breaking news
Andhra Pradesh
-
ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
తాడేపల్లి : అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ, ఎస్టీ, ఎస్సీ కమిషన్లకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి. దీనిపై ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది మోహన్కుమార్లపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘బాధితులు ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారు. వారందరినీ ఎమ్మెల్యే బుడ్డా కులదూషణ చేశారు. వారిపై దారుణంగా దాడి చేశారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించి రాత్రంతా తిప్పారు ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డానే స్వయంగా కారు నడిపారు. అనంతరం వారిని ఒక గెస్ట్హౌస్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడమే. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 1989 కింద నేరం. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల గౌరవంపై తీవ్రమైన దాడి చేసినట్టే. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బుడ్డా పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి. -
భక్తులకు అలెర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్
సాక్షి,విజయవాడ: భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్కోడ్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు.అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్కోడ్ తప్పనిసరి విధించింది. ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకుంది.విధి నిర్వహణలో సిబ్బంది సెల్ఫోన్ల వాడకంపై నిషేదం. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
‘లక్షల కోట్లు అప్పులు చేస్తూ దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వలేరా?’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. ‘దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది. అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగించారు. దేశ చరిత్రలో ఏనాడైనా ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరిగిందా?, చంద్రబాబు మాత్రమే ఏకంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించి తన కర్కశత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేరా?, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా?, ఉన్నవాటిని కూడా తొలగించి వారి ఉసురు తీస్తున్నారు. దివ్యాంగుల్లో కూడా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వటం ఏంటి?, నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. అలాంటి వారికి కూడా ఎలా పెన్షన్లు తొలగించారు?, గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లను కాదనటం ఆ డాక్టర్లను అవమానించటం కాదా?, వికలాంగులను తీసుకుని వస్తున్న మా పార్టీ నేత ఉషశ్రీ చరణ్ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు హెలికాప్టర్ లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా?, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించకపోతే ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. -
బాబు ముఠా బార్ల దందా.. టీడీపీ సిండికేట్కు కట్టబెట్టేందుకు కుట్ర
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిల్లో 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా టీడీపీ నేతల సిండికేట్ చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండగా.. 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాకపోవడం చర్చాంశనీయంగా మారింది. -
వైఎస్ జగన్పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోంది: భూమన
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు. -
‘ఏపీలో విద్య, వైద్యం పక్కకు పోయి.. మద్యం మాత్రం దొరుకుతుంది’
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఏపీలో విద్య, వైద్యం సంగతి పక్కకు పోతే మద్యం మాత్రం ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. మద్యం పాలసీతో పేదల జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై విరుకుపడ్డారు. ‘ ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది.కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు తెచ్చారు. సాధారణ ప్రజలు తాగి రోడ్డున పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు విస్తృతంగా మద్యం పంపిణీ చేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. వీధివీధినా మద్యం షాపులే దర్శనమిస్తున్నాయి. చివరికి కిల్లీ కొట్లు, పచారీ షాపుల్లోనూ బెల్టుషాపులు పెట్టించారుమద్యం మహమ్మారి పేద, మధ్య తరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు ఇచ్చి అక్కడే ఫుల్లుగా తాగమని లైసెన్స్ ఇచ్చారు. పేద కుటుంబాలను నాశనం చేయటమేనా చంద్రబాబు విజనరీ అంటే?, చంద్రబాబు అంటేనే మాయా ప్రపంచమని నిరూపిస్తున్నారు. 4,380 పర్మిట్ రూంలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం అమ్ముతున్నారు. మద్యం మీద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమంతా చంద్రబాబు జేబులోకి వెళ్తోంది. జగన్ హయాంలో మద్యం ఆదాయం రాష్ట్ర ఖజానాకి చేరింది. చంద్రబాబు ప్రివలేజ్ ఫీజు పేరుతో రూ.1100 కోట్లు తమ నేతలకు దోచి పెట్టారు. కొత్తగా మరో 3,736 బార్లు టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు. కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సిన షాపులను కూడా టీడీపీ వారికే కట్టబెట్టారు. చేసిన స్కాం బయట పడకుండా ఉండేందుకు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు’ అని టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి
సాక్షి,వైఎస్సార్: యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి జరిగింది. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిశేషు వైఎస్సార్సీపీ తరుఫు ప్రచారం చేశారు.అయితే, వైఎస్సార్సీపీ తరుఫున ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. ఆదిశేషుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆదిశేషుకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ దాడి చేసింది టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్రెడ్డి అనుచరులేననంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జనసేన చోటా నేత రౌడీయిజం.. బూతులు తిడుతూ హోంగార్డుపై దాడి
సాక్షి, కృష్ణా: కూటమి ప్రభుత్వ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనసేన నేత ఒకరు రౌడీయిజానికి దిగారు. తనకు సెల్యూట్ కొట్టలేదని హోంగార్డుపైనే దాడికి పాల్పడ్డాడు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి తనతోటి సిబ్బందితో కలిసి హోంగార్డ్ మోహనరావు బీట్ డ్యూటీ చేశారు. అదే సమయంలో మచిలీపట్నం జనసేన ఎనిమిదో డివిజన్ ఇంచార్జి కర్రి మహేష్ అటుగా వెళ్లారు. ఈ సందర్బంగా తనను చూసి సెల్యూట్ కొట్టలేదంటూ హోంగార్డ్ మోహనరావుపై కర్రి మహేష్ దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన మహేష్.. హోంగార్డును నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. ఏంట్రా నేను వస్తే కూర్చుంటరా.. సెల్యూట్ కొట్టాలని తెలియదా అంటూ వారిని చితకబాదారు.ఎస్పీకి చెప్పుకుంటావో.. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బూతులతో రెచ్చిపోయాడు. ఎస్పీకి చెప్పినా.. ఏమీ పీకలేరంటూ తీవ్ర పదజాలం వాడారు. అనంతరం, జనసేన చోటా నేత కర్రి మహేష్ దాడిలో హోంగార్డు మోహనరావు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు మోహనరావు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేన కర్రి మహేష్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. -
పుట్టపర్తిలో రెడ్బుక్.. ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లిన ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
ఎమ్మెల్యేల దందాలపై కిమ్మనరేమి బాబు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్కు తీసుకువెళ్లారు.ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
నెల్లూరు: ‘ఉదయగిరి’కి అరుదైన గౌరవం
సాక్షి, నెల్లూరు జిల్లా: భారతదేశ చరిత్రలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ‘ఉదయగిరి’ దుర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అదే ఉదయగిరి పేరుతో భారత ప్రభుత్వం యుద్ధనౌకను రూపొందించి నావికా దళంలో మంగళవారం ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సా«ధించాలనే పట్టుదల, తపనతో విదేశీ వనరుల నుంచి చేర్చుకున్న చివర యుద్ధనౌక ఐఎన్ఎస్ తమల్.ఇందులో భాగంగా రెండో తరం ఐఎన్ఎస్ ఉదయగిరి ప్రాజెక్టు 17ఏ కింద ఎఫ్–35 పేరుతో రూ.600 కోట్ల వ్యయంతో 6,670 టన్నుల సామర్థ్యం గల నీలి నీటిపై పనిచేసే విధంగా స్టెల్త్ ఫ్రిగేట్ను రూపొందించారు. ఇందులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ ప్రెసిషన్ స్ట్రెక్ క్రూయిజ్ క్షిపణులతో సహా అధునాతన సెన్సార్ల వ్యవస్థ, ఆయుధాలు ఉంటాయి. రష్యా, భారత్ వ్యుహాత్మక సహకారంతో రూపొందించిన 51వ యుద్ధనౌక ఇది.ఇంతటి ప్రాముఖ్యత గల యుద్ధనౌకను ఉదయగిరి పేరుతో రూపొందించడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం గల ఉదయగిరి దుర్గం కేంద్రంగా పల్లవులు, చోళులు, చాణుక్యులు, గజపతులు, విజయనగర రాజులు, ముస్లింలు, ఆంగ్లేయులు పాలించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి కేంద్రంగా పాలించిన చరిత్ర ఉంది. -
బాబు ముఠా బార్ల దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్.. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. ‘మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు. బిజినెస్ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. నేడు, రేపు సిండికేట్ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడచివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దరఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తున్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్ వేశారు.మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్ బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్ దక్కించుకోవాలని కూడా సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్ దక్కిన తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్ గురి పెట్టింది. బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచారం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ⇒ 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పై ఉన్నారు.⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. -
డీఎస్సీ... ఇక నో ఆప్షన్!
కర్నూలు జిల్లాకు చెందిన ఎం.నాగజ్యోతికి డీఈడీ, బీఎస్సీ, బీఈడీ అర్హత ఉండడంతో డీఎస్సీలో ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), టీజీటీ (మ్యాథ్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో ఆమె ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) పోస్టుకు ఎంపికయ్యారు. కానీ, పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జీటీకే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది. కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డీఎడ్, బీఈడీ చేశారు. ప్రస్తుత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతోపాటు ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జీటీకి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండాపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన పి.అనిత డీఎడ్, బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఆమె డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో జిల్లాస్థాయి 89వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)లో 10వ ర్యాంకు పొందారు. కానీ, పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జీటీకే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు. సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో అత్యుత్తమ మార్కులు సాధించినవారి ఆనందాన్ని... కూటమి సర్కారు తెచ్చిన ‘ముందస్తు ఆప్షన్ నిబంధన’ ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం... అధికారులు ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాసై మెరిట్ లిస్టులో ఉండి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో 10వేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించినా... ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జీటీ పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది. చేజారిపోతున్న ‘ఉన్నత’ అవకాశం ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా, మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఎడిట్కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డీఎస్సీ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులకు జీవితాంతం వేదనే...» స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జీటీలో చేరినవారు తీవ్రంగా నష్టపోతారు. » ఎస్జీటీ పోస్టులో చేరినవారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీసు పూర్తయినా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వస్తుందన్న గ్యారెంటీ లేదు. » అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ, మరో పదేళ్లలో ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంటుంది. » ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10వేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
అయ్యన్న బూతు పురాణం
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి రెచ్చిపోయారు. నేను వస్తున్నానంటే కూడా మీకు లెక్కలేదా అంటూ బూతులు లంకించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.రావికమతం: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. మేమొస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి పత్రికల్లో రాయలేని భాషలో విరుచుకుపడ్డారు. అయ్యన్న రెచ్చిపోయిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ఈ నెల 21న గ్రామ దేవత శ్రీదుర్గాలమ్మ పండుగ భారీ ఎత్తున జరిగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు వివిధ ప్రాంతాల నుంచి .. వివిధ పార్టీలకు చెందిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. వేలాది మంది భక్తుల రాకతో గ్రామంలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో సీఐ, ఎస్ఐ సహా పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున అనుచరులను వెంట బెట్టుకుని అయ్యన్న వచ్చారు. వచ్చీ రాగానే.. పోలీసులెక్కడ.. అని ప్రశ్నిస్తూ నోటికి పని చెప్పారు. పోలీసు అధికారులెవరూ తన వద్దకు రాలేదని ఆగ్రహించారు. ‘మేమొస్తుంటే సీఐ, ఎస్ఐ ఏం చేస్తున్నారు? తమాషాలు చేస్తున్నారా?.. నేను వచ్చినా కూడా ఇక్కడకు రారా..’ అంటూ బండబూతులతో రెచ్చిపోయారు. అయ్యన్న పోలీసులను తిడుతుంటే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మద్దతుగా కేకలు వేశారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి.. ‘సార్.. మేమిక్కడే ఉన్నామని చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో పోలీసులు చిన్నబుచ్చుకున్నారు. -
‘మూడ్స్’ అంటే మోజా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కారు అభంశుభం తెలియని చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఎమర్జెన్సీ మెడికల్ కిట్ల పంపిణీలోనూ చేతివాటం ప్రదర్శించింది. 2025–26 సంవత్సరానికి టెండర్ పిలవకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.7,31,54,361 విలువైన వర్క్ ఆర్డర్ను నామినేషన్ పద్ధతిపై అప్పగించేసింది. కేరళకు చెందిన మూడ్స్ కండోమ్స్ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అడ్డగోలుగా నామినేషన్పై అప్పగించడంలో తెరవెనుక డీల్ కుదిరింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 257 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ల పరిధిలో 55,746 అంగన్వాడీ సెంటర్లలో ఉండే చిన్నారుల ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) కోసం అందించే మెడికల్ కిట్లలోనూ కక్కుర్తి పడటం అత్యంత దారుణమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనలకు పాతర.. వాస్తవానికి వైద్యపరంగా అత్యవసరమైతేనే నామినేషన్ పద్ధతిలో వర్క్ ఆర్డర్ ఇస్తారు. సాధారణ సందర్భాల్లో రూ.లక్ష వర్క్ ఆర్డర్ ఇవ్వాలన్నా టెండర్ పిలవాలనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన మెడికల్ కిట్ల సరఫరాకు నామినేషన్ పద్ధతిపై ఈ నెల 5న వర్క్ ఆర్డర్ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది తేటతెల్లమవుతోంది. అది కూడా అందుబాటులో ఉన్న పెరెన్నికగన్న కంపెనీలను కాదని ఎక్కడో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ కంపెనీకి నామినేషన్ పద్ధతిపై అప్పగించడం గమనార్హం. ఆ కంపెనీ మూడ్స్ కండోమ్స్, గర్భ నిరోధక, రుతుక్రమం పరిశుభ్రత వస్తువులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన కంపెనీకి నామినేషన్ పద్ధతిపై వర్క్ ఆర్డర్ అప్పగించడంతో 10శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లింపు, సక్రమంగా మెడికల్ కిట్ల పంపిణీలో ఎంత మేరకు బాధ్యత ఉంటుందన్నది అనుమానమే. దీనికితోడు నిజంగా కేరళ నుంచి మెడికల్ కిట్లు కొనుగోలు చేసి ఏపీకి అందిస్తే స్థానికంగా మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీని కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కో మెడికల్ కిట్ ధర రూ.1312.25 చొప్పున నిర్ణయించగా స్థానిక మార్కెట్లో దానిలో కనీసం 30 శాతం నుంచి 40 శాతం తక్కువ ధరకు లభిస్తుందని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల పంపిణీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచి అపోలో, మెడ్ప్లస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా మెడికల్ కిట్లు సరఫరా చేసేవారు. అందుకు భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిపై కేరళ కంపెనీకి కట్టబెట్టడం శోచనీయం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో చక్రం తిప్పిన అధికారి.. రూ.7.31 కోట్లకుపైగా వర్క్ ఆర్డర్ను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టిన తంతులో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో కీలక అధికారి ఒకరు చక్రం తిప్పినట్టు తెల్సింది. గత టీడీపీ పాలనలో మంత్రి లోకేశ్ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారన్న విమర్శలు ఎదుర్కొన్న అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది జూన్లోనే అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల పంపిణీ ప్రతిపాదన వచ్చింది. అంత పెద్ద మొత్తంలో నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం సరికాదని, టెండర్ పిలవాల్సిందేనని ఐసీడీఎస్ డైరెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. కొరకరాని కొయ్యగా మారిన ఆయన ఇటీవల నెల రోజులపాటు ముస్సోరీ శిక్షణకు వెళ్లారు. అదే అదనుగా కీలక అధికారి ఒకరు ఈ డీల్ సెట్ చేసినట్టు విశ్వసనీయంగా తెల్సింది. -
పింఛన్ నోటీసుతో దంపతుల బలవన్మరణం
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టింది. ఏకపక్షంగా లక్షలాది పింఛన్లు తొలగిస్తూ పింఛన్దారుల కడుపు కొడుతోంది. పింఛన్ పొందడానికి పూర్తిగా అర్హత ఉన్నప్పటికీ.. అడ్డగోలుగా తొలగింపులకు పూనుకొంది. దీంతో ఇకపై ఎలా బతకాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు(45)కు రెండు కళ్లు కనిపించవు. పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. ఇటీవల పింఛన్ రీ వెరిఫికేషన్కు రావాలంటూ నోటీసు అందింది. అందులో ఇతనికున్న 70 శాతం వికలాంగత్వాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. దీంతో తన పింఛన్ ఆపేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతో మందికి ఇప్పటికే ఆపేశారని, తనకు కూడా ఆపేస్తే మనం ఎలా బతకాలని భార్య లలిత(42)తో చెప్పుకుని మదనపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు పడేకంటే చనిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చి శనివారం అర్ధరాత్రి దంపతులిద్దరూ పురుగు మందును ఫినాయిల్లో కలుపుకుని తాగారు. కొద్ది సేపటి తర్వాత తల్లిదండ్రులను గమనించిన వారి కుమార్తె దేవి (ఇంటర్ చదువుతోంది) భయపడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ విషం తాగి మృతి చెందడంతో ఆమె కూడా అక్కడే మిగిలిపోయిన అదే విషపు ద్రావణం తాగింది. ఆదివారం ఉదయం వీరి ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న బంధువులు లోపలికి వెళ్లి చూశారు. దంపతులిద్దరూ మృతి చెంది ఉండగా, దేవి ప్రాణాలతో ఉండటం గమనించి శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ కొద్దిగా కోలుకున్న ఆమె.. ఈ మేరకు జరిగిన సంఘటనను మీడియా, బంధువులకు వివరించారు.సీఐ రాకతో మారిన సీన్ శ్రీకాకుళం రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు రిమ్స్కు వచ్చి దేవితో మాట్లాడారు. అధికార పార్టీ నేతల సూచన మేరకు.. తన తల్లిదండ్రులిద్దరూ పింఛన్ ఆపేస్తారనే భయంతో కాకుండా కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని దేవితో చెప్పించారు. కాగా, అంత వరకూ ఎక్కడ అర్ధంతరంగా తన పింఛన్ ఆగిపోతుందేమోనని తన తండ్రి నిత్యం ఆలోచించేవారని ఆమె అక్కడ అందరికీ వివరించింది.శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆ విద్యార్థినితో ఇలా చెప్పించడం తగదని చర్చ జరుగుతోంది.పింఛన్ రాదని గుండె ఆగింది!అన్నమయ్య జిల్లాలో టైలర్ మనోవేదనతో మృతిరాయచోటి టౌన్: వచ్చే నెల నుంచి పింఛన్ రాదని ఓ టైలర్ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలివీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెకు చెందిన టైలర్ మహబూబ్ బాషా (50)కు భార్య, నలుగురు పిల్లలు. అతని కుడి కన్నుతో ఏమీ కనపడకపోవడంతో కంటివైద్యుడి సంప్రదించాడు. పరీక్షల అనంతరం ఇక చూపురాదని డాక్టర్ తేల్చిచెప్పారు. దీంతో ఇంటివద్దే ఉంటున్నాడు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రభుత్వ పెన్షన్ వస్తోంది. ఇప్పుడిదే అతనికి ప్రధాన జీవనాధారం. ఇంతలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి పింఛన్ రాదని మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో బాషా షాక్కు గురయ్యాడు. ఇంటి బాడుగ చెల్లించడంతో పాటు ఇల్లు గడిచేది ఎలాగని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని రాయచోటిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరపతికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.‘అంధత్వం’ కనిపించదా? ఇద్దరు అంధుల పింఛన్లు తొలగింపు కౌతాళం: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, హనుమేష్ పింఛన్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. దీంతో వారు ఆదివారం తమ ఇంటి వద్ద అంధత్వ సరిఫికెట్లను చూపుతూ నిరసన తెలిపారు. తమకు పుట్టినప్పటి నుంచే అంధత్వం ఉందని, ఎంతో ఆసరా అయిన పింఛన్ను తొలగిస్తే ఎవరు అన్నం పెడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.75 నుంచి పింఛన్ అందుకుంటున్నామని, వందశాతం అంధత్వం ఉన్నా పింఛన్ తొలగిస్తే ఎలా బతకాలి అని ప్రశ్నించారు. ఇక గుళ్లు, గోపురాల వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వాపోయారు. ‘పింఛన్లను ఇప్పించే మార్గం చూడండి సారూ’ అంటూ వేడుకున్నారు. -
వరి పొట్టు.. ఇసుక రట్టు!
సాక్షి టాస్క్ ఫోర్స్ : చిత్తూరు జిల్లా పాలంతోపు వద్ద శనివారం ఓ లారీ రోడ్డు పక్కకు వాలిపోయి ఇరుక్కుపోయింది. అక్కడకు వెళ్లిన స్థానికులు ఆ వాహనం నుంచి ఇసుక రాలుతుండటంతో మీడియా, పోలీసులకు సమాచారం అందించారు. పొక్లెయిన్ రాకపోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు లారీ అక్కడే నిలిచిపోయింది. అదే ప్రాంతానికి పది అడుగుల దూరంలో.. ఐదు రోజుల క్రితం గూడూరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ కూరుకుపోవడంతో రాత్రికి రాత్రే జేసీబీ రప్పించి గుట్టుగా తరలించారు. » చిత్తూరు మండలం అనంతాపురం గ్రావిటా ఫ్యాక్టరీ వద్ద గురువారం ఓ లారీ టైర్ పేలడంతో నిలిచిపోయింది. ఆగిన లారీ నుంచి ఇసుక, నీళ్లు కారడంతో అనుమానించిన స్థానికులు టార్పాలిన్ తొలగించి పరిశీలించగా వరి పొట్టు గోతాల కింద దాచిన ఇసుక బయటపడింది. » వరిపొట్టు చాటున ఇసుక దందా జోరుగా సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరు నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడుకు యథేచ్ఛగా తరలిపోతోంది. రోజూ దాదాపు 20 లారీల్లో సరిహద్దులు దాటుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నెల్లూరు, తిరుపతికి చెందిన టీడీపీ నేతల కనుసన్నల్లో పుష్ప సినిమా తరహాలో లారీల నంబర్ ప్లేట్లు మార్చి తప్పుడు పత్రాలతో అక్రమ ఇసుకను చేరవేస్తున్నారు. గూడూరులో డంప్.. తిరుపతి జిల్లా గూడూరు వద్ద స్వర్ణముఖి నది, నెల్లూరులోని పెన్నానది కేంద్రంగా ఇసుక దందా నడుస్తోంది. పొక్లెయిన్లతో తోడేసిన ఇసుకను గూడూరులోని నిర్మానుష్య ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అనంతరం లారీల్లో ఇసుక నింపి పైన వరి పొట్టు గోతాలను అమర్చి అనుమానం రాకుండా టార్పాలిన్ పట్టాలు కడుతున్నారు. ఇలా విలువైన ఇసుక తమిళనాడులోని చెన్నై దాకా అక్రమంగా తరలిపోతోంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం, చిత్తూరు మండలం తిరుత్తణి రోడ్డు, జీడీ నెల్లూరులోని తూగుండ్రం రోడ్డు మీదుగా రోజూ 20 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఒక్కో లారీ ఇసుకను రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యక్తులతో చేతులు కలిపి ఈ దందా సాగిస్తున్నారు.దారి తప్పిన నిఘా... కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక దందాకు హద్దులు చెరిగిపోయాయి. నదులు, కాలువలు, వాగులు వంకలను కొల్లగొట్టేస్తున్నారు. తమిళనాడుతోపాటు కర్ణాటకకు సైతం లారీల్లో టన్నులు టన్నులు తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రెండు జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. ఒకవేళ స్థానికుల ఫిర్యాదుతో తప్పనిసరై పట్టుకున్నా నామమాత్రంగా జరిమానా విధించి వదిలేయాలనే ఒప్పందంతో ఇసుక దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇవి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యూనిట్లు ఇప్పుడు తెగ మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖే సాక్షాత్తు పార్లమెంటులో ఇటీవలే వెల్లడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది జూలై 28 వరకు మొత్తం 2,191 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడినట్లు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,401 యూనిట్లు ఈ ఆరి్థక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 790కి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈలు ఇలా మూతపడుతుండటంతో సుమారుగా 30,000 మంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా.షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్ఎంఈలకు గట్టిగా కరెంట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటివి వీటిని వెంటాడుతున్నాయి. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 పడితే అదే తమిళనాడులో సగటున యూనిట్ ధర 7–8లుగా ఉంది. అంటే యూనిట్కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రోత్సాహకాల ఊసేలేదు..ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏడాది ప్రోత్సాహకాలు ఆ ఏడాదే ఇచ్చేస్తాం.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ పెడుతున్నామన్న చంద్రబాబు, ఇతర కూటమి నేతల మాటలు నీటిమూటలయ్యాయి. సుమారు రూ.10,000 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి ఇవ్వకపోగా వీటిని అడగడానికి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధులను అధికారులు పీ–4 దత్తత అంటూ వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. పరిశ్రమ నడపడానికి, జీతాలివ్వడానికి మా దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నా.. ఆ సంగతి తర్వాత చూద్దాంలే ముందు రెండొందల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన చేయమనడంతో చేసేదిలేక మొక్కుబడిగా ప్రకటన చేసి వచ్చేసినట్లు మరో పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఇంకోపక్క ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిపడిపోవడంతో ఈ ప్రభావం ఎంఎస్ఎంఈ యూనిట్లపై ప్రత్యక్షంగా పడుతోంది. కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీతో ఆదుకుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రోత్సాహకాలు మాకివ్వండని అడిగితే బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నాం.. రాగానే ఇస్తామని చెప్పి ఆరునెలలు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలి.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, అధిక విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు లేకపోవడం, టెక్నాలజీ అప్గ్రెడేషన్ లేకపోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి తమిళనాడు తరహా విధానం అమలుచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్తానికి ఒక నివేదిక ఇచ్చాం. సకాలంలో ప్రోత్సాహకాలు విడుదలచేసి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా -
దోపిడీలో స్మార్ట్ రి‘కార్డు’
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామంటూ కోతలు కోస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో (పీడీఎస్) ‘స్మార్ట్ కార్డుల పంపిణీ’ని ఘనకీర్తిగా ప్రచారం చేసుకుంటూ అభాసుపాలవుతోంది. వాస్తవానికి, ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులు పేరుకే స్మార్ట్.. అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ లేదు. చిన్న సైజులో కార్డులను ముద్రించి దానికి సాంకేతిక పరిభాషలోని ‘స్మార్ట్’ను జోడించి లబ్ధిదారులను మభ్యపెడుతోంది. దీని కోసం ఏకంగా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డుల పంపిణీ చేపట్టనుంది. అదనపు లబ్ధి శూన్యం! కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది. వన్ నేషన్.. వన్ రేషన్ నినాదాన్ని తీసుకొచి్చంది. అంటే, వేలిముద్ర వేసి దేశంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ నంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు. కేవలం ప్రభుత్వంలోని అమాత్యులు, కొందరు అధికారులు కమీషన్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలను సృష్టించి స్మార్ట్గా వెనకేసుకుంటున్నట్టు వినికిడి. పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్దిదారులు ఫొటోలు ఉండేవి. స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలి పాస్పోర్టు సైజు ఫొటో తప్ప ఇతరులు కనిపించరు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మూడు పేర్ల వరకు బాగానే కనిపిస్తాయి. అంతకు మించి ఎక్కవ మంది లబ్దిదారులు ఒకే కార్డులో ఉంటే వారి పేర్లు కుచించుకుపోవడం, లేదా లేకుండా ఉండటమే ఈ స్మార్టు కార్డు ప్రత్యేకత. దీనికి ఒక క్యూఆర్ కోడ్ను పెట్టి మిగిలిన వారి పేర్లు అందులో జోడిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి, ఈ–పోస్ మెషిన్కు, బియ్యం తూకం వేసే ఎలక్ట్రిక్ కాటాకు అనుసంధానం ఉండాలి. లబ్ధిదారుడి వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ కాటాలో సరైన తూకంలో బియ్యం వేస్తేనే ఈపోస్ మెషిన్ అంగీకరించి లావాదేవీని అనుమతిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు ప్రవేశపెట్టిన ప్రక్రియ. కానీ, కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ–పోస్ మెషిన్లను చేతుల్లో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే.. ప్రభుత్వం బయట గొప్పలు చెప్పుకుంటోంది. స్మార్ట్ కోతలు.. పంపిణీలోనూ కోతలే! రేషన్ సరుకుల పంపిణీలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఒక్క బియ్యం మినహా మరే సరుకులూ ఇవ్వడం లేదు. కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం 18 రకాల నిత్యావసరాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా, అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులన్నింటినీ ఆపేశారు. రూ.220 కోట్లకుపైగా కందిపప్పు బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు సరఫరాకు కూడా ముందుకు రావట్లేదు. -
ఏపీఈఆర్సీలో ఏక్ నిరంజన్!
సాక్షి, అమరావతి: స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుని పారదర్శకంగా ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థల్లో సైతం కూటమి ప్రభుత్వం రాజకీయాలను చొప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో జరుగుతున్న పరిణామాలే అందుకు తాజా నిదర్శనం. రాజకీయ, సామాజిక వర్గ సమీకరణలు తేలకపోవడంతో లీగల్ మెంబర్ భర్తీ ఫైల్ సీఎం వద్ద పెండింగ్లో పడింది! ఏం జరుగుతోందంటే.. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి చైర్మన్ లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లీగల్ సభ్యుడు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్చార్జ్ చైర్మన్గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలల తరబడి సాగదీత తరువాత ప్రభుత్వం లీగల్ సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టింది. జూన్ 18న ఈ నోటిఫికేషన్ విడుదల కాగా జూలై 9వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. తరువాత గడువు జూలై 16 వరకు పొడిగించారు. అదీ సరిపోదని జూలై 25 వరకూ మళ్లీ గడువిచ్చారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, ఇతర ఏ కార్యాలయాల్లోనూ ఉద్యోగి కాని వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అనర్హులని, ఎంపికైన అభ్యర్థి ఐదేళ్ల పాటు ఏపీఈఆర్సీ సభ్యుడిగా కొనసాగుతారని నిబంధనల్లో పేర్కొన్నారు. వచి్చన దరఖాస్తుల్లో ఐదుగురి పేర్లను ఎంపిక చేసిన ఇంధన శాఖ ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. అంతే.. ఆ తరువాత అక్కడి నుంచి ఫైలు కదలలేదు. స్వయంగా హైకోర్టు కలుగజేసుకోవడంతో.. రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు ప్రజల నుంచి వసూలు చేసే విద్యుత్ చార్జీలను నిర్ణయించే ప్రతిపాదనలపై విచారణ జరిపి ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటి కీలక బాధ్యతలను ఏపీఈఆర్సీ చైర్మన్ నిర్వర్తిస్తారు. అంత కీలకమైన పోస్టును కూటమి ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై ఇటీవల స్వయంగా హైకోర్టు కలుగజేసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే రిటైర్డ్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తులు ఏపీఈఆర్సీ చైర్మన్ స్థానంలో ఉంటే తమ ఆటలు సాగవని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిని కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలో తొలుత లీగల్ మెంబర్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఓ సీనియర్ నేత జోక్యంతో... చైర్మన్ పదవికి తాము ఎంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే లీగల్ సభ్యుడి పోస్టును కూడా ఇవ్వాలని భావించారు. అయితే అదే సమయంలో కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తించిన ఓ సీనియర్ నేత జోక్యం చేసుకుని తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే లీగల్ సభ్యుడిగా నియమించాలని సూచించడంతో ఎటూ తేలడం లేదు. చైర్మన్, మెంబర్ పోస్టులను ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తే విమర్శలు వస్తాయని ఆ సీనియర్ నేత చెబుతున్నట్లు తెలుస్తోంది. పోనీ లీగల్ మెంబర్ పోస్టును భర్తీ చేయకుండా వదిలేద్దామనుకుంటే అప్పుడు చైర్మన్ పదవిలో తప్పనిసరిగా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుంది. దీంతో ఎటూ తేల్చలేక ఏపీఈఆర్సీ సభ్యుడి భర్తీ ఫైలు రోజుల తరబడి సీఎం వద్దనుంచి కదలడం లేదు. -
సకలజన సార్వత్రిక విద్య
సాక్షి, అమరావతి: వయోలింగ భేదాల్లేకుండా దేశంలో అవసరమైనవారి విద్య, విజ్ఞానదాహం తీరుస్తోంది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, రెగ్యులర్గా కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోలేని లక్షలాది మందికి దూరవిద్య, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తోంది. ఏటికేడాది ఈ విశ్వవిద్యాలయంలో చేరికలు పెరుగుతున్నాయి. 21 స్కూల్ ఆఫ్ స్టడీస్ ద్వారా 67 రీజనల్ సెంటర్లు, 2,257 లెర్నింగ్ సపోర్టు కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దూరవిద్య, ఆన్లైన్లో డిప్లొమా, యూజీ, పీజీ డిగ్రీలు ఇగ్నో అందిస్తోంది. 333 అకడమిక్ ప్రోగ్రామ్స్ అందిస్తున్న ఇగ్నో అనేకమంది ఉద్యోగాలు సాధించడంలోను, ఉద్యోగుల కెరీర్ వృద్ధిలోను కీలకపాత్ర పోషిస్తోంది. ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించే దివ్యాంగులకు విద్యను చేరువ చేయడమే కాకుండా.. వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ‘జైల్ ఇన్మేట్స్’ (ఖైదీలు)ను సైతం విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. 2022–23లో 7,13,510 మంది వివిధ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరితో కలిపి ఆ విద్యాసంవత్సరంలో ఇగ్నోలో 13 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. 2022–23లో నమోదైనవారిలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. మొత్తం చేరికల్లో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. దివ్యాంగులు 4,227 మంది, ఖైదీలు 11,089 మంది చేరారు. కెరీర్ వృద్ధికి సోపానం ఇగ్నో సగటు విద్యార్థులకు దూరవిద్యలో బోధన అందించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కెరీర్లో ఎదగాలనుకునేవారికి సైతం చేయూతనిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇగ్నోలో ఇతర డిగ్రీలు అభ్యసిస్తున్నవారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2015–16లో 98,071 మంది ఉద్యోగులు నమోదు చేసుకుంటే.. 2019–20లో 2.28 లక్షల మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. తరువాత సంవత్సరం ఈ సంఖ్య 1.30 లక్షలకు తగ్గినా.. 2022–23లో 1.44 లక్షలకు పెరిగింది. సంప్రదాయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఇగ్నో సైతం తమ సంస్థలో డిగ్రీలు పొందినవారికి ప్లేస్మెంట్స్ కల్పించడానికి చర్యలు చేపడుతోంది. 2022–23లో ఎనిమిది ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించింది. 2021–22లో 21 శాతం ఉన్న ప్లేస్మెంట్స్ రేటు 2022–23లో 30 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, ఎస్బీఐ లైఫ్, గ్లోబివా, ఇన్సూరెన్స్ థేఖో డాట్కామ్ వంటి పలు సంస్థల్లో వీరు ఉద్యోగాలు పొందారు. కావాల్సినంత ప్రోత్సాహం విశ్వవిద్యాలయం కెరీర్ అవగాహన సెషన్లు నిర్వహించడం ద్వారా పరిశ్రమ నిపుణుల కెరీర్ ప్లానింగ్, నైపుణ్య అవసరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులకు చేయూత ఇస్తోంది. సీవీ తయారీ, జాబ్ పోర్టల్ వినియోగం, ఇంటర్వ్యూలకు తర్ఫీదు ఇస్తోంది. ఇగ్నో పోర్టల్లో 59 వేల కంటే ఎక్కువమంది పూర్వవిద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీని ఆధారంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి వివిధ రంగాల్లో విజయం సాధించిన వారితో ప్రేరణ కార్యక్రమాలు అందిస్తోంది. 2022–23లో ఇటువంటి 13 సమ్మేళనాలను నిర్వహించింది. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఆయా రంగాల్లో మరింత ఎదిగేందుకు కూడా ఈ విశ్వవిద్యాలయం తోడ్పాటు ఇస్తోంది. -
డేంజరస్ భిక్షువు!
సత్యాన్వేషణ స్పృహతో స్వతంత్రంగా, నిర్భీతితో, ఎరుకలో జీవించడమే మనిషి నిరంతర కర్తవ్యమని చెప్పి, అలా జీవించిన మహా మనీషి, తాత్వికుడు, విద్యా విప్లవకారుడు ఎం.శివరామ్ (85). పూర్తి పేరు మంచిరెడ్డి శివరామ్. పాతికేళ్లుగా విజయవాడ ప్రాంతంలో ‘పిల్లలు కేంద్రంగా విద్య’ అనే భావనను తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో, పాఠశాల యాజమాన్యాల్లో పాదుకొల్పడానికి అవిశ్రాంత కృషి చేసిన శివరామ్, ఆగస్టు 20న తుదిశ్వాస విడిచారు. ఆయన అవివాహితులు.పుట్టింది అనంతపురం జిల్లాలో. 20 ఏళ్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అరవింద స్కూల్లో మకాం. ఎటువెళ్లినా తిరిగి అక్కడికే చేరుకునేవారు. ప్రిన్సిపాల్ ఇంద్రాణి ఆత్మీయ సంరక్షణలో పిల్లల్లో ఒక పిల్లాడిలా గడిపేవారు. ‘రాజీ జీవితాన్ని’ ఏవగించుకునేవారు. శివరామ్ విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (జేకే) సహచరుడు. కొంతకాలం రిషి వ్యాలీ స్కూల్లో పనిచేశారు.వ్యక్తి వికాసం వెదజల్లే ప్రేమపూర్వకమైన ప్రజ్ఞ ద్వారానే మొత్తంగా సామాజిక పరివర్తన సాధ్యమనే భావన ఆయన సాన్నిహిత్యాన్నెరిగిన వారికి అనుక్షణం అర్థమవుతూ వుండేది. కమ్యూనిస్టు పంథా నుంచి ప్రేమతో జేకే చూపిన వెలుగుబాట వరకు ఎన్నెన్నో మలుపులు, మజిలీలు ఆయన జీవనయానంలో తారసపడతాయి. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం వేళ్లూనుకుంటున్న నాటి నుంచి ఐక్య కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పీడిత వర్గ రచయితగా, సాంస్కృతిక సేనానిగానూ ఉద్యమ ప్రగతికి కృషి చేశారు.సంపన్న కుటుంబంలో జన్మించిన శివరామ్, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదకంటా నిలబడ్డారు. నాయకుల మాటలకు-చేతలకు, సిద్ధాంతానికి-ఆచరణకు పొంతన లేకపోవడం.. వంటి పరిస్థితులన్నీ ఆయనలో మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఎంతకాలం ఇలా ఏ నాయకుడో చెప్పిన పంథాలో పయనించడం, వాళ్లు అది కాదంటే మనను మార్చుకోవడం? స్వతంత్రంగా సత్యాన్వేషణ చేయలేమా? సమాజాన్ని అర్థం చేసుకోడానికి, సేవ చేయడానికి మరో మార్గం లేదా?.. వంటి అనంతమైన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు అన్వేషిస్తూ దేశదిమ్మరి అయ్యారు. ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాలు, ప్రవచనాలు ప్రత్యక్షంగా వింటూ, అధ్యయనం చేస్తూ, ఆ వాతావరణంలో జీవిస్తూ అన్వేషణ కొనసాగించారు.ఆ క్రమంలో జేకే పుస్తకం ఒకటి శివరామ్ కంటపడింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. అది మొదలుగా జేకే దేశదేశాల్లో నిర్వహిస్తున్న చర్చాగోష్ఠుల సారాంశంతో అచ్చయ్యే తాజా పుస్తకాలను ఔపోసన పట్టడంలో నిమగ్నమయ్యారు. చెరువు గట్టున ఏకాంతంలో జేకేని చదువుతూ, తనలోకి తాను చూసుకుంటూ.. ప్రపంచాన్ని సరికొత్త దృష్టితో అధ్యయనం చేశారు. అనంతరం జేకేని స్వయంగా కలుసుకోవడంతో శివరామ్ జీవన విధానమే మారిపోయింది. ఆ సాన్నిహిత్యం ఆయనను రిషి వ్యాలీలో కట్టిపడేసింది. జేకే ఖండాంతరాల్లో నిరంతరం మాట్లాడుతున్నపుడు రికార్డు చేసిన టేపులు రిషి వ్యాలీకి చేరేవి. వాటిని రాయించి, ముద్రించడంలో కచ్చితత్వం పాటించే విషయంలో శివరామ్ జాగ్రత్త వహించేవారు. అలా జేకేని దగ్గరగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి ఆయనకు అవకాశం దొరికింది.రిషి వ్యాలీ మెయిన్ స్కూలు సంపన్నుల బిడ్డలకే పరిమితమవుతుండడం శివరామ్కు నచ్చలేదు. ఆ పరిసర ప్రాంతంలో గ్రామీణ పేదపిల్లలకు కూడా ‘సృజనాత్మక విద్య’ అందించాలని ప్రతిపాదించారు. ఆయన ఆధ్వర్యంలోనే రిషి వ్యాలీలో రూరల్ స్కూళ్లకు అంకురార్పణ జరిగింది. సహజంగా వికసిస్తూ, పిల్లలు సజీవంగా స్పందించడం రూరల్ స్యూళ్లలోనే సంతృప్తికరంగా సాధ్యమవుతోందని శివరామ్ అంటుండేవారు. ఎంత అద్భుతమైన వాతావరణంలో జీవిస్తున్నా ఎక్కువ కాలం ‘ఉన్నచోటనే ఉండిపోవటం’ ఆయనకు బొత్తిగా ఇష్టం లేని పని. ఐదారేళ్లకు అంతా పాతపడిపోతుందని శివరామ్ ప్రగాఢంగా భావించేవారు. రూరల్ స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పటికీ ఉన్నట్టుండి ‘ఇక్కడింకా ఎన్నాళ్లు?’ అనిపించిందాయనకు. అంతే.. లేడికి లేచించే పరుగన్నట్టు... జేకేకి నమస్కారం పెట్టి, జోలె చంకనేసుకొని రిషి వ్యాలీ నుంచి లోక సంచారానికి బయలుదేరారు శివరామ్.బతుకు భయంతో గానుగెద్దు జీవితాలు ఈడ్చుతున్న జనాన్ని తేలికపరచాలనిపించిందో ఏమో.. అమృతభాండాగారాన్ని మనసులో నింపుకుని కాలికి బలపం కట్టారు. ఎన్నెన్ని మజిలీలో, ఎందరెందరికి పునరుజ్జీవాలో.. ఓహ్.. అదొక సజీవ జీవనగాథల అనంత సాగరం!నెల్లూరుకు దగ్గరలోని పల్లెపాడులో గాంధీ ఆశ్రమాన్ని పునరుద్ధరించి ‘సృజన స్కూల్’ను విద్యావేత్త ఎలీనా వాట్స్తో కలిసి తేదకదీక్షతో నిర్వహించారు. ఇంగ్లండ్కు చెందిన ఎలీనా, శివరామ్ సృజన పిల్లలతో గడుపుతూ పొందిన అనుభవ పాఠాలు.. తెలుగునాట విద్యారంగంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. సృజన స్కూల్ అనుభవాలు, అనుభూతులు అనేక రూపాల్లో రికార్డయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో సృజన అనుభవాలకు గుర్తింపు లభించింది. దాదాపు ఐదారేళ్ల పాటు సృజన స్కూల్ శివరామ్, ఎలీనాల ఆధ్వర్యంలో కొనసాగింది. ఎలీనా తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోవటం, శివరామ్ హైదరాబాద్ చేరటంతో ఆ స్కూల్ ఇతరుల చేతుల్లోకి వెళ్లింది.నిశ్చలంగా ఒక స్కూలును నిరంతర పరిశీలన, పర్యవేక్షణతో నిర్వహించడం అవసరమే. కానీ, దాని పరిమితి దానికి వుంది. నాలుగ్గోడల మధ్య ‘బట్టీ చదువు’ల కింద నలిగిపోతున్న అశేష బాలలకు ఆ హింస నుంచి విముక్తి కల్పించడం కోసం శివరామ్ ఊరూరా తిరుగుతూ అంతులేని కృషి చేశారు. స్కూళ్లలో పిల్లలు నేర్చుకునే వాతావరణాన్ని నింపడానికి, పెద్దలకు తక్షణంలో జీవించడం ద్వారా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం రుచి చూపడానికి అనంత మనోశక్తితో, నిశ్చలంగా, నిశ్శబ్దంగా కడదాకా ఉద్యమించారు. ఆ ఉద్యమపథంలో విజయవాడ మజిలీ ఒక మైలురాయి.24 ఏళ్ల క్రితం శివరామ్ గారితో ముఖాముఖి కూర్చొని, అనేక అంశాలపై గాఢంగా, లోతుగా చర్చించుకునే అవకాశం వచ్చివుండకపోతే నా జీవితం ఇప్పటికన్నా నిస్సందేహంగా వెలితిగా, అలజడిగా, అనారోగ్యంగా వుండేది. ఆయన కనిపెట్టిన ‘విద్యార్థి సృజన కుటీర్’ గనక అందుబాటులో లేకపోయుంటే మా పిల్లలు ఇప్పుడున్నంత సంతోషంగా వుండి వుండేవాళ్లు కాదు!పిల్లలు వికసించే విద్య.. తక్షణంలో జీవించడమే - జీవితం. ఈ రెంటినీ నిరంతరం ఇతరులతో పంచుకోవడమనే ధ్యానాన్ని ముగించుకొని వెళ్లిపోయారు శివరామ్. ‘డేంజరస్గా జీవించాలి’ అనేవారు తరచూ. అన్నట్టే జీవించి చూపిన అమరజీవి శివరామ్ గారికి విద్యావిప్లవ జోహార్లు!– పంతంగి రాంబాబు,సీనియర్ జర్నలిస్ట్8639738658 -
ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
‘నేటికీ విజయవాడ ప్రజలు కోలుకోలేదు’
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం. రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు. దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. -
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. -
దెందులూరు అక్రమ కేసులు.. పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలోని దెందులూరులో అక్రమ కేసుల్లో స్థానిక పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులో చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘుకు ఏలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.వివరాల ప్రకారం.. పెదవేగి ఎస్ఐ రామకృష్ణ చాటపర్రు దళిత సర్పంచ్ గుడిపూడి రఘును అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినప్పటికీ రివర్స్లో రఘు సహా మరికొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో సర్పంచ్ రఘును ఏలూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచగా పోలీసుల అక్రమ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ రఘు సొంత పూచికత్తు 10వేలతో బెయిల్ మంజూరు చేశారు. రఘును అరెస్ట్ చేసిన ఎస్ఐ రామకృష్ణపై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. మరోసారి ఆయనకు మెమో జారీ చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. -
చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.As Cheteshwar Pujara announces his retirement wishing him all success in his future endeavours.His discipline, and focus brought immense pride to the nation.@cheteshwar1 pic.twitter.com/Jxe5JcaZOo— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2025 -
‘తిరుపతిలో భూ ఆక్రమణలు.. బాబు, బీఆర్ నాయుడికి బాధ్యత లేదా?’
సాక్షి, తిరుపతి: తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో భూ భాగోతానికి తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం. ఆలయ భూములను టూరిజానికి కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపాం. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?.టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. ఇది పూర్తిగా ధర్మం మీద దాడి. వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా?. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్ టూరిజానికి ఇవ్వడమేంటి?. మరెక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవొచ్చు కదా?. టీటీడీ బోర్డు మీటింగ్లో మా అభ్యంతరాలను తిరస్కరించారు. మే నెల ఏడో తేదీన జరిగిన బోర్డు మీటింగ్లో ఆగ మేఘాలపై సమావేశం నిర్వహించారు. అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని టూరిజంకు బదలాయించారు. 05.08.25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 07.08.25 జీవో ఇచ్చారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు. ఆ విలువైన 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలని చూస్తున్నారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా. మంత్రి రాసలీలలు గురించి మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు. నేను ఏ ఒక్క విషయం వక్రీకరించలేదు. టీడీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
ఏం కష్టమొచ్చిందో...!
కొత్తవలస(విజయనగరం): ఓ పెళ్లిలో వారి చూపులు కలిశాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. పెళ్లితో ఐదునెలల కిందట ఒక్కటయ్యారు. కొత్తింటిలో కాపురం పెట్టారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ.. ఆనందంగా జీవిస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... ఒకరి తర్వాత ఒకరు ప్రాణం తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనతో కొత్తవలస మండలం తమ్మన్నమెరక ఘొల్లుమంది. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు కార్చుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొత్తవలస మండలం తమ్మన్నమెరక గ్రామానికి చెందిన గీతల వెంకటలక్ష్మి (26), వేపాడ మండలం చిన్నదుంగాడ (కొప్పలవానిపాలెం) గ్రామానికి చెందిన కొప్పల చిరంజీవి (30)కి ఈ ఏడాది మార్చి నెలలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమెకు దివ్యాంగుడైన తమ్ముడు రాజేష్ ఉన్నాడు. కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తూ తమ్ముడిని సాకుతూ ఓ ఇంటివాడిని చేసింది. ఓ పెళ్లిలో వెంకటలక్ష్మిని చిరంజీవి చూసి ఇష్టపడడంతో పెద్దలకు తమ మనుసులోని మాటను చెప్పడంతో పెళ్లిచేశారు. వెంకటలక్ష్మికి గత ప్రభుత్వ హయాంలో తమ్మన్నమెరక గ్రామంలోని జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో అందులోనే కొత్తకాపురం పెట్టారు. ఇద్దరు డిగ్రీ విద్యను అభ్యసించడంతో చిరంజీవి పెందుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో సేల్స్ ఉమెన్గా పని చేస్తోంది.ప్రాణం తీసిన మనస్పర్థలు...అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటలక్ష్మి భర్త చిరంజీవికి నీవు అనుకున్నట్లే చనిపోతున్నాను.. నీకు సంతోషమే కదా అని మెసేజ్ పెట్టింది. దీనికి వెరీగుడ్ అంటూ చిరంజీవి రిప్లై ఇచ్చాడు. సరే.. నేను షాపు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిపోతున్నాను అని మెసేజ్ చేస్తే ఒకే.. అంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన వెంటనే వెంకటలక్ష్మి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన చిరంజీవి వెంకటలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి అదే తాడుతో చిరంజీవి ఉరివేసుకున్నాడు. శనివారం తెల్లవారు జూ మున బంధువులు చూ సి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సీఐ షణ్ముఖరావు, పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్నదమ్ములు మా త్రం తమ్ముడు, మరదలను కావాలనే ఎవరో చంపేసి అత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్టీమ్ బృందం ఆధారాలను సేకరించింది. మృతురాలి త మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.అనంతపురంలో ఉద్రిక్తత..ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. -
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 24-31)
-
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర దౌర్జన్యం చేసి టీడీపీ నేతలు పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించారు. ఈ క్రమంలో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం నుండి చాటపర్రు దళిత సర్పంచ్.. గుడిపూడి రఘుని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఏలూరు రూరల్ నుండి రాత్రి పెదపాడు స్టేషన్కు పోలీసులు తీసుకువెళ్లారు. పెదపాడు పోలీస్ స్టేషన్ నుండి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో, వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రాత్రంతా పెదపాడు స్టేషన్ వద్దే ఉన్నారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాకే నమస్తే పెడతావా ?
సత్యసాయి జిల్లా: గౌరవంగా నమస్తే పెట్టిన పాపానికి ఓ కౌన్సిలర్ పోలీసు దాషీ్టకానికి బలయ్యాడు. వివరాల్లోకెళితే.. హిందూపురం మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్వుల్లా శనివారం రాత్రి పట్టణంలోని అల్హిలాల్ కాంప్లెక్స్ వద్ద తన బట్టల దుకాణం వద్ద నిల్చొని ఉన్నారు. అటు వైపు నుంచి సీఐ జీపు రాగానే నమస్తే పెట్టారు. దీనికి ఆగ్రహించిన సీఐ రాజగోపాల్నాయుడు.. నాకే నమస్తే పెడతావా అంటూ ఆసిఫ్వుల్లాను కొట్టడంతో పాటు స్టేషన్కు లాక్కెళ్లారు. ఏం నేరం చేశానని ప్రశ్నించిన పాపానికి దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి , కౌన్సిలర్ శివ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేణురెడ్డి మాట్లాడుతూ సీఐ ఆగడాలు మితిమీరిపోయాయని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం... చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పెట్టుడు కనుగుడ్డు తీసి సిబ్బంది చేతిలో పెట్టిన దివ్యాంగురాలు
కోడూరు: కూటమి ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు కూడా పింఛన్లు రద్దు చేస్తోంది. పింఛన్లు తొలగించినట్లుగా అధికారులు ఇచి్చన నోటీసులతో వారు మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా కోడూరు పంచాయతీకి చెందిన భూపతి నాగమణికి పింఛను తొలగిస్తూ నోటీసు ఇచ్చారు. నాగమణికి ఒక్క కన్ను మాత్రమే ఉండడంతో ఆమెకు దివ్యాంగ పెన్షన్ రూ.6 వేలు వచ్చేవి. సదరం సరిఫికెట్లో 40శాతం అంధత్వం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల వైద్య పరీక్షల్లో 40శాతం లోపే ఉందంటూ పెన్షన్ను తొలగించారు. అధికారులు ఇచి్చన నోటీసులతో కోడూరు–1 సచివాలయానికి వెళ్లిన నాగమణి తనకు ఒక్క కన్ను మాత్రమే ఉందని, రెండోది పెట్టుడు కన్ను అంటూ కన్ను గుడ్డు తీసి సచివాలయ వెల్ఫేర్ సిబ్బంది చేతిలో పెట్టింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన బాధను చెప్పుకోవడం కోసమే కన్ను తీసి సచివాలయ ఉద్యోగి చేతిలో పెట్టినట్లు బాధితురాలు వాపోయింది. -
పంచాయతీ నిధుల బదిలీపై ఆలస్యం ఎందుకు?
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో గ్రాంట్లుగా ఇచి్చన రూ. 1,121.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ ఎందుకు జమ చేయలేదో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదుల నేపథ్యం.. ‘ఈ – గ్రామ్ స్వరాజ్ పోర్టల్’లో నిధుల బదిలీ జరిగినట్లు కనిపించకపోవడంతో పాటు పలు సర్పంచ్ సంఘాలు ఈ అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం స్పందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రాంప్రతాప్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా సంబంధిత గ్రాంట్లను వడ్డీతో సహా తక్షణమే విడుదల చేయాలని సూచించారు. ఇందుకు రుజువుగా గ్రాంట్ ట్రాన్స్ఫర్ సరి్టఫికెట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా, కేంద్రం లేఖ రాసి దాదాపు 20 రోజులు పూర్తవుతున్నప్పటికీ, ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం గమనార్హం. కేంద్రం నిధుల విడుదల ఇలా.. ⇒ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల పేరిట కేంద్రం గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన రూ. 446.48 కోట్ల బేసిక్ (అన్టైడ్) కేటగిరిలోనూ, అదే నెల మూడో వారంలో మరో రూ. 674.72 కోట్లు టైడ్ కేటగిరిలోనూ రాష్ట్ర ఆర్థిక శాఖకు విడుదల చేసింది. ⇒ ఆ నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్లకు 20 శాతం, జిల్లా పరిషత్లకు 10 శాతం చొప్పున లెక్కకట్టి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనా ఆక్షేపణ రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు జరగాల్సిన చెల్లింపుల వాటాపైనా సంబంధిత లేఖలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించడం గమనార్హం. 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం కాలపరిమితి 2024–25 ఆర్థిక సంవత్సరంతో పూర్తయినా తదుపరి ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం 2023 మార్చిలోనే ఏర్పాటు అయినప్పటికీ, దాని నివేదికను రాష్ట్ర శాసనసభలో సమర్పించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక వివరాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకురావాలని ఆ లేఖలో ఆదేశించింది. సాక్షి ఎఫెక్ట్తో... ఏప్రిల్లో జీవోలు ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో నిధులను విడుదల చేస్తున్నట్టు చెప్పుకోవడానికి అదే ఏప్రిల్ నెల 25వ తేదీన పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. వాటి అమలు మాత్రం లేదు. -
విద్యుత్ వ్యవస్థకు ‘సైబర్’ భద్రత
సాక్షి, అమరావతి: పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వాటి భద్రతకు కొత్త నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ–సీఈఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చిందని, తుది మెరుగులు దిద్ది త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించింది. కొంతకాలం క్రితం దేశ ఆరి్థక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం భావించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్ఐఆర్టీ)ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీఈఏ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఇవీ నిబంధనలు దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించారు. వీటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కించుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. ఇది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దానినుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సీఐఎస్ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్వాల్స్, డిటెక్షన్ సిస్టమ్, ప్రివెన్షన్ సిస్టమ్ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అలాగే విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లలో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. పునరుత్పాదక విద్యుత్కు ప్రత్యేక రక్షణ దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై సైబర్ భద్రతా చర్యలను మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమోనని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ భద్రతకు సంబంధించి ప్రత్యేక పరిశోధన, చర్యలు చేపట్టారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అనేది అప్పుడే రూపొందింది. దీనివల్ల ఏపీ ట్రాన్స్కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్కో జీఐఎస్ మోడల్ను తీసుకుంది. -
వైద్యుల పదోన్నతుల్లోనూ అక్రమాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో వైద్యుల ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మార్చేసింది. డిమాండ్ అధికంగా ఉండే ఆస్పత్రుల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి అమ్మేస్తున్నారని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024–25 ప్యానల్ సంవత్సరానికి వైద్యులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) పరిధిలో పదోన్నతిపై సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఎస్ఎస్) పోస్టింగుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. డోన్, పుంగనూరు, గుంతకల్లు ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, కౌన్సెలింగ్లో చూపించలేదని పదోన్నతి పొందిన వైద్యులు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అనస్థీíÙయా పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రదర్శించ లేదన్నారు. ఖాళీగా ఉన్న స్థానాలను ఎందుకు చూపలేదని కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో వైద్యులు నిలదీస్తే అధికారులు పొంతన లేని సమాధానం చెప్పారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఇటీవల కొందరు కేజీహెచ్ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేసిన ఓ డాక్టర్ను డీఎంఈ అధికారులు కౌన్సెలింగ్కు పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణ బదిలీల్లోనూ ఇదే తంతు జూన్ నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. డీఎంఈ పరిధిలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అవసరాలను సాకుగా చూపి, పాత వైద్య కళాశాలల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారు. బదిలీలు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతులతో బ్లాక్ చేసిన పోస్టుల్లో వారికి ఇష్టం వ చ్చిన వారిని నియమించారు. అప్పట్లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో పోస్టింగ్స్ కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్పౌజ్ (భార్యాభర్తలు) కేటగిరీలో ఒకరికి ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే ఇద్దరికీ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్య దంపతులతో పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లు చేసి ఈ నిబంధనను ప్రవేశ పెట్టారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. బదిలీలు ముగిశాక వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. -
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. రూ.931.83 కోట్ల ఆస్తులతో ఆయన అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో రూ.332.56 కోట్లతో అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, రూ.51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. కేవలం రూ.15 లక్షల ఆస్తులతో అత్యల్ప ఆస్తులున్న పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎంమమతా బెనర్జీ, ఆ తర్వాత స్థానంలో రూ.55 లక్షలతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఏడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా రూ.5.31 కోట్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు. 30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుదేశంలోని మొత్తం 30 రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.54.42 కోట్లు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ సమీక్షించి ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక సీఎం సగటు స్వీయ ఆదాయం రూ.13,34,738గా ఉంది. అలాగే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉంది. అయితే, అరుణాచల్ప్రదేశ్ సీఎం ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్లకు పైగా అప్పులున్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లకు పైగా, చంద్రబాబుకు రూ.10 కోట్లకు పైగా రేవంత్రెడ్డికి రూ.1.30 కోట్ల అప్పులున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. క్రిమినల్ కేసుల్లో రేవంత్రెడ్డి టాప్ మరోవైపు.. అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి నిలిచారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. రేవంత్రెడ్డి తర్వాతి స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. ఇక 12 మంది (40%) ముఖ్యమంత్రులు వారిపై క్రిమినల్ కేసులను ప్రకటించుకున్నారని, 10 మంది (33%) వారిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం సీఎంలలో ఇద్దరే మహిళలుఇదిలా ఉంటే.. 30 మంది ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన రేఖాగుప్తా ఇద్దరే మహిళలు ఉన్నారు. అలాగే, 30 మంది సీఎంలలో తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు, ఆరుగురు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు, ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా.. 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. -
ఏయూ పరువు గంగపాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. రాజకీయ అనాలోచిత నిర్ణయాలతో పూర్వ వైభవాన్ని కోల్పోతూ వర్సిటీ పరువు గంగపాలు అవుతోంది. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న యూనివర్సిటీపై ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్’ (ఎన్బీఏ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు మూల్యాంకనం కోసం వచ్చిన ఎన్బీఏ నిపుణుల బృందానికి ఏయూ అధికారులు సహకరించలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అంతేకాక.. రెండు కవర్లతో బహుమతులు ఎర వేసినట్లు ఆరోపిస్తూ లేఖ రాయడం ఏయూలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఏయూ పాలకులు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. సహకరించని ఏయూ..ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ (స్వయం ప్రతిపత్తి) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేయగా.. ఎన్బీఏ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి 17 నుంచి 19 వరకు ఏయూని సందర్శించింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజిలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు విద్యార్థుల వివరాలు, ఫీజులు, ఫ్యాకల్టీ, ఇతర వివరాలను పరిశీలించే ప్రయత్నం చేసింది. అయితే, ఏయూ అధికారులు బృందం సభ్యులకు సరైన పత్రాలు సమర్పించలేదు. దీంతో.. ఎన్బీఏ బృందం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అలాగే, ఈ బృందం సభ్యులకు రెండేసి కవర్లతో బహుమతుల ఎరవేశారు. అనంతరం.. ఏయూ నుంచి వెళ్లిపోయిన ఆ బృందం ఎన్బీఏకు నివేదికను సమర్పించే సమయంలో ఏయూ అధికారుల తీరును వెల్లడించింది. దీంతో వివరణ కోరుతూ ఏయూ పాలకవర్గానికి ఎన్బీఏ లేఖ రాసింది. కవర్లలో పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయంట..! ఎన్బీఏ లేఖపై ఏయూ అధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పత్రాల సమర్పణలో జాప్యానికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే కారణమని అందులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకాదని, బృందాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంకా ఏదైనా డాక్యుమెంట్లు అవసరమైతే వెంటనే సమరి్పంచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే, ఫ్యాకల్టీ విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని తెలిపారు. బృందానికి ఇచి్చన ఆ రెండు కవర్లలో ఏయూకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, నోట్ ప్యాడ్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉన్నాయని, దీనిని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు చింతిస్తున్నామని ఏయూ అధికారులు ఆ లేఖలో వివరణ ఇచ్చారు. దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏయూ అభివృద్ధిలో దూసుకుపోయింది. నూతన ఆవిష్కరణలకు వేదికగా మారింది. సరికొత్త విభాగాలు, చైర్లు, ఇన్నోవేషన్ హబ్లు ఇలా అనేక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. ఏయూ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా నాక్ ఏ++ గుర్తింపు లభించింది. అటువంటి ఆంధ్రా యూనివర్సివటీ ప్రస్తుతం రాజకీయ ప్రేరేపిత దాడులు, ప్రొఫెసర్లపై విచారణలకు పరిమితమైంది. దీంతో ఏయూ పూర్వవైభవం తగ్గుతూ వస్తోంది. ప్రతిష్టాత్మక ఎన్బీఏ బృందం ఏయూలో సందర్శించిన సమయంలో వారికి సరైన డాక్యుమెంట్లు అందించకపోవడం ఏయూలో అధికారుల పనితనానికి అద్దం పడుతోంది. మూడ్రోజుల పాటు ముల్యాంకనం జరిగితే.. కనీసం వారికి అవసరమైన సమాచారం అందించకపోవడం ఏయూలో చతికిలపడ్డ పరిపాలనకు నిదర్శనం. ఫలితంగా.. ఎన్బీఏ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచి్చంది. ఏయూ అధికారుల సుదీర్ఘ వివరణతో ఎన్బీఏ బృందం మరోసారి మూల్యాంకనానికి ఏయూను సందర్శించాలని నిర్ణయించింది. -
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు
తిరుపతి మంగళం: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. ఆరు వారాల లోపల ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని డీజీపీని మానవ హక్కుల కమిషన్ శనివారం ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 3న జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేలా ఉండటమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనలకు, ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినడానికి కారణమయ్యాయని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల రోజున తమ పార్టీ కార్పొరేటర్లతో కలిసి తాను ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు దాడి చేసి, అద్దాలు పగలగొట్టి, డ్రైవర్పై దాడిచేసి, టైర్ల గాలి తీసేసిన ఘటన రికార్డుల్లోనూ ఉందని ఎంపీ వివరించారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, కేసు నమోదు సమయంలో పలువురు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోవడం అనుమానాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం ఎంపీ గురుమూర్తి సమర్పించిన ఆధారాలు, మీడియా రిపోర్టులు, హైకోర్టు ఆదేశాలను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నం.18/2025 నమోదైనప్పటికీ, దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఎంపీ వాదించారు. ఈ నేపథ్యంలో కమిషన్ వరుసగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదికలు కోరింది. -
రంగా విగ్రహాలకు అవమానం
కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే.. ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు. విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ నేతలు దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు. అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్ సీఐ రవికుమార్కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. దుండగుల సమాచారమిస్తే బహుమతి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు. -
టీడీపీ ‘ప్రేమఖైదీ’!
సాక్షి, టాస్క్ ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక భారీ డీల్ నడిచింది. దశాబ్దకాలం పైగా శ్రీకాంత్ సైన్యంతో నెల్లూరును నేరమయం చేసిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి పెరోల్ ద్వారా అతడిని బయటకు రప్పించేందుకు వ్యవహారం నడిపించాడని పోలీస్ నిఘా వర్గాల విచారణలో తేలినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ నాలుగు జిల్లాల్లో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంద మందికిపైగా సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. వారి ద్వారానే సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు, చేయిస్తున్నాడని పోలీస్శాఖ విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో శ్రీకాంత్ అతని సైన్యం నడుస్తున్నట్టు తేటతెల్లమైంది. నెల్లూరులో జరిగే సెటిల్మెంట్లు, సింగిల్ నంబర్ల ఆట, బెట్టింగ్, ఆర్థిక నేరాలు అన్నింటినీ అతని ద్వారానే నడిపిస్తూ నగరంలో ప్రజాప్రతినిధితో పెట్టుకుంటే నూకలు చెల్లినట్లే అనే భయాన్ని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా దశాబ్దకాలంగా నెల్లూరులో ఆ ప్రజాప్రతినిధిని చూస్తేనే నగర వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు’లతోనే.. శ్రీకాంత్ పెరోల్ విషయంలో సిఫార్సు లెటర్లు ఇచ్చినా రిజక్ట్ చేశారంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నప్పటికీ వారి ఒత్తిడి, హోంమంత్రి అండతో హోంశాఖ పెరోల్ ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్ను బయటకు రప్పించి మరిన్ని సెటిల్మెంట్లతో ప్రజాధనాన్ని దోచేసేందుకు పెరోల్ అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారులు అడ్డుపడడంతో కీలక మంత్రికి రూ.2 కోట్ల డీల్ కుదిర్చారన్న ప్రచారం ఉంది. ఆ డబ్బుతోనే పెరోల్తోపాటు వచ్చే ఏడాది జనవరిలో స్రత్పవర్తన కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో శ్రీకాంత్ పేరు చేర్చేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది.అరుణ వ్యవహారంతోనే వెలుగులోకి.. ఇటీవల పెరోల్లో బయటకు వచ్చిన శ్రీకాంత్ తన సన్నిహితురాలు అరుణనురౌడీ సామ్రాజ్యానికి రాణిని చేసేందుకు తన సైన్యంతో సమావేశం పెట్టడం వల్లే అతని పెరోల్ వ్యవహారం లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో శ్రీకాంత్తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలూ అతని సైన్యాధిపతి తీసినవేనని తెలుస్తోంది. ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందోనని ఆ సైన్యాధిపతి లీకులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం ఎల్లో మీడియా వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేసిన యత్నాలు బూమ్రాంగ్ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఇదే అదనుగా కూటమిలోని ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం ఎల్లో మీడియాలో ఓ వర్గాన్ని ప్రోత్సహించి వ్యవహారాన్ని బజారులో పెట్టేలా చేశారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.శ్రీకాంత్ పెరోల్కు సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్కు తాను సిఫార్సు లేఖ ఇచి్చన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ పెరోల్ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ కూడా లేఖ ఇచ్చారని చెప్పారు. తమ లేఖల్ని జూన్ 16న రిజెక్ట్ చేసిన అధికారులు పెరోల్ ఇవ్వలేమని చెప్పారన్నారు. జూలై 30న హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్కు అనుమతి ఇచ్చిందన్నారు. పెరోల్ విషయంలో తమకేం సంబంధం లేదన్నారు. ఇకపై తాను బతికుండగా పెరోల్ కోసం సిఫార్సు లెటర్లు ఇవ్వనని చెప్పారు. ఇది తనకు గుణపాఠం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ పెరోల్కు సిఫార్సు లెటర్లు ఇచ్చానని అన్నారు. లేఖలు ఇవ్వడం సాధారణమన్నారు. అధికారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
కక్షసాధింపులకే లిక్కర్ స్కాం సృష్టి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాలు, దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ స్కాంను సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్క్లబ్లో గంగాధర్ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలకిష్్మతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షసాధింపుల కోసమే లిక్కర్ పేరుతో బేతాళ కథను సృష్టించి తప్పుడు కేసులు పెడుతూ వైఎస్సార్ సీపీ నేతలను, మచ్చలేని రిటైర్డ్ అధికారులను అరెస్టు చేసి పైశాచికానందం పొందుతున్నారని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..! 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న నాపై కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వల్లే గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట ఇబ్బంది పెట్టే యత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చా. ఐదేళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశా. అన్నీ పారదర్శకంగానే జరిగాయని, ఎక్కడా అవకతవకలకు తావులేదని నేను చెప్పా. కానీ నాపైన ఉన్నవారే అన్ని నిర్ణయాలూ చేశారని నేను చెప్పినట్టు ఎల్లోమీడియాలో అబద్ధపు కథనాలు రాశారు.నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వా«దీనం చేసుకుంటున్నారంటూ గంటగంటకూ విద్వేషపూరిత బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు వేశారు. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలూ లేవు. సిట్వాళ్లు కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అయినా ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. వాటినే సిట్ చార్జిషీట్లలో పేర్కొనడం చూస్తున్నాం. ఈ లిక్కర్ వ్యవహారం ఓ అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అనవసరం. నాకు ల్యాప్ట్యాప్ వాడకమే తెలియదు.. నాకు ల్యాప్ట్యాప్ లేదు. అయినా సిట్ వాళ్లు ల్యాప్ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్టు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. నాకు ల్యాప్ట్యాప్ వాడడం కూడా తెలియదు. లేని ల్యాప్ట్యాప్ను ఎలా స్వాదీనం చేసుకుంటారు? సిట్ వాళ్లు నా ఫోన్ను తీసుకున్నారని కూడా రాశారు. ఫోన్ తీసుకుని వారేం చేస్తారు? ఏదో జరుగుతుందని ప్రజలను నమ్మించేందుకు ఎల్లోమీడియా, టీడీపీ పడరాని పాట్లు పడుతున్నాయి. మా ప్రభుత్వంలో లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. ప్రభుత్వ షాపులుపెట్టి మాఫియాను అరికట్టాం. పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాం. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014–19తో పోలిస్తే పెరిగింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే లాభాపేక్ష లేకుండా నడిపినప్పుడు అక్రమాలకు తావెక్కడ? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా మద్యం పాలసీ పేరిట దోచుకుతింటున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో కేసూ నమోదైంది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
పరదాల మాటున చంద్రబాబు పర్యటన
పెద్దాపురం: సీఎం చంద్రబాబు నాయుడు పెద్దాపురం పర్యటన శనివారం కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ, పరదాలమాటున సాగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం అక్కడి డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సెంటర్ సమీపంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో ప్రసంగించారు. పరదాల మాటున.. చంద్రబాబు ఆద్యంతం పరదాల మాటున పర్యటన నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామర్లకోట, పెద్దాపురం వెళ్లే రోడ్లను మూసి వేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల మంది పోలీసులతో రోడ్లను దిగ్బంధించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు గ్రామాలకూ రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కువగా మఫ్టీలో పోలీసులు పహారా కాయడం విశేషం. చంద్రబాబు పాదయాత్ర చేసిన 100 మీటర్ల దూరం అంతా రెండు వైపులా ఫ్లెక్సీలతో మూసి వేశారు. సభ ముగిసిన తర్వాత టీడీపీ కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు వెళ్లే వరకు సుమారు 45 నిమిషాల పాటు సభా ప్రాంగణం నుంచి జనాన్ని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో సభకు వచ్చిన జనం అక్కడే ఉండిపోయారు. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్ఎస్కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్ఎస్కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్గా వచ్చే మంత్రి ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్తోపాటు ఇంకో అనుబంధ రూమ్ను కూడా మెయిన్టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నంద్యాలలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: ఆర్జియమ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న భాను ప్రకాష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ హాస్టల్లో భాను ప్రకాష్ ఉరివేసుకుని బలనన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం వరకూ కళాశాలలోనే ఉన్న విద్యార్థి భాను ప్రకాష్.. హాస్టల్కు వెళ్లిన తర్వాత ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి భాను ప్రకాష్ ఉరివేసుకున్న తర్వాత కొన ఊపిరితో ఉండటం చూసి కాలేజ్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి భాను ప్రకాష్ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ.. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, తమ్మినేని సీతారాం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.కాగా, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
‘అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు హుషారుగా ఉన్నారు’
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం. ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు. -
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. 𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
కూన రవి శారీరకంగా.. మానసికంగా వేధించాడు: ప్రిన్సిపాల్ సౌమ్య
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ రెజిటీ సౌమ్య తెలిపారు. శనివారం ఆమె మీడియా ముందుకు వచ్చారు. కూన రవి వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వేధింపులపై సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని సౌమ్య డిమాండ్ చేశారు. 2013 నుంచి ప్రిన్సిపాల్గా తాను పనిచేస్తున్నానని ఇంతవరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదన్నారు.‘‘రెండు నెలులుగా వేధింపులకు గురవుతున్నా.. వేధింపుల్లో భాగంగానే నన్ను బదిలీ చేశారు. ఎంత మానసిక ఒత్తిడి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. నేను సాధారణ మహిళను.. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే నాపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలి. ఎంక్వయిరీ చేయకుండా ఎలా నాపై ఆరోపణలు చేస్తారు?’’ అంటూ సౌమ్య ప్రశ్నించారు.‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుకే విచారణ చేయించాలని ధైర్యంగా చెప్తున్నా. స్కూల్కు నేను సరిగా వెళ్ళననని ఎమ్మెల్యే కూన రవికుమార్ అబద్ధం చెబుతున్నారు. నా స్కూల్ అటెండెన్స్ సీఎస్ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశానుఅదికూడా చూడండి. ప్రతీ రోజు పెట్టే ఫుడ్ కూడా మెనూ ప్రకారం పెడుతున్నా.. అది ప్రతి రోజు ఫొటోలు కూడా మాపై అధికారులకు పెట్టాను. పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేశానని నాపై ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయించారు. ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు. ఎస్ఎంసీ చైర్మన్ పరం నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు స్కూల్కి వచ్చి క్లాస్ రూమ్ల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు...ఎమ్మెల్యే నా ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా వివాహం గురించి కూడా తప్పుగా మాట్లాడారు. నా భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోవడానికి నన్ను మోసం చేశారు. అతను ఇప్పుడు వేరే మహిళను పెళ్లి కూడా చేసుకున్నారు. రాత్రిపూట ఒక ఎమ్మెల్యే మహిళలకు వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఏంటి?. పొందూరులో ఓసారి రాత్రి 10 గంటల వరకు కూడా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. నా సర్వీస్లో ఇంతవరకు ఎలాంటి తప్పు చేయలేదు ఈ రెండు నెలల నుంచే నేను వేధింపులకు గురవుతున్నా. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడినా నాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు...కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. అక్కడ పని చేస్తున్న వారు ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత సామాజిక వర్గం కావడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నేను స్కూల్కు వెళ్లాను. సెలవు రోజుల్లో (శనివారం రక్షా బంధన్) నాకు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టారు...rjd ఆర్ఐడీ విచారణ జరగకుండా నన్ను ఎందుకు బదిలీ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేకి రాత్రి కదా వీడియో కాల్ వద్దు.. ఆడియో కాల్ చేయమని అడిగాను. లేదు వీడియో కాల్లోకి రావాలని ఒత్తిడి చేశారు. నా కులం విషయంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో రవి కుమార్ నన్ను దూషించారు..సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ స్పందించి నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు జరిగిన అన్యాయంపై మాత్రమే మాట్లాడాను.గ వేధింపులపై జిల్లా కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేశాను. కలెక్టర్ను ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు’’ అని సౌమ్య తెలిపారు. -
స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు. -
కన్నబిడ్డలనే కాడెద్దులుగా చేసుకుని..
కడప జిల్లా: వ్యవసాయ కూలీల ఖర్చు భరించలేక ఒక రైతు శుక్రవారం తన కుమారుడు, కుమారైలకు కాడికట్టి కాడెద్దులుగా చేశాడు. పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్రెడ్డి అనే రైతు తన పొలంలో ఒక ఎకరాలో పూల సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు ఎక్కువగా ఉండటంతో దానిని తీసేందుకు కూలీలు దొరకక, దూరం నుంచి కూలీలను పిలిపిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇంటర్ చదువుతున్న తన పిల్లలు ప్రహ్లాదరెడ్డి, చామంతిలకు కాడి కట్టి కలుపు తొలగిస్తున్నారు. -
తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేడు ప్రకాశం పంతులు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు . తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/cPB3xrhlKv— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఐ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు. The passing of CPI leader and former MP Comrade Suravaram Sudhakar Reddy Garu is deeply saddening. His contributions to politics and the Communist movement will always be remembered.My heartfelt condolences to his family. May his soul rest in peace. pic.twitter.com/k5ssa78oMZ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
వికలత్వం 40 శాతం ఉంటే పింఛన్ : కలెక్టర్
తిరుపతి అర్బన్ : 40 శాతం అంతకంటే ఎక్కువ వికలత్వం ఉన్నట్లు తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు పింఛన్లు యథావిధిగా సెప్టెంబర్లో అందిస్తారని కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు ఇటీవల సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించిన నోటీసులను తిరిగీ కార్యదర్శులు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాల ఇచ్చిందని స్పష్టం చేశారు. అలాగే తాము అర్హులం అయినప్పటికీ రీవెరిఫికేషన్లో అనర్హులుగా గుర్తించి నోటీసులు అందుకున్న దివ్యాంగులు తమ పరిధిలోని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో 30 రోజుల్లో అప్పీలు చేసుకోవాలని కలెక్టర్ వెల్లడించారు. -
మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు. -
నిద్ర చేయడానికొచ్చి శాశ్వత నిద్రలోకి..
ఎన్టీఆర్ జిల్లా: కొడుకు పుట్టాడని చిన్నమ్మ ఇంట్లో నిద్ర చేయటానికి వచ్చిన ఓ బాలింత, మూడు నెలల కుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషాద ఘటన శుక్రవారం ఎనీ్టఆర్ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం ఎ.కొండూరుకు చెందిన నాగబత్తుల చైతన్యకు విజయవాడకు చెందిన నవీన్తో ఏడాది క్రితం వివాహమైంది. అతను విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో పని చేస్తుంటాడు. వారికి మగ బిడ్డ పుట్టగా ఆర్జిక్ చైతన్య అని నామకరణం చేశారు. చైతన్య కంచికచర్ల మండలం కీసరలో నివసిస్తున్న పిన్ని ఇంట్లో నిద్రచేసేందుకు మూడు నెలల బాబుతో కలసి బస్సులో వచ్చింది. కీసర సెంటర్లో బస్సు దిగానంటూ పిన్నికి ఫోన్ చేసింది. ఆమె చైతన్యను తీసుకురావాల్సిందిగా పొరుగింట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తిని కోరింది. వెంటనే బస్టాప్నకు వెళ్లిన శ్రీకాంత్ తల్లీబిడ్డను బైక్పై ఎక్కించుకుంటున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వేగంగా వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో చిన్నారి ఆర్జిక్ అక్కడికక్కడే మరణించాడు. చైతన్య, శ్రీకాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని హైవే అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కోట్ల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్లో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ అజెండాలో చేర్చకుండా టేబుల్ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు.అనంతరం టేబుల్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్సీపీ.. వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
దేశానికే ఆదర్శం.. ‘అల్లూరి’ జిల్లా
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ప్రారంభించిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమానికి ఎంపికైన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు సహకార ఆధారిత అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారింది. ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థలు వేర్వేరుగా పని చేస్తూ.. పరిమిత ఫలితాలు మాత్రమే సాధించాయి. దీనిని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డి్రస్టిక్ట్ నాన్ ప్రాఫిట్ ఫోరం(డీఎన్ఎఫ్) కీలక మార్పులు తెచ్చిందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. ఒకే వేదికపై స్వచ్ఛంద సంస్థలు.. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ పంచాయతీలు డీఎన్ఎఫ్ ద్వారా ఒకే దారిలో పయనించాయి. దీంతో ప్రణాళికలు సక్రమంగా అమలవ్వడంతో పాటు సత్ఫలితాలు గ్రామస్థాయికి చేరాయి. గిరిజనులకు కాఫీ ఆధారిత జీవనోపాధి బలపడింది. గ్రామాల్లో తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు మెరుగయ్యాయి. అదనంగా.. ఐదు గ్రామాల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతుల పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసి రైతులకు కొత్త మార్గాలను చూపించారు. యువత, సివిల్ సొసైటీ భాగస్వామ్యం పెరిగి పంచాయతీల స్థాయిలో నిర్ణయాలు బలపడ్డాయి. సంఘటిత వేదిక లేకుండా అభివృద్ధి కష్టమని అల్లూరి జిల్లా ద్వారా స్పష్టమైందని నీతి ఆయోగ్ పేర్కొంది. డేటా ఆధారిత నిర్ణయాలు, పారదర్శక సమీక్షలు విశ్వసనీయతను తెచ్చాయని ప్రశంసించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా మంచి ఫలితాలను ఇచి్చందని పేర్కొంది. అభివృద్ధిలో సమన్వయం, సహకారం, సమగ్రత అనే సూత్రాలతో ముందుకు సాగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అభినందించింది. -
ఇచ్చంపల్లికి షరతులతో తెలంగాణ సమ్మతి
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీళ్లను తరలించాలనే ప్రతిపాదనలకు తెలంగాణ షరతులతో సమ్మతి తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్ వల్ల దిగువన ఉన్న సమ్మక్క సాగర్పై ఏ ప్రభావం పడదని అధ్యయనాల్లో తేలిన తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. దేవాదుల కింద 38 టీఎంసీలు, సీతారామ కింద 67 టీఎంసీలు, సమ్మక్క సాగర్ కింద 47 టీఎంసీల నీళ్లను తాము వినియోగించుకున్న తర్వాత మిగిలే నీళ్లను గోదావరి – కావేరి అనుసంధానంలో భాగంగా తరలించేందుకు ఉన్న అవకాశాలపై సిమ్యులేషన్ స్టడీస్ జరిపి.. సానుకూల ఫలితాలు వస్తేనే ముందుకు వెళ్ళాలని సూచించింది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్్కఫోర్స్ శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్కుమార్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అధికారులు ప్రత్యక్షంగా హాజరుకాగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు వర్చువల్గా హాజరయ్యారు. తెలంగాణ తరఫున హాజరైన వారిలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుబ్రమణ్యం ప్రసాద్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్ ఉన్నారు. ఏపీ జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ హాజరయ్యారు. కేంద్రం నిధులతో 2 జలాశయాలు కట్టించాలి జాతీయ ప్రయోజనాలు ఇమిడిలేని ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వరాదని, గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తరలించే నీటిలో 50 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని రాహుల్ బొజ్జా కోరారు. ఇచ్చంపల్లి బరాజ్ కడితే అక్కడి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అనుసంధానం ద్వారా లభించే రాష్ట్ర వాటా జలాలను ఎక్కడైనా వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నీళ్లను నిల్వ చేసేందుకు రెండు జలాశయాలను కేంద్ర నిధులతో కట్టించి ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత మేర ముంపును తగ్గించాలని సూచించారు. ఇచ్చంపల్లి నుంచి తరలించే జలాలను నాగార్జునసాగర్లో కాకుండా దిగువన 7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న సాగర్ టెయిల్ పాండ్లో వేయాలన్నారు. ఏపీ ఇంట్రా లింక్ ప్రాజెక్టులపై అభ్యంతరం ఇదే ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఎన్డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్లను సమరి్పంచాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని కోరడంపై రాహుల్ బొజ్జా తీవ్ర అభ్యంతరం తెలిపారు. కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా గోదావరి–బనకచర్ల ఆనుసంధానం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాకే.. ఈ నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఏపీ ప్రతిపాదించిందని సమావేశం దృష్టికి తెచ్చారు. అనుసంధానం ప్రాజెక్టుపై సమ్మతి తెలుపుతూ అవగాహన ఒప్పందంపై.. అందరి సమ్మతి, అధ్యయనాల తర్వాతే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పరీవాహకంలో రాష్ట్రంలో 968 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు సత్వరంగా క్లియరెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం నుంచే చేపట్టాలి: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ కోరింది. గోదావరిలో నీటి లభ్యతపై 2023 జూన్లో సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగానే గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించారంటూ అభ్యంతరం తెలిపింది. ‘అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కృష్ణాబేసిన్లో గోదావరి నీళ్లు వేస్తే.. బేసిన్పై ఆధారపడిన ఇతర రాష్ట్రాలూ వాటాలు కోరే అవకాశం ఉంది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ అధ్యయనాల్లో తేడా ఉంది. అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఏపీ కోరింది. కనీసం 40 టీఎంసీలైనా ఇవ్వండి: కర్ణాటక ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తమకు కనీసం 40 టీఎంసీలను కేటాయించాలని కర్ణాటక కోరింది. ‘పూడికతో తుంగభద్ర జలాశయం 30 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. బెడ్తి – వర్ధా అనుసంధానంతో ఏ మా త్రం ప్రయోజనం లేదు. తుంగభద్ర ఎగువన మరో లింకు ప్రతిపాదిస్తాం..’ అని తెలిపింది. 48% పరీవాహకం ఉన్నా నీళ్లు ఇవ్వరా?: మహారాష్ట్ర ‘గోదావరిలో 48 శాతం పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలోనే ఉన్నా మా రాష్ట్రానికి ప్రాజెక్టు కింద నీళ్లు కేటాయించలేదు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కు నీళ్లను తరలిస్తే ఆ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలకు ఆ నీటిపై హక్కు ఉంటుంది. దాని ప్రకారం నీటి కేటాయింపులు చేయాలి..’ అని మహారాష్ట్ర కోరింది. మా వాటా నీళ్లన్నీ వాడుకుంటాం: ఛత్తీస్గఢ్ ’గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన మా వాటా నీళ్లను పూర్తిగా వాడుకుంటాం. మాకు గోదావరిలో 301 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 163 టీఎంసీల వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలు ఉన్నాయి. 100 టీఎంసీలతో బోధఘాట్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం..’ అని ఛత్తీస్గఢ్ పేర్కొనగా, సీడబ్ల్యూసీ జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు కదా? వేరే నీటి అవసరాలు లేవుగా? అని ప్రశ్నించింది. దీంతో ఛత్తీస్గఢ్ స్పందిస్తూ.. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్తో నాలుగు గ్రామాలు, 170 హెక్టార్ల భూమి ముంపునకు గురి అవుతాయని పేర్కొంది. వెంటనే పనులు చేపట్టాలి: తమిళనాడు అనునంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతూ ఇప్పటికే సంతకాలు చేశామని, కావేరీ తీవ్ర లోటు బేసిన్ అని, తక్షణమే ప్రాజెక్టు పనులు చేపట్టాలని తమిళనాడు కోరింది. తమకు 24 టీఎంసీలు కాదని, 74 టీఎంసీలు కేటాయించాలని పుదుచ్చేరి విజ్ఞప్తి చేసింది.గోదావరి నీటిని వాడుకోం: సీడబ్ల్యూసీ చైర్మన్ ‘గోదావరి–కావేరీ అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలు చుక్క కూడా వాడుకోము. హిమాలయన్ కాంపోనెంట్ నుంచి నీటిని తీసుకొచ్చి గోదావరిలో వేసి ఆ నీళ్లను తరలిస్తాం. రాష్ట్రాలన్నీ పెద్ద మనసుతో, ఉదార స్వభావంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించాలి. ప్రస్తుతం గోదావరిలో ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం. ఛత్తీస్గఢ్ గనుక తమ పూర్తి వాటా నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రాజెక్టులను నిర్మించుకుంటే తరలింపును నిలిపివేస్తాం. అయితే మరో 15 ఏళ్లయినా ఛత్తీస్గఢ్ తన వాటాను వాడుకునే అవకాశాల్లేవు..’ అని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్కుమార్ జైన్ అన్నారు. -
పోలవరం నిర్వాసితులకు పునరావాసంలో అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. సకాలంలో పునరావాసం కల్పించకపోతే నిర్వాసితుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జీవనోపాధిని పెంచేలా నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని సిఫార్సు చేస్తూ పార్లమెంట్కు ఇటీవల స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. జలవనరుల విభాగంపై ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఈ ఏడాది జూన్ 8 నుంచి 11 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దీనిపై పార్లమెంట్కు నివేదిక ఇచ్చింది. 12,797 కుటుంబాలకే పునరావాసం పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందుకోసం 213 పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా.. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించింది. వరదలు, సాంకేతిక సమస్యలు వస్తే.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పొడిగించింది. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ, జనవరి 8 నాటికి కేవలం 12,797 కుటుంబాలకే పునరావాసం కల్పించారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను సమన్వయం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు వెంటనే ప్రాజెక్టు వద్ద క్వార్టర్స్ నిరి్మంచాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కమిటీని నియమించాలని సిఫార్సు చేసింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయపడింది. -
రైలులో లగేజీ మరింత 'భారం'
సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణం..అన్నీ సర్దేసుకుని పట్టేసుకుందాం. సీటు కింద బ్యాగులు ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకుందాం అంటే కుదరదిక. మీ లగేజీ.. మీకు మరింత భారమవ్వనుంది. ఇకపై రైలులో ప్రయాణికుల లగేజీకి విమాన ప్రయాణంలో మాదిరిగా బాదుడు షురూ చెయ్యనున్నారు. ఎప్పటి నుంచే ఈ నిబంధనలున్నా.. ఇకపై తూ.చా. తప్పకుండా అమలు చెయ్యాలని నిర్ణయించారు. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే ఒకటిన్నర రెట్లు ఫైన్ పడనుంది. సీటు కంటే బ్యాగ్ సైజ్ పెద్దదైనా బాదుడు తప్పదని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యతరగతి ప్రయాణికులపైనే అధిక భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో 70 కిలోల వరకూ అనుమతి ఉండగా సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు కేవలం 40 కిలోల పరిమితికి మాత్రమే అనుమతించనున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికుల లగేజీ బరువు కొలిచే పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు రైలు ప్రయాణికులకూ అదే విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై లగేజీ కొలిచే విధానం రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం, ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ వెయింగ్ మెషిన్లలో తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట లగేజీ బరువు పరిమితులను నిర్ణయించింది. నిర్దేశించిన బరువు మించితే అదనపు చార్జీలు, జరిమానాలు చెల్లించాల్సిందేనంటూ ఇండియన్ రైల్వేస్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెబుతున్నా.. ఈ నూతన నిబంధనలు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టబోతున్నాయి. మధ్యతరగతిపైనే అధిక భారం ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అయినా.. ఇకపై కచ్చితంగా అమలు చెయ్యాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు రైల్వే కోచ్ ప్రకారం నిర్ణయించారు. ఇందులో మధ్యతరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే సెకెండ్క్లాస్, థర్డ్ ఏసీ పైనే భారం ఎక్కువగా ఉండనుంది. ప్రయాణికుల తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితిని నిర్ణయించారు. దీని ప్రకారం, ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. సెకండ్ ఏసీ ప్రయాణికులు 50 కిలోలు, థర్డ్ ఏసీ ప్రయాణికులు 40 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా కేవలం 40 కిలోలు మాత్రమే పరిమితి విధించవచ్చు. జనరల్, సెకండ్ సిట్టింగ్ ప్రయాణికులకు కేవలం 35 కిలోల వరకు ఉచిత పరిమితి విధించారు. రైల్వే నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన పరిమితి కంటే 10 నుంచి 15 కిలోల వరకు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడంలో సడలింపు ఉంటుంది. కానీ బరువు అంతకంటే ఎక్కువగా ఉంటే, ప్రయాణికులు స్టేషన్కు వెళ్లి లగేజీని బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుల్లో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్లైతే అనుమతించిన దానిలో సగం లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది.బ్యాగ్ సైజ్ పెరిగినా వాత పడుద్ది నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ తీసుకెళ్లినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడు బుకింగ్ పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తున్నట్లు తేలితే.. సాధారణం కంటే 1.5 రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణ సమయంలో ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు మాత్రమే కాకుండా బ్యాగ్ పరిమాణంపైనా భారం పడనుంది. ప్రయాణికుల బ్యాగ్ చాలా పెద్దదిగా ఉండి, కోచ్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే, దానిపైనా జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద సైజు బ్యాగ్ పట్టుకెళ్లినా భారం తప్పదన్న విషయం ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. అంటే బుకింగ్ లేకుండా పరిమితి కంటే ఎక్కువ బరువు తీసుకెళ్లడం ఇక జేబుకు చిల్లు పడటమేనని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తుండటం వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై ఈ సమస్య లేకుండా ఉండేందుకే నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వృద్ధుల చేతి కర్రలు, హ్యాండ్ బ్యాగులు, టిఫిన్ బాక్సులపై ఈ లగేజీ పరిమితి వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్రాజ్ డివిజన్¯లోని ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్ మొదలైన జంక్షన్లలో అమలుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే మిగిలిన స్టేషన్లలో అమలు చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
డిగ్రీ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదులో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. ఓఏఎండీసీ పోర్టల్లో సొంతంగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడంతోపాటుగా కళాశాలలకు నేరుగా వెళ్లి దరఖాస్తు ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించడం సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆన్లైన్లో సులభంగా ఆప్షన్ల వెసులుబాటు ఉన్నప్పుడు కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక విద్యార్థి ఆన్లైన్లో తనకు నచి్చన కళాశాల కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కళాశాలల్లో ఎన్ని కోర్సులకైనా ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యా మండలి మాత్రం వెబ్ ఆప్షన్లకు రెండు మార్గాలుగా అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ విద్యార్థి సొంతంగా ఆన్లైన్లో కాకుండా నేరుగా కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే.. ఆ కళాశాలలో సీటు రాకపోతే సదరు విద్యార్థి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. పోనీ, ఒక కళాశాలకు వెళ్లి అక్కడి కోర్సుల్లో ఆప్షన్లతోపాటు వేరే కళాశాలలోని కోర్సుల ఆప్షన్ల ఎంపిక కుదరదు. మళ్లీ ఇక్కడ విద్యార్థి ఆన్లైన్లో ఆç³్షన్ పెట్టుకోవాలి/మరో కళాశాలలకు వెళ్లి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్ల మార్పు సమయంలో ఆన్లైన్లో పెట్టిన ఆప్షన్లు ఎన్నైనా మార్చుకోవచ్చు. కానీ, కళాశాలకు వెళ్లి నమోదు చేసుకున్న ఆప్షన్ను మార్చడానికి వీలుపడదు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును హరించడమే. -
ఏడుగంటల పాటు నారాయణస్వామి విచారణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మద్యం విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా.. టీడీపీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం ముందుకెళ్తున్న ఏపీ ‘సిట్’ తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టార్గెట్ చేసింది. డెబ్భై ఐదేళ్లు దాటిన ఈయన్ను ఏడు గంటలపాటు పనికిరాని ప్రశ్నలతో వేధించింది. తిరుపతి జిల్లా పుత్తూరులో నారాయణస్వామి ఉంటున్న ఇంటికి సిట్ అధికారులు శుక్రవారం ఉ.10 గంటల సమయంలో వచ్చి సా.5 గంటల వరకు నారాయణస్వామిని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ఒప్పందాలు, లావాదేవీలు, మద్యం సరఫరా తదితర అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు తీసుకొచ్చిన మద్యం పాలసీలో చాలా లొసుగులున్నాయని, ఎవరి ప్రోద్బలంతో లిక్కర్ ఆర్డర్లను ఆన్లైన్లో కాకుండా, ఆఫ్లైన్లో ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడంతో.. మరోమారు విచారణకు రావాలంటూ అధికారులు నారాయణస్వామికి నోటీసులిచ్చారు. విచారణ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రశ్నలన్నింటికీ బదులిచ్చా.. విచారణ పూర్తయ్యాక నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చా. వాళ్ల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాను. మరో సారి విచారణకు రావాలంటే సరేనన్నాను. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’ అని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలను మానసికంగా వేధించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ ‘సిట్’ అని పార్టీ నాయకులు తెలిపారు. -
నోటీసులు అందుకున్న వారికి వచ్చే నెలలో పింఛన్లు రావు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత నోటీసులందుకున్న దివ్యాంగులకు వచ్చేనెలలో పింఛన్లు అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రీ అసెస్మెంట్లో వైద్య పరీక్షలు పూర్తయి మళ్లీ సర్టిఫికెట్లు వచ్చాకే వారికి తిరిగి పింఛన్లు వస్తాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీచేస్తుండడంపై వివాదం రగులుతున్న నేపథ్యంలో.. శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని.. అంతకుముందు 15 ఏళ్లలో ఆరు లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉన్నాయని చెప్పారు. అయితే, గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలామంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని.. దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇక ప్రస్తుతమున్న మొత్తం 7.95 లక్షల మంది దివ్యాంగుల పింఛనుదారులకుగాను 5.50 లక్షల మందికి సంబంధించిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, అందులో 80 వేల మంది అనర్హులుగా తేలగా, వారికి నోటీసులు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. అనర్హులుగా తేలిన వారిని వారి అర్హతబట్టి ఇతర పింఛన్లకు మళ్లిస్తున్నామని.. ఇలా 20 వేల మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పారు. వితంతువులు ఉంటే వాళ్లను వితంత పింఛన్లకు మారుస్తున్నామన్నారు. ఇక 2024 జులైలో 65.18 లక్షలు మందికి పింఛన్లు ఇచ్చామని.. ఇప్పుడు 63.71 లక్షల మందికి ఇస్తున్నామని.. ఈ తగ్గిన పింఛన్లు మరణించిన వారివి మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. -
గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతులకు రూ.53 కోట్లు
సాక్షి, అమరావతి: శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల్లో అంతర్భగామైన గోరకల్లు (నరసింహరాయ సాగర్) రిజర్వాయర్ మట్టికట్ట మరమ్మతులకు ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈని ఆదేశిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరకల్లు వద్ద 11 టీఎంసీల సామర్థ్యంతో గోరకల్లు రిజర్వాయర్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ మట్టికట్ట గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రివిట్మెంట్ కుంగిపోయింది. భారీ గోతులు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా తక్షణం మట్టికట్ట మరమ్మతులకు రూ.58.90 కోట్లు మంజూరు చేయాలని గతేడాది డిసెంబర్ 12న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ.. అప్పట్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టికట్ట మరింతగా దెబ్బతింది. ఇది రిజర్వాయర్ భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మట్టికట్టసహా రిజర్వాయర్ భద్రతకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది జూలై 4న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి మరోసారి నివేదిక పంపారు. -
కోనసీమలో వరద ఉధృతి
సాక్షి, అమలాపురం: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు చొచ్చుకురావడంతో లంకవాసుల కష్టాలు రెట్టింపయ్యాయి. భద్రాచలం, ధవళేళ్వరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరద తగ్గుతుండగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు పెరుగుతోంది. వరద లంకగ్రామాలను చుట్టుముట్టింది. రోడ్లు, కాజ్వేలు మునగడంతో పలుచోట్ల పడవల మీదే రాకపోకలు సాగుతున్నాయి. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లోని పలు లంకగ్రామాల్లోకి వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని మత్స్యకారుల ఇళ్లు నీటమునిగాయి. విద్యార్థులు పడవల మీద పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.ప్రజలు నిత్యావసర సరుకులకు, తాగునీటికి అవస్థలు పడుతున్నారు. పంటలన్నీ మునిగిపోయాయి. కూరగాయ పంటలు, బొప్పాయి, ఎర్ర చక్రకేళి, కంద వంటి వాణిజ్యపంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్వేలు నీటమునిగాయి. పునరావాస కేంద్రం లేదు అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 80 ఇళ్లు నీట మునిగినా అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు. వరద బాధితులకు భోజనం, నీళ్లు అందించడం లేదు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందని కోనసీమ జిల్లా లంకవాసులు ఆందోళన చెందుతున్న సమయంలో ఎగువన శాంతిస్తుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండోప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు. -
వరద తగ్గుముఖం.. కొనసాగుతున్న ప్రవాహం
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్, ధవళేశ్వరం, విజయపురిసౌత్: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,33,398 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 16,776 క్యూసెక్కులు వదలుతూ మిగులుగా ఉన్న 4,16,622 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13,54,996 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 13,42,396 క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,26,876 క్యూసెక్కులు కృష్ణాజలాలు చేరుతుండగా.. 4,86,493 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,32,217 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,05,532 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,82,121 క్యూసెక్కులు చేరుతుండగా 3,58,902 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,75,859 క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు. -
అందరి సమ్మతితోనే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా, ఏ రాష్ట్ర హక్కులకు విఘాతం కలగకుండా, పరివాహక ప్రాంతం (బేసిన్)లోని రాష్ట్రాల సమ్మతితో గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆరో సమావేశం జరిగింది. గోదావరి–కావేరి, బెడ్తి–వరద అనుసంధానంపై ఏకాభిప్రాయసాధనే అజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో బేసిన్లోని తొమ్మిది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక), కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి జలవనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ అనుసంధానంపై అతుల్ జైన్ తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలిస్తామని చెప్పారు. దీన్లో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని వివరిటంచారు. రెండోదశలో గంగా–మహానది, మహానది–గోదావరి అనుసంధానంతో కావేరికి మరిన్ని జలాలు తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్గఢ్ కోటా 148 టీఎంసీలను ఆ రాష్ట్రానికే ఇస్తామని చెప్పారు. రెండోదశ అనుసంధానంలో రాష్ట్రాల అవసరాల మేరకు నీటిని కేటాయిస్తామన్నారు. తొలిదశ అనుసంధానానికి అన్ని రాష్ట్రాలు సమ్మతి వ్యక్తం చేస్తే తక్షణమే ప్రాజెక్టును చేపడతామని ఆయన చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే.. ఆంధ్రప్రదేశ్: గోదావరిలో నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ మళ్లీ అధ్యయనం చేసి నికరజలాల్లో మిగులు తేల్చాలి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తే ఏపీ హక్కులకు భంగం వాటిల్లుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఏ రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లదు. నికర, వరదజలాల సమస్య ఉత్పన్నం కాదు. నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా వినియోగించుకుంటే వాటి ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. వరదల్లో కృష్ణా, పెన్నా నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, సోమశిల రిజర్వాయర్లపై సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలి. తెలంగాణ: ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపునకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనుసంధానంలో తరలించే జలాల్లో 50 శాతం నీటిని మాకు కేటాయించాలి. నాగార్జునసాగర్ ఆయకట్టుకు విఘాతం కలగకుండా చూడాలి. ఛత్తీస్గఢ్: ఇంద్రావతి సబ్బేసిన్లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మా కోటా 148 టీఎంసీలను తరలించడానికి అంగీకరించం. మహారాష్ట్ర: ఇచ్చంపల్లి బ్యారేజీలో నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మధ్యప్రదేశ్: గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విఘాతం కలగకుండా అనుసంధానించాలి. ఒడిశా: గోదావరి–కావేరి అనుసంధానం రెండోదశలో మహానది–గోదావరి అనుసంధానాన్ని అంగీకరించం. తమిళనాడు: మాకు నీటికేటాయింపు పెంచాలి. కర్ణాటక: కృష్ణాజలాల్లో మా వాటా పెంచాలి. కేరళ: కావేరి జలాల్లో మాకు అదనపు నీరు కేటాయించాలి. పుదుచ్చేరి: మాకు నీటికేటాయింపు పెంచాలి.నదుల అనుసంధానంలో ఏకాభిప్రాయమే ముఖ్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నదుల అనుసంధానంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ముఖ్యమని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరింది. నదుల అనుసంధానంపై రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబులు ఇచి్చంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. 147.98 టీఎంసీల నీళ్ల బదిలీ కోసం ముసాయిదా డీపీఆర్ను ఇప్పటికే అన్ని పరీవాహక రాష్ట్రాలకు అందించినట్లు తెలిపింది. నదుల అనుసంధానం అమలు కోసం ముసాయిదా మెమొరాండం ఆఫ్ అసోసియేషన్(ఎంవోఏ)ను తయారు చేసి.. గతేడాది ఏప్రిల్లో రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొంది. అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కోసం ఐదుసార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన, ఎంవోఏపై సంతకాల కోసం కృషి చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా చేపట్టనున్న నదుల అనుసంధానం ప్రతిపాదనలను కూడా కేంద్రం ప్రస్తావించింది. మొత్తంగా 30 ప్రాజెక్టులకు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇందులో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్, గోదావరి–కావేరి లింక్ (గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి), పర్బతి–కలిసిం«ద్–చంబల్ నదుల అనుసంధానాన్ని తొలి ప్రాధాన్యతగా గుర్తించినట్లు పేర్కొంది. 2030 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. దీనిపై కమిటీ స్పందిస్తూ.. నీటి కొరత, కరువు నివారణ, వరద నియంత్రణకు ఆచరణీయమైన పరిష్కారాన్ని నదుల అనుసంధానం అందిస్తుందని అభిప్రాయపడింది. సంబంధిత రాష్ట్రాలకు దీనిపై అవగాహన పెంచి.. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించింది. -
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్లో ఉన్న ట్రైన్పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు కూడా తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్రోడ్లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తువాలుతో మెడకు ఉచ్చేసి.. చంపేయాలని..
చిలమత్తూరు: చేతిలో మారణాయుధాలు పట్టుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ మూక రెచ్చిపోయింది..! ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుడే లక్ష్యంగా దాడికి దిగింది.. పైపెచ్చు బాధితుడిని పరామర్శించేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం ఈ దాడి వెనుక పెద్ద కుట్రను తేటతెల్లం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించింది. శుక్రవారం హుస్సేన్పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. చౌడేశ్వరీదేవి ఆలయంలో పూజల అనంతరం పురుషోత్తమరెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన బాబూరెడ్డి, నర్సిరెడ్డి, మరో నలుగురు మారణాయుధాలతో వచ్చారు. ఎంపీపీ ఎత్తుగా ఉండడంతో ఎడమ కాలిపై ఇనుప రాడ్డుతో కొట్టి కిందపడేశారు. ఆయన మెడలోని తువాలుతోనే ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బాబురెడ్డి, అతడి అనుచరులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తమరెడ్డిని హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. దాడి సంగతి తెలిసి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డిలు ఎంపీపీని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా.. రెండో పట్టణ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీయడంతో వదిలేశారు. ఆస్పత్రిలో పురుషోత్తమరెడ్డిని దీపిక దంపతులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా పురుషోత్తమరెడ్డిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ హిందూపురం సద్భావన సర్కిల్లో దీపిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలోనే దీపికను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. వన్టౌన్ స్టేషన్కు తరలించారు. ఆమెతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుడికే కట్లు.. టీడీపీ వింత నాటకం పురుషోత్తమరెడ్డిపై దాడిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వింత నాటకానికి తెరతీసింది. నిందితులను పార్టీ నుంచి తొలగించాల్సిన టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా చిలమత్తూరు రప్పించుకుని, లేని గాయానికి కట్టు కట్టించారు. తర్వాత ప్రెస్మీట్ పెట్టి బాధిత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపైనే విమర్శలు చేయించారు. నిందితుడు బాబూరెడ్డి కుడి మణికట్టు దగ్గర వాపు ఉందని చెబితే మాత్ర ఇచ్చామని, అయినా నొప్పి ఉందని కట్టు కట్టించుకున్నారని, కంప్రెషన్ బ్యాండేజీ లేకపోవడంతో రక్త గాయాలకు కట్టే బ్యాండేజ్ ను కట్టినట్టు వైద్యాధికారి రోజా చెప్పడం గమనార్హం. -
డీఎస్సీ–2025 మెరిట్ లిస్టుల విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్సైట్ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు. మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్ను విడుదల చేశారు. పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే.. ఇంగ్లిష్ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు) హిందీ : రమేష్ రామనుకొలను (93.5 స్కోరు) సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు) తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు ) బయాలజీ (ఇంగ్లిష్ మీడియం): చోడవరం శివకుమార్ (81.5 స్కోరు) గణితం (ఇంగ్లిష్ మీడియం): సంకరణం విజయ్ (78.5 స్కోరు) ఫిజిక్స్ (ఇంగ్లిష్ మీడియం): బాలకిశోర్ కురాకుల (74.5 స్కోరు) సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు) ప్రిన్సిపాల్: చింతల గౌతమ్ (75.5 స్కోరు) పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు.. అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు టీజీటీ ఇంగ్లిష్.. వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు టీజీటీ హిందీ.. గొల్లపల్లి పవన్ నారాయణ్ కౌశిక్ శాస్త్రి: 88.53 స్కోరు టీజీటీ సంస్కృతం.. తునికిపాటి భాను: 93.60 స్కోరు టీజీటీ తెలుగు.. కల్లె మహేశ్బాబు: 85.20 స్కోరు టీజీటీ మ్యాథ్స్.. సుంకరణం విజయ్: 87.33 స్కోరు టీజీటీ సైన్స్.. బోకం అనిత: 77.89 స్కోరు టీజీటీ సోషల్ స్టడీస్.. బొమ్మిడి డిల్లేశ్: 84.20 -
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్లతో పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్లో పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్ కేర్ బలోపేతం.. వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్సీలు/ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సీలు, పీహెచ్సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది. -
ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్లో జరిగిన హింసపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని గతంలో నివేదిక ఇచ్చి ఏపీ డీజీపీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో మరోసారి తాజా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. -
‘సొంతపార్టీ అధికార ప్రతినిధి ఆవేదనపై చంద్రబాబు స్పందించాలి’
తిరుపతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులు చేస్తున్న చీకటి బాగోతాలపై తెలుగదేశం అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలపై సీఎం స్పందించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్ళలో వారితో రాసలీలలకు పాల్పడుతున్న సదరు మంత్రిపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే, వారిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. పెద్దపెద్ద హోటళ్ళలో బస చేసే సదరు మంత్రి, తన పక్క రూంలను బుక్ చేసుకుంటూ, ఆ గదుల్లో మద్యం సేవించి, మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశాలపై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశంను సుధాకర్ రెడ్డి బహిరంగ పరిచారు. ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే హైదరాబాద్లో రాసలీలలకు పాల్పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఒక పత్రికలోనే దీనిపై పెద్ద ఎత్తున కథనం కూడా ప్రచురితం అయ్యింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తిరుపతికి తరచుగా వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, నైతిక అంశాలను మాట్లాడి వెడుతుంటాడు. అలాంటి మంత్రి గురించే టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్ట్ ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే కీలకమైన పదవులు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ, జనసేనకు చెందిన వారందరికీ తెలుసునని ఎన్బీ సుధాకర్రెడ్డి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇటువంటి అరాచకానికి సదరు మంత్రివర్యులు ఒడిగట్టడం దారుణం. అదే మంత్రి తిరుపతి పవిత్రతను కాపాడతానంటూ మాట్లాడుతుంటారు. అటువంటి మచ్చపడిన మంత్రివర్యులపైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
‘ఈ అరాచకాలకు చంద్రబాబే రాజగురువు’
తాడేపల్లి : టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు. ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు. ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం. అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
‘గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు.. వరదలా పారిస్తున్నారు’
భీమవరం(ప.గో. జిల్లా): బెల్ట్ షాపులు తొలగించాలని, అదే సమయంలో తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కొల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్టు షాపులతో మద్యాన్ని వరదలా పారిస్తున్నారు. గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు. మంచినీళ్లు లేక అనేక గ్రామాలు ఉన్నాయి మంచినీళ్లు ఇవ్వటం మా వల్ల కాదు.. మద్యం తాగండి అని కూటమి ప్రభుత్వం చెబుతుంది. బెల్ట్ షాపులు తొలగించండి మా ఉపాధిని కాపాడండి తాటి చెట్టు పై నుంచి పడి మరణించిన వ్యక్తికి ఎక్స్ గ్రేషియా ఇవ్వండి అనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 75 వేల బెల్టు షాపులు ఈ జిల్లాలో 4 వేల బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదు. ఇదే ప్రభుత్వానికి మా హెచ్చరిక. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి బెల్ట్ షాపులు తొలగిస్తాం. బెల్ట్ షాపులు పెడితే తోలు వలిచేస్తాం అని అన్నారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది తోలు తీశారు ఎన్ని బెల్ట్ షాపుల్లో తొలగించారు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈనెల 30వ తారీఖున భీమవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వందలాదిమంది గీత కార్మికులు మోకులు ధరించి పెద్ద ఎత్తున ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్రెడ్డి హెచ్చరించారు. -
‘నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని’
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.వైఎస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను 9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి.. బాబు సర్కార్పై సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎంతటి నీచ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటేనే వారి వేధింపులను అర్థం చేసుకోవచ్చు.అధికారుల ద్వారా కమీషన్లు గుంజుకోవాలని చూడటం సిగ్గుచేటు. ఆ తప్పుడు పని చేయలేనంటూ ఆ అధికారి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?.అసలు రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చంద్రబాబు చేయలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. వ్యవసాయ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల సమస్యలను పట్టించుకోవటం లేదు. రైతులు రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు.రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ.200 అదనంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. యూరియా, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతుల చెంతకే చేర్చాం. ఐదేళ్లలో ఏనాడూ యూరియా కొరత రాలేదు.కానీ నేడు రైతులను కూటమి ప్రభుత్వం సంక్షోభమలోకి నెట్టేసింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో సగం కూడా ఏపీకి రాలేదు.అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండానే చేసినట్టుగా చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి కింద సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా రూ.7,800 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకున్నారు. బీమా కోసం వైఎస్ జగన్ ప్రతి ఏటా ప్రభుత్వం తరపునే ఖర్చు చేశారు. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోనందునే 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది?. ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?.వరదలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు యూరియాను వెంటనే అందించాలి. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. చంద్రబాబుకు కొత్తపథకాల ఆలోచన ఎప్పుడూ రాదు. అన్నీ వైఎస్ జగన్ పథకాలే చంద్రబాబు కాపీ కొట్టాడు. వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. రైతులకు రైతు భరోసా అందించిన ఘటన వైఎస్ జగన్దే. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తానని మోసం చేశారు’అని ధ్వజమెత్తారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..
సాక్షి, విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు సీపీఎం, సీపీఐ కార్పోరేటర్లు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్లో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుము కేటాయించాలి. ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనీ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది. -
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్లో బంధించి వేధించాడు. ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్కు కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’. ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకతనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – డా‘‘ పి. మోహన్ రావుచైర్మన్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలను తెలుస్తుంది అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ైవైఎస్ జగన్ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బతీసింది. ఈసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు అప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్న వారంతా కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు అని హెచ్చరించారు. -
శ్రీకాంత్కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది. శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్కుమార్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్కు సిఫార్సు చేశారు. ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్ఫైల్పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి. -
దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్హౌస్లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది. -
ఇప్పుడు బాల్కనీలోనే... సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: కరెంటు బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. ఆ క్రమంలోనే భానుడి కాంతి కిరణాలను విద్యుత్ శక్తిగా మార్చే సౌర ఫలకల వాడకం పెరుగుతోంది. అయితే విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవంతులపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. వివిధ అంతస్తుల్లో నివాసం ఉండే వారికి సౌర విద్యుత్ సరఫరా అందని ద్రాక్షగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజాగా బాల్కనీలే వేదికగా ‘ప్లగ్ ఇన్’ సౌర ఫలకలు అందుబాటులోకి వస్తున్నాయి. ఖర్చు, అమర్చడం, నిర్వహణ పరంగా చూస్తే ఇవి సరికొత్త ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాయి. సులువైన ప్రత్యామ్నాయం విశాఖపట్నంలో ఓ హోటల్ యజమాని ఐదంతస్తుల భవనం మొత్తం గోడలను సౌర ఫలకలతో నింపేశారు. ఇది ఒక సోలార్ ప్యానల్ ఎలివేషన్తో నిర్మాణం జరిగిన ఫుల్ ఎకో గ్రీన్ హోటల్. ప్లగ్ ఇన్ ప్యానెల్స్ను అపార్ట్మెంట్లు, భవనాల బాల్కనీలో ఏర్పాటు చేసుకుని నేరుగా ఇంటిలోని ఇన్వర్టర్కి ప్లగ్ చేసుకోవచ్చు. అంటే సౌర ఫలక నుంచి నేరుగా ఒకే ఒక వైరు ద్వారా విద్యుత్ సరఫరాను పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రభుత్వ, సాంకేతిక అనుమతులు కూడా అవసరం లేదు. బాల్కనీ పొడవును బట్టి, సౌర ఫలకలు అమర్చేందుకు ఉన్న వెసులుబాటును బట్టి, ఎన్ని ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. సూర్య కిరణాలే... భవన విద్యుత్ వెలుగులు దేశం మొత్తం మీద వాడే విద్యుత్లో భవనాల్లో వినియోగం మూడవ వంతు కంటే ఎక్కువ. దేశ వ్యాప్తంగా 2027 నాటికి రూ.75,021 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్లు కోటి ఇళ్లకు అమర్చాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించింది. 2024–25 కోసం రూ.13,175.33 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 16.15 లక్షల గృహాలపై మాత్రమే రూఫ్టాప్ పెట్టగలిగింది. అదే బాల్కనీలో ప్లగ్ ఇన్ సౌర ఫలకలు ఏర్పాటు చేయగలిగితే నగరాలు, పట్టణాల్లోని అన్ని అపార్ట్మెంట్లలో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మే అవకాశం ఉంది. -
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల స్థానికతపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ‘స్థానికత’ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఏపీ వెలుపల ఇంటర్ విద్యను అభ్యసించినప్పటికీ తామంతా రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు దర్మాసనం.. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. స్థానికత విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే చాలా స్పష్టమైన తీర్పునిచి్చందని, ఇప్పుడు తాము అందుకు భిన్నంగా చెప్పాల్సింది ఏమీ లేదని తన తీర్పులో పేర్కొంది. ప్రవేశాలు కోరుతున్న విద్యార్థి, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్వీ యూనివర్సిటీ లేదా ఆంధ్రా యూనివర్సిటీ పరిధి)లో చదివానని చెబుతున్నారో, ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నాలుగేళ్లను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (+2 అంటే ఇంటర్)తో ముగించి ఉండటం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. అలాగే ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతారని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు +2 చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 53 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విపిన్ నాయర్ సుప్రీంను కోరారు. అంగీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. -
సాగుకు ఉరి..!
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో.. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల వ్యవసాయ భూములను కాపాడాల్సిందిపోయి వాటిని ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఆయన కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ‘నాలా’ (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్) చట్టం రద్దుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు దక్కిన 13.59 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను ఫ్రీజ్ చేసిన చంద్రబాబు సర్కారు ఆ రైతులను రోడ్డున పడేసింది. తాజాగా ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను రియల్ వ్యాపారులు, తమ అనుంగు పారిశ్రామికవేత్తలకు సులభంగా దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా ‘నాలా’ చట్టం రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణగా నిలిచింది. అలాంటి దాన్ని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి ఈ చట్టం అడ్డుగా ఉందనే సాకుతో దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండటాన్ని వ్యవసాయ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇక సాగు భూములకు రక్షణ ఏది? నాలా చట్టం మనుగడలో లేకపోతే వ్యవసాయ భూములను అత్యంత సులభంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలకు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ‘నాలా’ చట్టాన్ని తెచ్చారు. వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా నియంత్రించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు. భూ వినియోగ మార్పిడి చేసుకుంటే ప్రస్తుతం ఆ భూమి విలువపై 5 శాతం పన్ను కట్టాలి. అలాగే కొన్ని ఇతర పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల తాము సులభంగా భూములు పొందలేకపోతున్నామంటూ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు చెబుతూ వస్తున్నాయి. నాలా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. నిజానికి అడ్డగోలుగా జరిగే భూ వినియోగ మార్పిడిని ఈ చట్టం సమర్థంగా అడ్డుకుంది. రియల్ ఎస్టేట్ దందాలను కొంతమేరనైనా అడ్డుకోవడం వల్లే ఇప్పుడున్న సాగు భూమి మిగిలి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహార భద్రతకు ముప్పు.. నాలా చట్టం అమలులో లేకుంటే వ్యవసాయ భూములు యథేచ్చగా రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తిండి గింజలకు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. భూ మార్పిడిపై నియంత్రణ కరువవడంతో అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. దీర్ఘకాలంలో ఇది పర్యావరణ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాలా చట్టం లేకుంటే భూ మార్పిడిపై ఎటువంటి నియంత్రణ లేనందున రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారవేత్తలు భూములను చౌకగా దక్కించుకుని రైతులను మోసం చేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. అన్నదాతల గురించి ఆలోచించరా? రాష్ట్రంలో అభివృద్ధికి నాలా చట్టం అడ్డంకిగా ఉందని, దీన్ని రద్దు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయం, భూమినే నమ్ముకున్న అన్నదాతల మనోభావాలు, భావోద్వేగాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం పెద్ద పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లాబీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల సామాన్య రైతులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. నాలా చట్టాన్ని రద్దు చేస్తే చిన్న, సన్నకారు రైతులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వ్యవసాయ భూములు తగ్గిపోవడం, ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, గ్రామీణ ఆరి్థక వ్యవస్థ కుంటుపడటం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.ప్రజా ప్రయోజనాలకు విఘాతం‘నాలా’ రద్దుపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం వల్ల చిన్న రైతుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ రాశారు. రాష్ట్ర ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ‘పరిశ్రమలు, ఇతర ప్రయోజనాల కోసం భూములు తీసుకునేందుకు ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. దీనివల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది చిన్న రైతులు, సాంప్రదాయ మత్స్యకారులు, సహకార డెయిరీ సంస్థలపై ఆధారపడ్డ చిన్న పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలు సేకరిస్తూ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసింది. ప్రైవేట్ రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం విధానాలను మార్చుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన లక్షలాది మంది నష్టపోతారు. ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి దోహదం చేయాలి. అంతేగానీ ప్రైవేటు కంపెనీల లాభాలు పెంచడం కోసం కాదని గుర్తించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్కు కోరుకున్న చోట 5 లక్షల ఎకరాలు.. నాలా చట్టం రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల కోసమే. ఈ చట్టం అమలులో ఉంటే భూములు అడ్డగోలుగా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఎలా పడితే అలా భూములు తీసుకునే వీలుండదు. వారికి దొడ్డిదారిన మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రిలయన్స్ సంస్థకు 5 లక్షలు ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని సీఎం ఏకంగా కలెక్టర్ల సమావేశంలోనే ఆదేశించారు. చాలా సంస్థలకు భూములివ్వడానికి రెడీ అయ్యారు. పెద్దవారికి భూములు ఇవ్వడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. – వై.కేశవరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఎస్ఆర్ఎం, విట్కు చెరో 100 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో భూములు కేటాయించినందుకు ఒకపక్క కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరానికి రూ.నాలుగైదు కోట్ల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అదే చోట ప్రైవేట్ సంస్థలకు వందల ఎకరాలను భారీ తగ్గింపు ధరలకు కట్టబెడుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్ల ఒకలా.. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించే పైవేట్ సంస్థల పట్ల మరోలా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజ«దాని రైతుల నుంచి తీసుకున్న భూములను గతంలో ఇచ్చిన ప్రైవేట్ సంస్థలకే మళ్లీ మళ్లీ పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎస్ఆర్ఎం, విట్ అమరావతిలో ఎకరం రూ.2 కోట్లు చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాలు చొప్పున కేటాయించేందుకు తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. కాగా ఈ రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు గతంలోనే టీడీపీ హయాంలో ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఒక్కో విద్యాసంస్థకు అమరావతిలో ఏకంగా 200 ఎకరాలు కేటాయించడం గమనార్హం. తాజాగా కేటాయిస్తున్నవి దీనికి అదనం. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్దసారథి మీడియాకు వెల్లడించారు. నాలా చట్టం 2006 వల్ల సాగు భూములు వ్యవసాయేతర అవసరాల మార్పిడికి అనుమతి పొందే ప్రక్రియ సంక్లిష్టతతో ఉన్నందున ఈ చట్టం రద్దు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నాలా చట్టం రద్దు నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్–అర్బన్ డెవల‹³మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం 1965లకు సవరణల ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవీ.. » గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2,954 చదరపు గజాల మునిసిపల్ భూమి గతంలో 33 సంవత్సరాలు లీజుకు కేటాయించగా ఇప్పుడు ఎకరం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లపాటు లీజు పెంచుతూ ఆమోదం. » హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపులో మరిన్ని రాయితీలు కల్పించేందుకు పర్యాటక విధానంలో మార్పులకు ఆమోదం. » చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పీపీపీ విధానంలో అభివృద్ధి. భూసేకరణ, ఇతర అవసరాలకు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ – వ్యర్థ పదార్థాల పునరి్వనియోగ విధానం 2025–30కు ఆమోదం. » ఐఎంఎఫ్ఎల్, బీర్, వైన్, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ నిర్ణయించిన ధరలకు ఆమోదం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరల నిర్ణయం. » అధికార భాషా కమిషన్ పేరు ‘‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్’’గా మార్పు » అమరావతి క్యాపిటల్ సిటీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ల్యాండ్ పూలింగ్ జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఈపీసీ కింద టెండర్లకు అనుమతి. మౌలిక సదుపాయాల కోసం రూ.904.00 కోట్లకు పరిపాలనా ఆమోదం. » గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుంచి ‘విద్య’ తొలగించి వార్డు సంక్షేమ, అభివృద్ధి సెక్రటరీకి అప్పగించేందుకు ఆమోదం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 పోస్టులు సృష్టించడంతో పాటు మొత్తం 2,778 పోస్టులు డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్లో భర్తీకి ఆమోదం. » మాన్యువల్ స్కావెంజర్స్ నియామకంపై నిషేధం. ఆ వృత్తిలో ఉన్నవారికి పునరావాస చర్యలకు ఆమోదం. ఏపీ యాచక చట్టంలో వికలాంగులు, కుష్టు వ్యాధి బాధితుల పట్ల వివక్షపూరిత పదాలను తొలిగించే ముసాయిదా బిల్లుకు ఆమోదం. » పుష్కర ఎత్తిపోతల పథకంలో ప్రెజర్ మెయిన్ పైపు మార్చేందుకు రూ.51.67 కోట్లకు పరిపాలన అనుమతి. » ఏఎస్ఆర్ జిల్లా చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు ఆమోదం. » అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్– ఐ సర్వీసెస్) ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. » పల్నాడు జిల్లా గుండ్లపాడులో హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేలా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం వడ్డిరాల, దొడియం గ్రామాల్లో 1,200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా అదానీ సోలార్ ఎనర్జీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానం 2024–29 సవరణకు ఆమోదం. » నారావారిపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల సీహెచ్సీగా అప్గ్రెడేషన్. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఏర్పాటుకు వీలుగా 7.74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా అప్పగించేందుకు ఆమోదం. » గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర నిధులతో ‘సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ ఏర్పాటుకు 12.96 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయుష్ శాఖకు అప్పగించేందుకు ఆమోదం. » అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ పనుల నిర్వహణకు రూ.160 కోట్లకు పరిపాలనా అనుమతి. » 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ ఇస్తూ గతంలో జారీ చేసిన జీవోకు ఆమోదం. -
రోగమొస్తే జేబు గుల్లే
గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి భార్య జనవరిలో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డు ఉందని, నగదు రహిత వైద్యం అందించాలని కుటుంబసభ్యులు కోరారు. కానీ, ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కట్టి వైద్యం చేయించుకునేట్లైతే ఉండండి. లేదంటే వెళ్లిపోండి’ అని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. చేసేదేం లేక రూ.3 లక్షలకు పైగా బిల్లును సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేస్తే, ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగి కాలు నొప్పితో వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలన్నారు. ఈహెచ్ఎస్ కింద చికిత్స కోసం కర్నూలులోని నెట్వర్క్లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... ‘‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచిత చికిత్సలు అందించలేం’’ అని వైద్యులు చెప్పారు. ఫీజు కట్టి రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలమంది ఉద్యోగులు, పింఛనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనాలు. ఈ రెండు ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందనేందుకు తార్కాణాలు. నెలనెల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు తమ వాటా చెల్లిస్తున్నా... ఆపద సమయంలో అక్కరకు రావడం లేదనేందుకు సాక్ష్యాలు. ఉద్యోగులు, పింఛనర్లు అనారోగ్యంతో నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే.. నగదు రహిత వైద్యం లభించడం లేదు. దీంతో జేబులోంచి డబ్బు పెట్టాల్సి వస్తోంది. రూ.లక్షల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకుని రీయింబర్స్మెంట్కు దరఖాస్తు పెట్టుకుంటే నెలల తరబడి మంజూరు చేయడంలేదు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్పై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులు ఆధారపడి ఉన్నారు. 50:50 నిష్పత్తిలో ఉద్యోగులు, ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నారు. నిరుడు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదల ఆపద్బాంధవి ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ను అటకెక్కించారు. చికిత్సలు చేసిన ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడం మానేశారు. ఏకంగా రూ.320 కోట్ల మేర ఈహెచ్ఎస్ బిల్లులు బకాయి పెట్టారు. అరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు రూ.4 వేల కోట్లకు పైమాటే. ఇవన్నీ నెలల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుసార్లు నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించారు. అయినప్పటికీ స్పందన కొరవడడంతో ఆస్పత్రులు పూర్తిగా ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేశాయి. కేన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైనవారు ఉచిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 2019కి ముందు నాటి పరిస్థితి... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండే అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ సేవలను విస్తరించింది. అంతేకాకుండా 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన ప్రొసీజర్లను పునరుద్ధరించింది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే... ఉద్యోగులు, పింఛనర్లు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని 46 కేన్సర్ ప్రొసీజర్లను పథకంలోకి చేర్చింది. మొత్తంమ్మీద 2014–19 మధ్య కంటే 2019–24 కాలంలో ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు రెట్టించిన ఆరోగ్య భరోసా లభించింది. 2014–19 సమయంలో టీడీపీ పాలనలో రూ.976 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,427 కోట్లు ఖర్చు పెట్టారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్ఎస్కు 2019కి ముందునాటి పరిస్థితి దాపురించిందని లబ్దిదారులు వాపోతున్నారు. కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు ఈహెచ్ఎస్ కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రూ.2 లక్షల వరకే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ప్రతి నెల నేరుగా ట్రస్ట్కు జమ చేయాలి. ఈ విధానం అమలైతేనే మేలు జరుగుతుంది. ప్రొసీజర్స్ రేట్లను సమీక్షించి పెంచాలి. ప్రస్తుతం ఉన్న ధరలతో నష్టపోతున్నామని ఆస్పత్రులు చెబుతున్నాయి. –కె.వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం– ఆస్పత్రుల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు ఉద్యోగుల నుంచి ఠంఛన్గా ఈహెచ్ఎస్ వాటా తీసుకుంటున్నా... ప్రభుత్వం ట్రస్ట్కు ఆ డబ్బు జమ చేయడం లేదు. ట్రస్ట్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రూ.5 లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్మెంట్ కేవలం రూ.90 వేలు ఇస్తున్నారు. ఇదేమని అడిగితే ఆమోదించిన ప్రొసీజర్ రేట్లు ప్రకారం అంతే వస్తుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. అటు ఆస్పత్రులు, ఇటు ప్రభుత్వం మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఓపీ, వార్షిక ఆరోగ్య చెకప్లతో పథకాన్ని బలోపేతం చేస్తామన్న హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. ఐపీ సేవలు అందక ఉద్యోగులు, పింఛనర్లు నరకం చూస్తున్నారు. –బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ -
దివ్యాంగుల పెన్షన్ టెన్షన్
సాక్షి నెట్వర్క్: సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసింది. వారందరికీ సెప్టెంబర్ నుంచి పింఛన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ చర్యతో దివ్యాంగులంతా ఆందోళన చెందుతున్నారు. ‘దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా.. మీకు మనసెలా వచ్చింది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాలు, చేయి కూడదీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. వరుస ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఆందోళనల్లో భాగంగా అనంతపురంలో గురువారం పెట్రోల్ పోసుకుని ఉద్దీప్ సింహ అనే దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బాపట్లలో చల్లా రామయ్య అనే దివ్యాంగుడు సెల్ టవర్ ఎక్కిన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయగా.. అనంతపురంలో కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని సర్కారు తీరును ఎండగట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలో నిర్వహించగా.. సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కలెక్టరేట్లోకి అధికారుల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్న దివ్యాంగులు ప్రభుత్వానికి తమ ఉసురు తప్పక తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. కాగా.. పింఛన్ తొలగించారన్న మనోవేదనతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దివ్యాంగురాలు మెండు గంగాభవాని (45) గురువారం ప్రాణం విడిచిందని స్థానికులు తెలిపారు. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తతవికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సంయుక్తంగా గురువారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దివ్యాంగుల రాస్తారోకో చేపట్టడంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే హక్కుల వేదిక కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్తో అంటించుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లైటర్ గుంజుకుని ఉద్దీప్ సింహపై నీళ్లు పోశారు. అనంతరం దివ్యాంగులు ఎండలో రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలిపారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేల్లారా రండి.. మీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం చూడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. డీఆర్ఓ మలోల, డీఆర్డీఏ పీడీ శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దివ్యాంగులు వారితో మాట్లాడేందుకు నిరాకరించడంతో కలెక్టర్ వినోద్కుమార్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కార్యదర్శి రాజేష్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి దివ్యాంగులకు పింఛన్ ఎలా తొలగించారో వివరించారు. దీంతో కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ఆత్మారామ్ను పిలిపించారు. కళ్లెదుట వైకల్యం కనిపిస్తున్నా తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే అందరికీ మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు కాలేషా తదితరులు మద్దతు తెలిపారు. సెల్ టవర్ ఎక్కి నిరసనపెన్షన్లు తొలగించటంతో బాపట్లలో దివ్యాంగులు గురువారం కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి నిరసన చేపట్టారు. రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల సెల్ టవర్ ఎక్కి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని భీష్మించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, బాపట్ల జిల్లాలో 3,824 దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రామయ్యకు మద్దతుగా సెల్ టవర్ వద్ద నినాదాలు చేస్తున్న శరత్ అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో సెల్ టవర్ వద్ద నుంచి వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తరిమికొట్టారు. పోలీసులకు ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు దివ్యాంగుల పెన్షన్లు తొలగింపుపై అర్జీని మేరుగు నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీవో గ్లోరియాకు అందజేశారు. కాగా.. సెల్ టవర్ ఎక్కిన చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.తిరుపతిలో దివ్యాంగుల ధూంధాంతొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలంటూ దివ్యాంగులు తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోకి అధికారులెవరినీ వెళ్లనీయకుండా.. లోపల ఉన్న వారిని బయటకు రాకుండా గేటుకు అడ్డంగా బైఠాయించి నిర్బంధించారు. మండుటెండలో ధర్నా చేయటంతో సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లిపడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 75 శాతం నుంచి 90 శాతం ఉన్న వైకల్యం కూటమి ప్రభుత్వం వచ్చాక 40 శాతానికి ఎలా తగ్గిపోతుందని నిలదీశారు. వైద్యుల్ని దివ్యాంగుల వద్దకే పంపించి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్లో దివ్యాంగులకు హామీ ఇచ్చారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపారు.దివ్యాంగుడి పింఛన్ కోత.. నిరుపేద కుటుంబం గుండెకోత» పింఛన్ రీవెరిఫికేషన్ పేరుతో వైకల్య శాతం తగ్గింపు» ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం వైకల్య శాతాన్ని తగ్గించడంతో పింఛన్ తగ్గిపోతుందని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. విజయవాడ భవానీపురం 40వ డివిజన్కు చెందిన పొందుగుల చిన్నపరెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2022లో చెట్టుమీద నుంచి పడటంతో వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. వైద్యులు పరీక్షించి 90శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. చిన్నపరెడ్డి బాగోగులు చూసుకోవడమే అతని భార్యకు సరిపోతోంది. కుటుంబ పోషణ, కుమార్తె చదువు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం 2023వ సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. పెద్ద మనసుతో ఆయన ఆదుకున్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి ఈ సాయం చెక్కు అందజేశారు. సామాజిక పింఛన్ రూ.10వేలు మంజూరు చేశారు. వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నపురెడ్డి పింఛన్ను రీ వెరిఫికేషన్ చేసి.. వైకల్యాన్ని 85 శాతంగా చూపుతూ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. పింఛన్ రూ.6 వేలే వస్తుందని అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో తాము బతికేదెలా అంటూ ఆందోళన చెందుతోంది. -
ఓటమి భయంతో కూటమి కుట్ర
సాక్షి టాస్క్ఫోర్స్: చిన్న వార్డులోను ఓటమి భయం వెన్నాడుతున్న కూటమి నేతలు కుట్రలు పన్ని వార్డును విచ్ఛిన్నం చేశారు. ఉప ఎన్నికల సమయంలో వార్డులో ప్రాంతాలను తొలగించకూడదని నిబంధనలున్నా.. నేతల కుట్రకు అధికారులు వత్తాసు పలికారు. వార్డులోంచి ఈ ప్రాంతాలను ఎందుకు తొలగించారని స్థానికులు ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నములుతున్నారు. 484 ఓట్లున్న ఈ ప్రాంతాలు వైఎస్సార్సీపీకి అనుకూలమైనవనే కారణంతోనే ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఈ అప్రజాస్వామిక పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి.. దాచేపల్లి, నడికుడి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయించారు. ఈ నగర పంచాయతీకి 2023లో తొలి ఎన్నికలు జరిగాయి. మూడోవార్డు నుంచి విజయం సాధించిన మునగా రమాదేవి వైఎస్సార్సీపీ తరఫున తొలి నగర పంచాయతీ చైర్పర్సన్ అయ్యారు. అప్పుడు ఈ వార్డులో 1,596 ఓట్లున్నాయి. రమాదేవికి 189 ఓట్ల మెజార్టీ లభించింది. తరువాత అనారోగ్యంతో రమాదేవి మరణించడంతో మూడోవార్డుకు ఉప ఎన్నిక నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు నగర పంచాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి నేతల్లో భయం మొదలైంది. ఈ వార్డులో గెలిచే సత్తా లేదు కాబట్టి వార్డునే విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నారు. వారు చెప్పినట్లే అధికారులు చేసేశారు. గతంలో ఈ వార్డు పరిధిలో ఉన్న చేపలగడ్డ, రంగనాయకస్వామి దేవాలయం, బొడ్రాయి సెంటర్ ప్రాంతాలను ఈ వార్డు నుంచి తొలగించారు. గతంలో 1,596 ఓట్లున్న ఈ వార్డులో ఇప్పుడు 1,112 ఓట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు ఓటర్ల జాబితా నమూనా సిద్ధం చేశారు. ఈ వార్డు నుంచి తొలగించిన మూడు ప్రాంతాల్లో 484 ఓట్లున్నాయి.స్పందించని కమిషనర్ ఈ విషయంలో నగర పంచాయతీ కమిషనర్ జి.వెంకటేశ్వర్లు వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో తమ ప్రాంతాలను వార్డులోంచి ఎందుకు తీసేశారని అడిగితే ఆయన స్పందించడంలేదని ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు. ఉప ఎన్నిలో టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఆయన వ్యవహారశైలి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి నేతలు చెప్పినట్లే కమిషనర్ పనిచేస్తున్నారు దాచేపల్లి 3వ వార్డులో 484 ఓట్లు మాయం కావటంపై కమిషనర్ను కలిసి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించాం. మేం వెళ్లిన ప్రతిసారి కమిషనర్ దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. కూటమి నేతలు చెప్పిన విధంగానే కమిషనర్ పనిచేస్తున్నారు. – షేక్ సుభాని, వైఎస్సార్సీపీ దాచేపల్లి పట్టణ కన్వినర్మా ఓట్లు తీసే అధికారం కమిషనర్కు ఎక్కడిది? మూడోవార్డులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మాయమయ్యాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా ఓట్లను ఈ వార్డు నుంచి మాయం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీనికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతాం. – కోలా శ్రీనివాసరెడ్డి, 3వ వార్డు ఓటర్ఓట్ల మాయంపై పరిశీలిస్తాం దాచేపల్లి మూడోవార్డులో 484 ఓట్లు మాయం కావడంపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై బీఎల్వోల ద్వారా సమాచారం తెప్పించుకుంటాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వర్లు, కమిషనర్, దాచేపల్లి నగర పంచాయతీ -
అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’
సాక్షి, నంద్యాల: అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తున్నారని.. వారితో దాడులు చేయిస్తూ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. రేషన్ బియ్యం స్మగ్లింగ్గానీ, బెల్ట్ షాపుల నుంచి వసూళ్లు లేదా అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారాల్లో ఈ బ్యాచ్ ద్వారానే దోపిడీపర్వం సాగిస్తారన్న పేరుంది. అడ్డుచెబితే ‘అడ్డు’తొలగిస్తామన్నట్లుగా వారి్నంగ్లు ఇస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే కక్షసాధింపులకూ వెనుకాడడంలేదు. గత ఎన్నికల సమయంలో ‘ఎవడైనా ఎక్కువ మాట్లాడితే జీపునకు కట్టుకుని పోతా’ అంటూ ‘బుడ్డా’ చేసిన హెచ్చరిక ఆయన నేరస్వభావానికి అద్దంపడుతోంది. అందుకు తగ్గట్లుగానే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చెలరేగిపోతూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా.. అటవీశాఖ సిబ్బందిపై ఆయన బరితెగించి చేసిన దాడి ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఈ దాడి కాకతాళీయంగా జరగలేదని.. కక్షసాధింపులో భాగంగానే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే దాడిచేసినట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువుచేస్తున్నాయి. వైఎస్సార్ స్మృతివనంలో సిబ్బంది తొలగింపు.. ఎనిమిది నెలల క్రితం టీడీపీకి చెందిన దుండగులు ఆత్మకూరు మండలంలోని వైఎస్సార్ స్మృతివనంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దుండగులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఆత్మకూరు డీడీ సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా.. డీడీ సాయిబాబాను కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అలసత్వాన్ని క్షమించలేమని డీడీ చెప్పినట్లు సమాచారం. నాటి నుంచి ఎమ్మెల్యే పగతో రగిలిపోతున్నారు. గ్రావెల్ అక్రమార్కులకు వత్తాసు.. రెండునెలల కిందట సున్నిపెంటకు చెందిన కొందరు టీడీపీ కూటమి నాయకులు నల్లమల అడవిలోకి ప్రవేశించి అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ అటవీ సిబ్బందికి దొరికారు. వెంటనే సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కూటమి నాయకులు ఎమ్మెల్యేకు విషయం తెలిపారు. దీంతో ఆత్మకూరు డీడీ సాయిబాబాకు ఎమ్మెల్యే బుడ్డా కాల్చేసి ‘ట్రాక్టర్లు మా వాళ్లవే. వదిలేయండి’.. అన్నారు. ఈ విషయంలోనూ అటవీ అధికారి నిబంధనలు పాటించి ఒక్కో ట్రాక్టర్కు రూ.60వేల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా కక్ష సాధించాలన్న లక్ష్యంతోనే ఎమ్మెల్యే మంగళవారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏడాది కాలంగా ఎమ్మెల్యే బుడ్డా ఆగడాలు.. » ఆత్మకూరు పట్టణంలో ఒక వైశ్య ప్రముఖుడిపై పట్టపగలే దాడికి పాల్పడ్డారు. తర్వాత బలవంతంగా కేసును రాజీ చేయించారు. » వెలుగోడుకు చెందిన మరో వ్యాపారిపై కేసులు పెట్టించి మానసికంగా, ఆర్థికంగా వేధించారు. » మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో జరిగిన మూడు హత్యలలో బుడ్డా అనుచరులే ప్రధాన నిందితులు. » కడపలో టీడీపీ మహానాడుకు ఆత్మకూరు నుంచి వాహనాల్లో వెళుతూ దారిలో భోజన ఏర్పాట్లు చేశారు. ఆహారం సరిపోకపోవడంతో వంట మాస్టర్ను చితకబాదారు. » బుడ్డా అనుచరుడొకరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయించుకున్నాడు. అయితే, తనకు చెప్పకుండా ఎలా చేయించుకుంటావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అడ్డొచి్చన మరో ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో వారంతా ఆస్పత్రిపాలయ్యారు. బాధితులను మీడియా ప్రతినిధులు ఎవరూ కలవకుండా ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే మనుషులను కాపలాగా ఉంచారు.రౌడీబ్యాచ్తో ఆగడాలు.. నిజానికి.. ‘బుడ్డా’ గత ఏడాది గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తరలింపు, రేషన్ బియ్యం స్మగ్లింగ్, బెల్ట్ షాపుల విషయంలో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వీటన్నింటినీ చక్కబెట్టేందుకు ఆయన ఒక రౌడీబ్యాచ్ను పెంచిపోషిస్తున్నారని, ఎవరిపైనైనా దాడిచేయాలంటే ఈ బ్యాచ్ అక్కడ వాలిపోతుందని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం కూడా ఎమ్మెల్యే వెంట ఈ రౌడీబ్యాచ్ ఉందని, వీరితోనే అటవీ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలుస్తోంది. అలాగే, రెండునెలల కిందట మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై భౌతికంగా దాడిచేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసిన ఘటన కూడా ఈ రౌడీబ్యాచ్ కనుసన్నల్లోనే జరిగింది. -
కృష్ణా, గోదావరి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ విజయపురిసౌత్: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి నదులు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,40,756 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్ల ద్వారా 4,85,435 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 4,32,268 క్యూసెక్కులు చేరుతుండగా, 4.28 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,28,513 క్యూసెక్కులు చేరుతుండగా 4,13,205 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 5,08,849 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 5 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 11,09,200 క్యూసెక్కులు..భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,09,200 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 11,74,573 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 11,65,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 13,495 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట మీదుగా నాగావళి వరద జలాలు 9,400 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. -
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన ఆధారాలు
విజయవాడ: ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. -
పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024,సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు నిందితుడు చిత్తరంజన్ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తన తోటి విద్యార్థులు తనపై జరుగుతున్న లైంగిక దాడికి గురించి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. టీచర్ల సాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా కేసు విచారణలో విశాఖ కోర్టు నిందితుడు చిత్తరంజన్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. -
అవినీతి చేయడంలో..మంత్రులకు చంద్రబాబే ‘ఇన్స్పిరేషన్’
సాక్షి,శ్రీకాకుళం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో అవినీతిలో ఆయన కేబినెట్లోని మంత్రులు కూడా పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల అవినీతిని తట్టుకోలేక పారిపోతున్న అధికారులను వెంటాడి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించలేదనే కారణంతోనే ఆగ్రోస్ జీఎం రాజమోహన్ని ఈ ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినీతి కేసులున్న జూనియర్ అధికారిని నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిజాయితీగా పనిచేసే అధికారులకు కనీస గౌరవం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన అవినీతికి సహకరించలేదనే కారణంతో సీనియర్ అధికారి ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమైపోతుంది.వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం నెరిపి తనకు మేలు జరిగేలా చేయాలని మంత్రి పేషీ నుంచి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కానీ దానికి ఆయన అంగీకరించకుండా సెలవుపై వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులన్న జూనియర్ అధికారిని తీసుకొచ్చి నియమించడం చూస్తుంటే అవినీతికి ఈ ప్రభుత్వం ఏవిధంగా పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెప్పింది. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాల్సిందిపోయి కమీషన్ల ద్వారా జేబులు ఎలా నింపుకోవాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేసుకోవడం సిగ్గుచేటు.ఆగ్రోస్ జీఎం రాజమోహన్ బదిలీ వెనుక ఏం కారణాలున్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా వేధించి ఉండకపోతే సీఎస్కి లేఖ రాసి మరీ ఆయన వెళ్లిపోతారు? సమర్థవంతమైన నిజాయితీగల అధికారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజలకు మేలు చేయాలనుకున్న అధికారులను వేధించి ట్రాన్సఫర్లతో సన్మానిస్తారా? జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం, అవినీతికి ప్రేరేపిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.ఉచిత పంటల బీమాను ఎత్తేశారు:వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసింది. గత వైఎస్ జగన్ పాలనలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం చెల్లించిన బీమా వల్ల వారికి పెద్దగా నష్టం లేకపోయేది. కానీ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వరి, అరటి, మామిడి, మిర్చి, పొగాకు రైతులు తాము కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల్ని ఈ ప్రభుత్వం వంచించింది. కేంద్రం అందించే సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు ఇస్తామని మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలుగా రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తూ వస్తోంది. కూటమి నాయకుల అవినీతి వ్యవహారాలను వైఎస్సార్సీపీ ప్రస్తావించినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక గత ప్రభుత్వం అంటూ ఏడాదిగా మాపై బురదజల్లుతూనే ఉన్నారు. పొద్దస్తమానం వైఎస్ జగన్ పేరు తల్చుకోకుండా కూటమి నాయకులకు రోజు కూడా గడవడం లేదు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేయాల్సిందే: ఫారెస్ట్ అధికారులు
మార్కాపురం, ప్రకాశం జిల్లా: ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులుపై దాడి చేపనప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నల్లమలలో అటవీ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. -
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్ను మెసేజ్లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
ఉద్యోగులంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? వెంకట్రామిరెడ్డి
విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21 వ తేదీ) జరిగిన ఏపీ క్యాబినెట భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న(బుధవారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వినయానంద్ నిర్వహఙంచినా, నేటి చంద్రబాబు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి. అయితే అది జరగలేదు. కనీసం ఉద్యోగుల డీఏపై కూడా చర్చింంచకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? అని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ‘ ఈరోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చెప్పారు. కానీ కనీసం ఒక డిఏకి కూడా ఈరోజు ఆమోదించలేదు. 15 నెలలుగా కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇక ఐఆర్ లేదు.. పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తోంది. ఉద్యోగులపై పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే.. కెజిబివి ప్రిన్సిపాల్ని వేధిస్తే చర్యలు లేవు. ఇక ఉద్యోగులు ఎలా పని చేయాలి’ అని మండిపడ్డారు. -
ఏపీ కేబినెట్ భేటీలో.. టీడీపీ ఎమ్మెల్యేల బూతులపై చర్చ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా.. కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జరిగినవి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో.. అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
సుపరిపాలన అంటే స్కామ్లు, దాడులేనా?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: సుపరిపాలన అంటే స్కాంలు, దళితుల మీద దాడులు చేయటమా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం, ఇసుకలో దోపిడీ చేయటమే సుపరిపాలనా? సాక్షాత్తు ఎమ్మెల్యేలే అధికారులను కిడ్నాప్ చేస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషించిన ఎమ్మెల్యేకి చంద్రబాబు వత్తాసు పలికారు. ఇదేనా సుపరిపాలన అంటే?. ప్రణాళికాబద్దంగా చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆయన పాలనలో ప్రజలకు ఒరగిందేమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దారుణంగా దూషిస్తే కనీస చర్యల్లేవు. కూన రవికుమార్ ఒక మహిళా ప్రొఫెసర్ని వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘మంత్రి అచ్చెన్నాయుడు వేధింపులకు ఆగ్రోస్ అధికారి సెలవుపై వెళ్లిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఎమ్మెల్యేలు, మంత్రుల నీతి మాలిన చర్యల వెనుక చంద్రబాబు ఆమోదం ఉంది. భూ కుంభకోణాల గురించి జనం చర్చించుకుంటున్నారని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాయలసీమకు తాగునీరు రాకపోతున్నా పట్టించుకోరా?. దెందులూరులో మా పార్టీ నేత పామాయిల్ తోటలోకి టీడీపీ గూండాలు చొరపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడలను ఇకనైనా ఆపండి’’ అంటూ శైలజానాథ్ హెచ్చరించారు.‘‘రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వటం వెనుక హోంశాఖ ఉండటం దుర్మార్గం. ప్రజలకు ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలి. అరుణ సెల్ఫీ వీడియోకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఇస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు. -
ఉద్యోగాలిప్పిస్తానంటూ.. లక్షలు కాజేసిన జనసేన నేత
సాక్షి,డోన్: ఉద్యోగాల పేరుతో డోన్ జనసేన ఇన్చార్జ్ గడ్డం బ్రహ్మం నిరుద్యోగులకు టోకరా వేశారు. గురుకుల పాఠశాలలో ఉద్యోగాలిస్తామని డబ్బు వసూలు చేశారు. అయితే, ఉద్యోగం కోసం బాధితుల నుంచి గడ్డం బ్రహ్మం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మొహం చాటేశాడు. తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. తమకు ఇస్తామన్న ఉద్యోగంలో వేరేవాళ్లు ఉండటంతో గడ్డం బ్రహ్మం చేతిలో తాము మోసపోయామంటూ బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగమే కాదు.. బెల్ట్షాపులు ఇప్పిస్తానని పలువురు వద్ద నుంచి జనసేన నేత బ్రహ్మం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్ని తిట్టడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలిరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు.కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. -
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనలకు వైఎస్సార్సీపీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. -
‘ఉద్యోగుల హక్కులను చంద్రబాబు సర్కార్ కాలరాస్తోంది’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపులు, ఐఆర్ బకాయిలపై కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు.రెండేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న పన్నెండో పీఆర్సీకి నేటికీ కమిషనర్ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజకీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్నే నియమించలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న మధ్యంతర భృతి పైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు ఎంత అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డీఏ ఎరియర్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్ల్లో ఈ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరుఫున దీనిపై సీఎస్ను డిమాండ్ చేసినా, దానిపైనా ఎటువంటి స్పందన లేదు. పదకొండో పీఆర్స్ ఎరియర్స్తో పాటు, డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉంది. డీఏల గురించి ఎక్కడా ఈ సమావేశంలో మాట్లాడలేదు. అసలు జేఎస్సీ ఎందుకు పెట్టారో చెప్పాలి. కేవలం టైంపాస్ కోసం, ఉద్యోగుల కళ్ళ నీళ్ళు తుడిచేందుకే ఈ సమావేశం నిర్వహించారా..? కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.తక్షణం పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయాలి:ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణం పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి, పీఆర్సీ కనీసం 30 శాతంకు తగ్గకుండా చూడాలి. డీఏ బకాయిలను విడుదల చేయాలి. మధ్యంతర భృతిని చెల్లించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలు సరిగా నిర్వహించడం లేదు, బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రెండు నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని, గత ప్రభుత్వం మూడు వేల మందిని రెగ్యులర్ చేసింది, మిగిలిన ఏడు వేల మందిని కూడా తక్షణం రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పదిశాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, 75 దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కనీసం ఒక్క దానిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ళ వరకు పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు.ఈ డిమాండ్లపై సీఎస్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానంటూ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం ఎంత వరకు సమంజసం..? కూటమి ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల తరుఫున ప్రభుత్వం మెడలు వంచైనా సరే, వారికి రావాల్సిన అన్నింటిని సాధించుకుంటాం. -
దెందులూరులో చింతమనేని అనుచరుల వీరంగం
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక.. దగ్గుపాటికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత బుధవారం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. దగ్గుపాటిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించడం గమనార్హం.చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారనే చర్చ నడిచింది. కచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. ఇలాందేమీ జరగకుండానే.. వారిద్దరి భేటీ ముగిసింది. అయితే, మంత్రి నారా లోకేష్కి దగ్గుపాటి సన్నిహితుడు అయిన కారణంగానే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో బూతుల ఎమ్మెల్యేకు చంద్రబాబు మద్దతు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో, మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి రేపటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం నడిబొడ్డున బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..‘టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. -
బాబూ.. నిన్ను నమ్మేదెలా?
‘ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇదంతా కేవలం ఉపన్యాసం కోసం చేసిందేనని, చిత్తశుద్ధి లేనిదని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం ప్రచురితమైన రోజే ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరిగిన దాష్టీకాల వార్తలూ ప్రముఖంగా వచ్చాయి. కొన్నింటిలో చంద్రబాబు సొంతపార్టీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇప్పటివరకూ చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇందుకు తగ్గట్టుగానే బాబుకు వత్తాసు పలికే మీడియా కూడా టీడీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుతూంటుంది. కానీ.. ఈ ఘటనలన్నీ ఇతర మాధ్యమాల్లో వస్తుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.టీడీపీ ఎమ్మెల్యేల ఇతర దందాల సంగతి పక్కనపెట్టినా.. వీరూ, వీరి అనుచరులు మహిళలపై చేస్తున్న వేధింపుల ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. సినిమా విడుదలకు తన అనుమతి కావాలన్న ఆ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం ఆయన శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్ను ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. తనతో వీడియో కాల్లోనే మాట్లాడాలన్నది ఆయన హుకుం!. మాట వినకపోతే బదిలీ ఖాయమని సిబ్బంది ద్వారా బెదిరింపులకు దిగుతున్నట్లు ఈ కథనం చెబుతోంది.రాత్రి పది గంటల సమయంలోనూ పార్టీ ఆఫీసుకు రావాలని మహిళా ఉద్యోగులను పిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు భరించలేక ఆ దళిత మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ ఇతర మహిళా ఉద్యోగులను కూడా వేధించారని ఆమె అంటున్నారు. మరి ఇవన్నీ ఆడబిడ్డ జోలికి వెళ్లడమే కదా? మరి చంద్రబాబు తాట ఎంతవరకు తీశారు? కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు చేరవేయడానికి పనిచేసే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?.ఇక మరో ఎమ్మెల్యే ఉదంతం చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నట్లు పెదాలు కదుపుతున్న దృశ్యం సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యేకి టీడీపీకే చెందిన ఒక మహిళా నేతతో సంబంధం ఉందట. దీంతో ఆ మహిళా నేత భర్తే సంబంధిత వీడియోని ప్రచారంలో పెట్టారట. ఈ విషయాన్ని సూఫియా అనే మరో టీడీపీ నేత ఎమ్మెల్యేకి చెబితే తొలుత ఆమెను కామ్గా ఉండమని చెప్పారట. తదుపరి అక్రమ సంబంధం ఉన్న మహిళ కుటుంబంతో సెటిల్మెంట్ చేసుకుని, తదుపరి తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సూఫియా అంటున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీయకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన అత్యంత విషాద భరితం. శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే భర్త టీడీపీకి చెందిన వాడు కావడంతో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ వైస్ చైర్మన్ తదితరుల ఒత్తిడితో పోలీసులు ఆ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని శ్రావణి ఆరోపించారు. తన ఆత్మహత్యకు టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కారణమని ఆమె చెప్పిన ఆడియో వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అనే మహిళ హత్య కేసు గురించి గొంతెత్తి అరిచేవారు. ఎన్నికల తర్వాత ఆయనకు పదవి రావడంతో ఆ మాటే ఎత్తడం లేదు. ఆ మీదట సుగాలి ప్రీతి తల్లి నిరసన యాత్ర చేయాలని తలపెట్టినా అనుమతించడం లేదట. జగన్ పాలన సమయంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వలంటీర్లే కిడ్నాప్లకు పాల్పడ్డారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారం సాధించడానికి గాను మహిళలను అడ్డు పెట్టుకుని అంత ఘోరమైన ఆరోపణలు చేయవచ్చా? అది వారిని అవమానించినట్లా? కాదా?.2014-19 మధ్య కాలంలో కూడా మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగాయి. ముసునూరు మహిళా ఎమ్మార్వో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు ఆమెను తీవ్రంగా అవమానించిన ఘటన అప్పట్లో పెను సంచలనం. అయితే చంద్రబాబు ఎమ్మార్వోనే మందలించి రాజీ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు.. కొద్ది నెలల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక టీడీపీ మహిళా నేత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై నామమాత్రంగా చర్య తీసుకున్నా, ఆ తర్వాత ఆ కేసే లేకుండా రాజీ చేశారని వార్తలు వచ్చాయి.శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వినూత వ్యక్తిగత వీడియోల కేసు చివరికి వారి పీఏ హత్యకు దారి తీసింది. వినూత దంపతులు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే జరిగిందని ఆరోపించారు. అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వపరంగా చర్యలు శూన్యమే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ కారు ట్రాఫిక్లో బైక్గా మారిపోయి.. కాకినాడ కుర్రోడి వినూత్న ఆవిష్కరణ
కాకినాడ: ఉన్నత ఆశయం, పట్టుదల, చురుకుదనం మొదలైనవి వినూత్న ఆలోచనలకు దారితీస్తాయని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్ అన్వేష్ కుమార్ నిరూపించారు. ఎటువంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా లేని సుధీర్.. పరిస్థితులకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకునే టూ ఇన్ వన్ వాహనాన్ని రూపొందించాడు. ఈ వాహనం అటు బ్యాటరీతోను, ఇటు హైడ్రాలిక్ వ్యవస్థతోనూ పనిచేయడం మరో విశేషం.ఈ నూతన వాహనం రూపకల్పనకు సుధీర్ నాలుగు సీట్ల జీప్ మోడల్ను ఎంచుకున్నాడు. అది వెడల్పుకు కుదించుకుని, బైక్ మాదిరిగానూ మారిపోతుంది. తద్వారా అది భారీ ట్రాఫిక్లో సులభంగా ముందుకు కదులుతుంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నిరంతరం రద్దీగా ఉండే నగరాల్లోట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సుధీర్ దీనిని తీర్చిదిద్దాడు.సుధీర్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు. తన దగ్గర ఇంకా చాలా వినూత్న ఆలోచనలు ఉన్నాయని తెలిపాడు. విజయవాడకు చెందిన సుధీర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం కాకినాడకు వచ్చి స్థిరపడింది. ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తొలుత తండ్రి అనారోగ్యం, ఆ తర్వాత అతని మరణం కారణంగా సుధీర్ ఇంజినీరింగ్ చేయలేకపోయాడు. అయితే దీనికి బదులుగా, 2014 లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి, ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లాడు... హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సుధీర్ తరచూ భారీ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్ రద్దీని సులభంగా దాటగలిగే ప్రత్యామ్నాయ రవాణా వాహనాన్ని రూపొందించాలని అనుకున్నాడు. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు కార్లు కదలడం కష్టమవుతుందని, అదే బైక్ విషయంలో అలా జరగదని గమనించిన సుధీర్ కారు- బైక్ మోడ్ మధ్య స్థ వాహనాన్ని రూపొందించడంలో విజయం సాధించాడు. ఈ వాహనాన్ని సుధీర్ ఏడు అడుగుల పొడవు, 2.11 అడుగుల వెడల్పుతో ఉండేలా, కాంపాక్ట్గా ఉన్నప్పుడు 4.2 అడుగుల వెడల్పుకు విస్తరించేలా రూపొందించాడు. ఈ వాహనం బ్యాటరీతో శక్తితోనూ, హైడ్రాలిక్ వ్యవస్థతో కూడా నడిచేలా తీర్చిదిద్దాడు. ఈ వాహనానికి సుధీర్ ఎంజెడ్(మెల్చి జెడాక్) అనే పేరు పెట్టాడు. రూ. 50 కోట్ల నుంచి 75 కోట్ల వరకూ ఖర్చయ్యే ఈ తరహా వాహనాల ప్రాజెక్ట్ కోసం యూఎఈకి చెందిన ఒక కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సుధీర్ వెల్లడించారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) -
గుట్టురట్టు కాకుండా అరుణ అరెస్ట్.. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సాక్షి టాస్క్ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం గుట్టు రట్టు కాకుండా అత్యవసరంగా ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగా శ్రీకాంత్ సన్నిహితురాలు నిడిగంటి అరుణను ప్రభుత్వం ఆగమేఘాలపై అరెస్ట్ చేయించింది. కోవూరులో బిల్డర్ నుంచి అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారంలో అరుణ.. శ్రీకాంత్ స్నేహితులను అడ్డుపెట్టుకుని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించిందని మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయించింది.హైదరాబాద్కు వెళ్తున్న ఆమెను బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు. అంతకు ముందు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కారు డిక్కీలో వేశారు. ‘నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. నా కారులో గంజాయి పెట్టాలని నా కారు డ్రైవర్కు చెబుతున్నారు. నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏమేమి కేసులు పెడుతున్నారు? నేను చేసిన తప్పేంటి? నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. మీడియా నన్ను కాపాడాలి’ అంటూ డిక్కీలోంచి సెల్ఫీ వీడియో తీసి బయటకు పంపింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దలు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదు చేసి.. ఇప్పుడప్పుడే బయటకు రాకుండా చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అవును.. సిఫార్సు లేఖ ఇచ్చాను జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్కు తాను సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడిని చూడాలని ఉందంటూ తనకు ప్రజా విజ్ఞప్తుల్లో ఓ మహిళ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఆ తర్వాత పెరోల్ రద్దు కావడం తెలిసిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడ అరుణ అనే మహిళ ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని పెరోల్కు తామే సహకరించినట్లు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పెరోల్ రద్దుతో వివాదం సమసిపోయిందన్నారు.రూ.2 కోట్లు ఎవరికి ఇచ్చినట్లు?శ్రీకాంత్ 2014లో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్ల పాటు డాన్గా ఎదిగాడు. వంద మందికి పైగా రౌడీషీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్మెంట్లు, దందాలు, హత్యాకాండలు సాగించాడు. నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోయాక కూడా అదే తరహాలో జైలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అతడికి పెరోల్ మంజూరు చేసి.. అతని నేరాలకు రాచబాట వేసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెరోల్ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమను వాడుకుని వదిలేశారని, అందరి గుట్టు విప్పుతానని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పెరోల్ వెనుక అసలు గుట్టుతోపాటు అతని నేర చరిత్రలో భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అసలు రంగు బయట పడుతుందని ప్రభుత్వం బెంబేలెత్తిపోయి హడావుడిగా ఆమెను అరెస్ట్ చేయించింది. కాగా, పెరోల్ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి అరుణ రూ.2 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో విచారణలో తేలుస్తారా?ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్జీవిత ఖైదీ శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్లో శ్రీకాంత్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. నెల రోజులకు పైగా అయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో సన్నిహితురాలు అరుణతో మసాజ్ చేయించుకుంటూ, డ్యాన్స్లు చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై విచారణ జరిపిన ఎస్పీ.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఖాజా మొహిద్దీన్, ఖలీల్ను విధుల నుంచి తొలగించారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు వారికి సహకరించారో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. -
లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం
నర్సీపట్నం: ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పింఛన్ తొలగించమని సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకరే చెబుతున్నారు. రానున్న కాలంలో మరెన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు.ఈ విషయమై రెండు నెలలు క్రితం తానే స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉందన్నారు. 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4,148 మంది వికలాంగుల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా.. 3,349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. -
నేడు కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది.ఈ సమావేశంలో ఇటీవల సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపి, మరిన్ని అంశాలపై చర్చించనునట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
వారికి నోటీసులు ఆపండి!
సాక్షి, అమరావతి: అనర్హులంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగ పింఛనుదారులకు కొద్దిరోజులుగా జారీచేస్తున్న నోటీసులను కొందరికి నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పింఛను కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఈ మేరకు సూచించారంటూ సెర్ప్ అధికారులు అన్ని జిల్లాల అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా సెర్ప్ కార్యాలయం అందజేస్తుందని వారు తెలిపారు. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు దివ్యాంగులను ప్రధానంగా టార్గెట్ చేసింది. వీరి సంఖ్యను భారీగా కుదించేందుకు 10–15 ఏళ్లకు పైగా పింఛను పొందుతున్న లబ్ధిదారులకు కొత్తగా మళ్లీ వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. మీకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంది, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తోంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల పింఛన్లకు కోత..గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు అందించగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఆగస్టులో పంపిణీ చేసిన మొత్తం పింఛన్లు 62.19 లక్షలే. ఇప్పుడు దీనికి అదనంగా లక్షలాది మంది దివ్యాంగ, వైద్య పింఛనుదారులకు అనర్హత పేరుతో నోటీసులు జారీచేస్తుండడంపై ‘సాక్షి’ బుధవారం ‘పింఛన్లు.. కకావికలం’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు జారీచేసే నోటీసులను నిలుపుదల చేయాలంటూ సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు. -
'పన్ను'పోటు తగ్గేనా?
సాక్షి, అమలాపురం: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)(వస్తు సేవల పన్ను)లో సంస్కరణలు చేయడంతో పాటు, ముఖ్యమైన ఉత్పత్తులపై జీఎస్టీ తొలగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉద్యాన, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు సాగు చేసే రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే 5, 12, 18 శాతం చొప్పున జీఎస్టీని విధిస్తున్నారు. దీనివల్ల వీటిపై ఆధారపడిన వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులపై పరోక్షంగా భారం పడుతోంది. వీటిపై జీఎస్టీ తొలగిస్తే విలువ ఆధారిత ఉత్పత్తులు పెరగడంతో పాటు, సాగు లాభాసాటిగా మారుతుందని రైతులు చెబుతున్నారు. కొబ్బరిపై ఐదు శాతం గోదావరి జిల్లాల్లో వరి తర్వాత అతి పెద్ద సాగు కొబ్బరి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఏడాదికి సగటున 107 కోట్ల కాయల వరకు దిగుబడి వస్తోందని అంచనా. కొబ్బరి కాయ (పచ్చికాయ)పై జీఎస్టీ లేదు. కానీ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులపై ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి)పై ఐదు శాతం జీఎస్టీ విధించారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారికి ఎండు కొబ్బరి క్వింటాల్పై ప్రస్తుత ధర (రూ.20 వేలు)ను బట్టి రూ.వెయ్యి వరకు భారం పడుతోంది. గతంలో.. గతంలో ఎండు కొబ్బరిపై ఎటువంటి పన్ను ఉండేది కాదు. వాణిజ్య పన్నుల శాఖ ఎండు కొబ్బరిపై నాలుగు శాతం టాక్స్ విధించగా, 2002లో అప్పటి ప్రభుత్వం రెండు శాతానికి తగ్గించింది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు శాతం పన్ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారయ్యేది. కేంద్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన తర్వాత దీనిపై ఐదు శాతం జీఎస్టీ పడింది. నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండు కొబ్బరి తయారీ తగ్గుతూ వస్తోంది. అలాగే కొబ్బరి నూనెపై ఐదు నుంచి 18 శాతం వరకు జీఎస్టీ ఉంది. 15 కిలోల కొబ్బరి నూనె డబ్బాపై రూ.265 నుంచి రూ.945 వరకు భారం పడుతోంది. దీంతో జీఎస్టీ భారం లేకుండా కొందరు అక్రమార్కులు దొడ్డి దారిన కల్తీ కొబ్బరి నూనె అమ్మకాలు చేస్తున్నారు. ఎండుకొబ్బరి, కొబ్బరి నూనెపై జీఎస్టీ తొలగిస్తే.. ఇవి స్థానికంగా ఉత్పత్తి అయి రైతులకు, తయారీ కార్మికులకు, వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. పామాయిల్ పైనా.. ఆయిల్పామ్ రైతులు, వ్యాపారుల పరిస్థితి కూడా ఇంతే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. రైతులు విక్రయించే ఆయిల్ పామ్ గెలలపై జీఎస్టీ లేదు. కానీ, ఆయిల్ పామ్ పండ్ల నుంచి తీసే పామాయిల్పై ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధరలు తగ్గించడం ద్వారా పరోక్షంగా ఈ భారం రైతుల పైనే కంపెనీలు మోపుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతిపై జీఎస్టీ లేకున్నా.. వీటిలో వినియోగించే మందులు, సాగుకు వినియోగించే వస్తువులపై జీఎస్టీ ఉంది. అంతే కాకుండా వ్యవసాయ, ఉద్యాన సాగులో ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్, పవర్ వీడర్, మోటార్లు, ఉత్పత్తుల తయారీ యంత్రాలు వీటిపై కూడా ఐదు నుంచి 12, 18 శాతం జీఎస్టీలు శ్లాబ్లు ఉన్నాయి. వీటిని తొలగిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. తొలగిస్తేనే రైతులకు మేలు ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, ఇతర ఉద్యాన ఉత్పత్తులపై జీఎస్టీ మొత్తం ఎత్తి వేయాలి. దీనివల్ల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదే జరిగితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమల లేనిలోటు కొంత వరకూ తీరి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గతంలో ఎండు కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించడం ద్వారా జీఎస్టీని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. – మత్యాల జమ్మి, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సభ్యుడు, అంబాజీపేట -
అంతర్ జిల్లాల బదిలీలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు జీవిత భాగస్వామి (స్పౌజ్), పరస్పర (మ్యూచువల్) అంతర్ జిల్లా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఈ ఏడాది జూలై 31 నాటికి రెండేళ్ల సర్వీసు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, బదిలీ కోరుకుంటున్న జిల్లా వివరాలకు సంబంధించి రెండు రకాల ఫార్మాట్లలో గురువారం నుంచి ఈ నెల 24లోగా ఉపాధ్యాయులు లీప్ యాప్లో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. దరఖాస్తుల ప్రింట్ కాపీలను స్థానిక ఎంఈవోలకు అందించాలని, వీటిపై డీఈవో పరిశీలన చేసి ఈనెల 27 నాటికి డైరెక్టరేట్కు పంపించాలన్నారు. మ్యూచువల్, స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తాజా బదిలీల్లో మెడికల్ గ్రౌండ్స్ కింద అవకాశం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగతం, మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా అంతర్ జిల్లా బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే, మిగులు ఉపాధ్యాయులకు సైతం అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్పర్సన్గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
డీఎస్సీలో డొంక తిరుగుడు!
సాక్షి, అమరావతి :మెగా డీఎస్సీ.. ‘దగా డీఎస్సీ’గా మారనుందా..? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా..? పారదర్శకంగా మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం.. మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవహరించడం ఏమిటి? అనే అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెస్సేజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. ఏ డీఎస్సీలోనూ లేని రీతిలో..సాధారణంగా డీఎస్సీ పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 2018 డీఎస్సీ కంటే దారుణమైన తప్పులు 2025 డీఎస్సీలో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతామని ప్రభుత్వం చెబుతుండటంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. తప్పులు సరిచేయకుండానే మార్కుల వెల్లడి3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించినా, దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్ కీలో తప్పులపై విద్యాభవన్ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదులు చేశారు. ‘సాక్షి’ ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. తీరా ఆ తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు. టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలవడంతో మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్ నంబర్లతో లింక్ అయ్యి ఉంటాయి. ఫోన్ నంబర్లు మారినా ఆధార్ మారే అవకాశం లేదు. కానీ డీఎస్సీ 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు.. !నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు 11న ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈనెల 13న స్కోర్ కార్డులను విడుదల చేశారు. టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల ‘టెట్’ డేటా ఉంటే అభ్యర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డీఎస్సీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మెరిట్ అభ్యర్థులకు అన్యాయం..!1990 నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. డీఎస్సీ 2025లో మాత్రం అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? మెరిట్ లిస్ట్లో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఈ విధానం తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో చోటుచేసుకున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.డీఎస్సీ ఫలితాల్లో గూడుపుఠాణీ!టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సమయంలో మెరిట్ లిస్ట్లను తొక్కిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. పారదర్శకతకు పాతర వేస్తూ మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వెలువడే ముందు దాదాపు 60 వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ అభిమాని కావడం.. పిన్నెల్లి ఫొటో పెట్టుకోవడమే పాపం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడమే ఆ యువకుడు చేసిన పాపం. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ యువకుడిని పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్ఐ షమందర్ వలీ, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకటనాయక్ కలిసి విచక్షణారహితంగా చావబాదారు. కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ, జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తనను కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వతేదీ నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశించింది. పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 45 నిమిషాల పాటు చిత్రహింసలు..! అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘వెల్దుర్తి పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్ ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటి నుంచి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ వలీ, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు, బెల్టుతో చావబాదారు. కాళ్లు, చేతులు మెలిబెట్టి అదే పనిగా కొట్టారు. రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు రూ.15 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్కు రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు బెదిరించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని రామలక్ష్మణరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది ఏ.జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్పై నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నారని, ఇందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫుటేజీ భద్రపరచడానికి ఏం ఇబ్బంది? ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశి్నంచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ టీవీ ఉండి తీరాలని గుర్తు చేశారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని తగిన అధికారికి అందించేందుకు వీలుగా భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల జైలు.. ఒంగోలు కోర్టు తీర్పు
ఒంగోలు: ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయాధికారి కానుగుల శైలజ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఆదివారం అల్లూరు గ్రామంలో చర్చికి వెళ్లేది. ఆ చర్చిలో మైకు ఏర్పాటుచేసే బత్తుల చంటి అలియాస్ విల్సన్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్ చదువుతున్న ఆ బాలికను మభ్యపెట్టి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లకు బాలిక అనారోగ్యంగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక చంటి అలియాస్ విల్సన్ గురించి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు 2019 ఆగస్టు 6న కొత్తపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్.ఐ. మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి నిందితుడు చంటి అలియాస్ విల్సన్పై నేరారోపణ రుజువైందని ప్రకటించారు. దీంతో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు, ఆమె బిడ్డకు రూ.3 లక్షలు అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే..అటవీ సిబ్బందిపై దాడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు/యర్రగొండపాలెం/పెద్దదోర్నాల: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మద్యం మత్తులో అరాచకం సృష్టించారు. తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి, వారిపై దాడికి దిగారు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అతిథి గృహంలో బసచేసి దిగజారి ప్రవర్తించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దోర్నాల–శ్రీశైలం ఘాట్రోడ్డు రాత్రి 9 గంటలకు మూసేస్తారు. ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలంలోని శిఖరం వద్ద కూడా ఇదే సమయాన్ని అటవీ అధికారులు పాటిస్తారు. మంగళవారం రాత్రి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్ఆఫీసర్లు మోహన్కుమార్, గురవయ్య, డ్రైవర్ కరీం రాత్రి గస్తీ చేపట్టారు. చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్పోస్టు సమీపంలో రెండు వాహనాలు రోడ్డుపై ఆగి ఉండటాన్ని గమనించి హారన్ కొడుతూ వాటివద్దకు వెళ్లినా వాహనాలు కదల్లేదు. ఆ వాహనాల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి తన అనుచరులతో ఉండటాన్ని చూసి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేశారు. మద్యం మత్తులో ఊగిపోతున్న ఎమ్మెల్యే తన వాహనాల వద్దకు వచ్చి హారన్ కొట్టడంపై అటవీ సిబ్బందిపై బూతులతో రెచి్చపోయారు. ‘మీరంతా ప్రకాశం జిల్లా ఫారెస్టోళ్లు. శ్రీశైలం నా పరిధి. ఇక్కడ సిబ్బంది వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వాహనాలు పంపిస్తూ నాకు చెడ్డపేరు తెస్తారా?’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. గడువు దాటిన తర్వాత కూడా శిఖరం చెక్పోస్టు నుంచి వాహనాలను ఎమ్మెల్యే ముందుకు పంపించారు. ‘ఇది టైగర్ జోన్. వాహనాలను పంపకూడదు’ అని అటవీ సిబ్బంది చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. శిఖరం తమ పరిధిలోకి రాదని, ఆత్మకూరు రేంజ్ పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై చేయి చేసుకున్నారు. అటవీ సిబ్బంది ఐడీ, ఆధార్ కార్డులు, పర్సులను ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. అటవీ అధికారుల వాహనంలో ఇద్దరు సిబ్బందిని, తన వాహనంలో మరో ఇద్దరు అటవీ సిబ్బందిని బలవంతంగా కూర్చోబెట్టారు. అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుని సిబ్బందిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని ఓ అతిథి గృహంలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవుత్ చేరుకుని అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు.ఎమ్మెల్యేపై కేసు నమోదు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డీఎఫ్ఓకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుత భయపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం వన్టౌన్ పోలీసు స్టేషన్లో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జనసేన నేత అశోక్పై కేసు నమోదు చేశారు.మద్యం సేవించి శ్రీశైలంలో బస! శ్రీశైలంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ.. ఎమ్మెల్యే, వారి అనుచరులు పూటుగా మద్యం సేవించి అటవీ సిబ్బందిపై బూతులతో విరుచుకుపడి, దాడి చేయడమే కాకుండా శ్రీశైలంలోని ఓ అతిథిగృహంలో బస చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, అదీ తన సొంత నియోజకవర్గం శ్రీశైలంలో మద్యం మత్తులో బస చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పే అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తన సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేయడం, మద్యం సేవించి శ్రీశైలంలో బస చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది. ఉపేక్షించేది లేదు: అటవీశాఖ డీడీతమ సిబ్బందిపై దాడి చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటనను ఆయన ఖండించారు. ఇటువంటి దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత సిబ్బంది శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదుతో పాటు తాము శాఖాపరంగా విచారణ జరుపుతామన్నారు. బాధితుల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన వారున్నారని, దోషులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు దాడులు, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.తక్షణం చర్యలు తీసుకోవాలి: ఫారెస్ట్ అధికారుల సంఘంఅటవీ శాఖాధికారిపైన, సిబ్బందిపైన దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, ఆయన అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మార్కాపురం ప్రాంత అధ్యక్షుడు పి.కరీముల్లా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ నెక్కంటి డిప్యూటీ రేంజ్ అధికారి డి.రామానాయక్, ఎఫ్ఎస్ఓ జె.మోహన్కుమార్, ఎఫ్బీఓ టీకే గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను శ్రీశైలం శిఖరం వద్ద అటకాయించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, దాదాపు 30 మంది అనుచరులు దాడి చేశారన్నారు. సిబ్బందిని వాహనంలో కిడ్నాప్ చేసి తీవ్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. సిబ్బంది వద్ద ఉన్న వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, నగదు, వ్యక్తిగత వస్తువులు కూడా అపహరించారని వివరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఫారెస్ట్ సిబ్బందిని విడిచి పెట్టారని, దాడికి గురైన వారంతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్కళ్యాణ్ తక్షణమే స్పందించాలని, సీఎం చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడికి పాల్పడిన వారు తమ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని, వారికి చట్టపరమైన శిక్ష పడేవరకు తాము విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు డి.శివశంకర్, జె.ఫిలిప్, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉద్యోగుల వెతలు.. సీఎస్ కబుర్లు..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నుంచి తీపికబురు వస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత ఎన్నో ఆశలతో బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశంలో ఏ సమస్యపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రస్తావించాయి. ఒక్క అంశంపైనా తక్షణ పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా సమావేశం నుంచి వెనుదిరిగారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని... » 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి » 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేయాలి » బకాయి నాలుగు డీఏల్లో కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలి » 11వ పీఆర్సీ డీఏ బకాయిలు చెల్లించాలి » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలి » పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటెషన్, ఈఎల్ చెల్లింపులు ఇవ్వాలి » రెసిడెన్షియల్ సొసైటీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు చేయాలి ట ఈహెచ్ఎస్ కార్డుల సమస్యలు పరిష్కరించి రీయింబర్స్మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంచాలి. వీటిపై సీఎస్ ఏమన్నారంటే‘‘ఉద్యోగులకు సంబంధించి 114 అంశాలు పెండింగులో ఉన్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్థికేతర సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం’’ అని మాత్రమే సీఎస్ ‘హామీ’ ఇచ్చారు. నేతల అసంతృప్తి ఇలా...ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల బకాయిలు రూ.30 వేల కోట్లు దాటిపోయాయి. ఒక ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్లో చూపించాలని మే ము డిమాండ్ చేశాం. సీఎం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఎసీ అమరావతి అధ్యక్షులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, 30 శాతం ఐఆర్, కనీసం ఒక డీఏ వెంటనే ఇవ్వాలని మేము కోరాం. ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడంతో 14 నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. –విద్యాసాగర్, ఎపీఎన్జీవో అధ్యక్షులు టీచర్ల సమస్యలు పరిష్కరించాలి పాఠశాల విద్యా సమస్యలు, టీచర్ల అంశాలను ప్రస్తావించాం. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మున్సిపల్ టీచర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి –జి. హృదయరాజు, ఎపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు -
అచ్చెన్న ‘యంత్ర’ తంత్రం!
సాక్షి, అమరావతి: ఆయన వ్యవసాయశాఖ మంత్రి. విత్తనాలతోనే కాదు.. యంత్రాలతో సిరుల పంట పండించుకోవాలని రంగం సిద్ధం చేశారు. ఈ పంట పండించాలన్న ఒత్తిడి తట్టుకోలేక ఒక అధికారి ఈ బండారాన్ని బయటపెట్టారు. దీంతో మంత్రి, ఆయన ఓఎస్డీ తేలుకుట్టిన దొంగల్లా మారారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీ కేంద్రంగా అవినీతి యథేచ్చగా సాగుతోంది. మంత్రి అచ్చెన్న అవినీతికి వత్తాసు పలకలేక, వేధింపులు తట్టుకోలేక రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆగ్రోస్) జనరల్ మేనేజర్ (జీఎం) మునెల్లి చంద్రరాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కామధేనువుగా మార్చుకుని భారీ దోపిడీకి తెగబడుతున్నారని ఆయన స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదర్చమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆయన ఓఎస్డీ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించారని ఆయన ఆ లేఖలో వివరించారు. అచ్చెన్నాయుడి అవినీతి బాగోతంలో తాజా వ్యవహారం ఇది. రూ.240 కోట్ల కాంట్రాక్టులో అడ్డగోలు అవినీతికి స్కెచ్ ఆగ్రోస్ ఆధ్వర్యంలో గత ఏడాది రూ.60.14 కోట్ల సబ్సిడీతో 25 వేల పరికరాలు పంపిణీ చేయగా.. 2025–26లో రూ.240 కోట్ల విలువైన కిసాన్ డ్రోన్లతోపాటు యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలులో కమీషన్ల పేరిట సొమ్ము చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేశారు. ఆ బాధ్యతను తన ఓఎస్డీ పోలినాయుడుకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను సంప్రదించారు. యంత్రపరికరాల కంపెనీలతో మాట్లాడి భారీ కమీషన్లు వసూలు చేయాలని చెప్పారు. అందుకు సమ్మతించిన కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారని కూడా స్పష్టం చేశారు. భారీ కమీషన్ల డిమాండ్తో యంత్ర పరికరాల కంపెనీలు వెనుకంజ వేశాయి. దీంతో కమీషన్ల వ్యవహారం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఓఎస్డీ పోలినాయుడు రెండు, మూడుసార్లు జీఎం రాజమోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న పేరుతో ఓఎస్డీ వేధింపుల్ని తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వెళ్లేముందు మంత్రి అచ్చెన్న, ఆయన ఓఎస్డీ తనను ఏవిధంగా వేధించింది, కమీషన్ల కోసం ఎంతగా ఒత్తిడి తెచ్చింది వివరిస్తూ ఆగ్రోస్ చైర్మన్ ఎం.సుబ్బనాయుడు, ఎండీ ఢిల్లీరావు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్లకు లేఖ రాశారు. ఆ లేఖ కాపీనీ సీఎం కార్యాలయానికి కూడా పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బండారం బట్టబయలైంది. మీడియాలో వైరల్ అయిన ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరికరాల ధరలు పెంచి.. గత ఏడాది రూ.60.19 కోట్ల యంత్రపరికరాల కాంట్రాక్టులోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకోసం యంత్ర పరికరాల ధరలను భారీగా పెంచింది. గత ప్రభుత్వం రోటోవేటర్ను రూ.90వేల నుంచి రూ.లక్ష మధ్య కొనుగోలు చేసింది. ప్రస్తుతం అదే రోటోవేటర్కు రూ.1.45 లక్షల ధర నిర్ణయించారు. ఇదొక్కటే కాదు.. 2024–25 సీజన్లో పంపిణీచేసిన యంత్రపరికరాల ధరలన్నీ మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటు కోట్చేసి అవినీతికి పాల్పడ్డారు. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నెప్ట్యూన్ బ్యాటరీ స్ప్రేయర్ తయారీ సంస్థను సింగిల్ టెండర్ విధానంలోఎంపిక చేయడమే మంత్రి అచ్చెన్న దోపిడీకి నిదర్శనం. ట్రాక్టర్ల కొనుగోలులో ఎల్–1 టెండర్ ప్రక్రియను పాటించకుండా బాక్స్ టెండర్ పద్ధతిని అనుసరించడం, కేవలం రూ.10 లక్షల గ్యారంటీ ఉన్న కంపెనీలకు ఏకంగా రూ.23 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించడం, డిస్క్వాలిఫై అయిన ఓ ట్రాక్టర్ల కంపెనీని ఎంప్యానెల్ జాబితాలో చేర్చడం వంటి వాటితో అవినీతికి రంగం సిద్ధం చేశారు. ఆ అవినీతికి వత్తాసు పలకలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం స్థానంలో తమకు విధేయుడైన ఓ జూనియర్ అధికారిని నియమించి అవినీతి దందా సాగించేందుకు మంత్రి అచ్చెన్న సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. -
కడలి వైపు నదుల పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/సత్రశాల/అచ్చంపేట/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి బుధవారం మరింత పెరిగింది. కడలి వైపు నదులు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదులు తుంగభద్ర, భీమా వరదెత్తి ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర డ్యాంలోకి 1.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.21 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద నీటిమట్టం 311.32 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,78,032 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 4,85,397 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,87,037 క్యూసెక్కులు చేరుతుండగా 4,48,761 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,45,187 క్యూసెక్కులు చేరుతుండగా 4,81,102 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,64,064 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,59,786 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల గోదావరి ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి ఉప నదులు, వంకలు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు వరద నీటి మట్టం 43.2 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 8,25,477 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 4,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,20,677 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 17 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 15,661 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నీచ రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటంతో టీడీపీ కుప్పకూలిపోతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఇది ప్రభుత్వ విశ్వసనీయత, పాలన గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని స్పష్టం చేసింది. నీచపు రాజకీయాలకు టీడీపీ కేరాఫ్గా మారిందని నిప్పులు చెరిగింది. ప్రభుత్వ అధికారులపై నిస్సిగ్గుగా దాడులు మొదలు.. అవినీతి, పెరోల్ కుంభకోణాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వరకు అనేక వివాదాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూరుకుపోవడంతో అధికార పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిందని ఎత్తిచూపింది. ఈ మేరకు ‘సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్తో జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ పోస్టులో వైఎస్సార్సీపీ ఇంకా ఏమన్నదంటే.. » శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అధికార పార్టీ శాసనసభ్యులలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎత్తిచూపింది.» ఈ వివాదానికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు అవినీతిపై తుపానులో చిక్కుకున్నారు. డీలర్లతో అక్రమ కమిషన్ లావాదేవీలలో మధ్యవర్తిగా వ్యవహరించడానికి నిరాకరించినందుకు మాత్రమే తనను అకస్మాత్తుగా బదిలీ చేశారని ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ నేరుగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలు ఈ ప్రభుత్వ సమగ్రత, పాలనపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తాయి.» వివాదాస్పద పెరోల్ సిఫార్సుల చుట్టూ ఉన్న విషయాలు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఒక ప్రసిద్ధ రౌడీ–షీటర్కు పెరోల్ను సిఫార్సు చేశారు. ఈ చర్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హోం మంత్రి అనిత ఈ ఫైల్ను ఆమోదించడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇటువంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రజాభద్రత కంటే నేరస్థులకు పెరోల్ ఇచ్చేందుకు అధికంగా శ్రద్ధ చూపడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. » మంత్రులు, ఎమ్మెల్యేల వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస కుంభకోణాలతో టీడీపీ పూర్తిగా కుప్పకూలింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళ పట్ల అసభ్యకరమైన సైగలు చేస్తూ వీడియోలో దొరికిపోయాడు. ఇది వైరల్ అయ్యింది. అసెంబ్లీని ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటనను బహిర్గతం చేసినట్లు అనుమానించి, మరొక మహిళను కూడా ఆ ఎమ్మెల్యే వేధించి, ఆమెను ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. » అమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమెను పని సాకుతో తన కార్యాలయంలో ఉండమని బలవంతం చేస్తున్నాడు. అర్ధరాత్రి అనుచిత వీడియో కాల్స్ చేస్తున్నాడు. భరించలేని విధంగా అవమానాలకు గురిచేస్తున్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సౌమ్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికార దుర్వినియోగానికి ప్రతిబింబం.» మొత్తం మీద ఈ సంఘటనలు టీడీపీలోని మరో కోణాన్ని బహిర్గతం చేశాయి. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అధికార దుర్వినియోగం నుంచి అధికారులపై ప్రత్యక్ష దాడులు, మహిళలపై అసభ్యకరమైన చర్యల వరకు నేరాలకు పాల్పడ్డారు. ఈ ఉదంతాలన్నీ నీచ శ్రేణి రాజకీయాలు చేసే పార్టీగా ప్రజలు టీడీపీని అభివర్ణిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జవాబుదారీతనం లేకుండా అధికార దుర్వినియోగంతో మహిళల గౌరవం, అధికారుల హక్కులు, ప్రజా విశ్వాసానికి విఘాతం కల్పిస్తున్నారు. -
‘లై డిటెక్టర్ టెస్ట్’.. గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి,వైఎస్సార్: విద్యార్థిని హత్య కేసులో ఆమె తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. లైడిటెక్టర్ టెస్టుల్లో పాల్గొనాలని వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థిని హత్య అనంతరం పోలీసులు అన్నీ కోణాల్లో పోలీసులు విచారించారు. ఈ విచారణలో విద్యార్ధిని హత్యలో ప్రేమికుడు ప్రమేయం లేదని గతంలోనే తేల్చారు. కుటుంబ సభ్యులను విచారించారు. కానీ నిందిలు ఎవరనేది పోలీసులు గుర్తించ లేకపోయారు. చివరికి పరువు కోసం కుటుంబ సభ్యులే విద్యార్ధిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేసేందుకు వారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..గత జులై నెలలో వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా మారింది.ఘటన జరిగిన రోజు ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేష్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది.అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్పై లోకేష్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?హత్యకు గురైన రోజు ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేష్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జీవ ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్ వేదిక వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.Third-Rate… Vulgar LeadersIn just the last few days, the Telugu Desam Party (TDP) has been rocked by a string of scandals involving its ministers and MLAs, raising serious questions about the government’s credibility and governance. The controversies range from brazen attacks…— YSR Congress Party (@YSRCParty) August 20, 2025..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది. -
సినీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: హైదరాబాద్లో సినీ నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.