breaking news
Andhra Pradesh
-
వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరించే కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అర్పుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రయాణికుడి చెంపపై కొట్టిన మహిళా కండక్టర్
తోట్లవల్లూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పట్ల మహిళా కండక్టర్ అనుచితంగా ప్రవర్తించటమే కాకుండా చొక్కా పట్టుకుని చెంప చెళ్లుమనిపించిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును గురువారం ఉదయం ఓ వ్యక్తి ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో టికెట్కు సరిపడా చిల్లర లేకుండా బస్సు ఎందుకు ఎక్కావంటూ మహిళా కండక్టర్ ప్రయాణికుడి పట్ల దురుçసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాదన జరగటంతో కనకదుర్గమ్మ కాలనీ వద్ద కండక్టర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికుడిని బస్సు నుంచి దించి, ‘నన్ను బూతులు తిడతావా’ అంటూ అతని చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటనను చూసిన పలువురు స్థానికులు నివ్వెరపోయారు. టికెట్ తీసుకునే విషయంలో ప్రయాణికుడి పొరపాటు ఉన్నప్పటికీ, అతని చొక్కా పట్టుకుని కొట్టేంత వరకు వెళ్లిన మహిళా కండక్టర్ ప్రవర్తన పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
శానిటేషన్ టెండర్లలో రా'బంధువు'
సాధారణంగా ఎక్కడైనా టెండర్లు పిలుస్తున్నారంటే ప్రజాప్రయోజనాలు, నాణ్యమైన సేవల కల్పనకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో అలా కాదు. ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యం. ప్రతి కాంట్రాక్టును బంధువులు, అస్మదీయులకు కట్టబెట్టి తద్వారా కోట్లాది రూపాయలు దండుకోవాలన్నదే వ్యూహం. ఇందుకు తగ్గట్లుగానే టెండరు నిబంధనలూ రూపొందుతాయి. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ విషయంలో సీఎం బంధువు చెప్పిందే రూల్ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ (ఏపీ వైద్య విధాన పరిషత్), బోధనాస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణకు కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక కోసం గత నెలలో వైద్యశాఖ టెండర్లు పిలిచింది. ఈ టెండరు నిబంధనల్లో 2019–20 నుంచి 2023–24 మధ్య సేవలు అందించిన అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్నే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలు పెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం పిలిచిన టెండర్లలో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని, అలా తీసుకుంటే వచ్చే నష్టం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. – సాక్షి, అమరావతిససేమిరా అంటున్న ప్రభుత్వం..ఇందుకు సంబంధించి గతనెల 22న ఏపీఎంఎస్ఐడీసీ శానిటేషన్ టెండర్లను ఆహ్వానించింది. ప్రీ బిడ్ మీటింగ్లో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్ను పరిగణనలోకి తీసుకోవాలని చాలా సంస్థలు కోరాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం కుదరదని తేల్చేసింది. సాధారణంగా టెండరు ఆహ్వానించిన సమయానికి ముందు మూడు, నాలుగు, ఐదేళ్ల అనుభవం.. ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే అంశాన్ని ప్రీ బిడ్ మీటింగ్లో కొందరు కాంట్రాక్టర్లు ప్రస్తావించారు. మరోవైపు.. శానిటేషన్ టెండర్లు పిలవడానికి రెండ్రోజుల ముందు వైద్య కళాశాలల్లో యూజీ, పీజీ సీట్ల పెంపు కోసం ఎక్విప్మెంట్ కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండరు నిబంధనల్లో గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వార్షిక టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుంటామని నిబంధన పెట్టారు. అనంతరం పిలిచిన చిన్నచిన్న టెండర్లలోనూ అదే నిబంధనను కొనసాగించారు. సీఎం బంధువుకు నష్టం జరుగుతుందనే..ఆస్పత్రుల నిర్వహణలో అత్యంత కీలకమైన, రూ. వందల కోట్లు విలువచేసే శానిటేషన్ టెండర్లలో మాత్రం సీఎం బంధువు సంస్థకు నష్టం జరుగుతుందనే 2024–25 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని సమాచారం. 2019–20 నుంచి 2023–24 మధ్య అత్యధిక టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుని పనులను అవార్డు చేసేలా ప్రస్తుత టెండరు నిబంధన ఉంది. 2024–25లో సీఎం బంధువు సంస్థకు పెద్ద టర్నోవర్ లేదని సమాచారం. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన నాటికి ఐదేళ్ల ముందు అనుభవం, టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుంటే సదరు సంస్థకు పనులు దక్కవని, అసలు పోటీలోనే లేకుండాపోతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిబంధనల్లో మెలికపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు.. 2019–24 మధ్య టెండర్లలో పాల్గొన్న సంస్థలపై బ్లాక్ లిస్టింగ్/పోలీస్ కేసులు ఉండకూడదని నిబంధన ఉంచారు. ఈ నిబంధన ప్రకారం 2024–25లో బ్లాక్ లిస్టింగ్/పోలీస్ కేసులున్న సంస్థలు టెండర్లలో పాల్గొనడానికి వీలుంది. ఇప్పటికే సెక్యూరిటీ టెండర్ల మార్గదర్శకాల్లో ఏపీఎంఎస్ఐడీసీ చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని అర్హతలేని సంస్థలు రాజకీయ పలుకుబడితో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. శానిటేషన్ టెండర్లలోనూ అలా జరిగేందుకు అధికారులే అవకాశాలిస్తున్నట్లు కనిపిస్తోంది.చివరి దశలో టెండర్ల రద్దు..వాస్తవానికి.. కొద్దినెలల క్రితమే శానిటేషన్ నిర్వహణ టెండర్లను పిలిచారు. ఆ సమయంలో సీఎం బంధువు సంస్థ తప్పులతడకగా బిడ్ దాఖలు చేసింది. దీంతో పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. ఈ సంస్థకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పనులు అవార్డుచేసే సమయంలో మొత్తం టెండర్లనే ప్రభుత్వం రద్దుచేసేసింది. అప్పట్లో కోర్టు కేసులు, ఎల్1గా నిలిచిన సంస్థలపై ఫిర్యాదులను సాకుగా చూపినట్లు ఆరోపణలున్నాయి. ఇక 2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్యశాఖల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లింగ్ చేసేశారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ సంస్థ అడ్రస్ లేకుండాపోయింది. గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది. -
లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడంతోపాటు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0ని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తిరుపతి స్పేస్ సిటీలో మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2025–2035 మధ్య కాలానికి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. విద్యాసంస్థలను భాగస్వాములను చేసి తద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని చెప్పారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రభాగాన ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని సూచించారు. భవిష్యత్ స్పేస్ రంగానిదే: సోమనాథ్ఈ సమావేశానికి వర్చువల్గా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. స్పేస్ విజన్ పాలసీ–2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనన్నారు. మూలధన వ్యయానికి ప్రాధాన్యం: సీఎం మరోవైపు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లభ్యతపైనా ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో సీఎం సమీక్షించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చుచేయాలని చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాలతోపాటు సంపద సృష్టికి, ఆదాయ ఆర్జనకు దోహదపడే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.డ్రగ్స్పై యుద్ధంలో అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా..ఇక గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నానని.. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తానని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగుచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపామని.. ఇంకా అదే పనిచేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పారు. గతంలో విశాఖ కేంద్రంగా గంజాయి రవాణాచేసి ఆంధ్ర బ్రాండ్ను దెబ్బతీశారని ఆరోపించారు. గంజాయి నిర్మూలనకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని సీఎం కోరారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటుచేసిన ఈగల్ టాస్క్ఫోర్సుకు ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లకు ఫోన్చేసి సమాచారమివ్వాలని సీఎం చెప్పారు. కార్యక్రమంలో.. మాదకద్రవ్యాల నివారణకు పనిచేసిన వివిధ వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు సన్మానించారు. -
అర్థించినా ఆలకించని పవన్
సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్కళ్యాణ్కు బాధితులు ఎయిర్పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు. జనసేన కార్యకర్తల వీరంగం.. సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్కళ్యాణ్ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి. ‘ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’..!సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు. -
తనిఖీల పేరుతో ఇన్చార్జి అసభ్య ప్రవర్తన
తెనాలి: బండ బూతులు తిడుతూ అన్నం తింటున్నారా..పెం.. తింటున్నారా..! అంటూ గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా శానిటేషన్ వర్కర్లపై ఇన్చార్జి విజయసారథి సాగిస్తున్న దాష్టీకమిది.. సెల్ఫోన్లు దాచుకున్నారని యూనిఫామ్ చొక్కా విప్పించి ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేయించటం. అదేమంటే జాకెట్ కూడా విప్పమన్నాగా.. విప్పలేదా! అని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ పైశాచికానందం పొందడం ఆయన నైజమని మహిళా వర్కర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. విజయసారథి వ్యవహారశైలిపై విసిగిపోయిన వారు గురువారం తెనాలి తల్లీపిల్లల వైద్యశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కులాలవారీగా మహిళా వర్కర్లను వర్గీకరించి దళిత మహిళలను బూతులు తిడుతున్నారని తెలిపారు. డ్యూటీకి రాగానే అందరి ఫోన్లను ఆఫీసు రూంలో పెట్టిస్తున్నారని, ఆ తర్వాత మహిళా ఉద్యోగి చేత వర్కర్ల యూనిఫాం షర్ట్ విప్పించి తాకరాని చోట తాకుతూ తనిఖీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం ప్రశ్నిస్తే లంగాలు, జాకెట్లూ విప్పదీయించి వెతకమన్నానుగా.. చేయట్లేదా అని అడుగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా.. ’నన్ను కదిలించేవాడు ఎవడూ లేడు, ఏమైనా చేసుకోండి’ అంటూ మాట్లాడాడని వివరించారు. ఎవ రైనా ప్రశ్నిస్తే పని నుంచి తొలగిస్తున్నాడని వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించాడని, తనను విధుల్లోకి తీసుకోకుంటే ఇన్చార్జి గది ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఒక వర్కర్ స్పష్టం చేశారు. -
భగ్గుమన్న పొగాకు రైతు
మద్దిపాడు/కొండపి: కూటమి సర్కారు, అధికారుల తీరుపై పొగాకు రైతులు భగ్గుమన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో మరోసారి రోడ్డెక్కారు. మద్దిపాడు, కొండపి వేలం కేంద్రాల్లో గురువారం ఆందోళనలకు దిగారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని ముండ్లమూరు క్లస్టర్ రైతులు తీసుకొచి్చన పొగాకుకు ధర పూర్తిగా తగ్గించడంతో కోపోద్రిక్తులయ్యారు. జాతీయ రహదారిపై పొగాకు తగలబెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం నోబిడ్ అయిందని, కంపెనీలన్నీ కుమ్మక్కయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిలోకు రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు రూ.180కి తగ్గించాయని, చివరకు రూ.160కి కొనుగోలు చేస్తామని, అదీ కాకుండా రూ.125లోపే కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలోనూ గురువారం జువి్వగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాల్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు కంపెనీలు ధర పూర్తిగా తగ్గించేశాయని వేలాన్ని బహిష్కరించారు. కిలోకు కనిష్ట ధర రూ.160 కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వేలం నిర్వహణ అధికారి జి.సునీల్ కుమార్, రైతులతో చర్చలు జరిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. పొగాకు పంట సాగు పరిమాణం నిర్ధారణకొరిటెపాడు: గుంటూరు జీటీ రోడ్డులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో గురువారం 165వ పొగాకు బోర్డు సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ చిడిపోతు అధ్యక్షత వహించారు. ఏపీ ప్రాంత పంట కాలానికి పంట సాగు పరిమాణం నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్, రైతు సాగుబడికి ఆమోదయోగ్యమైన పరిధికి అనుగుణంగా ఈ ప్రాంత పంట కాలానికి 142.00 మిలియన్ కిలోల పరిమాణాన్ని సమావేశంలో నిర్ధారించారు. సమావేశంలో ఈడీ విశ్వశ్రీ, డైరెక్టర్ (ఆక్షన్) శ్రీనివాస్, వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య పలువురు సభ్యులు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా కర్ణాటక ఎంపీ పి.మహేశ్కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.. కర్ణాటక, గుజరాత్, బిహార్, యూపీ రాష్ట్రాల అధికారులూ పాల్గొన్నారు. -
డబ్బుల్ ధమాకా!
సాక్షి, అమరావతి: శాశ్వత సచివాలయం పేరుతో వీలైనంత దోచుకునేందుకు ముఖ్య నేత వేసిన స్కెచ్లో ఇంకో అడుగు ముందుకు పడింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఈ నెల 2వ తేదీన 48వ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఎన్సీసీ లిమిటెడ్, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా, డయా గ్రిడ్ విధానంలో నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు ఖర్చయ్యే పనులను ఏకంగా చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున కట్టబెట్టింది. ఇటాలియన్ మార్బుల్స్తో అంతర్జాతీయ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగుకు రూ.4 వేలు–4,500కు మించి ఖర్చు కాదు. ఈ ధరతోనే హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో హైరైజ్ బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఇంతకు రెండింతలు వెచ్చించి నిర్మిస్తుండటంలో ఆంతర్యం ‘నీకింత.. నాకింత..’ అని దోచుకోవడమేనని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టెండర్లలో జీఏడీ భవన నిర్మాణ పనులకు 4.53 శాతం అధిక ధర రూ.882.47 కోట్లతో కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎన్సీసీ.. 1, 2 టవర్ పనులకు 4.50 శాతం అధిక ధర రూ.1,487.11 కోట్లతో కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ.. 3, 4 టవర్ పనులకు 4.54 శాతం అధిక ధర రూ.1,247.22 కోట్లతో కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల నిర్మాణ వ్యయం రెట్టింపు అవడమే కాకుండా, ఎక్సెస్గా ప్రభుత్వ ఖజానాపై రూ.158.62 కోట్ల భారం పడింది. దీంతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి అధిక వడ్డీకి అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు దోచి పెడుతూ నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే సగటున 5 శాతం తక్కువ (లెస్) ధరకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారని, కనీసం రూ.320 కోట్ల మేర ఖజానాకు మిగిలేవని స్పష్టం చేస్తున్నారు. ఇక లేహ్ విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన షాపూర్జీ పల్లోంజీ సంస్థను 2024 ఆగస్టు 22న బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉత్తర్వులు (ఆర్డర్ నెంబరు: ఏఏఐ/లేహ్/ఎన్టీబీ/బ్లాక్ లిస్టింగ్/2024–25/886) జారీ చేసింది. 2026 ఆగస్టు 21 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంగా పేర్కొంది. అంటే.. అప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఏ టెండర్లలోనూ పాల్గొనేందుకు షాపూర్జీ పల్లోంజీకి అర్హత ఉండదు. అయినా సరే ఆ సంస్థ శాశ్వత సచివాలయం టెండర్లలో బిడ్ దాఖలు చేసింది.నిబంధనల ప్రకారం ఆ సంస్థపై అనర్హత వేటు వేయాల్సిన సీఆర్డీఏ అధికారులు తద్భిన్నంగా ఆమోదించి పనులు అప్పగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నాటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడూ నిబంధనలను తుంగలో తొక్కి శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను అప్పగించడం వెనుక కమీషన్ల దందా దాగి ఉందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ ఐకానిక్ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. » ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేటులోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. » 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లతో పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.» 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లతో పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.» జీఏడీ భవన నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా..శాశ్వత సచివాలయ నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పట్టో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు భవనాల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా, డయా గ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయా గ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. శాశ్వత సచివాలయం నిర్మాణాన్ని చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడు» తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో అప్పటి సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. » ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. » ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ధర ‘కోతా’పురి
చిత్తూరుకు చెందిన ఓ రైతు తోతాపురి రకం మామిడి కాయలను కోసి లారీలో ఫ్యాక్టరీకి అమ్మకానికి పెట్టాడు. రోజులు గడిచినా ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాయలను ఉచితంగా ఇచ్చేయాలని లారీ డ్రైవర్కు చెప్పడంతో... చిత్తూరు కైలాసపురం వాసులకు పంచిపెట్టారు.తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామ రైతు సుబ్రమణ్యంరెడ్డి రెండు రోజుల క్రితం ట్రాక్టర్ కాయల (5 టన్నులు)ను రోడ్డు మీద పారబోశారు. ర్యాంపులో తోతాపురి కేజీ రూ.2కు కొంటున్నారు. దీంతో స్థానిక తహసీల్దార్ తనిఖీ చేసి రూ.3కు కొనాలని నిర్వాహకుడిని ఆదేశించారు. దీనికి అతడు ఒప్పుకోలేదు. తహసీల్దార్ ర్యాంపునకు కరెంట్ కట్ చేయించారు. విసిగిన సుబ్రమణ్యంరెడ్డి కాయలను రోడ్డుపై పారబోసి వెళ్లిపోయారు.చిత్తూరు రూరల్: మామిడి రైతుల వ్యథ తీవ్రమవుతోంది. ఫలం పండినా... వారికి ప్రతిఫలం దక్కడం లేదు. ప్రధానంగా తోతాపురి రైతు తిప్పలు చెప్పనలవి కాదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 ఎక్కడా దక్కడం లేదు. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2కు మించి కొనడమే లేదు. ఫ్యాక్టరీలో కొద్ది రోజులు రూ.8 నుంచి ప్రారంభమై..రూ.6, రూ.5, రూ.4కు చివరికి రూ.2కి పడిపోయింది. ప్రస్తుత ధరపై ఫ్యాక్టరీలు అసలు నోరు విప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయి. తోతాపురి రకమే 39,895 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 4.99 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు తోతాపురి 1.5 లక్ష టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ⇒ 43 పళ్ల గుజ్జు (పల్ప్) పరిశ్రమలున్నాయి. వీటిలో 31 పనిచేస్తున్నాయి. నిరుడు తయారు చేసిన గుజ్జు నిల్వలు యుద్ధాల కారణంగా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎగుమతులు పుంజుకున్నాయి. ప్రస్తుతం 50 వేల టన్నుల గుజ్జు స్టాక్ ఉంది. దీన్ని సాకుగా చూపించి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలును ఆపేశాయి. తర్వాత జిల్లా అధికారుల ప్రయత్నంతో కొన్ని ఫ్యాక్టరీలు తాళం తీశాయి. ఈ నెల 6 నుంచి టోకెన్ల జారీ ప్రారంభించి కాయల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాయి. ఫ్యాక్టరీల ఎదుట ట్రాక్టర్ల క్యూ ఈ నెల 8 నుంచి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు గేట్లు తెరిచాయి. అప్పటి నుంచి ట్రాక్టర్లు, లారీలు లోడ్తో వేచి చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా అన్ లోడింగ్ కావడం లేదు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ నుంచి వేలాది ట్రాక్టర్లు, లారీలు రాష్ట్ర సరిహద్దును దాటి తమిళనాడు రాష్ట్రం కాటా్పడిలోని కింగ్స్టన్ కాలేజీ వరకు క్యూ కట్టాయి. ఇదే మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్న టాసా ఫ్యాక్టరీని ట్రాక్టర్లు, లారీలు చుట్టుముట్టాయి.రోజుల తరబడి అన్లోడింగ్ కాకపోవడంతో బండ్లల్లోని కాయలు జ్యూస్ అవుతున్నాయి. గంగాధరనెల్లూరు మండలం జైన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పూతలపట్టు, తవణంపల్లి, బంగారుపాళ్యం, పెనుమూరు, తిరుపతి జిల్లాలోని దామలచెరువు తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ రైతులు పస్తులు ఉంటున్నారు. ఫ్యాక్టరీలో మద్దతు కరువు⇒ మద్దతు ధర కేజీ రూ.8, ప్రోత్సాహక నిధి రూ.4... మొత్తం కేజీ తోతాపురికి రూ.12 ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యాక్టరీలు తొలుత కేజీ రూ.8 చొప్పున కొన్నాయి. వారం రోజుల్లో రూ.6కు తగ్గించేశాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనలేమని చేతులెత్తేశాయి. 10 రోజుల తర్వాత కొన్ని ఫ్యాక్టరీలు రేటును రూ.5కు దించాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫ్యాక్టరీలు కొనుగోలు ధరను వెల్లడించడం లేదు. నగదు చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే నమోదు చేయడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 40 ర్యాంపులున్నాయి. వీటి నిర్వాహకులు సిండికేట్ అయి మామిడి ధరలను తగ్గించేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు కొన్నారు. గత వారం రూ.2.50 అని.. ఈ వారం రూ.2కు చేర్చారు.కాయలు చెట్లల్లో రాలిపోయే పరిస్థితి ఉండడంతో... విధి లేని పరిస్థితుల్లో రైతులు చాలామంది ఇదే రేటుకు దింపి వస్తున్నారు. కొందరు రైతులు గిట్టుబాటు గాక, నీరసించి.. విసిగిపోయి.. రోడ్డుపై పారబోసి కన్నీళ్లతో ఇంటికెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధరలో మభ్యపెట్టాలని చూస్తోందని విరుచుకుపడుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ధర పేరుతో మాయ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.విధిలేక ర్యాంపునకు తోలుతున్నా.. నాకు 5 ఎకరాల దాకా మామిడి తోట ఉంది. తోతాపురి 20 టన్నుల వరకు వచి్చంది. ఫ్యాక్టరీకి ట్రాక్టర్లో రెండు లోడు కాయలు తరలించా. అక్కడ కొనలేమని చెబితే విధిలేక ర్యాంపుకు తీసుకొచ్చా. ర్యాంపుల్లో కేజీ రూ.2 అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. పెట్టుబడి కూడా రాదు. ఈసారి రైతులు నిండా నష్టపోయారు. – సూర్యప్రకాష్, దాసరపల్లి, యాదమరి మండలం -
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కారు రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేయించి 9.30 శాతం వడ్డీకి రూ.5,526 కోట్లు అప్పు చేసిందని ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థి క క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇదే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో కేంద్ర ఆర్థి క శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం తన ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి.. రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇది మరో తార్కాణం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీఎండీసీ రెండో దశలో 9.30 శాతం వడ్డీతో రూ.5,526 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ రెండో దఫా అప్పులు చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి.. ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293(1) ఆరి్టకల్స్ను ఉల్లంఘించడమే. అంతేకాదు.. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు కనీవినీ ఎరుగని విధంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టింది.అది కూడా కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం! రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై అజమాయిషీ కల్పించి.. అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు... ఎస్డీఎల్ (రాష్ట్ర అభివృద్ధి రుణాలు) కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ 9.30 శాతం వడ్డీకి ఏపీఎండీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసింది.ఇది ప్రస్తుతం ఎస్డీఎల్ వడ్డీ రేటు కంటే 2.60 శాతం ఎక్కువ. అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీఎండీసీపై ఏడాదికి అదనంగా రూ.235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి పదేళ్లు. అంటే.. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబూ? ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ రుణాలు.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన రుణంలో 50 శాతాన్ని దాటిపోయాయి’ -
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
కర్నూలు: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. -
ఆగస్టులో విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని తాడ–దువ్వాడ సెక్షన్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆగస్టు 26, 28, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి–విశాఖపట్నం(67285), కాకినాడ పోర్టు–విశాఖపట్నం(17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు(17268), గుంటూరు–విశాఖపట్నం(22876), విశాఖపట్నం–గుంటూరు(22875), విజయవాడ–విశాఖపట్నం(12718), విశాఖపట్నం–విజయవాడ(12717) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎన్నికలప్పుడు బాణసంచా పేలి గాయపడ్డానని ఇప్పుడు కేసు!
రాయచోటి/లక్కిరెడ్డిపల్లె: అదిగో పులి అంటే.. ఇదుగో తోక అన్నట్లుంది కూటమి పాలనలో పోలీసుల వ్యవహార శైలి. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు బాణసంచా కాల్చడంతో అప్పట్లో తాను గాయపడ్డానంటూ ఓ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడమే తరువాయి.. పోలీసులు కేసు కట్టడం విస్తుగొలుపుతోంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతుల అగ్రహారానికి చెందిన లోకేశ్ అనే యువకుడు 14 నెలల కిందట ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చాడు. ఆ క్రమంలో కంటి వద్ద గాయమైంది. అతడి చికిత్స కోసం అప్పట్లో వైఎస్సార్సీపీ నేతలు రూ.3 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన లోకేశ్.. ఇప్పుడు టీడీపీ పెద్దల సూచనతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులకు ఉపక్రమించాడు. ‘వారు బాణసంచా తెచ్చి కాల్చమని చెప్పారు. అది కాల్చినందువల్లే అప్పట్లో నా కంటికి గాయమైంది’ అంటూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విచారించాలని మానవ హక్కుల కమిషన్ లక్కిరెడ్డిపల్లె పోలీసులకు సూచించింది. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు కక్ష పూరితంగా 326, 420 సెక్షన్స్, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్రెడ్డి, ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షుడు, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్రెడ్డి సహా 19 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఎవరికీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం సుదర్శన్రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా వారందరినీ అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ప్రమాద సమయంలో శ్రీకాంత్ రెడ్డి వేరే మండలంలో ప్రచారంలో ఉన్నప్పటికీ కేసు నమోదు చేయడం రెడ్బుక్ దుర్మార్గానికి పరాకాష్ట. నిజానికి తనంతట తానే బాణసంచా కాల్చుతూ.. ఆ క్రమంలో అప్పుడు గాయపడి, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని.. దీనిపై పోలీసులు నిజానిజాలు విచారించకుండానే తప్పుడు కేసులు పెట్టడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. -
అరాచక పాలనను అడ్డుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాదికిపైగా టీడీపీ కూటమి సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వైఎస్సార్సీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. గురువారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలసిన వైఎస్సార్ సీపీ బృందం ఈ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిందని.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచి్చంది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నివేదించింది. ఈమేరకు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి,మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ,చిత్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇది నిరంకుశ ప్రభుత్వం: బొత్స సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు బొత్స వెల్లడించారు. ‘ఇవి అప్రజాస్వామికం.. గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించాం. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్కు చెందిన కాన్వాయ్ వాహనాలు కారణం కాదు.. వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ పల్నాడు జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హఠాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన వైఎస్ జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందంటూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలకు పాల్పడుతోందో దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది. ఏదో ఒక విధంగా వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం అవివేకం. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వం వద్ద లేవా? దానికి తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు? పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురు దాడి చేస్తున్నారు. సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే ఇంతకంటే ఎదురు దాడి ఉంటుందా అనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత కల్పిస్తే అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైఎస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు, అందులోని పోలీసులు, రోప్ పారీ్టలు ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం’ అని బొత్స పేర్కొన్నారు. ప్రజలే మీ నార తీస్తారు..! ఈ సందర్భంగా ఓ విలేకరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని బొత్సను కోరగా ఘాటుగా బదులిచ్చారు. ‘పవన్ కళ్యాణ్ ఎవడి నార తీస్తారు..? ఎవరి మక్కెలు ఇరగదీస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పనికిమాలిన మాటలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. ఒక ఎమ్మెల్యేగా జగన్కు భద్రత ఇచ్చామని హోంమంత్రి అనిత చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. తెలివి తక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు.. ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? గతంలో చంద్రబాబు తన పర్యటనల సమయంలో భద్రత కావాలని ఎందుకు అడిగారు?’ అని బొత్స ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్.. ‘ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. ప్రజలకు ఇచి్చన వాగ్దానాలను అమలు చేయలేక దృష్టి మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోంది. ప్రజల తరఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. స్వాతంత్య్రం వచి్చన తరువాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని బొత్స ధ్వజమెత్తారు. -
నకిలీ బంగారంతో ప్రైవేటు బ్యాంకుకు టోకరా 9 మంది అరెస్ట్
నార్పల: మండల కేంద్రంలోని కీర్తన ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం పొందిన మోసగాళ్లను అనంతపురం జిల్లా నార్పల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పట్టుపడిన వారిలో నార్పలకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్, దాదాపీర్, కంసాల మంజునాథ్, షేక్ మహబూబ్ బాషా, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ సాదిక్ వలి, బాబు, షేక్ యూసుఫ్ బాషా ఉన్నారు. వీరు 125.8 గ్రాముల నకిలీ బంగారాన్ని కీర్తన ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో తనఖా పెట్టి ఆ బ్యాంక్ అధికారి మహమ్మద్ షఫీతో కలిసి రూ.9.46 లక్షలు రుణం తీసుకున్నారు.బ్యాంక్ క్లస్టర్ మేనేజర్ కొలంట్ల నాగరాజు ఇటీవల ఆడిటింగ్ చేపట్టగా తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణ కొనసాగుతుండగానే గురువారం మరోసారి అదే తరహాలో మోసం చేయడానికి నిందితులు ప్రయత్నించారు. విషయాన్ని గుర్తించిన మేనేజర్ అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నార్పల క్రాస్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 నకిలీ బంగారు గాజులు, రెండు కడియాలు, మూడు ఉంగరాలు, ఓ ద్విచక్ర వాహనం, షిఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. -
వైజాగ్ టు చైనా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్ వైన్గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి.రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్విసెస్ వద్ద 150 మెట్రిక్ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్ ఇండియా సీఎఫ్టీలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా అమ్యామ్యాలే...! కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది.తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్ హౌస్ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్ నుంచి అనుమతులు పొందుతున్నాయి.తరువాత రేషన్ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్ టెరి్మనల్ ఫ్రైట్ స్టేషన్ల (సీఎఫ్టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు.ల్యాబ్ నివేదిక పేరుతో...! పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. రేషన్ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ నివేదికలు కూడా రేషన్ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం.చైనా డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకే...! వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్ వైన్కు డిమాండ్ ఉంది. చైనీస్ రైస్ వైన్ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి.దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్ వైన్ డిమాండ్కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్ ఇక్కడి రేషన్ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. -
వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: సింగయ్య మృతికి సంబంధించి తమపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా... అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు.కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాబట్టి వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణను సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, చిత్తరవు రఘు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవీ చెల్లవని తెలిపారు.పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని పేర్నొన్నారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తే అభ్యంతరం లేదని, అప్పటివరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ అరెస్ట్ చేస్తారనే ఆందోళన కారణంగానే ఈ పిటిషన్లు దాఖలు చేశారని.. అలాంటప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్ జగన్ తదితరుల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, మధ్యంతర రక్షణ కోరే హక్కు పిటిషనర్లకు ఉందని వివరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తదుపరి విచారణ వరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా మౌఖిక హామీ ఇచ్చేలా ఏజీకి స్పష్టం చేసినా చాలని పేర్కొన్నారు. -
బైపాస్ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంపై నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు తరఫున న్యాయవాది నగేష్రెడ్డి వాదనలు వినిపించారు.అనారోగ్య కారణాలతో పిటిషనర్కు కింది కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. ఈ గడువు గురువారంతో ముగుస్తుందని చెప్పారు.ఈ నెల 25న పీఎస్సార్ ఆంజనేయులుకు బైపాస్ సర్జరీ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పీఎస్సార్ ఆంజనేయులుకు 2 నెలల పాటు మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.మధుసూదన్కు వైద్య పరీక్షలు చేయించి నివేదికివ్వండిఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మధుసూదన్ చెబుతున్న నేపథ్యంలో గాల్బ్లాడర్, కిడ్నీ వ్యాధుల వైద్యులతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి, నివేదికను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించారు. -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్ఫోన్స్ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్ ఫోన్లూ భారత్లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్ హబ్’గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది.ఏటా కొత్త మైలురాళ్లు..మొబైల్ ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. అయితే మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కారణం. 2024–25లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.ఈసీఎంఎస్తో ఊతం..విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం (ఈసీఎంఎస్) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, మల్టీ లేయర్ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం.అసెంబ్లింగ్ను మించితేనే..ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలంటే విడిభాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్ప్లేలు, హై–ఎండ్ బ్యాటరీ ప్యాక్లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్ను సైతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్ చేసున్నారు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవాన్ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. బద్వేల్ మండలం బయనపల్లిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు ల్యాండ్లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఇల్లును ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. -
‘పవన్ ఎవరి నార తీస్తావ్..ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్!’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో గురువారం భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో భద్రతా లోపాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింగయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్ని వివరించారు.అనంతరం, వైఎస్సార్సీపీ శాసన మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్టవ్యతిరేక చర్యలను చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లాం. సత్తెనపల్లిలో ప్రైవేట్ వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ జిల్లా ఎస్పీనే స్టేట్ మెంట్ ఇచ్చారు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు సంబంధం లేదన్నారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటనను చేశారు. కారు డ్రైవర్ , కారులో ఉన్న జగన్తో పాటు మరికొంత మందిపై కేసులు పెట్టారుఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏనాడూ చూడలేదు. చరిత్రలో ఎన్నడూ చూడనట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు. మా నాయకుడికి రక్షణ కల్పించాలి. సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?. నిజంగా ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఘటన జరిగినపుడు ఎవరూ ఎందుకు చూడలేదు.ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది .ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనితకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎవడి నార తీస్తారు.. ఎవరి మక్కెలు ఇరగదీస్తారు.ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. తెలివితక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. బాధ్యతా రాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనల సమయంలో చంద్రబాబు ఎందుకు అడిగారు. జడ్ ప్లస్ ఉన్న వ్యక్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఎందుకు ప్రశ్నించారు -
‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’
విశాఖ: కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాత్ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఆయన విమర్శించారు. ‘ బాబు మోసాలను 6 వారాలు పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తాము.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్తాయి వరకు తెలియజేస్తాము.చంద్రబాబు హామీలను QR కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తాము. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు చంద్రబాబు ఇవ్వద్దంటున్నారు. టిడిపి వాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు అందించారు. గతంలో మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసివేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజలన్న భయం లేదు. ప్రభుత్వ పథకాలు అందిస్తామని గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి గ్యారెంటీ, వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు మోసం చేస్తారని మొదటి నుంచి చెపుతున్నాము. నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నెలకు రూ. 1500, 20 లక్షల ఉద్యోగాలు ఏమి అమలు చేయలేదు. తల్లికి వందనంకు సవా లక్ష ఆంక్షలు పెట్టారు.. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుంధో ఎవరికి తెలియదు. ప్రజల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలు యపడుతున్నారు..టిడిపి నాయకులు మాస్కులు వేసుకొని ప్రజలు దగ్గరకు వెళ్ళాలని చూస్తున్నారు. టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించలేదు. చంద్రబాబు లోకేష్ పెత్తనం ప్రభుత్వంలో కనిపిస్తుంది..‘సన్’ స్ట్రోక్ వలన పవన్న చంద్రబాబు పక్కనపెడుతున్నారు’ అని గుడివాడ అమర్నాత్ విమర్శించారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: బ్యాంక్ రుణాల కోసం ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్ కంపెనీకి బ్యాంక్ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్ల స్కామ్లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’. ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం?ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:స్టాంప్ డ్యూటీ స్కామ్కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక ప్రకటన చేయాలి.‘సిట్’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:కళ్యాణదుర్గంలో స్టాంప్ డ్యూటీ స్కామ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.హైకోర్టు తలుపు తడుతా:పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. -
‘చంద్రబాబు ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రవచనాలు’
సాక్షి, తాడేపల్లి: ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడుగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు.. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. అప్పట్లోని ఎమర్జెన్సీలాగే ఏపీలో ఇప్పటి పరిస్థితి ఉంది. అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించలేదు.. అంతే తేడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక పిచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?. పోలీసులు పోలీసు చట్టాన్ని అనుసరిస్తున్నారా?. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో వేలాది తప్పుడు కేసులు, చిత్రహింసలకు పాల్పడుతున్నారు’’ అని అప్పలరాజు మండిపడ్డారు.‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టటం ఎమర్జన్సీ కిందకు రాదా?. లోకేష్ చేతిలో అధికారాన్ని పెట్టి, నీఇష్టం వచ్చినట్టు చేయమని సలహా ఇచ్చారు, అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జగన్ని భూతం అంటూ ఫిక్కీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. అసలు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి పారిపోయేలా చేసిందెవరు?. తమ పరిశ్రమకు రక్షణ కల్పించమని హైకోర్టుకు వెళ్లారంటే ఎవరి పాలనలో అరాచకం జరుగుతున్నట్టు?...జిందాల్ను రాష్ట్రం నుండి తరిమేసిందెవరు?. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆదినారాయణ రెడ్డి దాడులు చేయిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది?. పల్నాడులో భవ్య సిమెంట్స్పై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దాడి చేయిస్తే ఫ్యాక్టరీకి తాళం వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ మీద లంచాల కోసం వేధించలేదా?. మై హోం సిమెంట్స్ గనులపై ఆంక్షలు పెట్టి వేధించిందెవరు?. చికెన్ టాక్స్ వేసి, కేజీకి రూ.10లు వసూలు చేస్తున్నదెవరు?, కృష్ణపట్నం పోర్టు మీద దాడులకు దిగింది టీడీపీ నేతలు కాదా?’’ అంటూ అప్పలరాజు ప్రశ్నలు సంధించారు...ఇలాంటి దాడులు చేస్తూ పారిశ్రామిక వేత్తలను తరిమేస్తున్నది చంద్రబాబు ముఠానే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ని భూతం అంటూ ఎలా మాట్లాడతారు?. యోగాంధ్ర విఫలం కావడంతో జగన్ పల్నాడు పర్యటనపై ఆరోపణలు చేశారు. ఒక మార్ఫింగ్ వీడియోని తెర మీదకు తెచ్చి ఏకంగా జగన్పై కేసు నమోదు చేశారు. చివరికి కారులో కూర్చున్నారంటూ మిగతా వారి మీద కూడా కేసు పెట్టటం ఏంటి?. జగన్ స్పీడుగా వెళ్లి జనాన్ని గుద్దించమని డ్రైవర్కి చెప్పినట్టు దిక్కుమాలిన రిపోర్టు రాశారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొని వృద్దుడు చనిపోతే డ్రైవర్ మీదనే ఎందుకు కేసు పెట్టారు?. టీడీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు పెట్టలేదు?..2015లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఒక మహిళ చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. 2016లో విజయవాడలో మళ్లీ చంద్రబాబు కారు ఢీకొని ఒక యువకుడు చనిపోతే చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు?. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కారు ఢీకొని ఒకరు చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వారి సొంత సర్వేలో ఈ వ్యతిరేకత తెలియడంతో డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టారు. మేధావులు సైతం ఈ పాలనను మెచ్చుకోవటం లేదు. పెద్ద పెద్ద నియంతలే రాజ్యాలను కోల్పోయిన సంగతి తెలుసుకుంటే మంచిది’’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. -
ఏఐ కాదు.. ఆ సిలిండర్ పేలింది కాకినాడలోనే!
కాకినాడ జిల్లా: గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది ఫేక్ అని, ఏఐ ఆధారిత వీడియో అని బాగా ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం యల్లయ్యపేట శివారులో జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఓ ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకైంది. దీంతో ఆ మహిళ పైప్తోపాటు సిలిండర్ను హాలులోకి తీసుకువచ్చింది. కాసేపటికి మహిళతోపాటు మరో వ్యక్తి లోపలికి వచ్చి సిలిండర్ను తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 18న ఘటన జరగగా.. అందుకు సంబంధించిన ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. Be careful how you handle your gas cylinders. You are safer having them outside. If the doors and windows were shut the explosion 💥 would have consumed them pic.twitter.com/RvRGQ92kgt— IPOB Zürich (@IpobZurich) June 22, 2025 -
అతడు-అతడు మధ్యలో ఆమె!
మర్రిపూడి, ఒంగోలు: స్థానిక విద్యాశాఖ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ కోలా రాజశేఖర్ (35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 18న ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్నాథం జయసింహగా కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వత్ వెల్లడించారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. రాజశేఖర్ గే. ఆయనకు పొదిలికి చెందిన జగన్నాథం జయసింహతో ఏడాదిన్నర నుంచి స్వలింగ సంపర్క సంబంధం ఉంది. తొలుత ఎవరికీ తెలియకుండా ఇద్దరూ సంబంధం కొనసాగించారు. కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన జయసింహ ఒంగోలులో ఫిషరీస్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ చెడు అలవాట్లకు బానిసై ఉద్యోగం మానేశాడు. చెడుతిరుగుళ్లు తిరుగుతూ దర్శికి చెందిన వివాహిత పల్లా అనూషాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది రాజశేఖర్కు నచ్చలేదు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రాజశేఖర్ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన జయసింహ తనతో చనువుగా మెలుగుతున్న అనూషాతో కలిసి హత్యకు పథకం రచించాడు. చివరిగా ఒకసారి తనతో శారీరకంగా కలిస్తే వాట్సప్ గ్రూపులో అసభ్యకర పోస్టులు పెట్టనని జయసింహతో రాజశేఖర్ చెప్పాడు. ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం ఇంటి నుంచి బైక్పై రాజశేఖర్ బయటకు వచ్చాడు. అనంతరం బస్టాండ్ సెంటర్లో అల్పాహారం పార్శిల్ చేయించుకుని శ్రీలక్ష్మీనృంహస్వామి కొండ వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ జయసింహ, అనూష ఉన్నారు. కాసేపటికే వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు చోటుచేసుకుంది. రాజశేఖర్ను కింద పడేసి అతి కిరాతకంగా కారుతో ఢీకొట్టి చంపారు. ఈ దాడిలో రాజశేఖర్ మర్మాయవాలు తెగిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హంతకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతుడి ఫోన్కు చివరిగా వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను ఉపయోగించి కేసును ఛేదించారు. హంతకులను పొదిలి కొండ సమీపంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి ఎస్సై రమేష్బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 -
బీటెక్ రవి బంధువు వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు. ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్ పరిధిలో ఉన్న జైస్వాల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్ కంపెనీ మేనేజర్ ఖాన్పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
తిరుమల: మరో అపచారం
కూటమి పాలనలో వరస ఆలయ అపచారాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే సంస్థ ఈ యాప్ను రూపొందించింది. వర్చువల్ ఎక్స్పీరియెన్స్తో ఈ యాప్ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు.. ఇందులో ఆలయ మహ ద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కనిపిస్తున్నాయి. ఈ గేమింగ్ యాప్పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ తప్పనిసరైంది. ఈ యాప్తో రోబ్లెక్స్ సంస్థ బారీ ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. -
అరెరె.. తమ్ముడి పనేనా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్ వద్ద గత సోమవారం బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు కూటమి నాయకులు రాజకీయాలు అద్దేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తమ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయవద్దని జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పిల్లలను బడులకు కూడా తల్లిదండ్రులు పంపడం లేదు. వారి సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందిలేదు. ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేస్తున్న వారు ఈ నెల 23న పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవంగా జరిగింది ఇదీ.. దీన్ని రాజకీయం చేసి, మాజీ ఎమ్మెల్యే జోగారావునే పిల్లలను ధర్నాకు తీసుకొచ్చినట్లు కూటమి నాయకులు ప్రచారానికి ఎత్తుకున్నారు. మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ఎవరు? జరిగిన ఘటనను పూర్తిగా వక్రీకరిస్తూ.. మాజీ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేస్తూ.. పాఠశాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ఈ శ్యామ్ అనే వ్యక్తి పక్కా టీడీపీ కార్యకర్త. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడు. సోషల్ మీడియా ఖాతాలనూ అతనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు.. మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ పలు సందర్భాల్లో ఫొటోలు దిగాడు. ఒక టీడీపీ కార్యకర్త.. వాస్తవాలను వక్రీకరిస్తూ, పోస్టులు పెట్టగానే చర్యలకు ఆదేశాలివ్వడం, నిర్ధారణ చేసేయడం గమనార్హం. టీడీపీ వారు ఏది చెబితే అదే రాజ్యాంగమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.దయచేసి రాజకీయాలు చేయొద్దు.. మా పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే గత సోమవారం ధర్నాకు వచ్చాం. ఇందులో ఎవరి ప్రమేయమూ, ఒత్తిడి లేదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. వీలైతే పాఠశాలను తరలించకుండా చూడండి. – సంతో‹Ù, విద్యార్థి తండ్రిమంత్రిని మభ్యపెట్టిన ఎమ్మెల్యే? తమను ఎవరూ పిలవలేదని.. పిల్లల పాఠశాల సమస్యపై తామే స్వచ్ఛందంగా వచ్చామని ఇప్పటికీ సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆటో ప్రమాద ఘటన దురదృష్టవశాత్తు జరిగిందే గానీ.. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహానికి పోయి, స్వయానా మంత్రి లోకేశ్ను మభ్యపెట్టి, సామాజిక మాధ్యమాల్లో తమ అనుచరునితో పోస్టులు పెట్టించి, డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీయడం విమర్శలకు తావిస్తోంది. తన అనుచరుని నిర్వాకాన్ని దాచిపెట్టి.. హడావిడిగా స్థానిక ఎమ్మెల్యే సైతం.. మాజీ ఎమ్మెల్యేనే నిందిస్తూ, ప్రకటన జారీ చేయడం గమనార్హం.ఏం జరుగుతోంది... ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అంటే.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ పోలీసులు వివరాలేవీ సేకరించలేదా, లేకుంటే ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రోజు కూడా పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల భవిష్యత్తుపైనా రాజకీయాలకు ముడిపెట్టి, తమ స్వప్రయోజనాల కోసం కూటమి నాయ కులు చేస్తున్న ప్రయత్నాలపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫోటో పెట్టి.. మేకులు కొట్టి భయంకరంగా క్షుద్ర పూజలు
మడకశిర: స్థానిక 3వ వార్డులోని శివపురంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. శివాపురం ప్రాంతంలో నివాసముంటున్న బోయ భారతి బతుకు తెరువు కోసం కిరాణా కొట్టు ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో భారతి అంటే గిట్టని వారు ఆమె ఫొటో పెట్టి పసుపు కుంకుమ, కోడి గుడ్లు, నిమ్మకాయలతో మంగళవారం రాత్రి క్షుద్ర ప్రయోగం చేశారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారు అక్కడి దృశ్యాలు చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనపై పోలీసులకు బాధితురాలు భారతి ఫిర్యాదు చేశారు. -
పవన్ అన్నా.. కాపాడు అన్నా!
సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ఫోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్ఫోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, విడదల రజిని, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. తన పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి అని పేర్కొన్నారు. -
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్ను ఎస్ఐ పలుసార్లు పోలీస్స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ కేసు
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేయగా.. ఇవాళ అది విచారణకు రానుంది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలిమరోవైపు ఇదే వ్యవహారంపై తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు.. మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు అన్నీ ఇవాళే విచారణకు రానున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని #apsdma ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/b65VwqYbHE— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 25, 2025ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు.. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.What a Day & Night (Yesterday) in TG 🌧️🌧️Adilabad, Karimnagar, Siddipet, Nizamabad, Nirmal, Medak, Warangal, Hanumakonda, Sircilla districts was observed Heavy to Very Heavy Rains. Still Adilabad district continuing Rains‼️Hyd got light rains at few places in the Overnight— Weatherman Karthikk (@telangana_rains) June 26, 2025 -
ధర్మవరంలో బీజేపీ నాయకుల దాష్టీకం
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికార అండతో బీజేపీ నాయకులు అమాయకులపై దౌర్జన్యం చేయడం, దాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా, అతని అనుచరులు రాత్రి వేళ సమయం ముగిశాక ఎగ్జిబిషన్లోకి అనుమతించాలంటూ దౌర్జన్యం చేసి.. ఆపై నిర్వాహకులతో పాటు కార్మికులపై దాడికి దిగారు. అమాయకులైన ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై చేతికందిన వస్తువులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. దాడికి గురైన బాధితులు న్యాయం చేయాలంటూ పట్టణ పోలీస్స్టేషన్కు వెళితే ఫిర్యాదు తీసుకుని చోద్యం చూడటం పోలీసుల వంతైంది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలో బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా బంధువులను వెంట పెట్టుకుని సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ధర్మవరం–అనంతపురం రోడ్డులోని ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లారు. సమయం ముగిసిందని, అనుమతి లేదని నిర్వాహకులు చెప్పారు. దీంతో షాహీన్షా ‘ఏరా.. మేము బీజేపీ నాయకులం. మాకే అనుమతి లేదంటావా?’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన ఎగ్జిబిషన్ నిర్వాహకులతో పాటు కార్మికులు చేసేది లేక లోపలికి అనుమతించారు. వారు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతుండగా రెండు నిమిషాల పాటు విద్యుత్ అంతరాయంతో ఆగిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు ‘మేము తిరుగుతుంటే అదే పనిగా ఆపేస్తావా?’ అంటూ చేతికందిన వస్తువులతో ఎగ్జిబిషన్లో పని చేసే కార్మికును, నిర్వాహకుడి భార్య ఎల్లమ్మను దారుణంగా కొట్టారు. బాధితులు ఎల్లమ్మ, జశ్వంత్, రమేష్ భానులకు రక్త గాయాలయ్యాయి. దీంతో వారు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చోద్యం చూసినట్లు బాధితులు వాపోతున్నారు. -
క్యాంపస్లో కొలువుల్లేవు
ఆంధ్రా యూనివర్సిటీలో నారాయణ (పేరు మార్చాం) అనే విద్యార్థి 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ (సీఎస్) పూర్తి చేశాడు. ప్రముఖ కంపెనీలేవీ ప్లేస్మెంట్స్ కోసం రాకపోవడంతో గాయత్రీ కాలేజీలో జరిగే ఆఫ్–క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లి టీసీఎస్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఒక్క నారాయణే కాదు 20 మంది ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ అమ్మాయి పేరు రేపాక ఈశ్వరి. 2022–23 విద్యా సంవత్సరంలో ఏయూలో సీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మాయికి అట్లాసియన్ కంపెనీలో రూ.84.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆఫర్ లెటర్ను అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అందించారు. ఆ ఏడాది ఈ అమ్మాయికే కాదు 1,001 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆఫర్ లెటర్స్ అందించారు. 2023 మే 1వ తేదీన బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘అచీవర్స్ డే’ ఘనంగా నిర్వహించి 1,001 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ను అందించారు. ఆ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.84.5 లక్షలు!2025లో ఏయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో పట్టుమని 20 శాతం మందికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేని పరిస్థితి. ఆఫ్–క్యాంపస్లో గాయత్రీ కాలేజీకి వెళ్లి అక్కడ సెలక్షన్స్లో 20 మంది ఏయూ విద్యార్థులు టీసీఎస్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.12 లక్షలు! ఇదీ గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్కు... కూటమి ప్రభుత్వంలో ఏయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్కు మధ్య ఉన్న తేడా. 20 లక్షల ఉద్యోగాల పేరుతో...! వాస్తవానికి ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని... లేనిపక్షంలో నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి ఏయూలో ఇంజినీరింగ్ సీటు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకే సాధ్యమవుతుంది. అటువంటి విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదు. కూటమి ప్రభుత్వం క్యాంపస్ ప్లేస్మెంట్స్పై కనీస శ్రద్ధ వహించక పోవడంతో వేరే ప్రాంతాలకు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే...! వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సంస్కరణలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏయూలో గణనీయ అభివృద్ధి జరిగింది. నూతన పోకడలకు అనుగుణంగా ఏయూలో కొంగొత్త మార్పులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్ను ఏర్పాటు చేశారు. పేటెంట్ల కోసం ఏకంగా వందకుపైగా దరఖాస్తుల చేయడం ద్వారా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శకంగా నిలిచింది. మేథో సంపత్తి హక్కులను (పేటెంట్స్) పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేథో సంపత్తి హక్కుల కేంద్రం (ఐపీటీ)ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి 2020 సెపె్టంబరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా వందకిపైగా దరఖాస్తులను పంపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఏయూ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిందనే రీతిలో ప్రచారం చేస్తూ... విచారణ పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ కంపెనీలను పిలిచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ను నిర్వహించడం లేదు. -
డిగ్రీ ప్రవేశాలపై గందరగోళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. జూన్ నెల ముగిసిపోతున్నా ప్రవేశాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మధ్య కొరవడిన సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి అకడమిక్ వ్యవహారాల్లో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలి పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిల్లో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువే! కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో సమస్య ఎంతకీ తెగకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు ముగింపు దశలో ఉండగా ఈ నెలాఖరు నుంచి తొలి ఏడాది తరగతులను ప్రారంభించనుంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఏపీలో ప్రవేశాల ఊసే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. తెలంగాణాలో ‘దోస్త్’ పోర్టల్ ద్వారా ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు చేపడితే.. ఏపీ తిరోగమనంలో ఆన్లైన్ ప్రవేశాల రద్దుకు ముందుకెళ్తోంది. ఉన్నత విద్యాశాఖలో బహిరంగంగా ఇంత జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ తన శాఖను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అభిప్రాయ సేకరణలో తీవ్ర జాప్యం కూటమి సర్కారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపై ఆది నుంచి విషం కక్కుతూనే ఉంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ మేజర్ను తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సర్కారు ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ డ్యూయల్ మేజర్ విధానాన్ని సిఫారసు చేసింది. నెల రోజుల కిందట ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చింది. కళాశాలల నుంచి కోర్సు కన్వర్షన్ కోసం దరఖాస్తులనూ ఆహ్వానించింది. అయితే, డ్యూయల్ మేజర్పై ఉన్నత విద్యాశాఖ నోట్ రూపంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి ఇప్పటికీ అతీగతీ లేదు. ఇప్పుడు, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డిగ్రీ కళాశాలలకు వెళ్లి విద్యార్థులు, లెక్చరర్ల నుంచి అభిప్రాయాలు సేకరించడం చర్చనీయాంశమైంది. కమిటీ సిఫారసులు చేసిన ఇన్ని రోజుల తర్వాత అభిప్రాయ సేకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలోని ట్రిపుల్ మేజర్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ మేజర్ విధానాన్ని రద్దు చేసి డ్యూయల్ మేజర్ను అమలు చేస్తే.. ఏపీలో డిగ్రీ చదివిన విద్యార్థులు మూడు రకాల డిగ్రీ పట్టాలతో కనిపిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుందని కొందరు అధికారులు వాదిస్తున్నారు. అందుకే సింగిల్ మేజర్ విధానంలో పొరపాట్లను సవరించి కొనసాగించాలని చెబుతున్నారు. అఫిలియేషన్ ప్రాసెస్ ఎక్కడ?విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతంలో ఈ ప్రక్రియ ఉచితమే. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సాంకేతిక విభాగం డబ్బులు ఇస్తే తప్ప చేయబోమని తెగేసి చెబుతోంది. ఒక్కో కళాశాల రూ.3,500 చెల్లించాల్సి ఉంది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా.. అన్ని కళాశాలలు వర్సిటీల నుంచి అఫిలియేషన్ పొందాల్సి ఉండగా.. ప్రక్రియ నిధులతో ముడిపడి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు కళాశాలలను సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్కు కన్వర్ట్ చేయడానికి సమయం పడుతుంది. వీటన్నింటి ఫలితం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.కళాశాలలకు నోటీసులు..ప్రస్తుతం 1300 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో గత మూడేళ్లలో 270 కళాశాలల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉన్నాయి. సున్నా ప్రవేశాలు ఉన్నవి 3 కళాశాలలు ఉన్నాయి. వీటికి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక కమిటీ ఎదుట ఆయా కళాశాలలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిస్తే తప్ప ఆ కళాశాలలకు అనుమతులు విషయం తేలదు. వీటితోపాటు కొత్తగా నియోజకవర్గ, మండల హెడ్ క్వార్టర్లో కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. డిగ్రీ విద్యలో 4.55 లక్షల సీట్లు ఉంటే పట్టుమని 39 శాతం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. ఇలాంటి తరుణంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రియుడితో భర్తను చంపించిన భార్య
రాప్తాడు రూరల్ : 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. రెండునెలల క్రితం పరిచయమైన ప్రియుడిపై ఓ మహిళ మోజు పెంచుకుంది. అది చివరకు భర్తను అంతమొందించేందుకు దారితీసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు. వివరాలివీ..అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివకాలనీకి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్బాబు (43), అనిత దంపతులు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో సురేష్బాబు ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. భార్య అదే ప్రాంతంలోని ఓ హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనితకు రెండునెలల క్రితం ఆటోలో పండ్లు అమ్ముకునే బాబాఫకృద్దీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అనుమానం రావడంతో..భార్య వ్యవహారశైలిపై ఇటీవల సురేశ్బాబుకు అనుమానం వచ్చింది. దీంతో మద్యం మత్తులో భార్యను వేధించడం ప్రారంభించాడు. తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రియుడికి అనిత వివరించింది. భర్తను కడతేరిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి భర్త హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో సురేశ్బాబు మంగళవారం రాత్రి 11 గంటలకు హోటల్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అక్కంపల్లి–రాచానపల్లి మధ్య మాటువేసిన బాబాఫకృద్దీన్ ఖాళీ సీసాను సురేశ్బాబుపై విసిరాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిన సురేశ్పై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఓ పెద్ద బండరాయితో హతమార్చి ఉడాయించాడు. భార్య తీరుపై అనుమానంతో..ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హతుడి భార్య అనితతో మాట్లాడారు. తన భర్త చాలా మంచివాడని ఎవరితోనూ గొడవల్లేవని ఎందుకు హత్యచేశారో తనకు తెలీదంటూ వాపోయింది. అయితే, ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నడవడికపై ఆరా తీశారు. ఆ తర్వాత బాబాఫకృద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
దొరికినంత దోచెయ్.. నా ‘సోమి’రంగా!
సాక్షి, టాస్క్పోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఖనిజ సంపద దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. పొదలకూరు మండలం డేగపూడిలోని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఖరీదైన మైకా క్వార్ట్జ్, ఫల్సపర్ మెటల్ను తవ్వకాలు చేస్తూ అక్రమంగా తరిలిస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సహకారంతో ఆయన అనుచరులు అక్రమ దందా సాగిస్తున్నారు. సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది. సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది. కాకాణిని అక్రమ కేసులతో జైల్లో పెట్టి.. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్రెడ్డి కూటమి ప్రభుత్వ ఏర్పాటైన రోజు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీని జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వెలుగులోకి తెచ్చేవారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతం నుంచి లైవ్ ఫొటోలు తెప్పించి మీడియా ద్వారా బయటపెట్టేవారు. అటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు, దోపిడీలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు.తాటిపర్తిలో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్లో కాకాణి పాత్ర ఉందని, అక్కడ జిలెటిన్ స్టిక్స్ పేల్చి మైనింగ్ చేశారని, గిరిజనులను బెదిరించారంటూ తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అంతేకాదు మరో ఏడు అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ సర్వేపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మూడు మైన్స్లో అక్రమ తవ్వకాలుడేగపూడిలో కండ్లేరు ఏటి కాలువను ఆనుకుని ప్రభుత్వ పోరంబోకు భూముల్లోని మూడు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. భారీ యంత్రాలతో రెండు నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం యంత్రాలతో ఖనిజాన్ని వెలికితీసి రాత్రి వేళ సైదాపురానికి రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగే దోపిడీ కావడంతో స్థానికులు మిన్నకుండిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తుండడంతో గ్రామస్తులు ఎదురు చెప్పలేక పోతున్నారు. పట్టించుకోని అధికారులు డేగపూడిలో కొంతకాలంగా మైకా క్వార్ట్జ్, ఫల్సపర్ ఖనిజాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. -
మా ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడినవుతున్నా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల దందాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే థామస్ అనుచరుడితో ఓ క్వారీ వ్యాపారి మాట్లాడిన ఆడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్వేటినగరం మండలంలోని సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో.. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి క్వారీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే థామస్, ఆయన ప్రధాన అనుచరులు క్వారీ నిర్వాహణకు కప్పం కట్టాలని హుకుం జారీ చేశారు. ఇందుకు వేంకటేశ్వరరెడ్డి అంగీకరించక పోవడంతో రాళ్లు తరలిస్తున్న లారీలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు ఎమ్మెల్యేను సంప్రదించగా.. తన అనుచరుడు హరీష్ యాదవ్తో మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం. దీంతో హరీష్ యాదవ్ను కలసి మాట్లాడి రూ.50 లక్షలు ఇచ్చారు. అయినా పనులు పాగనీయలేదు. ఇలా అడ్డుకోవడం బాగోలేదని వారిద్దరి మధ్య చర్చ నడిచింది. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే వెంకటేశ్వరరెడ్డి ఎవరో.. ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదని హరీష్ యాదవ్ చెబుతున్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. వెంకటేశ్వరరెడ్డి: సార్ మిమ్మల్ని నమ్మి మీ చేతికి రూ.50 లక్షలు ఇచ్చాను. నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. హరీష్ యాదవ్: మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. నేను అన్నీ తెలుసుకుని మీకు కాల్ చేస్తా. వెంకటేశ్వరరెడ్డి: అది కాదు సార్.. ఎమ్మెల్యే వద్ద నుంచే ప్రాబ్లం..రూ.50 లక్షలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నా. అనారోగ్యంతో బాధ పడుతున్నాను. హరీష్యాదవ్: నేను చెప్తాను అన్నా.. మాట్లాడతాను. వెంకటేశ్వరరెడ్డి: కొద్దిగా మాట్లాడు హరీష్. ఎందుకంటే రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను హరీష్. ఎందుకంటే నీవు ఎదో పొలిటికల్ నుంచి వచ్చావని నమ్మకంతో ఇచ్చాను. హరీష్ యాదవ్: మెటీరియల్ చేరాల్సిన చోటుకు చేరింది. వెంకటేశ్వరరెడ్డి : నేను ఎవరితో మాట్లాడేది చెప్పు. నాకు నీవే.. ఎమ్మెల్యే కూడా హరీష్తో మాట్లాడు అని చెప్పారు కదా. హరీష్ యాదవ్: నేను మాట్లాడుతాను.. ఓకే నేను సార్తో మాట్లాడుతాను. చిన్న డిస్టబెన్స్తో ఉన్నాడు. నిన్ను కూడా మాట్లాడిస్తాను. డబ్బులు విషయమైతే కాదు. రెండు మూడు చోట్ల సమస్యలు. నిన్న వచి్చనా మాట్లాడలేకపోయాను. డబ్బులు విషయమైతే కాదు.. చాలా బిజీగా ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి: కొంచం మాట్లాడండి సార్.. ఇక్కడ మీరే నాకు.. ప్లీజ్.. హరీష్యాదవ్: నేను ముందున్నాను కాబట్టి ఎమ్మెల్యేకి క్లారిటీగా చెప్పాలి వెంకటేశ్వరరెడ్డి: మీరు ముందున్నారనేగా మీ వద్దకు అనేకసార్లు తిరుగుతున్నా సార్ హరీష్యాదవ్: శనివారం, ఆదివారంలో కలసి మాట్లాడతాను.. మీకు క్లారటీ ఇస్తాను వెంకటేశ్వరరెడ్డి.. నేను మీకు చేస్తాను సార్, మీకు ఎమీ కాదు. వెంకటేశ్వరరెడ్డి: నాకు ఇబ్బంది లేకుండా చూడండి. నేను దీనిపై ఆధారపడి ఉన్నాను ప్లీజ్ సార్. ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ -
బదిలీల్లో బ‘లిస్టులు’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలదే ఇష్టారాజ్యమైంది. ఉద్యోగులను కూటమి నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నారు. బదిలీ కోసం తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగినంత డబ్బు ఇస్తేనే బదిలీ అని తెగేసి చెబుతున్నారు. దీనికితోడు బదిలీకి ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, తమకు కనీస గౌరవం ఉండడం లేదని ఆక్రోశిస్తున్నారు. తప్పక కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకు ఎమ్మెల్యేలు ఏ సచివాలయంలో ఏ కేటగిరి ఉద్యోగి ఎవరు ఉండాలన్నది సూచిస్తూ చాంతాడంత జాబితాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో కూడా కొనసాగుతున్న పశ్చిమ గోదావరి జిలా్లకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్క సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకే 40 మంది పేర్లను సూచిస్తూ ఆ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేషనలైజేషన్తో ఉద్యోగుల సంఖ్య పరిమితం చేయడం వల్లే.. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10 నుంచి 11 మంది చొప్పున ఉద్యోగులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఇటీవల రేషనలైజేషన్ పేరుతో సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6 నుంచి 8 మంది చొప్పున ఉద్యోగులను శాశ్వతంగా కొనసాగించేలా.. ఏ సచివాలయంలో ఏ కేటగిరి ఉద్యోగులు పనిచేయాలో నిర్ణయించింది. దీంతో సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. రేషనలైజేషన్తో శాశ్వతంగా ఉండే పోస్టులకు తొలుత బదిలీలు చేపట్టి, ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తదుపరి ఆదేశాల మేరకు సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. శాశ్వతంగా కొనసాగే పోస్టులకు డిమాండ్ పెరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 72 వేల మంది తప్పనిసరిగా బదిలీ కానుండడంతో వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని అధికార పార్టీ నేతలు పైరవీలకు తెరలేపారని, బేరసారాలు సాగుతున్నాయని సమాచారం. సచివాలయ ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధికారపార్టీ నేతలకు రూ.లక్షల్లో ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ పారదర్శకత భేష్ గతంలో ఇలాంటి పైరవీలు చూడలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టింది. ఎలాంటి పైరవీలకు, అక్రమాలకు తావులేకుండా తాము ఉద్యోగాలు పొందామని ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బదిలీలకు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ పారదర్శకత భేష్ అని పేర్కొంటున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో కొత్త ట్విస్టు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్ల బదిలీపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆఖరి నిమిషంలో కొత్త ట్విస్టు ఇచ్చాయి. ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం గ్రేడ్ –2) గ్రామ, వార్డు సచివాలయ శాఖ రేషనలైజేషన్ ప్రక్రియ పరిధిలోకి రారంటూ ఏపీ ఈపీడీఎస్ఎల్ సీజీఎం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, గ్రామ వార్డు సచివాలయాల శాఖ చేపట్టిన రేషనలైజేషన్లో ఎనర్జీ అసిస్టెంట్లనూ పరిగణనలోకి తీసుకుని ఒక్కో సచివాలయంలో ఆరు నుంచి 8 మంది చొప్పున ఉద్యోగులను శాశ్వతంగా ఉండేలా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిస్కంలు జారీ చేసిన ఆదేశాలతో బదిలీ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ డిస్కంల ఆదేశాలు తమ దృష్టికి రాలేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ జీఓ మేరకు రేషనలైజేషన్, బదిలీల ప్రక్రియ కొనసాగిస్తామని, ఇతర శాఖల అంతర్గత మెమోలు, సర్క్యులర్ల విషయం ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ డిస్కంల తరహాలోనే వీఆర్వోల విషయంలో రేషనలైజేషన్ పేరుతో ఎలాంటి రీ–ఆర్గనైజ్ ప్రక్రియ చేపట్టవద్దని, అలా చేస్తే రీసర్వే వంటి పనులకు ఆటంకం కలుగుతుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సూచిస్తూ గత మే 19న రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సీసీఎల్ఏ జయలక్ష్మి యూవో నోట్ను జారీ చేశారు. తాజాగా విద్యుత్ డిస్కంల ఆదేశాల నేపథ్యంలో సీసీఎల్ఏ జారీ చేసిన నోట్నూ వీఆర్వోలు సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
పీ–4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి
సాక్షి, అమరావతి : సమాజంలో చాలామంది పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని.. అలాంటి వారికి పీ–4ను వేదికగా మార్చి మార్గదర్శకుల సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన పీ–4 విధానం అమలుపై ముఖ్యమంత్రి బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ను సిద్ధంచేసిందని చెప్పారు. బంగారు కుటుంబంగా ఎంపికైన వారి జీవిత ప్రమాణాలపై ఎప్పటికప్పుడు సర్వే చేయాలని సూచించారు. మార్గదర్శకుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్–100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సీఓఓలు, సీఎఫ్ఓ, ఎండీలు, చైర్మన్లతో నేరుగా తానే మాట్లాడి పిలుపునిస్తానన్నారు. దీంతోపాటు.. దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శకులుగా ముందుకొచ్చేందుకు ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పారు. పీ–4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా వారిలో ఇప్పటివరకు 87,395 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. పెట్టుబడులకు ప్రోత్సాహకాలు.. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం ప్రకటించారు. వందేళ్లలో తిరుగు లేని రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. రూ.500 నోటు రద్దు చేసి డిజిటల్ మనీని ప్రోత్సహించాలన్నారు. గత ప్రభుత్వం మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పెట్టుబడిదారులు గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనను మర్చిపోవాలని.. మళ్లీ ఆ ప్రభుత్వం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నానని సీఎం చెప్పారు. ఐటీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రతినిధులను ఆహ్వానించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నాస్కామ్ ప్రతిని«దులు సీఎంను కలిసి బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూ్యరెన్స్) రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించారు. స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్గా స్మార్ట్ ఏపీ మార్పు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్గా మార్చి సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి పాలన కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో పలువురు మంత్రులు, పలు శాఖల అధికారులతో పాటు ప్రముఖ కార్పొరేట్లు, ట్రస్టులు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు, ఎన్జీఓల నుంచి సభ్యులను నామినేట్ చేస్తారు. అలాగే, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులను, ప్రముఖ వ్యక్తులనూ నామినేట్ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఎంపీలు, అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణి పేట (విశాఖ): బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. -
నిబంధనలు ఓడి.. అప్పుల దాడి
సాక్షి, అమరావతి : రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కోర్టు విచారణను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా రెండవ విడత ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు జారీ చేసి రూ.5,526 కోట్ల అప్పు చేసింది. మొదటి విడతగా మే 8వ తేదీన రూ.3,489 కోట్ల బాండ్లు జారీ చేసింది. అన్ని నిబంధనలను కాలరాసి బాండ్ల జారీతో మొత్తంగా రూ.9,015 కోట్ల అప్పు తెచ్చుకోగలిగింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసిన అప్పు రూ.1,66,827 కోట్లు. సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల సృష్టిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఏపీఎండీసీ ద్వారా జారీ చేసిన ఎన్సీడీ బాండ్ల విషయంలో చంద్రబాబు ఆర్థిక సూత్రాలన్నింటినీ తుంగలో తొక్కారు. అప్పు తెచ్చుకోవడమే లక్ష్యమైనట్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తప్పుడు సంప్రదాయానికి నాంది పలికారు. అప్పులు చేయడం కోసం చంద్రబాబు చూపిన చెడు మార్గాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పెను ప్రమాదంలో పడుతుందని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు. ఆర్థిక నియమాలకు పాతరఅప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారతాననే రీతిలో చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయించారు. రూ.9 వేల కోట్లు సమీకరించేందుకు ఆర్థిక నియమాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించారు. ప్రైవేటు వ్యక్తులకు ఖజానాను అప్పగించడాన్ని బట్టి చంద్రబాబు ఏ స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (1) ప్రకారం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టకూడదు. అయినా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ చంద్రబాబు ఈ అప్పు తీసుకొచ్చారు. ఇందుకోసం ఏపీఎండీసీకి చెందిన రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టారు. తద్వారా ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను పెట్టుబడిదారులకు రాసిచ్చారు. ప్రత్యేక ప్రయోజనాలు కల్పించినా ఎక్కువ వడ్డీ రేటు లక్షల కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టిందేకాక, రాష్ట్ర ఖజానాపై నేరుగా హక్కులు ఇచ్చి కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా బాండ్లు కొనుగోలు చేసిన వారికి 9.30 శాతం వడ్డీ రేటు ఇచ్చారు. ఇది మరింత అన్యాయంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ లోన్ (ఎస్డీఎల్)ను 6.71 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటుండగా, పలు ప్రత్యేక వెసులుబాట్లు, హక్కులు ఇచ్చి కూడా 9.30 శాతం వడ్డీ ఇవ్వడం వెనుక ఏదో జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, కేవలం బాండ్లు కొనుగోలు చేసే వారికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కల్పించడమే ప్రధానమన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చినా పర్వాలేదని, ప్రభుత్వ ఖజానా తన సొంత బ్యాంకు అన్నట్లుగా దానిపై బాండ్లు కొనుగోలుదారులకు హక్కులిచ్చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసి రూ.9 వేల కోట్ల అప్పను సమీకరించుకున్నారు. కోర్టులు కూడా తనను ఏమీ చేయలేవనే, తాను కోర్టులకు అతీతుడనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఏడాదిలో రూ.1,66,827 కోట్ల అప్పుతో కొత్త రికార్డు ఏడాదిలోనే రూ.1,66,827 కోట్ల అప్పు చేసి చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే నానా రాద్ధాంతం చేసిన ఇదే బాబు.. ఇప్పుడు అప్పుల చరిత్రలో కొత్త శకాన్ని లిఖిస్తున్నారు. ప్రతి వారం అప్పుల కోసం ఆర్బీఐ ఎదుట మోకరిల్లుతున్నారు. అదికాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ (బడ్జెట్ వెలుపల రుణాలు) ద్వారా ఏపీఎండీసీ, మార్క్ఫెడ్, ఏపీపీఎఫ్సీ వంటి సంస్థలను దివాలా తీయిస్తున్నారు. ఇతర విదేశీ ఆరి్థక సంస్థల నుంచి అప్పులు తెస్తున్నారు. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ అప్పు చేస్తూ రాజ్యాంగాన్ని, కోర్టుల్ని కూడా ఖాతరు చేయకుండా ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తున్నారు. పోనీ అప్పులేమైనా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. బాబు అప్పుల దాహం, రాజ్యాంగ ధిక్కరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
20 ఈఎమ్ఐలు.. రూ. 300 కోట్లు
సాక్షి, అమరావతి: ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, రేషన్ వాహనాలు తిప్పుతున్న వారందరికీ వాటిని ఉచితంగా అందిస్తామని చెప్పింది. కానీ నెల రోజులు గడిచినా ఆ మాట నెరవేర్చలేదు. దీంతో ఓ వైపు ఈఎమ్ఐలు కట్టాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు..మరోవైపు ఎన్వోసీలు లేక వాహనాలను వినియోగించుకోలేని దైన్యంలో వాహనాల డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే వచ్చే నెలనుంచి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.9,260 వాహనాలు..20 ఈఎమ్ఐలు.. రూ.300 కోట్లు గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సుమారు 9,260 మంది యువతకు సొంత ఊరిలోనే ఉపాధి కల్పిస్తూ ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. ఈ క్రమంలో అన్ని వాహనాలనూ ఉచితంగా అందిస్తామని, వాటిని వ్యాపార కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటికే 20 ఈఎమ్ఐలు ఉండగా, వాటిని తామే కట్టి వాహనాలను ఉచితంగా ఇచ్చేస్తామని మాటిచ్చింది. కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఈ వాహనాల ఈఎమ్లు పూర్తి చేయాలంటే ప్రభుత్వం బ్యాంకులకు రూ.300 కోట్లు చెల్లించాలి. ఆ మొత్తాన్ని కడితే తప్ప బ్యాంకుల నుంచి వాహనాలకు నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్వోసీ)లు దక్కని పరిస్థితి. ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించేంత వరకు రేషన్ వాహనాల డ్రైవర్లే ఈఎమ్ఐలు కట్టాలంటూ బ్యాంకులు వెంటపడుతున్నాయి.ఖజానాలో డబ్బుల్లేవు ఈ విషయమై రెండు రోజుల కింద రేషన్ వాహనాల డ్రైవర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్కు విన్నవించగా ‘‘ఖజానాలో డబ్బులు లేవు. ఒక్కసారిగా అంత అమౌంట్ కట్టాలన్నా కష్టమే. ఇప్పటి వరకు ఈఎంఐల రూపంలో కడుతున్నాం. దీనినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది’’అని చెప్పినట్టు సమాచారం.ఇక రోడ్లపైకి వస్తాం..రేషన్ వాహనాలను ఉచితంగా ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాటిచ్చి నెలదాటినా ఎన్వోసీ, క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇవి లేకుండా వాహనాలను రోడ్లపై ఎలా తిప్పగలం? ఇప్పటికే ఉపాధిని కోల్పోయాం. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెలనుంచి రోడ్లపైకి వస్తాం. – రౌతు సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర రేషన్ వాహన డ్రైవర్ల సమాఖ్య -
'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన
చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్. ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదురాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది.చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యంచంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్ కాన్ఫరెన్స్లోని మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారికి కూడా నా అభినందనలు. జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్ కూడా ఇప్పించారు. ఆ బాండ్పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి⇒ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. ⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.అందమైన అబద్ధంతో దగా– కురసాల కన్నబాబు, మాజీ మంత్రిక్యూఆర్ కోడ్, ఆ స్కానింగ్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ పై అక్రమ కేసు కోసం కుతంత్రం
-
ఫేక్ వీడియోతో "పచ్చ" కుట్ర...
-
మదనపల్లిలో బుస కొడుతున్న కాల్ నాగులు
సాక్షి, అన్నమయ్య జిల్లా: కాల్ నాగులు మళ్లీ బుస కొడుతున్నారు. మదనపల్లిలో వడ్డీ జలగలు రెచ్చిపోతున్నాయి. కాల్ మనీ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీల పేరుతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటున్నారు. లక్ష అప్పు ఇచ్చి.. పది లక్షలు వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్నారు.అప్పు తీర్చకుంటే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్లు పెడుతూ వేధింపులకు దిగుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు గౌరీ ఆవేదన వ్యక్తం చేశారు.కాల్ మనీ బాధితుల్లో టీడీపీ కార్యకర్త నాగమణి కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోతుంది. కాల్మనీపై హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇంత వరకు చర్యలు లేవని బాధితురాలు నాగమణి అంటున్నారు. -
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: హామీల అమలుపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారన్నారు.వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కుట్ర రాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్రజలను నమ్మించేందుకు బాండ్లు తయారు చేసి, వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎలా చేయాలో తమ వద్ద ప్రణాళిక ఉందని, సూపర్ సిక్స్ అమలు చేయకలేకపోతే తన కాలర్ పట్టుకోవాలని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సవాల్ విసిరాడు. కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే ఈ ముగ్గురూ చేతులెత్తేశారు.ఈ చేతకాని చంద్రబాబు పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే అధ్వాన్నంగా తయారైంది. ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు చూస్తే నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి మదనపల్లె ఫైల్స్, తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని, ప్రకాశం బ్యారేజ్కి బోట్లు అడ్డం పెట్టారని, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరా అని.. డైవర్షన్ పాలిటిక్స్తోనే సరిపోయింది. కూటమి నాయకుల దుష్ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే ప్రజాస్పందనే దీనికి నిదర్శనం.రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదిరాజకీయ మనుగడ కోసం ఎంతకైనా దిగజారే మనిషి చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు చెబుతున్నదే నిజమైతే, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే, రోప్ పార్టీ ఉంటే ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? వైఎస్ జగన్ ఏ పర్యటన వీడియోలు చూసినా పోలీసు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిందిపోయి ఆయన పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చంద్రబాబు కుట్రలు చేయడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా బాలకృష్ణ ఇంట్లో నిర్మాత బెల్లకొండ సురేష్ పై కాల్పులు జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. నందమూరి కుటుంబం పట్ల ఆరోజు సీఎంగా ఉన్న వఘెస్సార్ హుందాగా వ్యవహరించారే కానీ అవకాశాన్ని చౌకబారు రాజకీయాలకు వాడుకోవాలని చూడలేదు. కానీ చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా నేరంగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం.రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమలేదుబనకచర్ల ప్రాజెక్టును కడతామంటే రాయలసీమ వాసులుగా మేమంతా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాది కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? ఒక్క పిడికెడు మట్టయినా తీసుంటే చూపించాలి. చంద్రబాబుకి నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద బాధ్యత ఉంటే జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టుకి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేకపోయారు.రూ.వెయ్యి కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రూ.40 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను చేపడతానని చెబితే గుడ్డిగా నమ్మడానికి రాయలసీమ వాసులు సిద్ధంగా లేరు. పూర్తయ్యే స్థితిలో ఉన్న ప్రాజెక్టుల్లో భారీగా కమీషన్లు రావు కనుక, కొత్త ప్రాజెక్టులైతే దోచుకోవచ్చనేది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు సీఎం అయ్యాక కూటమి పాలనలో అన్ని వ్యవస్థల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారు కాబట్టే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పిపోయాయి.అన్ని వ్యవస్థల్లో వేళ్లూనుకునిపోయిన అవినీతి కారణంగా, కమీషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో కట్టబెట్టిన టెండర్లన్నీ సమీక్ష చేస్తే భారీగా అవినీతి బయటపడుతుంది. ఆయన పిలిచిన టెండర్లను 20 శాతం తక్కువకి ఇస్తే ఆ పనులు చేసేదానికి ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్త వరకు అవినీతి అజెండా పాలన సాగుతోంది. విజయవాడకి వరదలొస్తే ఆ సందర్భాన్ని కూడా అవినీతికి వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.30 కోట్లు కేటాయించారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని మెప్పించడం కోసం ఒక పూట చేసిన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి రూ. 300 కోట్లు ప్రజాధనం వృథా చేశాడు. -
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.A proud moment for India as Group Captain Shubhanshu Shukla from the Indian Air Force becomes the first ISRO astronaut to travel to the International Space Station on Axiom Mission 4. Wishing Group Captain Shukla and the entire crew a safe journey and a successful mission. The… pic.twitter.com/MX5Z8fkFmw— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2025భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.గురువారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శుక్రవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఆదివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.కాగా, బుధవారం సాయంత్రం 5గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49 మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్కు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్తో పాటు 18 మందిపై తప్పుడు కేసులను నమోదు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగిస్తే.. హత్యాయత్నం చేసినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్కు పంపించారు. తాజాగా ముగ్గురు బాలురుతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా టీడీపీ వారిపై హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.బాలురుపై హత్యాయత్నం కేసు పెట్టి జువైనల్ హోమ్కు పోలీసులు తరలించారు. ఈ రెండు కేసులపై హైకోర్టుకు వెళ్లిన బాధితులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు నివేదించారు. రెండు కేసుల్లో విచారణను వెంటనే నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. -
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.అన్ని వ్యవస్థలు విధ్వంసంమన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదేఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’చంద్రబాబు హామీలు. బాండ్లుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది.దానిపై ఏమని ఉంటుంది అంటే..చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.ప్రలోభాలు. పచ్చి మోసంఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.ఇవన్నీ ఎగ్గొట్టారుఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి.ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.ప్రజలతో మమేకం కావాలిఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.ఇది రాక్షస రాజ్యం. అందుకే..ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్ జగన్ కేడర్ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. -
నీలిమ 12 పెళ్లిళ్ల వ్యవహారం.. సీఐ ఏమన్నారంటే?
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమకు చెందిన నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందనే ఆరోపణలపై రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ స్పందించారు. నీలిమ పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తమ విచారణలో 12 పెళ్లిళ్లకు సంబంధించిన ఎటువంటి కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదన్నారు. గుర్రం రాజేశ్వరి, నీలిమ మధ్య ఉన్న పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. కోర్టుల్లో ఆ కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.వారిరువురి మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణంగానే నీలిమపై అమలాపురం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని సీఐ అన్నారు. పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై నీలిమ కూడా స్పందించింది. తాను పన్నెండు పెళ్లిళ్లు అంటూ తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని పేర్కొంది. మిగిలిన పదకొండు మంది ఎవరో నిగ్గు తేల్చాలని.. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెన పల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్ ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. పేర్ని నాని, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను కూడా రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
పవన్.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి: రోజా
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్పై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్మాల్తో ఓడించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ను తొక్కిపెట్టి నార తీయాలి కదా’ అని ప్రశ్నించారు. -
సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా?
శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన జనసేనని.. ఇప్పుడు ఇంకో 20 ఏళ్లు కూటమిని, ప్రభుత్వాన్ని మోయడానికి తనకి ఎలాంటి భేషజాలు, నామోషి, సిగ్గు లేదని తేల్చేశారు.వైఎస్ జగన్ మీద కడుపుమంట కావచ్చు.. అక్కసు కావచ్చు... ఈర్ష్య.. అసూయ కావచ్చు ఏదైనా కానీ జనసేనాని మాత్రం ఆజన్మాంతం చంద్రబాబుకు, లోకేష్కు సేవకుడిగా బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్, దార్శనికత.. ముందుచూపు, పార్టీ బలోపేతంపై నిబద్ధత లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే మూటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచనికైనా దిగజారతానని తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం అంటూ ఆయన సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం నైరాశ్యం మిగిలింది. నిన్ను గెలిపించడానికి.. సీఎంగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం వారికి ఊడిగించేయాలి అంటూ వారు తమలో తాము కుమిలిపోతున్నారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంతకాలం లేదా ఆయనకు ఆసక్తి ఉన్నంతకాలం బాబుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కల్యాణ్కు ఎప్పటికీ ముఖ్యపాత్ర దక్కదు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకు ఉన్న పరపతి, ఓటు బ్యాంకును చంద్రబాబు విజయవంతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని.. ప్రోటోకాల్ తగ్గిందని పవన్కు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న లోకేష్ అనధికారికంగా సీఎంగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చేస్తున్నారు.మరోవైపు, ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నాయకుల నుంచి డిమాండ్లు కూడా తెర వెనుక నుంచి చేయిస్తున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి లోకేష్ను సీఎం అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. అంటే లోకేష్ సీఎం కావడానికి కూడా పవన్ బేషరతుగా ఒప్పుకున్నట్లుగా లెక్క.. అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్లుగా ఇటు కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు లోకేష్కు అయినా సరే ఆయన అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లు మొన్నటి ప్రకటనలతో అర్థమైంది.ఇంకో 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి తాను పాలేరుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్కు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకరించరు. ఎన్నటికీ పవన్ వారి తాబేదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం. నిన్ను సీఎంగా చూడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు తెలుగుదేశానికి 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని మరి పాలేరుగా పనిచేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇక మేమేం చేస్తాం.. అంటూ జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
అనంతలో యువకుల హల్చల్.. దమ్ముంటే పట్టుకో అంటూ పోలీసులకే..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. తాజాగా పుష్ప డైలాగులతో మందు బాబులు పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో, ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అనంతపురం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఇద్దరు యువకులు కలిసి.. మరో యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం, పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ డైలాగ్ చెప్పారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఇలా డైలాగ్ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఏపీలో ప్రసిద్ధి చెందిన ఆలయం..ఈ ఎత్తైన గోపురం పైకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
-
‘రప్పా.. రప్పా’పై కేబినెట్లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి
సాక్షి, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో ‘రప్పా.. రప్పా’ డైలాగ్ రాజకీయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘పుష్ప–2’ సినిమాలోని డైలాగ్ ‘రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్ ప్రదర్శించిన విషయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం రాజేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు చివరకు ఆ పోస్టర్ ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని తేలడంతో కంగుతున్నారు.దీంతో, ఈ విషయంలో కూటమికి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనే దానిపై మాట్లాడుకున్నారు. కొందరు మంత్రులు చంద్రబాబు మెప్పు కోసం ఈ విషయంలో వైఎస్ జగన్కే నష్టం జరిగిందని, వారికి బాగా డ్యామేజ్ అయిందనే రీతిలో మాట్లాడినట్టు సమాచారం. భిన్నాభిప్రాయంతో ఉన్న మరికొందరు బయటకు వచ్చాక రియాలిటీగా మాట్లాడితే బాగుంటుందని అన్నట్టు తెలిసింది. అలాగే జగన్ పర్యటనలో ఆయన కారుకింద పడి కార్యకర్త మృతి చెందిన వ్యవహారంపై ఒక మంత్రి ప్రస్తావించగా.. చంద్రబాబు స్పందిస్తూ చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడకూడదని, తెలంగాణకు జవాబిచ్చే రీతిలో ఉండాలని, అదే సమయంలో అక్కడి వారికి వ్యతిరేకంగానూ ఉండకూడదని చెప్పినట్టు సమాచారం. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు చెప్పాలని సూచించారు. కాగా, మంత్రివర్గ సమావేశం మొదలుకాగానే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి కూర్చున్న ఆయన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సీఎంకు చెప్పి వెళ్లిపోయారు. -
అమ్మ ఓడి.. 'పోయింది'
చివరి రోజుల్లో.. చిట్టచివరి క్షణాల్లో.. కొడుకు కంటి చూపు, స్పర్శ కోసం పరితపించిన ఓ తల్లి వ్యథ ఇది. కాటికేగే వేళ కన్నబిడ్డను కళ్లారా చూసుకుంటే చాలనుకున్న ఓ వ్యథార్థ మాతృమూర్తి యథార్థ గాథ ఇది. అంతిమ ఘడియల్లో అన్నీ తెలిసి కొడుకు కావాలనే రాలేదన్న గుండె పగిలే చేదు నిజాన్ని తాళలేక ఆ కన్నీటి వ్యథతోనే కన్ను మూసిన ఓ అమ్మ కథ ఇది. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం వదిలిపోయావనీ, నాటి నుంచి కంటికి కానరాలేదనీ, చిట్టచివరిగా ఒక్కసారి కనిపించి వెళ్లపో నాయనా అంటూ తల్లి అచేతన స్థితిలో వీడియో పంపి మరీ వేడుకున్నా ఆ కొడుకు మనసు కరగలేదు. పుత్రరత్నం తాను ఉన్న హైదరాబాద్ నుంచి తల్లి ఉన్న కాకినాడకి తీరిక చూసుకొని చేరేసరికి ఆయువు పోసిన అమ్మ ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ అమాయకపు తల్లి రాజేశ్వరి అయితే, కాఠిన్యం నిండిన ఆ కొడుకు పేరు జోష్యబట్ల రాజశేఖర్. తనువు చాలించే వేళ బిడ్డను చూస్తే చాలనుకుంది. పున్నామ నరకం నుంచి తప్పించడమే ఎక్కువనుకొని చిట్ట చివరి వేళ కట్టె గుట్టకి నిప్పంటించి నిష్క్రమించాడా కొడుకు. ఈ హృదయ విదారక ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. – కాకినాడ క్రైంకొడుకు కోసమే యావత్ జీవితం కాకినాడ దేవాలయం వీధి వినుకొండ వారి వీధికి చెందిన జోష్యబట్ల రాజేశ్వరి(70) తన ఒక్కగానొక్క కుమారుడి కోసం తన యావత్ జీవితాన్ని అర్పించింది. ఈమెకి 45 ఏళ్ల కుమారుడు రాజశేఖర్ ఉన్నాడు. బిడ్డను కని భర్త వదిలి పోయినా టైలరింగ్ చేస్తూ కుమారుడిని చదివించింది. పదవ తరగతి అనంతరం విడిచిపోయిన తండ్రి పిలుపుతో రాజశేఖర్ కేరళ వెళ్లాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి వద్దకు వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లి.. తెలిసిన వారి సాయంతో కాకినాడలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం వేయించింది. అదే సమయంలో తల్లిని పిలవకుండానే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి భార్యను చూపించి, నాటి నుంచి తల్లిని వదిలిపోయాడు. వదిలిపోయి 20 ఏళ్లు 20 ఏళ్ల క్రితం తల్లిని వదిలిపోయిన రాజశేఖర్ మళ్లీ తల్లిని ఒక్క రోజైనా చూడలేదు. రాజేశ్వరి కొడుకు వస్తాడని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో టైలరింగ్ చేసుకుంటూ తనని తాను పోషించుకునేది. ఐదేళ్ల క్రితం తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరింది. ఆమె దయనీయ స్థితిని చూసి పొరుగు వారు అప్పటి కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ చొరవ తీసుకొని వలసపాకలలో ఉన్న రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో రాజేశ్వరిని చేర్చారు. అక్కడికి వెళ్లాక కూడు,గూడులోటు లేకున్నా కొడుకు కోసం పరితపిస్తున్న మనోవేదన మాత్రం ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. తోటి వృద్ధులతో కొడుకు ఉండీ ఇలా అనాథలా బతుకుతున్నానని చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యేది. కార్పొరేటర్ చొరవతో.. అనాథాశ్రమంలో రాజేశ్వరి పరిస్థితి దయనీయంగా మారింది. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్వయంగా తమ పనులు తాము చేసుకునేవారికే అక్కడ స్థానం ఉంటుంది. నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితితో రాజేశ్వరి మంచానికి పరిమితం అయింది. ఆశ్రమ యాజమాన్యం రాజేశ్వరిని చేర్చిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు విషయం చెప్పడంతో ఆమె రాజేశ్వరిని కాకినాడ జీజీహెచ్లో చేర్చి సేవలు చేశారు. నివాసాన్ని కోరుతూ కలెక్టర్ షణ్మోహన్కు లక్ష్మీప్రసన్న ఈ ఏడాది మే 12వ తేదీన లేఖ రాశారు. తక్షణమే స్పందించిన ఆయన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, రాజేశ్వరి బాగోగులు పరిశీలించి తగిన నివాస సదుపాయం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మిని్రస్టేటర్ రంగనాథం శైలజ రాజేశ్వరి బాగోగుల బాధ్యతలు చూసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, పెద్దాపురంలో బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన ఇల్లు’ వసతి గృహానికి రాజేశ్వరిని తరలించారు. కొడుకా అని కలవరిస్తూ... నాటి నుంచి రాజేశ్వరి తన కుమారుడి పేరును కలవరిస్తూనే ఉంది. వసతి గృహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, బృందం ఆమెకి సపర్యలు చేసేది. రాజేశ్వరి చివరి కోరికను తెలుసుకున్న సత్యనారాయణ విషయాన్ని శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రాజేశ్వరి కుమారుడు రాజశేఖర్ను సంప్రదించి తల్లి దీనావస్థను వివరిస్తే రావడానికి తనకు తీరిక లేదని ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సత్యనారాయణ, ఆయన బృందం రాజశేఖర్తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తాను సంగీత దర్శకత్వం చేస్తుంటానని, చాలా బిజీగా ఉంటానని తనకు మాటి మాటికీ ఫోన్లు చేయవద్దని విసుక్కున్నాడు. అప్పటికే రాజేశ్వరి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తిండి మానేసింది, మందులు తీసుకోవడానికి శరీరం కూడా సహకరించడం లేదు. అటువంటి నిస్సత్తువలో కూడా కొడుకు కోసమే పరితపించేది. కొడుకా కొడుకా అంటూ కలవరించేది. పోలీసుల వార్నింగ్ రాజశేఖర్ తన తల్లి స్థితిని కళ్లకు కట్టేలా వీడియోలు పంపి వివరించినా ఏ మాత్రం చలించలేదు. పైగా చెబుతున్న వారందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు సూచనలతో పోలీసులు రాజశేఖర్కి కాల్స్ చేశారు. వచ్చి తల్లికి కనిపించి వెళ్లకపోతే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్–2019 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మరో మార్గం లేక రాజశేఖర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఈ నెల 10వ తేదీన ఉదయం వచ్చాడు. అయితే కొడుకు రాకకోసం పరితపించి అతడు రావడానికి కొద్ది గంటల ముందే ప్రాణాలు విడిచింది. అంతిమ సంస్కారాలు మీరే చెయ్యండి రాజశేఖర్ వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి మండిపడ్డాడు. ఇంత మాత్రానికే తనను ఎందుకు ఇబ్బంది పెట్టారని విసుక్కున్నాడు. అంతిమ సంస్కారాలు కూడా మీరే చేసేయండని ఎంత కావాలన్నా ఇచ్చేస్తానని బేరాలాడాడు. శైలజ ఆమె బృందం నచ్చజెప్పారు. నిన్ను చూడాలన్న ఆమె ఆఖరి కోరిక ఎలాగో తీర్చలేదు, కనీసం తలకొరివి అయినా పెట్టమని అడిగారు. సఖి వన్స్టాప్ సెంటర్, బాధ్యత ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు రాజశేఖర్ మాతృమూర్తి మృతదేహానికి తలకొరివి పెట్టాడు. అంతిమ సంస్కారాలు బలవంతంగా చేయించిన అధికారులు, ఫౌండేషన్ సభ్యులపై విసుక్కొని వెళ్లిపోయాడు. -
అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ
సాక్షి, అమరావతి: రాజధాని కోసం గతంలో సీఆర్డీఏ తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం... తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను నారాయణ, సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. ‘‘2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధారంగా కొత్తగా 45 వేల ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 5వేల ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో వస్తాయి. కనీసం 45 వేల ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి కేపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తాం’’ అని నారాయణ చెప్పారు. భవన నిర్మాణ నిబంధనలు సరళీకరణ» భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించినట్లు నారాయణ తెలిపారు. అపార్ట్మెంట్లు్ల, గ్రూప్ డెవలప్మెంట్ ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటికాదా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చన్నారు.» గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల వంటి భవిష్యత్ అవసరాల కోసమే అమరావతిలో మరోసారి భూ సమీకరణ అని పార్థసారథి పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని భూముల సమీకరణకు ఒకే తరహా నిబంధనలు (యూనిఫాం రూల్స్)ను ఆమోదించినట్లు చెప్పారు. ‘‘ఎన్జీటీ, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా జలాశయాల రక్షణకు చర్యలు తీసుకుంటాం. అసైన్డ్, దేవాదాయ, లంక భూములను జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ చేసి యాజమాన్యాలను నిర్ధారిస్తాం. సరిహద్దు వివాదాలు లేకుండా డ్రోన్స్ సర్వే చేస్తాం. ఆధార్ ద్వారా భూ యజమానులను నిర్ధారిస్తాం. భూమి లేనివారికి నెలకు రూ.5 వేలు చొప్పున పదేళ్ల పాటు పెన్షన్, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తాం. రైతుల వ్యవసాయ రుణాలను రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం’’ అని వివరించారు.కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..» అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా జీఏడీ, హెచ్వోడీ టవర్ల నిర్మాణాలను రూ.844 కోట్లతో ఎన్సీసీకి, రూ.1,423 కోట్లతో షాపూర్ పల్లోంజీకి, రూ.1,247 కోట్లతో ఎల్అండ్టీకి ఇచ్చేందుకు ఆమోదం.» అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు 50 ఎకరాలను చదరపు మీటర్కు ఏడాదికి రూపాయి చొప్పున 60 ఏళ్లు లీజుకిచ్చేందుకు అంగీకారం.» అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగం. » జాప్యం కారణంగా నంద్యాల జిల్లాలో టయారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో అరబిందో రియాల్టీ– ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించిన 800 మెగావాట్ల అవుకు ప్రాజెక్టు రద్దు. » చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల్లో వి.కోట, రామకుప్పం వద్ద పాలార్ నదిపై 17 చెక్ డ్యాముల మరమ్మతు, పునర్నిర్మాణానికి రూ.5,355 లక్షలకు, పాలార్ నదిపై 4 చెక్ డ్యాముల మరమ్మతుకు రూ.1,024.50 లక్షలకు పరిపాలనా ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా గండికోట వద్ద ఓబెరాయ్ (విల్లాస్) రిసార్ట్ అభివృద్ధి కోసం 50 ఎకరాలు ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.» ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వేడుకల సభలు నిర్వహణ. -
ఇంటర్ బదిలీల్లో ఎన్నెన్నో వింతలు
విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో (‘ఏ’ కేటగిరి) పని చేస్తున్న తెలుగు లెక్చరర్ను నిబంధనల ప్రకారం బదిలీపై బి లేదా సీ కేటగిరీ కాలేజీకి బదిలీ చేయాలి. కానీ ఇదే నగరంలోని వించిపేట (‘ఏ’ కేటగిరి) జూనియర్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ లెక్చరర్ను ఈ నెల 9వ తేదీనే బదిలీ చేసినట్టుగా రాజమహేంద్రవరం ఆర్జేడీ ఈ నెల 18న పాత తేదీతో ఆర్డర్ ఇచ్చారు.వైఎస్సార్ కడప జిల్లాలోని లింగాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ బైపీసీ గ్రూప్లో 17 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని చెబుతూ జువాలజీ లెక్చరర్ను ప్రొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. వాస్తవానికి ప్రొద్దుటూరు కాలేజీలోని బైపీసీ గ్రూపులో ఉన్నది కేవలం ఆరుగురు విద్యార్థులే. సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ విద్యా మండలిలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా అక్రమాలు చేసినట్టు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి పోస్టుకు ‘లెక్క’గట్టి మరీ వసూలు చేసినట్టు విశ్వసనీయ సమచారం. సీనియారిటీ, పనిచేసిన స్టేషన్ ప్రకారం చేయాల్సిన బదిలీల్లో అర్హులను పక్కనబెట్టి దొడ్డి దారిలో తమకు కావాల్సిన వారికి నచ్చిన చోటుకు పోస్టింగ్ ఇచ్చారు. నాలుగు జోన్లలోనూ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాల్లో వసూళ్ల కోసం సిబ్బందిని నియమించి మరీ దందా నడిపారు. అర్హత లేకున్నా పోస్టును, ప్రాంతాన్ని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సీనియారిటీని సైతం పట్టించుకోకుండా కీలకమైన స్థానాలను డబ్బులిచ్చిన వారితో నింపుకున్నారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రెండేళ్లు దాటిన వారికి రిక్వెస్టు బదిలీ చేయాలి. కానీ, తప్పనిసరి బదిలీల్లో సీనియరిటీ ప్రకారం భర్తీ చేయాల్సిన పోస్టుల్లో తక్కువ సర్వీసు ఉండి ‘రిక్వెస్టు’ కేటగిరీ వారితో నింపేశారు. ఇటీవల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లను 250 మందిని బదిలీ చేయగా, వారిలో 200 మంది వరకు దొడ్డిదారినే నింపేశారు. ఈ పంపకాల్లో ఆర్జేడీ కార్యాలయం నుంచి విద్యా శాఖ మంత్రి పేషీ వరకు భాగం ఉన్నట్టు చెబుతున్నారు. అయిన వారికే ‘ఏ’ కేటగిరీ స్థానాలుగ్రామీణ నేపథ్యమున్న కాలేజీలను ‘సీ’ కేటగిరిగా, మున్సిపల్ ప్రాంతాలను ‘బి’, నగర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలను ‘ఎ’ కేటగిరీలుగా విభజించారు. ప్రభుత్వ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు అత్యధికంగా ‘ఎ’ కేటగిరీ స్థానాలనే కోరుకుంటున్నారని, దాంతో ఈసారి సీ, బీ కాలేజీలోన్లే రెగ్యులర్ సిబ్బందిని నియమిస్తామని వీటికి మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని బోర్డు ప్రకటించింది. కానీ బదిలీల్లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తోంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో (‘ఏ’ కేటగిరి) పని చేస్తున్న తెలుగు లెక్చరర్కు రెండున్నరేళ్ల సర్వీసు ఉంది. ఈమె రిక్వెస్టు బదిలీ కోరుకోగా సీ కేటగిరీ కాలేజీ చూపించారు. ఆమె అక్కడకు వెళ్లడం ఇష్టం లేక ‘ప్రత్యేక’ మార్గంలో మధ్యవర్తులను కలవడంతో ఈ నెల 18న విజయవాడలోనే వించిపేట (‘ఏ’ కేటగిరి) జూనియర్ కాలేజీకి బదిలీ చేశారు. అయితే ఆమెను ఈ నెల 9వ తేదీనే బదిలీ చేసినట్టుగా పాత తేదీతో రాజమహేంద్రవరం ఆర్జేడీ ఆర్డర్ ఇచ్చారు. తొలుత ‘ఏ’ కేటగిరీ ప్లేస్లను బ్లాక్ చేసిన బోర్డు అధికారులు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి కోసం ఆ పోస్టులు అమ్ముకున్నారని అర్హులు వాపోతున్నారు. జోన్ 2లోని ఒక్క వించిపేట కాలేజీలోనే 11 పోస్టులు ఉంటే 10 పోస్టులను ఇలా నింపేశారని, జోన్ 3లోని బాపట్లలోని ఓ కాలేజీలో 9 పోస్టులకు 7 పోస్టులు ఇలాగే చేశారని చెబుతున్నారు.కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ నిబంధన పెట్టి..ఈసారి బదిలీల్లో కొత్తగా ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’ కింద ఎవరినైనా బదిలీ చేయొచ్చన్న నిబంధనను తీసుకొచ్చారు. దీన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు తెర లేపారు. జోన్ 2లో ఐదు నెలల క్రితం పదోన్నతిపై అమలాపురం బాలికల కాలేజీలో ప్రిన్సిపల్గా చేరిన వారు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో ఆన్ డ్యూటీపై నెల రోజుల క్రితం తాడేపల్లిలోని డైరెక్టరేట్కు వచ్చారు. రాజమండ్రికి చెందిన ఈయన తాజా బదిలీల్లో సొంత పట్టణం సమీపంలోని కోరుకొండకు బదిలీ చేయించుకున్నారు. నెలల వ్యవధిలోనే ఈ మార్పులు జరిగిపోవడం గమనార్హం. పిఠాపురం పట్టణంలోని జూనియర్ కాలేజీలో సివిక్స్ పోస్టును ఓ సీనియర్ లెక్చరర్ ఆశించగా, వెబ్ కౌన్సెలింగ్లో ఆ ప్లేస్ లేదని చెప్పారు. ఆయన వేరే ప్రాంతాన్ని ఎంచుకున్న గంట వ్యవధిలోనే ఆయనకంటే జూనియర్కు కేటాయించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి కాలేజీలో స్ట్రెంత్ లేదని పోస్టులు కేటాయించేది లేదని ప్రకటించారు. కానీ సాయంత్రానికి ఓ లెక్చరర్ కోసం ఓపెన్ చేశారు. గుంటూరు పరిధిలోని నాలుగు ‘ఎ’ కేటగిరి కాలేజీల్లోని ప్రిన్సిపాళ్లకు ఐదేళ్ల సర్వీసు దాటింది. ఈ పోస్టుల్లో ఒకదానికి ‘సీ’ కేటగిరీలో ఉన్న దుర్గి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఒకరు రావాలని దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో రిటైర్ అవ్వనున్న ఆయనకు అన్ని అర్హతలు ఉన్నా సరే.. పోస్టింగ్ ఇవ్వకుండా బెల్లంకొండ కాలేజీ ప్రిన్సిపాల్కు ‘రిక్వెస్టు’పై ఆ పోస్టు కేటాయించారు. ఇలా మొత్తం నాలుగు జోన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ అక్రమాలపై కొందరు బాధిత లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. -
అప్పు ఇచ్చి.. వ్యభిచారం చేయమంటున్నారు!
మదనపల్లె రూరల్: ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను గుర్తించడం, వారికి కొంత నగదు అప్పుగా ఇవ్వడం, షూరిటీగా బ్యాంకు ఖాళీ చెక్కులు, ప్రాంసరీ నోట్లు తీసుకోవడం, ఆపై నూటికి రూ.45 వడ్డీ వసూలు చేయడం, సమయానికి అప్పు చెల్లించలేని మహిళలను తమ కోరికలు తీర్చాలని బలవంతపెట్టడం, లేదా తాము చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తూ నరకయాతనకు గురి చేస్తున్న వడ్డీ రాక్షసుల కసాయి లీలలను బాధిత మహిళ మంగళవారం వెల్లడించింది. తనలాగా మరో 20 మంది ఉన్నారని, వారు బయటకు రాలేక నలిగిపోతున్నారని, తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చానంది. వారి ఆగడాలకు తాను ఎలా బలైందో, పోలీసులు వడ్డీ వ్యాపారులకు ఎంతగా వంత పాడుతున్నారో.. కన్నీటిపర్యంతం అవుతూ ఆధారాలను మీడియాకు చూపించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీకి చెందిన బాధితురాలి కథనం మేరకు.. పట్టణానికి చెందిన బండి ఆనంద్, అతని భార్య మంజుల, దేవత నగర్కు చెందిన మాజీ సైనికుడు ఏకాంబరరెడ్డి, శేషప్ప తోటలో మటన్ వ్యాపారం చేస్తున్న బండి హరినాథ్, అతని భార్య అనూరాధ పట్టణానికి చెందిన చక్రాయపేట ఖాదర్ వలీ అనే వ్యక్తి ద్వారా, ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను గుర్తించి, వారికి అవసరమైన నగదు అప్పుగా ఇస్తున్నారు. రూ.100కి రూ.45 వడ్డీ వసూలు చేస్తున్నారు. వారి వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకుంటే రూ 1,500 మినహాయించుకుని మిగిలిన రూ.8,500 చేతికి ఇస్తారు. వారానికి రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ బాధితులను నరకయాతనకు గురి చేస్తున్నారు. తమ అప్పు తీరాలంటే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుకు వేదికగా గుండ్లూరి భారతి పట్టణంలో నడుపుతున్న బ్యూటీ పార్లర్ను ఎంచుకున్నారు. తన భర్త ఉపాధి నిమిత్తం బెంగళూరులో ఉండగా కుటుంబ అవసరాల కోసం ఆనంద్ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నానని, అందుకు ప్రతిగా రూ.10.5 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.కొత్తపల్లిలో ఉన్న తమ భూమిని సైతం వారికి రాసి ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పు తీసుకున్న సమయంలో తాను ఇచ్చిన బ్యాంకు చెక్కులను, ఒకటి రూ.10లక్షలకు, మరొకటి రూ.ఆరు లక్షలకు దాఖలు చేసి వేధిస్తున్నారని వాపోయారు. అప్పు తీర్చడానికి తాము చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. అతని భార్య మంజుల.. తనకు అనేకమంది అధికారులు, బ్యాంకు వ్యక్తులు తెలుసని, వారితో వ్యభిచారం చేయాలని పదేపదే బలవంతం చేస్తోందన్నారు. మాజీ సైనికుడైన ఏకాంబరం రెడ్డి వేధింపులపై 2024లో టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అప్పటినుంచి అతని వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయన్నారు. అనూరాధ, హరినాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన ఇంటికి వచ్చి తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తనను నరికి చంపుతానని హరినాథ్ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. భారతితో తనకు ఆర్థిక లావాదేవీలు లేకపోయినా తన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి, తప్పుడు మనుషులుగా చిత్రీకరించి, వేధింపులకు పాల్పడుతోందన్నారు. దీంతో తాను కుటుంబానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆగడాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావుకు వెనకాడబోనని, తన చావుతోనైనా పోలీసులు స్పందించి ఇతరులకు న్యాయం జరిగితే చాలన్నారు. అప్పులు ఇచ్చి మహిళలను సెక్స్ వర్కర్లుగా మార్చాలనుకుంటున్న వడ్డీ రాక్షసుల నుంచి బాధితులను కాపాడేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
వాన్పిక్ భూముల్లో ఇసుక తోడేలు!
బాపట్ల జిల్లా బచ్చులవారిపాలెం వాన్పిక్ భూముల్లో దందాచీరాల పచ్చనేత ఇసుక దందా పతాక స్థాయికి చేరింది. ఇప్పటివరకు పందిళ్లపల్లె, చీరాల ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల నుంచి ఇసుకను తరలించి అమ్ముకున్న ఆ నేత కన్ను ఇప్పుడు వేటపాలెం మండలం బచ్చులవారిపాలెం ప్రాంతంలో ఉన్న వాన్పిక్ భూములపై పడింది. వెయ్యి ఎకరాల్లోని ఈ భూములన్నీ ఇసుకతో కూడుకున్నవే కావడంతో ఆయన ఈ భూముల్లోని ఇసుకను తోడుకుని కాసులు పిండుకుంటున్నారు. వారం రోజులుగా బచ్చులవారిపాలెంలోని ఆ పచ్చనేత అనుచరులు వెంకట్రావు, అశోక్ వాన్పిక్ భూముల నుంచి రేయింబవళ్లు యంత్రాలు పెట్టి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. రోజూ 50కి పైగా లారీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. తొలుత వాన్పిక్ భూముల నుంచి ఇసుకను తవ్వి బచ్చులవారిపాలెం, ఊటుకూరు రహదారిలో కుప్పలుగా నిల్వచేస్తున్నారు. అక్కడినుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా చీరాల, బాపట్ల, ఒంగోలు, చినగంజాం, కారంచేడు, మార్టూరు, పర్చూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిమాండ్ను బట్టి ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు సమాచారం. -సాక్షి ప్రతినిధి, బాపట్ల రేయింబవళ్లు ఇసుకను తరలించేస్తున్నారు.. అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. నిజానికి ఈ భూములన్నింటినీ వాన్పిక్కు ఇచ్చాం. ఇప్పుడా భూములపై వాన్పిక్కు హక్కు ఉంటుంది. అయితే.. వారు వచ్చేవరకు భూములిచ్చిన రైతులకు మాత్రమే వాటిపై అధికారం ఉంది. కానీ, అధికార పార్టీ నేతలు భూముల్లోని ఇసుకను రేయింబవళ్లు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.– మోహన్రావు, మాజీ సర్పంచ్, బచ్చులవారిపాలెంరైతులపై పచ్చమూకల దౌర్జన్యం..వాస్తవానికి.. బచ్చులవారిపాలెం పరిధిలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూములను వాన్పిక్ కంపెనీ రైతుల నుంచి తీసుకుంది. కోర్టు కేసుల నేపథ్యంలో ఆ భూములను సదరు కంపెనీ వినియోగించలేదు. దీంతో భూములు ఇప్పటికీ రైతుల స్వా«దీనంలోనే ఉన్నాయి. తాము వచ్చేవరకు భూములు మీ స్వా«దీనంలోనే ఉంచుకోవాలని వాన్పిక్ రైతులకు సూచించింది. తాము వచి్చన తర్వాత తగిన పరిహారం ఇచ్చి భూములు స్వా«దీనం చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు రైతులకు చెప్పారు. కానీ, పచ్చనేతలు ఆ భూముల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కొందరు రైతులు ఈ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పచ్చనేత అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు. భూములు మీవి కాదని, వాన్పిక్వి అని బెదిరిస్తున్నారు. దీంతో కొందరు రైతులు ఇటీవల వేటపాలెం ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించలేదని తెలిసింది. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నది చీరాల పచ్చనేత అనుచరులు కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. దీంతో.. బాధిత రైతులు స్థానిక పెద్దలతో మాట్లాడి జిల్లా కలెక్టర్ను కలిసి ఇసుక దందా వ్యవహారం విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.మైనింగ్ అధికారులకూ ముడుపులు!మరోవైపు.. వాన్పిక్ భూముల నుంచి పచ్చనేతలు అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నా మైనింగ్ విభాగం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులకు తెలిసినా స్పందించడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారి నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటూ ఫిర్యాదులు పట్టించుకోవడంలేదని బచ్చులవారిపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కదంతొక్కిన కడలి పుత్రులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీ మౌత్ను తక్షణం పురుద్ధరించి వెంకట్రావుతోపాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు భ్రమర ఇన్ఫ్రాకు చెందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారులు మంగళవారం బాపట్లలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. తీరగ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాతబస్టాండు వద్ద ధర్నా నిర్వహించి.. ఆ తర్వాత చీలురోడ్డులో మానవహారం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్తుండగా.. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టర్తో చర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరినీ అనుమతించాల్సిందేనంటూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతోపాటు ప్రజాసంఘాల వారిని పోలీసులు లోపలికి అనుమతించారు. 2 గంటలపాటు మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించిన కలెక్టర్ వెంకటమురళి ఈపూరుపాలెం సీమౌత్కు అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పూడికతీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైనా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
‘చినబాబు సర్వీసు’ కమిషన్!
నారా చంద్రబాబునాయుడు..! వైఎస్ జగన్మోహన్రెడ్డి..! వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!! సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేనివిధంగా కమిషన్లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్ సభ్యుడిని తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?2023 గ్రూప్–1 నోటిఫికేషన్కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం స్పోర్ట్స్ కేటగిరీలో 42 మందిని, జనరల్ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరుగుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపోతుందని ఆక్రోశిస్తున్నారు.మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్.. కమిషన్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో సీనియర్ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..వారం క్రితం గ్రూప్–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్లో ఫైల్ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘాలపై కొత్త సభ్యుడిని నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమవారం రోజు బోర్డులో ఉన్న సీనియర్ సభ్యుడిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్ను అప్పటికప్పుడు నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.సీనియర్ సభ్యులను పక్కనపెట్టి..టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తికాలం కొనసాగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్టీయూ వైస్ చాన్సలర్గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా గత ప్రభుత్వంనియమించింది. అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రూప్–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తలరాతలు తారుమారు...టీడీపీ హయాంలో సర్వీస్ కమిషన్ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్భాస్కర్ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2018 గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు, ఒక సబ్జెక్టు నిపుణుడు (యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. -
స్టాంప్ డ్యూటీ స్కామ్లో మరిన్ని కంపెనీలు!
అనంతపురం టౌన్, సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలు సృష్టించి రూ.900 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంలో డొంకంతా కదులుతోంది! ఈ స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పాత్ర ఇప్పటికే బహిర్గతం కాగా ఆయన సన్నిహితుల కంపెనీలు నియో కన్స్ట్రక్షన్స్, సురాజ్ ఇన్ఫ్రా సైతం బ్యాంకులకు నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలు సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కంపెనీలు సైతం రూ.కోట్లలో బ్యాంకు రుణాలు పొందడం గమనార్హం.ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని చెల్లించకుండా తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఆర్సీ కంపెనీ 2024 జూన్ నుంచి 2025 మార్చి వరకు తొమ్మిది నెలల వ్యవధిలో టాటా క్యాపిటల్స్, యూనియన్ బ్యాంక్తో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.900 కోట్లకు పైగా రుణాలు అక్రమ మార్గంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీ 0.5 శాతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.4 కోట్లకు పైగా కట్టాలి. అయితే నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలను బ్యాంకులకు సమర్పించి రూ.నాలుగు కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ ఎగ్గొట్టింది. స్టాంప్ డ్యూటీ నకిలీ చలానాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ.. దొంగే.. దొంగ.. దొంగ..! అన్నట్లుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ఇందులో తమ తప్పు ఏమీ లేదన్నట్లు అంతా మీసేవ నిర్వాహకుడు యర్రప్ప అలియాస్ బాబే చేశాడంటూ ఎస్ఆర్సీ కంపెనీ అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ప్రశ్నలకు బదులేది?» స్టాంప్ డ్యూటీ చలానాలు తీసే ముందు ఎస్ఆర్సీ కంపెనీ ఖాతా నుంచి సదరు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ‘మీసేవ బాబు’ బ్యాంకు ఖాతా నుంచి చెల్లించారంటే అర్థం ఏమిటి? » రూ.వందల కోట్ల రుణాలు తీసుకునేందుకు రూ.కోట్లలో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం ‘మీ సేవ బాబు’ దగ్గర ఉంటుందా? » ఒకవేళ ఎస్ఆర్సీ కంపెనీనే స్టాంప్ డ్యూటీకి అవసరమైన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి జమ చేసి ఉంటే.. ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్ వివరాలు అందుబాటులో ఉంటాయి కదా? » ఓ ప్రముఖ కంపెనీ తమ సంస్థ పేరిట చలానాలు తీయకుండా థర్డ్ పార్టీ నుంచి చెల్లిస్తుందా? అలా చేయడంలో ఆంతర్యమేమిటి?రహస్యంగా యర్రప్ప దంపతుల విచారణ..ఎమ్మెల్యే సురేంద్రకు అత్యంత సన్నిహితుడైన మీసేవ నిర్వాహకుడు బాబు అలియాస్ బోయ యర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే విజిలెన్స్, సీసీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. యర్రప్ప నివాసంలో జరిపిన సోదాల్లో కిలో బంగారంతో పాటు ఓ డైమండ్ నెక్లెస్, ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.80 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. కాగా యర్రప్పకు సహకరించిన మోహన్బాబు అనే యువకుడితోపాటు మీసేవలో పనిచేసే మరో వ్యక్తిని, ఆరి్థక లావాదేవీలు నడిపిన ఓ మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యర్రప్పతో సన్నిహితంగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నడిపిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి కూడా సీసీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
తలొగ్గకుంటే హుష్‘ఖాకీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పలు జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, సీనియర్ ఐపీఎస్ అధికారులను భారీ స్థాయిలో బదిలీ చేసింది. కానీ ఏడాది గడిచేసరికే మళ్లీ భారీ స్థాయిలో బదిలీలకు సిద్ధపడుతుండటం గమనార్హం. హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించడంతో బదిలీల కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరుకు ఐపీఎస్ల బదిలీ ప్రక్రియను కొలిక్కి తేవాలని భావిస్తోంది. గుంటూరు ఎస్పీపై గుర్రు!రాష్ట్రంలో ఏడెనిమిది జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీసత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లా ఎస్పీల బదిలీకి ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరు ఎస్పీ సతీశ్ను కూడా బదిలీ చేయాలని సర్కారు భావిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటించిన సందర్భంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ కుట్రకు ఎస్పీ మొదట తలొగ్గకపోవడంతో ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. కాన్వాయ్లో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ( ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని ఎస్పీ సతీశ్ విచారణలో తేలింది. దాంతో అదే విషయాన్ని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమక్షంలోనే ఆయన వెల్లడించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్పై అక్రమ కేసు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ ఎస్పీ వాస్తవ విషయాలను వెల్లడించడంతో వారి పన్నాగం బెడిసికొట్టింది.దీంతో ప్రభుత్వ పెద్దలు ఎస్పీ సతీశ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి 3 రోజుల్లోనే మరో ప్రకటన చేయించారు. జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్టు చెప్పించారు. ఆ వాహన డ్రైవర్గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డితోపాటు జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ పై అక్రమ కేసు నమోదు చేయించారు. కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసు నమోదు చేసిందన్నది బట్టబయలైంది. తమ కుట్రకు మొదట్లో సహకరించని ఎస్పీ సతీశ్పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎస్పీతో నిమిత్తం లేకుండా ఆ అక్రమ కేసు వ్యవహారాన్ని పర్యవేక్షించాలని టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఆదేశించినట్లు సమాచారం. రెడ్బుక్ అక్రమ కేసుల బనాయింపులో ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నారనే కారణంతో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని భావిస్తున్నారు.హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బలి!కాపు రిజర్వేషన్ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి వేధించాలన్న సీఎం చంద్రబాబు పన్నాగం ఇటీవల బెడిసికొట్టింది. 2016లో తునిలో రైలుపై దాడి కేసును తిరగదోడుతూ కాపు రిజర్వేషన్ ఉద్యమకారులపై మళ్లీ కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం భావించింది. కాపు ఉద్యమ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మేరకు హోం మంత్రి అనిత సంతకం చేసి పంపించిన ఫైల్ను ఆమోదిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు.రైలు దహనం ఘటన కేసును మళ్లీ విచారించేందుకు హైకోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వ న్యాయవాదికి అనుమతినిచ్చారు. కానీ ప్రభుత్వ కుట్రపై కాపులు ఎదురుతిరిగడంతో ప్రభుత్వం ఆ జీఓను ఉపసంహరించుకుంది. ఈ ఉదంతంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని నమ్మించేందుకు కుమార్ విశ్వజిత్ను బదిలీ చేయాలని భావిస్తోంది.» విశ్వజిత్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. ఆ పోస్టుతోపాటు ఆయనను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమించే ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.» సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులనూ బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.» కీలకమైన విశాఖపట్నంలో తమ అక్రమాలు, కుట్రలకు సహకరించడం లేదని పోలీస్ కమిషనర్ శంకభాత్ర బాగ్చీపై కూడా ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు స్థాన చలనం తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి.» రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హాను కీలక పోస్టులో నియమించే అవకాశాలున్నాయి. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పోస్టులోనే కొనసాగుతున్న ఏకైక ఐపీఎస్ అధికారి ఆయనే. ఈ ఏడాది కాలంలో ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు మరింత సన్నిహితుడిగా మారినట్టు సమాచారం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కీలక పోస్టుపై మనీశ్ కుమార్ సిన్హా కన్నేసినట్టు తెలుస్తోంది. -
యాత్ర పేరిట నయవంచన
తెనాలి: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది యాత్రికుల నుంచి డబ్బు వసూలు చేసిన నిర్వాహకుడు వారిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వారంతా నానాఅగచాట్లు పడ్డారు. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని నానా బాధలు పడుతూ సొంత ఊళ్లు చేరుకున్నారు. తమను అవస్థలు పెట్టిన ట్రావెల్స్ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తెనాలిలోని శ్రీ అరుణాచలేశ్వర, మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు ఎం.గురుమూర్తి మొత్తం 260 మందిని సరస్వతీ నది పుష్కరాల యాత్ర, కేదార్నాథ్ దర్శనానికి తీసుకెళ్లేందుకు వసూలు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.22 వేల నుంచి రూ.34 వేల వరకు రూజ85 లక్షల వరకు తీసుకున్నారు. పర్వతం మీదుండే కేదార్నా«థ్ ఆలయానికి హెలికాప్టర్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిన వారి నుంచి అదనంగా రూ.15 వేలు వసూలు చేశారు. ప్రయాణికులు భోజనం, వసతి సహా అన్నింటికీ డబ్బులు ముందుగానే చెల్లించారు. యాత్రికులంతా రాష్ట్రంలోని గుంటూరు, చీరాల, ఒంగోలు, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన వారే. విజయవాడ నుంచి ఢిల్లీ వరకు రైలు ప్రయాణం, అక్కణ్నుంచి హరిద్వార్కు బస్సు అని చెప్పారు. మొత్తం 15 రోజుల యాత్ర. ప్రణాళిక ప్రకారం యాత్రికులు మే 17వ తేదీన రైలులో ఢిల్లీ చేరుకున్నారు. అక్కణ్నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో 18వ తేదీకి హరిద్వార్ చేరుకున్నారు. 19వ తేదీ ఉదయం ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్లిన నిర్వాహకుడు గురుమూర్తి ఆ తర్వాత కనిపించలేదు. ఫోన్ స్విచాఫ్లో ఉంది. దీంతో చేతిలో డబ్బుల్లేనివారు నానా అవస్థలు పడ్డారు.ఇళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకుని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి చేరినవారు కొందరుంటే, చాలామంది యాత్రను కొనసాగించలేక తిరుగుముఖం పట్టారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితులు స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లగా.. ఆ ట్రావెల్ ఆఫీస్ టూటౌన్ పరిధిలోనిదని అక్కడికెళ్లి ఫిర్యాదు చేయాలని, లేదంటే ఎవరి ఊళ్లో వారు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దీంతో వారంతా మీడియాతో తమ బాధను వెల్లడించారు.హరిద్వార్ తీసుకెళ్లి వదిలేశాడుసరస్వతీ నది పుష్కరాలు, కేదార్నా«థ్ యాత్ర అంటే ఒకేసారి రెండు అవకాశాలు రావటం అదృష్టమన్న భావనలో గురుమూర్తి అడిగినంత డబ్బు ఇచ్చి బయల్దేరాం. ఢిల్లీకి, అక్కణ్నుంచి హరిద్వార్కు తీసుకెళ్లి వదిలేశాడు. ఇప్పటికీ ఆచూకీ తెలియటం లేదు. బాధ్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. – దుర్గాప్రసాద్, చీరాల -
ప్రజల వద్దకు వెళ్లకుండా.. జగన్ను అడ్డుకునే కుట్రే!
సాక్షి, అమరావతి: విశేష ప్రజాదరణతో సాగుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుతంత్రాలను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం రలిగిస్తున్న వైఎస్ జగన్ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా బరి తెగించి వ్యవహరిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం జగన్ భద్రతా ఏర్పాట్ల పట్ల కుట్రపూరిత వైఖరిని అవలంబిస్తోంది. వైఎస్ జగన్కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏకపక్షంగా జప్తు చేయడం చంద్రబాబు సర్కారు పన్నాగంలో తాజా అంకం. తద్వారా వైఎస్ జగన్ భద్రతపై ఉద్దేశపూర్వకంగా ఏడాదిగా సాగిస్తున్న కుట్రలకు మరింత పదునుపెట్టింది. పాలనలో తన ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీసిన తాజా పన్నాగం ఇదిగో ఇలా ఉంది...అక్రమ కేసు... ఏకపక్షంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. అధికారిక కాన్వాయ్లో లేని ఓ ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించారు. ఆ వాహనాన్ని పోలీసులు జప్తు చేసి పోలీస్ స్టేషన్కు కూడా తరలించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్ జగన్పై అక్రమ కేసు నమోదుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎస్పీ సతీశ్ మూడు రోజుల్లోనే మాట మార్చాల్సి వచ్చింది.వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఓ కథను తెరపైకి తెచ్చి అక్రమ కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే మాట మార్చి అక్రమ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర కోణం తాజాగా బయటపడింది. వైఎస్ జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గుంటూరు పోలీసులు మంగళవారం జప్తు చేసి తరలించుకుపోవడంతో ప్రభుత్వ పన్నాగం స్పష్టమైంది. అంటే వైఎస్ జగన్ ప్రయాణించేందుకు పటిష్ట భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే లక్ష్యమన్నది తేటతెల్లమైంది. ఎందుకంటే ఇదే కేసులో ఇప్పటికే ఓ ప్రైవేటు వాహనాన్ని (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) పోలీసులు జప్తు చేశారు. అదే కేసులో మళ్లీ వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాజాగా జప్తు చేయడం గమనార్హం. తద్వారా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యమన్నది స్పష్టమైంది. జగన్ భద్రతపై బాబు కుట్రలు..వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. అందుకోసం ఏడాదిగా కుతంత్రాలు పన్నుతూనే ఉంది. ఏడాదిగా వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లపై ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మాజీ సీఎంహోదాలో ఆయన పర్యటనలకు పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలి. కానీ పాతబడిన ఓ డొక్కు వాహనాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ వాహనం మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఓ పర్యటనలో ప్రభుత్వం సమకూర్చిన డొక్కు వాహనం నుంచి దిగి మరో ప్రైవేటు వాహనంలో వైఎస్ జగన్ పర్యటించారు.బుల్లెట్ ప్రూఫ్ కాని వాహనంలో ఆయన ప్రయాణించాల్సి రావడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళ చెందారు. ఎందుకంటే వైఎస్ జగన్ పర్యటనలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ గూండాలు ఎటువంటి దుస్సాహసానికైనా తెగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతితో పార్టీనే ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఆ వాహనంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని ఆయనకు అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసి వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జప్తు చేసింది. ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్రే...వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న విశేష ప్రజాదరణను తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పన్నుతోంది. ఆయన ఎంత విస్తృతంగా పర్యటిస్తే... తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయన్నది టీడీపీ పెద్దల భయం! జగన్ పర్యటనలకు దారి పొడవునా వేలాది మంది జనం తరలి వస్తుండటం ప్రభుత్వ పెద్దలను కలవరపరుస్తోంది. ఆ అక్కసుతోనే వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల మీడియా చానెళ్ల ఇంటర్వ్యూల్లో ప్రకటించడం గమనార్హం. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలను గమనిస్తుంటే చంద్రబాబు తన వ్యాఖ్యలను చేతల్లో చూపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్రమంగా జప్తు చేశారు. కేసు దర్యాప్తు పేరిట ఆ వాహనాన్ని సుదీర్ఘ కాలం జప్తులో ఉంచాలన్నది పన్నాగం.మరోవైపు టీడీపీ ప్రభుత్వం ఎలాగూ పూర్తి కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చదు. తద్వారా వైఎస్ జగన్ జిల్లా పర్యటనలను అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది. సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపైనా న్యాయ పోరాటం చేయనుంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వ కుతంత్రాలపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్నని తరచూ చెప్పుకునే చంద్రబాబు పూర్తి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బయటపడిన భద్రతా వైఫల్యాలుజడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. జిల్లా పర్యటనలపై ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా సరే కనీస స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో అనంతపురం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... ఆ ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు వైఎస్ జగన్ వాహనంపైకి చొచ్చుకొచ్చారు.ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్పైకి ఎక్కి మరీ హల్చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ మాజీ సీఎం వాహనం బానెట్పైకి యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు.. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకుని వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్కు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు హెలికాఫ్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొంటారు.టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. సూపర్సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఆ దిశలో పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువకులు చేపట్టిన ‘యువత పోరు’ విజయవంతం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో తన ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను.మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్–2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఆరు త్రైమాసికాల ఫీజు పెండింగ్మరోవంక 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్–2025 వరకు ఆరు త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్–2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్–2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వక పోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.చంద్రబాబూ.. మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటి కోసం డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయి. మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి
-
Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి భారీ ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్లో భారీ ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో.. గత ఏడాది అక్టోబర్లో ఆమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపాలికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. సొంత డబ్బులతో వైఎస్ జగన్ కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్కు కేటాయించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు. దాంతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు. ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ 26 సీఈ 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. -
అమరావతిలో మరోసారి భారీ ఎత్తున భూ సమీకరణ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయవాడ: అమరావతి కోసం కూటమి ప్రభుత్వ మళ్ళీ భూ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
‘ప్రశ్నించే గొంతుకు అన్నారు కదా.. ఆ గొంతు ఇప్పుడు ఏమైంది...?’
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగటం లేదని ధ్వజమెత్తారు. ‘టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవు. వాళ్లు మాట్లాడిన మాటలకు ఎటువంటి సెక్షన్లు వర్తించవు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాట్లాడితే మాత్రం వెంటనే ఎక్కడ లేని సెక్షన్లు పుట్టుకొచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించిన దాని గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ లు పెట్టి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోవాస్తవాలను వాస్తవాలుగా చూపించడం ,తప్పు జరిగిన చోట ఖండించడం జరగడం లేదు. పల్నాడు ఘటనలో ఎస్పీ ప్రెస్ మీట్ లో ముందు ఒకలా మాట్లాడారు.. ఈరోజు ఎస్పీని మ్యాను ప్లేట్ చేశారు.సెక్షన్లు మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నారు. జగనన్న ఎక్కడికి వెళ్ళినా జన సందోహం స్వచ్ఛందంగా వస్తున్నారు... అది చూసి నేతల తట్టుకోలేకపోతున్నారు.కూటమినేతలుచెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలకు కుమిలిపోతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా జగనన్నను గుర్తుచేసుకోని వారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మా మీద బురద చల్లడం కోసం మహిళలు మిస్ అయ్యారు అని అన్నారు. వాలంటీర్లకు 5000 ఏం సరిపోతాయి మీ పొట్టను కొట్టను అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరీపొట్ట కొట్టాడు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో దళితులు వెలివేతకు గురైతే కనీసం స్పందించలేదు. ప్రశ్నించే గొంతుకు అన్నారు కదా ఆ గొంతుక ఇప్పుడు ఏమైంది...?’ అని ప్రశ్నించారు తానేటి వనిత. -
లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులు చేపట్టిన ‘యువత పోరు’ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న(సోమవారం) నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్.లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఫీజు రీయింబర్స్మెంట్ మాట ఏమైంది?మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఇకనైనా తప్పులు సరిదిద్దుకోండి..చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు..@ncbn గారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని… pic.twitter.com/TIp3bv8rOm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
‘ చంద్రబాబు.. మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు’
తాడేపల్లి : ఏపీఎండీసీ తన ఖనిజ సంపదను మరోసారి తాకట్టుపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేందరనాథ్రెడ్డి స్సష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు(మంగళవారం, జూన్ 24వ తేదీ) రూ. 5,500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయానని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపైపై బుగ్గన ధ్వజమెత్తారు. ‘ఆస్తులనుగానీ, మద్యం ఆదాయాన్నిగానీ తాకట్టు పెట్టటం లేదని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి?, అప్పు చెల్లించకపోతే నేరుగా రాష్ట్ర ఖజానా నుండే తీసుకునేలా అప్పుల వారికి అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. లక్షా 91 వేల కోట్ల విలువైన 436 గనులను యధేచ్చగా తాకట్టు పెట్టేశారు. ప్రయివేటు పార్టీకి వెసులుబాటు కల్పించడం దారుణం. మా హయాంలో అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక, వెనుజుల అవుతోందంటూ విష ప్రచారం చేశారు. మా హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు హయాంలో 27% అప్పులు చేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడిన వారంతా ఇప్పుడు ఏమయ్యారు?, చేసిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?, పోలవరం నిర్మాణానికి వచ్చిన రూ. 5,052 కోట్లు ఏం చేశారు?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. పర్యావరణ అనుమతులు సహా అనేక క్లియరెన్సులు వారే తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలలో రివేంజులు కాదు, రియలైజేషన్ ఉండాలి. అంతేకానీ ప్రతిరోజూ అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్లటం సరికాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు అప్పులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదు?, రాజధాని నిర్మాణానికి అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాల సేకరణ చేశారు. కానీ ఆయన రిపోర్టును పక్కనపెట్టి 1500 ఎకరాల్లో రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత 35 వేల ఎకరాలను సేకరించారు. అసలు రాజధాని కట్టాలనుకుంటున్నారా? నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారా?, పచ్చని పొలాలను పాడు చేస్తున్నారు’ అని బుగ్గన మండిపడ్డారు. -
రేపు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు పాల్గొంటారని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. -
‘ఏడాదిలోనే చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల రూ.1.62 లక్షల కోట్లు’
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘ఓట్ల కోసం కూటమి నేతలు,ఎల్లో మీడియా వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు,లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు,పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని.. చంద్రబాబు,లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేశారు’అని ఆరోపించారు. -
దంగేటి జాహ్నవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Heartiest congratulations to Ms. Jahnavi Dangeti on being selected as an Astronaut Candidate for Titans Space’s ASCAN programme, for a mission slated for launch in 2029. Your brilliance makes every Indian and every Andhrite proud. Wishing you continued success as you inspire many… pic.twitter.com/P1JMDktu5p— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు?. లోకేష్కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్ఆర్సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. -
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందులో భాగంగా.. ఇరాన్ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్, నారాయణలు తెలిపారు. ఆపరేషన్ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్ 13వ తేదీన ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది. -
విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడుస్తూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్, సింటర్ ప్లాంట్లను ప్రైవేటపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్ప్లాంట్ యాజమాన్యం దరఖాస్తులకు ఆహ్వానించింది ఇప్పటికే పలు అనుబంధ విభాగాలను ప్రభుత్వం అమ్మేసింది.స్టీల్ ప్లాంట్ను కాపాడతామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోరెత్తడం లేదు. కూటమి ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోగా అనుబంధ విభాగాల ప్రైవేటుపరం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లంకెలపాలెం జంక్షన్లో ఘోర ప్రమాదం
పరవాడ/అనకాపల్లి టౌన్ : లంకెలపాలెం ప్రధాన జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న మార్కెట్ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలో విధులు ముగించుకుని వస్తున్న ఉద్యోగుల కారును ఢీకొనగా అందులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా.. దానిపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. తరువాత బొలేరా వాహనం, కంటైనర్, మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనగా ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చన్నాయుడు (52), అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (47), అగనంపూడికి చెందిన ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు (35) ఉన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. -
విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తు కారణంగా మరో కుటుంబం చిన్నాభిన్నమైంది. మద్యం సేవించి రోజు భార్య పిల్లలను భర్త పవన్ చితకబాదటంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుమారుడు మణికంఠ, తల్లి గీత మృతి చెందగా.. కుమార్తె యొక్షితని స్థానికులు కాపాడారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాతో సీఐ అసభ్యంగా ప్రవర్తించారు
నరసరావుపేట రూరల్: ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయి జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. షాపింగ్మాల్లో జరిగిన వివాదం గురించి మాట్లాడేందుకు ఈనెల 15న పోలీస్స్టేషన్కు వెళ్లానని, సీఐ తన కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరంగా దూషించాడని పేర్కొన్నారు. మూడు గంటలు స్టేషన్లో నిర్బంధించారని, ఇతర అధికారుల ముందు తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్కు వస్తే చెప్పు తీసుకొని కొడతానని, బ్రోతల్ కేసు నమోదు చేసి లోపల వేస్తానని సీఐ బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యతి్నంచానని వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. -
పాఠశాలను విలీనం చేస్తే.. నిరాహార దీక్ష చేస్తాం!
పుత్తూరు: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేస్తే నిరాహార దీక్ష చేస్తామని తిరుపతి జిల్లా పుత్తూరు మండలం ఎగువ గూళూరు గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ అశోక్రెడ్డికి వినతి పత్రం అందచేశారు. తడుకు పంచాయతీ పరిధిలోని పాఠశాలను శిరుగురాజు పాళెం పంచాయతీలోని దిగువ గూళూరులో ఉన్న పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉన్న పాఠశాలను మూసివేయడానికి ఎవరికీ అధికారం లేదనీ, ఇక్కడ చదువుతున్న దళిత విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకొనే పరిస్థితి లేదని చెప్పారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోతే అంబేడ్కర్ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. మా పాఠశాలే మాకు ముఖ్యం వరికుంటపాడు ఎస్సీకాలనీ వాసుల ఆందోళనవిద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్ విధానాన్ని విద్యావంతులు, ఉపాధ్యాయ లోకం విమర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పలువురు తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించబోమని స్పష్టం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సీ కాలనీలో 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మోడల్ స్కూల్ విధానంలో ఎస్సీకాలనీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను వరికుంటపాడు రామాలయం సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేశారు. అంతదూరం తమ పిల్లలు ఎలా వెళతారంటూ సోమవారం కాలనీ వాసులు పాఠశాల ఎదుట ఆందోళన చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు. మా పాఠశాలే మాకు కావాలంటూ నినాదాలు చేశారు. – ఉదయగిరి (వరికుంటపాడు) -
చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. సిగ్నల్ కట్ చేసి...
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్ కేబుల్ కట్ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జాతీయ రహదారులు రక్తసిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్లపై నిత్యం పలువురు ప్రాణాలను కోల్పోతుండగా, మరికొందరు గాయపడి మంచాలకు పరిమితమవుతున్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 2023లో దాదాపు 2,300 మంది మృత్యువాత పడ్డట్లు జాతీయ రహదారుల డేటా తెలుపుతోంది. 522 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎన్హెచ్–48పై గుజరాత్లో 763 మంది మృతి చెందారు.ఆ ఏడాదిలో దేశంలో ఎక్కువమంది మృతిచెందింది గుజరాత్లోనే. 266 కిలోమీటర్ల ఎన్హెచ్–44పై హరియాణాలో 715మంది మృతి చెందారు. ఇక 154 కిలోమీటర్ల ఎన్హెచ్–65పై ఆంధ్రప్రదేశ్లో 213 మంది దుర్మరణం చెందారు. దేశంలోని పది జాతీయ రహదారుల్లో మృతిచెందిన వారి డేటా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కేవలం 21మంది మృతిచెందిన రాష్ట్రంగా పుదుచ్చేరి నిలిచింది. ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో జాతీయ రహదారులపై వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది. -
తడబడే వయస్సు.. పొరబడే మనస్సు!
నిన్నటి వరకు పాఠశాల చదువు.. ఒక్కసారిగా కళాశాల వాతావరణం.. ఇంటర్ విద్యార్థులకు ఇదో కొత్త అనుభవం. కొత్త వారితో పరిచయాలు, సరికొత్తగా అనిపించే ఆలోచనలు.. ఇప్పుడిప్పుడే కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థికి ఇలా అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. టీనేజ్లో ఇంటర్మిడియెట్ దశ అత్యంత కీలకం. జీవితాన్ని మలుపు తిప్పాలన్నా ఇదే ముఖ్యమైన కాలం. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. జీవితం మళ్లీ మన చేతుల్లోకి రానంత వెనక్కి వెళ్తుంది. అందుకే ఇప్పుడిప్పుడే జూనియర్ కళాశాలల్లో చేరుతున్న వారు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఇంటర్ దశ కొత్త బంగారులోకమై భవిష్యత్ ఉజ్వలమయమవుతుంది. నంద్యాల(న్యూటౌన్): తొలిసారి ఎదుర్కొన్న పది పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలను చేరామన్న ఉత్సాహం.. కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కల్గించే ఆనందం.. ఇలా అన్నీ వెరసి విద్యార్థులకు ఇంటర్మిడియెట్ దశ ఓ కొత్త బంగారు లోకమే. అనువైన గ్రూపు, ఇష్టమైన సబ్జెక్టులు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇదని చెప్పవచ్చు. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్లోనే పడతాయనడంలో అతిశయోక్తి లేదు.ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించినా, గాడి తప్పి అధఃపాతాళానికి పడిపోయినా.. అంతా ఇంటర్లోనే బీజాలు పడతాయని చెప్పుకోవచ్చు. హైసూ్కల్ విద్యతో మొదలయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే జాగ్రత్త పడాలి. సినిమాల ప్రభావంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమాయణమంటూ మనసు కలుషితం చేసుకోకూడదు. స్నేహితులే లోకంగా అని్పంచే వయస్సులో వారికి అతి ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రుల, ఆధ్యాపకులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దురి్వనియోగం చేస్తే భవిష్యత్ అంధకారమే. చదువుకే ప్రాధాన్యం.. ఇంటర్లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.సమయం.. సద్వినియోగం ఇంటర్లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పారీ్టలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. స్నే‘హితులు’ ఇంటర్లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి. లక్ష్యానికి తొలి అడుగులు.. భవిష్యత్లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకైనా తొలి అడుగు పడాల్సింది ఇంటర్లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. -
60 కి.మీ నుంచి 900 కి.మీకు..
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన బదిలీల్లో అనేక తప్పులతో అభాసుపాలైన రాష్ట్ర సాంకేతిక విద్య, ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఏటా జోన్ స్థాయిలో జరిగే బదిలీలను ఈసారి సాంకేతిక విద్య డైరెక్టరేట్ నుంచి వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో చేపట్టనున్నారు. మంగళవారం ఈ ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్ విడుదల చేశారు. దీంతోపాటు జోన్–4లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేసే 56 మందిని జోన్–1లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్ నుంచి ఏప్రిల్ వరకు 11 నెలల కాలానికి ఆయా జోన్ల పరిధిలోని కాలేజీల్లో పనిచేసేందుకు విధుల్లోకి తీసుకుంటారు. కానీ ఈసారి కాంట్రాక్టు లెక్చరర్లను జోన్లు, రీజియన్లు దాటించి మరీ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు.. గతేడాది 200 మంది అధ్యాపకులను సర్దుబాటు పేరుతో బదిలీలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని రద్దు చేశారు. ఇకపై బదిలీల వ్యవహారం సవ్యంగా సాగుతుందని అందరూ భావించారు. అయితే గతానుభవాలను విస్మరించిన సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ మళ్లీ అదే రీతిలో బదిలీలకు తెరలేపింది. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి జోన్–4లో నియమించాల్సిన కాంట్రాక్టు లెక్చరర్లు 56 మందిని ఆంధ్రా రీజియన్ జోన్–1లో నియమించేందుకు నిర్ణయించారు. తక్కువ జీతాలకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో నియమించడం ఆశ్చర్యకరం.ప్రస్తుతం పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు 309 మంది ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో పీఆర్సీ అమలు చేయడంతో నెలకు రూ.61,960 వేతనం 10 రోజులు మినహా 12 నెలల కాలానికి పొందేవారు. కానీ కూటమి ప్రభుత్వం వీరి వేతనాన్ని రూ.54,060కు తగ్గించేందుకు నిర్ణయించింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో పాత వేతనమే ఉంచి ఉత్తర్వులిచ్చారు. దీంతోపాటు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి కూడా వీరిని తొలగించింది. ఇంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను జోన్ దాటి రీజియన్ పరిధిలోకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అరకొరవేతనంతో అంతదూరమా? ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండు నెలల క్రితం సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టారు. మూడేళ్లుగా విద్యార్థులు లేని కోర్సుల్లో లెక్చరర్ పోస్టులు సహా లెక్చరర్లను అవసరమున్న చోటికి తరలించారు. ఇటీవల రెగ్యులర్ బదిలీలు పూర్తి చేశారు. జోన్–1లో 2009లో ఏర్పాటు చేసిన కాలేజీల్లో మాత్రం లెక్చరర్లను నియమించలేదు. ఈ ప్రాంతానికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో జోన్ పరిధిలోని కాలేజీల్లోని రెగ్యులర్ లెక్చరర్లతో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం వర్క్లోడ్ పేరుతో దాదాపు 200 మంది రెగ్యులర్ లెక్చరర్లకు సర్దుబాటు బదిలీలు చేసినా జోన్ స్థాయిలో జరగాల్సినవి రీజియన్లనే మార్చి మరీ చేశారు.60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరంలో నియమించడంతో బాధితులు పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ ఈ ఏడాది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి బదిలీ చేసి వేధించడం తప్ప దీని ద్వారా ప్రభుత్వానికి, సాంకేతిక విద్యాశాఖకు వచ్చే లాభం ఏంటో తెలియడం లేదని వాపోతున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ.. ‘స్టాంప్ డ్యూటీ’ స్కామ్
అనంతపురం, సాక్షి అమరావతి, సాక్షి టాస్క్ఫోర్స్: ఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిíÙలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది.ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచి్చందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ...ఒక్కటి తగ్గింది బాబు!
సాక్షి, అమరావతి: పుష్ప సినిమాలో పోలీస్ అధికారి పాత్రధారి ‘ఒకటి తగ్గింది పుష్ప’ అని చెప్పే డైలాగ్ చాలా పాపులర్ అయింది. యోగాంధ్ర పేరిట గిన్నీస్, వరల్డ్ బుక్ రికార్డులు బద్దలు కొట్టామని కూటమి ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది. ఈ క్రమంలో ‘ఒక రికార్డు తగ్గింది బాబు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఊపందుకున్నాయి. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మరణించిన వారి ఆత్మలతో సైతం యోగా చేయించి ఆ రికార్డును నమోదు చేసుకోవడాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని నెటిజనులు చింతిస్తున్నారు.ఆత్మలను సైతం తట్టి లేపి యోగా చేయించిన ఘనత ప్రపంచంలో చంద్రబాబుకు తప్ప మరెవరికీ దక్కలేదన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన షేక్ జహరాబీ 2017లో మరణించింది. ఆమె మరణాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ సైతం విడుదల చేసింది. కాగా, జహరాబీ యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులకు మెసేజ్ వచ్చింది. అంతేకాదు ప్రభుత్వం ప్రశంసాపత్రాన్ని సైతం జారీ చేసింది. ‘యోగా డే గ్రాండ్ సక్సెస్ అయింది. రికార్డులన్నీ బద్దలు కొట్టేశాం.’ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న క్రమంలో జహరాబీ డెత్ సర్టిఫికెట్, యోగాంధ్రలో రిజి్రస్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన సందేశాలు, ప్రశంసాపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం
తాగు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గానీ మద్యం దొరకని చోటు లేదు... వేల సంఖ్యలో బెల్టు షాప్లు... దర్జాగా లిక్కర్ దందా... ఎవరికి అందాల్సిన మొత్తం వారికి... వాటాలు కుదరనిచోట నెలవారీ ముడుపులు..! సిక్కోలు వాకిట్లో ఇదీ మద్యం సిండికేట్ల రాజ్యం..! మద్యం ద్వారా ఆదాయం ముంచెత్తాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు గేట్లు ఎత్తారు...!శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు, సిండికేట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షాప్ పరిధిలోని గ్రామాల్లో 10 నుంచి 40 బెల్ట్ షాప్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 10 వేలపైనే అని అంచనా. ఇవన్నీ బార్లను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నివాస గృహాలు, చిన్న చిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. క్వార్టర్ బాటిల్పై రూ.30 నుంచి రూ.50 అదనంగా అమ్ముతున్నారు. కొన్నిచోట్ల లైసెన్స్ దుకాణాల కౌంటర్లలోనే రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. వైన్ షాప్లు, బార్లలో నిర్దేశిత వేళల్లో మద్యం దొరుకుతుంటే బెల్ట్షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఇక బార్లలో మాదిరిగా బెల్ట్షాప్లలో ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం⇒ బెల్ట్ షాప్లు, లైసెన్స్ దుకాణాల వద్ద అనధికారికంగా పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు, ఎంఆర్పీకి మించి అమ్మకాలకు నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తమవంతు సాయం చేసినందుకు షాప్ల యజమానులు, సిండికేట్ల నుంచి ముడుపులు, వాటా తీసుకుంటున్నారు. సిండికేట్ ఏర్పాటైనచోట నేతలు అదనపు వాటా పొందగా, అది లేనిచోట లైసెన్స్ షాప్నకు నెలకు రూ.లక్ష చొప్పున తీసుకుంటున్నారు.రాజాంలో మొదలై జిల్లా అంతటికి విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే రాజాం నియోజకవర్గంలో లిక్కర్ దందా మొదలైంది. లైసెన్స్ షాపుల యజమానులందరినీ సిండికేట్ చేశారు. ఇందులో సభ్యుడిగా నియోజకవర్గ కీలక నేతను చేర్చారు. లాభాల్లో వాటాను కీలక నేతకు ఇస్తున్నారు. అంతా ఏకం కావడంతో ఎంఆర్పీకి మించి విక్రయాలే కాదు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులూ నడుపుతున్నారు.నెలకి షాపునకు రూ.లక్ష శ్రీకాకుళం నియోజకవర్గంలోనైతే సిండికేట్ లేదు కానీ బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఎంఆర్పీకి మించి విక్రయాలు జరుగుతున్నాయి. చూసీ చూడనట్టున్నందుకు నియోజకవర్గ నేతకు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.లక్ష ముట్టజెబుతున్నారు. అధికారులే సూత్రధారులై ఆ ఒప్పందం అమలు చేస్తుండడం గమనార్హం. టెక్కలి, ఆమదాలవలసలో సోదరుల పెత్తనం టెక్కలి, ఆమదాలవలసల్లో కీలక నేతల సోదరులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలసలో కొన్ని షాపులు సిండికేట్లో కలవలేదు. వాటి యజమానులు నెలవారీ ముడుపులిస్తున్నారు. పాతపట్నంలో కూడా వ్యాపారులంతా సిండికేటై, అక్కడున్న నేతకు వాటా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్పై రూ.30 అదనంగా పిండుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో నెల వారీ మామూళ్లు కొనసాగుతున్నాయి.నరసన్నపేటలో మొత్తమంతా కీలక నేతకేనరసన్నపేటలో కీలక నేత పంట పండింది. కలిసి మద్యం వ్యాపారం చేసుకుందామని నమ్మబలికి అనుచరులు, నాయకుల దగ్గరి నుంచి రూ.20 కోట్లకు పైగా సేకరించారు. వారికి వ్యాపారంలో వాటా ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాలకు దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. తీరా తన కుటుంబ సభ్యుల పేరునే ఎక్కువగా దరఖాస్తులు చేశారు. వారి కుటుంబసభ్యులకే లాటరీలో ఎక్కువ దుకాణాలు వచ్చాయి. రూ.20 కోట్లు ఇచి్చన నాయకులు, అనుచరులను దూరంపెట్టారు. వారి డబ్బూ తిరిగివ్వలేదు. వాటాలూ ఇవ్వలేదు. దీంతో ఆగకుండా.. నియోజకవర్గంలో మిగతావారికి దక్కిన షాపులను సైతం బెదిరించి సిండికేట్లో కలిపారు. పైసా పెట్టుబడి లేకుండా తానొక వాటా తీసుకుంటున్నారు.పలాసలో అల్లుడి దందా పలాసలో సీనియర్ నేత అల్లుడే చక్రం తిప్పుతున్నారు. వ్యాపారులందరినీ సిండికేట్గా చేయడమే కాక లైసెన్స్ షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్పై రూ.20 అదనంగా అమ్మేలా దారి చూపించారు. ప్రతిఫలంగా సిండికేట్లో వాటాతో పాటు షాపుల నుంచి నెల వారీ ముడుపులు తీసుకుంటున్నారు. జిల్లాలో లైసెన్స్ షాప్ల కౌంటర్లలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టడం పలాసలోనే మొదలవడం గమనార్హం.మద్యం మత్తులో గ్రామాలు ప్రభుత్వం తీసుకొచి్చన విధానంతో పాటు బెల్ట్షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి సిక్కోలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలు, గొడవలు జరుగుతున్నాయి. జనవరి 19న శ్రీకాకుళం న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను అతి కిరాతకంగా ఓ యువకుడు చంపేశాడు. ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీ కాలనీలో మద్యం మత్తులో సాహుకారి ఢిల్లీశ్వరరావు భార్యను హత్య చేశాడు. మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను భర్త అప్పలరెడ్డి దారుణంగా నరికి చంపాడు. కాశీబుగ్గలో మద్యం మత్తులో ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం బలగ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బీరు సీసాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. -
హోరెత్తిన ‘యువత పోరు’
సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ అంటూ ఉత్తుత్తి హామీతో... నిరుద్యోగ భృతి పేరిట నయవంచనకు పాల్పడిన కూటమి ప్రభుత్వంపై యువత, విద్యార్థులు కన్నెర్రజేశారు. అరొకరగా నిధులు విడుదల చేస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెనపై కపట ప్రేమ చూపుతున్న సర్కారు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీశారు. మాట తప్పి... వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ ముందుకు కదిలారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటివరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. విద్యా దీవెన కింద రూ.4,200 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు... మొత్తం రూ.6,400 కోట్లకు గాను, రూ.750 కోట్లు విదిలించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనలను క్రమంతప్పకుండా ఠంఛనుగా అందించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. 2024 జనవరి వరకు నిధులను క్లియర్ చేసింది. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికం బిల్లులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మేలో విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు క్వార్టర్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ సోమవారం ‘యువత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కదంతొక్కారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు వందలాది మంది ప్లకార్డులు చేతబట్టి ‘బాబు వచ్చాడు... వాలంటీర్లను రోడ్డుపై నిలబెట్టాడు, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు తొలగించాడు.. నిరుద్యోగ భృతి ఎప్పుడు?.. గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు... ప్రతి నిరుద్యోగికి రూ.36 వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలి.. ఫీజులు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం... వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి’ అని నినదించారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. వలంటీర్లను రోడ్డున పడేయడంతో పాటు ఇంటింటికి నిత్యావసర సరకులు అందిస్తున్న రేషన్ వాహనాలను నిలిపివేసి ఆపరేటర్ల జీవనోపాధిపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ, యువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడలో ‘యువత పోరు’ ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు ⇒ విజయవాడ ధర్నాచౌక్లో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు చేపట్టారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నాచౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు (కాళీ) అధ్యక్షతన జరిగిన యువత పోరులో మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), సింహాద్రి వికాస్, పలువురు అనుబంధ విభాగాల నాయకులు ప్రసంగించారు.ఆంక్షల నడుమ..⇒ ప్రకాశం జిల్లాలో యువత పోరుపై అడుగడుగునా పోలీసులు అంక్షలు విధించారు. కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచే భారీగా బలగాలను దించారు. అంబేడ్కర్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలూ రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. అయినా జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబేడ్కర్ భవనం వద్ద జరిగిన సభలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు ⇒ రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా కక్షసాధింపు రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరులో యువత పోరులో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. రిక్షా తొక్కుతూ..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై రిక్షా తొక్కుతూ పరిస్థితిని చాటి చెప్పారు. కలెక్టరేట్ వరకు ప్రభుత్వ తీరుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ తీశారు. ‘తూర్పు’న కదం తొక్కిన యువతరాజమహేంద్రవరంలో కలెక్టరేట్కు వెళ్తున్న యువత పోరు భారీ ర్యాలీని బొమ్మూరు సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, యువజన సంఘం నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురంలో పోలీసులను దాటి మరీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్సీపీ యువత పోరుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పారు. కలెక్టరేట్కు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మూడుసార్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ సమీపాన బారికేడ్లు, రోప్ పార్టీలతో నిలువరించారు. మహిళా నేతలు, కార్యకర్తలను సైతం పోలీసులు వెనక్కు నెట్టేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని ముందుకు వచ్చారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు భారీగా తరలివచ్చిన యువత ⇒ కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం, జెడ్పీ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మూకుమ్మడిగా కలెక్టరేట్కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, మహావీర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ చేరింది. అనంతరం డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ⇒ నంద్యాలలో యువత పోరుకు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ⇒ తిరుపతిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, నగర అధ్యక్షుడు దినేష్రాయల్, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్రెడ్డి, చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా యువత, విద్యార్థులు యువత పోరులో పాల్గొన్నారు.శ్రీకాకుళంలో జడివానలోనూ...⇒ శ్రీకాకుళంలో జడివానకు పార్టీ శ్రేణులు యువతతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో జిల్లా పరిషత్ ఏరియా దద్దరిల్లింది. జనమంతా వానలోనే ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరి నుంచి బయల్దేరారు. గంటకుపైగా నిరసన తెలిపారు. గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు పోలీసు ఆంక్షల వలయంలోనూ యువత పోరును విజయవంతం చేశారు. తమకు కావల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాలంటూ నినదించారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో యువత పోరు హోరెత్తింది. వర్షానికి వెరవకుండా గర్జించింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా యువత తగ్గలేదు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టరేట్లు దద్దరిల్లాయి.⇒ పాడేరులో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో యువత వర్షం సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.పల్నాడులో లాఠీ ప్రతాపంపల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వందలాది విద్యార్థులు, యువత శాంతియుత ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహన్ని ప్రశ్నించేందుకు జిల్లా నలుమూలల నుంచి యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా... వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. తొలుత వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు బయల్దేరిన ర్యాలీని ఎస్పీ ఆఫీసు ఎదుట బారికేడ్లతో అడ్డుకున్నారు. నాయకులతో పాటు 50 మందిని మాత్రమే కలెక్టరేట్ వైపు అనుమతిస్తామని చెప్పారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు అంగీకరించడంతో బారికేడ్లను తెరిచారు. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బారికేడ్ల వద్ద ఉన్నవారిపై లాఠీలతో విరుచుకుపడడంతో యువత పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో కిందపడినవారి పైనా పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పి.గౌతమ్రెడ్డిలు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.⇒ గుంటూరు జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, యువతను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పడంతో పది మంది ముఖ్య నేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. ⇒ బాపట్లలో భారీ నిరసనలతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. పోలీసులు ఆంక్షలు విధించినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అక్కడే బైఠాయించారు. రథం బజారు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. -
మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసిన వారి గుర్తింపు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై తరచూ దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కూడా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వైఎస్ జగన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయారు. ఈ ఘటనపై ఆదివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు ఆ కారును గుర్తించి తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం వారి వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.‘తెనాలికి చెందిన కుమార్ వంశీ, ధరణిసాయి స్నేహితులు. కుమార్వంశీ చెన్నైలో, ధరణిసాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక వీకెండ్లో తెనాలి వచ్చి ధరణిసాయికి చెందిన ఏపీ 39 బీక్యూ 1496 నంబరు గల కారులో తిరుగుతూ ఉంటారు. శనివారం కారుకు ఇంజిన్ ఆయిల్ మార్పించుకుని ఉండవల్లి సెంటర్ మీదుగా స్క్రూ బ్రిడ్జి దాటి సీతానగరం మీదుగా మంగళగిరిలోని మిత్ర దాబాకు వెళ్లారు. మార్గంమధ్యలో కారు దిగి మూత్రం పోసుకుని అక్కడున్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్లారు.మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారు. అది పొరపాటుగా జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, వారు మూత్రం పోసిన ప్రదేశంలోని తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని ఆడుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెప్పిన ప్రకారం డంపింగ్ యార్డు వద్ద మలమూత్రాలను విసర్జిస్తారు. అలాంటి ప్రాంతంలో పడి ఉన్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని పొరపాటున విసిరినట్లు పోలీసులు చక్కగా వారికి ట్రైనింగ్ ఇచ్చి కట్టుకథను చెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రెస్మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించకుండా వారిద్దరూ పొరపాటు అయ్యిందని చెప్పిన వీడియోను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ నివాసం వద్ద ఎప్పుడూ సందర్శకులు ఉంటారు. అయినా అక్కడే కారు అద్దం దించి తాటికాయలు ఎలా లోపలికి విసిరేశారనే విషయాలను పోలీసులు ప్రశ్నించకుండానే, వారు చేసింది పొరపాటు, పోలీస్ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలివేశామని చెప్పడం విశేషం. -
మీరు తప్పులు చేసి.. మా నుంచి రికవరీ ఏంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం పెడుతున్న టార్గెట్లతో తాము చేయని తప్పులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా బలి కావాల్సి వస్తోందంటూ కార్యాలయ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఉపాధి హామీ పథకం పనుల కోసం వచ్చిన శ్రామికులకు రోజుకు రూ.300 తగ్గకుండా వేతనం వచ్చేలా చూడాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు టెక్నికల్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అందుకు సహకరించని వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.దీనివల్ల శ్రామికులు పనిచేయకపోయినా రోజుకు రూ.300కు పైగా వేతనం వేస్తుండటం వల్ల కొలతల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని పేర్కొన్నారు. ఆ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీల్లో కొలతల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నికల్ సిబ్బందిపై చేయని తప్పులకు అభియోగాలు మోపి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్షల రికవరీకి బాధ్యుల్ని చేస్తుండడం అన్యాయమని వాపోయారు. శ్రామికులు ఎంత పనిచేస్తే అంత మొత్తం కూలీ నమోదు చేసేలా సిబ్బందికి స్వేచ్ఛ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజకు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామచంద్రయ్య నేతృత్వంలోని సంఘ ప్రతినిధులతో ఉపాధి హామీ పథకం విభాగం డైరెక్టర్ షణ్ముఖకుమార్, ఆడిషనల్ కమిషనర్ శివప్రసాద్ చర్చలు జరిపారు. అనంతరం కమిషనర్ వీఆర్ కృష్ణతేజ్ సంఘ ప్రతినిధులతో భేటీ అయ్యారు. టెక్నికల్ సిబ్బందిపై అనవసరమైన అభియోగాలు మోపడం, రూ.లక్షల రికవరీలకు బాధ్యులను చేయడం తదితర అంశాలపై ఆయా విభాగాల సిబ్బందికి తగిన సూచనలు చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారని చర్చల అనంతరం జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. -
48 గంటల్లోగా ధాన్యం సొమ్ము ఇవ్వాలి
సాక్షి, అమలాపురం/పిఠాపురం: ‘రైతులను పట్టించుకోండి. పండించిన పంటకు ఇవ్వాల్సిన సొమ్మును 48 గంటల్లో ఇవ్వడి. రైతు పరిస్థితి అస్సలు బాలేదు. పురుగుల మందు తాగి చావాల్సిన దుస్థితి వచ్చింది. మీరే మమల్ని చంపేస్తున్నారు’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన రైతు వర్రే నాగబాబు రెండు చేతులూ జోడిస్తూ వేడుకున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు వేలాదిగా ఉన్నారు. మే 9 నుంచి ధాన్యం బకాయిల చెల్లింపులు ఒకపైసా కూడా ఇవ్వలేదు. రబీ రైతులకు ఇంకా రూ.248.65కోట్ల వరకూ ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రబీ ధాన్యం అమ్మినా కూటమి ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ధాన్యం సొమ్ము వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము ఖరీఫ్ సాగు చేయలేమని, సాగు సమ్మె చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(పాడా) కార్యాలయం వద్ద కూడా ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు ధర్నా చేశారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిబ్బంది తీసుకోలేదు. సమస్యను వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్లే
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు అధ్యాపకులపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కును పోలీసుల బలగాలతో కాలరాసింది. దీంతో అధ్యాపకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగి్వవాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సోమవారం మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో హక్కులకు పాతరేస్తూ తీసుకొచి్చన కొత్త కాంట్రాక్టు అగ్రిమెంట్లోని నిబంధనను తప్పుపట్టారు.ఉద్యోగ భద్రత లేకపోతే తమ జీవితాలు రోడ్డునపడినట్లేనని ఆందోళన వ్యక్తంచేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న తమను నిత్యం మానసికంగా చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న తమకు మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎం) అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ సిబ్బందిలా తమకు డీఏ, హెచ్ఆర్ఏలతో కూడిన ఎంటీఎంను అందించాలని కోరారు.ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65కు పెంచాలని, భవిష్యత్తులో వర్సిటీల్లో నియామకాల సమయంలో తమ పోస్టులను మినహాయించి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తినికి వినతిపత్రం సమరి్పంచారు. ఏపీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్స్ సమాఖ్య(కాంట్రాక్టు), అధ్యక్షుడు డాక్టర్ కె.అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు వర్తింపజేయండి
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నాలు జరిగాయి. ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, వేతనాలను పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్లకు, అధికారులకు సమరి్పంచారు. విజయవాడ ధర్నాచౌక్లో చేపట్టిన ధర్నాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించాలన్నారు.ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిగణించడంతో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని, వాస్తవానికి వర్కర్లకు రూ.11,500, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7 వేలు మాత్రమే జీతం ఇస్తున్నప్పటికీ వారికి పథకాలు అందడం లేదన్నారు. ధర్నా అనంతరం ఆటోనగర్లోని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగి్వవాదం జరిగింది. చివరకు పోలీసులు అడ్డు తప్పుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్ సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు. -
బీసీ గురుకులాలకు 130 గెస్ట్ టీచర్ పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 65 బీసీ గురుకులాల్లో రెండు చొప్పున మొత్తం 130 గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఎస్) బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్(బీవోజీ) సమావేశం నిర్ణయించింది. సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.715 మంది ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కో–ఆర్డీనేటర్ పోస్టుల భర్తీకి, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపారు. గురుకులాల్లో విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారంతోపాటు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందించేందుకు నిర్ణయించారు. -
వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ నిబంధనల్లో మార్పు
సాక్షి, అమరావతి: వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సొంత మండలం నిబంధన నుంచి వార్డు సచివాలయాల ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సొంత వార్డు పరి«ధిలో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులకు గానీ, ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు గానీ బదిలీపై వెళ్లేందుకు అర్హులని తెలియజేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలి‘వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత పట్టణంలోని మున్సిపాలిటీల్లోనే బదిలీలకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ’ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సమంజసం కాదు. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సైతం వారి సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాని పాషా, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో వినతులుగ్రామ సచివాలయాల ఉద్యోగులకు కూడా సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ మంగళవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో తెలిపింది. -
విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం
సాక్షి, అమరావతి : పలు డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఆ కాలేజీల్లోని విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కాలేజీలు ఫీజు చెల్లించకుంటే, అందుకు విద్యార్థులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించింది. ‘ఫీజులు చెల్లించని కాలేజీలను ఉరి తియ్యండి. మేం ఎంతమాత్రం జోక్యం చేసుకోం.కానీ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే మాత్రం చూస్తూ ఉరుకోం. మాకు విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. ఇంతకుమించి మాకు ఏదీ ముఖ్యంకాదు. ఫలితాలు వెల్లడించకుంటే అది విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరీక్ష ఫలితాలను వెల్లడించకుండా ఆపేస్తామంటే మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదు. కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించకుంటే, అసలు ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎందుకు అనుమతినిచ్చారు? చేరిన విద్యార్థులను మరో కాలేజీకి తరలించి ఉండాల్సింది.ఇవేవీ చేయకుండా విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారి పరీక్ష ఫలితాలను నిలిపేయడం ఏంటి? మేం కాలేజీల వైపు లేం.. విద్యార్థుల పక్షానే ఉన్నాం. అసలు కోర్టుకొచి్చన డిగ్రీ కాలేజీలకు చెల్లించాలి్సన స్కాలర్షిప్పుల బకాయిలను ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? తదితర వివరాలను మా ముందుంచండి’.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాగార్జున యూనివర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాలి్సన అఫిలియేషన్ ఫీజు, పరీక్ష ఫీజులను చెల్లించలేదన్నారు. ఈ సమయంలో కాలేజీల తరఫు న్యాయవాది అనుపమాదేవి జోక్యం చేసుకుంటూ, పరీక్ష ఫీజులను చెల్లించామన్నారు. అఫిలియేషన్ ఫీజును మాత్రమే చెల్లించలేదని, కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. . న్యాయమూర్తి స్పందిస్తూ.. కాలేజీలు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థుల పరీక్షల ఫలితాలను ఆపడానికి వీల్లేదన్నారు. బకాయిల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేశారు.ఫలితాల నిలుపుదలపై హైకోర్టుకు కాలేజీలు..తమ కాలేజీల్లో చదువుతూ 6వ సెమిస్టర్ పరీక్షలు రాసిన 2022–25 బ్యాచ్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ వెల్లడించకుండా నిలిపేయడాన్ని సవాలుచేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్.. వర్సిటీ రిజిస్ట్రార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
సింగయ్య చనిపోయే అవకాశమే లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. తేలికపాటి గాయాలే అయ్యాయి హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్ చెప్పి.. ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు. సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్గా తేల్చుకుంటా’ అని చెప్పారు. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్ను తాడేపల్లి స్టేషన్కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్చేసి, డ్రైవర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
చంద్రబాబే యమకింకరుడు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్)గోదావరి పుష్కరాలు... బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా? కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్) ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభతన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణంచంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2018 మార్చి 31న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్) గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాతచంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్ ట్రిక్తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణంపవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాబు గద్దింపు ఇదీ..!ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..? జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...? బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతిగతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. -
మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్’ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఏమన్నారంటే.. చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్కళ్యాణ్గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్ రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్ ఇది.మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్కు సంబంధించిన రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత.. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్ పార్టీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. ⇒ మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ⇒ జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. ⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?⇒ ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్మీట్ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు.. వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం! -
‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’
తాడేపల్లి: న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి మరీ పోలీసులు కేసులు పెడుతున్నారని, ఈ సాంప్రదాయం మంచిది కాదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్శంగా చోటు చేసుకున్న సింగయ్య ఉదంతంపై పోలీసులు చెబుతున్న వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. ఆ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతోందని, ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు ప్రాతిపదికగా తీసుకున్న వీడియోకి ముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాల వీడియోలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైఎస్ జగన్ వాహనాన్ని నడిపింది కూడా ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్. అనేక ఏళ్లుగా ఆయన కార్లు నడపడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. పోలీస్ విచారణలో తన కారు కింద వ్యక్తి పడిపోయినట్టు కూడా తెలియదని చెప్పాడు. ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగిందని అనుకున్నా దానికి డ్రైవర్ పై బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టి నోటీసులివ్వాలి. కారులో ఉన్నవారందరికీ తెలిసి కూడా నేరం చేసినట్టు పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. కారులో ఉన్నవారందరి మీదా కేసు పెట్టడం పూర్తిగా కక్షపూరితం’ అని మనోహర్రెడ్డి తెలిపారు.పోలీసులు స్క్రిప్టును ఎందుకు మార్చారు?మొదటి రోజున టాటా సఫారీ వాహనం ఢీకొని చనిపోయాడని చెప్పి దాన్ని సీజ్ చేసిన పోలీసులు, మూడు రోజుల తర్వాత స్క్రిప్టును ఎందుకు మార్చారు? డ్రైవర్పై కేసు నమోదు చేస్తే ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ డ్రైవింగ్ కింద నమోదు చేశారని అనుకోవచ్చు. విపరీతమైన క్రౌడ్ ఉన్న కారణంగా అక్కడ ర్యాష్ డ్రైవింగ్ కి అవకాశమే లేదు. కాబట్టి డ్రైవర్ మీద కూడా కేసు పెట్టే అవకాశం పోలీసులకు లేదు. పైపెచ్చు కారులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి సహా, ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఆ మేరకు భద్రత కల్పించలేదు. రోప్ పార్టీ, మాజీ సీఎం వాహనానికి ముందుగా పైలట్ వాహనం, ఆయన చుట్టూ పోలీసు భద్రత వంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ పాటించలేదు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అభిమానులు ఆయన కారుపైకి కూడా ఎక్కే పరిస్ధితులు నెలకొంటున్నాయి.చంద్రబాబు మీద కేసులు పెట్టలేదే? 2015, 2016లో సంవత్సరాల్లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ సంఘటనల్లో చంద్రబాబు మీద కేసులు పెట్టారా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 29 మంది అమాయక భక్తులు చనిపోయినా ఆయన మీద కేసు పెట్టలేదు. అదేవిధంగా 2022 డిసెంబర్లో చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో 8 మంది చనిపోయినా దానికి చంద్రబాబుని బాధ్యుడ్ని చేసి ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వం కేసు పెట్టలేదు. 2023 జనవరిలో గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన మరో తెలుగుదేశం సమావేశంలో ముగ్గురు చనిపోయారు. ఆరోజు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చంద్రబాబు మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేయలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతరవైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా నేటి కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అందులో ప్రయాణించే వారి మీద కేసు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని పరిశీలిస్తే దేశ చరిత్రలో ఒక్క కేసు కూడా కనపడలేదు. అంటే, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం కొత్త అధ్యాయాలకు తెరతీస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు పెట్టివైఎస్సార్సీపీ నాయకులను వేధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది పోలీసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికొచ్చింది. ఇలాంటి విధానం రాష్ట్రానికి మంచిది కాదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీలు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే వ్యవస్థలను నాశనం చేయడంలో ఇదొక భాగం అవుతుంది. వ్యవస్థలను చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు. -
సుపరిపాలన సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీదే అధికారం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు సజ్జల. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం కావడమే కాదు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమయ్యేలే చేశారని సజ్జల విమర్శించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన 'పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం, పంచాయతీరాజ్ విభాగంను బలోపేతం చేయాలని జగన్ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్లో బలంగా ఉండాలి.కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం.ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్సార్సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దాం’ అని సజ్జల సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం..మన పంచాయతీ రాజ్ విభాగం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ‘ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’ అని పిలుపునిచ్చారు. -
స్వీపర్ పోస్టుకు కమిషన్ డిమాండ్.. మహిళపై టీడీపీ నేత వేధింపులు
సాక్షి,కృష్ణాజిల్లా : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు మరింత బరితెగిస్తున్నారు. స్కూల్లో స్వీపర్ ఉద్యోగం ఇప్పించినందుకు కమిషన్ ఇవ్వాలంటూ మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ నీలం రమేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అదేంటని ప్రశ్నించినందుకు దాడికి దిగాడు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరంలోని స్కూల్లో ఓ మహిళకు రమేష్ స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. స్వీపర్ ఉద్యోగం చేసినందుకు గాను సదరు మహిళకు వచ్చే జీతం రూ.6వేలు. అందులోనే తన కమిషన్ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఖాతాలో ఆరు నెలల వేతనం జమైంది.ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేత రమేష్ తన కమిషన్ ఇవ్వాలని మహిళను వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలి భర్త బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై బాధితురాలి భర్తపై రమేష్ దాడికి దిగాడు. టీడీపీ నేత రమేష్ నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు. -
‘ ఎస్పీ ముందు ఒకటి చెప్పి.. తర్వాత మాట మార్చారు’
విశాఖ : సింగయ్య మృతిపై టీడీపీ, ఎల్లో మీడియా అనవరసర రాద్దాంత సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ.. ఆపై మాట మార్చారన్నారు. ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జిమ్మిక్కులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఈరోజు( సోమవారం,. జూన్ 23) విశాఖలో ప్రెస్మీట్ నిర్వహించిన బొత్స.. కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ‘రెంటచింతలకు వైఎస్ జగన్ వెళ్ళినప్పుడు భారీగా అభిమానులు తరలి వచ్చారు.. సత్తెనపల్లి జగన్ వెళ్ళినప్పుడు పోలీసుల వైఫల్యం కనిపించింది.. పోలీసులు మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కల్పించలేదు. పోలీసులు ముందు ఒకమాట.. తరువాత మరో మాట మాట్లాడారు. ఎల్లో మీడియాలో కధనాలు వచ్చాక పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో దిక్కుమాలిన, దిగజారిన పాలన సాగుతుంది. సింగయ్యను కాన్వాయ్ వాహనం ఢీ కొట్టలేదని ఎస్పీ చెప్పారు..మళ్ళీ ఆయన మాట మార్చారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి.. పాలన దిగజారిపోయింది. గాయలతో ఉన్న సింగయ్యను ప్రైవేటు వాహనంలో తరలిద్దాం అంటే 108 లోనే పంపిద్దాం అని పోలీసులు చెప్పిన మాట వాస్తవం కాదా?, పాలన వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున జగన్ పర్యటనలకు ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ సహా ఇతర పక్షాలు మూడేళ్లు కనపడలేదు. గురివింద గింజలా ఉంది మంత్రుల శైలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బాబు, పవన్ లకు ఎప్పుడైనా భద్రతా ఇబ్బందులు ఉన్నాయా..?, ఇది ప్రజాస్వామ్యం ఎవరి సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ప్రభుత్వ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. జగన్ వాహనం దగ్గర ఉండాల్సిన రోప్ పార్టీ ఎక్కడ ఉంది. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదునిజంగా ఘటన జరిగితే మీ పోలీసు వ్యవస్థ ఎక్కడుంది.. జగన్ పర్యటనలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంతో రాద్దాంతం చేస్తుంది. సింగయ్య మరణం మమ్మల్ని చాలా బాధించింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా చనిపోయిన కార్యకర్తలను ఏనాడైనా ఆధుకున్నారా..?, ప్రభుత్వం వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. సత్యసీలుల్లా మాట్లాడుతున్న మంత్రులు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది..చంద్రబాబు తాబెదారులకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఆడ బిడ్డ నిధి ఎక్కడిచ్చారు..?, P4 కాన్సెప్ట్ ఏమిటి..?, P4 వలన ఒరిగింది ఏమిటి..? సమాధానం చెప్పాలి. చంద్రబాబుని ఎప్పుడు గెలిపించినా మోసం, ధగా తప్పదు. యోగా డే కోసం ఇంత ఖర్చు అవసరమా..?, యోగా డే వలన ఏమిటి..?విశాఖకు ఏం మంచి జరిగింది..?, మనకు జరిగిన ప్రయోజనం ఏంటి..? సమాధానం చెప్పాలి. ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ ప్రాంతానికి ఏదో మేలు జరగాలి. ఋషికొండ భవనాలను ఒక మాన్యుమెంట్ లా తయారు చేసాం. ఋషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే బిల్స్ ఎందుకు ఇచ్చారు.. యోగా డే వైఫల్యం కావడంతో సింగయ్య మరణంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. సింగయ్య మరణం బాధాకరం.. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. పల్నాడు లాటీ ఛార్జ్ ఎందుకు చేశారు. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?, ప్రభుత్వాన్ని ఇలాగే నడుపుతారా?, చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మీరెవరు ప్రశ్నించడానికి అని బాబు అడుగుతున్నాడు. ప్రభుత్వ మెడలు వంచి తల్లికి వందనం ఇప్పించాం. మేం మాట్లాడకపోతే మరో మూడేళ్లు ప్రజలకు పథకాలు వచ్చేవి కాదు. మేం ప్రజల తరఫున పోరాడటానికే ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతాం. బలహీన వర్గాల తరఫున పోరాడుతాం. బాబు మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు.. ఎవడి తాట తీస్తావ్. భూ స్థాపితం చేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు.. ఏంటి ఆ మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడి సీఎం కుర్చీ స్థాయిని దిగజార్చద్దు’ అని బొత్స హెచ్చరించారు. -
పేర్ని నానికి భారీ ఊరట
సాక్షి, అమరావతి: ఇళ్ల పట్టాల కేసులో మాజీమంత్రి పేర్ని నానికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని వివరణ తీసుకోకుండా ఎలాంటి కేసు నమోదు చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాల అంశంలో తనపై ఆరోపణలు రావడంపై ఆయన హైకోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు ఇవాళ కోర్టుకు వివరించారు. ఈ తరుణంలో.. ఒకవేళ భవిష్యత్లో ఈ అంశంపై కేసు కడితే పేర్ని నాని వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పేర్ని నాని వాదన పూర్తిగా విన్న తర్వాతే ప్రభుత్వం విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో తనపై చర్యలు తీసుకోకుండా జూన్ 11, 2025న పిటిషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలో అర్హులకే పట్టాలు ఇచ్చారని, తనకు, తన కుమారుడు పేర్ని కిట్టూకి ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. -
‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు రోజా. అదే సమయంలో ఈవీఎం ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ‘కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు. ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్నారు హోం మంత్రి, గోడ కూలి భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్లకు ప్రజలు రావడం లేదు. జగనన్న మీటింగ్లకు పొలాల్లోంచి పరుగులు పెడుతూ జనం వస్తున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్లో ముందు, వెనుక వీడియా విడుదల చేయాలి. జగనన్న ప్రజల మనిషి. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు’ అని ఆర్కే రోజా మండిపడ్డారు. -
సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్. మరి జడ్ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్పార్టీలను జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025 -
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘బుల్లెట్ల’ కలకలం
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గన్లో ఉపయోగించే బుల్లెట్ల కలకలం రేగింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్పై 13 బుల్లెట్లు లభించాయి. ఇందులో 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉండగా, 4 చిన్న సైజూ బుల్లెట్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు కంట పడటంతో పోలీసులకు సమాచారం అందించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఎల్ఆర్ గన్లో వాడే బుల్లెట్లగా అనుమానిస్తున్నారు పోలీసుల. అయితే ఈ బుల్లెట్లు శ్రీశైలం టెంపుల్ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
సూపర్ సక్సెస్ వైఎస్సార్సీపీ యువత పోరు (చిత్రాలు)
-
‘సీఎం కాన్వాయ్లో ప్రమాదం జరిగితే.. బాబుపై కేసు నమోదు చేస్తారా?’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. అధికార పార్టీకి పోలీసులు ఊడిగం చేయడం బాధాకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదు చేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అసలు వైఎస్ జగన్పై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్లో ప్రమాదం .జరిగితే.. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు రామకృష్ణ. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న చంద్రబాబు.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారని నిలదీశారు. ఓ వైపు అప్పులు చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాలకు డబ్బు లేదంటున్నారని చంద్రబాబు పాలనా తీరుపై మండిపడ్డారు రామకృష్ణ.. చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం.. సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ -
బుగ్గమఠం భూములపై ‘సుప్రీం’ స్టేటస్ కో ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: బుగ్గమఠం భూములపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోసారి.. రెండు వారాలపాటు యధాతధ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ఫై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ కేవీ విశ్వనాధన్, జస్టిస్ ఎన్ కె సింగ్ ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూనే..చట్ట ప్రకారం ఏపీ హైకోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. -
ఈ ఉద్యోగానికి ఓ దండం
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి నిర్వహించిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమం జీవీఎంసీ పరిధిలోని రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు తీవ్ర ఆవేదనను, అవమానాన్ని మిగిల్చింది. అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కారణంగా తాము ప్రజల చేత మాటలు పడాల్సి వచ్చిందని, ఈ ఉద్యోగమే వద్దనుకునేంతగా మానసిక క్షోభ అనుభవించామని ఆర్పీలు వాపోతున్నారు.ప్రధాని మోదీ పాల్గొన్న ‘యోగాంధ్ర’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో అధికారులు జన సమీకరణ బాధ్యతను పూర్తిగా ఆర్పీల మీద పెట్టారు. ప్రతి ఆర్పీ వందల మందిని కార్యక్రమానికి తీసుకురావాలని లక్ష్యాలు నిర్దేశించారు. ఉదయం 6.30 గంటలకల్లా కార్యక్రమం ముగిసి, 8 గంటలకంతా అందరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చని, అక్కడ అల్పాహారం, మంచినీటి సౌకర్యాలు ఉంటాయని జనాలకు నచ్చజెప్పి ఆర్పీలు వారిని తీసుకువచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారింది. గంటల తరబడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నిర్వాహకులు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. మ్యాట్ల కోసం కొట్టుకున్నారు. స్నాక్స్ కోసం తోపులాటలు జరిగాయి. దీంతో ఆర్పీలు తీసుకువచ్చిన జనం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహంతో, ఆకలితో అలమటించారు. చివరకు తమను తీసుకువచ్చిన ఆర్పీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం కోసం ఎంతో కష్టపడితే అన్ని వైపుల నుంచి తిట్లు..చీవాట్లు మిగిలాయంటూ ఆర్పీలు వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన చెందుతున్నారు.అధికారుల నిర్లక్ష్యం, ఆర్పీల ఆవేదన‘వేకువ జామున 2 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి వారి తలుపులు తట్టి జనాన్ని యోగాంధ్రకు తీసుకెళ్లాం. గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకున్న ఓ ఆర్పీ యోగాంధ్రకు 100 మందిని తీసుకెళ్లారు. అయితే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాం. ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజల నుంచి చీదరింపులు ఎదుర్కొన్నాం. పని పూర్తయ్యాక అధికారులు చల్లగా జారుకున్నారు. కానీ మేం మాత్రం ప్రజల చేత తిట్లు తినాల్సి వచ్చింది. మమ్మల్ని నమ్మి వచ్చినవారికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయాం. తీసుకెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తే చాలు అనుకునేంత నరకాన్ని చూశాం’ అని ఆర్పీలు తమ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేవలం రూ.10వేల జీతానికి ఇంతటి అవమానమా? 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం, కానీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం, నీళ్ల బాధ్యత మాకే అప్పగించేవారు. కానీ ఇప్పుడు మమ్మల్ని కేవలం జన సమీకరణకే వాడుకుని, తర్వాత బలిపశువులను చేశారు’ అని వాపోయారు. ఈ మానసిక వేదనతో ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పలువురు ఆర్పీలు పేర్కొన్నారు. -
పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్లకు కవల పిల్లలు జన్మించారు. భర్త ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ప్రైవేటు గన్మెన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ కలల రూపాలైన కవలలను ఉన్నతంగా చదివించాలని ఆరాట పడ్డారు. ఈ నేపథ్యంలో సొంతూరి నుంచి చిత్తూరుకు మకాం మార్చారు. ఆ దంపతులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నారు. కానీ ఆ కలలను దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దంపతులిద్దరినీ మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో కుమారుడు, కుమార్తె గాయపడి స్పృహ కోల్పోయారు. గాయపడిన ఆ కుటుంబ ఆశాదీపాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఏం జరిగింది.. ఎలా ఉన్నారో..ఎక్కడ ఉన్నారో ఆ పసి హృదయాలకు పాపం తెలియదు.చిత్తూరు: గుడిపాల మండలంలోని కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికుడు సిద్దయ్య(47), అతడి భార్య జ్యోతిలక్ష్మి (43) మృతి చెందగా, కొడుకు, కుమార్తె గాయపడ్డారు. దీంతో కుప్పిగానిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల దైవదర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లి వస్తుండగా పనపాకం సమీపంలోని గడ్డకిందపల్లె వద్ద ఆవును తప్పించబోయి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. దంపతుల ఇద్దరిదీ కుప్పిగానిపల్లె గ్రామమే. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పిల్లల చదువు కోసం చిత్తూరులో నివాసం ఉంటున్నారు. గిరి(13), గాయత్రి(13) బివిరెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.తండ్రి అడుగుజాడలోనే ఆర్మీలో చేరి..కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నాగరత్నం, సరస్వతీలకు 1978లో సిద్దయ్య జన్మించాడు. నాగర త్నం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి టీటీడీలో పనిచే శాడు. నాగరత్నం చొరవతో కుమారుడు సిద్దయ్య 1998లో ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు, జగద కుమార్తె జ్యోతి లక్ష్మిని 2002లో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వరకు పిల్లలు కలగలేదు. అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.పిల్లలను ఉన్నతంగా చదివించాలని..పిల్లలు జన్మించిన అయిదు సంవత్సరాలకు వారి చదువు కోసం చిత్తూరులో కాపురం పెట్టారు. సిద్దయ్య 2020 సంవత్సరంలో ఆర్మీ నుంచి ఉద్యోగ విరమణ పొందారు.ఈక్రమంలో చిత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నారు.పుట్టిన రోజే మృత్యుఒడిలోకిసిద్దయ్య పుట్టిన రోజుకి ఎప్పుడూ తిరుమల దైవద ర్శనానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరు మలలో స్వామిని దర్శించుకొని పిల్లలు, భార్యతో కలిసి కారులో తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిని మృత్యువు వెంటాడడంతో దంపతులు మృత్యుఒడికి చేరుకోగా పిల్లలు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సైనికుడిగా ఉన్న సిద్దయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ప్రైవేట్ గన్మెన్గా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహిత్రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. సంతపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, పదిహేడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి వారధి సెంటర్కు చెందిన కుమార్ స్నేహితుడు ఉన్నాడు. ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబాలు తిరుమలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కుమార్ అతని భార్య, స్నేహితుడి కుమార్తె శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే ఉండి మార్చి 16న నెల్లూరుకు వచ్చారు. బాలిక కుమార్ ఇంట్లో ఉండగా, అతని భార్య వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన కుమార్ బాలికను బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆమె ఎవరికి చెప్పలేదు. రెండు నెలలుగా బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో బాధిత తల్లి ఆమెను శనివారం జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలు ఆదివారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ జి. దశరథరామారావు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా నాన్న తప్పు చేయడు.. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను గట్టిగా నమ్ముతున్నాను. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదని. చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. బెయిల్ రాకుండా రోజుకో కేసు తెరపైకి తెచ్చి వేధిస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను దగ్గరగా చూస్తున్నాను. ఆయన ఏ తప్పు చేయడు. తప్పు చేసిన వారు ఎవరైనా ఒప్పుకోడు. అలాంటి ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నింటిని ఆ భగవంతుడే చూస్తున్నాడు. నాన్నపై కుట్ర పన్ని తప్పులు చేసిన వారు, చేయిస్తున్న వారిని భగవంతుడే శిక్షిస్తాడు. నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను’ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తనయ కాకాణి పూజితతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.మీ నాన్న అరెస్ట్ తర్వాత మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశి్నస్తున్నారని మానాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్లో ఉంచారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను వదిలి ఉండలేదు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్లం. నాకు వివాహం అయి తొమ్మిదేళ్లు. అప్పుడే నా ఇద్దరు బిడ్డలు నా వద్దే ఉండాలని చెప్పి చేశారు. నాన్నను చూడకుంటా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది మూడు నెలలుగా నాన్నకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది?. 80 ఏళ్ల మా నాన్నమ్మ నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారని ప్రశి్నస్తుంటే ఆమెను ఓదార్చలేకపోతున్నాం. మా పిల్లలు తాతయ్య ఎక్కడని రోజూ ఏడుస్తున్నారు. పిల్లలు వాళ్ల తాతయ్యను వదిలి ఉండలేదు. మా నాన్న మనస్తత్వం తెలిసిన నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన తప్పు చేయడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జంకడు. ఆయన్ను ఒక రాజులా చూశాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ను చూడలేకే ములాఖత్కు వెళ్లడం లేదు.కాకాణిని జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ పరిస్థితి ఏమిటి? మూడు నెలలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్నారు. అయినా పార్టీ కేడర్ ఏమీ భయపడడం లేదు. నా తండ్రి అందుబాటులో లేకపోయినా.. ఆయన బిడ్డగా నేను పార్టీ కేడర్కు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నాను. అందరికి మంచి చేసిన మా నాన్నను జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ మొత్తం కసితో ఉన్నారు. వారే ముందుకు వచ్చి మాకే ధైర్యం చెబుతున్నారంటే ఆయన వారిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.పార్టీ కేడర్ను వేధిస్తున్నారన్న సమాచారం ఎంత వరకు నిజం? కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతో పోలీసులు మా నాన్న గోవర్ధన్రెడ్డిపై ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు. రోజుకో కేసు పెడుతున్నారు. ఆధారాలు లేని ఆ కేసుల్లో నాన్న పేరు చెప్పాలని పార్టీ కేడర్ను పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ల టార్చర్ భరించలేకపోతున్నట్లు కొందరు నాకు ఫోన్ చేసి అమ్మా మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టి సంతకాలు తీసుకుంటున్నారు అని చెబుతుంటే బాధగా అనిపిస్తుంది. నాన్న ఒక్కడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇంత మందిని హింసించడం చూస్తే నా మనస్సు చలిస్తుంది. నాన్న వెంట నడిచిన నేతలందరిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు.భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? మా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. మా తాతయ్యకు ఇప్పటికి మంచి పేరు ఉంది. మా తాత విలువలకు వారసుడిగా రాజకీయ చేస్తున్నారే కానీ.. ఏనాడు తెలియక కూడా తప్పు చేయలేదు. జెడ్పీ చైర్మన్గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కోణంలోనే ఆ తప్పులను ఎత్తి చూపి విమర్శలు చేశారనే కానీ, అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. మా నాన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అంత వరకు మా నియోజకవర్గంలోని మా పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పాను. -
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. విశాఖలో ఉద్రికత్త
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’ అప్డేట్స్.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారురెడ్బుక్పై ఉన్న శ్రద్ధ.. హామీల అమలులో లేదా?కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరించటం హాస్యాస్పదంటీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరుతనపై వ్యతిరేక వార్తలు రాసే వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుమ్మనూరు జయరాంపై ఏ చర్యలు తీసుకోలేదుచంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..సింగయ్య మరణంతో వైఎస్ జగన్కు ఏం సంబంధం?వైఎస్ జగన్ వాహనం కింద పడి కార్యకర్త చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారువైఎస్సార్సీపీ యువత పోరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు కుట్రలుహామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారు.హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్పారుచంద్రబాబు కాలర్ పట్టుకోవాలా?పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా?నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా?ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..ఇంటింటికీ తిరిగి మోసపు వాగ్ధానాలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారుఏడాది కాలంలో కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారువిద్యకు ప్రాధాన్యం కల్పించిన నాయకులు వైఎస్ జగన్.చిన్నపిల్లలను కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందితల్లికి వందనం 15 వేలు ఇస్తామని చెప్పిన లోకేష్ 13 వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడువైఎస్ జగన్ బయటికి వెళితే భద్రత లేదుఆయనపై కేసులు ఎలా పెట్టాలి.. జైల్లో ఎలా పెట్టాలనేదే కూటమి ఆలోచనసత్తెనపల్లి పర్యటనలో దొంగ సాక్ష్యాలతో జగన్పై కేసు పెట్టాలని చూస్తున్నారుఏం చేశారని సుపరిపాలన జరుపుకుంటున్నారుఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విజయవాడలో ధర్నా చౌక్ ఖాళీ ఉండటం లేదులోకేష్ పేరుకే విద్యాశాఖ మంత్రిఆయన శాఖ తప్ప అన్ని శాఖల పనులూ లోకేష్ చేస్తున్నాడువిద్యార్ధుల ఆవేదనను ఇప్పటికైనా లోకేష్ గుర్తించాలి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ కామెంట్స్..కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందియువకుల బాధ్యత నాది అని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చాడుఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదునేనుంటాను.. నేను చూసుకుంటానని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారుసచివాలయ వ్యవస్థ ప్రజలకు దూరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందికేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారుసత్తెనపల్లి పర్యటనలో ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని ఎస్పీ చెప్పారుఫేక్ వీడియో జతచేసి రాజకీయం చేస్తున్నారు..పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారుగతంలో టీడీపీ నేతలు చేసిందేంటి?కందుకూరు సభ పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నారుగుంటూరులో చీరలు పంచి ముగ్గురు చనిపోయేలా చేశారుప్రజల ప్రాణాలు పోతే వదిలేసి వచ్చిన చరిత్ర మీదితారకరత్న చనిపోతే యువగళాన్ని కొనసాగించిన వ్యక్తి లోకేష్మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..యువతను ఈ ప్రభుత్వం మోసం చేసిందిప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ అన్నారుహామీలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలివైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టడమేనా మీ అభివృద్ధిఫీజు రీయింబర్స్ మెంట్ ఇంతవరకూ చెల్లించలేదునిన్నటి వరకూ వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టారుఇప్పుడు ఆయనతో పాటు కారులో ఉన్నవారిపైనా కేసులు పెడుతున్నారుసినిమా డైలాగ్ ను చెబితే వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేశారునీ తల నరకొచ్చుగా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఎవరైనా ఖండించారా?.బుచ్చయ్య చౌదరి పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారువైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారుఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారుఎన్ని నిర్భందాలు విధించినా మేం ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రశ్నిస్తాందాడిశెట్టి రాజా కామెంట్స్..ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడుప్రజలు, రైతులు, యువత, మహిళల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్వైఎస్ జగన్ను ఏదో విధంగా ఎలిమినేట్ చేయ్యాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి.వైఎస్ జగన్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు..ప్రజల తరుపున ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు.బుచ్చయ చౌదరికి ఇంగిత జ్ఞానం.. బుద్ది లేదా?80 ఏళ్ళ వయస్సులో ఒక మాజీ ముఖ్యమంత్రి తల నరుకుతానంటున్నావ్!ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వైఎస్ జగన్ చెబితే...దానికి సమాధానం చెప్పకుండా రప్పా రప్పా అంటూ డైవర్ట్ చేశారు.వైఎస్ జగన్ ప్రెస్మీట్ డైవర్ట్ కోసం రప్పా..రప్పాఫీజు రియింబర్స్మెంట్ రప్పా..రప్పానిరుద్యోగ భృతి రప్పా..రప్పా.మచిలీపట్నం ఇంఛార్జి పేర్ని కిట్టు కామెంట్స్..విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడుఎన్నికల సమయంలో నోటి కొచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక భయం వేస్తుందని మాట మార్చాడుపవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని యువతను మోసం చేయాలని చూశావుప్రస్తుతం యువత అంత పిచ్చితనంలో లేరుయువత మిమ్మల్ని నిలదీసే రోజు వచ్చింది.విద్యార్ధులకు ఫీజులు ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే చంద్రబాబువిశాఖపట్నంలో యోగ పేరిట డబ్బు ఖర్చు పెట్టావ్ఆ డబ్బులను యువత ఫీజులకి విడుదల చేసుంటే బాగుండేదిగిన్నిస్ రికార్డు కోసం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారువిద్యార్థులకు ఫీజులు ఎగ్గొటిన ఏకైక ముఖ్యమంత్రి నేనే అని గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సిందివిశాఖలో ఉద్రికత్త..వైఎస్సార్సీపీ యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం.నాలుగు చోట్ల భారీ కేట్లు పెట్టిన పోలీసులు..వైఎస్సార్సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు..పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట.పోలీసులను దాటుకొని కలెక్టరేట్కు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు..చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు..విజయవాడ..ధర్నాచౌక్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసననిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్పార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు,జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,వైఎస్సార్సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువతవైఎస్సార్ జిల్లా..వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీవైఎస్సార్సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీజిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువతకూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలుకలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రంవిశాఖ..ప్రారంభమైన యువత పోరు కార్యక్రమం..జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత విద్యార్థులు నిరుద్యోగులు..చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు..ఇంటికొక ఉద్యోగం అన్నారు..ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి..విశాఖ వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు.అనంతపురం..యువత సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాటఅనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరుభారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలుఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహంటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారుఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందిఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. యువత పోరు ప్రారంభం..ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం ప్రారంభం. కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, నిరుద్యోగులు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలుఅనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయంఅధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వంనిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబుచంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలుకలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపుకృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.నో జాబ్స్..ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.28 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
కలవరపెడుతోన్న బెబ్బులుల మరణాలు!
సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద పులుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఒకవైపు వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతున్నా మరోవైపు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 91 పులులు మృతి చెందాయి. అంటే నెలకు సగటున 15 పులులు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది నమోదైన 126 మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2019 నుంచి 2023 మధ్య దేశవ్యాప్తంగా 628 పులుల మృతి చెందాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 91 పులుల మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 26, మధ్యప్రదేశ్లో 24 చోటుచేసుకున్నాయి. కేరళలో 9, అసోంలో 8, ఉత్తరాఖండ్లో 7, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో 4 చొప్పున, తెలంగాణలో ఒకటి, మిగిలినవి ఆయా రాష్ట్రాల్లో మరణించినట్లు గుర్తించారు. వీటిలో కొన్ని రైలు ప్రమాదాల వల్ల జరగ్గా, కొన్ని వ్యాధుల వల్ల, మరికొన్ని మానవ–వన్యప్రాణి ఘర్షణల వల్ల చోటుచేసుకున్నాయి. మృతి చెందిన 91 పులుల్లో 42 వాటి సంరక్షిత ప్రాంతాల్లోనే (టైగర్ రిజర్వులు) ప్రాణాలు కోల్పోయాయి. వేటగాళ్లు్ల చంపిన పులులు 24 వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీఎస్ఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 120 పులులు మృత్యువాత పడ్డాయి. అందులో 96 సహజ, మానవ–వన్యప్రాణి సంఘర్షణల వల్ల మృతి చెందినట్లు తేలింది. 24 పులుల్ని వేటగాళ్లు చంపినట్లు వార్తలు వచ్చాయి. గత 12 ఏళ్లలో దేశంలో మొత్తం 1,386 పులులు మరణించాయని డబ్ల్యూపీఎస్ఐ తెలిపింది. సవాలుగా మారిన పులుల సంరక్షణ.. ఆవాసాల కోసం కొన్నిచోట్ల పులుల మధ్య తీవ్రమైన టెరిటోరియల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఘర్షణలతో మృత్యువాత పడుతున్నాయి. నగరీకరణ, రహదారుల విస్తరణ, వ్యవసాయానికి అడవుల వినియోగం వల్ల టైగర్ రిజర్వులు కుంచించుకుపోవడంతో వాటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఎన్టీసీఏ లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2010లో 1,706గా ఉండగా.. 2022 నాటికి అవి 3,700కి పెరిగాయి. ప్రస్తుతం 1,57,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పులుల ఆవాసాలు సామాజిక–ఆరి్థక కారణాల వల్ల క్షీణిస్తున్నాయి.వాటి రక్షిత, ఆవాస ప్రాంతాలను విస్తరించడం, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం, పులుల ఆవాసాల సమీపంలో నివసించే వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా మానవ–వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అడవులను అనుసంధానించే టైగర్ కారిడార్ల ఏర్పాటు, రైలు మార్గాల్లో హీట్–సెన్సింగ్ అలర్ట్లు, స్పీడ్ లిమిట్లు విధించాలని సూచిస్తున్నారు. మృతి చెందిన రణథంబోర్ రాణి రాజస్తాన్లోని రణథంబోర్ టైగర్ రిజర్వ్లో 14 ఏళ్ల ప్రఖ్యాత ఆడపులి యారోహెడ్ శుక్రవారం మృతి చెందిందని అటవీ అధికారులు ధ్రువీకరించారు. బోన్ క్యాన్సర్, మెదడు ట్యూమర్ వల్ల మరణించినట్లు వెల్లడించారు. ఈ పులికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖంపై బాణం(యారో) ఆకారంలో ఉన్న చారల వల్ల దీనికి యారోహెడ్ అనే పేరు వచ్చింది. ఫొటోగ్రాఫర్లు, పర్యాటకులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పులిని ‘క్రొకడైల్ హంటర్’ అని కూడా పిలిచేవారు. సరస్సులోని మొసళ్లను వేటాడే అరుదైన పులిగా యారోహెడ్ గుర్తింపు పొందింది. -
పట్టు తప్పుతోంది!
దిగుబడి పెరిగిందని ఆనందంలో ఉన్న పట్టురైతుకు ‘ధరాఘాతం’ తగులుతోంది. బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రోజురోజుకూ దిగజారుతుండగా..రైతు పరిస్థితి బేజారవుతోంది. ప్రోత్సాహకం అందించి ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ పట్టించుకోకపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మడకశిర/హిందూపురం: పట్టుగూళ్ల ధరలు నెలరోజులుగా తగ్గుముఖం పట్టాయి. పట్టుగూళ్ల విక్రయాలకు రాష్ర్టంలోనే పేరెన్నికగన్న సత్యసాయి జిల్లా హిందూపురం మార్కెట్లోనూ ఆశించిన ధర దక్కడం లేదు. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలేక రైతు దిగాలు.. ప్రస్తుతం హిందూపురం మార్కెట్కు రోజూ 4 వేల నుంచి 5 వేల క్వింటాళ్ల వరకు బైవోల్టిన్ పట్టుగూళ్లు వస్తున్నాయి. హిందూపురం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాలతోపాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను ఇక్కడికి తెస్తున్నారు. అయితే నాణ్యమైన గూళ్లు తెచ్చినా రైతులు ఆశించిన ధర మాత్రం పలకడం లేదు. నెల క్రితం కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్లు గరిష్టంగా రూ.750 వరకు పలికాయి. కనిష్ట ధర రూ.620 తగ్గకుండా ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి గరిష్ట ధర రూ.600 దాటడం లేదు. కనిష్ట ధర రూ.500 లోపే ఉంటోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కోసారి హిందూపురం వరకూ పట్టుగూళ్లు తెచ్చిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేచిచూస్తే కొంతమేలు.. పట్టుగూళ్ల అమ్మకాలకు ఆన్లైన్ ద్వారా టెండర్ వేసే ప్రక్రియ సాగుతోంది. అయితే ప్రతిసారి 1, 2 టెండర్లలో తక్కువ ధర లభిస్తోంది. అందువల్ల మూడో టెండర్ వరకు వేచి చూస్తేనే ధర కాస్త పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. కొన్నిసార్లు మూడో టెండర్లోనూ మంచి ధర దక్కడం లేదంటున్నారు. పట్టుగూళ్లు నిల్వచేసే అవకాశం లేకపోవడంతో రీలర్లు ఏకమై ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆదుకోని ప్రభుత్వం.. మార్కెట్లో పట్టుగూళ్ల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం పట్టురైతులను ఆదుకోవాల్సి ఉన్నా.. ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తికి కిలోపై అదనంగా ఇచ్చే రూ.50 ప్రోత్సాహకాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టు రైతులకు అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు. -
సెల్ఫోన్ వాడకంతో మాటలు రాని చిన్నారులు
కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు. పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు.కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్ఫోన్కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్ఫోన్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు.ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు. అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్)ఒకప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలకు అమ్మానాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మలు ఉండేవారు. వీరందరూ పిల్లలను ఆడిస్తూ పెంచేవారు. బయటకు తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించి పిల్లలను ఆనందింపజేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరూ బిజీగా మారారు. చిన్నకుటుంబాలు ఎక్కువ కావడంతో పిల్లలను ఆడించేవారు కరువయ్యారు. వారికి సెల్ఫోన్లో వచ్చే ఆటలే ఆటవస్తువులుగా మారాయి. అందులో వచ్చే కార్టూన్ బొమ్మలను, రంగులను చూసి పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు. రెండేళ్ల వయస్సు కూడా రాకముందే పెద్దల కంటే మిన్నగా మొబైల్ను ఆపరేట్ చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వారి ఉత్సాహం, చైతన్యం చూసి ఆ వయస్లులోని చిన్నారులను చూసి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మాట ముచ్చట కురువై.. అతి చిన్న వయస్సులోనే సెల్ఫోన్లోని ఫీచర్లను వాడేయడం, యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాను ఎలా వాడాలో పెద్దలకు చూపించడం వంటివి నేర్వడంతో సంతోషించడం పెద్దల వంతైంది. ఈ క్రమంలోనే వారికి మూడేళ్లు వచ్చినా మాటలు రాకపోవడం చాలా మంది గమనించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏడాదిన్నరకే అమ్మా నాన్నతో పాటు అవ్వా తాత, అత్తమ్మ, మామ అనే చిన్న చిన్న పదాలు పలికేవారు. రెండేళ్ల వయస్సుకు పొట్టిపదాలతో మాట్లాడేవారు. మూడేళ్లకు వచీ్చరానీ మాటలతో గలగలా మాట్లాడుతూ అల్లరి చేసేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆ ముచ్చటే కరువైంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సెల్ఫోన్లకు బానిసలు కావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. చికిత్స కోసం ఆసుపత్రులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని బాలల సత్వర చికిత్స కేంద్రంలో గత ఐదేళ్లలో పుట్టుకతో వచ్చిన లోపాలతో పాటు ఎదుగుదల లోపాలతో వచ్చే చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్నతనంలోనే మొబైల్ వాడకం వల్ల మాటలు రాకపోవడంతో పాటు దృష్టిలోపం, వినికిడిలోపం, నేర్చుకోలేకపోవడం, భాష తెలియకపోవడం వంటి లోపాలతో వస్తున్నారు. ఇక్కడే గాకుండా చిన్నపిల్లల విభాగంలోనూ ఇలాంటి చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు,క్లినిక్లలోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇలాంటి చిన్నారులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చిన్నతనంలో ఎక్కువ సమయం డిజిటల్ తెరలను చూడటంతో వారిలో సమాజంలో ఇతరులను కలిసే తత్వం తగ్గుతుంది. పిల్లలు ఆటల పట్ల దృష్టి పెట్టే సమయాన్ని తగ్గిస్తాయి. ఎక్కువసేపు మొబైల్ చూసే పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఇది భవిష్యత్లో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు నిద్రించే సమయాన్ని తగ్గిస్తుంది. డిజిటల్ తెరల నుంచి వెలువడే నీలికాంతి ఎండోజెనస్ మెలటోనిన్ను అణిచివేస్తుంది. మొబైల్కు దూరంగా ఉంచడమే మేలు పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాని్పంచేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్ ఫోన్ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు.పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది. -
‘కనీస’ కనికరం లేదా..!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అతి తక్కువ వేతనంపై ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న 2008, 1998 డీఎస్సీ ఎంటీఎస్(మినిమం టైం స్కేల్) టీచర్లపై కూటమి ప్రభుత్వం కక్షగట్టినట్టు వ్యవహరిస్తోంది. జీవో నంబర్ 47కు విరుద్ధంగా కేటగిరీ–4 స్కూళ్లల్లో నియామకాలపై అన్ని జిల్లాల్లోనూ కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఎంటీఎస్ టీచర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనాలతో 60–70 కిలోమీటర్ల దూరంలో పనిచేయలేమని, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభమైన వెంటనే ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో దిగొచ్చిన పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని పాఠశాలల్లో మిగిలిన ఖాళీలు ఎంటీఎస్లకు చూపించాలని ఆదేశించారు. గతంలో 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వక అన్యాయానికి గురయ్యారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం వీరిని మినిమం టైం స్కేల్పై విధుల్లోకి తీసుకుంది. 2021లో 2008 డీఎస్సీ అభ్యర్థులు 2,193 మందికి, 2023లో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,072 మందికి పోస్టింగ్స్ ఇచ్చింది. కనీస వేతనంపై సేవలు అందిస్తున్నందున ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారి సొంత ప్రాంతాలకు దగ్గరలోనే పోస్టింగ్ ఇవ్వాలని జీవో నంబర్ 47లో పేర్కొంది. రెగ్యులర్ టీచర్ల బదిలీలతో దక్కని అవకాశం ఎంటీఎస్ ద్వారా 6,265 మందికి రెండు దఫాలుగా పోస్టింగ్స్ ఇవ్వగా, గత రెండేళ్లలో 2 వేల మంది వరకు రిటైరయ్యారు. మిగిలిన 4 వేల మందికి కూటమి ప్రభుత్వం జూన్–ఏప్రిల్ వరకు 11 నెలల కాలానికి విధుల్లోకి తీసుకుని వేతనం చెల్లిస్తోంది. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక తిరిగి కౌన్సెలింగ్ ద్వారా వారిని పోస్టుల్లోకి తీసుకుంటోంది. ఈసారి రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం, ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు గతంలో వలే 10 శాతం స్థానాలను బ్లాక్ చేయకపోవడంతో కేటగిరీ–1,2,3 పోస్టులన్నీ రెగ్యులర్ ఉపాధ్యాయులతో భర్తీ చేశారు. పైగా ఈసారి ఎంటీఎస్లకు స్థానిక ప్రాంతాల్లో పోస్టింగ్ అన్న అంశాన్ని తొలగించి పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.ఇటీవల రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగియడంతో ఖాళీగా ఉన్న కేటగిరీ–4లోని మారుమూల గ్రామీణ పాఠశాలలను మాత్రమే ఎంటీఎస్ లకు కేటాయిస్తోంది. కొన్ని జిల్లాల్లో అసలు ఖాళీలే లేకపోవడంతో ఎంటీఎస్లను క్లస్టర్ పూల్లో ఉంచా రు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి గత ప్రభుత్వం స్థానికంగా పోస్టింగ్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేయడంపై ఆదివారం ఎంటీఎస్లు ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్సీ–2025 కోసం ఉంచిన ఖాళీలనూ చూపా లని అధికారులు ఆదేశించారు. 1998 డీఎస్సీ అభ్యర్థుల్లో అత్యధికులు అనారోగ్యాలతో ఉన్నవారు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారే. ఇలాంటి వారిపై దయ చూపాలని రెగ్యులర్ టీచర్లే కోరుతున్నారు. కూటమి సర్కారు తీరుపై నిరసన ఎంటీఎస్ టీచర్లు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆందోళన బాట పట్టారు. విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. కౌన్సెలింగ్ను బహిష్కరించారు. ఎంటీఎస్ల కౌన్సెలింగ్ను విశాఖ వ్యాలీ స్కూల్లో ఆదివారం నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధం కాగా, మైదాన ప్రాంతాల్లో ఖాళీలు లేవని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలకు కౌన్సెలింగ్ చేస్తున్నారని తెలుసుకున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఈఓ ప్రేమ్కుమార్ను కొద్దిసేపు చుట్టుముట్టి ఆందోళన వ్యక్తంచేశారు.కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరులోని డీఈఓ కార్యాలయాల వద్ద కూడా ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చేశారు. కౌన్సెలింగ్ను బహిష్కరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్ఎం హైస్కూల్లోనూ కౌన్సెలింగ్ను బహిష్క రించి ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. డీఈఓ రమేష్ కు వినతిపత్రం అందించారు. అనంతపురంలోని జిల్లా సైన్స్ సెంటర్లో జరప తలపెట్టిన కౌన్సెలింగ్ను ఎంటీఎస్ టీచర్లు బహిష్కరించారు. కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన డీఈఓ ప్రసాద్బాబును అడ్డుకున్నారు.మానవత్వం చూపాలిఇప్పటికే గత ఏడాది మేం కొండల్లో ఉద్యోగం చేశాం. మళ్లీ అక్కడే పనిచేయడానికి మా ఆరోగ్యం సహకరించట్లేదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మా పిల్లల్ని చదివించుకోలేపోతున్నాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మాపై జాలి చూపించి న్యాయం చేయాలని కన్నీటితో వేడుకుంటున్నాం. – కె.వి దుర్గాదేవి, 2008 డీఎస్సీ ఉపాధ్యాయిని, విశాఖపట్నం -
‘గెస్టు’కు రెగ్యులర్ గుబులు
సాక్షి, అమరావతి: అడ్డగోలు నిర్ణయాలతో అభాసుపాలవడం బీసీ సంక్షేమ శాఖ బాధ్యులకు పరిపాటిగా మారింది. కాంట్రాక్ట్ స్కూల్స్లో తాజాగా మంజూరైన కాంట్రాక్ట్ టీచర్స్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చేందుకు గట్టి యత్నాలే జరుగుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత అధ్యక్షతన సోమవారం నిర్వహిస్తున్న బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీఓజీ) సమావేశంలో కాంట్రాక్ట్ స్కూళ్లలోని 715 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చేందుకు ప్రతిపాదించారు. దీనిని ఆ సమావేశ అజెండాలోని 13వ అంశంగా ఆమోదించేందుకు ముందస్తు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల పరిధిలో 2019లో కొత్తగా 65 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారు. వాటిలో 65 రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, 715 మంది టీచర్లను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని అప్పట్లో జారీ చేసిన జీవో నంబర్ 23లో స్పష్టం చేశారు. అప్పటినుంచి వాటిలో కాంట్రాక్ట్ టీచర్స్ నియామకం లేకపోవడంతో గెస్ట్ ఫ్యాకల్టీ లతో నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ స్కూల్స్లోని 715 పోస్టులతోపాటు మరికొన్ని గురుకులాలతో కలిపి మొత్తం 1,253 మంది గెస్ట్ టీచర్స్ 5 నుంచి 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. జీవో నంబర్ 23లో పేర్కొన్న నిబంధనలను కాదని.. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్ స్కూల్స్లోని పోస్టులను రెగ్యులర్గా మారిస్తే గెస్ట్ టీచర్స్ రోడ్డున పడే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణం కాంట్రాక్ట్ స్థానంలో రెగ్యులర్ టీచర్స్ను పెట్టే ప్రతిపాదన విరమించుకుని కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి గెస్ట్ టీచర్లకు వెయిటేజీ ఇచ్చి భర్తీ చేయాలని కోరుతున్నారు. జగన్ మేలు చేస్తే.. కూటమి కక్ష కట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరగ్గా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని గెస్ట్ టీచర్లు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో మోడల్ స్కూల్స్లో 282 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గెస్ట్ టీచర్లకు 20 మార్కుల వెయిటేజీ ఇచ్చి భర్తీ చేసింది. రాష్ట్రంలో 106 బీసీ గురుకులాల్లో టెన్త్ విద్యార్థులు 2023–24లో 98.8 శాతం, 2024–25లో 95 శాతం ఉత్తీర్ణత సాధించడంలో గెస్ట్ టీచర్స్ పాత్ర కీలకం. కనీసం వారు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకూ కూటమి ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు. డీఎస్సీ కోచింగ్కు వెళ్లిన వారిని బీసీ గురుకుల సొసైటీకి రానిచ్చేది లేదంటూ ఇటీవల సర్క్యులర్ కూడా జారీ చేసింది. అటు డీఎస్సీ కోచింగ్ తీసుకునే అవకాశం లేకుండా చేసి.. ఇటు ఉన్న పోస్టులకే ఎసరు పెడితే తాము ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడతామని గెస్ట్ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలు!
సాక్షి టాస్క్ఫోర్స్: రెడ్బుక్ రాజ్యాంగానికి కొమ్ము కాస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నా, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం చీవాట్లు పెడుతున్నా వారి తీరు మారడంలేదు! తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్ శైలి వివాదాస్పదంగా మారింది. కొత్తచెరువులో ఓ స్థల వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడు పాండును ఆదివారం ఉదయం కర్ణాటకలోని కొప్పళలో అరెస్టు చేసినట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించగా.. గత నాలుగు రోజులుగా తనను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు పాండు మొర పెట్టుకోవడం గమనార్హం.ఘర్షణ జరిగిన రోజు తాను గ్రామంలో లేకున్నా అరెస్టు చేశారని, పోలీసుల నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాడు. పుట్టపర్తి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విజయ్కుమార్ ఓ వర్గానికి అనుకూలంగా పని చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాపిరెడ్డిపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సమయంలో హెలిప్యాడ్ వద్ద భద్రతా అధికారిగా ఉన్న విజయ్కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.కాగా, రెండు రోజుల క్రితం ఎన్పీ కుంట (నంబులపూలకుంట) ఎస్ఐ వలీబాషా ఓ యువకుడు, ఇద్దరు మహిళలను విచారణ నిమిత్తం స్టేషన్కు పిలిచి చితకబాదడంపై బాధితులు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రత్న విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామిని నియమించారు. నివేదిక ఆధారంగా ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బీఎన్ఎస్ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్ ప్లస్ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్పైకి ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి (ఏఆర్ కానిస్టేబుల్)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైనట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్ 18 : వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్లోని వాహనం కాదు. ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు గొట్టిపాటి హరీశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్ 22 : వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్ఎస్ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్పై ఒత్తిడి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. -
శ్మశానంలో పూడ్చనివ్వం..!
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోజుకో ఆటవిక చర్య వెలుగు చూస్తూనే ఉంది. మొన్న శాంతిపురం మండలంలో ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంలో మహిళలను కొట్టడం, నిన్న కుప్పం మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదని భార్యను చెట్టుకు కట్టేసి కొట్టడం, జరుగు పంచాయతీలో మగదిక్కు లేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే... కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజుకు శివానంద, మంజునాథ్, శివశంకర్ (35) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెంట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు.. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు (క్రతువు) నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించ లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కు తగ్గారు. పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై మళ్లీ దాడి
తాడేపల్లి రూరల్: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై దుండగులు మరోసారి దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంటి వద్దకు శనివారం సాయంత్రం కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు గేటు ముందు కారు ఆపి లోపలకు తాటికాయలు విసరడం కలకలం రేపింది. జగన్ ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఇదంతా రికార్డయింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఇది నాలుగోసారి. జగన్ ఇంటివద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఇంటివద్ద కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించలేదు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఆయన వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.భద్రతా లోపం వల్లే ఇలాంటి ఘటనలుతాజా దాడిపై వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై ఇద్దరు యువకులు కారులో వచ్చి ఇంటి లోపలికి తాటికాయలు విసిరినట్టు తెలిపారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రులకు జెడ్+ కేటగిరీ కల్పించాల్సి ఉన్నా.. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లోకేశ్, చంద్రబాబు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని, ఆయన ఎక్కడ పర్యటించినా ఈ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ నివాసంపై దాడి చేశారని తాడేపల్లి పోలీస్స్టేషన్కు వెళితే.. టీడీపీ, జనసేన నేతలను సీఐ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారే తప్ప తమ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అనంతరం ఎక్నాలెడ్జ్మెంట్ అడిగితే ఇవ్వమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినపుడు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నామని, కానీ తాడేపల్లి పోలీసుల తీరు విచిత్రంగా ఉందని అన్నారు.మాజీ సీఎం నివాసంపై దాడి జరిగిందంటే ఒక పోలీస్ అధికారి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంపై వారికి ఎటువంటి భావం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారిలో మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నాగార్జునరెడ్డి, బూత్ కమిటీల అ«ధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఉన్నారు. -
వాట్సాప్..ఇక యాడ్స్ అడ్డా!
టెక్నాలజీ దిగ్గజం మెటా.. ‘వాట్సాప్ యాడ్స్’పె దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో రారాజైన వాట్సాప్లో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్టు ఈ అమెరికన్ దిగ్గజం ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్ను ‘తెర’పైకి తెచ్చింది. వాట్సాప్ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 85 కోట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉంది.ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జనంతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్న వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. అందుకేనేమో.. చాలా సంవత్సరాలుగా ప్రకటనలు లేకుండానే కొనసాగించిన మెటా కంపెనీ ఎట్టకేలకు వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్్ట సందేశాలతోపాటు స్టేటస్ ఫీచర్లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్స్ట్ వీడియోల రూపంలో కంటెంట్ను పంచుకోవచ్చు. కంటెంట్ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.కళ్లుచెదిరే వ్యాపారం..: వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య 200 కోట్ల పైచిలుకే. 85.4 కోట్ల యూజర్లతో భారత్ ప్రపంచంలో తొలి స్థానంతో దూసుకుపోతోంది. తరవాతి స్థానాల్లో బ్రెజిల్ (14.8 కోట్లు), ఇండోనేషియా (11.2 కోట్లు), యూఎస్ (9.8 కోట్లు), ఫిలిప్పీన్స్ (8.8 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వాట్సాప్ ’అప్డేట్స్’ ట్యాబ్ను రోజుకు 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కళ్లు చెదిరే వ్యాపారం చేస్తోంది మెటా. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ చేరుతోంది.అంచనాలకు అందనంత....: ఈ టెక్ దిగ్గజాల ప్రకటనల ఆదాయం అంచనాలకు అందనంత ఉంది. గూగుల్ 2024లో రూ.22,75,560 కోట్ల ఆదాయం పొందింది. 2025 జనవరి–మార్చిలో మెటా ప్రకటనల ఆదాయం రూ.3,55,180 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.14 శాతం అధికం. ప్రతిరోజు మెటా యాప్స్ను ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల మంది వాడుతున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య 6 శాతం పెరిగింది. ఇక భారత్లో ఈ రెండు దిగ్గజాలు 2023–24లో ప్రకటనల రూపంలో సుమారు రూ.50,000 కోట్లు అందుకున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.ఈ రంగాల్లో ప్రయోజనం..: డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ), ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్), ఆరోగ్య సంరక్షణ, క్విక్ కామర్స్ వంటి రంగాలలోని బ్రాండ్స్ వాట్సాప్ స్టేటస్ ప్రకటనల నుండి ప్రయోజనం పొందుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్సాప్ స్టేటస్లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు.సమ్మతితో ప్రకటనలుప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది. వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ స్థలం. ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాట్సాప్ పట్ల యూజర్లలో నమ్మకం ఉంది. యూజర్లు కుటుంబంతో, సన్నిహితులతో మాట్లాడతారు. సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు. ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదు.అన్నింటా భారతీయులేగూగుల్లో ఏదైనా వెతుకుతున్నప్పుడో.. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లో విహరిస్తున్నప్పుడో ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. నిముషాల వ్యవధిలోనే కొత్త కొత్త యాడ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకు కారణం.. మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్ను కోట్లాది మంది వాడుతుండడమే. ఈ స్థాయిలో యూజర్లు ఉన్నారు కాబట్టే బ్రాండ్ల ప్రచారానికి ఈ యాప్స్ అడ్డాగా మారాయి. వీటికి ఉన్న యూజర్ల సంఖ్య చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాడకంలో మన భారతీయులే ముందంజలో ఉన్నారు.గూగుల్: రోజుకు సగటున 850 కోట్ల వరకు సెర్చెస్ నమోదవుతున్నాయి. 100 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ నుంచి నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. యూఎస్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.ఫేస్బుక్: ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైచిలుకు నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సామాజిక మాధ్యమం ఇదే. ప్రపంచ జనాభాలో దాదాపు 37 శాతం మంది ఫేస్బుక్ వాడుతున్నారు. రోజు ఎఫ్బీ తెరుస్తున్నవారు 211 కోట్ల మంది. యూజర్లలో ఎక్కువ మంది 25–34 ఏళ్ల వయస్కులు. ఇక పురుషుల సంఖ్య 56.7 శాతం, స్త్రీలు 43.3 శాతం. 37 కోట్ల యూజర్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. యూఎస్ 19.3 కోట్లు, ఇండోనేషియా 11.7 కోట్లు, బ్రెజిల్ 11 కోట్లు, మెక్సికో 9 కోట్లు, ఫిలిప్పీన్స్ 8.7 కోట్లు, వియత్నాం 7.4 కోట్లు, బంగ్లాదేశ్ 5.5 కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాయి.యూట్యూబ్: యాక్టివ్ యూజర్లు నెలకు 253 కోట్లకు పైమాటే. 46.7 కోట్ల మంది యూజర్లతో మన దేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. యూఎస్లో 23.8 కోట్లు, బ్రెజిల్లో 14.4 కోట్ల మంది వాడుతున్నారు. 80 భాషల్లో 100కుపైగా దేశాల్లో అందుబాటులో ఉంది. వినియోగదార్లలో పురుషులు 54 శాతం, స్త్రీలు 46 శాతం ఉన్నారు.ఇన్స్టాగ్రామ్: 200 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 41.4 కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ 17 కోట్లు, బ్రెజిల్ 14 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. యూజర్లలో అత్యధికులు 25–34 ఏళ్ల వయసు వారే. -
అబ్రకదబ్ర.. సూపర్ సిక్స్ ఇచ్చేశా.. మాయాఫెస్టోతో నయ వంచన!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు నాటి సీఎం వైఎస్ జగన్ సిసలైన నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయడం.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజలకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.బీసీలకు వెన్నుపోటు⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు. ⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. ⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొటా్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.మహిళలకు మోసం ⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.⇒ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహంఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.రైతులకు తీరని ద్రోహంవ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.ఉద్యోగులకూ మోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ను రాజీనామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్ను నియమించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్ ఊసే లేదు. అలవెన్స్ పేమెంట్స్పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి ⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–26 బడ్జెట్లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.ముస్లిం మైనార్టీలకు దోఖా ⇒ హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ చేపట్టలేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు. ⇒ నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.గాల్లో దీపంగా ప్రజారోగ్యం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.విద్యుత్ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.అగ్రవర్ణ పేదలకు అన్యాయం ⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు. ⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేయలేదు. ⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు. చెదురుతున్న సొంతింటి స్వప్నం గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.బాదుడే బాదుడు ⇒ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామన్న∙హామీ నిలుపుకోలేదు. ⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూరా.. వాడవాడన బెల్ట్షాపులు వెలిశాయి. ⇒ రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు. -
యువతకు బాసటగా మరో పోరాటం
సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. కృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఏటా జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మందిని వలంటీర్ల ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంటివద్దకే రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడం ద్వారా వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు వంటి 20 వేల మందిని రోడ్డున పడేశారు. బెవరేజస్ కార్పొరేషన్లో పనిచేసే 15 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను భారీ ఎత్తున తొలగించారు. ఏడాదిలోనే సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు. -
ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో ముసురుకుంటున్న యుద్ధ మేఘాలతో బహుళ జాతి కంపెనీలు నూతన నియామకాలను నిలిపివేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. ఏకంగా 63శాతం కంపెనీలు కొత్త నియామకాలను ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్టు ప్రముఖ మార్కెటింగ్– హెచ్ఆర్ ప్రొవైడర్ ‘జీనియస్ కన్సల్టెంట్స్’ తాజా నివేదిక వెల్లడించింది. మే, జూన్లలో లింక్డిన్ డేటాను విశ్లేషిస్తూ విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..⇒ ప్రపంచంలోని ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో 63శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాయి.⇒ 15శాతం సంస్థలు రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం, లేదంటే ఫ్రీలాన్సర్ల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.⇒ 36శాతం మంది ఉద్యోగుల పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడింది.⇒ ఉద్యోగులకు పనిభారం 21శాతం పెరిగింది.⇒ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగుల పనితీరు గుర్తింపు, కార్యాలయ పనిమీద విదేశీ పర్యటనల అవకాశాల్లో 22శాతం కోత విధించారు.