breaking news
Andhra Pradesh
-
శత్రువు తెలుసు, మిత్రులెవరో తెలీదు!
వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణి స్తున్నారు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (సీసీడీ) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. ఈ కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి (ఎన్డీఏ).ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది – ఎన్డీఏను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరి ష్కారం. అయితే, ఆచరణ అంత సులువు కాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్థాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌర సమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌర సమాజాన్ని కూడ ఇప్పుడు సీసీడీ కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమా జాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుద్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం ఉంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడా కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారు. వాళ్ళలో ఓ70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసేబృహత్తర పథకాన్ని రచించి కచ్చితంగా ఫలితాలనుసాధించే కార్యాచరణ ఒకటి ఉండాలి.అయితే, ప్రజాస్వామ్యం పేదది కాదు; పేదోళ్ళదిఅంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజా స్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పార డాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి అన్నమాట! ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సీసీడీ ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమను తాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే!అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్డీఏ కూటమికి వ్యతి రేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్థం ఏమిటీ? ఎన్డీఏ కూటమి తన సొంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యత వల్ల మాత్రమే గెలుస్తున్నది.విపక్షాలు ఏకం అయితే ఎన్డీఏ కూటమిని ఓడించడం సులువు అని దీన్నిబట్టి అర్థమవుతుంది. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీఏ కూటమి ఏకశిలా సదృశంగా సమైక్యంగా ఉంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీశ్ కుమార్ వంటి సోషలిస్టులు కూడా ఉంటారు. అయినా, అందరూ ఒక్కటై ఉంటారు. అది వాళ్ళ విజయ రహస్యం.విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుం బిగించింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నా లజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగా ఉన్నాసరే ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు ఓట్లు పెద్దగా పెరVýæకపోయినా (4–5 శాతం), సీట్లు మాత్రం భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోటనే ‘ఎద్దేలు కర్ణాటక’ ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక సానుకూల సంకేతం. తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజిక న్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సీసీడీ, ఎన్డీఏ కూటమి బాధిత సమూహాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మత సామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బీసీలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు. ఆధిపత్య కులాల్లోని పేదలు, ఉదారవాదులకు వారివైన ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహా లన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి. లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధామథనం సాగాలి.-వ్యాసకర్త సమాజ విశ్లేషకులు-డానీ -
ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా?.. ఏం తమాషాగా ఉందా?
సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సదస్సు వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్(ప్రతిష్టాత్మకంగా కనిపించినా.. ఆర్థికంగా నష్టాన్ని కలిగించే ప్రాజెక్ట్)తో పోల్చిన ఆయన.. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదని తేల్చేశారు. శనివారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘మూడు నెలలకొకసారి రివ్యూ నేనూ చేస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని ఉంది. కార్మికులు ఇంట్లో పడుకొని పని చెయ్యకపోతే జీతాలు ఎవరు ఇస్తారు?. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు. అన్ని స్టీల్ ప్లాంట్లకు లాబాలు వస్తుంటే వైజాగ్ స్టీల్కు ఎందుకు రావడం లేదు?. పబ్లిక్ సెక్టార్లో ఉందని బెదిరిస్తామంటే కుదరదు. ప్రతీసారి జీతాలు ఇవ్వాలంటే ఎలా?. ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా? ప్యాకేజీ ఇచ్చాం కదా?.. ఏం తమాషాగా ఉందా??’’ అని అన్నారు.మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కుట్ర కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులపై యాజమాన్యం కొత్త నిబంధనలు తెచ్చింది. ప్రొడక్షన్ శాతాన్ని బట్టి జీతమంటూ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉత్పత్తితో జీతానికి సంబంధం ఏంటి? అని నిలదీస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ చేస్తే నిబంధనలు ప్రకారం జీతం ఇవ్వాలని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆంక్షలు తేవొద్దని.. వెంటనే సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
హిందూపురం ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి ఘటనను(Attack on Hindupur YSRCP Office) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారాయన. వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా భావించాలి. టీడీపీ హింసాత్మక చర్యలు, చంద్రబాబు నాయకత్వం మద్దతుతో గుంపుల ధారాళాన్ని ప్రోత్సహించడం, భయపెట్టి ప్రత్యర్థులను అణచివేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తన ఎక్స్ ఖాతాలో దాడికి సంబంధించిన వీడియోతో సహా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur is a direct assault on democracy itself. We strongly condemn this barbaric act. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes, and physically… pic.twitter.com/aFVgHXoRDl— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2025 -
హిందూపురంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, శ్రీ సత్యసాయి: హిందూపురంలో అధికార తెలుగు దేశం పార్టీ గూండాలు రెచ్చిపోయారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. టీడీపీ రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వాళ్లపైనా దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది. ఎవరూ ఏం చేయలేరనే రెచ్చిపోతున్నారుహిందూపురం కార్యాలయం ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాధ్ ఖండించారు. ‘‘బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా?. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది’’ అని అన్నారాయన. -
విశాఖ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్కి షాక్
సాక్షి, విశాఖపట్నం: బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డికి షాక్ తగిలింది. ఉచిత బస్సు పథకం ఎలా ఉందంటూ ప్రయాణికురాలను మంత్రి అడిగారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం లేదంటూ ఆ మహిళ తేల్చి చెప్పింది. ఉచిత బస్సు పథకంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రయాణికుల మధ్య గొడవలు అవుతున్నాయని చెప్పింది. మహిళ సమాధానంతో షాక్ తిన్న మంత్రి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.కాగా, ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు.సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు.మరో ఘటనలో.. ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు.కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్టోబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు. -
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, అనంతపురం జిల్లా: సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు తాడిపత్రి పోలీస్టేషన్కు గుత్తి రైల్వే పోలీసులు బదిలీ చేశారు. శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికపై చర్చ జరుగుతోంది. రైలు ఎక్కిన కాసేపటికే భార్యకు నాలుగుసార్లు సతీష్కుమార్ ఫోన్ చేశారు. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్ కంఫర్ట్గా ఉందంటూ వాట్సాప్ మెస్సేజ్ చేసినట్లు సమాచారం.సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్కు వచ్చిన సతీష్ కుమార్.. రైల్వే స్టేషన్ పార్కింగ్లో తన బైక్ పార్క్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో సతీష్ కుమార్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్క్ చేసిన సతీష్కుమార్.. గుంతకల్ రైల్వేస్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది. -
పవన్ కల్యాణ్ అభ్యంతరాలను లెక్కచేయని చంద్రబాబు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ అభ్యంతరాలను కూడా చంద్రబాబు లెక్క చేయడం లేదు. లూలూ మాల్తో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్పై ఎంవోయూ జరిగింది. ఇటీవల కేబినెట్లో లులూపై పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారు. లులూ అతిగా షరతులు పెడుతుందంటూ పవన్ అభ్యంతరం చెప్పారు. కేబినెట్లో లూలూపై సీఎం సీరియస్ అయినట్టు డ్రామాకు తెరతీశారు. పవన్ అభ్యంతరాలు లెక్క చేయకుండా లులుతో ఎంవోయూ చేసుకుంది. వందల కోట్ల భూములు కారు చౌకగా విశాఖలో అప్పగించనుంది.మరో వైపు జనసేన పార్టీలో భూమి గోల సాగుతోంది. తనదాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు, సీఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది.రూ.350 కోట్ల విలువచేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం బోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30,31,39, 461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకుపైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది. -
చంద్రబాబు విస్తృతార్థం పవన్కు తెలుసా?
రాజకీయ పరిపాలన అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే తెలియదా? ఒకవైపు సీఎం చంద్రబాబేమో పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆ విషయం తెలిసినా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబుకు అసంతృప్తి కలుగుతుందో అని దానిని ఎమ్మెల్యేలపై నెట్టివేస్తూ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేల దందా గురించి పవన్ ప్రస్తావించడం తప్పు కాదు. కాకపోతే అదేదో కేవలం ఎమ్మెల్యేలకి సంబంధించిన అంశమని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది.నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన సాగాలి కాని చంద్రబాబు నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు కూడా అధికారులకు పార్టీ పరమైన ఆదేశాలు ఇస్తూ మొత్తం వ్యవహారాన్ని ఏకపక్షం చేస్తున్నారు. టీడీపీ ఐడీ కార్డుతో వచ్చే వారిని కూర్చొబెట్టి మర్యాదలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సూచన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా పోలీసు వ్యవస్థ వారి జోలికి వెళ్లడానికే జంకుతోంది. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. రాజకీయ పాలన అని దీనికి ముద్దు పేరు పెట్టుకున్నారు.మరి పవన్ కళ్యాణ్ ఏమని అర్థం చేసుకున్నారో తెలియదు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక విస్తృతార్థంలో పొలిటికల్ గవర్నెన్స్కు ప్రాధాన్యమివ్వాలని చెబుతుంటే.. కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ చిన్న పనికోసం వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, ప్రజల ఆస్తి వివాదాలలో కూడా తలదూర్చుతున్నారని దీనివల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన మందలించారట. జనసేన ఎమ్మెల్యేనే అరాచకాలు చేస్తుంటే ఆయన నిరోధించలేక పోయారన్నమాట. కాని రాజకీయ పాలన అంటే చంద్రబాబు విస్తృతార్థం ఏమిటో పవన్కు తెలుసా?. చంద్రబాబు ఉద్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ఏ పని చేయకపోవడం, ఆ పార్టీ అభిమానులకు స్కీమ్లలో కోత పెట్టడం, సోషల్ మీడియా, సాక్షి వంటి మీడియా ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే పొలిటికల్ గవర్నెన్స్.అలాగే.. వేల కోట్లు అప్పులు తేవడం, కాణీ, అణాలకు ఎకరాలకు ఎకరాల భూమి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం. ఆఖరుకు టీడీపీ ఆఫీసులకు తక్కువ మొత్తానికి భూమి లీజులకివ్వడం కూడా రాజకీయ పాలనే అవుతుంది. అయితే, టీడీపీ మాదిరిగానే జనసేన పార్టీకి కూడా భూములు కేటాయించాలని మంత్రి దుర్గేశ్ కోరారట. టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న విషయం పవన్కు తెలియదా? రాష్ట్రంలో 90 శాతం మద్యం దుకాణాలను టీడీపీ వారికే దక్కేలా చేసింది నిజమే కదా?.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. పార్టీలు, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగానే చెప్పారు. అదేం పద్దతి? అని పవన్ అప్పుడు అడిగి ఉంటే గౌరవంగా ఉండేది. కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వడం లేదని, అధికారులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నారని పలు వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం భూముల రిజిస్ట్రేషన్లలో కూడా ఎమ్మెల్యేల దందా ఏంటని ఎల్లో మీడియా కూడా రాసింది. అప్పుడు తానే సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఆ ప్రకారం సుమారు 35 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయినా ఆ తర్వాత ఏమీ కాలేదని పవన్ వ్యాఖ్యల ద్వారా అర్దం అవుతుంది.టీడీపీ నాయకత్వం ఆదేశాలను పట్టించుకోని వారి సంఖ్య 48కి పెరిగింది. వారికి నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఆఫీస్కు ఆదేశాలు ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే వారు పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం లేదట. అందుకే నోటీసులు ఇచ్చారట. అంతే తప్ప, భూమి, లిక్కర్, ఇతర స్కాంలలో భాగస్వాములు అవుతున్నారని కాదట. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓపెన్గా టీడీపీ నేతల భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి అమ్మకాలలో కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనుషులు భాగస్వాములు అవుతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి చర్య తీసుకోకపోగా, వాటన్నిటిని బయటపెడతావా అంటూ కొలికపూడి పార్టీ లైన్ దాటారంటూ ఆయనను మందలించే స్థితిలో టీడీపీ ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ ప్రకారం పార్టీ నాయకులు అక్రమాలు చేసినా ఫర్వాలేదు కాని, అవి బయట పడకూడదనే కదా!. మరి పవన్ కళ్యాణ్కు అర్థమైన విస్తృతార్థం ఏమిటో?.ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ కోరినప్పుడు చంద్రబాబు ఏం జవాబు ఇచ్చారో తెలుసా? ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారమే తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్చార్జీ మంత్రులదే అని చెప్పారు. అంటే ఆ రకంగా చంద్రబాబు చేతులు దులుపుకున్నారన్నమాట. దీని గురించి పవన్ ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు?. రాష్ట్రంలో పరిస్థితి ఎంత అరాచకంగా ఉందనే విషయం పవన్ కళ్యాణ్కు తెలియదా?. టీడీపీ ఎమ్మెల్యే జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న ఆరోపణలు వస్తే పవన్ కనీసం స్పందించలేకపోయారే!. శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలలో ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన ఆరోపణలు వస్తే చర్య తీసుకోవాలని పవన్ కోరారా?. సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పటికీ రేషన్ మాఫియా కొనసాగుతోందని అనేక వార్తలు వస్తుంటే ఎందుకు నోరెత్తడం లేదు?.రాష్ట్రంలో జూద కేంద్రాలు నడుస్తున్నాయని భీమవరం డీఎస్పీపై తీవ్ర ఆరోపణలను పవన్ చేస్తేనే దిక్కులేదే!. అది నిజమా? కాదా? అన్నది కూడా చెప్పలేదే!. అయితే, ఒక్కటి మాత్రం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కేబినెట్ సమావేశాలలో, ఇతరత్రా వీలైనప్పుడు పవన్ను పొగిడేసి చంద్రబాబు ఖుషీగా ఉంచుతున్నారని అనుకోవాలి. అంతేకాక పవన్ తన పదవిని ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వెళ్లాలన్నా, మరెక్కడికి వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లతో సమానంగా ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే తమకు కావల్సిన వారికి వందల ఎకరాల భూమిని పందేరం చేసుకుంటున్నారు. పవన్ సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్తకు 1200 ఎకరాల భూమి కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేయడం రాజకీయ పాలన కిందకు వస్తుందేమో తెలియదు. విశాఖలో టీడీపీ నేత గోడౌన్లో పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడితే కిమ్మనకపోవడం, పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతున్న తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగడం వంటివి జరిగినా నోరెత్తినట్లు వార్తలు రాలేదు. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల లబ్ది పొందుతున్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నీతులు చెబితే కుదురుతుందా?. అందుకే కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల మాటేమిటి?. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్నారట. మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ది పొందడం తప్పు కాదు కాని, అచ్చంగా రాజకీయాలు చేయడమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిట్టి బుర్రలపై 'పెను' భారం
చదువు పేరుతో చిన్నారులపై కూటమి ప్రభుత్వం పెద్ద భారంమోపి పైశాచికానందాన్ని పొందుతోంది. చదువులు, ర్యాంకుల పేరుతో ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలల్లోనే ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి ఉండింది. అయితే తాజాగా ఈ కోవలోకి ప్రభుత్వ స్కూళ్లూ వచ్చి చేరాయి. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న చిన్నారులకు 100 మార్కులను కేటాయించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. వీటిలో 80కు ప్రశ్నపత్రం, మరో 20కు ఇంటర్నల్ మార్కులుంటాయని ప్రకటించారు. ఇంటర్నల్లో ఏ విధ«ంగా కేటాయిస్తారో నేటికీ చెప్పలేదు. గతంలో కేవలం 50 మార్కులకే ప్రశ్నపత్రం ఉండగా, చిన్నారులకు ప్రస్తుతం అగ్నిపరీక్ష పెట్టారు. నెల్లూరు (టౌన్): పరీక్షల పేరుతో చిట్టి బుర్రలపై భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. ఉపాధ్యాయులకు సైతం అర్థం కాని ప్రశ్నలిస్తుండటం గమనార్హం. ఈ పరిణామాల క్రమంలో టీచర్లే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఆన్సర్ షీటుతో పాటు వర్క్బుక్లోనూ జవాబులు రాయాలని ఆదేశించారు. దీంతో ఏమీ తెలియని చిన్నారులు పరీక్షలంటేనే తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇదీ తంతు.. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను ఈ నెల పది నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గవర్నమెంట్ స్కూళ్లలో 1.8 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు వరకు 85 వేల మందికిపైగా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారు ఈ పరీక్షలనే రాయాల్సి ఉంది. వీరందరికీ ఒకే ప్రశ్నపత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం సొంతంగా ముద్రించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ ముద్రించిన క్వశ్చన్ పేపర్తోనే ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలు ఇలా.. » 1, 2వ క్లాసులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్.. 3, 4, 5కు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షలుంటాయి. » అదే ఆరు నుంచి పది వరకు సబ్జెక్టుల వారీగా నిర్వహిస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 100 మార్కులను కేటాయించారు. » 80కు ప్రశ్నపత్రం, 20కు ఇంటర్నల్ పేరుతో మార్కులేయనున్నారు. జవాబు పత్రంతో పాటు వర్క్బుక్లోనూ రాయాల్సి ఉంది. » 1, 2కు 8.. 3, 4, 5 క్లాసులకు 15 పేజీలను కేటాయించారు. » 20 ప్రశ్నలకు సంబంధించిన జవాబులను షీటులో, మిగిలిన 13కు సమాధానాలను బుక్లెట్లో రాయాల్సి ఉంది. రెండున్నర గంటల్లో రెండు షీట్లలో జవాబులను ఎలా రాయాలో చిన్నారులకు అర్థం కావడం లేదు. అసలీ వ్యవహారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలియదాననే సందేహం తలెత్తుతోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు1, 2 తరగతుల ప్రశ్నపత్రంలా లేదని.. ఎంఏ చదివే వారికి ఇచ్చిన తరహాలో ఉందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్తో సంబంధం లేకుండా శాస్త్రీయబద్ధంగా సైతం లేదంటున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ ప్రశ్నపత్రాల రూపకల్పనపై తమ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటి ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను ఎలా పరీక్షించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.టీచర్లే చెప్పి రాయిస్తున్న పరిస్థితి జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే సమాధానాలు చెప్పి పిల్లలతో రాయిస్తున్నారని సమాచారం. ఈ ప్రశ్నపత్రం ప్రకారం మెజార్టీ విద్యార్థులు ఫెయిలయ్యే పరిస్థితి ఉంది. రెండు పేపర్లు రాసేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికే సమయం సరిపోతుందని, బోధన ఇంకెప్పుడు చేయాలని ప్రశ్నిస్తున్నారు. సీసీఈ పరీక్ష విధానమే సరికాదు సీసీఈ పరీక్ష విధానమే సరికాదు. 1, 2వ తరగతులకు రెండు సార్లు జవాబులు రాయాలనడం తగదు. సొంతంగా సిలబస్ ఇవ్వడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయులే సమాధానం చెప్పి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చదువుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. – మోహన్దాస్, రాష్ట్ర నేత, ఏపీటీఎఫ్ మార్పు తీసుకురావాలి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాలి. ఒక సిలబస్నే రెండుసార్లు ఇవ్వడంతో ప్రయోజనం ఉండదు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది సరైన విధానం కాదు. – నవకోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ -
అమ్మేస్పత్రులు!
చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 2022 మార్చి 19వ తేదీన మగ శిశువు అదృశ్యమైంది. మంగసముద్రం గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ప్రసవించిన మూడు రోజుల పసికందును బ్యాగులో పెట్టుకుని ఎత్తికెళ్లిపోయారు. శిశువు అదృశ్యంపై పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బిడ్డను గుంటూరులో గుర్తించారు. ఈ ముఠాను అరెస్ట్ చేసి కటకటపాలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెండు రోజులకు కిందట కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారం బట్టబయలైంది. ప్రభుత్వ వైద్యుడు, ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తూ పట్టుబడ్డాడు. ఆ చికిత్స వికటించడంతో బండారం మొత్తం బయటపడింది. దళారుల ద్వారా జరుగుతున్న ఈ దందా గుట్టు రట్టు అయింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందిన యమున అనే మహిళ ఈ మాఫియాకు బలైంది.చిత్తూరు జిల్లాలో మెడికల్ మాఫియా బుసలు కొడుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కొంత మంది వైద్యుల ముసుగులో దందాలకు పాల్పడుతున్నారు. దళారులతో చేతులు కలిపి పీక్కుతుంటున్నారు. మనుషుల అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు. మదనపల్లి తరహాలో కిడ్నీ మార్పిడిలు, శిశు విక్రయం, అబార్షన్లు, లింగ నిర్ధారణను అవకాశంగా చేసుకుని నిబంధనలకు తూట్లు పొడిచి రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేక దర్జాగా మెడికల్ మాఫియా దందా సాగిపోతోంది. ఇంత జరుగుతున్నా వెద్య ఆరోగ్య శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2,500 పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు 500 పైగా నడుస్తున్నాయి. ఆర్ఎంపీ క్లినిక్లు 4 వేలు, స్కానింగ్ సెంటర్లు 600 పైగా ఉండవచ్చునని అధికారుల అంచనా. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వైద్య వ్యవస్థకే మాయని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. అమాయక ప్రజలను ఆసరా చేసుకుని కాసుల కక్కుర్తికి పాల్పడుతోంది. మదనపల్లిలో జరిగిన కిడ్నీ రాకెట్తో ప్రైవేటు ఆస్పత్రుల, వైద్యుల అక్రమ వ్యాపారం బహిర్గతమైంది. మెడికల్లో దళారులను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈరకమైన ఘటనలు (అక్రమ స్కానింగ్, పసికందుల మాయం) జిల్లాలో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రాణంగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. అబార్షన్లకు అడ్డా చిత్తూరు జిల్లా కేంద్రం అక్రమ స్కానింగ్లు, అబార్షన్లకు అడ్డగా పేరొందింది. ఇందు కోసం జిల్లా నలుమూలల నుంచి రావడంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి పదుల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని పరిచయాలు దళారులను పోషిస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లి కాకుండానే గర్భిణులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి కేసులు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి అధికంగా వస్తున్నారు. జిల్లాకు మధ్యవర్తుల ద్వారా అబార్షన్లకు వస్తున్నారు. వీరిలో కొంత మంది ఐదు నెలలు దాటితే అబార్షన్ కాదని చెప్పడం. తర్వాత బిడ్డ ప్రసవం..ఆపై మాయమవుతోంది.డెమో విభాగం డమ్మీనేనా..ప్రైవేటు ఆస్పత్రుల పుట్టు పూర్వోత్రాలు మొత్తం డెమో విభాగం చేతిలో ఉంటుంది. చిత్తూరు డెమో చేతిలో అధికారిక, అనధికారిక ఆస్పత్రుల వివరాలు పక్కాగా ఉన్నాయి. కానీ అనధికారిక ఆస్పత్రులను టచ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. చూసీ చూడ నట్లు వెళ్లిపోతున్నారు. ఆస్పత్రుల పనితీరుపై నిఘా పెట్టలేకపోతున్నారు. ఓ అధికారి మమల్ని తనిఖీలకు వెళ్లకుండా డమ్మీగా కూర్చోబెట్టారని డెమో సెక్షన్లోని పలువురు వాపోతున్నారు. బొమ్మసముద్రం పీహెచ్సీ పరిధిలో జరిగిన ఘటనతో పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ తోటపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేస్తే...తన అనుమతి లేకుండా ఎలా వెళ్లావంటూ ఓ అధికారి సంజాయిషీ అడిగారు. దీంతో ఆ అధికారి కూడా మిన్నుకుండిపోయారు. కాగా వైద్య వ్యవస్థల్లో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయడంలో వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అనుమతుల్లేని ఆస్పత్రులు చిత్తూరు జిల్లాలో అనుమతిలేని ఆస్పత్రులు కోకొల్లుగా ఉన్నాయి. చిత్తూరు నగరంలో ప్రధానంగా సుందరయ్యవీధిలో అనుమతిలేని ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. అలాగే గిరింపేట, దర్గా సర్కిల్, కొంగారెడ్డిపల్లి, గాం«దీరోడ్డు, సంతపేట, మురకంబట్టు తదితర ప్రాంతాల్లో అనధికారిక ఆస్పత్రులు ఏళ్ల తరబడి నాటుకుపోయాయి. తిరుపతి జిల్లాలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబడి రోడ్డు, లీలామహాల్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బహిరంగంగానే అనుమతి లేని ఆస్పత్రులు పాతుకుపోయాయి. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంత్యరం ఏమిటోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
పెట్టుబడుల్లో ‘టెక్’నిక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచిపెడదామనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పంథాలో వెళుతోంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ.. కొత్త కంపెనీ వస్తోందంటూ ఊదరగొడుతోంది. విశాఖపట్నం జిల్లా బక్కన్నపాలెంలోని 80 ఫీట్ రోడ్డులోని ఈశ్వర్సాయి ఎన్క్లేవ్లో సెయిల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఇదే కంపెనీ విశాలాక్షినగర్లో ఉండేది.అక్కడి నుంచి బక్కన్నపాలేనికి మారింది. ఐటీ హిల్స్లో కూడా ఈ కంపెనీ కార్యాలయం ఉంది. అయితే, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్–3లో మంత్రిలోకేశ్ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఊదరగొడుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు వైజాగ్ చేరుకున్న లోకేశ్.. ముందస్తు ఒప్పందాలంటూ హడావుడి చేశారు. గురువారం ఐటీ హిల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేందుకు గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకు సూట్స్ వేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలున్నాయి.విలువైన భూములు కట్టబెట్టేందుకే..‘శ్రీ తమ్మిన సొల్యూషన్స్’ పేరుతో విశాఖ శంకరమఠం రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ తమ్మిన సొల్యూషన్స్ది కూడా ఇదే కథ. ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్నది కేవలం 500 మంది లోపు ఉద్యోగులే. అయితే, రానున్న ఐదేళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారానే 2వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. 2005లో ఏర్పడిన ఈ కంపెనీ రెండు దశాబ్దాలుగా కల్పించిన ఉద్యోగాల కంటే నాలుగు రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్–2లో భూమిని కేటాయించడమే కాకుండా, భారీగా ఉపాధి లభిస్తుందంటూ లోకేశ్ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న కొన్ని కంపెనీలకు విలువైన భూములను తక్కువ ధరకు అప్పగించేందుకు ఈ నాటకాలను తెరమీదకు తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఒకవైపు 99 పైసలకే ఎకరా భూమి అంటూ వైజాగ్లోని విలువైన భూములను ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. పెద్దగా ఉపాధి కల్పించని కంపెనీలకు కూడా భారీగా భూ సంతర్పణ చేస్తోంది. అప్పనంగా భూములు అప్పగించడానికి, విశాఖలో భారీగా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకునేందుకే వీలుగా ఈ వ్యవహారాలు సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.విశాఖ జిల్లా బక్కన్నపాలెంలో చాలాకాలంగా కొనసాగుతున్న సెయిల్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఇది.. -
వాణిజ్య ప్రతినిధులకు చుక్కెదురు!
సాక్షి, విశాఖపట్నం: లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలంటూ అంకెల గారడీతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వాణిజ్య ప్రతినిధుల విషయంలోనూ అదే వైఖరి ప్రదర్శించింది. తమ వాణిజ్య, వ్యాపారాల్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంత మంది పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. బిజినెస్ టు బిజినెస్ (బీ–బీ) సెషన్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు. 'ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.3,500 నుంచి రూ.10,500 వరకు ఫీజు వసూలు చేశారు. దాదాపు 200 మంది వరకు బీ–బీలో రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 మంది బిజినెస్ ప్రతినిధులతో బీ–బీ సెషన్లో మాట్లాడుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తీరా భాగస్వామ్య సదస్సుకు వచ్చిన తర్వాత.. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడికొచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులు విస్తుపోయారు. సమస్యలుంటే వెబ్సైట్లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి.. సదస్సు ప్రారంభమయ్యే సమయానికి వెబ్సైట్నే మూసేశారు. దీంతో కొందరు వాణిజ్యవేత్తలు బీ–బీపై నిర్వాహకులను నిలదీశారు. ‘వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది.. ఏమీ అనుకోవద్దు.. మీకోసం ఏర్పాటు చేసిన సెషన్ హాల్లో కూర్చోండి’ అంటూ తాపీగా సమాధానం చెప్పి జారుకున్నారు. 200 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అక్కడ మాత్రం కేవలం 20 టేబుల్స్.. ఒక్కో టేబుల్ దగ్గర నాలుగు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అవి కూడా మరుగుదొడ్ల పక్కనే ఏర్పాటు చేయడంతో వచ్చినవారు కూడా ఇబ్బందులు పడ్డారు. జామర్ల కారణంగా ఇంటర్నెట్ కూడా పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా వైఫై క్యూఆర్ కోడ్లు ఇచ్చారు. వాటిని స్కాన్ చేస్తే ఎర్రర్ రావడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు. -
మొగలి పూలు.. రైతుకు సిరులు!
సాక్షి, అమరావతి: సుగంధ పరిమళాలు వెదజల్లే మొగలి పూలు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ పూల సాగుపై ఇప్పుడిప్పుడే రైతులు దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో మొగలి పొదలున్న ఒడిశాలో అధ్యయనం చేసిన ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సువిశాలమైన సముద్ర తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ ఈ మొగలి పూలసాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా గుర్తించింది. తీరంలోనే కాదు.. అంతర పంటగానూ సాగు చేసే దిశగా రైతులను చైతన్యపరచడానికి అడుగులు వేస్తోంది. మొగలి పూల నుంచి నూనె, అత్తరు, ఆకులు, రెమ్మల నుంచి నీరు, ఆకులు, రెమ్మలు, స్టెమ్లను వివిధ రకాల హ్యాండీక్రాఫ్టŠస్ను తయారు చేస్తున్నారు. గతేడాది మొగలి పూల నూనె లీటరు రూ.21 లక్షలకు పైగా పలికిందంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ సాగు విధానం.. ప్రపంచంలో మరే ఇతర వృక్ష జాతికి లేని విశిష్టత ఈ మొగలి పొదల సొంతం. మగ చెట్లు పూలు పూస్తే ఆడ చెట్లు కాయలు కాస్తాయి. ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు బతుకుతాయి. 25–30 ఏళ్ల వరకు పంటనిస్తాయి. ఒండ్రు మట్టి, ఇసుక, ఎర్రమట్టి నేలలు వీటి సాగుకు అనుకూలం. దుక్కిదున్ని 2 అడుగుల దూరంలో ఎకరాకు మట్టి స్వభావాన్ని బట్టి 150–280 మొక్కలు నాటుకోవచ్చు. లైన్ల మధ్య 8–10 అడుగులు దూరం ఉండాలి. వీటి సాగులో ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. ప్రారంభంలో కొద్దిగా నీళ్లుంటే చాలు. ఎకరాకు రూ.లక్ష వరకు మొదట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వ్యయం చేస్తే చాలు. అయితే ఇప్పటి వరకు వీటికి ప్రత్యేకంగా నర్సరీలంటూ ఎక్కడా లేవు. ఇప్పటికే సాగులోని మొక్కల స్టమ్లను తీసుకొచ్చి చెరకుగడల మాదిరిగా నాటితే వాటంతటవే పెరుగుతాయి. వరి పొలాలు, కాలువ గట్ల వెంబడి, ఇళ్లకు, పశువుల కొట్టాలకు కంచెలా, రోడ్ల కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్గానూ నాటుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల్లోనూ అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. క్యాజరీనా, యూకలిప్టస్, జీడి మామిడి, తాటిగచ్చక వంటి వాటికి దీటుగా తీరంలో సముద్ర కోతను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, పొలాలకు రక్షణగా కంచెగా, మడ అడవుల్లా, తుపానులు, ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి. ఎకరాకు 11వేల పూల ఉత్పత్తి జూన్ నుంచి ఆగస్టులోపు మొగలి నాటుకునేందుకు అనుకూలం. ఈ పంటకు తేమ శాతం అధికంగా ఉండాలి. నాటిన మూడేళ్ల తర్వాత ఏటా 3 సీజన్లలో పంట (పూలు) చేతికొస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు, డిసెంబర్ నుంచి జనవరి వరకు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఇలా మూడు సీజన్లలో పూలు పూస్తాయి. మూడో ఏట నుంచి చెట్టుకు 15–20 పూలు (ఎకరాకు 5,600)పూస్తాయి. అదే ఐదేళ్లు దాటితే 35–50 పూలు (ఎకరాకు 11,200) పూస్తాయి. ఒక్కో చెట్టు ఏడాదిలో 800–1000 వరకు పూలు పూస్తుంది. వర్షాకాలంలో పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తీరానికి 3 కి.మీ. వరకు సాగైన పంట నుంచి నెం.1 క్వాలిటీ పూల దిగుబడి వస్తుంది. ఉదయం 5–6 గంటల్లోపు పూచే పూలను ఫస్ట్ క్వాలిటీ పూలుగా, 6–10 గంటల మధ్య పూచే పూలను సెకండ్ క్వాలిటీగా, 10–11గంటల మధ్య థర్డ్ క్వాలిటీ పూలగా పరిగణిస్తారు. మొగ్గ దశలోనే వీటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ పూలకు ఒక్కొక్క దానికి రూ.35–45, రెండో రకానికి రూ.20–25, మూడో రకం పూలకు రూ.10–15 ధర లభిస్తుంది. పండుగ సీజన్లలో థర్డ్ క్వాలిటీ పూలు సైతం మార్కెట్లో రూ.40 వరకు ధర పలుకుతాయి. తీరానికి 3 కి.మీ.వరకు నాటిన మొక్కల ద్వారా వచ్చే ఫస్ట్ క్వాలిటీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గరిష్టంగా ఎకరా పూల ద్వారా 2.75 కిలోల వరకు నూనె ఉత్పత్తి అవుతుంది. సగటున కిలో రూ.9.25 లక్షలు పలుకుతుండగా, మొగలి పూల ద్వారా తయారయ్యే అత్తరు లీటరు రూ.40–80వేలు, మొగలి జలం లీటర్ రూ.5–20వేల వరకు పలుకుతోంది. నూనెను ఫుడ్ బేవరేజస్లో విరివిగా వినియోగిస్తారు. అదే మొగలి జలాలను సెంటెడ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. రైతుల నుంచి ఫ్యాక్టరీలు నేరుగా పూలను కొనుగోలు చేస్తాయి. ఒడిశాలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి మొగలి సాగుకు ప్రపంచంలోనే ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురం పరిసర ప్రాంతాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాల్లో మొగలి సాగవుతోంది. ఈ ప్రాంతంలో 400కు పైగా పరిశ్రమలున్నాయి. 12 వేల మందికిపైగా ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి ఈ పూలు సాగు చేసే రైతులే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా నూనె, అత్తరు, నీరు వంటి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలోఉత్తరప్రదేశ్లోని కనోజ్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఏపీలో ఉద్దానం, సోంపేట, ఇచ్చాపురం, కవిటితో పాటు ప్రకాశం, చీరాల, బాపట్ల, పశి్చమ గోదావరి జిల్లాల్లో ఈ పంట సహజ సిద్ధంగా సాగవుతోంది. ఒడిశా స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాలో 400 ఎకరాలు వరకు రైతులు మొగలి సాగు చేస్తున్నారు.ఆదాయం వచ్చే పంటగా అభివృద్ధి చేస్తున్నాం మొగలి పొదల సాగు రైతులకు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం లోతైన అధ్యయనం సాగుతోంది. మొగలి పొదలు పెంచే రైతులకు అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు బోర్డు ద్వారా అందజేస్తాం. స్వల్ప వ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం ఒడిశా నుంచి నాణ్యమైన మొగలి అంట్లు అందుబాటులోకి తీసుకొస్తాం. పంట భూముల రక్షణకు ఏర్పాటు చేసుకునే మొగలి చెట్లు పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొగలి హెర్బల్ గార్డెన్స్ పెంపకాన్ని బోర్డు ద్వారా ప్రోత్సహిస్తాం. – ఆవుల చంద్రశేఖర్, సీఈవో, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు -
ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మళ్లీ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15రోజుల ముందు వర్సిటీలోని సైకాలజీ విభాగంలో ర్యాగింగ్కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోగా ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో పైశాచికానందంతో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు.అర్ధరాత్రి హాస్టల్లో జూనియర్లను గంటల తరబడి నిల్చోబెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వర్సిటీకి చేరుకుని విషయంపై ఆరాతీయగా ఇంటరాక్షన్ క్లాసులు మాత్రమేనంటూ సీనియర్లు, హాస్టల్ సిబ్బంది మాయ మాటలు చెప్పసాగారు. దీంతో శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
జనసేనలో భూమి గోల
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తనదాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు, సీఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది. రూ.350 కోట్ల విలువచేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం బోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30,31,39, 461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకుపైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది. అయితే, సదరు భూమిలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయి. అనంతరం జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్లో పీఆర్ఎస్ నాయుడుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే పీఆర్ఎస్ నాయుడుకు అనుకూలంగా వ్యవహరించేందుకు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా రూ.50 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో పీఆర్ఎస్ నాయుడు నేరుగా భూమిలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేకు వార్నింగ్.. అధికారుల బదిలీ తనతో సంబంధం లేకుండా నేరుగా సమస్యను పరిష్కరించుకోవడంపై కినుక వహించిన ఎమ్మెల్యే స్థానిక తహశీల్దారుతో పాటు సీఐపై ఒత్తిడి తెచ్చి.. సివిల్ వివాదాన్ని కాస్తా క్రిమినల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. నాయుడుకు అనుకూలంగా పవన్ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారని తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాత్రం తన వాటా దక్కాల్సిందేనంటూ స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలున్నాయి. సురేష్ ఈ విషయాన్ని పవన్కు చేరవేశారు. దీంతో పవన్.. సదరు ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఇద్దరు అధికారులను బదిలీ చేయించారు. అంటే తన సన్నిహితుడు తల దూర్చిన భూ వివాదంలోనే తన ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏ మేరకు వీరి ఆగడాలు ఉన్నాయనేది పవన్కు తెలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేబినెట్లో పవన్ ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించడం ఏమిటంటూ సదరు ఎమ్మెల్యే వర్గీయులు వాపోతున్నారు. అసలు పవన్ సన్నిహితుడికి తమ నియోజకవర్గంలోని భూ వివాదంతో పనేమిటంటూ వారు మండిపడుతున్నట్లు సమాచారం. తన సన్నిహితుడు భూ వివాదంలో తల దూర్చిన విషయాన్ని మరుగునపెట్టి, కేవలం తమ నేతపై మాత్రమే నింద వేయడం సరికాదంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల ఆగడాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలతోపాటు వారి సోదరులు, బంధువులు, పీఏల ఆగడాలు మితిమీరాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మూడు రాష్ట్రాల్లో మదనపల్లె కిడ్నీ రాకెట్ లింకులు!
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు మూడు రాష్ట్రాల్లో విస్తరించినట్టు తెలుస్తోంది. కిడ్నీ ఇచ్చినది విశాఖ జిల్లా యువతి, దానిని అమర్చింది గోవాకు చెందిన వ్యక్తికి, ఈ ఆపరేషన్ చేసినది బెంగళూరుకు చెందిన వైద్యుడని పోలీసులు గుర్తించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఎప్పటి నుంచి ఉంది? ట్రాన్స్ఫ్లాంటేషన్కి అనుమతిలేని ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎలా చేశారు? ఇందులో అనుభవం కలిగిన వైద్యుల అవసరం కాబట్టి వాళ్లు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని విశాఖపట్నం సహా మరికొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, గోవా రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. విశాఖతో మదనపల్లెకు లింకు ఎలా కుదిరింది? విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సాడి యమున (29) అనే యువతి కిడ్నీ తీసి గోవాకు చెందిన వ్యక్తికి అమర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యూరాలజీ వైద్యుడు పార్థసారథి అని గుర్తించారు. ఆయన కోసం గాలిస్తున్నారు. కిడ్నీ స్వీకరించినది గోవా వ్యక్తి.. అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కిడ్నీ సేకరించే విషయంలో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాకు చెందిన యువతికి, ఆపరేషన్ చేసిన ఆస్పత్రి ఉన్న రాయలసీమలోని మదనపల్లె ముఠాకు ఎలా లింకు కుదిరింది? వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో కీలక నిందితుడైన వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు నుంచి వివరాలను రాబడితేనే గుట్టంతా వీడుతుందని భావిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేసిన మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిన్నర కిందట ప్రారంభించారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఇప్పటిదాకా ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేశారో ఆరా తీస్తున్నారు.ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసేవారే కీలకం? ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు, కదిరి, మదనపల్లె ప్రభుత్వాస్పత్రుల్లోని డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న బాలు, మెహరాజ్ కీలకమని పోలీసులు గుర్తించారు. సాడి యుమున మృతిచెందకుండా ఉంటే కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చేదికాదు. కిడ్నీ రాకెట్ ముఠా ఆమె మరణించిన తర్వాత కూడా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించి, విషయం బయటకు రాకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. మరోవైపు యమునతో ఎమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఈ విషయాలన్నీ తెలిసే కిడ్నీ మార్పిడి కోసం మధ్యవర్తులైన పిల్లి పద్మ, సత్యతో ఆమెను పంపినట్టు పోలీసులు గుర్తించారు. క్రైమ్ నంబర్ 179/2025గా నమోదైన కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. డాక్టర్ ఆంజనేయులును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎఫ్ఐఆర్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. -
బాబు ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికే బలి
సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణి కేసులో కూటమి ప్రభుత్వ క్షుద్ర రాజకీయం మరింత వికృతరూపం దాలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన అప్పటి టీటీడీ ఏవీఎస్వో, ప్రస్తుత జీఆర్పీ సీఐ వై.సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి కేంద్ర బిందువుగా కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం పన్నుతోంది. ఈ ఉదంతాన్ని రెడ్బుక్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకునేందుకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సతీశ్ కుమార్ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా వేధించిన విషయం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి. మరోవైపు ఆయన మృతి అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండా పోలీసు ఉన్నతాధికారులు సతీశ్ కుమార్ది హత్యేనని ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులకు అనుగుణంగా వక్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సతీశ్ కుమార్కు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు.. ఆయన అనుమానాస్పద మృతిపై పోలీసుల లీకు రాజకీయాలు కూటమి ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్న తీరు ఇదిగో ఇలా ఉంది..కుటుంబ సభ్యులను కట్టడి చేసిన పోలీసులు⇒ వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని సతీశ్కుమార్ తేల్చిచెప్పిన తరువాత పరిణామాల్లోనే.. ఆయన శుక్రవారం అనుమానస్పదంగా మృతి చెందడం గమనార్హం.⇒ గుంతకల్లో గురువారం అర్ధరాత్రి 12.45 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ బోగీలో రైలు ఎక్కిన సతీశ్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించారు. కాగా ఈ విషయం బయటకు పొక్కగానే పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది.⇒ ప్రధానంగా సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడకుండా పోలీసు అధికారులు కట్టడి చేశారు. ఆయన నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు, సమీప బంధువులతోసహా ఇతరులను వెళ్లనివ్వలేదు. సతీశ్ కుమార్ భార్య ఫోన్నూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రికీ ఆమె ఫోన్ను తిరిగి ఇవ్వనే లేదు. బాధిత కుటుంబం తమ ఆవేదనను ఎవరితోనూ పంచుకునేందుకు.. ఆయన మృతిపై తమ సందేహాలను వెల్లడించేందుకూ అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టడి చేయడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.అధికారిక నిర్ధారణ లేకుండా కుట్రపూరిత ప్రచారంఇక సతీశ్ కుమార్ మృత దేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించిన తరువాత పోలీసుల తీరు మరింత సందేహాస్పదంగా మారింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ ప్రాథమిక నివేదికలో ఏమని తెలిపారో అధికారికంగా వెల్లడించలేదు. సతీశ్ కుమార్ మృతికి కారణమేమిటన్నది చెప్ప లేదు. కానీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే ఎల్లో మీడియా ద్వారా తమ కుట్రను బయటపెట్టారు. సతీశ్ కుమార్ది హత్యేనని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్సైట్లు, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆ విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు.సతీశ్ కుమార్ది హత్యేనని టీడీపీ అధికారిక వెబ్సైట్ శుక్రవారం రాత్రి 7.30గంటలకే పోస్టు చేసింది. ఇక ఈనాడు వెబ్సైట్లోనూ సతీశ్ కుమార్ను హత్య చేశారని పేర్కొన్నారు. పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక పేర్కొందని కూడా చెప్పడం గమనార్హం. అంటే పోలీసులు అధికారికంగా నిర్ధారించకుండా.. ఇలా టీడీపీ వెబ్సైట్లు, ఎల్లో మీడియా ద్వారా కుట్రపూరితంగానే ఓ ప్రచారాన్ని వైరల్ చేశారన్నది స్పష్టమవుతోంది.టీడీపీ కార్యాలయం డైరెక్షన్లోనే..సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్లోనే పోలీసులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ లక్ష్యంగా నిరాధారణ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను బలపరిచేలానే పోలీసులు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. శుక్రవారం సాయంత్రానికే అందుకు అనుగుణంగా పోలీసులు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. ఆయన తల వెనుక భాగంలో గాయముందని.. పక్కటెముకలు విరిగాయని.. హత్యేనని వైద్యులు ప్రాథమికంగా తెలిపారని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్సైట్, ఆ పార్టీ సోషల్ మీడియాలో అదే విషయాన్ని వైరల్ చేశాయి.కక్ష సాధింపు కోసమే పన్నాగం..సతీశ్ కుమార్ది హత్యేనని పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక వెల్లడిస్తే.. ఆ విషయాన్ని పోలీసులు అధికారికంగానే వెల్లడించవచ్చు. అందుకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ పోలీసులు అలా చేయలేదు. కేవలం ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. సతీశ్ కుమార్ది హత్యే అయితే... ఎవరిపై అక్రమ కేసు నమోదు చేయాలా అని ప్రభుత్వ తుది ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. లేదా.. హత్యకు కారకులైన టీడీపీ వర్గీయులను కేసు నుంచి తప్పించేందుకే కాలయాపన చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.ఏది ఏమైనా సరే సతీశ్ కుమార్ మృతి వెనుక అసలు విషయాన్ని కప్పిపుచ్చి.. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రకు వాడుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకు ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్ను అమలు చేయడమే తమ కర్తవ్యంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. కాగా పోలీసు అధికారి మృతిపై ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుండటంపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి.అబద్ధపు వాంగ్మూలం కోసం సతీశ్ కుమార్ను తీవ్రంగా వేధించడంపైనే పోలీసు వర్గాలను ఆవేదనకు గురి చేసింది. కాగా ప్రస్తుతం ఆయన అనుమానాస్పద మృతి వెనుక వాస్తవాలను వెల్లడించకుండా కక్ష సాధింపు కోసం వక్రీకరించేందుకు యత్నిస్తున్నారని పోలీసువర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దల వైపే..⇒ అబద్ధపు వాంగ్మూలం కోసం వేధింపులు⇒అందుకు సతీశ్ కుమార్ ససేమిరా⇒ ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతిటీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పరకామణి కేసు దర్యాప్తును వక్రీకరించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్కెచ్ వేశారు. వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసులో ఇరికించి వేధించేందుకు పక్కా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ సీఐడీ అధికారులను రంగంలోకి దించారు. డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో ఈ అక్రమ కేసు దర్యాప్తు కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. కానీ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. దీంతో సీఐడీ, పోలీసు అధికారులు టీటీడీ పూర్వ ఏవీఎస్వో సతీశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని ఆయన్ని వేధించారు.తాము చెప్పినట్టుగా సీఆర్పీసీ 161, 164 వాంగ్మూలాలు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితోపాటు మరి కొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. వారు చెబితేనే తాను ఈ కేసులో లోకాయుక్త ఎదుట హాజరై రాజీ ప్రక్రియను పూర్తి చేసినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. సతీశ్ కుమార్ ద్వారా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే.. దాన్ని బట్టి అప్పటి తిరుపతి ఎస్పీగా ఉన్న పరమేశ్వర్రెడ్డి, మరికొందరు పోలీసు అధికారుల నుంచి అదే రీతిలో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది పోలీసు ఉన్నతాధికారుల ఉద్దేశం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో ఇరికించి... జైలు పాలు చేస్తామని కూడా సతీశ్ కుమార్ను బెదిరించినట్టు తెలుస్తోంది.పోలీసు ప్రధాన కార్యాలయ అధికారులతోపాటు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతోనూ సతీష్కుమార్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సామాజికవర్గ కోణంలో విజయవాడలోని ఓ పోలీసు అధికారి ద్వారా సతీశ్కుమార్ను తమ దారికి తెచ్చుకునేందుకు యత్నించినట్టు తాజాగా వెలుగు చూసింది. సతీశ్ కుమార్ సామాజికవర్గానికి చెందిన అధికారితో మాట్లాడించి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. మనం మనం ఒకటి కాబట్టి చెబుతున్నా.. పోలీసు బాస్లు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పించినట్టు సమాచారం. అంతేకాదు సతీష్ కుమార్ను విచారిస్తున్న సమయంలో లక్ష్మణరావు అనే ప్రైవేటు వ్యక్తి(రౌడీ)ని ప్రవేశపెట్టడం గమనార్హం.లక్ష్మణరావు చేత సతీశ్కుమార్ను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించినట్టు సమాచారం. సహచర పోలీసు అధికారుల సమక్షంలో ఓ పోలీసు అధికారిని ఓ ప్రైవేటు వ్యక్తి పరుషపదజాలంతో దూషించడం... బెదిరించడం.. అంతు చూస్తామని వేధించడం ఏమిటనే విభ్రాంతి పోలీసుశాఖలో వ్యక్తమవుతోంది. ఈ నెల 6న ఓసారి ఆయన్ని సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఆయన్ని శనివారం విచారణకు రావాలని తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాలతో సతీశ్ కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని, రాజకీయ కుట్రలో పావుగా మారి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన మనస్సాక్షి అంగీకరించ లేదని సమాచారం. తాను అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని ఆయన సీఐడీ అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి. -
వ్యక్తిగత ప్రయోజనాలకు సీబీఐని వాడుకోలేరు
సాక్షి, హైదరాబాద్: స్వప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను వినియోగించుకోవాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. అంతకుముందు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు సాయి వంశీకృష్ణ, ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ, ‘సునీత పరస్పర విరుద్ధ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకవైపు కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ, మరోవైపు మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు నచ్చినట్లు విచారణ చేయాలని కోరడం ఎంతమాత్రం చెల్లదు. ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్లో బాధితులమని చెప్పుకొనేవారంతా దర్యాప్తు సంస్థలను సొంత లబ్ధికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సునీత చర్యలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. సత్వర విచారణ కోరుతున్నారా? లేదా విచారణ ఇంకా జాప్యం కావాలని కోరుకుంటున్నారా? అనే అంశంపై స్పష్టత లేకుండా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్లు వేస్తున్న పిటిషన్లతో కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాదు.. విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో రోజూ విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే, ఈ కోర్టు మళ్లీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా నిష్ప్రయోజనం అవుతుంది. న్యాయస్థానంలో కేసు విచారణ ఆలస్యం చేయడానికే సునీత ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని నివేదించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ఏమిటి?‘సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ధర్మాసనం స్పందిస్తూ దిగువ కోర్టును నిర్ణయం తీసుకోమని చెప్పింది. అయితే, వాస్తవ పరిధి ఉన్న కడప కోర్టును ఆదేశించిందా? లేక హైదరాబాద్లోని ఈ కోర్టును ఆదేశించిందా? అనేది సందేహాస్పదంగా మారింది. ‘అధికార పరిధి’ తేలిస్తే ఈ పిటిషన్ మెయింటెనబుల్ అవుతుందో? లేదో? తెలుస్తుంది. సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్లలో ప్రతివాదులుగా సీబీఐని తప్ప నిందితులను చేర్చలేదు. దీంతో వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం కోర్టు మరింత దర్యాప్తునకు ఆదేశించలేదు. దిగువ కోర్టును ఆశ్రయించాలని మాత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో వేసిన పలు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం వద్ద ప్రస్తావించలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత మళ్లీ దర్యాప్తు చేయాలని కోరడం చట్టవిరుద్ధం. ఏ కేసులోనైనా చార్జెస్ ఫ్రేమ్ చేశాక దర్యాప్తు కొనసాగించడం సాధ్యం కాదు. ఫలాన ఫలాన అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరలేరు. ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఆమె చెబుతుండడం సరికాదు. సీబీఐ తనకు నచ్చినట్లు, తను చెప్పినట్లు దర్యాప్తు చేయాలని ఆమె పట్టుబట్టడం చెల్లదు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టులో వెల్లడించిన సీబీఐ, మళ్లీ విచారణ ఎలా ప్రారంభిస్తుంది’’ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. -
బాబు బండారం బట్టబయలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రకటించారు. శుక్రవారం విశాఖ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ వైజాగ్ టెక్ పార్కులో ఇద్దరం కలిసి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. తద్వారా విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు బట్టబయలు అయ్యింది. అదానీ గ్రూపు పేరును దాస్తూ గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ మరోమారు చర్చకు వచ్చింది. విశాఖలో అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎదుటే కరణ్ అదానీ ప్రకటించడం కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది. ఇది అన్నిచోట్లా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కాదని, ఇది ఇండియా డిజిటల్ చరిత్రను తిరగరాస్తుందని కరణ్ అదానీ తెలిపారు. ఈ డేటా సెంటర్ను పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని కరణ్ అదానీ చంద్రబాబు ఎదురుగానే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కరణ్ అదానీ గూగుల్ కలిసి డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించిన వెంటనే సీఎంతోపాటు వేదికపైన ఉన్న టీడీపీ మంత్రుల ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి.సీఐఐ వేదికగా మళ్లీ అదే బొంకుడుఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకోవడంతోపాటు, డేటా సెంటర్కు డేటా తీసుకురావడం కోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్ సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేసే ప్రాజెక్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దేశంలోని డేటా సెంటర్ ఏర్పాటు బాధ్యతలను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అదానీకి అప్పగించింది. గూగుల్తో అనుబంధం ఉన్న అదానీ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపులో భాగంగానే అదానీతో కలిసి గూగుల్ 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ అదానీ సీఐఐ వేదికగా చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సైతం ఆ విషయాన్ని దాచి పెట్టడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఇదే విషయమై సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తల మధ్య ఇదేం విడ్డూరం అంటూ విస్తృతంగా చర్చ జరిగింది. విశాఖ సదస్సులో ప్రసంగించిన అనంతరం కరణ్ అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ పెట్టుబడుల కొనసాగింపు..అదానీ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్తో దీర్ఘకాలంగా అనుబంధం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో పోర్టులు, సిమెంట్, ఎనర్జీ డేటా సెంటర్స్ వంటి రంగాల్లో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని, దీన్ని కొనసాగిస్తూ వచ్చే పదేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు కరణ్ అదానీ ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందని, దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్లలో ఒకటని వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్టులో భాగం కావడం ఆనందంగా ఉంది: జీఎంఆర్భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు(జీఎంఆర్) పేర్కొన్నారు. ఇక్కడ భారీ ఎంఆర్వో యూనిట్తోపాటు ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టంను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లను విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి మాట్లాడుతూ నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో మల్లవల్లి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ నుంచి మామిడి, జామ రసాల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు. -
ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ మృతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీస్ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చాలన్నారు.విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెర తీసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలు పోలీసు సమాజానికే అవమానకరమన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.సీబీఐతో విచారణ జరిపించాలి..‘ఈ ప్రభుత్వం చేస్తున్న అపచారాలను ప్రశి్నస్తున్న నన్ను దోషిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి నుంచి నారా లోకేష్ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశారో అందరికీ తెలుసు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్ మరణం వెనుక కారణాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. పది రోజులుగా జరుగుతున్న సీఐడీ విచారణ తతంగం, న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి జరుగుతున్న యత్నాలపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని భూమన డిమాండ్ చేశారు.ఇది ప్రభుత్వ హత్యే..!‘పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్కుమార్పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.పరకామణి కేసును విచారిస్తున్న అధికారులు న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రౌడీలు, గూండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. ఏ అర్హత లేని లక్ష్మణ్ రావు అనే క్రిమినల్ కూడా విచారణలో పాల్గొని సతీష్ కుమార్ను బండ బూతులు తిట్టాడు. తన పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్ చెప్పడం వల్లే రాజీకి వెళ్లానని అధికారులకు సతీష్ కుమార్ చెప్పారు’ అని భూమన చెప్పారు. -
బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ రావాలి
ఎంవీపీ కాలనీ: రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నెరెడ్కో నిర్వహించిన ‘వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులెవరైనా విశాఖ బీచ్కు వస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, భర్త బీచ్లో కూర్చుని రెండు పెగ్గులేసుకుంటే భార్య ఐస్క్రీం తింటూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకొస్తారని ప్ర«శ్నించారు. క్యాసినో, పబ్కల్చర్ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్కు సూచించారు. విశాఖలో కొంత కాలంగా రియల్ ఎస్టేట్ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లే అవుట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోతే తాను ఇస్తానన్నారు. -
టీటీడీ మాజీ ఏవీఎస్వో అనుమానాస్పద మృతి!
తాడిపత్రిటౌన్/గుంతకల్లు/అనంతపురం సెంట్రల్/ తిరుమల తిరుపతి దేవస్థానం/పత్తికొండ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.విచారణకు వెళుతూ..పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.2012 బ్యాచ్ అధికారికర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది.నిష్పక్షపాతంగా విచారణ చేయాలిసతీష్ కుమార్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు గోపాల్, ఓబుళపతి, నాగేంద్ర, రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. సతీష్కుమార్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఐడీ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా దర్యాప్తు చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సతీష్ కుమార్ భార్య మమతను సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆమె సెల్ఫోన్ను పోలీసు అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. పోలీసులు ఆమె సెల్ఫోన్ను తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.పోస్టుమార్టం పూర్తిసతీష్కుమార్ మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండకు తరలించారు. తొలుత మృతదేహానికి సీటీస్కాన్ చేశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. జిల్లా ఎస్పీ జగదీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా సతీష్ వినియోగిస్తున్న సెల్ఫోన్ను విజయవాడ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా జిల్లా ఎస్పీ జగదీష్ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోనే ఉన్నప్పటికీ చివరకు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, సతీష్ కుమార్ మృతి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసేందుకు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురానికి చేరుకున్నట్లు సమాచారం.హత్య కోణంలో దర్యాప్తు చేయాలి: బీజేపీసాక్షి, అమరావతి: తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి సతీష్కుమార్ అనుమానాస్పద మరణం ఆందోళనకరమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రైల్వే ట్రాక్పై మృతదేహం లభించడం దర్యాప్తును మరింత తీవ్రమైన కోణంలో పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను హత్య కోణంలో దర్యాప్తు చేయమని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ మరణం వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలి. నిజం వెలుగులోకి రావాలి’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్నారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇదిగో ఆధారాలు..పవన్ పేషీ భూకబ్జా..!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్న వ్యక్తిపై వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన భీమర శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో తనకు చెందిన 11 ఎకరాల 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సురేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై 2004 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ భూమిని తమకు అప్పగించకపోవడం బాధాకరమని రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సత్య అనే వ్యక్తితో పాటు మరొకరు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి సురేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి పాస్బుక్లు ఇవ్వకుండా సురేష్ అడ్డుపడుతున్నాడని, చుట్టుపక్కల భూములకు పాస్బుక్లు వచ్చినా తన భూమికి మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని రమణబాబు అన్నారు. తన భూమి విలువ రూ.110 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, తన పేషీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రమణబాబు కోరారు. నా భూమిని నాకు అప్పగించకపోతే, పవన్ కళ్యాణ్ను కలసి, ఆయన పేషీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా వెల్లడిస్తాను’ అని హెచ్చరించారు. ఓవైపు అవినీతి, భూకబ్జాలపై పోరాడతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, తన పేషీలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అని రమణబాబు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest congratulations to Dhiraj Bommadevara from Andhra Pradesh on clinching the GOLD MEDAL in the Men's Recurve at the Asian Archery Championship 2025! A true champion and a moment of immense pride. May he achieve many more victories!#IndianArchery@BommadevaraD pic.twitter.com/aCuTysqs5r— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2025 -
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: టీడీపీ మాజీమంత్రి యనలమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను రోజూ సాక్షిపేపర్ చదువుతా.. సాక్షి టీవీ చూస్తా. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం. మెడికల్ కాలేజీల నిరసన ర్యాలీతో.. ప్రతిపక్షంలో కసి పెరిగింది. ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు’ అని గుర్తు చేశారు. -
సీఐఐ సమ్మిట్ సాక్షిగా బట్టబయలైన ‘క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సమ్మిట్ సాక్షిగా క్రెడిట్ చోరీ బట్టబయలైంది. చంద్రబాబు బండారాన్ని కరణ్ అదానీ బట్టబయలు చేశారు. డేటా సెంటర్ను నిర్మిస్తున్నట్టు కరణ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదాని డేటా సెంటర్ ఒప్పందానికి బీజం పడిన సంగతి తెలిసిందే. గూగుల్ పార్ట్నర్షిప్తో డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇవాళ సమ్మిట్ ప్రారంభోత్సవంలో కరణ్ అదానీ ప్రకటించారు.గూగుల్ పార్ట్నర్షిప్తో బిగెస్ట్ డేటా సెంటర్ను ఏపీలో నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ పనిచేస్తోందన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలను కూడా అదానీ సంస్థ కల్పించిందన్నారు. ఏపీలో వృద్ధిలో అదానీ సంస్థ భాగస్వామి అవుతోందని కరణ్ తెలిపారు. ఇదే విషయం గతంలో వైఎస్ జగన్ ఆధారాలతో వెల్లడించారు. అదానీ పేరు చెప్పకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు. చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కరణ్ నిజం బయటపెట్టారు.ఇదీ చదవండి: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ -
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
కూటమి ఓవరాక్షన్.. పెద్దారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల తీరును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నేతలు సూచనల మేరకే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో, పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు స్పందిస్తూ.. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేశారని ఘాటు విమర్శలు చేశారు. దీంతో, తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు బాలల దినోత్సవం. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘నాణ్యమైన విద్య, ప్రపంచానికి పరిచయంతో పిల్లలు పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తాయి. మనం వారిని ఆ మార్గంలో నడిపించాలి. శక్తివంతమైన, ప్రగతిశీల భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారి పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలంటే అందుకు వారికి అధికారం కల్పించాలి’ అని పోస్టు చేశారు. Quality education and exposure to the world inspire children to dream big. We should guide them on that path and ensure they are empowered to unlock their full potential in realising those dreams, for a vibrant, robust, and progressive India. #ChildrensDay— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2025 -
హాస్టల్ విద్యార్థిని బ్యాగ్లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం
గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున ఉన్న పరివర్తన భవన్ (ఎస్సీ వెల్ఫేర్ కాలేజీ బాలికల హాస్టల్)లో ఓ విద్యార్థిని బ్యాగ్లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం, మెట్టెలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థినుల బ్యాగులు చెక్ చేసే క్రమంలో వారం రోజుల కిందట పరివర్తన భవన్లోని ఓ విద్యార్థిని బ్యాగులో ఇవి బయటపడ్డాయి. వెంటనే సిబ్బంది వార్డెన్కి చెప్పగా, వార్డెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. బయటకు పొక్కడంతో బుధవారం రాత్రి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లావణ్యవేణి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణం చూసి నివ్వెరపోయారు. 2గంటలకుపైగా ప్రతి గదిని తనిఖీ చేశారు. ముగ్గురు వార్డెన్లు ఉన్నప్పటికీ హాస్టల్ను ఈ విధంగా గాలికి వదిలేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం. విద్యారి్థని బ్యాగ్లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్ వ్యవహారంపై ఏఎస్డబ్ల్యూఓ శైలజను వివరణ కోరగా అటువంటి ఘటనలు గాని, ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏఎస్డబ్ల్యూఓ(అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్), హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆ శాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్)ను ఆదేశించినట్లు తెలుస్తోంది. నెలకిందట ఇదే హాస్టల్కు చెందిన ఓ విద్యార్థినిని ఓ ఆకతాయి హైదరాబాద్కు తీసుకువెళ్లాడు. 3 రోజులపాటు పోలీసులు శ్రమించి ఆ విద్యార్థినిని హాస్టల్ అధికారులకు అప్పగించారు. ఈ విషయంలో విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి అధికారులపై మండిపడ్డారు. గతేడాది డిసెంబర్లో ఇదే పరివర్తన భవన్లో ఓ విద్యార్థిని ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి వార్డెన్ను సస్పెండ్ చేశారు. హాస్టల్ నిర్వహణపై పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పేందుకు ఈ వరుస ఘటనలే నిదర్శనం. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 62,129 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,026 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 4.13 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
-
అమ్మో పులి
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పులుల సంచరిస్తున్నాయన్న సమాచారంతో స్థానికులు హడలిపోతున్నారు. వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాలో శనివారం, ఆదివారాలలో మేతకు వెళ్లిన రెండు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. గేదెలు మరణించిన తీరు, అక్కడి పాదముద్రల ఆధారంగా పులి చంపినట్టు అటవీ అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ రేంజ్లో ఇటీవల కాలంలో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన పశువులను పెద్దపులి వేటాడి చంపిన ఘటనలు అనేకం ఉన్నాయి.రెండేళ్ల కిందట దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రికల ఆధారంగా రెండు పులులు దాడి చేసి నట్టు అటవీశాఖ అధికారులు అప్పట్లో నిర్ధారించా రు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకొని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి పులుల సంచారం పెరగడంతో ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. పెరుగుతున్న పులుల సంఖ్య... శ్రీశైలం, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి కొన్నేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 85 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా, అనధికారికంగా మరి కొన్ని పులులు ఉండవచ్చని భావిస్తున్నారు. టైగర్ జోన్ను ఆహార వేట కోసం పులులు పల్నాడు జిల్లా శివారు తండాల వైపు వచ్చి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాలలో పులులు సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చిరిస్తున్నారు. రక్షణ కోసం చర్యలు వివిధ కారణాలతో జనారణ్య సమీపంలోకి వచ్చిన పులులను ఇబ్బందిపెట్టవద్దని ప్రజలకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సహాయంతో పులుల జాడ తెలుసుకొని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడు కోవడానికి పొలాల చుట్టు వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు నిత్యం రాత్రిపూట గస్తీ పెంచారు. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వజ్రాలపాడు తండా సమీపంలోని నాలుగు గ్రామాలలో సోమవారం అటవీ శాఖ దండోరా వేయించింది. పులి సంచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తున్నట్టు సమాచారం. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పాదముద్రలను పరిశీలించి వరుసగా రెండు రోజులు ఒకే పులి దాడిచేసిందా లేదా వేర్వేరు పులులు దాడి చేశాయా అనే కోణంలో అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి, లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వివాహ వేడుకకు విచ్చేసి.. నూతన వధూవరులు ప్రణయచంద్రారెడ్డి, జానకి ప్రియను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. – గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం) కంటి‘పాప’ భావోద్వేగం ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాలులో గురువారం వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. -
ఎన్కౌంటర్ చేసి పాతరేస్తాం
సాక్షి, అమరావతి: ‘వేమన సతీశ్కు డబ్బులు ఇచ్చాననే విషయం చెబుతావా.. మాల లం.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. నిన్నూ, నీ మొగుడ్నీ, కుటుంబం మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం’ అని కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ తమను బెదిరించారని టీడీపీ దళిత నేత సుధా మాధవి వెల్లడించారు. పోలీసులు తమను కిడ్నాప్ చేసి, బంధించి, వేధించి.. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత వేమన సతీశ్కు తాము డబ్బులు ఇవ్వలేదని వీడియో రికార్డింగ్ చేయించారని కూడా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీ కోయా ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేత వేమన సతీశ్ తమ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనకు నగదు ఇస్తున్న వీడియోలను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు సుధా మాధవి, ఆమె భర్తను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సుధా మాధవి దంపతులను పోలీసులు అపహరించారని వారి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున తదితరులు ఎలా కిడ్నాప్ చేసి వేధించిందీ వివరిస్తూ సుధా మాధవి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిర్యాదులోని అంశాలను వివరించి, పోలీసుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని వాపోయారు. సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. టీడీపీ కార్యాలయం ఎదుటే కిడ్నాప్ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నంబరు లేని వాహనంలో వచ్చిన పోలీసులు నా భర్తను, నన్నూ బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన మా కొడుకు, మనవడిని తీవ్రంగా కొట్టారు. నాకు, నా భర్తకు తుపాకి గురి పెట్టి అరిస్తే కాల్చేస్తామని బెదిరించారు. మా ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ నాగార్జున మమ్మల్ని నేరుగా మదనపల్లెకు తీసుకువెళ్లి ఓ గదిలో బంధించారు. ఎన్కౌంటర్లో లేపేస్తాం సీఐ నాగార్జున, ఓ మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు మమ్మల్ని తీవ్రంగా వేధించారు. మమ్మల్ని కులంపేరుతో బూతులు తిట్టారు. వేమన సతీశ్కు రూ.7 కోట్లు ఇవ్వలేదని చెప్పాలని, లేకపోతే ఇక్కడే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు రాస్తామని బెదిరించారు. అనంతరం సీఐ నాగార్జున తన దగ్గర ఉన్న ఓ ఫోన్ నుంచి డీఐజీ కోయా ప్రవీణ్కు ఫోన్ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. అవతలి నుంచి డీఐజీ కోయా ప్రవీణ్ తనను పరిచయం చేసుకుని.. ‘వేమన సతీశ్ నాకు వరుసకు తమ్ముడు అవుతాడు. అతను రూ.7 కోట్లు తీసుకున్న విషయాన్ని మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తారా.. మీకు ఎంత ధైర్యం.. అలా ఫిర్యాదు చేసి బతకగలం అనుకుంటున్నారా.. మిమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తే దిక్కూ మొక్కూ ఉండదు.. అయినా మీ ముఖాలకు రూ.7 కోట్లు ఉన్నాయా.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. మాల లం.. అని అసభ్యంగా తిడుతూ బెదిరించారు. నిన్నూ, నీ మొగుడిని, మొత్తం కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం అని హెచ్చరించారు. మాల, మాదిగలకు రోడ్డెక్కడం అలవాటే ఆ వెంటనే వేమన సతీశ్ మాతో ఫోన్లో మాట్లాడారు. చూశారా నా పవర్.. రాష్ట్రంలో మీరు కాదు కదా.. మిమ్మల్ని పుట్టించిన వాళ్లు కూడా నా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేరు. రూ.50 లక్షలు ఇస్తాను తీసుకోండి.. అంతేగానీ సీఎం.. పీఎం.. అంటూ తిరిగితే ఆ డబ్బులు కూడా దొరకవు. మీ మాల, మాదిగ కులాల వారికి ఇలా రోడ్డు ఎక్కడం అలవాటే.. అంటూ చెప్పుకోలేని పరుష పదాలతో తీవ్రంగా దూషించారు. అనంతరం పోలీసులు మమ్మల్ని తీవ్రంగా కొట్టి, బెదిరించి మాతో బలవంతంగా వీడియో రికార్డింగ్ చేయించారు. వేమన సతీశ్కు మేము రూ.7 కోట్లు ఇవ్వలేదని మాతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. పోలీసుల నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది. మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. మమ్మల్ని కిడ్నాప్ చేసి వేధించిన డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
పార్టీ ఆఫీస్లకు చవకగా ప్రభుత్వ భూములు
సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను చవకగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలని, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ భూముల కేటాయింపు లీజును 66 ఏళ్లకు పెంచుతూ.. పార్టీ మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజును పొడిగించాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. తాజాగా జారీ చేసిన జీవో ఆధారంగా అధికారంలో ఉన్న పార్టీలు నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, తమ పార్టీ కార్యాలయాల కోసం 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు లీజుకు కేటాయింపులు చేయించుకోనున్నాయి. ఇదిలా ఉండగా మచిలీపట్నం నార్త్ మండలంలో గతంలో రవాణా శాఖకు కేటాయించిన 1.60 ఎకరాల భూమి కేటాయింపులను రద్దు చేసి, ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు కేటాయిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించారు. ఈ భూమిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే తిరుపతి రూరల్ మండలం అవిలాలలో టీడీపీ కార్యాలయం కోసం ఖరీదైన రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున కేటాయించారు. ఈ భూమిని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి అప్పగించాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
విద్యుత్ కాంట్రాక్టుల్లో చిన్న సంస్థలకు ‘షాక్’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖలో టెండర్లన్నీ కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకే దక్కుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోందనేది ఇన్నాళ్లూ ఎవరికీ అంతుచిక్క లేదు. కానీ తాజాగా దాని వెనుక ఉన్న కొన్ని వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. తామనుకున్న కంపెనీకి కాంట్రాక్టును దక్కించడం కోసం చంద్రబాబు సర్కార్ అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది. చట్టం ముందు దొరకకుండా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పక్కా ప్రణాళికతో అవినీతికి పాల్పడుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా బయటపడ్డ ‘నిబంధనల’ కుట్రలు. అధికారం చేతికి రాగానే మొదలుపెట్టిన ఆ అక్రమాల భాగోతం ఇది.రింగ్ కాంట్రాక్టర్ల హవావిద్యుత్ సంస్థలపై పడి దోచుకుతినడానికి చంద్రబాబు సర్కారులోని నేతలు సరికొత్త దారులు వెదుకుతున్నారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసం రసవత్తర డ్రామాలు ఆడుతున్నారు. వారికి తోడుగా విద్యుత్ సంస్థల్లో కొందరు కాంట్రాక్టర్లు రింగ్ (కూటమి) మాస్టర్లుగా ఏర్పడ్డారు. టెండర్ల విలువను పెంచేసి, ఎవరికి టెండర్ రావాలో వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేసి, అనుకున్న విధంగా టెండర్లు దక్కేలా చేసి ఆపైన వాటాలను దండుకుంటున్నారు. తమ మాట వినని వారి టెండర్లను తామే తప్పుబట్టినట్టు నటించి, తమ వాటా కోసం బేరాలు సాగిస్తున్నారు. ఈ రింగ్ కాంట్రాక్టర్లు తమ కూటమిలో లేని సంస్థలు టెండర్లలో పాల్గొంటే వారిని ఏదో విధంగా అనర్హులుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అందుకోసం పాలకుల వద్ద నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు. బాబు సర్కార్లో ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన వ్యవహారం. కొత్త బ్రహ్మాస్త్రం.. ‘మార్కులు’టెండర్లను బడా సంస్థలకు కట్టబెట్టేందుకు, చిన్న, మధ్య తరహా కంపెనీలను కనీసం టెండర్ దాఖలు వరకూ కూడా రానివ్వకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రభుత్వం అర్హత పేరుతో తాజాగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. దానిపేరే ‘మార్కులు’. విద్యుత్ శాఖలో ఏ టెండర్ వేయాలన్నా ఆ కంపెనీకి విద్యుత్ సంస్థలు విధించిన నిబంధన ప్రకారం 150కి గానూ 113 మార్కులు రావాలనేది ఇన్నాళ్లూ ఉన్న నిబంధన. దీనివల్ల ఏ కంపెనీ అయినా తమకున్న వనరులు, పరిధులను బట్టి టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాటిని 124కు పెంచేశారు. అంటే ఆ మేరకు నిబంధనలు అదనంగా జత చేశారు. దీనివల్ల చిన్న, మధ్య తరహా సంస్థలేవీ టెండర్లలో పాల్గొనలేవు. చెప్పేదొకటి.. చేసేది మరొకటినిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ వైర్లు, ఇతర విలువైన సామాగ్రి(మెటీరియల్) ఏది అవసరమైనా అందులో 50 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నుంచే తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి కాంట్రాక్టు దక్కకుండా చేస్తోంది.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని అడ్డగోలు టెండర్ల తీరు..బూడిద టెండర్లో గోల్మాల్నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తికి వాడే బొగ్గు నుంచి వచ్చే బూడిద టెండర్లలో కమిషన్ కోసం కూటమి ఎమ్మెల్యే పెద్ద కథే నడిపారు. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ రూ.270 కోట్ల అంచనా విలువతో ‘చెరువు బూడిద రవాణా’ ఈ–టెండర్ను పిలిచింది. ఇందులో ఎల్1, ఎల్2, ఎల్3గా వచ్చిన వారికి రూ.90 కోట్ల చొప్పున పనులు అప్పగిస్తుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు థర్మల్ ప్లాంట్కు చుట్టుప్రక్కల 300కి.మీ. పరిధిలో ఈ బూడిదను సరఫరా చేయాలి. అయితే కాంట్రాక్టర్ అర్హత ప్రమాణాలను అయిన వారి కోసం అనుకూలంగా మార్చేశారు. ఈ విషయం నెల్లూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేకు తెలిసింది. కొన్ని ఇంజినీరింగ్ సంస్థలు ఆ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాయి. దీంతో వెంటనే ఆయన జెన్కోకు లేఖ రాశారు. టెండర్పై వచ్చిన ఫిర్యాదులను ఆ లేఖలో పేర్కొంటూ, అధికారులను వివరణ కోరారు. చివరికి టెండర్ వేసిన కాంట్రాక్టర్తో బేరం కుదుర్చుకుని ఫిర్యాదు చేసిన వారినే తిరిగి బెదిరించారు.సబ్ స్టేషన్ టెండర్లో రింగ్ఏపీ ట్రాన్స్విుషన్ కార్పొరేషన్లో ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.60.21 కోట్లకు టెండర్ పిలిచింది. కానీ ఇక్కడ ఏకంగా రూ.6.68 కోట్లు పెంచేశారు. నిజానికి రూ.60.21 కోట్ల టెండర్లోనే ఆ సంస్థల లాభాలు కూడా ఉంటాయి. అదనంగా ఎందుకు పెరిగిందని ఆరాతీస్తే.. బాబు ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధితో మూడు సంస్థలు టెండర్ దక్కించుకోవడం కోసం ముందే బేరాలు కుదుర్చుకున్నాయని తెలిసింది. భవ్య కోసం... ‘టెండర్’ఏపీజెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఉన్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి కోసమంటూ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు టెండర్ అప్పగించారు. అయితే మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడవ సారి పిలిచిన టెండర్లలో అవేవీ లేవు. భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు ఇంతకన్నా తక్కువ కోట్చేశాయి. అయినా కాదన్నారు. మరో విశేషం ఏమిటంటే ఆర్టీపీపీలో వైద్య సేవల కోసం యశోదా హాస్పిటల్ నెలకు రూ.11.50 లక్షలు ఇస్తే చేస్తామంటే వద్దని, భవ్యకు రూ.15.57 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఒక్కో ప్రాజెక్టు వద్ద దాదాపు 3,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మూడేళ్ల టెండర్ కాలంలో దాదాపు రూ.100 కోట్లను భవ్యకు కట్టబెడుతున్నారు.సీఆర్డీఏ టెండర్లలో భారీ పెంపుసీఆర్డీఏ పరిధిలో నిర్మించే సబ్ స్టేషన్లు, లైన్ల మార్పులపై నాలుగు టెండర్లను పిలిచారు. వీటిలో 132 కేవీ, 220కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు పలు లైన్ల ఏర్పాటు పనులు ఉన్నాయి. వీటన్నిటి విలువ రూ.1,800 కోట్లు కాగా రూ.2,100 కోట్లకు టెండర్ల విలువ పెంచేశారు. బీఎస్ఆర్ ఇఫ్రా, యూనివర్శల్ కేబుల్కు అండర్ గ్రౌండ్ కేబుల్స్ టెండర్ రూ.990 కోట్లది రూ.1100 కోట్లకు ఇచ్చారు. 400కేవీ లైన్ మార్పు పనులు రూ.350 కోట్లది పీవీఆర్ కనస్ట్రక్షన్స్, కేఆర్కు రూ.390 కోట్లకు ఇచ్చారు. 220 కేవీ సబ్ స్టేషన్ జీవీపీఆర్కు రూ.215 కోట్లది రూ.237 కోట్లకు ఇచ్చారు. నేలపాడు 220 కేవీ సబ్ స్టేషన్ రూ.240 కోట్లది రూ.280 కోట్లకు ఇచ్చారు. కర్నూలు జిల్లా భావనాసి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, ఏలూరు జిల్లా కొప్పాక, విజయనగరం జిల్లా భోగాపురంలో 220 కేవీ సబ్స్టేషన్లు రూ.200 కోట్లు విలువ కాగా రూ.230 కోట్లకు టెండర్లు వేశారు.లింగయ్యపాలెం జీఐఎస్ టెండర్సీఆర్డీఏ పరిధిలోని లింగయ్యపాలెంలో 220/33 కేవీ గ్యాస్ ఇన్సూ్యలేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) నిర్మాణం చేపట్టాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది. దానికి రూ.267.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి ఓ కార్పొరేట్ సంస్థకు టెండర్ను అప్పగించింది. కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న 400కేవీ సబ్ స్టేషన్ల పనులను రెండు సంస్థలు జాయింట్ వెంచర్గా టెండర్ వేస్తే వాళ్లకు అప్పగించారు. కానీ లింగయపాలెం సబ్ స్టేషన్కు మాత్రం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని అనుసరించారు. చిత్రమేమిటంటే కాకినాడ ఎస్ఈజెడ్లో జేవీలుగా టెండర్ దక్కించుకున్న సంస్థలే ఇక్కడ విడివిడిగా టెండర్లు దాఖలు చేశాయి. అయితే, మంత్రి అండతో రింగ్ మాస్టర్లుగా మారిన కొందరు కాంట్రాక్టర్లు ఇతర సంస్థలను టెండర్లలో పాల్గొననివ్వలేదు. -
చంద్రబాబు సమర్పించు పెట్టుబడుల సినిమా.. ఉత్త ఒప్పందాలే
సాక్షి, అమరావతి: రెడీ.. యాక్షన్.. కెమెరా..! అంటూ విశాఖలో ప్రివ్యూ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తరహాలో.. క్రెడిట్ చోరీతో ప్రజలకు మరోమారు పెట్టుబడుల సినిమా చూపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! శుక్ర, శనివారాల్లో విశాఖ వేదికగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా చూపించనున్నారు. 2014– 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే తరహా సినిమాలను రాష్ట్ర ప్రజలకు చూపించారు. 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్లు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్స్ పేరిట విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ మూడు సమావేశాల్లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.19.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా 34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు.. ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చింది 45 మాత్రమే. అంటే 13 శాతమే కార్యరూపం దాల్చా యి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే వచ్చిన పలు కంపెనీలతో తాజాగా విశాఖ వేదికగా మళ్లీమళ్లీ ఒప్పందాలు చేసుకుంటూ అందుకోసం ఆర్నెల్లుగా సీఎం, పలువురు మంత్రులు విదేశీ పర్యటనలు చేసి రావడం గమనార్హం. ఎస్ఐబీపీలకూ దిక్కులేదు.. పార్టనర్షిప్ సమ్మిట్ ఒప్పందాలే కాదు.. ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సైతం 2014–19 మధ్య టీడీపీ హయాంలో దిక్కు లేకుండా పోయింది. ఎక్కడైనా ఎస్ఐపీబీ ఆమోదం లభించిందంటే ప్రాజెక్టులు పరుగులు పెట్టాల్సిందే. 2014–19 మధ్య చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 17 సార్లు ఎస్ఐపీబీ సమావేశాలు జరిగాయి. అందులో మొత్తం రూ.1,70,036 కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 2,04,183 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. అయితే నాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన వాటిలో 5.69 శాతం మాత్రమే అమల్లోకి వచ్చాయి. రూ.9,681 కోట్ల విలువైన ఒప్పందాలు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా ఉపాధి లభించింది 36,140 మందికి మాత్రమే. 2014 –19 కితకితలే కితకితలు..!చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైపర్ లూప్ దగ్గర నుంచి సుఖోయ్ యుద్ధవిమానాల వరకు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రపంచంలోనే అమల్లోకి రాని హైపర్లూప్ కాన్సెప్ట్తో అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకోవచ్చంటూ ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిపి రూ.14,000 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేశారు. సెమీ కండక్టర్స్ విభాగంలో ఎటువంటి అనుభవం లేని నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని ప్రచారం చేశారు. ఆ కంపెనీ ద్వారా 1,10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే హల్దియా రూ.62,714 కోట్లతో కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ నెలకొల్పుతోందంటూ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2023లో కుదుర్చుకున్న ఒప్పందాలలో 91 శాతం వాస్తవరూపం దాల్చినట్టుగా పరిశ్రమల శాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గుడియాన్ టెక్నాలజీస్ రూ.40,000 కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్, రూ.23,285 కోట్లతో సోలార్గైజ్ ఇండియా, రూ.22,500 కోట్లతో టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోందంటూ టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవికాకుండా హెచ్పీసీఎల్ గెయిల్ క్రాకర్ కాంప్లెక్స్ (రూ.40,000 కోట్లు), అనంత్ టెక్నాలజీస్ (రూ.4,500 కోట్లు), సిరీన్ డ్రగ్స్ (రూ.8,200 కోట్లు), రాయల విండ్ పవర్ (రూ.16,500 కోట్లు) తదితర సంస్థలు టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్న తర్వాత మొహం చాటేశాయి. 2018లో ఒప్పందం చేసుకున్న వాటిలో ఎస్బీ ఎనర్జీ (రూ.13,200 కోట్లు), మైత్ర మొబైల్ (రూ.7,000 కోట్లు), కోనసీమ ఫెర్టిలైజర్స్ (రూ.5,000 కోట్లు), బద్వే ఇంజనీరింగ్ (రూ.4,200 కోట్లు) లాంటి సంస్థలు అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. స్విట్జర్లాండ్కు చెందిన ఏరోస్పేస్ వెంచర్స్ రూ.9,600 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా భూమి కేటాయించినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఎన్టీపీసీ ఒప్పందం అప్పటిదే.. పాతవాటికి కొత్తవిగా కలరింగ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను తమ ఖాతాల్లో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా విస్తరణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2023 మార్చి4న నాటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జీఐఎస్ సదస్సులో ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరిన రూ.1.85 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ (అనకాపల్లి వద్ద)ను ఇప్పుడు చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే రూ.69,000 కోట్లతో ఇండోసోల్ ప్రాజెక్టు, తిరుపతిలో రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్, రూ.3,700 కోట్లతో రెన్యూ ఎనర్జీ, రూ.4,500 కోట్లతో సత్యసాయి జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు చేసుకోగా, ఇప్పుడు బాబు సర్కారు వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే వచ్చిన ఎన్టీపీసీ, రెన్యూ పవర్, సెంచురీయన్, ఏటీసీ టైర్స్, రిలయన్స్ ప్రాజెక్టులతో తాజాగా విశాఖ సదస్సులో తిరిగి కొత్త ఒప్పందాలకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.జగన్ హయాంలో 91 శాతానికి పైనే..వైఎస్సార్సీపీ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి 99 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ.6,60,068.72 కోట్ల విలువైన పెట్టుబడులతోపాటు 7,56,455 మందికి ఉపాధి లభించనుంది. ఆ ఒప్పందాలు జరిగిన రెండేళ్లలోపే 90కిపైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా.. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించాయి. మొత్తం పెట్టుబడుల్లో 91.06 శాతం అంటే రూ.6,01,071.72 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా తెలియచేసింది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10,000 కోట్లు) ఐవోసీ (రూ,4,300), ఇండోసోల్ (రూ.69,000 కోట్లు), జిందాల్ స్టీల్ ఆంధ్రా (రూ.7,500 కోట్లు), జేఎస్డబ్ల్యూ స్టీల్ (రూ.16,350), ఎన్టీపీసీ (రూ.1,85,000 కోట్లు), ఆ్రల్టాటెక్ సిమెంట్ (రూ.4,000 కోట్లు), ఉత్కర్ష (రూ.4,500 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.5,500 కోట్లు), అలయన్స్ టైర్స్ విస్తరణ (రూ.1,100 కోట్లు), బ్లూస్టార్ (రూ.550 కోట్లు), కలర్షైన్ ఇండియా (రూ.510 కోట్లు), దాల్మియా సిమెంట్స్ (రూ.650 కోట్లు), దివీస్ ల్యాబ్ (రూ.790 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ (రూ.1,113 కోట్లు), ఇగులా స్టెర్లెస్ (రూ.600 కోట్లు), గ్రీన్లామ్సౌత్ (రూ.825 కోట్లు), జేఎస్డబ్ల్యూ సిమెంట్ (రూ.550 కోట్లు), కింబెర్లీ క్లార్క్ ఇండియా (రూ.700 కోట్లు), లైఫస్ ఫార్మా (రూ.2,319 కోట్లు), లారస్ (రూ.1200 కోట్లు), ఎల్జీ పాలిమర్స్ (రూ.240 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.2,500 కోట్లు), టీసీఎల్ (రూ.500 కోట్లు) లాంటి పలు ప్రధాన కంపెనీలున్నాయి. -
29 మంది గిరిజన విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం దుంపల కూర, పెరుగు తిన్న 29 మంది గిరిజన విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి గురువారం ఉదయాన్నే నిద్రలేచిన కొద్దిసేపటి తరువాత ఒక్కసారిగా కడుపునొప్పి మొదలైంది. దీంతో.. పాఠశాలకు ఎదురుగా ఉన్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్ననికి 26 మంది కోలుకోవడంతో వారు పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, అరుణ్కుమార్ (10వ తరగతి), శామ్యూల్ (5వ తరగతి), కె. రవి (3వ తరగతి)కి బీపీ అధికంగా ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఈ ముగ్గుర్నీ చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ పాఠశాలలో మొత్తం 240 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. కలుషిత పెరుగే కారణమా!?..ఈ ఆశ్రమ పాఠశాలకు పెరుగు సరఫరా లేకపోవడంతో నిర్వాహకులు పాలను తోడుపెడుతున్నారు. కానీ, పాలు తోడుకోలేదని బుధవారం మధ్యాహ్నం ఎండలో పెట్టడంతో పెరుగు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఉదయాన్నే జర్రెల ఆశ్రమ పాఠశాల, ఆస్పత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించి ఘటనపై విచారణ జరిపారు. పెరుగు కలుషితంపై వివరాలు సేకరించారు. అలాగే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ నేత చిలకల రవికుమార్, ఏబీవీపీ నేత తిరుపల్లి యోగిలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంవల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తతదళిత విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళనకు దిగిన 3 వేల మంది విద్యార్థులు తమ కుమారుణ్ని అన్యాయంగా చంపేశారంటూ తల్లిదండ్రుల ఆవేదన8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన డైరెక్టర్ శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బుధవారం దళిత విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గుంటూరుకు చెందిన సృజన్కు మద్దతుగా కళాశాలలోని 3 వేల మంది విద్యార్థులు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. యాజమాన్యం తీరుపై నిరసన గళం వినిపించారు. సృజన్ ఆత్మహత్య చేసుకునేలా సీనియర్లు ప్రవర్తించారని, బుధవారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, సరిగా చదవడని ఒత్తిడితోనే చనిపోయాడంటూ యాజమాన్యం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బిడ్డను అన్యాయంగా నాలుగు గంటలపాటు కొట్టి చంపేశారని, అనంతరం ఫ్యాన్కు వేలాడదీశారని, సమాచారం కూడా ఆలస్యంగా ఇచ్చారని సృజన్ తల్లిదండ్రులు వాపోయారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు సైతం కళాశాల డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, రిజిస్ట్రార్ అమరేంద్రలతో వాగ్వాదానికి దిగారు. చివరికి శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది విద్యార్థుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం క్యాంపస్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు 8 మందిని సస్పెండ్ చేశారు.భోజనం సరిగా పెట్టడం లేదువారానికి ఆరు సార్లకు బదులుగా రెండు సార్లే గుడ్లు ఇస్తున్నారు ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలికి విద్యార్థుల ఫిర్యాదు మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులో ఉన్న ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారాన్ని మెనూ ప్రకారం అందించడం లేదని ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి ఎదుట విద్యారి్థనులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె హాస్టల్ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వారానికి ఆరు సార్లు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. సాయంత్రం పండ్లు ఇవ్వడం లేదని, 301 మంది విద్యార్థినులు ఉండగా, రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తున్నారని, తాగునీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది పిల్లలతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదని, మళ్లీ అన్నం కోసం వెళితే తిడుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. అలాగే వంట సిబ్బందిని కూడా తొలగించాలన్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని, కమిషన్ తరఫున కూడా సుమోటోగా తీసుకుంటామని తెలిపారు. -
క్రెడిట్ చోరీతో చిక్కిన చినబాబు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తరలి వచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషిని 2023లో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు సాక్షిగా రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే తాము ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నాడు లింక్డిన్లోనూ స్వయంగా వెల్లడించారు. వాస్తవం ఇలా ఉంటే.. రెన్యూ పవర్ని తామే రప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ పేరు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వ పెద్దలు.. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, వైఎస్ జగన్ కట్టించిన ఇళ్లలోకి మళ్లీ కొత్తగా గృహ ప్రవేశాలు చేయించి, తామే కట్టించినట్లు డ్రామాలాడారు. ఇప్పుడు విశాఖలో సీఐఐ సమ్మిట్ వేదికగా మరో క్రెడిట్ చోరీకి శ్రీకారం చుట్టారు. క్రెడిట్ చోరీలో తండ్రితో పోటీ పడుతున్న నారా లోకేశ్ రెన్యూ పవర్ విషయంలో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయారు. తరిమేసింది బాబు సర్కారే..! విచిత్రంగా అదే రెన్యూ పవర్ సంస్థతో తాజాగా విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే చంద్రబాబు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి రెన్యూ పవర్ను తరిమేసింది చంద్రబాబు ప్రభుత్వమే. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కర్నూలు జిల్లాకు తరలిస్తూ ఈ ఏడాది జూలై 28న బాబు సర్కార్ జీఓ నెం.56 జారీ చేసింది. ఈ నిజాలను వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు.. లోకేశ్ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ మీమ్స్తో దుమ్మెత్తిపోస్తున్నారు. రెన్యూ పవర్ను తెచ్చిందే వైఎస్ జగన్.. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ పవర్తో పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 2023 జూన్ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్థాపించేందుకు రెన్యూ పవర్కు అనుమతిస్తూ జీవో నెం.15ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 2024 ఫిబ్రవరి 5న అదే సంస్థను మరో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నెం.16ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఆ రెండు జిల్లాల్లో కేటాయించేందుకు కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నాడే అంగీకారం తెలిపింది. ఈ జీఓలపై నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ సంతకాలు చేశారు. దీన్నిబట్టి రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూ కేటాయింపులతో సహా 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయనేది సుస్పష్టం. -
క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో.. అప్పట్లోనే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లను పట్టుకుని ‘ఈ ఇళ్లన్నీ మేమే కట్టేశాం’ అంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని.. నాటకాల రాయుడు అని అంటారని చురకలు వేశారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో.. ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ట్యాగ్తో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘‘క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం.. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ‘‘ఇళ్లన్నీ మేమే కట్టేశాం’’ అంటున్నారు. కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలను బల్లగుద్ది మరీ చెబుతూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు.» మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. » ఇవికాక 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి, కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. » అయినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ను కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు గారూ! మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం.మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. -
ఇచ్చట పాత ఒప్పందాలు మళ్లీ కుదుర్చుకోబడును!
సాక్షి, అమరావతి: అన్నీ పాత ఒప్పందాలే..! అందులోనూ గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు..! పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే గతంలో కుదిరిన ఒప్పందాలనే మళ్లీ మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు సర్కారు సరికొత్త గారడీకి శ్రీకారం చుట్టింది. విశాఖలో శుక్ర, శనివారాల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండగా.. ఒక రోజు ముందే గురువారమే పాత ఒప్పందాలే మరోసారి చేసుకుని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా పోస్టు వైఎస్సార్ సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కారు ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న హడావుడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ఒక రోజు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడూ పాత ఒప్పందాలే.. గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో కోతలు⇒ 2023లో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో రూ.2.35 లక్షల కోట్ల ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్తో రూ.1,20,000 కోట్ల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్నకు చెందిన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ రూ.1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తాజాగా గురువారం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (నెడ్క్యాప్)తో ఒప్పందం కుదుర్చుకుంది.⇒ ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ.97,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని రూ.82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎంవోయూల మాయ సాక్షి, విశాఖపట్నం: టీడీపీ హయాంలో 3సార్లు విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు ఆ తరువాత పత్తా లేకుండాపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హీరో ఫ్యూచర్స్తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం(ఫైల్) ⇒ రూ.234 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా వజ్ర రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం. ⇒ రూ.300 కోట్లతో ఎకో రిసార్ట్ అండ్ వుడ్ కాటేజీ నిర్మాణానికి వాటర్ స్పోర్ట్స్ సింపిల్ సంస్థతో ఎంవోయూ ⇒ రూ.153 కోట్ల పెట్టుబడులు పెట్టేలా స్కైవాల్ట్ ్జ మెరీనా సంస్థతో ఒప్పందం ⇒ రూ.100 కోట్లతో ఎంఐసీఈ సెంటర్ ఏర్పాటుకు వైబ్ గ్రూప్స్తో ఎంవోయూ ⇒ రూ.2 వేల కోట్లతో గోల్డ్ఫిష్ అబాడ్ సంస్థతో గోల్ఫ్ కోర్స్ నిర్మాణ ఒప్పందం. ⇒ రూ.7 వేల కోట్లతో మైత్రా మొబిలిటీ సంస్థ ఎల్రక్టానిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందం. ⇒ రూ.550 కోట్లతో మాగ్నమ్ పైరెక్స్ సంస్థతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఒప్పందం.హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్తో తాజాగా మళ్లీ విశాఖపట్నంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు ⇒ వైఎస్సార్సీపీ హయాంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. -
ప్రజల కోసం మాట్లాడడమే నేరమా? : మాజీ మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం: నకిలీ మద్యం వ్యాపారాలపై ప్రజా ప్రయోజనాల కోసం నిరసన ర్యాలీ నిర్వహించినందుకు తనపై కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ప్రజల కోసం మేము ర్యాలీ చేశాం. కానీ ఆ ర్యాలీని పోలీసు విధులకు ఆటంకం కలిగించామంటూ మాపై కేసు పెట్టడం విచారకరం అని అప్పలరాజు అన్నారు.గత 16 నెలల్లో తనపై 10 కేసులు నమోదు చేశారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న చర్య. విద్యుత్ చార్జీలు పెంచారని ప్రజల తరపున నేను నిరసన చేపట్టాను. దానిపైనా మరో కేసు పెట్టారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు.తాను వైద్య వృత్తి నుంచి వచ్చి నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నానని, కానీ కూటమి ప్రభుత్వం తనలాంటి వారిపై తప్పుడు కేసులు మోపుతోందని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కేసులు పెట్టలేదు. ప్రజల సమస్యలపై మేము గళం విప్పితే దాన్ని అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోంది అని అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు.ప్రజా సమస్యలపై పోరాడినందుకు శిక్షించాలన్న తీరుతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన పేర్కొన్నారు. “ప్రజల కోసం మాట్లాడడమే నేరమా?” అని అప్పలరాజు ప్రశ్నించారు. -
పొలిటికల్ స్క్రీన్పై పవన్ సర్కస్ ఫీట్లు.!
సినిమా స్లో అయినపుడు.. కాస్త సాగదీస్తున్నట్లు.. ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నట్లు ఉండగానే రిలీఫ్ కోసం.. మళ్ళీ జోష్ పెంచడానికి ఒక ఐటం సాంగ్ వస్తుంది.. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కోశాంతి, సిల్క్ స్మిత వంటివాళ్ళు ఆ స్తబ్దతను.. నిరాసక్తతను పోగొట్టి.. మళ్ళీ జనాలను ఉత్తేజితులను చేసేవాళ్ళు. అచ్చం అదే పాత్ర నేడు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. రాజకీయంగా తన ఇమేజి డౌన్ అవుతున్నదని అనిపించినపుడు.. తనను అటు లోకేష్, చంద్రబాబు సైడ్ ట్రాక్ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్నారనిపించినపుడు.. గతంలో తాను చేసిన ఆరోపణలు.. కామెంట్లు.. అబద్ధపు హామీలు సోషల్మీడియాలో మళ్ళీ ప్రత్యక్షమై తనను వెక్కిరిస్తున్నపుడు ప్రజలకు సమాధానం చెప్పడానికా అన్నట్లుగా మళ్ళీ జుయ్ అంటూ పొలిటికల్ స్క్రీన్ మీదకు.. మీడియాలోకి వస్తూంటాలు.. ఏదోటి మాట్లాడి తన క్యాడర్లో జోష్ నింపే సర్కస్ ఫీట్లు చేసి మళ్ళీ కొన్నాళ్ళు సినిమా షూటింగులకు వెళ్ళిపోతారు.మొన్న ప్రత్యేక విమానం.. ప్రత్యేక హెలీకాఫ్టర్లో చిత్తూరు అడవులకు వెళ్లి కాసేపు ఎర్ర చందనం పరిశీలనపేరిట హడావుడి చేసి వచ్చారు. ... తరచూ ప్రత్యేకవిమానాల్లో షికార్లు చేస్తున్నారు .. ప్రభుత్వ సొమ్మును విలాసాలకు తగలేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ హోరెత్తింది. దీంతో ఇక వాటికి సమాధానం చెప్పుకోలేక సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు పవన్. హెలీకాఫ్టర్లో అలా షికార్లు చేస్తూ స్టయిల్ గా వీడియోలు తీశారు.. అందులో భాగంగా చిత్తూరుజిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి 76. 74 ఎకరాల భూములు కబ్జా చేసారంటూ వీడియో విడుదల చేశారు. దాంతోబాటు వాటికి స్వాధీనం చేసుకుంటామని కూడా ప్రకటన చేసారు. వాస్తవానికి గతంలో గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో కూడా ఇలాగే ప్రభుత్వం భూమి కలిసి ఉందంటూ ఫోటోలు తీసిన పవన్ దాన్ని నిగ్గుతేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తీరా చూస్తే అవన్నీ రైతుల వద్ద అప్పుడెప్పుడో కొనుక్కున్న జిరాయితీ భూములు అని తేలడంతో పవన్ కళ్ళు తేలేసారు.దమ్ముంటే నిరూపించి తీసుకోండి పవన్ : మిథున్ రెడ్డి ఛాలెంజ్ఇప్పుడు కూడా పవన్ వీడియోలు చూసి ఎంపీ మిథున్ రెడ్డి ట్విట్టర్లో ఛాలెంజ్ చేసారు.. అవి మీ చంద్రబాబు అధికారంలో ఇరవయ్యేళ్ళ క్రితం కొన్న భూములు. అప్పుడు మేము అధికారంలో లేము.. మీకు దమ్ముంటే రికార్డులతో సహా మేము చేస్తున్న సవాల్ స్వీకరించండి .. లేదా ఊరుకోండి అన్నట్లుగా సవాల్ చేసారు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పారిపోవడం మీకు అలవాటు.. ఇప్పుడు కూడా అలాగే ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించండి.. అవి మేము రైతులవద్ద కొన్న భూములు.. ఇవిగో రికార్డ్స్.. పత్రాలు.. చేతనైతే అవి అటవీ భూములు అని నిరూపించండి అని సవాల్ చేసారు. అయితే పవన్ ఎప్పుడు కూడా నోటికొచ్చిన ప్రకటనలు చేయడం.. తరువాత రెండు మూడు నెలలు రాజకీయ కార్యక్రలాపాల నుంచి దూరంగా ఉండడం.. మళ్ళా టైంపాస్ కోసం రావడం పరిపాటి. దీంతో ఇప్పుడు పవన్ చేసిన ప్రకటనమీద సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీదే.. దమ్ముంటే విచారణ చేసి భూములు స్వాధీనం చేసుకోవాలిగానీ చేతగాని బిల్డప్ ఎందుకు పవన్ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న -
ఢిల్లీ పేలుడు..చిన్న పోస్టర్తో.. జైషే కుట్రపై గర్జించిన తెలుగు సింహం!
న్యూఢిల్లీ: భారత్లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.పోస్టర్తో బండారం బట్టబయలు 2019 వరకు కాశ్మీర్లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.సందీప్ చక్రవర్తి ప్రస్థానం కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలుసందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. -
పవన్ కళ్యాణ్కి షాకిచ్చిన పీసీసీఎఫ్ చలపతిరావు
విజయవాడ: 76.74 ఎకరాల మంగళంపేట భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీఎఫ్(Principal Chief Conservator of Forests) చలపతిరావు స్పందించారు. పవన్ ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రకటన చేశారు. అక్కడ 77 ఎకరాలు ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని ఆయన వెల్లడించారు. 76.74 ఎకరాల భూమి తమదే అని ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించారు. కాగా, 76.74 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దీనిపై ఎంపీ మిథున్రెడ్డి రికార్డులను సైతం వెల్లడించారు. ఎంపీ మిథున్రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించడంతో పవన్ కళ్యాణ్ చేసినవి ఆరోపణలేని తేటతెల్లమైంది. పెద్దిరెడ్డి భూముల ఫెన్సింగ్ బయట ఉండటంతో వాటిని ఆయన కుటుంబానికి ఆపాదించి తప్పుడు ప్రచారం చేశారు. అయితే అటవీ భూమి పక్కన పెద్దిరెడ్డి భూములు ఉన్నాయని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు పెట్టామన్నారాయన.ఇప్పటికే ఈ భూములపై సర్వే చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించలేదని చంద్రబాబు ప్రభుత్వం సైతం నిర్దారించింది. గతంలో కిరణ్కుమార్రెడ్డి హయాంలో కూడా ఈ భూములపై విచారణ జరిపారు. అప్పుడు కూడా ఆక్రమించలేదని విచారణలో నిర్ధారణయ్యింది. అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షకట్టి నోటీసులు జారీ చేశారు. నోటీసులపై పెద్దిరెడ్డి కుటుంబం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న భూములపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దానికి ఎంపీ మిథున్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజంగానే కబ్జా చేస్తే ఇన్నాళ్లూ చర్యలు తీసుకుంటారా? అని మిథున్రెడ్డి ప్రశ్నించారు. దీనికి పవన్ నుంచి సమాధానం రాలేదు. మరొకవైపు అక్కడ 77 ఎకరాలు ఎన్ క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని పీసీసీఎఫ్ వెల్లడించడంతో పవన్ హెలికాఫ్టర్ ఎపిసోడ్ బెడిసికొట్టినట్లయ్యింది.పవన్పై వైఎస్సార్సీపీ సీరియస్ -
ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పిన కృష్ణానది పెను పడవ ప్రమాదం
సాక్షి,కృష్ణా: కృష్ణానదిలో మరోసారి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల పడవ మార్గ మధ్యలో సాంకేతిక లోపం కారణంగా నదిలో ఆగిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ప్రయాణం మధ్యలో పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దీంతో పడవ నది ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పడవలో ఉన్న సిబ్బంది వెంటనే లంగర్ వేసి పడవను నిలిపే ప్రయత్నం చేశారు.గింజపల్లి ఒడ్డున ఉన్న స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై పడవను తాడులతో ఒడ్డుకు లాగారు. వారి సహకారంతో పడవను సురక్షితంగా తీరం చేరవేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. ప్రమాద సమయంలో పడవలో ఉన్న 30 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొందరికి స్వల్ప అస్వస్థతలు తప్ప, ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
సీదిరి అప్పలరాజుపై కక్ష సాధింపు
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏడేళ్ల క్రితం నమోదు చేసిన కేసులో కొన్ని రోజుల క్రితం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు సీదిరి అప్పలరాజు హాజరైన సంగతి తెలిసిందే. అయితే మరొకసారి సీదిరి అప్పలరాజును విచారణకు రమ్మనడంతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య బహిర్గతమైందినాలుగురోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరైన అప్పలరాజును.. మరో కేసులో మళ్లీ విచారణకు రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు. దాంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు సీదిరి అప్పలరాజు. శనివారం సుమారు ఏడుగంటల పాటు అప్పలరాజును పోలీసులు విచారించారు. మళ్లీ అప్పలరాజు విచారణకు హాజరు కావడంతో పీఎస్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. -
ఆ సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు
విజయవాడ: కృష్ణ జిల్లా పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్పై పెట్టిన కేసులో పోలీసులకు చుక్కెదురైంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కైలే అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ తరుఫు మనోహర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మాజీ ఎమ్మెల్యే కైలేపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు.అనంతరం కైలే అనిల్పై నమోదైన సెక్షన్లను హైకోర్టు పరిశీలించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల చెల్లవని స్పష్టం చేసింది. మనోహర్ రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు..2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చెయ్యాలని పోలీసులుకి ఆదేశాలు జారీ చేసింది. -
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు. -
పవన్ కళ్యాణ్పై YSRCP సీరియస్
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించింది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన వపన్ కళ్యాణ్పై మండిపడింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది.‘‘డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా?..సర్వే సెటిల్ మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్కళ్యాణ్ కాదనగలరా?. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు...ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్కళ్యాణ్ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్రెడ్డి సవాల్ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుపాను నష్టపరిహారం అందించలేక ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ దుయ్యబట్టింది. 🚨 Dare to answer these questions, @PawanKalyan ?డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ… https://t.co/vyPJQ0kSWp— YSR Congress Party (@YSRCParty) November 13, 2025 -
పవన్ కళ్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై స్పందించిన మిథున్.. ఆ ఆరోపణలను నిరూపించాలని పవన్కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్ గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Mr @PawanKalyan you are good at shooting and scooting. You have done that in the past (remember red sanders remarks made by you) and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land, we bought it in 2000.— Mithunreddy (@MithunReddyYSRC) November 13, 2025 -
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారువై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. -
అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సిఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది.అంబటి రాంబాబుపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం(నవంబర్ 12) భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయతి్నంచిన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, అంబటికి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. పోలీసుల అవరోధాలను అధిగమించిన నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ ప్రోద్భలంతో సీఐ తనను టార్గెట్ చేశారని రాంబాబు మండిపడ్డారు. -
మంత్రిగారూ.. న్యాయం చేయండి
శ్రీకాకుళం జిల్లా: ‘అచ్చెన్నాయుడు గారూ... మాకు న్యాయం చేయండి. నా భర్త కట్టిన ఇంటిని ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీనికి అధికారులు, మీ నేతలే సహకరిస్తున్నారు’ అంటూ బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఓ మహిళ తన కుమార్తె, తల్లితో నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే... టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేబారికి సంధ్య కొద్దిరోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయింది. తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు సంధ్య వాపోయారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదని, కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కలగజేసుకుని తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే కుమార్తె సహా ఆత్మహత్యే శరణ్యమంటూ బోరున విలపించారు. -
ఢిల్లీ ఎఫెక్ట్.. ఏపీలో నాలుగు జిల్లాలో NIA తనిఖీలు
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు నేపథ్యంలో ఏపీలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఏపీలోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయనగరంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారుల సోదాలు జరుపుతున్నారు. అలాగే, గుంటూరులోని పొన్నూరులో, కర్నూలులోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానంగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఎంత పని చేశావమ్మా!
అనకాపల్లి జిల్లా: ఆరు నెలల బిడ్డను చంపి, ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్ సమీపంలో కనకమహాలక్ష్మినగర్లోని తమ నివాస గృహంలో పోరెడ్డి వీణ (30), ఆమె 6 నెలల బాబు బుధవారం సాయంత్రం విగత జీవులై కనిపించారు. వీణ మెడకు చీర ఉరి వేసుకున్నట్టుగా ఉండగా.. ఆమె పక్కనే కన్నకొడుకు మృతదేహం ఉంది. మృతురాలు వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన వీణ, అదే జిల్లా వీఎం వలస మండలం కౌడుతండ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ప్రేమించుకొని, పెద్దల సమక్షంలో గత ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు వియాన్స్ ఉన్నాడు. వీరు చోడవరం కనకమహాలక్ష్మినగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోలీసులకు భర్త చెప్పిన వివరాల ప్రకారం.. రోజూలాగే ఉమామహేశ్వరరావు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పాఠశాల ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూసేసరికి గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని వీణ మృతి చెంది ఉండగా.. మంచం పక్కనే బాబు విగత జీవిగా పడి ఉన్నాడు. బాబును తలగడతో నొక్కి చంపేసి తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు సంఘటన స్థలంలో లభించిన వివరాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య కలహాల కారణంగానే వీణ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు చెప్పారు. భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక మిగతా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. భర్త ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్తో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు’’ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025..మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం..చంద్రబాబూ.. మేము 31.9 ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం!. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. -
చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు!
సంపద సృష్టించి మరీ ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళతానని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. కానీ గత ఏడాది జనసేన, బీజేపీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన గారి సంపద సృష్టి అసలు రహస్యం ప్రజలకు అర్థం కాలేదు. అప్పులు, రెవెన్యూ లోటుల్లో మాత్రం ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసేశారు. ఒకప్పటి బీమారు రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రుణాల విషయంలో బాగా మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలోని అంశాలు.ఏపీలో చంద్రబాబు అండ్ కో.. పాలన, అభివృద్ధి వంటి విషయాలపై కాకుండా.. ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై కేసులో పెట్టడంలోనే బిజీ అయిపోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్పై కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమోనని ఓ సీనియర్ పాత్రికేయుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వాన్నంగానే ఉందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఆహో, ఓహో అంటూ డబ్బా కొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు కాస్త భిన్నమైన కథనం రాయడం ద్వారా ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తీసుకువచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో కలిసి ఎల్లో మీడియా నానా రచ్చ చేసేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని, అదంతా జగన్ ప్రభుత్వమే చేసిందేమో అన్న అనుమానం కలిగేలా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లేనని తేలింది. జగన్ టైమ్లో అప్పులు అంటూ గోలగోలగా చెప్పిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్షన్నర కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. అది అసాధ్యమని జగన్ అంటే, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్దాలు చెప్పారు. ఎల్లో మీడియా తాన తందానా అని పాట పాడేవి. ఇప్పుడేమో ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోటెత్తిన లోటు అని కథనాలు ఇస్తున్నారు. మరి అప్పుడు అన్ని చేసేస్తామని చెప్పారు కదా.. ఇప్పుడేమిటి ఇలా చేతులెత్తేస్తున్నారని వారు ప్రశ్నించరు. ఎవరైనా అడిగితే వారిపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా అన్నదానిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటోంది.తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్ధిక నిర్వహణ చేసినట్లు వెల్లడవుతుంది. కూటమి ప్రభుత్వం 2025-26లో రెవెన్యూ లోటు రూ.33185 కోట్లు అంచనా వేస్తే ఆరు నెలలకే రూ.46652 కోట్లకు చేరిందని కాగ్ వెల్లడించింది. ఇది అధికారుల అంచనా తప్పా? లేక లక్ష్య సాధనలో వైఫల్యమా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ పని ఎటూ చేయరనుకోండి. దాదాపు రూ.2.17 లక్షల కోట్ల రెవెన్యూను అంచనా వేస్తే రూ.74234 కోట్లు మాత్రమే వచ్చాయి. ఖర్చు మాత్రం రూ.120887 కోట్లుగా లెక్కగట్టారు. బడ్జెట్ రూపొందించిన సమయంలో అంచనా వేసిన ఆదాయంలో కేవలం 34 శాతం మాత్రమే ఇప్పటికి వచ్చిందట. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32284 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని భావిస్తే, ఈ ఆరు నెలల్లో రూ.4014 కోట్లే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది మొత్తానికి తీసుకోవాలని తలపెట్టిన రూ.79926 కోట్ల రుణంలో ఆరు నెలల్లోనే 78 శాతం పైగా, అంటే రూ.63వేల కోట్ల రుణాన్ని తీసేసుకుంది. ఇది దేశంలోనే అత్యధికం.2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు కేవలం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయారు. అదే 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉన్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. ఒకప్పుడు ఆర్థిక నిర్వహణలో ఉత్తరప్రదేశ్ అట్టడగున ఉండేది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహారులు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. అప్పులు, ఆర్ధిక నిర్వహణలో యూపీ బాగా పనిచేస్తున్నట్లు అనుకోవాలి.ఉత్తరప్రదేశ్ ఈ ఆరు నెలల్లో కేవలం రూ.9332 కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ (రూ.49100 కోట్లు), తెలంగాణ(రూ.45139 కోట్లు) అధిక అప్పులు చేసిన రాష్ట్రాలలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం రెండేళ్లపాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుణాలు తీసుకోండని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా, అదేదో జగన్ తప్పు పనిచేసినట్లు ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పని చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు పదివేల కోట్లు కాని, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల ఆర్ధిక సాయం కాని జగన్ సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్ అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కాని ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇతర రాష్ట్రాలలో వృద్ధిరేటు కనిపిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా ఉంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా రాసిన కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం పథకంతో జీఎస్టీ జోష్, ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్దికాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత జీఎస్టీ తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అంటూ కూడా ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని రాస్తోంది. సేవింగ్స్కు సూపర్ మస్కా, రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని రాస్తోంది. మొదటేమో అద్భుతమని ప్రచారం చేయడం, ఒక్కో కుటుంబానికి రూ.25 వేల రూపాయల నుంచి నలభై వేలు సేవ్ అవుతున్నాయని ప్రభుత్వానికి డబ్బా కొట్టడం, ఇప్పుడేమో సేవింగ్స్ కనిపించడం లేదని చెప్పడం.. ఇలా ఉంది ఎల్లో మీడియా తీరు.ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.249350 కోట్ల మేర అప్పులు చేసిందని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో ఐదేళ్లలో రూ.332670 కోట్లు అప్పుచేస్తే శ్రీలంక అయిపోయిందని విష ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలు చేసిన వాగ్దానాలలో అనేకం అమలు చేయకుండానే దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, వచ్చే సంవత్సరాలలో ఇంకెంత అప్పు చేస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక, ఇప్పటికి జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమోకాని, ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిత్తూరు: ఏనుగుల దాడి.. రైతు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. కుప్పం నియోజకవర్గంలో రైతులకు రక్షణ కరువైంది. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఘటన జరిగింది. మృతుడు రైతు కిట్టప్పగా గుర్తించారు. రాగి పంటకు కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు దాడి చేయడంతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు దాడి నుంచి రైతులు ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.కాగా, బంగారుపాళెం మండలంలోని అటవీ సరిహద్దు గ్రామమైన టేకుమందలో సోమవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడిచేశాయి. పంటలను ధ్వంసం చేశాయి. మొగిలి దేవరకొండ సమీపంలోని కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు టేకుమంద గ్రామం మామిడి మానుకుంట మీదుగా రైతుల పొలాలపైకి వచ్చాయి.గ్రామానికి చెందిన పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మకు చెందిన సుమారు 4 ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అదేవిధంగా అరటి చెట్లను విరిచి నేలపాలు చేశాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
అలర్ట్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది.అల్లూరి జిల్లాలోని అరకులోయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు 8 డిగ్రీలు, లంబసింగిలో 10, చింతపల్లిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. వీటి ప్రభావంతో కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లో 6.8 డిగ్రీలు, సిర్పూర్లో 7.1 డిగ్రీలు, తిర్యానీలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్సీయూ ప్రాంతంలో 11.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 11.5, రాజేంద్రనగర్లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.COLD WAVE INTENSIFIED ACROSS TG ⛄️SINGLE DIGIT TEMPERATURES(ASIFABAD)— Lingapur : 6.8°C— Sirpur (U) : 7.1°C— Ginnedari : 8.2°C— Kerameri : 9.3°C— Tiryani : 9.5°C(ADILABAD)— Neradigonda : 9.5°C— Sonala : 9.8°C— Bazarhathnoor : 9.9°C— Pochara : 9.9°C(SIRCILLA)—… pic.twitter.com/1U4ZMHAkLE— Weatherman Karthikk (@telangana_rains) November 13, 2025ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.STRONG COLDWAVE GRIPS TELANGANA Sirpur in KB Asifabad recorded 7.1°C this morning, followed by Tiryani 8.2°C 🥶Meanwhile in Hyderabad City, HCU Serlingampally recorded 11.8°C, Rajendranagar 12.9°C, Maredpally 13.6°CMeanwhile outskirts of Hyderabad City like Ibrahimpatnam…— Telangana Weatherman (@balaji25_t) November 13, 2025 -
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ కె.రహేజా రియల్ ఎస్టేట్ గ్రూపునకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్–3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సింటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు రూ.91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది.అనకాపల్లి వద్ద రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజస్ ప్లాంట్ కోసం ఎకరం రూ.40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది. రూ.744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్కు రూ.330.52 కోట్ల టైలర్ మేడ్ రాయితీలను ప్రకటించింది. అనంతపురంలో రూ.1,274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రత్యేక రాయితీలు, రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్ కాంపోనెంట్కు 19.06 ఎకరాలు, కుప్పంలో ఎన్పీఎస్పీఎల్కు 130 ఎకరాలు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్ల పెట్టుబడులు, క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లు, మదర్సన్ టెక్నాలజీకి రూ.109.73 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్, ఉప్పాడలో కాకినాడ వద్ద రూ.44,000 కోట్లతో 1 మిలియన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తూ పలు ఉత్వరులు విడుదలయ్యాయి. -
రా...రమ్మని
చుట్టూ ఎత్తైన కొండలు... ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే భారీ వృక్షాలు...పరమశివుని జటాజూటం నుంచి జాలువారుతున్నట్టు జలపాతాల హొయలు... పాల సంద్రం భువిలో వెలిసిందా అనేలా శ్వేతవర్ణ మేఘాల సోయగాలు... పచ్చి గాలి మధురాను భూతి...మట్టి గంధం సువాసన... పక్షుల కిలకిలా రావాలు, ఆకుల సవ్వడులు... ఇలా పంచేంద్రియాలను ప్రకృతితో మమేకం చేసే మరెన్నో ప్రత్యేకతల స్వర్గధామం... అల్లూరి మన్యం. పర్యాటక సీజన్లో ఈ అందాలు ద్విగుణీకృతమవుతాయి. కొద్ది రోజులు సాధారణ జీవితం గురించి మరిచిపోయి ఎంచక్కా ప్రకృతితో మమేకమవ్వాలను కుంటున్న వారికి ఇది సరైన సమయం.సాక్షి,పాడేరు: మన్యంలో పర్యాటక సీజన్ ప్రారంభమైంది. నవంబర్ మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకూ నెలకు రెండు లక్షల మంది పర్యాటకులు అల్లూరి జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో సుమారు నెలకు రూ.5 కోట్లపైనే బిజినెస్ జరుగుతుంది. సహజ ప్రకృతి అందాలకు నిలయమైన ఏజెన్సీలో ఈ సీజన్లో అప్పుడే పర్యాటకుల సందడి ఆరంభమైంది. జిల్లాలో బొర్రాగుహలు, వంజంగి హిల్స్, లంబసింగి, చాపరాయి జలపాతం తదితర ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తున్నారు. పర్యాటకుల కోసం ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా వంజంగి హిల్స్ వద్ద అటవీశాఖ రూ.35 లక్షల వ్యయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నలుచెరగులా... జిల్లాలోని 22 మండలాలున్నాయి. పర్యాటకంలో ప్రతీ మండలానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. అనంతగిరి నుంచి ఎటపాక వరకు అన్ని మండలాల్లోను పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఏడాది దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులంతా ఫిదా అవుతారు. » పాడేరు మండలంలోని వంజంగి హిల్స్ విశ్వవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ఈకొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. » అరకులోయ మండలంలోని మాడగడ,చింతపల్లి మండలంలోని చెరువులవెనం, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ ప్రాంతాలు మంచి వ్యూపాయింట్లుగా పర్యాటకులను అలరిస్తున్నాయి. ఇక్కడ పొగమంచు,సూర్యోదయం అందాలు అబ్బుర పరుస్తున్నాయి. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలతో పాటు అరకులోయలోని పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,లంబసింగి,సిలేరు,మారేడుమిల్లి.మోతుగూడెం పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. జలపాతాల హోరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పెదబయలు మండలంలోని పిట్టల»ొర్ర, అనంతగిరిలోని కటికి, తాడిగుడ, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి, సీలేరు ప్రాంతంలోని ఐస్గెడ్డ, మోతుగూడెంలోని పొల్లూరు, మారేడుమిల్లి ప్రాంతాలలో జలపాతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. దేవీపట్నం, వి.ఆర్.పురం ప్రాంతాలలో పాపికొండల విహార యాత్రకు లాంచీలపై పర్యాటకులు తరలివెళుతున్నారు. వలిసె పూల అందాలు అదుర్స్ ఈసీజన్లో వలిసెపూలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి.భూమికి పసుపు రంగేసినట్టు ఉండే వలిసెపూల తోటల్లో ఫొటోలు తీసుకునేందుకు సందర్శకులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఏటా భారీగా వ్యాపారం పర్యాటకులు అధికంగా తరలివస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో వ్యాపారలావాదేవీలు భారీగా జరుగుతాయి. నెలకు రూ.5 కోట్లపైనే వ్యాపారం జరుగుతుంది. పాడేరు, అనంతగిరి, అరకులోయ, జి.మాడుగుల, చింతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో హోటళ్లు, ఇతర వ్యాపారులకు అధిక ఆదాయం సమకూరుతుంది. పర్యాటక ప్రాంతాల్లో స్థానిక గిరిజనులు కూడా పలు రకాల ఫుడ్ కోర్టులు,చికెన్ వంటకాలు,అటవీ,వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలతో జీవనోపాధి పొందుతున్నారు. ప్రకృతి అందాలు కొలువైన ‘గుడి’సెరంపచోడవరం: దట్టమైన అడవి.. మధ్యలో ఎత్తైన కొండపై మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి.. మార్గమధ్యంలో ఆకట్టకునే జలపాతం ఇవన్నీ కలిపి ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్గా మారేడుమిల్లి కొండలు మారాయి. మారేడుమిల్లికి సుమారు 36 కిలోమీటర్లు దూరంలో తూర్పు కనుమల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని గడ్డి కొండలు(గ్రాస్ ల్యాండ్స్)లో ఉన్న గుడిసె అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఎౖత్తైన కొండల మధ్య సూర్యోదయాన్ని, ప్రకృతి అందాలను తనివి తీరా చూసేందుకు రాష్ట్రాలు దాటి మరీ పర్యాటకులు వస్తున్నారు. మారేడుమిల్లికి 36 కిలోమీటర్ల దూరం మారేడుమిల్లికి 36 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతాన్ని తిలకించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మారేడుమిల్లి నుంచి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తరువాత ఆకుమామిడి కోట గ్రామం వస్తుంది. అక్కడ నుంచి మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుడిసె కొండలను చేరుకోవచ్చు. ఆకుమామిడి కోట వద్ద ఉన్న ఫారెస్టు చెక్పోస్టు వద్ద వాహనాలకు రూ. 300, మనిషికి రూ. 100 చెల్లించిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణిస్తే పుల్లంగి గ్రామం వస్తుంది. అక్కడ నుంచి గుడిసె వెళ్లేందుకు ఎత్తైన కొండల మధ్య ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. కొండ పై భాగానికి చేరుకున్న తరువాత అక్కడ విశాలమైన గడ్డితో కూడిన మైదానం కనిపిస్తుంది. ఇక్కడి అందాలు, సూర్యోదయం దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. గతంలో రాత్రి సమయంలో అక్కడే పర్యాటకులు ఉండేందుకు అటవీ శాఖ వారు అనుమతించారు. పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ విపరీతంగా ప్లాసిక్ట్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో రాత్రి బసను రద్దు చేశారు.ఆకుమామిడి కోట పరిసర ప్రాంతాల్లో రాత్రి బస చేసి, తెల్లవారుజాము 4 గంటల సమయంలో గుడిసెలో సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు వెళతారు. గుడిసె ప్రాంతంలో పర్యాటకులు గడిపేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆకుమామిడి కోట నుంచి గుడిసె కొండమీదకు ప్రైవేట్ వాహనాల్లో పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రూ. 3వేల వరకు చార్జి చేస్తున్నారు. క్యాంపెయిన్ టెంట్లకు గిరాకీ సీజన్లో రోజుకు కనీసం వెయ్యి మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీంతో ఇక్కడ క్యాంపెయిన్ టెంట్లకు గిరాకీ పెరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లిలో ఈ టెంట్లను అద్దెకు ఇస్తారు. టెంట్ సైజును బట్టి రూ.500 నుంచి రూ.750 వరకూ వసూలు చేస్తున్నారు. పర్యాటకుల్లో కొందరు మారేడుమిల్లిలో గల ప్రైవేట్, ఎకో టూరిజం గదుల్లో బస చేసి, తెల్లవారుజామున కొండమీదకు వెళతారు. దుంపవలస జలపాతం ఆకుమామిడి కోట నుంచి బోడ్లంక వెళ్లే రహదారిలో గల దారగెడ్డ గ్రామం నుంచి దుంపవలస వెళ్లాలి. అక్కడి జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. గుడిసె వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు దుంపవలస జలపాతంలో స్నానాలు చేస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరిచిపోతారు. ఆకుమామిడి కోట నుంచి సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతం ఉంది. -
నాడు ఉద్యోగాల విప్లవం నేడు అడుగడుగునా మోసం
సాక్షి, అమరావతి: అబద్ధాలు చెప్పడంలో డబుల్ పీహెచ్డీలు చేసిన సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ సీఎంను అని చెప్పుకుంటున్న ఆయన హయాంలో డీఎస్సీ తప్ప ఇతర పోస్టులు భర్తీ చేసింది అరకొరే. అదీ తప్పులు చేసి, యువతను మోసం చేసి అభ్యర్థుల కన్నీటికి కారణమయ్యారు. 1998, 2018లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా పోస్టులు భర్తీ చేయలేదు. ఆ అభ్యర్థులకు న్యాయం చేసింది మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నీ కలిపి మొత్తం 34,108 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ సీఎంగా 6,26,116 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక వివిధ పరిశ్రమలను స్థాపించి వీటిలో 24,68,146 మందికి ఉద్యోగ అవకాశాలు క ల్పించారు. రెండేళ్లపాటు కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఒక్క విద్యాశాఖలోనే 21,608 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారంటేవిద్యా రంగానికి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు. తొలి సంతకానికే దిక్కులేని పాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గత ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై చేశారు. అయితే 14 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇటీవల అరకొరగా పోస్టులు భర్తీ చేశారు. ఇంకా ఈ భర్తీలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన న్యాయ చిక్కులను పరిష్కరించడంతోపాటు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలలో 30,94,262 ఉద్యోగాలను భర్తీ చేసింది. బాబు జమానాలో చేసింది అరకొరగానే.. చంద్రబాబు పాలనతో ప్రతి నోటిఫికేషన్ను వివాదాస్పదంగా మార్చేశారు, ఇందుకు 1998, 2018 డీఎస్సీలే ఉదాహరణ. వాస్తవానికి చంద్రబాబు హయాంలో డీఎస్సీని ఓ పెద్ద నాటకంగా మార్చేశారు. 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్లో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు 300 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగిలిన పోస్టులను వైఎస్ జగన్ 2021లో న్యాయ వివాదాలు పరిష్కరించి భర్తీ చేశారు. అలాగే, గత ఐదేళ్ల జగన్ పాలనలో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,059 మంది, 2008 అభ్యర్థులు మరో 2,193 మందికి ఎంటీఎస్గా విధుల్లోకి తీసుకున్నారు. స్పెషల్ డీఎస్సీ–2019 ద్వారా 602 మందికి, 2023లో కేజీబీవీల్లో 1,250 మందికి కాంట్రాక్టు విధానంలోను, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీగా మరో 450 మంది.. ఇలా మొత్తం 15,508 పోస్టులు భర్తీ చేశారు. 2024 డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ పోస్టులను నిలిపివేసింది. ఇవికూడా భర్తీ అయితే మొత్తం 21,608 పోస్టులను భర్తీ చేసినట్టు అయ్యేది. విద్యా సంస్కరణలకు బ్రాండ్ వైఎస్ జగన్ గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడి కీర్తిని ఐక్యరాజ్య సమితిలో నిలబెట్టారు వైఎస్ జగన్. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల్లో 11 రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు టోఫెల్, ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టారు. ‘మనబడి: నాడు–నేడు’ ద్వారా రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేశారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. నాడు–నేడు రెండో దశలో రూ.8000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అంతేగాక దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరు శాతం ప్రభుత్వ బడులను డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతోపాటు సీబీఎస్ఈ సిలబస్ను సైతం ప్రభుత్వ బడిలో అమలు చేశారు. అలాగే, అంతర్జాతీయంగా పేరు పొందిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ను సైతం అమలు చేసేందుకు బాటలు వేశారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఈ విద్యా సంస్కరణలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం తన కుటిల∙బుద్ధితో ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. -
కుప్పలు తెప్పలు.. ఎడాపెడా అప్పులు
సాక్షి, అమరావతి : బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశాల్లో ఆమోదించడం.. ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయడం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది. కొత్తగా అమరావతి రాజధాని, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), విద్యుత్ సంస్థల పేరుతో.. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.16,150 కోట్ల అప్పులు చేయడానికి బుధవారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో రూ.1,02,533 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారెంటీ అప్పులు రూ.62,533 కోట్లు ఉండగా, అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో రూ.40,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని అప్పట్లో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుగా చిత్రీకరించాయి. అయితే బాబు సర్కారు బడ్జెట్ బయట కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.1,02,533 కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వ గ్యారెంటీలతో జీవోలు జారీ చేసినా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించడం లేదు. వాస్తవంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ బయట అప్పులు చేసింది. ఆ అప్పులను తప్పుగా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేశారు.ఎడాపెడా ఉత్తర్వులువాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్లు అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా పౌర సరఫరాల సంస్థ అప్పుల గరిష్ట పరిమితిని రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.1,000 కోట్ల అప్పు తీసుకునేందుకు అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఈ అప్పు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పింది. డిస్కమ్స్ (విద్యుత్ సంస్థలు) వివిధ బ్యాంకుల నుంచి రూ.1,150 కోట్ల అప్పులు చేసేందుకు అసలుకు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధానిలో పనుల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఎబీఎఫ్ఐడీ) నుంచి రూ.7,500 కోట్లు అప్పు చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అప్పుకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీని తీసుకుని రుణ ఒప్పందం చేసుకోవాల్సిoదిగా సీఆర్డీఏ కమిషనర్కు ఉత్తర్వుల్లో సూచించింది. అలాగే రాజధాని పనుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,500 కోట్లు అప్పు తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ అప్పునకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీ తీసుకుని అప్పు ఒప్పందం చేసుకోవాల్సిoదిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు అప్పులు -
ఇది ప్రజా విజయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థులతో కలిసి వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, భావసారూప్య పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. » వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్త పరిచారు. ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ఆ సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితోపాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, మిత్రపక్షాలు.. వివిధ ప్రజా సంఘాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రజల నిబద్ధతను, సామాజిక న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజలు స్వలాభం కోసం కాకుండా, సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. » తమ బాధ్యత మరిచి, ప్రభుత్వ పెద్దల మాటలు మాత్రమే వింటున్న పోలీసులు నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎక్కడా ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ధైర్యంగా, శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. బలవంతంగా ప్రజల గొంతు నొక్కలేమని ప్రజా ఉద్యమ ర్యాలీ మరోసారి నిరూపించింది. » చంద్రబాబు గారూ.. ఇకనైనా ప్రజల మనోభావాలు గుర్తించి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చారిత్రక ఉద్యమాన్ని విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. -
కట్టించింది జగన్.. క్రెడిట్ కొట్టేస్తున్నది బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్బేగం, ఎం.హేమలతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో పక్కా ఇళ్లు మంజూరు చేయగా వారు పూర్తిచేశారు. గోడలపైనా ఇదే రాశారు. ఈ వివరాలు గృహనిర్మాణశాఖ లెక్కల్లోనే స్పష్టంగా ఉన్నాయి. కానీ, వీటిలో గృహ ప్రవేశాలంటూ బుధవారం సీఎం చంద్రబాబు ఆర్భాటం చేశారు. ముంతాజ్బేగంకు దేవగుడిపల్లెలో సొంత స్థలం ఉండగా పక్కా ఇంటికి 2022 మే 9న ఆమోదం వచ్చింది. ముంతాజ్బేగం పేరిట తహసీల్దార్ 2023 జూలై 6న పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్– 2023 జూన్ 4 వరకు మూడు బిల్లులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. రోజుకు రూ.200 లెక్కన 90 రోజుల ఉపాధి హామీ పథకం బిల్లు వచ్చింది. కేవలం రంగులు వేయించి బుధవారం గృహ ప్రవేశం చేయించారు. » హేమలతకూ సొంత స్థలం ఉండగా 2022 జూలై 9న పక్కా గృహం మంజూరైంది. 2024 మార్చికి పూర్తి చేశారు. ఈ బిల్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఉపాధి హామీ బిల్లు కూడా అందింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారురంగులు వేసింది. ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రం, ఇంటి మంజూరు పత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జారీ అయ్యాయని వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారని హేమలత చెప్పడం గమనార్హం.అద్దె బాధల నుంచి విముక్తినా పేరు ఫాతిమా. ఇదిగో ఇది నాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇంటి పట్టా. వ్యవసాయ కూలిగా జీవనం సాగించే నేను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పక్కా ఇంటి కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే స్థలం, ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షల సాయం చేశారు. నెలనెల అద్దె కట్టడానికి ఇబ్బంది పడేవాళ్లం. జగనన్న పుణ్యాన సొంతింటి కల నెరవేరింది.గత ప్రభుత్వంలోనే సొంతింటి సంబరంనలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్న నన్ను భర్త కొన్నేళ్ల క్రితమే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 30 ఏళ్లు కళ్యాణదుర్గంలోని బాడుగ ఇంట్లో ఉన్నాం. నెలకు రూ.4 వేల వరకు అద్దె కట్టేదాన్ని. గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పుణ్యమా అని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కురాకుల తోట జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మొత్తం బిల్లు రూ.1.80 లక్షలు మంజూరైంది. ఇప్పుడు సొంతిట్లోసంతోషంగా ఉంటున్నాం. –నబియా భాను, జగనన్న కాలనీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగత ప్రభుత్వంలోనే... అద్దె ఇంటి నుంచి సొంత గూటికిమేం చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. 2022లో గృహ ప్రవేశం చేసి ఇందులోనే నివసిస్తున్నాం. ఇంత సాయం అందించిన జగనన్న మా పాలిట దేవుడు. –షేక్ నాగూర్ బి, గుంటూరు జిల్లా దుగ్గిరాల జగనన్న కాలనీ సొంతింటి కల నెరవేర్చింది జగనన్నమాకు 2.50 సెంట్ల స్థలం ఉంది. కానీ, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు తగినన్ని డబ్బులు లేవు. చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే భరోసా కల్పించారు. రెండు విడతలుగా బిల్లులు నా బ్యాంక్ అకౌంట్లో వేశారు. నిర్మాణం పూర్తి చేసి 2023లోనే గృహప్రవేశం చేశాం.– నల్లమోతు రాణి, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లాజగనన్న హయాంలోనే మాకు ఇల్లునా భర్త, నేను వ్యవసాయ కూలీలం. మాకు ఇద్దరు పిల్లలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ స్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పట్టా, నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. సకాలంలో బిల్లులు రావడంతో కొంత నా డబ్బులు వేసుకుని ఇల్లు పూర్తి చేశా. ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. –సంగం త్రివేణి, గండేపల్లి గ్రామం, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా15 ఏళ్ల నిరీక్షణ... వైఎస్సార్సీపీ హయాంలో సాకారంసొంతిల్లు లేక చాలా ఇబ్బందిపడ్డాం. 15 ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. చిన్న గుడిసె, బడితెల గోడల ఇంట్లో మరికొన్నేళ్లు ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహప్రవేశం చేస్తాం. సొంతిల్లు అనే ఆలోచనే సంతోషంగా ఉంది. దీన్ని సాకారం చేసింది వైఎస్ జగన్. – రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాఅన్నీ అప్పుడే మంజూరు...జగనన్న ప్రభుత్వంలోనే మాకు పక్కాగృహం మంజూరైంది. స్థలానికి పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మొత్తం రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చేశారు.–సుజాత, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్’
నాడు‘‘సెంటు స్థలం ఇస్తారంట..! ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది...? ఒక్కదానికి సరిపోతుంది. చనిపోయిన తర్వాత పూడ్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది. అంతకుమించి ఇళ్లు కట్టడానికి పనికిరాదు. – వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబునేడుఅన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్.అల్తాబ్బేగమ్ వ్యవసాయ కూలీ. ఈమె పేరిట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవ రత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై రూ.32 వేల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి సమకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే, కేవలం తాళంచెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు. అల్తాబ్బేగమ్ మాత్రమే కాదు, బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడిపల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి మల్లక్కలకూ 2021–22లో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసింది. ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.సాక్షి, అమరావతి: ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైనా పంచిన దాఖలాల్లేవు.. పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన పాపాన పోలేదు... కానీ, తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు నిర్మించేసిందని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. అన్నింటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తున్న సీఎం చంద్రబాబు... ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ నిస్సిగ్గుగా డప్పు కొట్టుకుంటున్నారు. ఈ మేరకు ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఆర్భాటం చేశారు. ఇదంతా చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. చంద్రబాబు మూడు లక్షల ఇళ్ల కథ కమామిషు ఏమిటి? అని చూస్తే అసలు విషయం బయటపడుతోంది. పాలనలో విఫలమైన బాబు పేదలకు తాను చేయని మేలును చేసినట్టు మభ్యపెడుతున్న కుతంత్రం బయటపడుతోంది.గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లేరాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. వీటి మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్దఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇళ్లు 2.62 లక్షలు అదనం. ఎన్నికలు ముగిసేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు శ్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు శ్లాబ్ దశలో ఉన్నాయి. చాలావరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. ఇలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. బుధవారం చంద్రబాబు దేవగుడిపల్లెలో పంపిణీ చేసిన ఇళ్లు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించినవే. అక్కడి రాజీవ్ కాలనీలో ఇళ్లు లేని పేదలకు 40 ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చింది. 30 మంది లబ్ధిదారులు నిర్మాణం మొదలుపెట్టగా, ఎన్నికలు ముగిసేనాటికే కొన్ని పూర్తయ్యాయి. మిగిలినవి దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్న దశలో ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించిన ఇళ్ల తాళాలను సీఎం, మంత్రులు లబ్ధిదారుల చేతుల్లో పెట్టడం గమనార్హం.పూర్తి అండగా వైఎస్ జగన్2019–24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మందిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు కరెంట్, విద్యుత్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు రూ.355 కోట్ల దాక ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఇళ్ల పట్టాలకు భూ సేకరణ, లేఅవుట్ల అభివద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు రూ.35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సృష్టికి పాటుపడ్డారు.బాబు పాలనలో గజం స్థలమైనా మిథ్య!17 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవీ రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. వైఎస్ జగన్ హయాంలో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతిలో 50 వేలమంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. సాయం పెంపులోనూ మొండిచేయిపట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ, గజం కూడా ఇచ్చింది లేదు. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక 6 నెలల్లోనే కోవిడ్ వ్యాప్తి మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితులను అధిగమించి 2020 డిసెంబరు 25న వైఎస్ జగన్ 31 లక్షల మందిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి చరిత్ర సష్టించారు. కాగా, ఈ స్థలాలు శవాలు పూడ్చడానికి తప్ప దేనికీ పనికిరాదని పేదల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. నాడు శ్మశానాలతో పోల్చిన స్థలాల్లోని ఇళ్లనే నేడు తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.చంద్రబాబు కనీసం ఇళ్ల పట్టాల పంపిణీలో విఫలమయ్యారు. పేదలకు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేయడమే కాక సీఎం హోదాలోనూ దగా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనే పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదనపు సాయం వస్తుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. కొద్ది రోజులకే ఆ సాయం ఊసే లేకుండా చేసేశారు.1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే టిడ్కో ఇళ్లుమిగిలినవారికి లబ్ధిదారుల వాటా 50 శాతం తగ్గింపులక్షమంది లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగింత2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని, ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందన్న ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్నిచోట్ల పునాదులతో వదిలేయగా, చాలాచోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరు, రెండు–మూడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. కానీ, వైఎస్ జగన్ సీఎం కాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో, 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరలను పక్కనబెట్టి, 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, మరో 77 వేల ఇళ్లను 90 శాతంపైగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లను ఉచితంగా ఇవ్వగా రూ.10,339 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వీరి నుంచి గత టీడీపీ సర్కారు లబ్ధిదారుల వాటాగా వసూలు చేసిన రూ.500 కోట్లను తిరిగి చెల్లింపు ప్రారంభించి రూ.250 కోట్లను వెనక్కిచ్చింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాలని నిబంధన పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కారు దీన్ని 50 శాతం తగ్గించింది. ఈ రెండు యూనిట్లకు గాను 1,18,616 మంది పేదలపై రూ.482 కోట్ల భారం తగ్గింది. పైగా లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,77,546 ఇళ్లు పూర్తి చేసిందని అసెంబ్లీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ప్రకటించడం గమనార్హం. -
కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి
మహారాణిపేట: చంద్రబాబు పాలనలో వైద్యం అందక చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్లతో గిరిజన బాలికలు మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. తాజాగా కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మరో గిరిజన పసికందు బలి అయ్యాడు. పిల్లల వార్డులో చికిత్స పొందుతూ ఐదు నెలల ధన్వీర్ బుధవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. కేజీహెచ్లో సరైన వైద్యం అందించలేదని ధన్వీర్ తండ్రి అఖిల్ ఆరోపించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మరణించాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బిడ్డ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామానికి చెందిన ఎ.అఖిల్ దంపతులకు రెండో సంతానంలో బాబు జన్మించాడు. ఈ బాబు ఈ నెల 8న అనారోగ్యానికి గురయ్యాడు. గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో వైద్యం అందించారు. అక్కడి వైద్యులు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అదే రోజు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఇక్కడకు వచ్చాక ఏం వైద్యం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం రాత్రి పసికందు ఆరోగ్యంగా కనిపించాడని తండ్రి అఖిల్ అన్నారు. అర్ధరాత్రి తర్వాత పసికందు మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని వార్డులో ఉన్న వైద్యులకు, నర్సులకు సమాచారం ఇచ్చినా ఎవరూ వచ్చి చూడలేదని, మందులు కూడా ఇవ్వలేదని, అందువల్లే బిడ్డ మరణించినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వీర్ మృతితో తల్లిదండ్రులు, వారి బంధువులు కేజీహెచ్ పిల్లల వార్డు ఎదుట ఆందోళనకు దిగారు. తమ బాబుకు సరైన వైద్యం అందలేదని, నిర్లక్ష్యం చూపిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరొకరికి ఇలా జరగకూడదు: అఖిల్ కేజీహెచ్లో మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబుకు బాగోలేకపోతే ఆస్పత్రికి వచ్చామని, కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మరణించినట్లు కేజీహెచ్ సీఎస్ ఆర్ఎంవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి విచారణ చేస్తున్నారు. -
ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీలోని ప్రభుత్వ వసతి గృహంలో 7వ తరగతి చదువుతున్న బాలుడిపై అదే హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు బాలురు లైంగిక దాడికి పాల్పడినట్లు జేఆర్ పురం పోలీసులు తెలిపారు. ఈ నెల 6న రాత్రిపూట ఐదుగురు బాలురు బాధిత బాలుడుపై అకృత్యానికి పాల్పడ్డారు. దీంతో అప్పటి నుంచి బాధిత బాలుడికి రక్తస్రావం అవుతుండడంతో బుధవారం రణస్థలం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో వారు జేఆర్ పురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని శ్రీకాకుళంలోని మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎస్. చిరంజీవి నిందితులు ఐదుగురిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది. నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు. -
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి మళ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కత్తిగట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని కక్షసాధిస్తోంది. కేసులు, నోటీసుల పరంపరను కొనసాగిస్తోంది. ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని శతవిధాలా యత్నిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభా ఉల్లంఘన నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి ఎడిటర్ హైకోర్టును ఆశ్రయించిన విషయమూ తెలిసిందే. హైకోర్టు ఆదేశాల తర్వాతా కూటమి సర్కారు వేధింపులు ఆపలేదు. తాజాగా ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పత్రికలో రాసిన పలు కథనాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు తరచూ పోలీసులను పంపి ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా ఎడిటర్ ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు వచ్చి బెదిరింపులకు పాల్పడడంపై జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు సర్కారు క్షక్షసాధింపు పంథాను వీడడం లేదు. దీనిలోభాగంగానే తాజాగా మళ్లీ ప్రివిలైజ్ నోటీసులు జారీ చేయించింది. -
‘హద్దు’లు దాటి ఇసుక దందా!
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ఖమ్మం/సత్తుపల్లి: ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. ఏపీలోని తాడిపత్రిలో ఉన్న ఓ అధికారిక రీచ్ నుంచి కర్నూలు మీదుగా వాహనాలు వస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా గుండా ఉమ్మడి మహబూబ్నగర్లోని గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, ఆదిభట్ల తదితర ప్రాంతాలతోపాటు హైదరాబాద్లోని పలు చోట్లకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు బెంజ్ వాహనాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో బినామీలు రెచ్చిపోతున్నారు. గోదావరి ఇసుకను దర్జాగా ఏపీ సరిహద్దు దాటిస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే బినామీలకు చెందిన ఇసుక టిప్పర్లు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టుబడడం గమనార్హం. కాగా ఏపీకి చెందిన నేతలు ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఇసుక దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి నుంచి యధేచ్చగా.. అనంతపురం జిల్లా తాడిపత్రి రీచ్ వద్ద ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ధర తక్కువగా ఉండడంతో కన్నేసిన ఇసుక మాఫియా అక్కడి నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి టన్ను రూ.1,800 నుంచి రూ.2,400 వరకు విక్రయిస్తూ సొమ్ము చోసుకుంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలు సరిహద్దులోని పుల్లూరు టోల్ప్లాజా దాటేలా అక్రమార్కులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో గస్తీ నామమాత్రంగా ఉండడంతో ఇసుక వాహనాలు సులువుగా సరిహద్దులు దాటుతున్నాయి. ఎక్కువగా 16 టైర్ల లారీల్లోనే ఇసుకను తరలిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 16 టైర్ల వాహనంలో 47 టన్నులు, 14 టైర్ల వాహనంలో 42 టన్నులు, 12 టైర్ల వాహనంలో 36 టన్నులు, 10 టైర్ల వాహనంలో 28 టన్నుల ఇసుకను మాత్రమే తరలించాలి. కానీ ఆయా వాహనాలను రీడిజైన్ చేసి.. సామర్థ్యానికి మించి 35 నుంచి 45 శాతం మేర అధికంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ కూటమి పార్టీ వ్యక్తి, స్థానిక నేత కుమ్మక్కు ఇసుక దందా వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీకి చెందిన ఒక వ్యక్తి.. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సమీప బంధువులని కూడా సమాచారం. నెల రోజులుగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తున్న పది వాహనాలను స్థానిక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇటు పోలీసులు, అటు రవాణా శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాత్రివేళ దొంగ చాటుగా ఇసుక లారీలు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టోల్ప్లాజా వద్ద గస్తీ పెంచామని జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి ఎస్ఐ శేఖర్ తెలిపారు. ఏజెంట్ల ద్వారా వ్యవహారం ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో లోడ్ చేస్తున్న గోదావరి ఇసుకను ఆర్డర్ల ఆధారంగా టిప్పర్లు, లారీల్లో సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఏలూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను రూ.250 చొప్పున టిప్పర్లలో 40 – 50 టన్నుల వరకు లోడ్ చేసి, సత్తుపల్లిలో టన్ను రూ.1,200 చొప్పున, ఖమ్మంలో రూ.1,600 – రూ.1700, అదే హైదరాబాద్కు తీసుకెళ్తే రూ.2,500కు అమ్ముతున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు ఆనుకుని తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తుపల్లిలో కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి కనుసన్నల్లో ఆయన బినామీలు వ్యవహారం నడిపిస్తున్నారు. టిప్పర్లు రాగానే వేగంగా అన్లోడ్ చేసేలా ఈ ఏజెంట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యే బినామీలే ఇటీవల ఏపీలో రూ.100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేకు చెందిన బినామీలే ఇసుక దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక టిప్పర్లు కూడా ఆ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గాల్లోని వ్యక్తులవే కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అయితే రెండురోజుల క్రితం ఆ ఎమ్మెల్యే హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన పేరు చెప్పుకుని కొందరు ఇసుక, మట్టి దందా చేస్తున్నారని.. వారికి, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం విశేషం. కాగా ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారంతో నిఘా వేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు..ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గంగవరం రాజవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పేరుతో ఉన్న ఏపీ 39 డబ్ల్యూహెచ్ 7666, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామానికి చెందిన కరకం శ్రీనివాస్ పేరిట ఉన్న ఏపీ 36డబ్ల్యూజీ 9666 టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా ఆదివారం రాత్రి పట్టుకోవడం గమనార్హం. -
భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త
అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యపై దారుణ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరంపల్లికి చెందిన ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మపై అనుమానంతో కోపావేశంలో రత్నమ్మ గొంతు కోసి పరారయ్యాడు.దాంతో రత్నమ్మ తీవ్రంగా గాయపడగా, ఆమెను తక్షణమే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.ఎర్రిస్వామి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.సదరు ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఎర్రిస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. -
అనకాపల్లి జిల్లా వడ్డాదిలో 30 మందిని కరిచిన పిచ్చి కుక్క
అనకాపల్లి: జిల్లాలోని వడ్డాదిలో పిచ్చికుక్క స్వైర విహారం స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పిచ్చికుక్క దెబ్బకు గ్రామస్తులు హడలిపోతున్నారు. ఈరోజు(బుధవారం) పిచ్చికుక్క స్వైర విహారం చేసి 30 మందిని కరిచింది. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారంతా వృద్ధులు, చిన్నారులే ఉన్నారు. వీరిని చోడవరం, కేజే పురం ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వాక్సిన్ వేశారు వైద్యులు. అయితే ఆ పిచ్చి కుక్క మళ్లీ ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్తుల్లో భయం నెలకొంది. -
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: సిట్ విచారణకు సహకరించానని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానన్నారు. గతంలొ టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించినట్టే తానను కూడా విచారించారన్నారు. కొత్త ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని.. విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించవద్దన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ధర్మారెడ్డి అన్నారు.టీటీడీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని నిన్న (మంగళవారం, నవంబర్ 11) కూడా విచారణ చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు మంగళవారం ఉదయం 10:58 గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు.భోజన విరామ సమయంలో మీడియా సిబ్బంది మాట్లాడండి.. అని కోరగా ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫొటోలు వీడియోలు తీసుకోమని చెప్పారు. ఇదే సమయంలో జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ సిట్ కార్యాలయం వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరో తెచ్చిన లడ్డూలను తానే తిరుమల నుంచి తెచ్చా.. ధర్మారెడ్డికి ఇస్తా అంటూ హల్చల్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కిరణ్ రాయల్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ధర్మారెడ్డి భోజనానికి వెళ్లి.. 3.10 గంటలకు తిరిగి విచారణకు హాజరయ్యారు. రాత్రి 9.15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇవాళ కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. -
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావటం సంతోషకరం. ప్రజల సంక్షేమమే ముఖ్యం అని వీరంతా అనుకోవటం మంచి పరిణామం. పోలీసులు ఈ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు...ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. ఇవ్వాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత
విజయవాడL ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విజయవాడలో 248 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు విజయవాడలో ఉంచిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి గంజాయి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50 లక్షల రూపాయల ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తరలించడానికి సిద్ధం చేసిన రెండు లారీలను సీజ్ చేశారు అధికారులు. -
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
-
మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రి సీజ్
మదనపల్లి: అన్నమయ్య .జిల్లాలోని మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ రాకెట్ దందా నేపథ్యంలో చర్యలు చేపట్టిన అధికారులు.. గ్లోబల్ ఆస్పత్రిని సీజ్ చేశారు. అదే సమయంలో గ్లోబల్ ఆస్పత్రిలో రికార్డులను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం( నవంబర్ 11వ తేదీ) మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం రేపింది యమున అనే మహిళ మిస్సింగ్ కేసు ఎపిసోడ్తో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.ఆమె భర్త మధుబాబు 112 తిరుపతికి కాల్ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్కు ఎండార్స్ చేశారు పోలీసులు.సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ను ట్రేస్ చేశారు పోలీసులు. దాంతో గ్లోబల్ హాస్పిటల్లో పద్మ కిడ్నీలను తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది. ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆస్పత్రికి తీసుకురాగా, యమున అనే మహిళకు కిడ్నీ తొలగిస్తున్న సమయంలో మృత్యువాడ పడ్డారు. నిన్ననే గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఈరోజు ఆ ఆస్పత్రని సీజ్ చేశారు. -
మీరు తెలుగులో ప్రశ్నలు వేస్తే కుదరదన్న లోకేష్..!
ఢిల్లీ: తెలుగు మీడియాకు ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏపీ భవన్లో మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రి లోకేష్ ఏపీ భనవ్కు రావడంతో అధికారులు ఎక్కడాలేని హడావుడి చేశారు. ఇదంతా బాగానే ఉన్నా తెలుగు మీడియాకు అక్కడ అనుమతి లభించలేదు. తెలుగు మీడియా అక్కడకు రావడంపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశానికి మీరెందుకు వచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ‘‘మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదు’’ అంటూ మీడియా ప్రతినిధులను లోకేష్ అవమానించారు. దాంతో పలువురు మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. తెలుగు మీడియాకు అనుమతి లేదని ఐ & పి ఆర్ అధికారులు సైతం వెల్లడించారు. ఏపీ భవన్లో సమావేశం పెట్టి ఏపీ మీడియాను అధికారులు అనుమతించకపోవడం ఏంటనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలు. -
మరో మారు క్రెడిట్ చోర్గా మారిన చంద్రబాబు
సాక్షి, అన్నమయ్య జిల్లా: మరో మారు క్రెడిట్ చోర్గా మారిన చంద్రబాబు.. వైఎస్ జగన్ హయాంలో మంజూరై పూర్తి చేసుకున్న ఇళ్లకు గృహ ప్రవేశం అంటూ హడావుడి చేశారు. 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అంటూ అన్నమయ్య జిల్లాలో హడావుడి సృష్టించారు. లబ్దిదారులను పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబే ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన డబ్బా కొట్టించుకున్నారు. 2022లో మంజూరై 2023లోనే ఇల్లు పూర్తి అవ్వగా.. ఇప్పుడు తానే ఆ ఇళ్లను ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో చంద్రబాబు బాగోతం బయటపడింది.కూటమి సర్కార్ వచ్చాక సెంటు స్థలం, ఒక్క ఇల్లు కూడా ఇవ్వని చంద్రబాబు.. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వైఎస్ జగన్ మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసేసుకున్నారు. పక్కా ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. తాను గృహ ప్రవేశం చేయించిన ఇళ్లే తానివ్వక పోతే ఇక 3 లక్షల ఇళ్ల మాటేమిటంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులతో కూడా అబద్ధాలు చెప్పించి మరీ చంద్రబాబు.. క్రెడిట్ కొట్టేశారు.దేవగుడిపల్లికి చెందిన ఎస్.ముంతాజ్ బేగంకు 2021-22లో ఇళ్లు మంజూరైంది. వైఎస్ జగన్ హయాంలో 2022 మే 9వ తేదీన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇంటి నిర్మాణ నగదు జమ అయ్యింది. జూన్ 2023కి ఇంటి నిర్మాణం రూఫ్ లెవల్కి వచ్చింది. దేవగుడిపల్లికి చెందిన ఎం.హేమలతకు 2022 జులై 9వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో నగదు జమ అయ్యింది. వైఎస్ జగన్ హయాంలోనే 2024 మార్చి 19కి ఇంటి నిర్మాణం రూఫ్ లెవల్కి వచ్చింది. అయినా తానే మంజూరు చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. -
గుంటూరులో ఉద్రికత్త.. అంబటితో సీఐ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.వివరాల ప్రకారం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.గుంటూరు లో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో YSRCP ప్రజా ఉద్యమం🔥🔥అడ్డుకుంటున్న పోలీసులు #OneCroreSignatures#StopPrivatization#SaveMedicalCollegesInAP#YSRCPForMedicalStudents pic.twitter.com/MtDOBCRkH0— Rahul (@2024YCP) November 12, 2025 పీపీపీ పద్దతి వద్దంటూ కోటి సంతకాలు సేకరించాం. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడా బాబులకు అప్పగించి లోకేష్ జేబులు నింపుతున్నారని మేం ఆరోపిస్తున్నాం. మేం ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. మెమోరాండం ఇవ్వకుండా ఆపగలిగారా?. పోలీసులు పద్దతి మార్చుకోవాలని చెబుతున్నాం. లోకేష్ మెప్పుకోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల భాష మాట్లాడుతున్నారు.. మాకు రాదా పోలీసు భాష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకూ ఉద్యమం ఆగదు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ బంధువు. ఎక్కడా ఆపని పోలీసులు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. మేం తగ్గేది లేదు.. చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. పోలీసులతో అణిచిపెట్టాలని చూస్తున్నారు.. లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్దం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
Nellore Lorry Incident: ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..
మాటేసిన మృత్యువు.. కంటైనర్ రూపంలో కాటేసింది. ఎన్నెన్నో కలలను కబళించింది. మూడు కుటుంబాలకు కన్నీరు మిగిలి్చంది. ఆస్పత్రికి వెళ్లొస్తున్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక లేడని తెలుసుకొని ఓ అన్నా చెల్లెలు.. బయటకెళ్లిన భర్త కొబ్బరి నీరు తెస్తాడని ఎదురు చూసిన నిండు గర్భిణైన భార్య గుండెలు పగిలిలా తల్లడిల్లారు. జీవనోపాధి నిమిత్తం కంకులు విక్రయిస్తూ బతుకు పోరాటం చేస్తున్న మీజూరి మల్లిక.. కొబ్బరి బోండాలు అమ్మే మాలకొండయ్య గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.నెల్లూరు (క్రైమ్): కంటైనర్ మితిమీరిన వేగం వారి పాలిట మృత్యువైంది. తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక రారని అన్నా, చెల్లెలు.. జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేసిన భర్త కానరాని తీరాలకు వెళ్లిపోయారని తెలుసుకొని ఎనిమిది నెలల గర్భిణి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నెల్లూరులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాలను చిదిమిసేంది. నెల్లూరు ఎస్వీజీఎస్ కళాశాల మైదాన సమీపంలో జాతీయ రహదారి పక్కన ఎనీ్టఆర్నగర్ రాయపుపాళేనికి చెందిన మీజూరు మల్లిక తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు.. ఎనీ్టఆర్నగర్కు చెందిన చుండూరి మాలకొండయ్య టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.సూళ్లూరుపేటలో చేపలను అన్లోడ్ చేసిన మినీ కంటైనర్ నెల్లూరుకు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరింది. గ్రీన్ సిటీ మార్గం వద్దకొచ్చేసరికి చెన్నై వైపు రహదారి నుంచి కావలి వైపు ఒక బైక్పై యూటర్న్ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ బైక్ను తప్పించే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోయారు. బైక్తో పాటు ముందు వెళ్తున్న మరో బైక్, కంకులను కొనుగోలు చేస్తున్న వ్యక్తి, తోపుడు బండిని ఢీకొని దూసుకెళ్లి ముందున్న పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం సిరి గార్డెన్స్కు చెందిన ఒట్టూరు సురేష్ (36), తండ్రీకొడుకులు ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70), ముజాహిద్ అలీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మల్లిక, మాలకొండయ్యతో పాటు కంకుల కొనుగోలుకు వచ్చిన లైన్మెన్ ఈదూరు అనిల్, యూటర్న్ తీసుకున్న ద్విచక్రవాహనదారుడు కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.వైద్యచికిత్స చేయించి ఇంటికెళ్తూ..నెల్లూరు రూరల్ మండలం సిరి గార్డెన్స్కు చెందిన ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70) విశ్రాంత పీఈటీ. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు తౌహీద్, కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుమారుడు ముజాహిద్ అలీ నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలోని సచివాలయంలో శానిటరీ అండ్ ఎని్వరాన్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో హెల్త్ చెకప్ నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తండ్రిని తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి జాతీయ రహదారి మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో కంటైనర్ ఢీకొని వారు మృతి చెందారు. తండ్రి, సోదరుడు మృతి చెందారనే విషయం తెలుసుకున్న తౌహీద్, సోదరి ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.హాస్పిటల్లో మిన్నంటిన రోదనలుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లిక, మాలకొండయ్య, అనిల్.. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్పిటల్కు చేరుకొని విషాదంలో మునిగిపోయారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన అనిల్కు భార్య మెర్సీ, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన నెల్లూరులో లైన్మెన్గా పని చేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.ఎనీ్టఆర్నగర్కు చెందిన మల్లిక, రవిచంద్ర దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. జాతీయ రహదారి పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ మల్లిక జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోదించారు.ఎనీ్టఆర్నగర్కు చెందిన మాలకొండయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ కొంతకాలంగా మాలకొండయ్య జీవనం సాగిస్తున్నారు.తిరుపతి జిల్లా కోట మండలం ఉచ్చువారిపాళేనికి చెందిన కోటేశ్వరరావు నెల్లూరు గ్రీన్ సిటీలోని సచివాలయ బిల్డింగ్కు వాచ్మెన్గా రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు.ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..మూలాపేటకు చెందిన సురేష్ ప్రస్తుతం సిరి గార్డెన్స్లో ఉంటున్నా రు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి. సురేష్ ఇంటికొస్తూ.. భార్యకు ఫోన్ చేసి నీకేం కావాలి తన అడిగారు. కొబ్బరి నీళ్లు తీసుకురావాలనడంతో అక్కడ ఆగడమే ఆయనకు ఆఖరి క్షణమని తెలియదు. సురేష్ మృతి విషయాన్ని భార్యకు చాలా సేపటి వరకు బంధువులు చెప్పలేదు. గర్భిణి కావడంతో కొంచెంగా చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కూప్పకూలిపోయారు. -
ఒక్కటిగా మెలిగి.. ఒక్కటిగానే మృత్యు ఒడికి చేరిన స్నేహితులు
మృత్యువు మింగేసింది.. నిశీధి వేళలో నలుగురు స్నేహితులను కర్కశంగా కబళించేసింది.. వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.. నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది.. మృతదేహాల్ని మూటగట్టింది.. సరదాగా కారులో బయలుదేరిన వారికదే ఆఖరి మజిలీ అయ్యింది. ఆశల్ని,ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది.. కన్నవారికి, తోబుట్టువులకు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ముగ్గురు మొగల్రాజపురానికి చెందిన వారు కాగా, మరొకరు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన యువకుడు. ఘటనపై ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నప్పటి నుంచీ మిత్రులే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేష్ బాబు(24), ఈటె ప్రిన్స్బాబు(22), గొరిపర్తి పాపారావు అలియాస్ పాపయ్య(23) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. పదో తరగతి వరకూ కలిసే చదివి, ఆ తరువాత కూడా స్నేహం కొనసాగించారు. మొగల్రాజపురం బందులదొడ్డి సెంటర్ సమీపంలో నివాసం ఉండే రాకేష బాబు తండ్రి చక్రపాణి దస్తావేజు లేఖరి. చక్రపాణికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడైన రాకేష్ తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. ఇటీవలే స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ఐజీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్లో అటెండరుగా చేరాడు. కుమారుడి మర ణ వార్తతో చక్రపాణి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలోని గిరిపురంలో ఉండే ఈటే ప్రిన్స్బాబు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ప్రిన్స్ తండ్రి రామయ్య రాడ్ బెండింగ్ కార్మికుడు. పాపారావు అలియాస్ పాపయ్య మొగల్రాజపురంలోని బాలభాస్కర నగర్ కనకదుర్గ మ్మ గుడి రోడ్డులో కొండపైన నివాసం ఉండే గొరిపర్తి శివయ్య, యశోదకు రెండో కుమారుడు. ఈయన మెడికల్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పాపయ్య తండ్రి శివ య్య ట్రాక్టరు డ్రైవరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపయ్య మాట్లాడుతుండటంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పాపయ్య చికిత్స పొందుతూ మరణించారు. కొణతం చింతయ్య(19)ది కంకిపాడు మండలం కుందేరు స్వగ్రామం. చింతయ్య వ్యవసాయ కూలీ. చింతయ్య తండ్రి బాలకృష్ణ పాల వ్యాపారం చేస్తుంటాడు. అటు వ్యవసాయం, ఇటు పశుపోషణ సాగిస్తూ చింత య్య కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. మృతుల్లో ఒకరైన పాపారావుది కూడా కుందేరు గ్రామమే. అయితే కొన్నాళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డారు. తల్లడిల్లి.. సొమ్మసిల్లి.. బయటకు వెళ్లిన బిడ్డలు ఇంటికి వస్తారని ఆశగా చూస్తున్న ఆ కుటుంబాలకు విషాదమే మిగిలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వచ్చిన ఫోన్తో గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాలను శోకంలో ముంచెత్తింది. స్నేహితుడి కోసం వెళ్తున్నామని చెప్పి, పుట్టినరోజు వేడుక అని చెప్పి బయటకు వెళ్లి శవమై తిరిగి వచ్చారంటూ మృతుల తల్లిదండ్రులు, రక్తసంబం«దీకులు పెట్టిన రోధనలు ప్రతి ఒక్కరినీ కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. బిడ్డల మృతదేహాలను చూస్తూ తల్లిడిల్లి సొమ్మసిల్లి పడ్డ కుటుంబ సభ్యులను చూసి అందరి మనసూ చలించింది. విజయవాడ నుంచి ఎందుకు వచ్చారు? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ఉయ్యూరు వైపు ఎందుకు వస్తున్నారు? రావాల్సిన అవసరం ఏముంది? అర్థం కాని స్థితిలో రోడ్డు ప్రమాదం తమ బిడ్డలను తీసుకెళ్లిపోయిందంటూ మృతుల బంధువుల రోదనలు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటాయి. తోడుగా ఉంటారనుకున్న కొడుకులకు తల కొరివి పెట్టే శిక్ష ఎందుకు వేశావంటూ గుండెలు బాదుకుంటూ రోధించారు.కలిసే మృత్యు ఒడికి.. చాట్రగడ్డ రాకేష్ బాబు స్నేహితుడిని రైల్వేస్టేషన్లో దింపుతానని సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి కారు తీసుకుని బయలుదేరి వెళ్లాడు. స్నేహితులు ప్రిన్స్బాబు, పాపయ్యను ఎక్కించుకున్న రాకేష్బాబు కుందేరులో ఉంటున్న పాపయ్య బంధువు వరుసకు తమ్ముడు కొణతం చింతయ్య వద్దకు వచ్చారు. తమ స్నేహితుడి పుట్టినరోజు అని చెప్పి చింతయ్యను కూడా కారులో ఎక్కించుకుని వెళ్లారు. రైల్వేస్టేషన్కు వెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోయే సరికి రాకేష్బాబు తండ్రి చక్రపాణి అర్ధరాత్రి 12, ఒంటి గంట మధ్యలో ఫోన్ చేయగా తాను పాతపాడు చర్చికి వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే వీరంతా కుందేరులో చింతయ్యను ఎక్కించుకుని విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి మీదుగా ఉయ్యూరు వైపు ప్రయాణం సాగించారు. వీరు ప్రయాణిస్తున్న కారు గండిగుంట సమీపంలోని పెట్రోలు బంకు 1.32 గంటలకు క్రాస్ అయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం 1.34 గంటల సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి, సర్వసు రోడ్డుకు మధ్యన ఉన్న బోదెలోకి దూసుకెళ్లి మూడుకు పైగా పల్టీలు కొట్టింది. ఈ పల్టీలు కొట్టే క్రమంలో కారు పూర్తిగా ధ్వంసమై కారు అద్దాలలో నుంచి ఒక్కరొక్కరుగా రోడ్డుపై పడ్డారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని ఊహించని వారు తీవ్ర గాయాలపాలై తనువు చాలించారు. ఘటనాస్థలంలోనే ఈటే ప్రిన్స్బాబు, చాట్రగడ్డ రాకేష్బాబు, కొణతం చింతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన గొరిపర్తి పాపారావును 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు. అతివేగం, మద్యం మత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారిపై డేంజర్ బెల్స్ జాతీయ రహదారి మార్గంపై డేంజర్బెల్స్ మోగుతున్నాయి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని భయానక పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు, ప్రజలు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, ఈడుపుగల్లు, గోసాల సెంటర్, కంకిపాడు బైపాస్, ప్రొద్దుటూరు, దావులూరు టోల్గేట్, నెప్పల్లి సెంటరు, పెద ఓగిరాల, చిన ఓగిరాల, గండిగుంట, గురజాడ, తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, నిడుమోలు జంక్షన్, మొదలైన ప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి నిర్మాణంలో లోపాలు, సర్వసు రోడ్డు జంక్షన్లు, రాత్రిళ్లు హైవేపై లైట్లు వెలగకపోవటం వంటి అనేక సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. దీనికి తోడు వాహనాల మితిమీరిన వేగం కూడా ప్రమాదాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ఎన్హెచ్ అధికారులు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు నివారణ, వీధి దీపాలు నిర్వహణ తదితర అంశాలపై సామాజిక కార్యకర్తలు ఇటీవల స్వయంగా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవటం గమనార్హం. -
కొత్త బట్టలు వేసుకుందువు లెయ్యి రా!
నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్డే ఉండటంతో సోమవారం కార్తీక్ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాలుగోసారి ప్రెగ్నెంట్.. ప్రసవతేదీ దాటిపోయినా రానంటూ మొండికి..
అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆమె నిండు గర్భిణి. ప్రసవ తేదీ దాటిపోయి నాలుగురోజులవుతోంది... దీంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బందివెంటనే ఆస్పత్రికి రావాలని ఆమెను కోరారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.సిబ్బంది ప్రాథేయపడినా, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినా ఆస్పత్రికి వెళ్లకుండా మొండికేసింది. వివరాలు... బూదరాళ్ల పంచాయతీ గరిమండలో మంగళవారం 104 వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదే పంచాయతీ గోధుమలంకకు చెందిన గర్భిణి పాంగి మౌనిక చికిత్స కోసం అక్కడకు వచ్చింది. ఆశా వర్కర్ ఆమె వివరాలను వైద్య పర్యవేక్షకులు భూలోకకు తెలియజేసింది. ప్రసవ తేదీ దాటి నాలుగు రోజులు కావస్తోందని గుర్తించారు. దీంతో ఆమెను వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తామని, వెంటనే బయలుదేరాలని భూలోక తోపాటు వైద్య సిబ్బంది తెలిపారు. గర్భిణి భర్త కృష్ణకు కూడా నచ్చజెప్పారు. అయితే ఆస్పత్రికి వచ్చేందుకు గర్భిణి నిరాకరించింది. బుధవారం ఆస్పత్రి వస్తానని తెలిపింది. రాజేంద్రపాలెంకు గోధుమలంక 20 కిలోమీటర్ల దూరంలో ఉందని, నొప్పులు వస్తే ఇబ్బందులు పడతారని హెచ్ఎస్ భూలోక, ఏఎన్ఎం రాజేశ్వరి, ఎంఎల్హెచ్పి జోత్స్న నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా..అయినా ఆమె స్పందించలేదు. ఆమె నాల్గోసారి గర్భందాల్చిందని, అబార్షన్ కారణంగా మూడో కాన్పు జరగలేదని హెచ్ఎస్ భూలోక చెప్పారు. -
తాడిపత్రిలో టెన్షన్.. పోలీసుల హైడ్రామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో అధికార టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ర్యాలీల సమయంలోనే పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి తెర లేపారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జేసీ వర్గీయుల హడావిడి చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యక్రమం కేంద్రాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో వైఎస్సార్సీపీ పెద్దారెడ్డి.. యాడికి మండల కేంద్రానికి ర్యాలీ కార్యక్రమానికి మార్చారు. దీంతో, యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాడికిలో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామునే పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పెద్దారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. నా కార్యక్రమాలకు సంబంధించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాను. నా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ముందే పోలీసులు విజ్ఞప్తి చేశాను. రాత్రి నా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏంటి?. చంద్రబాబు, జేసీ మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఎందుకు?. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ గ్యాంగ్ స్టర్లా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . క్యూకాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,367 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. -
కపిల తీర్థం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగింది. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోందని స్వాములు ఆరోపించారు. టీటీడీ వైఖరిపై భక్తులు, స్వాములు మండిపడుతున్నారు. ఎట్టకేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ నాయుడు డౌన్ డౌన్.. టీటీటీ డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణీ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళనస్నానం చేసేందుకు భక్తుల్ని అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులుటీటీడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అయ్యప్ప భక్తులుకార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనకు అనుమతించని అధికారులు… pic.twitter.com/s74F1Dp7jb— Rahul (@2024YCP) November 11, 2025అయితే, కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు, దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారులు ఆంక్షలు విధించారు. ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. దీంతో, తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనాన్ని దూరం చేస్తున్నరని భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భక్తులు ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో, టీటీడీ దిగి వచ్చింది. -
గెలగింత!
దిండి సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు పెరట్లో కాసిన అరుదైన అరటి గెల అబ్బుర పరుస్తోంది. పిసంగ్ సెరిబు రకానికి చెందిన ఈ అరటి గెల మలేషియా, ఇండోనేషియాల్లో పెరుగుతుందని కొవ్వూరు అరటి పరిశోధన సంస్థ సైంటిస్ట్ కె.రవీంద్ర తెలిపారు. ఏడాదికి తయారయ్యే ఈ గెల 7 అడుగుల పొడవు, 200 అత్తాలతో ఉంది. ఆకర్షణీయంగా ఉండే ఇటువంటి గెలలను అలంకరణలో ఎక్కువగా వాడతారని ఆయన తెలిపారు.– మలికిపురం -
ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు! దీంతో రాష్ట్రంలో ఉపాధి లభించక నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది.⇒ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడి అన్ని వయసుల వారికి సంబంధించి నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ 8.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. అదే జాతీయ సగటు నిరుద్యోగత 5.2 శాతంగా మాత్రమే ఉంది. జాతీయ సగటును మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. అత్యధికంగా 8.9 శాతం నిరుద్యోగంతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో ఉంది.⇒ గ్రామీణ, పట్టణప్రాంతాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో నిరుద్యోగత 7.2 శాతం ఉండగా మహిళల్లో 10.1 శాతంగా ఉంది. అదే జాతీయ సగటు చూస్తే 5.2 శాతంగా నమోదైంది.⇒ రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా 8.5 శాతం నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.⇒ ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.3 శాతం ఉండగా, మహిళల్లో 10.5 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.0 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగత 9.3 శాతం ఉందని నివేదిక పేర్కొంది.యువత నిరుద్యోగత 21 శాతంప్రత్యేకంగా యువతీ యువకుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో 29 ఏళ్ల లోపు వయసున్న యువతి యువకుల నిరుద్యోగత 21.0 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిని మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. జాతీయ స్థాయిలో యువతీ యువకుల్లో నిరుద్యోగత 14.8 శాతం మాత్రమే ఉంది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 21.9 శాతం నిరుద్యోగత ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.7 శాతం, మహిళల్లో 28.8 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది. -
చిన్నారికి టీకా
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్తో ముందుకెళ్తున్నారు. ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఏ టీకా.. ఎప్పుడు వేయాలి ?ప్రసవం నుంచి 24 గంటలు: టీబీ నుంచి రక్షణకు బీసీజీ, పోలియో నివారణకు ఓపీవీ జిరో డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్–బి 45 రోజులకు: పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ 75 రోజులకు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యూమోనియా నివారణకు పెంటావాలెంట్–1, 2, 3 105 రోజులకు: తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి సమస్యల నివారణకు ఆర్వీవీ–1, 2, 3 9–12 నెలలకు: తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఎ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫ్ఐవీవీ–3, పీసీవీ–బీ 16–24 నెలలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీడీ–1 బూస్టర్, పోలియో నివారణకు ఓపీవీ బూస్టర్, తట్టు రుబెల్లా నివారణకు ఎంఆర్–2, మెదడువాపు వ్యాధికి జేఈ–2, అంధత్వ నివారణకు విటమిన్–ఎ2 5–6 సంవత్సరాలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 10 సంవత్సరాలు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–1 బూస్టర్ 16 ఏళ్ల వయసు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–2 బూస్టర్ ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్ పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు. -
ఆపదలో తల్లీబిడ్డ
ప్రతి మహిళ జీవితంలో అమ్మ కావడం అద్భుత ఘట్టం. బిడ్డ కోసం ఎన్నో కలలుగన్న ఆ తల్లి పొత్తిళ్లలో చేరిన పాపాయిని తనివితీరా చూసుకోకుండానే తనువు చాలిస్తే.. నవమాసాలు మోసిన ఆశల రేడుకు పురిట్లోనే నూరేళ్లు నిండిపోతే.. ఆ ఇంట జీవితాలు తల్లకిందులై పోతాయి. మంత్రసానుల నుంచి పురిటి నొప్పులు లేకుండానే ప్రసవం చేసేంతగా వైద్యం అభివృద్ధి చెందినా జీరో శాతం మాతాశిశు మరణాల లక్ష్యం కలగానే మిగులుతోంది.గత కొద్ది నెలల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు మాతృమూర్తులు, 42 మంది నవజాత శిశువులు మృతిచెందారు. సాక్షి, భీమవరం: ఏప్రిల్ నుంచి సెపె్టంబరు వరకు గత ఆరు నెలల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 42 ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో 3,561 ప్రసవాలు జరిగితే వీటిలో సిజేరియన్లు 2,102 ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన మేరకు 103 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 5,452 ప్రసవాలు జరగగా వాటిలో అత్యధికంగా 4,135 సిజేరియన్ ప్రసవాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 59 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 79 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడు క్వార్టర్లలో నమోదైన నాలుగు మాతృ మరణాలు డెలివరీలు జరిగింది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కావడం గమనార్హం. ప్రసూతి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సాధారణ ప్రెగ్నెన్సీ కేసును ఎలా ట్రీట్ చేయాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే వ్యత్యాసాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వైద్యాన్ని అందించాలి. వారికి అనుకూలంగా లేని కేసులను మెరుగైన వసతులు ఉన్న మరో ఆస్పత్రికి రిఫర్ చేయాలి. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వైద్యం మొదలుపెట్టి పరిస్థితి చేజారిపోయాక మరో ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి నిర్లక్ష్యం మాతా శిశు మరణాల రూపంలో అయినవారికి తీరని శోకం, ఆర్థిక భారం మిగుల్చుతున్నాయి. ఇలాంటి ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకం.» ‘‘పాలకోడేరుకు చెందిన గర్భిణి మే 24న ఆకివీడులోని ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆమె అనారోగ్యానికి గురికావడంతో మంగళగిరి ఎయిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ 27న మృతిచెందింది. ఇన్ఫెక్షన్ వ్యాపించడం వల్ల మృతిచెందినట్టుగా విచారణలో గుర్తించారు.’’» ‘‘గొల్లవానితిప్పకు చెందిన గర్భిణి ఆగస్టు 12న భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పురుడుపోసుకుంది. మరుసటి రోజున సుగర్ ఎక్కువగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫిట్స్ ఆగకుండా రావడం వలన మృతిచెందినట్టుగా నిర్ధారించారు.’’» ‘‘తాడేపల్లిగూడెంకు చెందిన గర్భిణి జూలై 2 స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావంతో అదేరోజు రాత్రి మృతిచెందింది.’’» ‘‘మోగల్లుకు చెందిన గర్భిణి గత నెల 29న డెలివరీ కోసం భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచన మేరకు స్థానికంగా మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 2న బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి 3వ తేదీన కన్నుమూసింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.’’» ‘‘ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 42 మంది నవజాత శిశువులు (పుట్టిన నాటి నుంచి 28 రోజుల లోపు) మృతిచెందారు. వీరిలో ఆక్సిజన్ సమస్యతో నలుగురు, నెలలు నిండకుండా పుట్టిన వారు ఐదుగురు, తక్కువ బరువుతో పుట్టిన వారు ఏడుగురు, గుండె సంబందిత సమస్యలతో ముగ్గురు, ఇతర అనారోగ్య కారణాలతో మిగిలిన వారికి పరిట్లోనే నూరేళ్లు నిండిపోయాయి. 29 రోజుల వయస్సు నుంచి ఏడాదిలోపు శిశువులు తొమ్మిది మంది మృతిచెందారు.’’ప్రసవ వేదన గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు స్కానింగ్లు, రక్త పరీక్షల పేరిట నిరంతర వైద్య పర్యవేక్షణ ఉంటున్నా నవజాతి శిశువుల్లో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలల్లో వెచ్చించి వైద్యం చేయించుకున్నాం, పండంటి బిడ్డకు జన్మిస్తాడనుకుంటే పూర్తిగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో, ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారు. ఇందుకు కొందరిలో సాంకేతికంగా జన్యుపరమైన కారణాలుంటే మరికొందరిలో సరైన పోషణ, వైద్యం అందకపోవడం కారణంగా తెలుస్తోంది. గత ఐదు నెలల్లో జరిగిన ప్రసవాల్లో జిల్లాలో నెలలు నిండకుండానే 525 మంది, తక్కువ బరువుతో 741 మంది శిశువులు జ న్మించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జిల్లాలో జీరో శాతం మాతా శిశు మరణాలు లక్ష్యంగా కలెక్టర్ నాగరాణి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరి వరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుంచే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ గర్భవతి అయితే ఇబ్బంది ఉన్నప్పుడు వారికి ముందే అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై చర్యలకు ఆదేశిస్తున్నారు. -
‘గోదావరి’ టు హైదరాబాద్
గోదావరి ఇసుకను అక్రమార్కులు సరిహద్దులు దాటించేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి వనరును స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిత్యం వందల లారీల ఇసుక హైదరాబాద్ తరలిపోతోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ కీలక నేత కనుసన్నల్లో రూ.కోట్లలో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తెలిసినా అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. -సాక్షి, రాజమహేంద్రవరం ఒకే బిల్లుపై అనేకసార్లు కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో 15 స్టాక్ పాయింట్లున్నాయి. వీటి వద్ద కనీస పర్యవేక్షణ లేదు. సీసీ కెమెరాలు, వేబ్రిడ్జి లేవు. నిత్యం ఒక అధికారి ఉండాలి. మామూళ్లు తీసుకుని వారు కనపడకుండా పోతున్నారు. ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. పై అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే కనిపిస్తున్నారు. దీనికితోడు సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. » స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక టన్ను రూ.160కు విక్రయించాల్సి ఉండగా కూటమి నేతల కనుసన్నల్లో రూ.300–రూ.350 వసూలు చేస్తున్నారు. » కొవ్వూరు, చిడిపి, తాళ్లపూడి, కుమారదేవం, అరికిరేవుల తదితర స్టాక్ పాయింట్లలో ఇసుకను లారీల్లో నింపి రాష్ట్రం దాటిస్తున్నారు. గోపాలపురం, ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల మీదుగా పరిమితికి మించి రవాణా చేస్తుండడంతో ఇసుక రోడ్డుపైకి జారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొంగ వే బిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక లారీకి బిల్లు తీసుకుని అనేక ట్రిప్పులు వేస్తున్నారు. ఒకవేళ పట్టుకుంటే లారీ మరమ్మతుకు వెళ్లింది, రెండ్రోజులు ఆగిందని బుకాయిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరితెగించింది. గామన్ బ్రిడ్జి సమీపంలో కుమారదేవం, ఆరికిరేవుల, పంగిడి, తాళ్లపూడి, చిడిపి, కొవ్వూరు తదితర చోట్ల నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తోంది. లారీకి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.కోటిన్నర నెలకు రూ.45 కోట్లు కూటమి నేతలు దండుకుంటున్నారు. నియోజకవర్గంలోని ద్విసభ్య కమిటీ సభ్యులు, ఓ కీలక నేతకు చెందిన ఉద్యోగులు, ఓ ప్రజాప్రతినిధి అనుచరులు వ్యవహారమంతా దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల మామూళ్లు దండుకుంటున్న మైనింగ్ అధికారులు కళ్లెదుటే లారీలు తరలుతున్నా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల హైదరాబాద్ వెళ్తున్న లారీలను పట్టుకున్నట్లు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు రెండ్రోజుల తర్వాత మిన్నకున్నారు. కలెక్టర్ దృష్టిసారిస్తేనే... స్టాక్ పాయింట్ల నుంచి నిత్యం వందల లారీల ఇసుక తెలంగాణకు తరలుతోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నామమాత్రంగా జరిమానాలు, కేసులు పెట్టి వదిలేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి మరుసటి రోజే ఇసుక మాఫియా రంగంలోకి దిగుతోంది. తిరిగి అవే లారీలతో అక్రమ రవాణా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లా కలెక్టరైనా దృష్టిసారిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
పేరుకే ఈసీలు.. దిక్కుతోచని వీసీలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. స్వతంత్ర సంస్థలుగా విద్యాసేవలను అందించాల్సిన విశ్వవిద్యాలయాలను అనధికారిక నిబంధనల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను కాలరాస్తూ కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలు నిర్వహించకుండా వర్సిటీల పాలన కుంటుపడేలా చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడిచినా వర్సిటీల్లో ఇంతవరకు వార్షిక బడ్జెట్కు ఈసీ అప్రూవల్స్ లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రపోజల్స్ సైతం సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత బడ్జెట్కే అప్రూవల్స్ లేకపోవడం వర్సిటీల ఆర్థిక వ్యవహరాల నిర్వహణపై తీవ్రప్రభావం చూపనుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసేసిన తర్వాత వాటిని రాటిఫై చేసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వర్సిటీల చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధిపతిగా వైస్ చాన్సలర్ (వీసీ) వ్యవహరిస్తారు. ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్/డైరెక్టర్లతో పాటు వర్సిటీలోని ఆచార్యులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల వారు, విద్యావేత్తలు సభ్యులుగా నామినేట్ అవుతారు. మూడునెలలకు ఒకసారి ఈసీ సమావేశం నిర్వహించాలనేది ప్రాథమిక నిబంధన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను కాలగర్భంలో కలిపేసింది.17 నెలలుగా వర్సిటీల్లో పూర్తిస్థాయి ఈసీ సమావేశాలు నిర్వహించకుండానే కాలం గడిపేస్తోంది. దీంతో వర్సిటీల్లో పాలన, ఆర్థిక వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాలను రాటిఫై పేరుతో తర్వాత ఈసీ సమావేశాల్లో ఆమోదిస్తారు. కానీ కూటమి పాలనలో సాధారణ నిర్ణయాలను కూడా ఈసీ సమావేశాల్లేక రాటిఫై చేసుకోవడానికి వీలుకలగడంలేదు. వర్సిటీల్లో కీలకంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల నియామకం విషయంలోను ఈసీ ఆమోదం తప్పనిసరి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ వర్సిటీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రార్గా నియమితులైన వ్యక్తికి ఈసీ ఆమోదం పొందడానికి ఏడాది పట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మారిపోయారు. వీసీ మరొకరిని రిజిస్ట్రార్గా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ సమావేశమే జరగలేదు. అసలు ఈసీ ఆమోదం లేని వ్యక్తి వర్సిటీలో కీలక ఆర్థిక వ్యవహరాలు నడిపిస్తూ వాటిని రాటిఫై చేసుకునే ఆలోచన మొత్తం వర్సిటీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ అరడజనుకుపైగా వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదంటే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తోంది. అంతా తానే అంటున్న అధికారి వైస్ చాన్సలర్ ముందుస్తు సమాచారంతో ఈసీ సమావేశం ఏర్పాటుచేసి కోరం ఉంటే అజెండా ప్రకారం నిర్ణయాలు ఆమోదింపజేసుకోవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలోని ఓ కీలక అధికారి వర్సిటీలపై పట్టుకోసం వీసీలు, రిజిస్ట్రార్ల అధికారాలకు కత్తెర వేస్తూ ఈసీ సమావేశాలు జరగనివ్వకుండా చూడటం వర్సిటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసీలో మెంబర్ మాత్రమే అయిన ఆ అధికారి.. గవర్నర్ ఆమోదంతో నియమితులైన వీసీలను, ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారాలను బైపాస్ చేస్తూ ఈసీల నిర్వహణకు అడ్డుకట్టు వేస్తుండటం గమనార్హం. తనకు వీలైనప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే ఈసీ సమావేశం నిర్వహించాలని నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నప్పుడే ఈసీ సమావేశం నిర్వహణకు ఓకే చెబుతున్నారు. ఆ అధికారికి సమయం లేకపోతే ఎంతకాలమైనా వీసీలు అనుమతి కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో విచిత్రం.. ఆ అధికారి మాత్రం ఈసీ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతారు. మిగిలిన సభ్యులు నేరుగా హాజరుకావాలని హుకుం జారీచేస్తుంటారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సైతం వీసీలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు విమర్శలున్నాయి. తన పరిధిలోకి రాని ఉన్నతవిద్య అంశంలో రాయలసీమ జిల్లాల్లోని ఓ కలెక్టర్ జోక్యం చేసుకోవడమేగాక, గౌరవంగా కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన వీసీని బయట కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించటం విమర్శలకు దారి తీసింది. షాడోల రాజ్యం ఉన్నత విద్యాశాఖలో షాడోల పాలన నడుస్తోంది. విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ షాడో మంత్రిగా వ్యవహరిస్తుంటే.. ఉన్నత విద్యాశాఖలోని కీలక అధికారికి ఎన్నడూ పాఠాలు చెప్పని ఓ సీనియర్ లెక్చరర్ అనుమతి లేని ఓఎస్డీ పోస్టు సృష్టించుకుని షాడో పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరు షాడోల దెబ్బకి ఉన్నత విద్యావ్యవస్థ, వర్సిటీలు కుప్పకూలిపోతున్నాయి. మంత్రి షాడోగా ఉన్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తుంటే.. ఉన్నతాధికారి షాడో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా సమాచారం పేరుతో ఫోన్లు చేయడమేగాక అజెండాలు కూడా నిర్దేశిస్తున్నారని పలువురు వీసీలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి మంత్రికి, కీలక ఉన్నతాధికారికి విద్యాసంబంధిత అంశాలను పట్టించుకునే తీరకలేదని, తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదని వర్సిటీల అధికారులు పేర్కొంటున్నారు. బాబు పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. -
వరి పండిస్తే క్యాన్సర్ తప్పదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ అమరావతి: వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని, వరి పండించటం వల్లే పంజాబ్ రైతులకు క్యాన్సర్ సోకిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు చంద్రబాబు హాజరయ్యారు. ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కర్నూలు, అచ్యుతాపురం, గుంటూరు జిల్లా శాఖమూరులో దసపల్లా స్టార్ హోటల్ సహా రాష్ట్రవ్యాప్తంగా 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు క్యాన్సర్తో బాధపడుతున్నారన్నారు. ప్రతిరోజు పంజాబ్ నుంచి రెండు బస్సుల్లో ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రులకు వెళుతున్నారని చెప్పారు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కాకి లెక్కలతో గొప్పలుసీఎం చంద్రబాబు ప్రసంగం కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టేలా సాగింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన లెక్కలు చెబుతూ తడబడ్డారు. నిధులు అని చెప్పబోయి సంస్థలు అని చెప్పారు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పి.. 87 ప్రాంతాల నుంచి ఆన్లైన్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశామని చెప్పుకొచ్చారు. ఏపీఐఐసీలో ఇప్పటివరకు 25 ఇంజినీరింగ్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఆ వెంటనే 1,595 ఎంఎస్ఎంఈలకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. మళ్లీ ఈ వారంలో 99 కంపెనీలకు శంకుస్థాపన చేశామన్నారు. చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలకు ఒక దానితో ఒకటి పొంతన లేకపోవడంతో జనాలకు అర్థంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, ఉపాధి అని అంకెల గారడీ చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం చేస్తానని గొప్పలు పోయారు.సెల్ఫోన్ గురించి మాట్లాడితే.. నన్ను 420 అన్నారు30 ఏళ్ల క్రితం హైదరాబాద్కు టెక్నాలజీని తానే తెచ్చానని, దీనివల్లే హైదరాబాద్కు దేశంలోనే అత్యధికంగా తలసరి ఆదాయం వస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పట్లో సెల్ఫోన్ గురించి మాట్లాడితే తనను కొందరు 420 అన్నారని.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలను తానే తెచ్చానని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని కూడా తానే తీసుకొస్తున్నానని, భవిష్యత్ మొత్తం టెక్నాలజీదేనని గొప్పలు వల్లెవేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అర్థం కావట్లేదుతనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సుపరిపాలన తెస్తానని చెప్పినట్టుగానే ఏ పని కావాలన్నా సెల్ ఫోన్లో అయిపోయేలా చేశా. ఏఐ పెడుతున్నాం. మీ ఇంటి పక్కనే ఉండే ఎమ్మార్వో ఆఫీసులో పని కూడా ఇంట్లో ఉంటే అయిపోయేలా టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. అన్ని విషయాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా మిమ్మల్నే అడుగుతున్నా. ఇంటికి వచ్చే గ్యాస్ ఇచ్చి బాయ్ ప్రవర్తన బాగుందా? లేదా? బాయ్ డబ్బులు అడుగుతున్నాడా అని కూడా అడుగుతున్నా. ఏ చిన్న పని అయినా ప్రజలను అడిగి మీరు శభాష్ అన్నాకే అది చేస్తున్నా. లేదంటే పక్కన పెడుతున్నా’ అని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే..‘బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అనేలా నేనే ప్రమోట్ చేశా. ప్రపంచానికి పరిచయం చేశా. దూరదృష్టితోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీ పక్కన విమానాశ్రయం కట్టాను. అవుటర్ రింగ్ రోడ్డుతో అక్కడి లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్ అభివృద్ధికి కష్టపడ్డా. అవుటర్ రింగ్రోడ్డు, ఫార్మా, హైటెక్ ఐటీ ఇలా హైదరాబాద్లో అన్నీ నేనే చేశా. హైదరాబాద్లో ఐటీతో ప్రారంభించా. ఏపీలో గూగుల్తో ప్రారంభించా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 18 నెలల పాలనలో పెట్టుబడుల వరద వస్తోంది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. విశాఖ సీఐఐ సదస్సులో మరో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అబ్దుల్ హక్ అవార్డులతోపాటు ఉర్దూ భాషాభివృది్ధకి పాటుపడుతున్న సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. -
నకిలీ మద్యం కేసులో బెయిల్ పిటిషన్లపై కౌంటర్కు ఆదేశం
విజయవాడలీగల్/ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఏ–1 అద్దేపల్లి జనార్ధనరావు, ఏ–2 అద్దేపల్లి జగన్మోహనరావు, ఏ–4 నకిరికంటి రవి, ఏ–7 బాదల్ దాస్, ఏ–8 ప్రదీప్ దాస్, ఏ–11 శ్రీనివాసరెడ్డి, ఏ–12 అంగలూరు కళ్యాణ్, ఏ–13 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఏ–17 చెక్కా సతీష్కుమార్ల బెయిల్ పిటిషన్లపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని 6వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్బాబు ఆదేశిస్తూ ఈనెల 13కి వాయిదా వేశారు. కస్టడీకి అనుమతినకిలీ మద్యం కేసులో ఏ–17గా ఉన్న చెక్కా సతీష్కుమార్ను విచారించేందుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఐదు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇదే కేసులో అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావులను మరోసారి కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జనార్దనరావు, విజయవాడ జైలులో జగన్మోహన్రావు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 17కి వాయిదా వేశారు. ఈ కేసులో ఏ–18 జోగి రమేష్, ఏ–19 జోగి రాములను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు. అలాగే నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జోగి రమేష్ జైలులో ములాఖత్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు మంగళవారం ముగియడంతో న్యాయమూర్తి తీర్పును ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు.ముగిసిన పోలీసు కస్టడీనకిలీ మద్యం కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న బాదల్దాస్, ప్రదీప్దాస్, శ్రీనివాసరెడ్డి, అంగలూరు కళ్యాణ్, నకిరికంటి రవి, రమేష్బాబు, అల్లాభక్షుల ఐదు రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగియడంతో ఎక్సైజ్ పోలీసులు న్యాయస్ధానంలొ హాజరుపరిచారు. అనంతరం వారిని జైళ్లకు తరలించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పీటీ వారెంట్కు కోర్టు అనుమతిరాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయిన నలుగురు నిందితులపై పీటీ వారెంట్కు మంగళవారం కోర్టు అనుమతించింది. ములకలచెరువు కేసులో ఏ2 కట్టారాజు, ఏ3 సయ్యద్ హాజీ, ఏ10 మిథున్దాస్, ఏ11 అంతాదాస్ మదనపల్లి సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. విజయవాడ ఇబ్రహింపట్నంలో నమోదైన నకిలీ మద్యం కేసులోనూ వీరు నిందితులుగా ఉండడంతో విజయవాడ భవానీపురం పోలీసులు వీరిని తీసుకెళ్లేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తంబళ్లపల్లె జడ్జి వారికి రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికి 21 మంది అరెస్టుములకలచెరువు నకిలీ మద్యం కేసులో 25 మందిని నిందితులుగా చేర్చి 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక టీడీపీ నేతలు దాసరపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్, అన్బురసులను అరెస్టు చేయాల్సి ఉంది.నిడుగుంట అరుణ కస్టడీ పిటిషన్ వాయిదాప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలుచేసి మోసం చేసిన కేసులో నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్న నిడిగుంట అరుణను(నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ పొందిన జీవితఖైదు శ్రీకాంత్ సన్నిహితురాలు) పోలీసు కస్టడీ విచారణకు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను న్యాయమూర్తి 12వ తేదీకి వాయిదా వేశారు. -
డిసెంబర్లో రెండు ప్రయోగాలు
సూళ్లూరుపేట: ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు రాకెట్ ప్రయోగాలే చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ నెలలో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. రెండోవారంలో ఎల్వీఎం3 మార్క్–6 రాకెట్ ద్వారా బ్లాక్–2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని, చివరివారంలో పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ద్వారా ఓషన్శాట్–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్లోని రెండో ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో ఇస్రో బాహుబలి రాకెట్గా పేరుగాంచిన ఎల్వీఎం3 మార్క్–6 రాకెట్ అనుసంధానం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని టెక్సాస్లో ఉన్న ఏఎస్టీ స్పేస్ మొబైల్ రూపొందించిన 6,500 కిలోల బరువు కలిగిన బ్లాక్–2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి సంబంధించి అమెరికన్ శాస్త్రవేత్తలు షార్లో రాకెట్ అనుసంధానం పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇస్రో చరిత్రలో 6,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సాంకేతిక విప్లవం... బ్లాక్–2 బ్లూబర్డ్ టెక్సాస్లోని ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ ఉపగ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పనిచేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల వినూత్నమైన యాంటెన్నా ఉంది. ఇది ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్కు ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధారపడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్ యూఎస్ఏలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపికచేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యులార్ బ్రాండ్బ్యాండ్ సేవలు అందించాలన్నదే లక్ష్యంగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 1,800 కిలోల బరువున్న ఓషన్శాట్–3ఏ డిసెంబర్ ఆఖరువారంలో ప్రయోగించే పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు మొదటి ప్రయోగవేదికకు అనుసంధానంగా ఉన్న పిఫ్ బిల్డింగ్లో జరుగుతున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1,800 కిలోల బరువున్న ఓషన్శాట్–3ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్లను షెడ్యూల్ చేసిన తేదీల్లో ప్రయోగించలేకపోవడంతో రెండు ప్రయోగాలను డిసెంబర్లోనే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది రాకెట్ ప్రయోగాల జోరు తగ్గింది. జనవరి తరువాత మూడునెలలు ప్రయోగాలే లేవు. మే, జూలై నెలల్లో రెండు ప్రయోగాలు చేశారు. ఆ తరువాత మూడునెలలు ప్రయోగాలకు బ్రేక్పడింది. ఈ నెల 2న ఒక రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. అంటే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే చేశారు. -
మంత్రివర్యులూ.. ప్రత్యేక విమానాల్లోనే..
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు సర్కార్లో అందరూ ‘ప్రత్యేక’ విమానమే ఎక్కుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండగా..తామేం తక్కువ కాదంటూ మంత్రులూ ఇప్పుడు ప్రజాధనంతో ‘ప్రత్యేక’ బాట పట్టారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో వేసిన కమిటీలో సవిత, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ ఉన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష కోసం మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం పుట్టపర్తికి వచ్చి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తిరుగు ప్రయాణంలోనూ ప్రత్యేక విమానాన్నే ఉపయోగించారు. కాగా, ప్రత్యేక విమాన ప్రయాణ అవకాశం రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తుండటం గమనార్హం. -
‘కాశీబుగ్గ’ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
శ్రీకాకుళం: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందజేస్తోంది. సోమవారం పలు కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున చెక్లను అందించగా, మంగళవారం కూడా పలువురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన నిఖిల్ కుటుంబ సభ్యులకు, వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటలో మురిపింటి నీలమ్మ కుటుంబ సభ్యులకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన డొక్కరి అమ్ముడమ్మ కుటుంబ సభ్యులకు, అలాగే మందస మండలం మందస గ్రామానికి చెందిన బోర బృందావతి, బెల్లు పట్టియా గ్రామానికి చెందిన దువ్వ రాజేశ్వరి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత గోదాం నుంచే గో మాంసం ప్యాకింగ్!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతకు చెందిన గోదాంలో దాదాపు 200 టన్నుల గో మాంసం పట్టుబడిన సంచలన కేసు నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ తెరపైకి తెస్తోంది. లడ్డూ నెయ్యి కల్తీ అంటూ అనవసర రాద్ధాంతానికి దిగుతూ... గో మాంసం కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అనుచరుడు, టీడీపీ కీలక నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన విశాఖ శివారు శొంఠ్యాంలోని శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజీలోనే గోమాంసం దొరకడంతో చంద్రబాబు సర్కారు ఉలిక్కిపడింది. అంతే, ఆ వెంటనే అసలు ఏమీ లేని కల్తీ నెయ్యి కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది. ఓవైపు విశాఖ గోదాం నుంచి అరబ్ దేశాలకు ఎగుమతికి సిద్ధం చేసిన 189 టన్నుల గో మాంసం దొరికిన కేసులో విచారణను జాప్యం చేస్తూ... మరోవైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు కూడా దర్యాప్తు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. వాస్తవానికి నెల నుంచి సాగుతున్న ఈ గో మాంసం సీజ్ కేసులో విస్తుపోయే వాస్తవాలున్నాయి.అసలు ఏం జరిగిందంటే?అక్టోబరు 3న శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిషేధిత పశుమాంసం ఉన్నట్లు విజిలెన్స్కు సమాచారం అందగా పశు సంవర్థక శాఖకు సమాచారం ఇచ్చి శాంపిల్స్ తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు ఆరు శాంపిల్స్ తీసి అక్టోబరు 5న ఫోరెన్సిక్కు పంపారు. గత నెలాఖరునే మెయిల్ ద్వారా రిపోర్టులు ఇచ్చారు. ఆరు శాంపిళ్లలో మూడింట్లో నిషేధిత గో మాంసం ఉన్నట్లుగా వెల్లడైంది. మిగిలిన రెండింట్లో ఎద్దు మాంసం, ఒకదాంట్లో గేదె మాంసం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో నిషేధిత గో మాంసం ఉందని విజిలెన్స్కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3న పశు సంవర్థక శాఖ, విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో కలిసి విశాఖ ఆనందపురం పోలీసులు సోదాలు చేశారు. అనుమతుల్లేని 189 టన్నుల గో మాంసం ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. దీన్ని 9,921 కంటైనింగ్ బాక్సుల్లో ప్యాక్ చేసి నిల్వ ఉంచారు. ఏ పత్రాలు లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అబ్దుల్ గఫూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోమాంసాన్ని సీజ్ చేశారు. ఇక ఇక్కడినుంచి చంద్రబాబు ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టింది.ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని..అక్టోబరు 3వ తేదీన దాడులు జరిగి సీజ్ చేస్తే... 4వ తేదీ సాయంత్రం వరకు సమాచారం బయటకు రాలేదు. ఓవైపు సనాతన ధర్మం అంటూ హడావుడి చేస్తుండగా, రాష్ట్ర చరిత్రలోనే భారీఎత్తున నిషేధిత గోమాంసం పట్టుబడడంతో చెడ్డ పేరు వస్తుందని టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. బయటికి రాకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ, స్థానికులు కొందరు శొంఠ్యాంలో గోమాంసం పట్టుబడిందని ప్రచారం చేయడంతో ఒక్కసారిగా గుప్పుమంది. చేసేదిలేక...4వ తేదీన పోలీసులు విషయాలను బహిర్గతం చేసి కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రిజిస్టర్డ్ కంపెనీ మెష్ ఓవర్సీస్ సంస్థ ఈ పశుమాంసాన్ని తీసుకొచ్చినట్లు గుర్తించి అక్కడి డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. 8వ తేదీన పోస్టు ద్వారా ఫోరెన్సిక్ నివేదికలు పశుసంవర్థక శాఖకు చేరగా 10న ఆనందపురం పోలీస్స్టేషన్కు అందజేసినట్లు తెలుస్తోంది.గేదె మాంసానికి అనుమతి.. ఎగుమతి గో మాంసం సుబ్రహ్మణ్య గుప్తా గేదె మాంసం అని చెప్పి అనుమతులు పొంది కొంతకాలంగా అనధికారికంగా నిషేదిత గో మాంసం నిల్వ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన గో మాంసం సెప్టెంబర్ 24న ప్యాక్ అయి విశాఖ చేరుకుంది. ఇక్కడి నుంచి యూఏఈకి చెందిన సాదియా ఫుడ్స్ సంస్థతో కలిసి యూఏఈ, ఖతర్, కువైట్, బహ్రయిన్, సౌదీ అరేబియా, ఒమన్, వియత్నాంకు ఎగుమతి చేస్తుంటారు. కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం జరుగుతోందని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.గో మాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు కల్తీ నెయ్యి వ్యవహారంహిందుత్వాన్ని తామే ఉద్ధరిస్తున్నామంటూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి గోమాంసం పట్టుబడడం తీవ్ర సంకటంగా మారింది. దీంతో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. భారీగా గోమాంసం పట్టుకున్నారన్న విషయం తెలిస్తే పరువు పోతుందని.. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం పేరుతో మరోమారు తప్పుడు ఆరోపణలు మొదలు పెట్టారు. మరోవైపు.. గోమాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు బ్రేక్ వేసింది. మరోవైపు.. భారీగా నిషేదిత గోమాంసం.. కంటైనర్ల ద్వారా పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకేనని తెలుసుకున్న డీఆర్ఐ తమకు కేసును అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరగా తమ పోలీసులే విచారణ చేస్తారని వారిని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు.. గోడౌన్ యజమాని అయిన టీడీపీ నేతను తప్పించి.. కేవలం మెష్ ఓవర్సీస్ సంస్థదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించి.. కేసుని క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.నన్నెందుకు అడుగుతారంటున్న సీపీ.!రాష్ట్రంలో ఇంత భారీగా గోమాంసం పట్టుబడి సంచలనం సృష్టించిన కేసు విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయంపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని ‘సాక్షి’ ప్రశ్నించగా.. సీఐని అడగమని బదులిచ్చారు. సీఐ స్పందించడం లేదని చెప్పగా.. ఏసీపీని.. ఆయనా కాదంటే డీసీపీని అడగండి.. నన్నెందుకు అడుగుతారంటూ మాట దాటవేశారు. ఇదంతా చూస్తుంటే కేసు విచారణకు బ్రేక్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నదో అర్థమవుతోంది. ఆనందపురం సీఐ వాసునాయుడిని అడిగితే.. ఇంతకంటే ప్రాధాన్యమున్న కేసులు, ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి.. వాటిపైనే దృష్టిసారించామని, ఆ తర్వాతే దీనిగురించి అని చెప్పడం గమనార్హం.మైనార్టీలను అడ్డం పెట్టుకుని...విశాఖలోని కోల్డ్ స్టోరేజీని సుబ్రహ్మణ్యగుప్తా ఉరఫ్ చిన్నా ఎనిమిదేళ్లుగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రొయ్యల ఎగుమతులు చేసే సమయంలో ప్రస్తుత బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రమంగా నష్టాలు రావడంతో వర్మ తప్పుకొన్నారు. ఇతర వ్యాపారాలను సుబ్రహ్మణ్యగుప్తా కొనసాగిస్తున్నారు. బాపట్ల ఇస్లాంపేటకు చెందిన మైనార్టీల పేరుతో పశుమాంసం ఎగుమతులకు అనుమతులు పొందారు. తొలుత గల్ఫ్ దేశాలకు ఎద్దు, గేదె మాంసం ఎగుమతి చేసేవారు. నిషేధిత గో మాంసం ఎగుమతితో లాభాలు బాగా వస్తాయని అక్రమంగా ఎగుమతులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గుప్తాకు టీడీపీ నేతల మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు.సీజ్ ద కోల్డ్ స్టోరేజ్ అని పవన్ ఎందుకు చెప్పలేదు?గోమాంసం అక్రమరవాణా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ నాయకుల అండదండలతోనే నడుస్తోంది. ఎవరి వాటా వాళ్లకు అందుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా.. విశాఖలో స్వయంభూ దేవాలయాలకు దగ్గర్లో దొరికినా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఇదంతా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హిందువుల మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. గోమాంసం పట్టుబడడంపై ఇంకా స్పందించడం లేదంటే ఏమనుకోవాలి. పశుసంవర్థక శాఖ మంత్రి, హోం మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు? సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు.? బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే సీజ్ ద షిప్ అని చెప్పిన ఆయన... సీజ్ ద కోల్డ్ స్టోరేజ్ అని ఎందుకు అనలేదు.? ప్రభుత్వం ఏమీ మాట్లాడనివ్వడం లేదా? – విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై.. కోటి గళాల గర్జన
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు.. రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు నోటీసు ఇస్తున్న పోలీసు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదుసాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. -
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోయిన రైతు
తిరుపతి: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలంలోని ఎగువ రెడ్డిపల్లికి చెందిన రైతు తన పిల్లల చదువుల కోసం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయితీలోని శ్రీవాణి నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే రైతు ఫోన్ నెంబర్ వాట్సప్కు PMJY కిసాన్ యోజన పథకం పేరుతో ఉన్న లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయడంతో వ్యక్తిగత వివరాలను అడిగిన సైబర్ నేరగాళ్లకు తన వివరాలు తెలిపాడు రైతు. దాంతో రైతు అకౌంట్లో ఉన్న 10 లక్షల 81 వేల రూపాయలలో 7.50 లక్షల నగదు విత్ డ్రా అయినట్టు రైతు ఫోన్కు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ నుండి 7.50 లక్షల నగదు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని గ్రహించిన బాధితుడు.వెంటనే 1930కు కాల్ చేసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాడు. తను మోసపోయినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు. సైబర్ నేరగాళ్లను చేధించే పనిలో పడ్డారు. -
బయటపడ్డ కిడ్నీ రాకెట్
అన్నమయ్య జిల్లా: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలన రేపుతోంది. యమున అనే మహిళ మిస్సింగ్ కేసు ఎపిసోడ్తో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త మధుబాబు 112 తిరుపతికి కాల్ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్కు ఎండార్స్ చేశారు పోలీసులు.సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ను ట్రేస్ చేశారు పోలీసులు. దాంతో గ్లోబల్ హాస్పిటల్లో పద్మ కిడ్నీలను తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది. మరొకవైపు యమునతో పాటు తీసుకొచ్చిన మరో మహిళ ఆచూకీ కోసం పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కిడ్నీ రాకెట్ ఉదంతంపై మదనపల్లి 2 టౌన్ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ధైర్యముంటే లడ్డూ అంశంపై సీబీఐ విచారణ జరపాలి: సజ్జల
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు.వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకునే ఇవన్నీ చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం రాద్దాంతంపై సజ్జల సంధించిన ప్రశ్నలు..రిమాండ్ రిపోర్టు చూస్తే 2024లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ రెండో వారంలో ధర్మారెడ్డిని మీరు తొలగిచిన తర్వాత, వెంటనే శ్యామలరావును పెట్టుకున్నారు. ఇది జరిగిన తర్వాత జులై మొదటివారంలో ట్యాంకర్లలో వచ్చిన నేయిని పరీక్షలకోసం ఎన్డీడీబీకి పంపారు. రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు తిరిగి ఆగస్టులో మళ్లీ వచ్చాయి, వాటిని నేయి తయారీకి వాడారని చెప్తున్నారు. అంటే తప్పు ఎవరిది అవుతుంది? ఆరోపణలు వచ్చిన ట్యాంకర్లన్నీకూడా చంద్రబాబు పరిపాలనా కాలంలోనే కదా సప్లై అయినవి?పాలు లేకుండా నేయి తయారైందని అంటున్నారు. అలాంటప్పుడు ఏ ట్యాంకర్ కూడా పరీక్షల్లో ప్యాస్ కాకూడదు కదా? నేయిలో కల్తీ జరిగితే.. మేనేజ్ చేశారను అనుకుందాం.. అసలు నేయి లేకుండానే కెమికల్స్తో ఆర్టిఫిషయల్ నేయి తయారు చేశారన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో రాశారు. ఇన్ని లక్షలమంది భక్తులు, ఇన్ని వందలాదిమంది తయారీదారులు.. నిజంగా కనిపెట్టలేకపోయారా? అసలు అలా తయారు చేసిన లడ్డూ నిల్వ సాధ్యమేనా? ఇవన్నీ సామాన్యులకు వస్తున్న సందేహాలు. రిమాండ్ రిపోర్టులో చూస్తే.. మార్చి 27, 2025 నాటి ఎన్డీడీబీ రిపోర్టు అని కోట్ చేస్తూ.. నేయి శాంపిళ్లను పరిశీలిస్తే.. పామాయిల్, పామ్ స్టెరిన్, పామ్ కెన్నెల్ ఆయిల్ కలిసిందని నువ్వే చెప్తున్నావు, అంటే చంద్రబాబు వచ్చిన 8 నెలల తర్వాతకూడా, పైగా తిరుమల లడ్డూపై సెప్టెంబరులో చంద్రబాబు కామెంట్లు చేసిన తర్వాత కూడా ఇలాంటి రిపోర్టు వస్తే దానికి బాధ్యత చంద్రబాబుదే కదా? ఈ ప్రభుత్వానిదే కదా? దాన్ని కూడా ఏరకంగా మరొకర్ని తప్పుబడతారు. మా హయాంలో కేజీ నేయి రూ.319లకు కొంటే తప్పుబట్టారు. కాని చంద్రబాబు హయాంలో రేట్లు చూస్తే.. రూ.273, 276, 279, 295, 285గా ఉన్నాయి. మరి దాని అర్థం చంద్రబాబుగారి హయాంలో నేయిలో బాగా కల్తీ ఉందనేదిగా దాని అర్థం? వాళ్ల సిద్ధాంతం ప్రకారమే ఇది వాస్తవమే కదా మరి?ఇదీ చదవండి: ‘ఎందుకీ ఆరోపణలు.. ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?’ -
చదువు వలనే సమాజంలో గౌరవం..
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ ఎస్ఎస్సీ-2025లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నంద్యాల విద్యార్థిని ఇష్రత్ కలిశారు. దీనిలో భాగంగా ఎస్ఎస్సీలో 600 మార్కులకు 599 మార్కులు సాధించిన ఇష్రత్ను వైఎస్ జగన్ అభినందించారు. ఇష్రత్ను అభినందించడంతో పాటు లక్ష రూపాయిలు ప్రోత్సాహం కూడా అందించారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ ప్రతి విద్యార్థిని చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుంది. ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి. చదువు వలనే సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతీ విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాం..
తాడేపల్లి :ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు(బుధవారం, నవంబర్ 12వ తేదీ) వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రేపు చేపట్టే ర్యాలీల ద్వారా ప్రజాస్పందనను గట్టిగా వినిపిద్దామన్నారు సజ్జల. ఈ మేరకు మంగళవారం(నవంబర్11వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు గట్టిగా పోరాటం చేద్దాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలదలో కేంద్రాల్లో ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలి. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం,. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం. అందరి భాగస్వామ్యం వలనే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీల గురించి జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘ఎందుకీ ఆరోపణలు.. ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?’
తాడేపల్లి : తిరుమల లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వ్యాఖ్యలు ఆధారాల్లేని ఆరోపణలేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి లాగటం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈరోజు(మంగళవారం, నవంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ లడ్డూ విషయంలో ఏమీ జరగక పోయినా జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?, పదేపదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?, సిట్ను కూడా పక్కదారి పట్టించేలా లోకేష్ ట్వీట్ లు పెడుతున్నారు. రాజకీయాలలోకి దేవుడ్ని లాగవద్దని సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. అయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బుద్ది మారలేదు. ఆలయాల్లో అపచారాలు చేసి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు. చంద్రబాబు సర్కార్ పాలనలో భక్తులకు రక్షణ లేదు. ఆలయాలకు వెళ్తే తొక్కిసలాటలో చనిపోతున్నారు. టీటీడీలోనైతే గతంలో జరగనన్ని అపచారాలు జరుగుతున్నాయి. డైవర్షన్ కోసం వెంటనే లడ్డూ విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఈవో శ్యామలరావే లడ్డూ నాణ్యత బాగుందని కితాబిచ్చారు. మళ్ళీ ఆయనే స్వరం మార్చి ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ మీద ఆరోపణలు చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటం దారుణం. తొలుత జంతువుల కొవ్వు అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ రసాయనాలు కలిశాయని లోకేష్ ట్వీట్ చేశారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టే స్వయంగా ప్రశ్నించింది. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో రిట్ వేసి లడ్డూ విషయమై విచారణ కోరారు. సిట్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హిందూ భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?, ఆధారాలు లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?, నిజంగా ఆధారాలు ఉంటే సిట్ అధికారులు ప్రెస్మీట్ పెట్టి ఎందుకు చెప్పటం లేదు?, కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయటం దేవుడిని రాజకీయాలలోకి ఎందుకు తెస్తున్నారు?, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించటం చేతకాని ప్రభుత్వం ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తోంది’ అని ధ్వజమెత్తారు. -
ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద ఘటన జరిగింది. వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.రహదారిపై ఉన్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. టాటా ఏస్ వాహనంతో పాటుగా మూడు బైకులను ఢీకొట్టింది. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.‘‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. "భారత రత్న" మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం.మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/rKD6LTwvNb— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2025 -
మృత్యువుతో పోరాడి.. తుది శ్వాస విడిచి
కాకినాడ క్రైం / జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరం జాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్లో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీనితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదానికి గురైన చైతన్యకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటికే కాకినాడ జీజీహెచ్కు తరలించగా, ఆమెను తొలుత అత్యవసర విభాగంలో ఉన్న సీఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆర్ఐసీయూ–2లో చేర్చారు. కాళ్లు రెండూ ఛిద్రమవడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో కాలి నుంచి ఇన్ఫెక్షన్ శరీరానికి వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆదివారం దుర్గాచైతన్య ఎడమ కాలిని తొలగించారు. ఎమర్జెన్సీ ఓటీలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి పూర్తయ్యింది. అనంతరం ఆమెను ఆర్ఐసీయూ–1కి తరలించి పరిశీలనలో ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో దుర్గాచైతన్య ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్కు గురైంది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చైతన్య చివరికి ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని వయసులో చేయని తప్పుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన బాలిక దయనీయ స్థితి వైద్య సిబ్బందితో కన్నీళ్లు పెట్టించింది.ఇర్రిపాకలో విషాదంనిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాచైతన్యది జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. ఆమె తండ్రి సన్యాసిరావు, తల్లి కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాచైతన్య పెద్ద కుమార్తె. సన్యాసిరావు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను తనలా కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని ఎంతో ఆశపడేవాడు. అందుకే కాకినాడలో పెద్ద కుమార్తెను నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. ఆమె ఉద్యోగంలో స్థిరపడితే తన కాళ్లపై తాను నిలబడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి దుర్గాచైతన్య మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
చంద్రకళ జీవితంలో చీకట్లు నింపిన టీడీపీ నాయకుడు
ఆమె పేరులో ఉన్న ‘కళ’ను జీవితంలో లేకుండా చేశారు. వేధించి, దాడి చేసి, అవమానపరచి జీవచ్ఛవంలా మార్చేశారు. ఇంత జరిగినా వారి ఆక్రోశం మాత్రం చల్లారలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నారు. కాస్త దయ చూపమంటూ ‘పెద్ద’లను ఆశ్రయిస్తే పట్టించుకోలేదు.. సరికదా వెక్కిరిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన ఖాకీలు దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతుండడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ, చిన్నా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుటుంబం సంతోషంగా జీవనం సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్నుపడింది. కోరిక తీర్చాలంటూ వెంటపడడం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలంటూ రామాంజినేయులును చంద్రకళ హెచ్చరించింది. విషయం తెలుసుకున్న రామాంజినేయులు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. రామాంజినేయులు భార్య లక్ష్మీ , బంధువులు గాయత్రి, రామకృష్ణ, శిరీష, రమేష్ కలిసి చంద్రకళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. విషయంపై బాధితులు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఎనిమిది నెలల క్రితం ఇంట్లో యాసిడ్ తాగింది. జీవచ్ఛవంలా.. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రకళను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. దాదాపు 8 నెలలు వెంటిలేటర్పై కొట్టుమిట్టాడిన చంద్రకళ ప్రాణం ఎలాగోలా నిలిచింది. అయితే, అప్పటికే ఆస్పత్రిలో చికిత్సల కోసం బాధిత కుటుంబం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసింది. దొరికిన చోటల్లా అప్పు చేసి, ఉన్నవన్నీ కుదువ పెట్టి డబ్బు సమకూర్చారు. అయితే, ఇంకో రూ. 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో దిక్కుతోచలేదు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రకళ ప్రస్తుతం నేరుగా ఆహారం తీసుకోలేకపోతోంది. బాగా చిక్కిపోయి జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తున్నారు. అలా చేస్తేనే సాయమట! ఇటీవల బాధితురాలి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆశ్రయించారు. అయితే, బాధితులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలుసుకున్న ఆయన.. టీడీపీలోకి వస్తే వైద్య ఖర్చులకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుకోండి’ అంటూ టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారని చంద్రకళ కుటుంబ సభ్యులు వాపోయారు. పట్టించుకోని పోలీసులు.. చంద్రకళ ఫిర్యాదు చేసిన సమయంలో పట్టించుకోని పోలీసులు.. ఆమె యాసిడ్ తాగాక అప్రమత్తమై టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి, గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను పంపించేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ప్రశి్నస్తే.. తమకు ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని, విసిగించకుండా వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని వారు వాపోతున్నారు. ఆగని వేధింపులు... తమ పార్టీ నాయకులపై పెట్టిన కేసుకు సంబంధించి చంద్రకళ కుటుంబీకులపై ఇటీవల టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కేసు రాజీ కావాలంటూ టీడీపీ నేతలు తిమ్మరాజు, వైపీ రమేష్ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. చెప్పినట్లు వినకుంటే మీరే దాడి చేశారంటూ ఫిర్యాదు చేయించి మీపైనే కేసు నమోదు చేయిస్తామని వేధిస్తుండడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.కాపాడండి.. నా కుమార్తెపై టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. వారు ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నా కుమార్తె జీవితం చిన్నాభిన్నమైంది. అయినా టీడీపీ నేతలు, పోలీసులు వేధింపులు ఆపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. దయ ఉన్న మారాజులు స్పందించి నా కుమార్తె ఆస్పత్రి ఖర్చులకు సాయం చేయాలని చేతులు జోడించి కోరుతున్నా. – బయన్న, చంద్రకళ తండ్రి -
ఒక్క రోజులో 12 చోరీలు చేసిన ‘భీమవరం బుల్లోళ్లు’
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముఠా...నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 12 నేరాలు చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా ‘పని’ ముగించింది. వీరి కోసం రంగంలోకి దిగిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ చోరుడు ధరించిన పసు పు రంగు చెప్పులే కీలక ఆధారంగా అధికారులు ముందుకు వెళ్లారు. ఈ గ్యాంగ్పై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు డీసీపీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, కె.శ్రీకాంత్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. మేలో అరెస్టు... అక్టోబర్లో బెయిల్... భీమవరానికి చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు ఈ గ్యాంగ్కు లీడర్గా ఉన్నాడు. కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్న ఇతడిపై ఏపీలోని వివిధ ఠాణాల్లో 41 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మేలో పి.గన్నవరం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి అక్టోబర్లో బెయిల్పై బయటకు వచ్చాడు. ఆపై తమ ప్రాంతానికే చెందిన పాత నేరగాళ్లు దాగారపు ఎల్యజూర్ (గతంలో 30 కేసులు), మారుబోయిన మావుళ్లు (గతంలో 6 కేసులు), గండ్రెడ్డి లోకే‹Ùలతో (గతంలో 16 కేసులు) కలిసి ముఠా కట్టాడు. హైదరాబాద్ను టార్గెట్గా చేసుకుని వచ్చిన వీళ్లు నాదర్గుల్ సమీపంలోని కమ్మగూడలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 5న నందిగామ వెళ్లిన వీళ్లు అక్కడ బైక్ చోరీ చేశారు. దానిపై ఇద్దరు, బస్సులో ఇద్దరు చొప్పున నగరానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి వరుస పెట్టి చోరీలు చేయడానికి నిర్ణయించుకున్నారు. నాలుగున్నర గంటల్లో పది చోట్ల... ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కమ్మగూడ నుంచి ఒకే బైక్పై బయలుదేరిన ఈ నలుగురూ హయత్నగర్ వెళ్లారు. అక్కడ మరో బైక్ తస్కరించి ఒక్కో దానిపై ఇద్దరు చొప్పున మొదలయ్యారు. తెల్లవారుజామున 1.20–1.40 గంటల మధ్యలో సరూర్నగర్లోని మూడు దుకాణాల్లో, అట్నుంచి సైదాబాద్ వెళ్లి 1.50–2.15 గంటల మధ్య రెండు దుకాణాల్లో, ఆపై బేగంబజార్ చేరుకుని 3.01–3.15 గంటల మధ్య ఓ దేవాలయంలో, అక్కడ నుంచి సుల్తాన్బజార్ వెళ్లి 3.45–4 గంటల మధ్య మరో దేవాలయంలో, చివరకు ఐఎస్ సదన్ వచ్చి 4.15–4.30 గంటల మధ్య దేవాలయం, దుకాణంలో చోరీలు చేశారు. ఆపై తమ షెల్టర్కు వెళ్లి మిన్నకుండిపోయారు. వీరికి ప్రతి చోరీలో చిల్లర నాణాలు, కొద్దిపాటి కరెన్సీ నోట్లు మాత్రమే దక్కాయి. ఐఎస్ సదన్లోని దేవాలయంలో జరిగిన చోరీని సీరియస్గా తీసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. లైట్ల వెలుగులో విభిన్నంగా కనిపించి... ఈ గ్యాంగ్ను పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మధు తమ బృందాలతో రంగంలోకి దిగారు. ఘటనాస్థలాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను సేకరించి అధ్యయనం చేశారు. అయితే ఎక్కడా నేరగాళ్లు ముఖాలు, వాహనాల నెంబర్లు స్పష్టంగా నమోదు కాలేదు. ఓ నేరగాడు ధరించిన పసుపు రంగు చెప్పులు మాత్రం రాత్రి వేళ లైటింగ్కు విభిన్నంగా కనిపించాయి. దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ వీరి వాహనం వెనుక మరో వాహనం నడిచింది. ఈ ఆ«ధారంగా ముందుకు వెళ్లిన టాస్్కఫోర్స్ బృందం సోమవారం నాదర్గుల్ వరకు వెళ్లి కాపుకాసింది. అక్కడ ఓ మద్యం దుకాణం వద్దకు పసుపు చెప్పులు వేసుకున్న నేరగాడే రావడంతో గుర్తించి పట్టుకుంది. ఇతడిచి్చన సమాచారంతో అద్దె ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు నేరగాళ్లుతో పాటు వీరికి సహకరిస్తున్న మహిళ కె.రజ్జి, ఓ మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సొమ్ముతో పాటు వాహనాలు, స్రూ్కడ్రైవర్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. -
చంద్రబాబు ఎవరు?
అనపర్తి : ‘చంద్రబాబు ఎవరు? చంద్రబాబుకు కూడా సమయం ఇవ్వాల్సింది నేనే’.. అంటూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.చంద్రబాబునాయుడు తనకు సమయం కేటాయిస్తే శాసనసభ సమావేశాలకు రావడానికి సిద్ధమని జగన్ అంటున్నారని విలేకర్లు ప్రశ్నించగా.. అయ్యన్న పైవిధంగా వ్యాఖ్యానించారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడంలేదంటూ చాలా మంది తనను ప్రశి్నస్తున్నారని, ఆయన రాకపోతే తనకేం సంబంధమని అసహనం వ్యక్తంచేశారు. జగన్మోహనరెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, సాధారణ ఎమ్మెల్యేలకు ఇచి్చనట్లుగానే ఆయనకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. -
ఫ్యాన్సీ పాస్వర్డ్.. 123456
123456..ఫ్యాన్సీ నంబరు కదా.. ఇది చూడగానే పెదవిపై ఓ చిరునవ్వు.. అంతేనా.. చాలామంది కళ్లు కాస్త పెద్దవిగా కూడా అయి ఉంటాయి. ఎందుకంటే లక్షలాది మంది ఈ నంబరును ఆన్లైన్ ఖాతాలకు పాస్వర్డ్గా పెట్టుకున్నారు కాబట్టి. ఈ జాబితాలో మీరూ ఉంటే కచ్చితంగా పాస్వర్డ్ మార్చుకోవాల్సిందే. యూకేకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘కంపేరిటెక్’ఓ ఆసక్తికర నివేదికను రూపొందించింది.2025లో డేటా బ్రీచ్ ఫోరమ్స్లో లీక్ అయిన 200 కోట్లకుపైగా రియల్ అకౌంట్ పాస్వర్డ్స్ను కంపేరిటెక్ సేకరించింది. ఆ డేటా ఆధారంగా అత్యధికంగా ఉపయోగించిన పాస్వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. 123456 పాస్వర్డ్ను ఏకంగా 76,18,192 మంది తమ ఆన్లైన్ ఖాతాలకు ఉపయోగిస్తున్నారు. 12345678ను 36.7 లక్షలు, 123456789ను 28.6 లక్షల మంది వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లోadmin, 1234 పాస్వర్డ్స్ ఉన్నాయి. అత్యధికంగా వినియోగించిన టాప్–100 పాస్వర్డ్స్లో 53వ స్థానాన్ని India@123 ఆక్రమించింది. డేటా బ్రీచ్ ఫోరమ్స్ యూజర్ల సమాచారాన్ని తస్కరించిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తరచూ డార్క్ వెబ్లో కనిపిస్తాయి. ఇవి సైబర్ నేరస్తులు దొంగిలించిన డేటాను పంచుకోవడానికి, కొనుగోలు, విక్రయించడానికి మార్కెట్ ప్లేస్లు, చర్చా కేంద్రాలుగా పనిచేస్తాయి. దొంగిలించిన సమాచారంతో సిద్ధంగా ఉన్న మార్కెట్ను రహస్యంగా అందించడం ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఈ వేదికలు సులభతరం చేస్తాయి. ప్యారిస్లోని లూవ్ (Louvre) మ్యూజియంలో సెక్యూరిటీ సిస్టమ్కు Louvre అనే పదం పాస్వర్డ్గా ఉంది. ఇంత సులభంగా ఉండడం వల్లే దోపిడీ నిమిషాల్లో పూర్తయ్యింది. సుమారు రూ.900 కోట్ల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. కనీసం 12 అక్షరాలు.. పాస్వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండాలని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. సులభంగా గుర్తించే అవకాశం ఇవ్వకుండా చిన్న, పెద్ద అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాల కలయికతో రూపొందించుకోవాలి. కుటుంబ సభ్యులు, వ్యక్తులు, ఉత్పత్తి పేరును పాస్వర్డ్గా ఉపయోగించకపోవడం మంచిది. తద్వారా మరొకరి చేతుల్లోకి పాస్వర్డ్ వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ⇒ 65.8% పాస్వర్డ్స్ 12 అక్షరాల కంటే తక్కువ ఉన్నాయి ⇒ 3.2% ఖాతాలకు 16 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను ఉపయోగించారుబాధితులు కావొద్దు ఇంటికి తాళం వేసినప్పుడు ఒకటికి రెండుసార్లు లాగి సరిగ్గా పడిందా లేదా అని చూస్తుంటాం. అలాంటిది మన కష్టార్జితం అంతా దాచుకున్న బ్యాంకు ఖాతాలు లేదా పేమెంట్ యాప్స్, జీ–మెయిల్ అకౌంట్స్ వంటి ముఖ్యమైన సాధనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆన్లైన్ పాస్వర్డ్ను మరొకరు సులభంగా ఊహించగలిగితే, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఒకే పాస్వర్డ్ను ఉపయోగించే వ్యక్తులు ఎక్కువమంది ఉంటే అటువంటి ఖాతాలను హ్యాకర్లు సులభంగా ఛేదించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏఐ సాధనాలను సైబర్ నేరస్తులు ఆయుధంగా చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నెటిజన్లు జాగ్రత్త పడకపోతే బాధితులుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఊహించడం కష్టంగా, దొంగిలించేందుకు వీలులేని క్లిష్టమైన పాస్వర్డ్ను పెట్టుకోండి అంటూ బ్యాంక్స్, ఆన్లైన్ సేవల కంపెనీలు తరచూ చెప్పేది ఇందుకే. సులభంగా ఊహించేలా.. ⇒ చాలా పాస్వర్డ్స్ను ఆరోహణ లేదా అవరోహణ సంఖ్యలతో.. అంటే వరుస క్రమంలో 12345 లేదా 54321 మాదిరిగా సులభంగా ఊహించేలా ఉంటున్నాయి. ⇒ టాప్–1,000లో నాలుగింట ఒక వంతు పాస్వర్డ్స్ పూర్తిగా సంఖ్యలతోనే పెట్టుకున్నారు. ⇒ 123 అంకెలతో 38.6%, 321తో 2%, abc పాస్వర్డ్తో 3.1% ఖాతాలు ఉన్నాయి. ⇒ 18వ స్థానంలో 111111, 35వ స్థానంలో నిలిచింది. ⇒ 3.9% , password, 2.7% admin, 1% welcome అనే పదాలను కలిగి ఉన్నాయి. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. అనంతరం గతేడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా నానాటికి ఉధృతం అవుతోంది. నిజానికి కేవలం రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో కేవలం రూ. ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతోంది. తెలంగాణలో భవనాల్లేకపోయినా.. 2025–26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొడంగల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవనాలను అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్మించకపోయినా కొడంగల్కు 15 కి.మీ దూరంలో ఉండే తాండూర్ ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా, నర్సింగ్ కళాశాల భవనాలను తాత్కాలిక తరగతి గదులుగా చూపించి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టారు. అలాగే గతేడాది తెలంగాణలోని మహేశ్వరం వైద్య కళాశాలకు ఎన్ఎంసీ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. కళాశాల, బోధనాస్పత్రి శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనాల్లోనే అకడమిక్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్ చొరవతో సకల వసతులతో భవనాలు నిర్మించినా.. వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. పులివెందుల వైద్య కళాశాల, బోధనాస్పత్రిని నిర్మించి ప్రారంభించారు. మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలలు ప్రారంభించకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు. మెరుగైన మార్కులు సాధించినా నిరాశే.. తెలంగాణలో తాత్కాలిక వసతులతోనే వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ రెండేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిశాక తెలంగాణలో నీట్ యూజీ–2025లో 403 స్కోర్తో రెండు లక్షలకు పైబడి ఆలిండియా ర్యాంక్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కోటా సీటు దక్కింది. ఇదే కేటగిరీలో ఏపీలో ఎస్వీయూ రీజియన్లో 471, ఏయూలో 487 స్కోర్ వద్దే ప్రభుత్వ కోటా సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఈ లెక్కన ఓపెన్ కేటగిరీలో తెలంగాణాతో పోలిస్తే 84 మార్కులు అధికంగా సాధించినప్పటికీ ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీటు దక్కలేదు. బీసీ కోటాలో 120కిపైగా ఎక్కువ మార్కులున్నా.. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు సీట్లన్నీ కేటాయిస్తామనే వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ కూటమి సర్కారు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఏకంగా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించకుండా బీసీ, ఎస్సీ లాంటి రిజర్వేషన్ వర్గాలకూ తీరని ద్రోహం తలపెట్టింది. కొత్తగా సీట్లు రాష్ట్రంలో పెరగకపోవడంతో తెలంగాణ విద్యార్థుల కంటే 120 మార్కులకు పైగా ఎక్కువ స్కోర్ చేసినా మన విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు దక్కలేదు. తెలంగాణాలో బీసీ–ఏ విభాగంలో 338 స్కోర్ చేసిన వారికి ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్ రాగా, ఏపీలో ఏయూలో 461, ఎస్వీయూలో 443 స్కోర్ల వరకే సీట్లు వచ్చాయి. అంటే 105–123 మార్కులు అదనంగా కటాఫ్ ఉంది. మిగిలిన రిజర్వేషన్ విభాగాల్లోనూ తెలంగాణాలో కంటే ఏపీలో కటాఫ్లు 50 నుంచి వంద మార్కుల మేర అధికంగానే ఉన్నాయి. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ. లక్షలు ఖర్చు చేసి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్కు పంపినా వచ్చే ఏడాదైనా రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయనే నమ్మకం లేదని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. 2,450 మంది వైద్య విద్యకు దూరం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో ఐదు కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చారు. గత ప్రభుత్వ కృషితో పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా చంద్రబాబు అడ్డుకుని రద్దు చేయించారు. గత విద్యా సంవత్సరం 700 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరకుండా అడ్డుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మరో 7 కొత్త వైద్య కళాశాలలు కూడా ప్రారంభమై మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావాల్సి ఉండగా వాటిని రాబట్టకపోగా ప్రైవేట్పరం చేస్తున్నారు. రెండేళ్లలో 2,450 మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన ప్రభుత్వం వారి కలలను ఛిద్రం చేసింది. చేరువలో వైద్య విద్య.. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్య చదువుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సైతం చేరువలో వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. – కె.లహిత, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఉచితంగా మెరుగైన వైద్యం ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందుతాయి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. – బి.రతుల్రామ్, వైద్యవిద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
కార్పొరేట్లకు రూ.వేల కోట్లిస్తారు.. మాకివ్వరా రాయితీలు?
సాక్షి, అమరావతి: మాకు ఇవ్వాల్సిన రూ.1,200 కోట్ల పారిశ్రామిక బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవుగానీ.. విదేశీ కార్పొరేట్ సంస్థలకు రూ.వేలకోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారంటూ దళిత పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న 100 శాతం పారిశ్రామిక ప్రోత్సాహకాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ పూర్తిగా విడుదల చేయాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచి్చన దళిత పారిశ్రామికవేత్తలు సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే వీరు నల్ల కండువాలు కప్పుకొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాజకీయరంగు పులిమి రాయితీలను నిలిపేయడాన్ని వారు నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నాయకుడు ఈడ్పుగంటి అన్నార్బాబు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా బకాయిల్లో 20%, 30% శాతం చొప్పున అందులోను కొందరికి మాత్రమే విడుదల చేయడం దారుణమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ 100 శాతం రాయితీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో కాకుండా కేవలం వారికి కావాల్సిన వారికి మాత్రమే నిధులు విడుదల చేశారని చెప్పారు.ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో జరగనున్న సదస్సును కూడా అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏడాదిన్నరగా పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూసి అప్పులపాలయ్యామని, ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు నిజమే.. ఈ ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు కొందరిని అధికారులు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వద్దకు తీసుకెళ్లి చర్చలపేరుతో గతంలో మాదిరిగానే కాలయాపన చేశారు. రాయితీల విడుదలకు సంబంధించి ఏపీఐఐసీ రూపొందించిన జాబితాలో తప్పులు దొర్లాయని యువరాజ్ పేర్కొన్నట్లు జేఏసీ నాయకుడు పినమాల నాగకుమార్ చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే ఏపీఐఐసీ వద్ద ధర్నా చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు ఈరా రాజశేఖర్, జంగా త్రిమూర్తులు, చినమౌలాలి, కనపర్తి విజయరాజు, కొడాలి రాంబాబు, అన్ని జిల్లాల నుంచి అధికసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
మైనార్టీలపై బాబు సర్కార్ ఉదాసీనత
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చలేదు... సంక్షేమ పథకాల అమలులో తీవ్ర వైఫల్యం... శాఖాపరమైన పోస్టింగుల్లో ఇష్టారాజ్యం... ముస్లిం మైనార్టీల పట్ల పూర్తి ఉదాసీనత...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తీరు. మొత్తం పరిస్థితి ఇలా ఉండగా మంగళవారం విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం జాతీయ మైనార్టీ దినోత్సవం నిర్వహించనుండడంపై ముస్లింలు మండిపడుతున్నారు. 12 హామీలు ఇచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయని బాబు... వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లిం మైనారిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. వక్ఫ్ ఆస్తులను లీజు పేరుతో అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలకు తెరలేపారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఏడాదిగా బకాయిపెట్టారు.49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ ప్రకటించి ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. మరోవైపు బాధ్యతాయుత పోస్టుల్లో సైతం తగిన హోదా లేని వ్యక్తుల నియామకం, క్యాడర్ పోస్టుల్లో నాన్ కేడర్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి మైనార్టీ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పైరవీలు చేసుకుని వస్తున్న నాన్ కేడర్ ఉద్యోగులు క్యాడర్ పోస్టుల్లో ‘అధికార’ దర్పం చెలాయిస్తున్నారు. క్యాడర్ స్థాయి అధికారులైతే తాము చెప్పినట్టు వినరని భావించి ఏరికోరి అనర్హులను అందలం ఎక్కిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడే కాదు, 2014 ఎన్నికల సమయంలోనూ ముస్లింలకు చంద్రబాబు 25 హామీలిచ్చి ఎగ్గొట్టారు. నాలుగేళ్ల పాటు మంత్రివర్గంలో ముస్లింలకు చోటే కల్పించలేదు. గుంటూరు, కర్నూలులో ముస్లిం యువతపై దేశద్రోహం అక్రమ కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణయుగం 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్తో ముస్లిం యువత ఉన్నత విద్యను ప్రోత్సహించారు దివంగత మహా నేత వైఎస్సార్. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలను ఆరి్థక, రాజకీయ, సామాజికంగా ముందుకు నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కింద మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల (నాన్ డీబీటీ)ద్వారా మరో రూ.11,064.88 కోట్ల లబ్ధి చేకూర్చారు. మౌజమ్లు, ఇమామ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.3 వేలు, రూ.5 వేలు మాత్రమే ఇవ్వగా, వైఎస్ జగన్ హామీ మేరకు రూ.5 వేలు, రూ.10 వేలకు పెంచారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.300.68 కోట్లను గౌరవ వేతనంగా అందించింది. వారికి భరోసా ఇచ్చేలా వన్టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఇచి్చంది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా సుమారు రూ.100 కోట్లు అందించింది. 2019 ఎన్నికల్లో ముస్లింలకు 5 సీట్లు, 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. పాదయాత్రలో ఇచి్చన మాటను నిలబెట్టుకుంటూ అక్రమ కేసులను ఎత్తివేశారు. నియామకాల్లో బాబు సర్కారు ఇష్టారాజ్యం⇒ ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ, పంచాయతీరాజ్శాఖ నుంచి నాన్ క్యాడర్ అధికారి యాకుబ్ బాషాను నియమించారు. ⇒ అత్యంత కీలకమైన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్గా సీహెచ్ శ్రీధర్ ఒక్కరే ఉన్నారు. ఏపీ హజ్ కమిటీ ఈవోగా ఉన్న గౌస్ పీర్కు ఉర్దూ అకాడమీ డైరెక్టర్, నూర్బాషా ఫెడరేషన్ ఎండీ పోస్టులు కట్టబెట్టారు. అంటే, ఒకే వ్యక్తికి ఏకంగా రెండు, మూడు బాధ్యతలు అన్నమాట. ⇒వక్ఫ్ బోర్డు సీఈవో మహ్మద్ అలీ సర్విస్ రికార్డుల్లో ఇంటర్ విద్యార్హత మాత్రమే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పదోన్నతిపై సామాజిక మాధ్యమాల్లో న్యాయవాదులు పోస్టులు పెట్టారు. ఈయన బంధువులు 13 మందికి పైగా వక్ఫ్బోర్డులో కీలక స్థానాల్లో ఉన్నారు. అలీ హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. తర్వాత ఆ భూమికి లీజు ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. ⇒ రాజ్యాంగబద్ధమైన మైనార్టీ కమిషన్ కార్యదర్శి పోస్టుకు ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన వ్యక్తిని నియమించాల్సి ఉంది. కానీ, తగిన అర్హత లేని నిజాముద్దీన్కు బాధ్యతలు అప్పగించారు. కమిషన్కు చైర్మన్ను లేకపోవడంతో వైస్ చైర్మన్ జాషువా డానియేల్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం కమిషన్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఉర్దూ అకాడమీకి చైర్మన్, పాలక వర్గాన్ని కూడా నియమించకపోవడం గమనార్హం.జగన్ చేసి చూపించారు.. వైఎస్ జగన్ మాట ఇస్తే చేసి చూపిస్తారని ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారు. సామాజికంగా, ఆరి్థకంగా, రాజకీయంగా ముస్లింలను ప్రోత్సహించారు. శాశ్వత జీవనోపాధి చూపించేలా అనేక పథకాలతో మైనార్టీ లకు జగన్ మేలు చేశారు. –మీర్జా షంషీర్ అలీబేగ్, మాజీ చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లింలను ఎంతకాలం మోసం చేస్తారు బాబూ..? రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు చంద్ర బాబూ..? 2024లో హజ్ యాత్రీకులకు జగన్ నిధులు మంజూరు చేయగా, తర్వాత వచి్చన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. రూ.లక్ష చొప్పున ఇస్తామని ఆ తర్వాత విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారికే అని మోసం చేశారు. హజ్ కమిటీలో ఇస్లామిక్ ధారి్మక పండితుల స్థానంలో టీడీపీ కార్యకర్తలు పఠాన్ ఖాదర్ఖాన్, షేక్ హసన్బాషాలను నియమించారు. –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ మైనార్టీ దినోత్సవం జరిపే నైతిక హక్కులేదు.. మైనార్టీలకు ఏ మాత్రం మేలు చేయని అసమర్థ చంద్రబాబు ప్రభుత్వానికి మైనార్టీ జాతీయ దినోత్సవాన్ని జరిపే నైతిక హక్కులేదు. బాబు అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారు. –షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షులు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి వైఎస్ జగన్ మేలును ముస్లిం సమాజం మరువదు వైఎస్ జగన్ చేసిన మేలును ముస్లిం సమాజం ఎప్పటికీ మరువదు. నూర్ బాషా, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లిస్తానని 2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోలేదు. నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం చేశారు. –షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఏపీ ముస్లిం దూదేకుల జేఏసీ -
కట్టు తప్పింది మీరే!
సాక్షి, అమరావతి: కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం బాగోలేదని.. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై అంతర్గతంగా వారంతా రగిలిపోతున్నారు. నిజానికి కట్టుతప్పి వ్యవహరిస్తోంది టీడీపీ పెద్దలేననే విమర్శలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పాలన గాలికి వదిలేసి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారనే వాదన సొంత ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు పనితీరే అధ్వానంగా ఉందని ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మద్యం, ఇసుక దందాను కేంద్రీకృతం చేసి అక్రమాలకు తెరతీశారని పేర్కొంటున్నారు.కమీషన్లు తీసుకుంటూ టూరిజం హోటళ్లను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఉర్సా, లులు, ఇండిచిప్ లాంటి సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని ఉదహరిస్తున్నారు. ప్రాంతానికి ఒక ఐజీని పెట్టి మరీ మైనింగ్ అక్రమ సొమ్మును వసూలు చేస్తున్నారని, 108, 104 వాహనాల నిర్వహణ టెండర్లను అర్హత లేని వారికి కట్టబెట్టి అక్రమాలకు తెర తీశారని మండిపడుతున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఇవన్నీ చేస్తూ తమను నిందించడం ఏమిటనే చర్చ ఎమ్మెల్యేల్లో జోరుగా సాగుతోంది. ఇన్చార్జి మంత్రులదే బాధ్యత.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనడంలేదన్నారు. అలాంటి వారిని పిలిచి స్వయంగా తాను మాట్లాడినా మార్పు రాలేదని చెప్పినట్లు తెలిసింది. ఇన్చార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేల బాధ్యతను తీసుకోవాలని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ఒక్కో ఇన్చార్జి మంత్రికి ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని, నేతలను పరిగణనలోకి తీసుకోవడంలేదని పేర్కొన్నట్లు తెలిసింది. -
బాబు సర్కారు భూ పందేరం.. ఏడాదికి రూ.వెయ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను కారుచౌకగా లీజుకు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్ల పాటు వీటిని ధారాదత్తం చేయనుంది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ప్రభుత్వ భూముల లీజు కాలం 33ఏళ్లుగా ఉంది. ఈ వ్యవధిని 66 సంవత్సరాలకు, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు పెంచే అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమాచార మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించిన కేబినెట్ భేటీ వివరాల ప్రకారం...⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రవాణా శాఖకు ఇచ్చిన 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని రద్దు చేసి టీడీపీ జిల్లా ఆఫీసుకు కేటాయింపు. తిరుపతి రూరల్ మండలం అవిలాలలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయానికి కేటాయింపు. వార్షిక రుసుము రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజు కింద మచిలీపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడికి భూమి బదిలీ.⇒ గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని భవానీ ద్వీపంలో ‘అడ్వెంచర్ థ్రిల్ సిటీ’ అభివృద్ధికి విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం. ⇒ మచిలీపట్నం తల్లపాలెం వద్ద అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ల అభివృద్ధికి మైరా బే వ్యూ రిసార్ట్స్కు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు.⇒ క్లీన్ ఎనర్జీకి అవసరమైన అసైన్డ్ భూములను ప్రైవేట్ సంస్థలకు 99 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టంలో సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం)–2025 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఆర్డినెన్స్ జారీకి అంగీకారం. ⇒ అమరావతిలో ప్రాజెక్టుల కోసం కొత్తగా బడ్జెట్ బయట రూ.9వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సీఆర్డీఏకు అనుమతి. ⇒ అమరావతి రాజధాని సిటీలోని ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధికి రూ.7,500 కోట్లు రుణం పొందేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అనుమతి. ⇒ రాజధానిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులు వేగవంతానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) నుంచి రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం. ⇒ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ యుటిలిటీల నిర్వహణకు, బొగ్గు, విద్యుత్ కొనుగోలు నిమిత్తం సర్కారుకు అప్పు ఇవ్వడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు ఏపీపీఎఫ్సీఎల్ రూ.1,000 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం. ⇒ విద్యుత్ సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ జారీచేసిన జీవోకు, ఎస్బీఐ, యూబీఐ నుంచి ఏపీ డిస్కమ్స్ తీసుకునే రూ.1,150 కోట్ల రుణంపై ప్రభుత్వ గ్యారెంటీకి, ఖరీఫ్లో ధాన్యం సేకరణ కోసం మార్క్ఫెడ్ ద్వారా పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీచేసిన జీవోకు ఆమోదం. ⇒ ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ తీసుకునే గరిష్ట రుణ పరిమితి రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంపు. ⇒ కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల భూ సేకరణకు హడ్కోరుణం చెల్లించేందుకు హామీతో ప్రభుత్వ ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ జారీకి, ఏపీ ఫైర్ సర్వీసెస్ చట్టం–1999లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ విడుదలకు ఆమోదం.⇒ ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.⇒ సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యల నిమిత్తం కమిషనర్ అనుమతికి అంగీకారం.⇒ ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్–2కు రూ.595.01 కోట్లకు పరిపాలన అనుమతి⇒ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ గ్రామాల లే అవుట్లో అనుసంధానం పనులను రూ.1,863 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు అనుమతి.⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టం–1939కు సవరణ చేసే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ⇒ వివిధ కేటగిరీల కాంట్రాక్టర్ల ద్రవ్య పరిమితులు, వారి రిజిస్ట్రేషన్ ఫీజును, సాల్వెన్సీ సర్టిఫికెట్ మొత్తాన్ని, గత అనుభవం, పనుల విలువను పెంచడానికి ఆమోదం.⇒ ఏలూరు జిల్లా పోలవరంలోని 15.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.⇒ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ డేటా లేక్ ప్రాజెక్టు డిజైన్.. అభివృద్ధి, అమలు, ఆపరేషన్లు, నిర్వహణ కోసం సిస్టమ్ ఇంటిగ్రేటర్గా నియామకానికి మెస్సర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల కాలానికి షెడ్యూల్ విలువ రూ.181 కోట్లతో కోట్ చేసిన సింగిల్ బిడ్కు ఆమోదం. ⇒ క్వాంటమ్ మిషన్ నిపుణుల కమిటీ ముందు బిడ్ల సాంకేతిక మదింపును ఉంచి, సమీక్ష, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, టెండర్ల విధానాల ప్రకారం ఆర్ఎఫ్పీ పద్ధతిలో ఏక్యూసీసీ ప్రాజెక్టుకు టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సాంకేతిక చార్జీలు మినహాయించి రూ.99.62 కోట్లకు అంగీకారం. ⇒ ఇటీవల ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రాయితీలకు ఆమోదం⇒ పలు ఎనర్జీ, టిడ్కో ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు గ్రీన్సిగ్నల్. -
పేదలకు సెంటు భూమి ఇవ్వరు..
సాక్షి, అమరావతి: పేదలకు సెంటు స్థలం ఇవ్వదు కానీ, పార్టీ ఆఫీసులకు మాత్రం రూ.వందల కోట్ల విలువైన భూములు కేటాయించుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే వ్యూహంతో టీడీపీ కార్యాలయాల కోసం అత్యంత విలువైన స్థలాలను కారుచౌకగా ఇచ్చేస్తోంది. తాజాగా మచిలీపట్నంలో కట్టెబట్టిన 1.60 ఎకరాల విలువ రూ.50 కోట్లకు పైనే. తిరుపతి రూరల్ మండలం అవిలాలలో ఇచ్చిన రెండెకరాల భూమి విలువ రూ.100 కోట్లు కావడం గమనార్హం.జనవరిలో కడపలోని రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆర్అండ్బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద లీజుకు ఇచ్చేశారు. అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానన్న చంద్రబాబు ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా జగనన్న కాలనీల్లో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతూ పేదలలో ఆందోళన రేకెత్తిస్తున్నారు. మంగళగిరిలో స్టార్ హోటల్ తరహాలో...చంద్రబాబు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం కేటాయించి అత్యాధునిక భవనాలను కట్టించేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం 3.65 ఎకరాలలో కోల్కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని అత్యంత విలువైన ప్రాంతంలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చాక కేటాయించుకున్నారు. ప్రస్తుత విలువ రూ.150 కోట్లకుపైనే. ఇందులో వాగు పోరంబోకు, కాలువ, రైతులకు అసైన్ చేసిన డి–పట్టా భూములున్నా నిబంధనలకు విరుద్ధంగా 2016లో 99 ఏళ్ల లీజుకు తీసుకున్నారు.దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులున్నా ఖాతరు చేయలేదు సరికదా... స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని నిర్మించారు. గుంటూరు అరండల్పేట పిచుకులగుంటలో వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం లీజుకుని తీసుకుని పక్కనే ఉన్న 1,500 గజాల స్థలాన్నీ ఆక్రమించి భారీ భవనం కట్టేశారు. మున్సిపల్ స్థలాలను ఎక్కడా లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా 2015లో చంద్రబాబు అధికార బలంతో ఆ భూమిని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు.విజయవాడ నడిబొడ్డున రూ.50 కోట్ల భూమివిజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంతం గురునానక్ కాలనీకి ఆనుకుని ఉన్న 95 సెంట్ల భూమిని 2018లో టీడీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. ప్రజావసరాలకు ఉపయోగపడే ఈ సాగునీటి శాఖ స్థలంలో చిన్న కార్యాలయాలుండగా కూల్చేశారు. ఈ స్థలం ప్రస్తుతం రూ.50 కోట్లపైనే ఉంటుంది. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని వారి నోరు మూయించి మరీ కన్వర్షన్ చేసుకున్నారు. ⇒ శ్రీకాకుళంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ సేకరించి అభివృద్ధి చేసిన భూమిని టీడీపీ కార్యాలయం కోసం లీజు పేరుతో లాగేసుకున్నారు. అందులో పెద్ద భవనాన్ని నిర్మించారు. దీని విలువ ఇప్పుడు రూ.40 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ⇒ కాకినాడలో 2 వేల గజాల జిల్లా పరిషత్ స్థలాన్ని 2014లో టీడీపీ కార్యాలయం కోసం తీసుకున్నారు. దీని విలువ రూ.20 కోట్లకుపై మాటే. విశాఖలో దస్పల్లా కొండను ఆక్రమించి..విశాఖపట్నంలో దస్పల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దస్పల్లా భూముల్లో 2 వేల గజాలను ఏడాదికి రూ.25 వేల చొప్పున 33 ఏళ్ల లీజుకు కేటాయించుకున్నారు. పక్కనే ఉన్న మరో వెయ్యి గజాలను ఆక్రమించి కార్యాలయం నిర్మించారు. టెక్కలి, చిలకలూరిపేటలో 30 సెంట్లు, 20 సెంట్ల విలువైన స్థలాలను ఇలానే పొందారు.హైదరాబాద్లోనూ అంతే...విలువైన స్థలాలను పార్టీ కార్యాలయాల పేరుతో ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు ఘనాపాఠి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఇలానే నిర్మించారు. ఇప్పుడూ రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలువైన స్థలాలు పొంది విలాస భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. సోమవారం మచిలీపట్నం, తిరుపతిలో కేటాయింపులు పూర్తవగా, మున్ముందు అన్నిచోట్ల ప్రభుత్వ భూములను పొందేందుకు సిద్ధమవుతున్నారు. -
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్, షెడ్యూల్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజయవాడ– చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్లు కల్పించారు. -
పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.పరీక్ష ఫీజు రుసుం ఇలా.. ⇒ రెగ్యులర్ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60⇒ వయసు మినహాయింపు కోసం రూ.300మార్చిలో ‘పది’ పరీక్షలుపదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్ను సిద్ధం చేసినట్టు తెలిసింది. -
స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
చింతకొమ్మదిన్నె: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది.అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యార్థిని మృతదేహాన్ని తరలించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచ్చినా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు.పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రోడ్డెక్కిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిస్తూ జీఓ జారీ చేయటం విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. దీంతో తమకు న్యాయంచేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కళాశాలను అదేపేరుతో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారుఅసలేం జరిగిందంటే..: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ 2023లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలను గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్వా«దీనం చేసుకున్న ఎన్బీటీ అండ్ ఎన్సీవీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గతంలో ఇదే ప్రాంగణంలో జేఎన్టీయూ–ఎన్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహించారు. వారికి సొంత భవనాలు సమకూరటంతో సదరు ప్రాంగణాన్ని డిగ్రీ కళాశాలకు కేటాయించారు. అయితే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం రావటంతో ప్రభుత్వ ఆ«దీనంలో ఉన్న కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్ సోసైటీ(పాత యాజమాన్యం)కి అప్పగిస్తూ జీఓ జారీ చేసింది.దీంతో సొసైటీ ప్రతినిధులు తమ కళాశాలను, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది. కళాశాల పేరు ఎన్బీటీ అండ్ ఎన్సీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా నమోదు కావటంతో ఇప్పుడు తమను వేర్వేరు కళాశాలల్లో చేరమనటంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో 101 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంబంధించిన రికార్డులన్నీ ఇదే కళాశాల పేరుతో ఉండటంతో హఠాత్తుగా వేరే కళాశాలకు బదిలీ చేస్తే తాము నష్టపోతామని విద్యార్థులు చెబుతున్నారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తింపుతో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతోనే స్కాలర్షిప్లు ఇతర సదుపాయాలు పొందుతున్నారు. సచివాలయం బయోమెట్రిక్ ట్యాగ్ సైతం ఎస్బీటీ అండ్ ఎన్సీవీ ప్రభుత్వ కళాశాల పేరుతోనే ఉన్నాయి. కళాశాలను పాత యాజమాన్యానికి అప్పగించి తమను వేరే కళాశాలకు మార్చినట్లయితే తాము నష్టపోతామని వాపోతున్నారు. తృతీయ సంవత్సరం పూర్తి చేసే వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అదే పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. -
సర్కారీ చిక్కీలో పురుగులు
చుండూరు (కొల్లూరు): బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం ఉపాధ్యాయులు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు దర్శన మిచ్చాయి. వాటిని విద్యార్థులు ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు చిక్కీలపై ఉన్న కవర్ను తొలగించి విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రయతి్నస్తున్న క్రమంలో పురుగులు కనిపించడంతో నిశ్చేషు్టలయ్యారు. ప్యాకెట్లోంచి తీసిన చిక్కీలోబతికున్న పురుగు బయటకు వస్తుండటం చూసిన తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నాణ్యమైన భోజనం, చిక్కీలు అందించాల్చిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించడం, చిక్కీల నాణ్యతను విద్యాశాఖాధికారులు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు పురుగులను గమనించకుండా ఆరగించి ఉంటే వారి పరిస్థితి ఏమిటన్న సందేహాలు తల్లిదండ్రులలో వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాటల కోటలు దాటుతుంటే.. విద్యార్థులకు ఇస్తున్న చిక్కీలలో పురుగులు బయటకొస్తున్నాయని పలువురు వ్యాఖ్యానించారు. -
‘పవర్’పై ప్రైవేటు పెత్తనం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల్లో కొందరు, ఉన్నత పదవుల నియామకాల్లో మరికొందరు అందినంత దోపిడీ.. కాంట్రాక్టుల్లో ఇంకొందరు భారీగా కమీషన్లు వసూలు...! కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి విద్యుత్ సంస్థలను దోచుకుంటున్న తీరు ఇది...! ఈ దందాలో అనేకమంది అనేక విధాల ప్రయత్నాలు... వీరిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు..! తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి అన్నీ తానే అయి ఉన్నతాధికారులను శాసిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా అధికారిక సమీక్షల్లో నేరుగా పాల్గొంటూ, ప్రభుత్వంలోని కీలక నేత తాలూకా అని చెబుతూ హడలెత్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పని కాకుంటే బదిలీనే బహుమానం... ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో ఇటీవల జరిగిన ఓ అధికారిక సమీక్షలో ఉన్నతాధికారులతో పాటు ఓ వ్యక్తి దర్జాగా కూర్చున్నారు. ఆయనను చూసిన ఇతర అధికారులు, సిబ్బంది ఎవరో ఉన్నతాధికారి అని భ్రమపడ్డారు. కానీ, ఆయన ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధి. సీఎండీ కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే స్థాయిలో విద్యుత్ సంస్థల్లో పవర్ పెంచుకున్నారు ఆ వ్యక్తి. ఇందుకోసం రాష్ట్రంలోని ఓ మంత్రి పేరును వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మంత్రి చెప్పిందే అన్ని శాఖల్లో జరుగుతోంది.దీంతో ఆయన తాలూకా అని చెబుతున్న ప్రైవేటు వ్యక్తికి అధికారులు అంతే విలువ ఇస్తున్నారు. ఈ ఒక్క డిస్కంలోనే కాదు, మిగిలిన రెండు డిస్కంలలోనూ ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులే పెత్తనం చెలాయిస్తున్నారు. టెండర్లు తయారీ, ఒప్పంద పత్రాలను రూపొందించడం వంటివి ఈ సంస్థ చేతుల మీదుగానే జరుగుతోంది. దీనికి చెందిన ‘చౌదరి’ అనే వ్యక్తి వివిధ శాఖల్లో లాబీయింగ్ చేస్తూ పారిశ్రామికవేత్తలు, డిస్కంల ఉన్నతాధికారుల మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కొన్ని సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులను ఒత్తిడి చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా టెండర్లు విడుదల చేయించేందుకు యతి్నంచడం, అది జరగకపోతే బదిలీ చేయిస్తామని బెదిరించడం అతడికి పరిపాటిగా మారిందని డిస్కం వర్గాలు అంటున్నాయి. ఆయన ఓ బ్యాంకు ఐటీ మాజీ ఉద్యోగి గతంలో చౌదరి ఓ బ్యాంకు ఐటీ విభాగంలో పనిచేశాడని, అవినీతి ఆరోపణల వల్ల తొలగించారని సమాచారం. ప్రస్తుతం విద్యుత్తో పాటు అనేక శాఖల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. ప్రైవేటు సంస్థకు చెందిన చౌదరి తెలంగాణలో ఉంటూ, ఏపీ డిస్కంలపై అజమాయిషీ చేస్తున్నాడు. రూ.50 లక్షల కాంట్రాక్టు నుంచి రూ.100 కోట్లపైగా ప్రతిదీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.విజిలెన్స్ వెన్నువిరిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో అక్రమాలను, అవినీతిని పసిగట్టి చర్యలు తీసుకునే ట్రాన్స్కో విజిలెన్స్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. మొక్కుబడి విభాగంగా మార్చేసింది. ఇప్పటికీ ఆ శాఖకు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారి లేరు. ఒకవేళ విజిలెన్స్ ఉండి ఉంటే... చౌదరి వ్యవహారంపై దృష్టిసారించి ఉండేవారనే వాదనలు వినిపిస్తున్నాయి.అక్కడే అన్ని వ్యవహారాలుకొందరు ప్రముఖులు, బడా బాబులతో హైదరాబాద్లో చౌదరి సమావేశమవుతాడని, అక్కడే వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ ఇటీవల ఓ సంస్థతో చౌదరి నివాసంలోనే ఒప్పందం కుదుర్చుకుందని, ఆ టెండర్ పత్రాలనూ డిస్కం సిబ్బంది కాకుండా చౌదరి స్వయంగా రూపొందించాడనే ఆరోపణలున్నాయి. టెండర్ పత్రం పూర్తిగా ప్రైవేటు సంస్థకు అనుకూలంగా, ఇతర పోటీదారులు పాల్గొనే అవకాశం లేకుండా రూపొందించారని, దీనిలో కొందరు అధికారులు, చౌదరి బాగా నే లాభపడ్డారని సమాచారం. తాజాగా ఓ డిస్కంలో డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు టెండర్ విడుదలైంది. దానినీ చౌదరి వ్యక్తులే రూపొందించారని తెలిసింది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో పెట్టిన టెండర్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. -
లడ్డూ ప్రసాదంపై బాబు సర్కారు కుట్ర!
సాక్షి అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెట్టింది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు బరి తెగించింది. అందుకోసం పరస్పర విరుద్ధ ఆరోపణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి న్యాయస్థానాలను బురిడీ కొట్టించేందుకు కూడా తెగబడుతుండటం తీవ్ర విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి వివాదంలో సిట్ తాజాగా అరెస్టు చేసిన సుగంథ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ నివేదికే అందుకు తాజా తార్కాణం.ఆ రిమాండ్ నివేదికలోని అంశాలను ఎల్లో మీడియాతోపాటు వివిధ మీడియా సంస్థలకు ముందుగానే లీక్ చేసి రాద్ధాంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన కుట్రలను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా కుతంత్రంతోనే ఈ దుష్ప్రచార కుట్రలకు ప్రభుత్వం బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంథ్ను నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడిన ప్రభుత్వ కుట్ర ఇలా ఉంది..జంతువుల కొవ్వు అన్నారు.. కాదు కాదు పామాయిల్ అంటున్నారు!తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడిందన్నది ఈ రిమాండ్ నివేదిక బయటపెట్టింది. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. అదే నిరాధార ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా పదేపదే ఉద్ఘాటించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కాగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.సీఎం చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు కూడా కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కుతంత్రానికి ఈ రిమాండ్ నివేదిక ద్వారా కుట్ర పన్నింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్, ఈస్ట్, ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంది. జంతువుల కొవ్వు ఆరోపణలు బెడిసికొట్టడంతో నెయ్యిపై దుష్ప్రచారం చేసేందుకు పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ కలిపారనే వాదనను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డెయిరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసులో ఇరికిస్తారనే భయంతోనే డెయిరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలొగ్గినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీపై భిన్న వాదనలు..లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం భోలే బాబా డెయిరీపై పరస్పర విరుద్ధ ఆరోపణలతో తన కుట్రలను బయటపెట్టుకుంటోంది. ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను పోలీసులు వైవీ సుబ్బారెడ్డి పీఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆయన భోలే బాబా డెయిరీని బెదిరించి రూ.50 లక్షలు లంచం అడిగారని ఆరోపించారు. అందుకు ఆ డెయిరీ నిరాకరించడంతో టీటీడీ జీఎంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ లిస్టులో పెట్టించారని పేర్కొన్నారు. మరో రెండు కంపెనీలకు భోలేబాబా డెయిరీ ఎల్ 1గా వచ్చినప్పటికీ ఆ డెయిరీని కాదని మరో రెండు డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించినట్లు ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలను వక్రీకరిస్తూ వాటిని ఆధారంగా చూపించేందుకు తాపత్రయపడ్డారు.కానీ అదే సమయంలో చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పీఏగా పని చేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోలీసులు భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనడం గమనార్హం. అంటే భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే టీటీడీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క చుక్క కూడా పాలు సేకరించలేదని సిట్ పేర్కొంది. కానీ అదే డెయిరీ యూపీలో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన వినిపించింది.భోలే బాబా డెయిరీ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో అజయ్ కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టులో సిట్ కొత్త కట్టుకథను వినిపించింది. భోలే బాబా డెయిరీ సుగంథ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు కొత్త కట్టుకథ సృష్టించింది. అందులో వివిధ ప్రైవేట్ డెయిరీల పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంది. ఆ మేరకు హర్‡్ష ట్రేడింగ్ కంపెనీ, హర్‡్ష డెయిరీ ప్రొడక్ట్స్ తదితర పేర్లను పేర్కొంది. అంటే ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.సుప్రీం తీర్పునూ బేఖాతర్ చేస్తూ...రాజకీయాల్లోకి కనీసం భగవంతుడినైనా దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు బేఖాతర్ చేస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తోంది. అజయ్కుమార్ సుగంథ్ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే ఎల్లో మీడియాకు చేరడం అందుకు నిదర్శనం. ఎల్లో మీడియా, కొన్ని ఇంగ్లీషు పత్రికలు, వెబ్సైట్లలో దుష్ప్రచార కథనాలను సోమవారమే వైరల్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.టీటీడీ లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించేలా మీడియా చానళ్లలో చర్చా గోష్టి నిర్వహించింది. ఆ దుష్ప్రచార కథనాలను మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే ప్రభుత్వం, ఎల్లో మీడియా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ, తీర్పుతో నిమిత్తం లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. -
ఢిల్లీలో బ్లాస్ట్.. 9 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: హస్తినలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రోస్టేషన్ ఒకటో నంబర్ గేటు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట, పార్లమెంట్, మెట్రో స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో సోదాలను పెంచారు. లాడ్జ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి. ఘటన జరిగిన తీరును అక్కడి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెల్సుకుంటున్నారు పేలుడు తర్వాత మంటలు, దట్టమైన పొగ అలుముకున్న ఆ ప్రాంతంలో మంటలను రాత్రి ఏడున్నరకల్లా ఆర్పేశామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అయితే ఇది ఉగ్రదాడి అని వార్తలొస్తున్నా ఇప్పటిదాకా ఏ ఉగ్రసంస్థా ఈ పేలుడుకు బాధ్యలము తామేనని ప్రకటించుకోలేదు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పేలుడు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్ఖిలా మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైట్ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్ మార్కెట్లోని జనం భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్షాను అడిగి తెల్సుకున్నారు. ఛాందిని చౌక్ మార్కెట్ సమీపంలోనే పేలుడు సంభవించడంతో జనం రద్దీని కట్టడిచేసేందుకు మంగళవారం మార్కెట్ను మూసేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ భార్గవ చెప్పారు. కశ్మీర్ వాసి పేరిట కారు రిజిస్ట్రేషన్ ! పేలిన కారు హరియాణాలో హెచ్ఆర్26సీఈ 7674 నంబర్తో రిజిస్ట్రర్ అయినట్లు గుర్తించారు. కారు యజమాని నదీం ఖాన్ను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఈ కారు పలువురు యజమానులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే చివరిసారిగా కశ్మీర్లోని పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తి దీనిని కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. అయితే కారు క్రయ, విక్రయల సమయాల్లో తప్పుడు గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లను వినియోగించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే 2013 మోడల్ ఐ20 తెలుపు రంగు కారుకు గతంలో యజమాలుగా ఉన్న ఎండీ సల్మాన్, దేవేందర్లనూ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గురుగ్రామ్లోని శాంతినగర్కు చెంది సల్మాన్ ఈ కారును ఏడాదిన్నర క్రితం ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందిన దేవేందర్కు విక్రయించాడు. తర్వాత ఈ కారును అంబాలా నగరంలో మరొకరు కొన్నారు. మృతదేహాల్లో కానరని బాంబు శకలాలు పేలిన కారులో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు, గాయపడిన శరీరభాగాల్లోకి ఎలాంటి మేకులు, చిన్నపాటి ఇనుపగుండ్లు దూసుకెళ్లలేదు. ఉగ్రవాదులు ఉపయోగించే ఐఈడీ తరహా పేలుడుపదార్థంలో ఇలాంటి వాటిని చొప్పించి పేలుడు విస్తృతి ఎక్కువగా ఉండేలా, పెద్దసంఖ్యలో జనం మరణించేలా కుట్ర పన్నుతారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి మేకులు, బాల్ బేరింగ్లు, చిన్న వైర్ల జాడ కనిపించలేదు. కానీ ఘటనాస్థలిలో ఒక బుల్లెట్ను కనుగొన్నారు. రసాయన పదార్థంకారణంగా సంభవించే కాలిన గాయాలు సైతం మృతదేహాలపై లేవు. దీంతో ఏ తరహా పదార్థం పేలిందనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఢిల్లీ నేర విభాగం, ప్రత్యేక విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తును ముమ్మరంచేశాయి. పేలిన కారు అంతకుముందు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. ఘటనాస్థలిలో ఘటన జరిగినప్పుడు అక్కడ క్రియాశీలకంగా ఉన్న మొబైళ్ల తాజా లొకేషన్లనూ సరిచూస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సమీపం నుంచే బాంబును పేల్చి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కొన్ని సెకన్ల ముందు ఒకవేళ అక్కడి పాదచారులు సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకుంటే వాటిని తమకు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఈ పేలుడు అధిక–ఉష్ణోగ్రతను వెదజ్లే విస్ఫోటనం కాకుండా యాంత్రిక లేదా రసాయనిక విస్ఫోటనం అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే నైట్రేట్లు లేదా టీఎన్టీ వంటి జాడను వెతుకుతున్నారు. ఆస్పత్రులకు పోటెత్తిన బాధితుల కుటుంబసభ్యులు పేలుడు ఘటనలో తమ వారు ప్రాణాలు కోల్పోయారన్న వార్త తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన మార్చురీలు, ఆస్పత్రులకు చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. క్షతగాత్రుల కుటుంబసభ్యులు, స్థానికులు, మీడియా ప్రతినిధులతో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. తమ వారిని ఐసీయూలో చేర్పించారని, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏ విషయాలు చెప్పట్లేరని పలువురు కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా సైతం లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల ఆరోగ్యంపై వాకబు చేశారు. స్వల్ప గాయాలైన క్షతగాత్రులను ఓదార్చారు. ఘటన జరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. తర్వాత ఘటనాస్థలికి రాత్రి పదిన్నర ప్రాంతంలో అమిత్ షా చేరుకున్నారు. పేలుడు జరిగిన తీరును అక్కడి దర్యాప్తు అధికారులు అమిత్ షా వివరించారు. ఎటు చూసినా రక్తపు ముద్దలు ‘‘శక్తివంతమైన పేలుడు దెబ్బకు కొద్దిసేపు మా చెవులు గిల్లుమన్నాయి. అసలేం జరిగిందో చూసేలోపే అంతటా మంటలు. చుట్టూతా ముక్కలైన మృతదేహాలు శరీరభాగాలు. కొన్ని ముక్కలు వాహనాలపై, మరొకొన్ని రోడ్లమీద పడ్డాయి. అంతటా రక్తపు మరకలు. మంటలు అంతెత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి ఎంతో ఎత్తున ఉండే హైమాస్ట్ వీధిదీపాలు సైతం పగిలిపోయాయి. దుకాణాల, మెట్రో స్టేషన్ గాజు ప్యానెళ్లు సైతం బద్దలయ్యాయి. సమీప వాహనాలు, అందులోని వాహనాదారులకు సైతం మంటలు అంటుకున్నాయి’’అని ప్రత్యక్ష సాక్షి, 36 ఏళ్ల అమిత్ ముద్గల్ భయంభయంగా చెప్పారు. ముగ్గురు పురుషులు ముక్కలై పడి ఉన్నారని మరో ప్రత్యక్ష సాక్షి భూపీందర్ సింగ్ చెప్పారు. ‘‘చాలా మంది చేతులు, వేళ్లు తెగి పడ్డాయి. ఒక కారు స్టీరింగ్ చక్రం విరిగిపోయింది. తోపుడు బళ్లు నడిపేవాళ్లు, ట్యాక్సీ డ్రైవర్లు మంటల్లో చిక్కుకుపోయారు. వాళ్లు బతకడం కష్టమే’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇర్ఫాన్ చెప్పారు. ‘‘పేలుడు జరిగిన సెకన్లలోనే అక్కడంతా ఎర్రని పొగ అలుకుముంది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. గాయాలతో కిందపడిన చాలా మందిని నేను అప్పటికే వచ్చిన అంబులెన్సుల్లోకి ఎక్కించా’’అని ఆయన అన్నారు. ‘‘నేనో ఆటో రిక్షా డ్రైవర్ను. సిగ్నల్ వద్ద నా ఆటోకు ముందువైపు కొంచెం దూరంలో ఓ కారు ఆగింది. దాని వెనుకభాగంలోనే పేలుడు సంభవించింది’’అని నుదుటికి గాయమైన డ్రైవర్ చెప్పారు. ‘‘పేలుడు తీవ్రతకు నా దుకాణంలోని వస్తువులన్నీ ఒక్కసారిగా కంపించాయి’’అని సమీప దుకాణదారుడు వివరించారు. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరంలో ఉన్న జామా సమీదు దాకా వినపడింది. పేలుడు ఘటనపై పుకార్లను ప్రచారం చేయొద్దని, సంయమనం పాటించాలని ఢిల్లీవాసులకు రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజ్ఞప్తిచేశారు. అమెరికా ఎంబసీ తమ పౌరులకు అలర్ట్ పేలుడు ఘటనపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. ఎర్రకోట వంటి జనం విపరీతంగా గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకూడదని తమ పౌరులకు అమెరికా ఎంబసీ సోమవారం ఒక భద్రతా అలర్ట్ను పంపించింది. స్థానిక యంత్రాంగం సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జనసమ్మర్ద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు పేలుడు ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్చేశారు. అన్ని దారులు పుల్వామాకే! ఢిల్లీ పేలుడుకు మూలాలు పుల్వామాలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. సోమవారం కశ్మీర్, హరియణా, యూపీ సంయుక్త ఆపరేషన్లో పట్టుబడిన ఒక వైద్యుడు పుల్వామాకు చెందిన వ్యక్తే. 2019 ఫిబ్రవరి 14న సైనిక వాహనశ్రేణిపై దాడి జరిగింది పుల్వామాలోనే. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో కారు యజమాని తారిఖ్ సైతం పుల్వామాకు చెందిన వ్యక్తే. ]శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ శంషాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారులోని పేలుళ్ల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ను విధించారు. ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రతాదళాలతో పాటు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, ఎయిర్పోర్టు సెక్యూరిటీ రక్షకదళాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయంలో ఆర్వోబీ గేటు నుంచి మొదటి రోటరీ, రెండో రోటరీలతోపాటు ఎయిర్పోర్టులో అరైవల్, డిపార్చుర్ టెరి్మనళ్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను ఆపి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రారి్థంచారు.ఢిల్లీ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నాను’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఢిల్లీ పేలుడుపై కేటీఆర్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ‘ఎక్స్’లో స్పందించారు. ‘ఈ విషాదకర ఘటనలో పలువురు అమాయక ప్రజలు మరణించారనే వార్త నన్ను కలచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నాను’అని కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్కు బాంబు బెదిరింపు విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అధికారులు శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పంపిన ఈ–మెయిల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున ఎయిర్పోర్టు కస్టమర్ సపోర్ట్కు వచి్చన ఈ –మెయిల్లో లండన్లోని హీత్రూ విమానా శ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చే బ్రిటిష్ ఎయిర్వేస్ –277 విమానంలో బాంబు ఉందని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, భద్రతాధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్గా తేలడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీలో పేలుడు.. ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. Deeply shocked and saddened to learn about the massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident.Praying for a speedy recovery of all those injured in this ghastly tragedy.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్సిగ్నల్ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు. -
‘చంద్రబాబు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు’
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను , దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో అనేక నిదర్శనాలున్నాయి. వైఎస్సార్సీపీపై నిందలు వేయడానికి తన ఎల్లో మీడియాను వాడుకుంటారు. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ముందుగా కొన్ని కథనాలను రాయిస్తారు. ఏదో జరిగిపోతుందనే భావన ప్రజలకు కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో పెద్ద నేరం చేసేశారని నమ్మించడానికి దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేస్తారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులతో సిట్ వేసి విచారణ చేయిస్తారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా వారితో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.బెదిరించి వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.లేదంటే భౌతికంగా దాడి చేసి చెప్పిస్తారు. బలవంతంగా పేర్లు చెప్పించడం .. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వం పని. దేవుడిని సైతం తన స్వార్ధ రాజకీయాలకు వాడుకునే నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు.టిటిడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై బురదజల్లుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ అయ్యిందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రచారం చేశారు. జగన్పై బురద చల్లడానికే చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు.పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారు.సీబీఐ విచారణ జరిపించాలని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ద్వారా విచారణ చేయించాలని చెప్పింది.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవద్దని చంద్రబాబుకు చురకలు అంటించింది. కోర్టుకు వెళ్లినందుకు వైవీ సుబ్బారెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు వరుస కథనాలు రాయించారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని జూన్ 6వ తేదీన సిట్ విచారించింది. వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని చిన్న అప్పన్నపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏపీలో ఏదైనా పెద్ద ఇష్యూ జరగగానే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తారు.నెయ్యిలో కల్తీ ఉందని ఇంత వరకూ నిరూపించలేకపోయారు.లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటి వరకూ ఎక్కడికీ టెస్టుకు పంపించనే లేదు.కానీ లడ్డూ కల్తీ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న అప్పన్న 2018 వరకూ వైవి.సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. అంతకంటే ముందు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్ద కూడా పనిచేశారు. చంద్రబాబు టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి కాబట్టి వేరే నేతల పేర్లు బయటికి రావు. ఇప్పటి మంత్రి పార్థసారథి గతంలో టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు.వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి ఖరీదు 276 రూపాయలు మాత్రమే. ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, జగన్పై బురదజల్లడమే చంద్రబాబు పని. మా పార్టీ నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ చేస్తున్నది చాలా నీచమైన రాజకీయం. దేవాలయాలను, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు. ఎవరిపై కక్ష తీర్చుకుందాం..ఎవరిని లోపల వేద్దామనేదే చంద్రబాబు ఆలోచన .చంద్రబాబు,లోకేష్ వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’అని హితువు పలికారు. -
శ్రీచైతన్య స్కూల్.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,వైఎస్సార్: కడప చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గదిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డ మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ అందోళన చేపట్టారు. మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు రోడ్డుపైనే ధర్నా చేపట్టారు.మరోవైపు విద్యార్థిని మృతిపై విచారణ చేసేందుకు వెళ్లిన డీఈవో వెళ్లారు. డీఈవో వెళ్లినా యాజమాన్యం స్కూల్ గేట్ తాళం తీయలేదు. దాదాపు అరగంట సేపు స్కూల్ గేటు వద్ద డీఈవో వేచి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. -
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. -
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.బీఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా...?టీవీ5 బీఆర్ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ.. సర్వేపై బాబు, లోకేష్ గగ్గోలు!
సాక్షి, విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని, వారికి అనవసరంగా సీటు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఎమ్మెల్యేల దోపిడీపై తాజా సర్వే ఒకటి చంద్రబాబును టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు మండినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని చంద్రబాబు, లోకేష్లు అంగీకరించారు. ఎమ్మెల్యేల దోపిడీపై ఎస్-9 సంస్థ సర్వేలో(టీడీపీ సొంత సర్వే) తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. సర్వే రిపోర్టులు, కార్యకర్తల ఫిర్యాదులతో చంద్రబాబు, లోకేష్ గగ్గోలు పెట్టినట్టు తెలిసింది. అంతకుముందు.. కొంత మందికి టికెట్లు అనవసరంగా ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కాగా, యువకులను ఎంకరేజ్చేసే పనిలో భాగంగా టికెట్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నప్పటికీ కొందరు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్టు తెలిసింది. మరోవైపు.. తాజాగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదన్న లోకేష్ వ్యాఖ్యలు చేయడం ఈ ఎపిసోడ్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా తండ్రి, కొడుకుల వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ బండారం బట్టబయలైంది. ఇక, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. -
ఈర్ష్య.. అసూయలతో రాజకీయం ఎంత కాలం?
రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ ద్వేషంతోనో... ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందన్న సంశయంతోనో చేయకూడదు. చేస్తున్నది మంచి పనా? కాదా? అన్నది ఆలోచిస్తే రాజకీయాలలో పెడధోరణులు తగ్గుతాయి. అయితే సమకాలీన రాజకీయాలలో ప్రజోపయోగాల కంటే ద్వేషానికే పెద్దపీట పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేన, బీజేపీల కూటమి సర్కార్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈర్ష్యా, అక్కసులతో చేస్తున్న కొన్ని పనులు వారికే చేటు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలతోపాటు ఆయన చేసిన అభివృద్దిని కూడా విధ్వంసం చేసే రీతిలో సాగుతోంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి, సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచిత ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అందరిని విస్మయపరుస్తోంది. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించింది. నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గా పేరొందిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఒక పెద్ద లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన విజ్ఞాన వేదిక, రిక్రియేషన్ సెంటర్.. వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు సంకల్పించింది. కొన్నిటి నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. దీంతో అంబేద్కర్ మహా శిల్ప కేంద్రానికి గ్రహణం పట్టింది. అధికారంలోకి రావడంతోనే కూటమి పార్టీ నేతలు కొందరు ఈ కేంద్రంపై దాడి చేసి, జగన్, అంబేద్కర్ పేర్లను తొలగించారు. విమర్శలు రావడంతో అంబేద్కర్ పేరును మాత్రం తిరిగి పెట్టారట. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా విస్మరించింది. చివరికి అక్కడ పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వడం లేదు. దాంతో వారు పనులు చేయకపోవడంతో ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలవారు నిరసన తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి ఒక ప్రశ్న వేశారు. ‘‘నెలకు రూ.పది లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పరిరక్షించలేని చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎలా నిర్మించగలుగుతుంది?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.టీడీపీ అంబేద్కర్ను అగౌరవ పరిచిందంటూ నెటిజన్లు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని ప్రసంగాల వీడియోలను బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం అంతంతమాత్రంగానే ఉంది. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా మాల్కు ఇవ్వడానికి ప్రయత్నించిందని, సృ్మతివనం పేరుతో అమరావతిలో ఓ మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్లాన్ చేసినా జనాగ్రహం కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని నిర్వహణ, పర్యవేక్షణలపై చేతులెత్తేసింది. ఈ తప్పును తొందరగా దిద్దుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా చేసి, ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారట. అంబేద్కర్ కేంద్రమే కాదు... విశాఖలో రిషికొండ మీద జగన్ నిర్మించిన భవనాలను కూడా కూటమి సర్కారు ఏడాదిన్నరగా పాడు పెడుతోంది. బహుశా వీటిని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించవచ్చని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణానికి పూనుకుని, కొన్నిటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని కొనసాగిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. ప్రైవేటీకరణలో భాగంగా ఇంకా మొదలుకాని కొన్ని కాలేజీల టీచింగ్ ఆస్పత్రులకు సంబంధించి విలువైన యంత్ర పరికరాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు. అందులో పులివెందుల కాలేజీ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. పులివెందుల అంటే చంద్రబాబు అండ్ కో కి ఉన్న ద్వేషం అలాంటిదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ గతంలో కుప్పంలో ప్రభుత్వ స్కూల్ను నాడు-నేడు కింద బాగు చేయించడం, కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వడానికి కృషి చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదే చంద్రబాబు మాత్రం జగన్ నియోజకవర్గమైన పులివెందుల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. పులివెందులతోపాటు రాయలసీమలోని మదనపల్లె, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కుపురం కాలేజీల నుంచి కూడా పరికరాలను తరలించారని వార్తలు వచ్చాయి. ఇది ఆ ప్రాంత ప్రజలలో ఆవేదన మిగుల్చుతుందని చెప్పాలి. టూరిజం రంగానికి చెందిన హోటళ్లు, భవనాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించారు.ఇలా ఒక్కొక్క రంగాన్ని ప్రైవేటువారికి అప్పగించేస్తే ప్రభుత్వం ఇక చేసేది ఏముంటుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలతో పాటు, ఆయా నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటువారిపరం చేయడం వంటి చర్యల ద్వారా కూటమి సర్కార్ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.దీనికంతటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషమే కారణంగా కనిపించడం లేదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ, రాజస్థాన్ రోడ్డు ప్రమాదాలపై ‘సుప్రీం’ విచారణ
ఢిల్లీ: జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఏఐ, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండీషన్స్ పైన నివేదిక ఇవ్వాలని కోరింది.మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం ఆదేశించింది. జాతీయ రహదారుల పక్కన దాబాల ఏర్పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నదని, ట్రక్కులను రోడ్డుపై ఆపేసి, దాబాలకు వెళ్తున్నారని తెలిపింది. ఆగిన వాహనాలను ఢీకొన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీనిని నిరోధించడం అవసరమని సూచించింది. టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని పేర్కొంది. కాగా రాజస్థాన్లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, శ్రీకాకుళంలో ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. -
పవన్, లోకేష్.. నాకు న్యాయం చేయండి: సుధా మాధవి
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు సుధా మాధవి మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం తాము ఎంతో కష్టపడామని.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేనూ ఆడబిడ్డనే.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ నా ఆవేదన వినండి. మాకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అని కన్నీరుపెట్టుకున్నారు.టీడీపీ నాయకురాలు సుధా మాధవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కోసం చాలా కష్ట పడ్డాను. టీడీపీ నుండి టికెట్ ఇప్పిస్తామని నా నుండి ఏడు కోట్లు తీసుకున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా డబ్బులతో ఆస్తులు కొన్నాడు. టీడీపీకి నేను చాలా చేశాను.. నా సేవలను గుర్తించండి. వేమన సతీష్ ఒక్కడే కార్యకర్త కాదు.. మేము కూడా కార్యకర్తలమే. నాకు అన్యాయం జరిగింది కాబట్టే నేను జై భీమ్ రావ్ పార్టీ నుండి పోటీ చేశాను. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తారా?.వేమన సతీష్ ఏడు కోట్లు తీసుకొన్నారు.. 43 లక్షలు చెక్ ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఆరు కోట్లు కూడా వేయాలి. మాకు అన్యాయం జరిగింది అని వీడియో తీసి పంపించాము. మా సమస్య చంద్రబాబుకి చెప్పుకుందామని విజయవాడ వస్తే పోలీసులు తీసుకొని వెళ్లారు. వేమన సతీష్కి మేము డబ్బులు ఇవ్వలేదని వీడియో తీయించారు. ఒక పోలీస్ అధికారి కులం పేరుతో బూతులు తిట్టారు. మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని నమ్మించారు.. అలాగే భయపెట్టి వీడియో తీయించారు. మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నది విచారణ చేసి న్యాయం చేయాలి. మేము ఇచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కొన్నారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు ఎలా వచ్చాయి.రాజేష్ మహాసేన , యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు మాకు న్యాయం చేపించండి. జడ శ్రావణ్ కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రమే.. మమ్మల్ని పోలీసులు విడుదల చేశారు. లేదంటే మమ్మల్ని అక్కడే చంపేసేవాళ్లు. నేను ఆడబిడ్దని.. నాకు న్యాయం చేయండి. డబ్బులు ఇచ్చిన వీడియోలు అన్ని ఉన్నాయి. మాకు అంత సీన్ లేదు అని ప్రచారం చేస్తున్నారు. మహా టీవీలో డిబేట్ పెట్టండి.. సతీష్ని పిలవండి.. నేను వస్తాను. నా కుటుంబానికి రక్షణ కల్పించి.. మా ఆస్తులు మాకు ఇప్పించండి. చనిపోదాం అనిపిస్తుంది.. అలా వేధిస్తున్నారు. పవన్, లోకేష్ నా ఆవేదన వినండి. ఆస్తులు పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డాను. మాకు బుద్ధి వచ్చింది రాజకీయాల వైపు ఇంకెప్పుడు చూడను. మాకు న్యాయం చేయకపోతే మాకు చావే శరణ్యం. చంద్రబాబు, లోకేష్కి కూడా మా సమస్య తెలియజేశాం. కిడ్నాప్ చేశారు కాబట్టే మేము మీడియా ముందుకు వచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీపీ బ్రౌన్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి. బ్రౌన్ గారు. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/8kBc2udUnO— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 -
టీడీపీ నేత గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం..
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధికార టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. ఇంత పెద్ద మొత్తంలో గో మాంసం పట్టుబడటంతో ధార్మిక సంఘాలు.. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు సోమవారం ఉదయం గోమాంసం వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశారు. అయితే, గోడౌన్లో లక్షా 89వేల కేజీల గోమాంసం పట్టుబడితే అసలు సూత్రధారులను మాత్రం పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం. అధికార టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టన్నుల కొద్దీ గోమాంసం ఉండటంతో స్థానికులు షాకవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ను సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
తిరుమలలో మరో అపచారం.. తప్పు ఒప్పుకున్న టీటీడీ!
సాక్షి, తిరుమల: కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల నడకదారిలో మరోసారి మహాపచార ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా.. సదరు సిబ్బంది భక్తులని బెదిరింపులకు గురిచేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఎట్టకేలకు ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ..‘టీటీడీ ఔట్సోర్సింగ్లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనే ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులపై తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించినట్టు తెలిపింది. -
వజ్రాల్లేవ్...రావొద్దు!
నంద్యాల జిల్లా: మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాలవంకలో వజ్రాన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి.. రూ. లక్షల విలువైనవంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వజ్రాలు దొరకడం దేవుడెరుగు...వజ్రాన్వేషణ మాటున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు. వజ్రాల కోసం అంటూ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్ప డం గుర్తించినట్లు తెలిసింది. వంక వెంట కంపచెట్లు, పొదలు ఉండటం కొందరికి కలిసొస్తుంది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వారు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రేమ జంటలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటలిజెన్స్ విభాగం, ఎస్బీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, రంగురాళ్లు, సూదిముక్కు రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితవు చెబుతూ అక్కడి నుంచి పంపించేస్తున్నారు. -
తండ్రికి కుమార్తె అంతిమ సంస్కారాలు
కోనసీమ జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ లచ్చురాజు చెరువు గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన తండ్రికి కుమార్తె ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కదిలించింది. లచ్చురాజు చెరువుకు చెందిన బడుగు వెంకటరమణ (48) బ్రెయిన్ స్ట్రోక్కు చికిత్స పొందుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అనారోగ్యంతో బాధ పడుతోంది. పెద్ద కుమార్తెకు వివాహమైంది. దీంతో, తండ్రికి చిన్న కుమార్తె శ్రావణి తలకొరివి పెట్టి, దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లి అనారోగ్యంతో మంచాన పడటం, తండ్రి మృతి చెందడం, ఇంట్లో మగ పిల్లలు లేకపోవడం, చిన్న కుమార్తె శ్రావణి అంత్యక్రియలు నిర్వహించడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)


