breaking news
Andhra Pradesh
-
సాక్షిపై చంద్రబాబు సర్కార్ దమనకాండ.. జర్నలిస్టుల నిరసన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొవ్వొత్తులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, సాక్షి మీడియా జర్నలిస్టులు, ఇతర మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు. -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జీ సీరియస్
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రాపై సీరియస్ అయిన ఏసీబీ కోర్టు జడ్జి.. కేసు విచారణ పూర్తయిందా? లేదా? సూటిగా చెప్పాలన్నారు. విచారణ కొనసాగుతుందని.. కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు లూథ్రా తెలిపారు.ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా ఆధారాలు కోర్టుకు తెలపలేదన్న ఏసీబీ జడ్జి.. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారన్నారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి.. కోర్టుని మిస్ గైడ్ చేస్తున్నారంటూ లుథ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు. -
‘సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తామన్నారు.. ఏమైంది?’
విశాఖ: టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీ కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడరని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమి అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ టిడిపి నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది. దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి. కృపాలక్ష్మి నిజాలు మాట్లాడితే ఆమెపై దాడి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళ నేత వీడియోలు తీయించాడు..డబ్బులు ఎరచూపి వీడియోలు తీయించారని కోట వినూత ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన వారిపై పోలీసులను ఉపయోగించడం లేదు. సుగాలి ప్రీతి తల్లిని నిర్బంధించడానికి మాత్రం పోలీసులను వాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని పవన్ ఓట్లు దండుకున్నారు.సుగాలి ప్రీతి కేసును సిబిఐకు ఇస్తామని ఎన్నికలకు ముందు పవన్ మాట్లాడారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత బాబు పవన్ కళ్యాణకు లేదా?, సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారుమారయ్యాయి..?, ఎన్నికల్లో ఓట్ల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. జడ్పీ చైర్పన్ ఉప్పాల హారికపై టిడిపి గుండాలు దాడి చేశారు. కేసు పెడితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల తప్పులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. -
సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.కాగా, హైదరాబాద్లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి ఝలక్.. టీడీపీ శ్రేణుల కొత్త రాజకీయం!
సాక్షి, వైఎస్సార్: కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబావుట ఎగురవేశారు. మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవీ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్ధనలు చేశారు. క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంత వరకూ ఒక్క మైనార్టీ నేతకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపకు రాక ముందు నుంచీ పార్టీ తరఫున కష్టాలకోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు.మరోవైపు.. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
వామ్మో... ఎంత పెద్ద లారీ !
కడప: చైన్నె నుంచి కడప మీదుగా కర్నూలు మార్గంలో నిత్యం భారీ వాహనాలు అధిక లోడుతో ప్రయాణిస్తుంటాయి. ఇందులో వందల టన్నులు బరువు ఉన్న వాహనాలు కొన్నయితే, ఎక్కువ పొడవు కలిగిన వాహనాలు మరికొన్ని ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న భారీ లారీలు రెండో రకానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. ఒక్కో వాహనం పొడవు సుమారు 50 మీటర్లు ఉంటుంది. సుమారు ఐదారు వాహనాలు ఒకేచోట నిలబడి భారీ పైపులను మోసుకెళ్తున్నాయి. కడప– కర్నూలు జాతీయ రహదారిలో ఆలంఖాన్పల్లె పాత టోల్ప్లాజా వద్ద ఈ దృశ్యాలను సాక్షి తన కెమెరాలో బంధించింది. -
కల్తీ మద్యం కేసులో కీలక పరిణామాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్కు నకిలీ మద్యాన్ని జనార్దన్రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా..మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు! -
పవన్కు ఆ ధైర్యం ఉందా?
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజీనామా చేసేస్తానని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రకటించారు. ఈ మాటల వెనుక చిత్తశుద్ధి ఎంత? అన్న దానిపై అందరిలోనూ సందేహాలున్నాయి. సినిమా నటుడైన పవన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ మేలైన నటనకు అలవాటు పడిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటలకు.. అధికారం వచ్చిన తరువాత చేతలకూ అసలు పొంతన లేకపోవడం ఇందుకు కారణమవుతోంది.సముద్రజలాల కాలుష్యం పెరిగిపోతుండటం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. పిఠాపురం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. తమ సమస్యలు వినేందుకైనా ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే రావాల్సిందేనని భీష్మించుకున్నారు. అనారోగ్యం, ఇంకో కారణం చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా రాయబారం నడిపిన పవన్ వారిని కలవలేదు. త్వరలో వస్తానన్న హామీ మేరకు మత్స్యకారులు తమ ఆందోళన విరమించుకున్నారు కూడా. ఆ తరువాత.. సరిగ్గా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన రోజే పవన్ కళ్యాణ్ కూడా తన సభ పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కొందరి అనుమానం పక్కనబెట్టినా.. మత్స్యకారులను కలిసిన పవన్ ఏదైనా నిర్దిష్టమైన హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. వందరోజుల్లోపు న్యాయం జరక్కపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానన్న నామ్ కా వాస్తే అన్నట్టుగా ప్రకటనైతే చేశారు.కొన్ని సినిమా డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. సమస్యను అధ్యయనం చేయాలని.. సముద్రంపైకి వెళ్లి తానే పరిశీలిస్తానని కూడా చెప్పారు కానీ.. ఏదీ చేసినట్లయితే తెలియరాలేదు. మాటలు మార్చడం పవన్కు కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే పలు వీడియోలు సోషల్ మీడియాలో ఏళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయనకే చిత్తశుద్ధి ఉండి ఉంటే తాము అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చామన్న విషయం ఒప్పుకునేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతెందుకు.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఈమధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేకానేక వ్యవహారాలపై పల్లెత్తు మాట కూడా అనలేదు కదా? సొంత పార్టీ ఎమ్మెల్యేల దందాలు కానీ.. లంచాలు తీసుకుంటున్నామని బహిరంగంగానే చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నా వ్యతిరేకించలేదు సరికదా.. ఇది తప్పని చిన్న మాటైనా అనలేకపోయారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులని తేటతెల్లమవుతున్నా.. పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఒట్టు.గతంలోనూ ఇంతే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించిన చంద్రబాబుకు వపన్ దన్నుగా నిలిచాడు. సనాతని వేషం కట్టి.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు వెళ్లాయని ఆరోపించారు. వాస్తవాలు బయటపడిన తరువాత మాత్రం ఇప్పటివరకూ ఆ అంశంపై కిమ్మనలేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన ప్రకటనలు ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి పొట్టకొట్టబోమని, జీతాలు పెంచుతామని బహిరంగంగానే ప్రకటించారు. అధికారం వచ్చిన తరువాత వాటి ఊసెత్తేందుకూ ఇష్టపడటం లేదు. సుగాలి ప్రీతి విషయంలోనూ అంతే. ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని అధికారం వచ్చిన వెంటనే తొలి ఆదేశం జారీ చేస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిపాటు ఆ ఊసే ఎత్తలేదే! కూతురికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కితే మాత్రం ఆమెనే తప్పు పట్టారు. ఇంకో జనసేన నేత ఆ తల్లిపై నీచమైన కామెంట్లు చేశారు.ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో 30వేల మంది మహిళలు కనపడకుండా పోయారని, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు తనకీ విషయాన్ని చెప్పాయని ఊరంత ఊదరగొట్టిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే తేవడం లేదు. తప్పిపోయింది కేవలం 34 మంది మహిళలు మాత్రమేనని స్వయంగా కూటమి నేతలే ప్రకటించారు. వాస్తవానికి రాజకీయాలకు గుడ్బై చెప్పేసేంత విషయం ఇది. అలాగే.. నాసిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కిడ్నీలు పాడైపోతున్నట్లు హైదరాబాద్ డాక్టర్లు చెప్పారంటూ కూడా పవన్ అప్పట్లో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు అధికార భాగస్వామి టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ, పంపిణీ కర్త, కర్మ, క్రియలని తెలిసిన తరువాత నోరు కూడా విప్పడం లేదు. పవన్ కళ్యాణ్ కలుగులో దాక్కున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేయడం కూడా ఇందుకే. ఒక్కో నియోజకవర్గంలోని 500 మంది యువకులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి పరిశ్రమలు స్థాపింపజేస్తామని కూడా పవన్ గతంలో చెప్పారు. ఎందుకని ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదో ఆయనకే తెలియాలి.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని హామీలను అమలు చేయకపోవడం ప్రజలను వంచించడమే. రాజకీయాలకు గుడ్బై చెప్పాల్సినంత పెద్ద విషయాలే. కానీ.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో పర్యటిస్తూ, సినిమాలలో నటిస్తూ, అటు అధికారాన్ని.. ఇటు సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటారు? తప్పుకోకున్నా ఫర్వాలేదు కానీ.. తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పినా పవన్కు మంచి పేరు వస్తుంది. అయితే ఆయనకు ఆ ధైర్యం ఉందా? అన్నదే ప్రశ్న. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుగాలి ప్రీతి తల్లి హౌజ్ అరెస్ట్
కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. చంద్రబాబు, పవన్, అనితల వల్ల కాకపోవడంతో.. ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లాలని తల్లి పార్వతి, తండ్రి రాజునాయక్ ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు. ప్రధాని కర్నూలు పర్యటన వేళ.. పోలీసులు ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. మోదీని కలిసి తమకు న్యాయం చేయమని కోరాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బుధవారం కర్నూలు కలక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు కూడా. అయితే మోదీ పర్యటన, సభకు సుగాలి ప్రీతి కుటుంబం అటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో.. భద్రతా కారణాలను చూపిస్తూ హౌజ్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పవన్.. ఏ ముఖం పెట్టుకుని కర్నూలు వస్తున్నావ్? -
కర్నూలు చేరుకున్న మోదీ
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పర్యటన ఇలా.. 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం10.20 AM: కర్నూలు ఎయిర్పోర్ట్10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు4.00 PM: బహిరంగ సభ4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక4.40 PM: కర్నూలు ఎయిర్పోర్ట్కి బయల్దేరి7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపుకర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. -
వ్యక్తి స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తి స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టు, ట్రయల్ కోర్టులకు మరోసారి స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విచారణ ప్రతి కేసు విషయంలో దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలని, ఒకరి కేసుతో మరొకరి కేసును ముడిపెట్టడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులు బెయిల్ అంశంలో వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలతో మద్యం అక్రమ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది.కేసు నేపథ్యం ఏమిటంటే..మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇదే కేసులో నాల్గవ నిందితునికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు, బెయిల్ రద్దు పిటిషన్పై తాము తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ కేసుకు సంబంధించిన ఇతర బెయిల్ పిటిషన్లపై విచారణను నిలిపివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ నిరవధికంగా నిలిచిపోయింది. తనకు సంబంధం లేని కేసు కారణంగా తన బెయిల్ పిటిషన్పై విచారణ జరగకపోవడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే:సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. పిటిషనర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘గత నాలుగు నెలలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్కు, హైకోర్టులో నడుస్తున్న మరో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా విచారణ నిలిపివేయడం అన్యాయం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ హక్కును హరించడమే’ అని వాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదన.లు వినిపించారు. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ను తక్షణం విచారించాలి: సుప్రీం ఆదేశాలుసుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్పై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ‘ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నంత మాత్రాన, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను ఆపడం సరికాదు. ఒకరి వ్యక్తి స్వేచ్ఛ అంశం ఇమిడి ఉన్నప్పుడు, ఆ బెయిల్ పిటిషన్పై విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం వెనుక ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు. వేర్వేరు దరఖాస్తులను ఒకే గాటన కట్టడం సరికాదు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తక్షణమే విచారించాలి. ఇతర కేసులతో సంబంధం లేకుండా, కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. మరో నిందితుడి బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ దాని సొంత మెరిట్పై కొనసాగవచ్చు. ఆ విచారణలోని అంశాలు గానీ, పరిశీలనలు గానీ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రభావం చూపకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను ఆయా కోర్టుల ముందు ఉంచవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో పిటిషన్ను పరిష్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. -
రూ.కోటి ఇస్తా.. వీసీ పోస్టు నాదే!
సాక్షి, అమరావతి: ‘రూ.కోటి ఇస్తా.. వీసీ పోస్టు నాదే.. నన్ను కాదని వీసీగా ఎవరొస్తారు.. సెర్చ్ కమిటీ ఎవరి పేరు సిఫారసు చేసినా నేనే వీసీ.. అవసరమైతే వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఆర్డర్ తెచ్చుకుంటా’ అని ముఖ్య నేత ఇలాకాలోని ఓ వర్సిటీ ఇన్చార్జి వీసీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయిలో వైస్ చాన్సలర్లను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 16 నెలలుగా వర్సిటీల్లో పాలన గాడి తప్పడంతో విద్యా వ్యవస్థ కుదేలవుతోంది. ఇంకా నాలుగు వర్సిటీలకు వీసీలను నియమించడంలో పిల్లి మొగ్గలు వేస్తోంది.ప్రభుత్వం వీసీల నియామకానికి వర్సిటీలకు విడివిడిగా యూజీసీ, వర్సిటీ, రాష్ట్ర ప్రతినిధులుగా ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ నియమిస్తుంది. సెర్చ్ కమిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి మూడు పేర్లు ప్రతిపాదిస్తుంది. అందులో ఒకరిని గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీ ఇన్చార్జి వీసీ మాత్రం సెర్చ్ కమిటీతో సంబంధం లేకుండా వీసీ పోస్టు కోసం మంత్రాంగం నెరుపుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవానికి వర్సిటీకి సెర్చ్ కమిటీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ పేరును సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే ఎలాగైనా సెర్చ్ కమిటీ నివేదికను పక్కకు తప్పించి, పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ) ఆర్డర్ తెచ్చుకుని వీసీగా కొనసాగాలని ఆ ఇన్చార్జ్ వీసీ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆయన వర్సిటీలో కంటే అమరావతిలోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాస్తారా? ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీలో అర్హత లేనప్పటికీ సొంత సామాజిక వర్గం కార్డును అడ్డు పెట్టుకుని ఆయన ఇన్చార్జి వీసీగా చెలామణి అవుతున్నారని ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ఆయనకు ఆచార్యునిగా పదోన్నతిపై కోర్టులో కేసులు ఉండటం గమనార్హం. వాస్తవానికి బోధనేతర విభాగానికి చెందిన వ్యక్తికి ఆచార్యుడిగా ప్రమోషన్ ఇవ్వడమే వర్సిటీ నిబంధనలకు విరుద్ధం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏకంగా ఇన్చార్జి వీసీని చేసింది. ఇప్పుడు ఆయన్ని ఏకంగా వీసీగా (ఎఫ్ఏసీ) ఎక్కడ నియమిస్తారోనని వర్సిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సదరు ఇన్చార్జి వీసీ 16 నెలల్లో వర్సిటీ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మేశారని విమర్శలు మూటగట్టుకున్నారు. దశాబ్దాల నాటి చెట్లను తెగనరికి అడ్డంగా దోపిడీకి పాల్పడటంపై సీఎంవో వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు స్క్రాప్ పేరుతో కంప్యూటర్లు, టేబుళ్లను కారు చౌకగా ఇచ్చేసి భారీగా ముడుపులు దండుకున్నారని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి. -
ఎమౌంట్ తగ్గితే ఎమ్మెల్యే బావ ఊరుకోడు
సాక్షి నెట్వర్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ పెద్దలు వెనుక ఉండి.. అద్దేపల్లి జనార్దనరావును ముందు పెట్టి ఈ స్కామ్ నడిపారని ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావుకు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య ఫోన్లో జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇందులో జనార్దనరావు ‘సార్.. ఈ వీక్ ఎమౌంట్ పంపించాను’ అని టెక్ట్స్ చేయగా.. ‘రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలే పంపించావు’ అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు. ‘వచ్చి కలుస్తాను’ అని జనార్దన్ చెప్పగా.. ‘కలవడం కాదు.. బావ ఊరుకోడు.. రిమైనింగ్ అమౌంట్ పంపించు. నెక్ట్స్ వీక్ ఇలా చేయకు’ అని కోటేశ్వరరావు చాట్æ చేసిన వాట్సాప్ మెసేజ్ కలకలం సృష్టిస్తోంది. అద్దేపల్లి జనార్దన్రావు ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లను కూటమి నాయకులే పెట్టించారనేందుకు ఇదో ఉదాహరణ అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాగోతం మొత్తం బట్టబయలు కావడంతో విదేశాల్లో ఉన్న జనార్దన్రావును హుటాహుటిన రప్పించి రిమాండ్కు పంపడం.. ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించడం.. ఈ స్కామ్ను వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పైకి నెట్టాలని చూడటం తెలిసిందే. అటు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో, ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో టీడీపీ పూర్తిగా ఇరుకున పడిపోవడంతో ‘ముఖ్య’ నేత పలు విధాలా డైవర్షన్ రాజకీయం చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా అధికార టీడీపీ నేతలే చేస్తున్నారని అన్ని ఆధారాలూ ప్రజల్లోకి వెళ్లడంతో ‘ముఖ్య’ నేత అంతర్మథనంలో పడ్డారు. దీన్నుంచి బయట పడేందుకే ‘సిట్’ను ఏర్పాటు చేసి, తాత్కాలికంగా ఈ విషయం మరుగున పడేయాలని యత్నిస్తున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్లో ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఇంట్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిగాయి. నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులు జనార్దనరావు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో కూడా కెమెరాలు బిగించారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేశారు. మరో వైపు ఏఎన్నార్ బార్ సమీపంలో పట్టుబడిన నకిలీ మద్యం డంప్కు అనుకుని ఉన్న స్వర్ణ సినీ కాంప్లెక్స్లోని సీసీ టీవీ పుటేజీని ఎక్సైజ్ శాఖ ఎన్పోర్స్మెంట్ సీఐ వర్మ పరిశీలించారు. -
సాక్షి గొంతు నొక్కేందుకు మరో ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజల హక్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న ‘సాక్షి’ గొంతుక నొక్కడానికి కూటమి ప్రభుత్వం మరోసారి పోలీసులను ప్రయోగించింది. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీఎన్ఎస్ఎస్ 179 (1), 94 సెక్షన్ల కింద బుధవారం రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు. ‘నకిలీ మద్యానికి నలుగురు బలి’ శీర్షికన 2025 అక్టోబర్ 8వ తేదీన సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి దాఖలైన రెండు అక్రమ కేసుల్లో నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బుధవారం హైదారాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ ధనంజయరెడ్డికి చెరో రెండు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు సార్లు సాక్షి కార్యాలయానికి రావడాన్ని పరిశీలిస్తే, వారిమీద అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసమంజస ఆదేశాలు వార్తా కథనానికి సంబంధించి బీఎన్ఎస్ఎస్ 94 సెక్షన్ ప్రకారం పలు డాక్యుమెంట్లు సమర్పించాలని నిర్దేశించారు. వార్తకు సంబంధించి ఎడిటోరియల్ ఫైల్.. ఒరిజనల్ డ్రాఫ్ట్ కాపీ (ప్రింట్ అండ్ డిజిటల్) ఇవ్వాలని కోరారు. దీనితోపాటు వార్తా కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్లతో సంబంధమున్న రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ వార్తా కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్మెంట్లు, ఈ–మెయిల్, మెసేజ్లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలని సూచించారు. పబ్లికేషన్ ఆథరైజేషన్ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని స్పష్టం చేశారు. తద్వారా పత్రిక, మీడియాకు సంబంధించి సోర్స్ బయటకు వెల్లడించాల్సిన పనిలేదని ఆర్నాబ్ గోస్వామి కేసుతోసహా పలు సందర్భాలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారు. కేవలం 12 గంటల గడువు కాగా, పోలీసులకు ఎడిటర్ పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ, ‘‘తాము నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేరు’’ అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు తాము కోరిన సమాచారాన్ని అంతా కేవలం 12 గంటల లోపు అంటే.. 16వ తేదీన 2:30 గంటలకల్లా హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంలోకానీ లేదా ఆయా పోలీస్ స్టేషన్లలో కానీ (నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్)లలో సమర్పించాలని స్పష్టం చేశారు. అలాగే ‘‘నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేని కారణంగా’’ 16వ తేదీ 10.30 గంటలకు తమ విచారణకు సాక్షి కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నెల్లూర్ రూరల్ పోలీసులు 179 (1) నోటీసుల్లో పేర్కొనగా, ఈ సమయాన్ని 2.30 గంటలుగా కలిగిరి పోలీసులు నిర్దేశించడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేది?ఒక వార్తా కథనానికి సంబంధించి ఎడిటర్ను సోర్స్ (ఆధారం) వెల్లడించమని పోలీసులు డిమాండ్ చేయడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద పత్రికా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించడం కాదా?వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం, ద్వంద్వ విచారణ (డబుల్ జియోపార్డీ) లేదా అధికార దురి్వనియోగం కిందకు రాదా?బీఎన్ఎస్ఎస్ 94 కింద డాక్యుమెంట్లు, ఎడిటోరియల్ ఫైళ్లు, రిపోర్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వమని పోలీసుల ఆదేశం పత్రికా స్వేచ్ఛను అణిచివేసే చర్య కాదా?ఉన్నత న్యాయస్థానాలు పలు తీర్పుల్లో పత్రికా సోర్స్ను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఏపీ పోలీసుల చర్య ఆ తీర్పులను తుంగలోతొక్కడం కాదా?కేవలం 12 గంటల గడువులో ‘అంతా సమర్పించాలని’ అంటూ డిమాండ్ చేయడం, సహజ న్యాయ సూత్రమైన ‘సమంజస సమయం ఇవ్వాలి’ అనే నిబంధనను ఉల్లంఘించడం కాదా?సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కాబట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయడం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా?ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను హరించి భయపెట్టి, లొంగదీసుకునే చర్యగా ఎందుకు పరిగణించకూడదు?ఇది.. మీడియాపై టెర్రరిజం మీడియాను టెర్రరైజ్ చేసే ధోరణులు ప్రజాస్వామ్యంలోని వ్యక్తులందరూ ఖండించాలి. పత్రికా ఎడిటర్లు, విలేకర్లపై పోలీసులుపదేపదే కేసులు నమోదు చేయడాన్ని మీడియాపై టెర్రరిజంగానే పరిగణించాలి. ప్రచురితమైన వార్తకు సంబంధించి సమాచారం పేరిట పత్రికా కార్యాలయానికి నోటీసు ఇవ్వడం తగదు. – జి.ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఇది. ఎడిటర్లు, విలేకర్లను భయభ్రాంతులకు గురి చేసి పత్రికా వ్యవస్థను భయపెట్టాలనే ఆలోచన తప్పు. ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. పత్రికా కార్యాలయాలపైకి పోలీసులు పంపించడం సరికాదు. – శ్రీరాం యాదవ్, ఏపీ మీడియా ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాక్షి మీడియాపై దాడి హేయం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై దాడి హేయం. నకిలీ మద్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎదుట దోషిలా నిలబడింది. వాస్తవాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’పై కేసులు పెట్టి అడ్డుకోవాలని చూస్తోంది. ఎడిటర్పై కేసు పెట్టి నోటీసులతో పత్రికా కార్యాలయానికి వెళ్లడం ప్రజాస్వామ్యం దాడిగానే పరిగణించాలి. – ధారా గోపీ, సీనియర్ జర్నలిస్టు మీడియాపై రాజకీయ కక్షలు సరికాదు మీడియాపై రాజకీయ కక్షలు తగవు. సాక్షిలో ప్రభుత్వ వైఫల్యాలపై కథనాలు వచ్చినంత మాత్రాన పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడులు చేయడం, ఎడిటర్ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు నిర్వహించడం సరికాదు. మీడియాపై అధికారుల దాడులు, ఒత్తిళ్లు, వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది. – కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే -
మద్యం తాగిన మైనర్.. రైలుకింద పడి ఆత్మహత్య
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.బెల్టు దుకాణమే కారణమా? చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది. -
చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్ (11), గౌతమ్ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మృత్యు ఘంటికలు!
మక్కువ (పార్వతీపురం మన్యం): ఆశ్రమ పాఠశాలల్లో చేరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న అడవి బిడ్డల కలలు ఆవిరైపోతున్నాయి. చదువుల మాట దేవుడెరుగు.. ఆశ్రమ పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి వస్తే చాలు అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. కలుషిత తాగునీరు, అనారోగ్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల ఏడాది వ్యవధిలో 15 మంది గిరిజన విద్యార్థులు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం గమనార్హం. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 11 ఏళ్ల వయసున్న చిన్నారి అనే విద్యార్థి కిడ్నీ సమస్య బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతిపార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తాడంగి చిన్నారి (11) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న చిన్నారి అనారోగ్యానికి గురైనట్లు ఈనెల 13వ తేదీన తల్లిదండ్రులు ముగిరి, కాంతమ్మకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది. చిన్నారి తల్లిదండ్రులు అదే రోజు పాఠశాలకు చేరుకొని విద్యార్థిని సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. కలుషిత నీరు కారణంగా అనారోగ్యానికి గురై, కిడ్నీలు పాడవడంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గిరిజన, ప్రజా సంఘాల ఆందోళన..రైతు కూలీసంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, జిల్లా నాయకులు అసిరి, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేష్, గిరిజన సంఘం నేత మండల గిరిధర్రావు తదితరులు మూలవలస చేరుకుని విద్యార్థి మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఐటీడీఏ అధికారులు గ్రామానికి వచ్చి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాలకు తరలించి నిరసన చేపడతామని హెచ్చరించారు. గిరిజన బిడ్డల ఆరోగ్యం గురించి మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదని, అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకాల కోసం చేసిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బాలుడు కిడ్నీలు పాడై చనిపోవడం ఏమిటని మండిపడ్డారు. తాగునీటి సమస్యతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఆర్వో ప్లాంట్లు మూలకు చేరినా బాగు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటీడబ్ల్యూ విజయశాంతి, ఏటీడబ్ల్యూ కృష్ణవేణిని చుట్టుముట్టిన ప్రజాసంఘాలు, గిరిజన నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చిన్నారి చనిపోయాడని మండిపడ్డారు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ, ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురించి ప్రభుత్వం దృష్టికి తెస్తామని డీటీడబ్ల్యూఓ పేర్కొన్నారు.ఈ ఏడాది జూన్లో జియ్యమ్మవలస మండలం టీకే జమ్ముకు చెందిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కె.తనూజ, గత నెల 26న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి, ఈ నెల ఒకటో తేదీన కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయారు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 180 మందికిపైగా బాలికలు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత కొద్దినెలల కిందట మృతిచెందగా.. సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) రెండు రోజుల కిందట చనిపోయింది. తాజాగా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.మన్యంలో మరణ మృదంగం గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు, పార్వతీపురం మండలం రావికోన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థి పి.రాఘవ, గుమ్మలక్ష్మీపురం మండలం వామాసి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల మండంగి గౌతమ్ మలేరియాతో చనిపోయాడు. కొమరాడ కేజీబీవీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.శారద, గుమ్మలక్ష్మీపురం బాలికల ఆశ్రమ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎన్.అవంతిక, కురుపాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి నితిన్, జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి జీవన్కుమార్, గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ముకు చెందిన మూడో తరగతి చదువుతున్న జి.దినేష్ మృతిచెందారు.కన్నెత్తి చూడని విద్యాశాఖ మంత్రిఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కురుపాంలో ఇద్దరు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటనను కప్పిపుచ్చేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమంటూ మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ దారుణ వైఖరికి అద్దం పడుతోంది. గిరిజన విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, విద్యాశాఖ మంత్రి గానీ సమీక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన కూడా లేదు. విశాఖలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి కేజీహెచ్కు వెళ్లి గిరిజన బిడ్డల ఆరోగ్యంపై కనీసం ఆరా తీయలేదు. విద్యార్థుల చావులకు కారణాలను కప్పిపుచ్చుతూ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది.పిల్లలు చనిపోతున్నా పట్టదా..?మా కుమారుడు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందిన వెంటనే పాఠశాలకు వెళ్లాం. సాలూరు, విజయనగరం, కేజీహెచ్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలు అనారోగ్యంతో మృతి చెందుతున్నా పట్టించుకునేవారే లేరు. – తాడంగి ముగిరి (చిన్నారి తండ్రి, మూలవలస గ్రామం)తాగునీటి సమస్యే కారణం..విద్యార్థి చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 8వ తేదీన శంబర పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్ వచ్చింది. 10వ తేదీన పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడంటూ పంపించేశారు. చిన్నారి 13వ తేదీన మళ్లీ అనారోగ్యానికి గురికాగా సాలూరు, విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చిన్న వయసులో కిడ్నీలు పాడవడం దారుణం. దీనికి తాగునీటి సమస్యే ప్రధాన కారణం. ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి. – కె.సోమేష్, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
అధికారంలోకి రాగానే 'క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్'
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నకిలీ మద్యం బండారం అధికారికంగా బట్టబయలైంది. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం నాణ్యతపై ఎటువంటి భరోసా లేదని తేటతెల్లమైంది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే ఇన్నాళ్లూ విక్రయాలు సాగించినట్టు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలకు రాచబాట పరిచిందనీ స్పష్టమైంది. తీరా నకిలీ బాగోతం బట్టబయలు కావడం.. ప్రభుత్వ ముఖ్య నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుండటం.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతుండటంతో గత్యంతరం లేక.. గత ప్రభుత్వంలో అమలైన తరహాలో బాటిల్పై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి విక్రయించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తద్వారా నకిలీ మద్యం దందాను కప్పిపుచ్చేందుకు పన్నాగం పన్నింది. అయితే క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయకపోతే ఏం చేస్తారనే విషయమై స్పష్టత లేదు. అలాగే వీధి వీధిన ఏర్పాటైన బెల్ట్ షాపుల్లో ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనే విషయాన్ని వెల్లడించ లేదు. తద్వారా బెల్ట్ షాపుల ద్వారా ఈ రాకెట్ నడుపుకోవచ్చనే సంకేతాలు ఇస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాదిన్నరగా విక్రయించిన మద్యంలో ఎంత మేర నకిలీ ఉందోనని ఇన్నాళ్లూ తాగిన వారు ఆందోళన చెందుతున్నారు.గత ప్రభుత్వ హయాంలోనే క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు.. మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమైన మద్యమేనా.. మద్యం ఏ డిస్టిలరీలో తయారైంది.. ఎప్పుడు తయారైంది..బ్యాచ్ నంబరు..ఇలాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండేలా పటిష్ట విధానాన్ని అమలులోకి తెచ్చింది. మద్యం నకిలీ/కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు ఈ విధానాన్ని పటిష్టంగా నిర్వహించింది. అప్పట్లో ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణంలో వినియోగదారులకు వారి ముందే బాటిల్ను క్యూర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే విక్రయించే వారు. 2024లో రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపి వేసింది. అపై టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ అమలు చేయాలని ఇప్పుడు ఉత్తర్వులు రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా దోపిడీ బయట పడటంతో కూటమి ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. దాంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా బుధవారం ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 45 రోజుల్లో ఈ విధానం అమలు చేసేలా రాష్ట్రంలోని 3,336 వైన్ షాపుల్లో, 540 బార్లలో, (త్వరలో రానున్న మరో 300 బార్లలో కూడా) ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అంటే ఏడాదిన్నరపాటు క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే సాగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమ్మతించినట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు రెండు నాల్కల విధానంపై విస్తుపోతున్నారు.నకిలీ మద్యానికి రాచబాటేటీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే మద్యం విక్రయాలు సాగించింది. ఏడాదిన్నరగా వేల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే ఇంత భారీగా మద్యాన్ని విక్రయించినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో కేవలం టీడీపీ సిండికేట్ దుకాణాల ద్వారా నకిలీ మద్యం విక్రయాలను అడ్డూ అదుపు లేకుండా చేసేందుకే క్యూ ఆర్ కోడ్ స్కాన్ను తొలగించారని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం రాకెట్ బయట పడటం గమనార్హం. ఏడాదిన్నరలో విక్రయించిన మద్యంలో నకిలీ ఎంత ఉంటుందన్నది అంచనాలకు అందడం లేదు.ఇదీ సంగతి! ⇒ క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం అమలు చేయాలని ఇప్పుడు చెప్పడం ద్వారా ఏడాదిన్నరగా రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు జరిగాయన్నది ప్రభుత్వమే ఒప్పుకుంది. ⇒ రాష్ట్రంలోని మద్యం షాపుల్లో ఏడాదిన్నరగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ అన్నదే లేదని తేల్చింది. ⇒ ప్రస్తుతం మద్యం షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్ పరిధిలో ఉన్నాయి. వాటిలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ⇒ ఊరూరా.. వీధి వీధిన ఉన్న బెల్ట్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ను ఎలా అమలు చేయిస్తుంది? ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పారదర్శకంగా నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగాయని ఒప్పుకున్నట్టే. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
తురకపాలెంలో ‘మరణాలు’ ప్రభుత్వ ‘హత్యలే..’
గుంటూరు రూరల్: తురకపాలెంలో జరిగినవి ప్రభుత్వ హత్యలేనని ఆ గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. అరుదైన వ్యాధితో దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన నాయకులు ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి కారణంగా గ్రామస్తులు మృతి చెందారని చెబుతున్నప్పటికీ మరణాలకు అసలు కారణాన్ని నేటికి గుర్తించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 46 మంది మృతి చెందితే కేవలం 28 మందికే నామమాత్రంగా రూ. 5 లక్షలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణం. కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి. గ్రామంలో 24 గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కేవలం క్వారీ నీటిని తాగడం వల్లే ఇంతటి దారుణ పరిస్థితి సంభవించింది. ఏడాదిగా తాగునీరు మురికిగా వస్తోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని, గ్రామ ప్రజలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారమే చూపడం లేదు. మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభరత్రెడ్డి తదితరులు గ్రామంలో పర్యటించిన పార్టీ ప్రతినిధి బృందంలో ఉన్నారు.నెలరోజుల్లో మంచినీటి ప్లాంట్తురకపాలెం దళితవాడలో సురక్షిత మంచినీటి వ్యవస్థ అవసరమని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఆర్వో ప్లాంట్ను నిర్మించి గ్రామానికి నెల రోజుల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు నగరం నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
రూ.360 కోట్ల భూమిని రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలోని అత్యంత విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా గ్రూపునకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మార్కెట్లో ఎకరా రూ.12 కోట్లు ఉన్న భూమి కేవలం రూ.1.5 కోట్లకే కేటాయించారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి ఈ పిల్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సత్వా గ్రూపునకు రూ.360 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని తెలిపారు. ఆ భూమిలో రియల్ కంపెనీ ఆఫీసు కార్యాలయాలను నిర్మించి లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటుందని పొన్నవోలు చెప్పారు. అనంతరం భూ కేటాయింపుల విధానాన్నే సవాలు చేస్తామని, అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
‘సాక్షి’పై కుతంత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. హైదరాబాద్లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం దాదాపు 10 గంటలపాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు ఇలా ఉన్నాయి. నకిలీ మద్యం దారుణాలను బట్టబయలు చేస్తున్నందునే... రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా సాక్షి మీడియా పోరాడుతోంది. అమాయక ప్రజల ప్రాణాలకు పెనుముప్పు కలిగిస్తున్న నకిలీ మద్యం బాగోతాన్ని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెస్తూ ప్రజలను చైతన్య పరుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తాజాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం మాఫియా దారుణాలను సవివరంగా వెల్లడించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కుతో ‘సాక్షి’ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. నకిలీ మద్యం తాగిన అనంతరం సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి పత్రిక ప్రచురించటాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు సహించలేకపోయారు. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాకుండా.. వాటిని వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పత్రికలు ప్రచురించే కథనాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారికంగా వివరణ (రిజాయిండర్) పంపించవచ్చు. ఇంకా కావాలనుకుంటే పరువు నష్టం దావా వేయవచ్చు. అందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీనిపై న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగపరమైన నిబంధనలను పాటించాలన్న ఆలోచనే లేనట్లుగా కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఐదు రోజులుగా వేధింపులు.. అనంతరం ప్రభుత్వం పోలీసులను నేరుగా రంగంలోకి దింపింది. ఈ క్రమంలో పోలీసులు ఐదు రోజులుగా నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జ్ను వేధిస్తున్నారు. ఈ నెల 12న తెల్లవారుజామునే విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయానికి పోలీసులు చేరుకుని హడావుడి చేశారు. కార్యాలయం తాళాలు తెరవకముందే అక్కడకు వచ్చి నోటీసులు తీసుకోవాలని సిబ్బందిని వేధించారు. ఎడిటర్ హైదరాబాద్ కార్యాలయంలో ఉంటారని చెప్పినా వినిపించుకోకుండా సంబంధం లేని ప్రశ్నలతో బెదిరించేందుకు యత్నించారు. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, రాత్రి 8.30 గంటలకు కలిగిరి పోలీసులు వెళ్లి నోటీసుల పేరుతో హడావుడి చేశారు. అంతేకాదు.. 12వ తేదీ తెల్లవారు జామునే మరోసారి ఆయన నివాసంలో సోదాల పేరుతో పోలీసులు హంగామా చేశారు. వెంటనే విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని ఒత్తిడి చేశారు. ఆరోగ్య సమస్యలతో డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు. సరేనని వెళ్లిన పోలీసులు మళ్లీ అదే రోజు అర్ధరాత్రి మళ్లీ మస్తాన్రెడ్డి నివాసానికి రావడం గమనార్హం. రాత్రి 11.15 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, అర్ధరాత్రి 1.20 గంటలకు కలిగిరి పోలీసులు ఆయన నివాసానికి వచ్చి రాద్ధాంతం చేశారు. పది రోజుల సమయం ఇవ్వడం కుదరదని.. మర్నాడే అంటే 13వతేదీ ఉదయమే విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. 13న ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఆయన్ను విచారించారు. ఏమాత్రం సంబంధం లేని 62 ప్రశ్నలు అడిగారు. ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కలిగిరి పోలీసులు విచారించారు. 67 ప్రశ్నలు అడగటం గమనార్హం. అంతటితో పోలీసులు శాంతించలేదు. ఈ నెల 17న మళ్లీ విచారణకు రావాలని బుధవారం సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల కుట్రే.. పోలీస్ బాస్ల పర్యవేక్షణ సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్రను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఉన్నత స్థాయి ఆదేశాలు, ఒత్తిడితోనే పోలీసులు ఐదు రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోదాలు, విచారణకు వచి్చన పోలీసులకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఏకంగా 30 సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే పోలీసు వేధింపులను ఉన్నత స్థాయిలో ఎంత నిశితంగా పర్యవేక్షిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్ర అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందన్నది తేటతెల్లమవుతోంది.హైదరాబాద్ కార్యాలయంలో పోలీసుల హల్చల్... మరోవైపు హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేసినంత పని చేశారు. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి వాట్సాప్లో ముందుగా నోటీసులు పంపారు. అసలు వాట్సాప్లో నోటీసులు పంపవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా, దాన్ని నిర్భీతిగా ఉల్లంఘించి మరీ వాట్సాప్లో నోటీసులు పంపించారు. నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు బుధవారం హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యాలయంలో హడావుడి చేసి పాత్రికేయులను బెదిరించే రీతిలో వ్యవహరించారు. అంటే సాక్షి పత్రిక గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బుధవారం నోటీసుల జారీ, విచారణ పేరుతో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించారు. ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇవ్వాలని, న్యూస్ సోర్స్ చెప్పాలని, మరింత సమాచారం కోసం రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 12 గంటల సమయం ఇచ్చి రేపు హాజరు కావాలన్నారు. పోలీసుల ప్రశ్నావళికి సమాధానం చెప్పేందుకు పది రోజుల సమయం కావాలని ఎడిటర్ ధనంజయరెడ్డి వారితో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చేందుకు ఈ నెల 29 వరకు గడువు కోరారు. కేసుల నమోదు పద్ధతి కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్పై వరుసగా కేసులు నమోదుచేయడం ఆక్షేపణీయం. ఏదైనా వార్త, కథనంలో తప్పున్నట్లైతే అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని, లేదా ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. కానీ, ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదుచేయడం పద్ధతికాదు. – తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు పత్రికా స్వేచ్ఛను హరించడమే.. పత్రికలో ఒక వార్త ప్రచురిస్తే ఆ వార్తకు సంబంధించి ‘న్యూస్ సోర్స్’ను వెల్లడించాలని పోలీసులు బలవంతం చేయలేరు. ఎడిటర్ ధనంజయ్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు నమోదుచేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – డాక్టర్ పి. విజయబాబు, సీనియర్ సంపాదకులు ఈ సంస్కృతి మంచిది కాదు పత్రికలో కానీ.. ప్రసార మాధ్యమాల్లో కానీ ఏవైనా వార్తలు ప్రచురించినప్పుడు... వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే కౌంటర్ వివరణ ఇవాలి. న్యాయపోరాటం చేయాలి. అంతేగానీ ఇలా బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఏజె) కార్యదర్శి దాడులు సిగ్గుచేటు హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గం, సిగ్గుచేటు. – అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా కలంపై జులుం తగదు.. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కలి్పంచిన హక్కు. సాక్షి కార్యాలయాలపై దాడులు, ఎడిటర్పై కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దాడులను అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కలంపై జులుం తగదు. – ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్, సీనియర్ జర్నలిస్ట్, కలింగవార్త ఎడిటర్, రాజాం అప్రజాస్వామికం ప్రభుత్వ విధానాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో సాక్షి మీడియాపై పోలీసులతో సోదాలు, దాడులు చేయించడం అప్రజాస్వామికం. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతిపక్ష పార్టీలు, సమాచార మాధ్యమాలు గొంతుకను వినిపించే హక్కు లేకుండా చేయాలని చూడటం నియంత పాలనే. – జి.శాంతమూర్తి, ఇండియన్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరు -
ఇప్పటికే కూటమిలో విభేదాలు..
నెల్లూరు టాస్క్ఫోర్స్: కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడాలని స్పష్టం చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరూ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామ న్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు. నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఏపీలో వైన్స్, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ జీవో జారీ
సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపులు, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం పునరుద్ధరిస్తూ.. ఎక్సైజ్ శాఖ జీవో 376 జారీ చేసింది. ప్రతి మద్యం షాపు, బార్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. నకిలీ మద్యానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏడాది కిందట క్యూ ఆర్ కోడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. టీడీపీ నేతల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్లగానే క్యూ ఆర్ కోడ్ విధానం ఎత్తివేసింది.ఏడాదిగా మద్యం, బార్ షాపుల్లో నకిలీ మద్యానికి ఎక్సైజ్ శాఖ ఆస్కారం కల్పించింది. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడటంతో తాజాగా జీవో జారీ చేస్తూ.. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ తెచ్చింది. మద్యం షాపు, బార్లలో ప్రతి బాటిల్ను క్యూ ఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాలని ఆదేశాల జారీ చేసింది. -
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్లో స్టెరాయిడ్స్తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. -
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కాకాణి
సాక్షి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.కూటమి ప్రభుత్వంలోనే ఈ దందా అని నిర్థారించిన ఎక్సైజ్ అధికారులునకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, చంద్రబాబు, లోకేష్లతో సన్నిహత సంబంధాలు ఉన్నవారే సూత్రదారులు అని బయటపడింది. సాక్షాత్తు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ప్రమేయం వెలుగుచూసింది. అయినా కూడా సిగ్గులేకుండా విషయాన్ని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం మరకను వైఎస్సార్సీపీపై రుద్దడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3వ తేదీన ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది.నకిలీ మద్యం, సీసాలు, లేబుళ్ళు వెలుగుచూశాయి. ఇబ్రహీంపట్నంలో వేల లీటర్ల మద్యంను నిల్వ చేసిన గోడవున్ను గుర్తించారు. ఈ దందా రెండుమూడు నెలలుగా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ కమిషన్ మూడు నెలలుగా జరుగుతున్నట్లు చెప్పారు.రెండుమూడు నెలలుగా ఈ నకిలీ మద్యం దందా రెండుమూడు నెలల నుంచే జరుగుతోందని ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఈ నకిలీ మద్యం దందా రెండు మూడేళ్ల నుంచి జరుగుతోందంటూ వైఎస్సార్సీపీకి కూడా ఆ బురదను అంటించే కుట్రకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అందులో భాగంగా ఒక విషప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిందే కాదు, గత ప్రభుత్వంలోనూ జరిగిందంటూ చెప్పేందుకు తంటాలు పడుతోంది.జనార్థన్ వీడియో ద్వారా డైవర్షన్అక్టోబర్ ఆరో తేదీన జనార్థన్రావు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ 'నకిలీ మద్యం తయారీలో నన్ను ముద్దాయిగా చూపుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ వారికి సంబంధం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆఫ్రికాలో వున్నాను, నేను ఇండియాకు వచ్చిన తరువాత జరిగిన వాస్తవాలను వెల్లడిస్తాను' అని చెప్పాడు. ఆయన వీడియోలో ఎక్కడా జోగి రమేష్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక ఆయన రెండో వీడియో ఈ నెల 13న విడుదల చేశాడు. దీనిలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రపన్ని, తనకు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ మద్యం తయారీని చేయించారంటూ' ఆరోపణలు చేశాడు.'నకిలీ మద్యం తయారీ బయటపడటంతో జయచంద్రారెడ్డి తదితరులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చుకున్నాడని, ఇబ్రహీంపట్నంలో ముందుగా సరుకును తెచ్చిపెట్టమని చెప్పడని, దానిని సాక్షి మీడియా ద్వారా ఎక్సైజ్ వారికి పట్టించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడంటూ' కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెబితేనే తాను చేశానని, టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పేర్కొన్నారు. తొలి వీడియోకు, రెండో వీడియోకు సంబంధం లేకుండా జనార్థన్రావు మాట్లాడాడు. రెండో వీడియోతో నకిలీ మద్యం కేసును డైవర్ట్ చేసేందుకు కుట్ర ప్రారంభమైంది.టీడీపీ నేతలు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు?టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులపై టీడీపీ ఎందుకు సస్పెన్షన్ వేటు వేసింది? జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే తాను నకిలీ మద్యంను రవాణా చేశానంటూ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దానికి ఆధారాలు కూడా ఉండటంతోనే విధిలేని స్థితిలో టీడీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంపై సీరియస్గా ఉందని, మేమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, గోడౌన్లను వెతికి పట్టుకున్నామని, దాడి చేయించామని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.అలాంటప్పుడు జనార్థన్రావు విడుదల చేసిన రెండో వీడియోలో జోగి రమేష్ నకిలీ మద్యంను తెప్పించి, ఇబ్రహీంపట్నంలో పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దానిని బయటపెట్టించి, ఎక్సైజ్ వారితో సీజ్ చేయించారని ఎలా చెబుతారు? చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా ఈనాడులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడినా కూడా రెండుమూడు రోజుల పాటు దానిపై ప్రస్తావన కూడా చేయలేదు. తరువాత తప్పు చేశారు కాబట్టే మా పార్టీకి చెందిన నాయకులను సస్పెండ్ చేస్తున్నామని నారా లోకేష్, వర్ల రామయ్య ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్వీట్లో జయచంద్రారెడ్డి 'ఏ1' అంటూ పేర్కొని, తరువాత రెండు రోజుల్లో 'ఏ1' అనే దానిని తొలగించారు. అంటే తమ కుట్రను ప్రారంభించడానికి సిద్దమయ్యే, దానికి అనుగుణంగా తమ వైఖరిని మార్చుకున్నారనేందుకు ఇదే నిదర్శనం.సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయినకిలీ మద్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్ల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? దానికి బదులుగా వైఎస్సార్సీపీపై బురదచల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కపట నాటకాన్ని మొదలుపెట్టారు. హడావుడిగా పన్నెండో తేదీన చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టడానికి కారణం, వైయస్ఆర్సీపీ ఎంపీ మిధున్రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమంత్రికి లేఖ రాయడమే. ఎక్కడ ఇది సీబీఐ దర్యాప్తునకు దారి తీస్తుందోనని భయంతోనే చంద్రబాబు మీడియాతో రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ జగన్కి, ఆయన బంధువులుకు కూడా ఆపాదించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. నకిలీ మద్యం బయటపడిన తరువాత మౌనంగా ఉన్న ఈనాడు పత్రిక, ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫ్రికాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారంటూ వైఎస్ జగన్ బంధువులకు అంటగట్టేలా ఒక కథనాన్ని రాసింది.ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలిజనార్థన్రావును అరెస్ట్ చేసి విచారించిన తరువాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఉందా? రెండో వీడియోలో మొత్తం జోగి రమేష్ చెబితేనే చేశాను అన్న జనార్థన్రావు, పోలీసుల విచారణలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? దానికి సమాధానం చెప్పాలి. జనార్థన్రావు నెల్లూరు జైలుకు రిమాండ్కు వెళ్ళిన 24 గంటల తరువాత ఏ విధంగా ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది?ఒకవేళ పోలీసులు విచారణలో జనార్థన్రావు ఈ వీడియోలో మాట్లాడి వుంటే, రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయం ఎందుకు రాయలేదు? జనార్థన్రావు మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ జరిపారా? పక్కన ఎవరో ఉండి ప్రామ్టింగ్ ఇస్తుంటే జనార్థన్రావు మాట్లాడినట్లు కనిపిస్తోంది, అలా ప్రామ్టింగ్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి ఉన్న సమాచారంతోనే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దాడులు చేశారని సీఎం చంద్రబాబు చెప్పుకున్న విషయం వాస్తవం కాదా? రెండో వీడియోలో జనార్థన్రావు 'జోగి రమేష్ ఒక పథకం ప్రకారమే ఇబ్రహీంపట్నం గోడవున్లో నకిలీ మద్యంను పెట్టించి, ఎక్సైజ్ వారికి పట్లించారని' మాట్లాడిన విషయం వాస్తవం కాదా? అంటే ప్రభుత్వమే నకిలీ మద్యం గురించి తెలుసుకుని దాడులు చేసి, పట్టుకుందన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దమా? లేక జనార్థన్రావు తన వీడియోలో చెప్పిన మాటలు అబద్దమా?నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, టీడీపీని అసహ్యించుకుంటున్నారని తెలియగానే, వైఎస్సార్సీపీపై బుదరచల్లేందుకు గానూ జనార్థన్రావుతో ఒక పథకం ప్రకారం ఈ రెండో వీడియోను కుట్రపూరితంగా తయారుచేసి, బయటకు వదిలిపెట్టారనేది వాస్తవం కాదా? తాను విదేశాలకు వెళ్ళిపోతే రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేష్ ఆఫర్ చేశారని, అందుకే ఆఫ్రికాకు వెళ్ళినట్లు చెప్పిన జనార్థన్రావు, ఎవరు చెబితే తిరిగి ఏపీకి వచ్చారు? ఆయన చెబుతున్నట్లుగా మూడు కోట్లు తీసుకోకుండానే ఎలా ఏపీకి వచ్చాడు? మొలకలచెరువు ఘటనలో కొందరు దోషులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని విచారణకు ఇవ్వాలంటూ కష్టడీ పిటీషన్ వేశారు. కానీ జనార్థన్రావు విషయంలో ఎందుకు కస్టడీ పిటీషన్ వేయలేదు? జనార్థన్రావును లోతుగా విచారించకుండా, దొంగ వీడియోను విడుదల చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టీడీపీ నేతగా ఉన్న జనార్థన్రావును ఆఫ్రికా నుంచి పిలిపించిన ప్రభుత్వం, కీలకమైన జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదు? ఆయనపై లుక్అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేయలేదు? ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? పోలీసుల విచారణలో టీడీపీకి చెందిన నాయకులు పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాన్లను, వాటి యాజమానులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?వారంతా టీడీపికి చెందిన వారు కావడం వల్లే వారిని ఉపేక్షిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు వేల బెల్ట్షాప్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం శాంపిళ్లను సేకరించి, నకిలీ అవునా కాదా అని తెలుసుకునేందుకు ఎందుకు ల్యాబ్లకు పంపించడం లేదు? జనార్థన్రావుతో గుర్తుతెలియని ప్రాంతంలో ఒక వీడియోను తీయించి, రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారం ముదురుతుంటే ఎంపీ మిధున్రెడ్డి నివాసాలపై దాడులు చేయించడం, ప్రజల దృష్టి మళ్లించేందుకు కాదా? నకిలీ మద్యంపై మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదు? -
చంద్రబాబు, లోకేష్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్లో ఉన్న జనార్థన్రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
చంద్రబాబు దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ‘‘వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్ను మనం అమలు చేయాలి’’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధిగా పనిచేయాలన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం.. అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి సహా ఇతర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి, ఈ దుర్మార్గాలను ఆపగలగాలి. ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ దీనిపై చిత్తశుద్దిగా పనిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని వైఎస్ జగన్ ఆలోచించి అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ నిర్మించారు..క్షేత్రస్థాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర. మన సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు జగన్. మనం ఎక్కడా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన పార్టీకి కోట్లాది మంది సైన్యం సిద్ధంగా ఉంది. అందరినీ సంఘటితం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నాం. మనం ఇప్పటికే మండల స్ధాయి కమిటీలలో ఉన్నాం. ఇక గ్రామస్థాయికి వెళ్ళబోతున్నాం. డేటా ప్రొఫైలింగ్ చేస్తూ ముందుకెళుతున్నాం. దీనిపై అందరూ సీరియస్గా దృష్టిపెట్టాలి...వైఎస్సార్సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్థాయి నాయకత్వం ఉంటుంది. వీరందరి డేటా ప్రొఫైలింగ్ను మనం సరిగా నమోదు చేయగలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలను అందుకోగలుగుతాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి, ఈ ప్రక్రియకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్ను మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణంలో అలసత్వం వద్దు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి వారికి కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి...ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వైఎస్ జగన్ హయాంలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చక్కగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తే చంద్రబాబు మాత్రం రివర్స్ పాలన సాగిస్తున్నారు. గతంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చక్కగా చేశాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేద్దాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
గాయని బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నేపథ్య గాయని బాల సరస్వతీ దేవి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) ఇవాళ ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
కోనసీమలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
సాక్షి, కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు తాగించి చంపిన తండ్రి పావులూరి కామరాజు.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న కామరాజు.. తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనివాస్, దుర్గారావు అనే వ్యక్తుల వల్లే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.విద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన బాటలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ఆ రంగాల్లో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి, పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, ఈ దేశాన్ని విజ్ఞానపరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. వీధి దీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శప్రాయంగా మార్చి చూపించిన గొప్ప దార్శినికుడు. ఉన్నత చదువులతో ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి, మిస్సైల్ మ్యాన్గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి.ప్రపంచ దేశాల సరసన అణ్వస్త్రదేశంగా భారత్ను నిలబెట్టి, ఎటువంటి అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గం అని చాటిచెప్పడంలో అబ్దుల్ కలాం కృషి మరువలేనిది. ఆయన దేశానికి అందించిన సేవలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి ఆయనను అలంకరించింది. రాష్ట్రపతిగా ఆయన దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి అయిన తరువాత ఒక గురువుగా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేశారు.క్రమశిక్షణ, దేశభక్తి, విజయాన్ని సాధించాలనే సంకల్పాన్ని యువతలో పెంపొందించేందుకు ఆయన చేసిన రచనలు కూడా స్పూర్తిదాయకం. అటువంటి మహనీయుల మార్గదర్శకంలో వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతూ, సమాజంలో మార్పుకు, అభివృద్దికి పాటుపడుతోంది. అబ్ధుల్ కలాం అందించిన స్పూర్తికి అనుగుణంగానే గత అయిదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ విద్య, సాంకేతికరంగాల్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. విద్యతోన పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంలో ఆయన పనిచేశారు.దేశానికి అరుదైన సేవలందించిన మహనీయుడు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఒక కుగ్రామంలో 1931లో జన్మించి, ఈ దేశం గర్వంచే భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారు. దేశానికి రాష్ట్రపతి వంటి ఉన్నతస్థాయి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. తన పదవీకాలం పూర్తయిన తరువాత కూడా విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలవాలని తపించారు. చివరికి ఆయన విద్యార్థులకు బోధనలు చేస్తూనే మరణించారంటే, ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అబ్ధుల్ కలాం వంటి మహనీయులు ఇచ్చిన స్పూర్తిని అందుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సమాజంలో విద్యతోనే మంచి మార్పును సాధించాలనే లక్ష్యంతో పనిచేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో విద్యకు ఉన్న గొప్పతనాన్ని, అబ్దుల్ కలాం వంటి మహనీయులు సమాజానికి చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ పాలన సాగించాలని తపించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివరారెడ్డి, షేక్ ఆసీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు నారమల్లి పద్మజ, కాకాణి పూజిత, బత్తుల రామారావు, దుర్గారెడ్డి, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
‘వినేవాడుంటే చెప్పేవాడే చంద్రబాబు.. లోకేశ్ శైలీ ఇదే’
సాక్షి, తూర్పుగోదావరి: వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు.. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. డేటా సెంటర్పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు. తొమ్మిది హార్బర్స్కు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో చేసినా ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాం.. ఇది వాస్తవం. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదం.డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్?. డేటా సెంటర్పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా? దీనిపై సవాల్ చేస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు, గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే. జిందాల్ సంస్థ తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రాపర్టీ ఏది?. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా ఉంటాయి’ అని హితవు పలికారు.ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి.. ఆయన వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు?. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయండి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.సిట్ వేయడం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. టీడీపీ నేతలపై సిట్ కేసు నమోదు చేస్తుందా?. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వాములు కదా.. సీబీఐకి అప్పగించండి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు. పాలకొల్లు, అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. జోకర్లు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. రాజమండ్రిలో ప్రవీణ్ చౌదరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 9000 రూపాయలు పెంచి వేతన సవరణ చేశారు. రాజమండ్రి ప్రస్తుత ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే 5400 మాత్రమే చేయించారు’ అని చెప్పుకొచ్చారు. -
ఏపీ మద్యం కేసు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో మోహిత్రెడ్డికి బిగ్ రిలీఫ్ -
నకిలీ మద్యంపైనా టీడీపీ మార్కు లీల!
తనపై వచ్చిన ఆరోపణలను ప్రత్యర్థులకే చుట్టబెట్టడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అందవేసిన చేయి. అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడే రాజకీయాలు చేస్తారు. విలువలతో నిమిత్తం లేకుండా వ్యవహరించే తీరు సమాజానికి ఏ మాత్రం ఆదర్శంగా కనపడదు. నకిలీ మద్యం కేసు ఇప్పుడు చంద్రబాబు నైజానికి ఇంకో నిలువెత్తు తార్కాణంగా నిలుస్తోంది. ములకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ తెలుగుదేశం పార్టీ నేతలే అని తేటతెల్లమైనా ఆ కేసును వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. కస్టడీలో ఉన్నా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ద్వారా వీడియో విడుదల చేయించిన వైనం, అందులో తెలుగుదేశం ప్రభుత్వానికి సర్టిఫికెంట్ ఇప్పించుకోవడం చూసి విస్తుపోవడం ప్రజల వంతైంది.జనార్ధనరావు విడుదల చేసిన వీడియో సారాంశం మొత్తం ఎల్లో మీడియాలో విపులంగా ప్రచురించారు. అది అచ్చంగా కాశీ మజిలీ కథ మాదిరిగా ఉంది. జగన్ జమానాలో జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేశ్ రూ.మూడు కోట్లు ఆశజూపి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించారట! జోగి రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే తాను ఆయన నేతృత్వంలో నకిలీ మద్యం తయారు చేశానని, హైదరాబాద్ నుంచి తెచ్చి బార్లో విక్రయించేవాడినని ఆయన అన్నారట. ఇది నిజమైతే అలాంటి వ్యక్తి టీడీపీ వారికి ఎలా దగ్గరయ్యాడు? పైగా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పెట్టిస్తే చంద్రబాబు ఎలా బద్నామ్ అవుతారు? కుప్పంలో పెట్టించి ఉంటే బాబుకు మరింత ఎక్కువ నష్టం జరిగేదిగా అన్న అనుమానం వస్తే కాశీ మజిలీ కథలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అంతేనా...? నకిలీ ప్లాంట్ సిద్దం చేసి సరకు నిల్వచేసి పెడితే ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్ పై దాడులు జరిగేలా చూస్తామని రమేశ్ చెప్పారట. అంటే మంత్రిగా పనిచేసిన రమేశ్కు అలా ప్లాంట్ పట్టుబడితే తన మీదకు కూడా కేసు వస్తుందని తెలియని అమాయకుడని జనార్ధనరావు చెప్పారన్నమాట. ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించిన సందర్భంలోనే అక్కడ టీడీపీ నేత, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ ద్వారా నకిలీ మద్యం ఇతర చోట్లకు రవాణా అయినట్లు ప్రకటించారు. ఆ స్థలంలోనే ఉన్న పాలవ్యాన్ల ద్వారా బెల్ట్షాపులకూ చేరుతోందని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలేనా? టీడీపీ ముఖ్య నాయకులను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో తాను చెబుతున్న విషయాలేవి హైలైట్ కాలేదట. రమేశ్ ఆఫ్రికాలో ఉన్న తనకు ఫోన్ చేశారని జనార్ధనరావు చెప్పారట. అది నిజమైతే, ఫోన్ బొంబాయిలోనే వదలివేసి రావడం ఎందుకు? పనిలో పని జయచంద్రారెడ్డికి కూడా మద్యం తయారీతో ఎలాంటి సంబంధం లేదని ఈయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న మద్యం వ్యాపారం మాటేమిటి? ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తానని, అప్పటివరకూ ఆఫ్రికాలోనే ఉండమని జోగి రమేశ్ తనతో చెప్పారని, ఆ పని జరక్కపోవడంతో ఈలోగా తన తమ్ముడిని అరెస్ట్ చేయడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు జనార్ధనరావు చెప్పారట. జనార్ధన రావు వాదనలో లొసుగులు అన్నిఇన్నీ కావు. ఆఫ్రికాలో ప్లాంట్ పెట్టగలిగిన వ్యక్తి రూ.మూడు కోట్ల ముడుపుల మొత్తానికి ఆశపడటం నమ్మశక్యంగా కనిపించదు. అలాగే అధికారంలో ఉన్న వారి నుంచి గట్టి హామీ ఏదీ లేకుండా ఎవరూ బెయిల్ కోసం ప్రయత్నించకుండా విదేశాల నుంచి ఆకస్మికంగా రారు. తొలుత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న నకిలీ మద్యం ప్లాంట్ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఎక్సైజ్ అధికారులు కూడా దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందని, ప్రభుత్వంలోని పెద్దలు కొంతమందికి ఈ కేసులో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిసి ఉంటే ఈ వ్యవహారాన్ని ముందుగానే తొక్కిపెట్టి వేసేవారేమో తెలియదు. అనూహ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అవడం, పలు చోట్ల నకిలీ మద్యం పంపిణీ అయిందని వార్తలు రావడంతో సంచలనమైంది. మద్య పానం చేసేవారిలో ఆందోళన పెరగడం, కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని, మరికొందరు అకాల మృతి చెందారని కథనాలు వచ్చాయి. అప్పటికి దీని సీరియస్నెస్ కనిపెట్టిన ప్రభుత్వ ముఖ్యులు వెంటనే టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, కట్టా సరేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఆ చర్యతో ఈ స్కామ్తో టీడీపీ వారికి ఉన్న కనెక్షన్ ప్రజలందరికి తేటతెల్లమైంది. ఇది మరింత డామేజీ అయిందని భావించిన ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో వ్యూహంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో టీడీపీ వారు ఉన్నా సహించబోమన్న సంకేతం ఇవ్వాలని, తద్వారా క్రెడిట్ పొందాలని భావిస్తున్న తరుణంలో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లతో ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చా యి. జయచంద్రా రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇచ్చిన వైనంపై సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనిషి అని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. తంబళ్లపల్లెలో రామచంద్రా రెడ్డి సోదరుడు ద్వారకానాథ రెడ్డిని గెలిపించుకోవడానికి టీడీపీలోకి పంపించారని, ఆయన కోవర్టు అనే వాదన తీసుకువచ్చారు. దీనిపై అంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే లోక్సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటి ద్వారా కొత్త కథలు సృష్టించారు. జగన్ జమానాలోనే నకిలీ మద్యం మొదలైందని, జనార్ధనరావు తదితరులు అప్పటి నుంచే ఈ వ్యాపారం చేశారని అంటూ వార్తలు ఇచ్చారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నం లో మరో నకిలీ మద్యం డంప్ బయటపడింది. ఇది మద్యం సేవించే వారిలో ఆందోళన పెంచింది. ఈ సమయంలో ప్రభుత్వం దీనిపై కచ్చితమైన చర్యలు తీసుకుని మద్యం తీసుకునే వారి ఆరోగ్యాలపై దృష్టి కేంద్రీకరించకుండా, వాటిని వదంతుల కింద, వైఎస్సార్సీపీవారి దుష్ప్రచారం కింద తిప్పి కొట్టడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ కేసు విచారణకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వారు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తుంటే తన అధీనంలో ఉన్న సిట్ వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అంతేకాకుండా, మీడియాతో మాట్లాడుతూ స్కామ్ ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని, ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనీయం, రాజకీయం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. ఆ బ్యాచ్ ఎవరో మీకే త్వరలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆఫ్రికా వారిని కూడా మనమే కాపాడాలని వింత ప్రకటన చేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్ పై స్పందిస్తూ, కేసును సాగదీయాలనే ఆలోచనతోనే అడుగుతున్నారని అనడం తమాషానే అనిపిస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సీబీఐ సమర్థతపై నమ్మకం లేదన్నమాట. తన హయాంలో నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని బుకాయించడానికి యత్నించారు. అదే వైఎస్సార్సీపీ టైమ్లో మాత్రం నిరాధారంగా 30వేల మంది చనిపోయారని ఎలా చెప్పారు? ఇది శవ రాజకీయం కాదా? సిట్ ఏమి చేయబోతోందో ముందస్తుగానే ఆయన సంకేతాలు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.అది అలా ఉండగా, ఆఫ్రికాలో ఉన్న జనార్ధనరావు ఏపీకి వచ్చి లొంగిపోయారు. అంతకు ముందు ఆయన విడుదల చేసిన వీడియో లో ఎక్కడా జోగి రమేశ్ పై కాని, వైఎస్సార్సీపీపైన కాని ఆరోపణలు చేయలేదు.కాని అరెస్టు అయ్యాక, వీడియో ఆయన ఎలా చేశారో, దానిని ఎలా ఎల్లో మీడియాకు అందచేశారో, ఇందులో పోలీసుల పాత్ర ఏమిటో తెలియదు కాని, మొత్తం కధను జోగి రమేశ్ పై నెట్టేశారు. ఇది టీడీపీ పెద్దల నైపుణ్యం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత తామే నకిలీ మద్యం ప్లాంట్ ను ,డంప్ లను కనిపెట్టామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు ఎవరి ద్వారానో సమాచారం అందించి దాడులు చేయించారని జనార్ధనరావుతో చెప్పించారు. ఇక్కడే ప్రభుత్వం దొరికిపోయిందనిపిస్తుంది. ఈ నకిలీ మద్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందన్న అంచనాకు వచ్చిన పెద్దలు వెంటనే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా జోగి రమేశ్ వైపు మలుపు తిప్పారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఈ నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జోరుగా నిరసనలు చేసిన సాయంత్రానికే జనార్ధనరావు వీడియోను వ్యూహాత్మకంగా విడుదల చేశారు. అయితే అందులో జరిగిన తప్పిదాలతో దొరికిపోయారన్న భావన కలుగుతుంది. అలాగే సురేంద్ర నాయుడు కు ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడితే ఆయనకు క్షమాబిక్ష పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా ?కాదా?ఏ సంబంధం లేకుండా అలా చేస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ప్రశ్నకు ఎందుకు టీడీపీ నుంచి సమాధానం రాలేదు? ఇవన్ని ఎందుకు ! సీబీఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జి దర్యాప్తు ,లేదా వెంకకటేశ్వర స్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి రావాలని, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేశ్ సవాల్ చేశారు. వాటిలో ఒక్కదానికైనా చంద్రబాబు లేదా ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదు? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏరా.. ల... కొడకా!
సాక్షి, కర్నూలు జిల్లా: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అనుచరుడిపై బూతులతో విరుచుకుపడ్డారు. ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. గుమ్మనూరు జయరాం ఆలూరులోని ఉపాధ్యాయనగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 16న జయరాం పుట్టిన రోజు సందర్భంగా ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట రెండు రోజుల కిందట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జయరాం మంగళవారం ఆర్ అండ్ బీ అతిథిగృహానికి చేరుకోగా.. ఫ్లెక్సీని చించివేసిన విషయం అనుచరులు ఆయనకు తెలియజేశారు. వెంటనే ఆయన కారు దిగి ఎదురు షాపులో ఉన్న జ్యోతి ముఖ్య అనుచరుడు రహిమాన్ను పిలిచి ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. తమ పారీ్టకే చెందిన నాయకుడిని టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులు తిట్టడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. జయరాం హడావుడి కారణంగా దాదాపు 15 నిమిషాలు కర్నూలు–బళ్లారి రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
నేడు అబ్దుల్ కలామ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్(Abdul Kalam) జయంతి. ఈ సందర్భంగా అబ్ధుల్ కలామ్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నివాళులు అర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలాం. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్కు నమస్కారిస్తున్నా అంటూ పోస్టు చేశారు. Remembering Dr. A.P.J. Abdul Kalam , who embodied leadership through knowledge, humility, and service. On his jayanti, I salute the Missile Man who believed in the power of education and inspired a generation to dream and build a better India.#APJAbdulKalam pic.twitter.com/Y8D4253RJi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
ఇంటి ముందు మనిషి పుర్రె
విజయనగరం జిల్లా: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
ఒంగోలులో నకిలీ బీరు కలకలం
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి. ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో కేవలం నకిలీ లిక్కర్ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 🚨 Public Alert! Be Cautious! 🚨A shocking incident has come to light at Koppole Road, Ongole.At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025 -
కారుపై బాబు బొమ్మ అడ్డుకునేది ఎవరమ్మా!
తిరుపతి జిల్లా: తిరుమలలో సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన ఓ కారు మంగళవారం హల్చల్ చేసింది. తిరుమలకు పార్టీ రంగులు, నాయకుల ఫొటోలతో కూడిన వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే. మంగళవారం ఏపీ 39 ఆర్ఎం 3999 నంబర్గల కారు..వెనుక వైపు సీఎం చంద్రబాబు ఫొటో కనిపించింది. దీంతో పలువురు భక్తులు అధికార పార్టీ నాయకుల బొమ్మలు వాహనాలపై ఉంటే తిరుమలకు అనుమతిస్తారా? అంటూప్రశ్నించారు. ఇప్పటికైనా అలిపిరి చెక్పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీలను క్షుణ్ణంగా నిర్వహించాలని భక్తులు కోరారు. -
శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!
శ్రీశైలంటెంపుల్: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకైక క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది. ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేనా? శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్ క్వాటర్స్ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది. భూ బదలాయింపు జరిగేనాగతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో ముంపు అయింది. బ్రిటీష్ కాలం నాటి జీవో, బ్రిటీష్ కాలం నాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఘాట్రోడ్డు విస్తరించేనాశ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకైన ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..! శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) ప్రసాద్ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న మోదీ.. శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు. -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్ని టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
ఆశపెట్టి.. మోసగించి!
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త విధానాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేయవచ్చునంటూ వల విసిరి రూ.లక్షలు దోచేశారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా పార్ట్టైమ్ జాబ్లంటూ మోసాలకు తెగబడ్డారు. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు లబోదిబోమంటూ మిన్నకుండిపోతున్నారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి.ధర్మవరం అర్బన్: ఆన్లైన్ పార్ట్టైమ్ జాబ్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో సత్యసాయి జిల్లా యువత చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆన్లైన్ జాబ్ సైట్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్, పత్రికల్లో నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోతోంది. వీరిలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నారు. ఇంట్లో ఉన్నవారే లక్ష్యం వర్క్ ఫ్రమ్ హోం పై మక్కువ పెంచుకున్న యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు వేలాది రూపాయలు సంపాదించే జాబ్లు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించి ఆకర్షిస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో డబ్బు కట్టించుకుని ఆ తర్వాత బోర్డు తిరగేయడం షరా మాములైంది. తమనే నష్టపరిచారంటూ బ్లాక్ మెయిల్ జిల్లాలో రకరకాల డేటా ఎంట్రీ స్కామ్స్ వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ స్కిల్స్ అవసరం లేదని, సింపుల్గా డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బు సంపాదించవచ్చని నమ్మబలుకుతారు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు రూపంలో పేమెంట్ చేయించుకుంటారు. డేటా ఎంట్రీ అనంతరం అందులో తప్పులున్నాయని, దాని వల్ల తమ సంస్థ నష్టపోయిందని, పరిహారం చెల్లించకపోతే లీగల్ ప్రొసీడింగ్స్కు వెళతామని బెదిరింపులకు దిగుతూ పెద్ద మొత్తంలో నగదు లూటీ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. » నెలకు రూ.60 వరకు జీతం అందిపుచ్చుకుంటున్న ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి... తీరిక వేళల్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఆన్లైన్ టాస్్కలో పాల్గొన్నాడు. మొదట దాదాపు రూ.15వేల వరకు నగదు అతని ఖాతాకు బదిలీ అయింది. దీంతో పూర్తిగా నమ్మి అవతలి వ్యక్తుల డిమాండ్ మేరకు నగదు బదిలీ చేస్తూ రూ.2.75లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోతున్నట్లుగా నిర్ధారించుకుని మిన్నకుండిపోయాడు. » ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆరునెలలుగా ఇంటి వద్దనే ఖాళీగా ఉన్నాడు. ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతూ ఓ వెబ్సైట్లో లింక్ను ఓపెన్ చేశాడు. కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే అంతకు రెట్టింపు వస్తుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో తొలుత రూ.5వేలు వారి ఖాతాకు పంపాడు. అనంతరం విడతల వారీగా రూ.1.35 లక్షల వరకు నగదు బదిలీ చేసినా తనకు రిటర్న్స్ లేకపోవడంతో అవతలి వ్యక్తులను నిలదీశాడు. వారి సమాధానంతో తృప్తి చెందక ఇకపై తాను డబ్బు వేయనని తేల్చి చెప్పడంతో వెంటనే వారి నంబర్లు, వాట్సాప్ గ్రూపు బ్లాక్ చేసేశారు. » ధర్మవరంలో నివాసముంటున్న ఓ వివాహిత డిగ్రీ వరకు చదువుకుంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక పార్ట్టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే రోజు రెండు గంటల పాటు పనిచేస్తే రూ.250 చొప్పున నెల రోజుల తర్వాత జీతం రూపంలో బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అవుతుందనే ఓ సైట్ కనిపించడంతో సంప్రదించింది. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి తొలుత రూ.5వేలు చెల్లించింది. ఆ తర్వాత రోజు రూ.250 నుంచి రూ.500ల వరకు సంపాదిస్తున్నట్లు వారం రోజుల పాటు ఆన్లైన్ వాలెట్లో కనిపిస్తూ వచ్చింది. వారు విధించిన గడువు లోపు మ్యాటర్ టైప్ చేసి ఇవ్వకపోతే ఎదురు డబ్బు చెల్లించాలనే నిబంధన ఉండడంతో పలుమార్లు తన ఖాతా నుంచి దాదాపు రూ.55వేల వరకు ఆమె బదిలీ చేస్తూ వచ్చింది. అయితే రెండు నెలలు గడిచినా ఆమె బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమకాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే భర్తకు వివరించింది. » ధర్మవరంలోని యాదవవీధిలో నివాసముంటున్న బీటెక్ పూర్తి చేసిన యువకుడు పార్ట్టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ఇంట్లో గంటసేపు కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ వెబ్సైట్లో సమాచారాన్ని నమ్మి తన సరి్టఫికెట్లు, ఆధార్కార్డు అప్లోడ్ చేశాడు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు పేరుతో అడ్వాన్స్గా రూ.15వేలు సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. అనంతరం తాము ఇచ్చిన మ్యాటర్ను అలాగే టైప్ చేసి పంపాలని, గంటలోపు ఎన్ని పదాలు టైపు చేస్తే అంత డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందని నమ్మబలికారు. దీంతో యువకుడు టైపు చేస్తుండగా, తప్పులు ఉన్నాయని, దీంతో కంపెనీ పరువు పోయిందని, పరిహారం రూ. 2 లక్షలు చెల్లించకపోతే కోర్టుకు లాగుతామని బెదిరించారు. పక్కనే ఉన్న తమ న్యాయవాదితో మాట్లాడమంటూ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. విషయాన్ని వెంటనే సదరు యువకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్ నేరగాళ్లు వారి నంబర్ను బ్లాక్ చేశారు. అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజి్రస్టేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు. జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్లిమిటెడ్ ఎరి్నంగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్స్టేషన్కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం -
చంద్రబాబు డైరెక్షన్తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
16న ఈశాన్య రుతుపవనాల ఆగమనం
సాక్షి, అమరావతి: ఈ నెల 16వ తేదీ నాటికి ఈశాన్య రుతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ ఏడాది ముందే వచ్చిన నైరుతి రుతుపవనాలు ముందే నిష్క్రమించడంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం ఏర్పడింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మూడో వారం వరకూ కొనసాగుతాయి. కానీ.. ఈసారి నిష్క్రమణ ప్రక్రియ ముందే ప్రారంభమై దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వైదొలగాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయినా కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల కోస్తాంధ్రలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతమే నైరుతి సీజన్లో ఎక్కువ వర్షాలు కురిసినట్టు కనిపించినా అది సాధారణం కంటే ఎక్కువగా లేదు. జూన్ నుంచి సెపె్టంబర్ వరకూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 515 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. ఈ సీజన్లో 530.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. రుతుపవనాలు మే 26న ముందుగానే వచ్చినా జూన్, జూలైల్లో వర్షాలు తక్కువగా పడ్డాయి. మొదట 31 శాతం లోటు నమోదైంది. జూలై చివరి నాటికి ఇది 24 శాతానికి తగ్గింది. ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల వర్షాలు పెరిగాయి. ఆగస్టులో సాధారణం కన్నా 39 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో పడిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయ్యింది. తుపానులకు అవకాశం ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. ఈసారి వీటివల్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. లానినొ పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడటానికి అనువైన పరిస్థితులున్నాయి. నైరుతి రుతుపవనాలు సమయం కన్నా ముందే ప్రారంభమై, ముందే ముగియడంతో అకాల వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆగస్టులో పడిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ లో నైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో వచ్చిన అధిక వర్షాలు పడి పలు ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలను దెబ్బతీశాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల వరి నాట్లు దెబ్బతిన్నాయి. పంటలకు తెగుళ్లు కూడా సోకాయి. పంటలలో తేమ శాతం పెరిగి దిగుబడి తగ్గింది. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె వాయిదా
సాక్షి,అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం మంగళవారం జరిపిన చర్చలు అర్ధరాత్రి దాటిన తరువాత అసంపూర్తిగా ముగిశాయి. విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ ఎస్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, సహాధ్యక్షుడు కేవీ శేషారెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోపాలరావు, జేఏసీ కన్వినర్ ఎంవీ రాఘవరెడ్డిలతో కూడిన దాదాపు 30 మంది సభ్యుల బందం చర్చలకు వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు, ఏపీజెన్కో ఎండీతో కూడిన అధికారుల బృందం వారితో చర్చలు జరిపింది. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో ప్రధాన సమస్యలను స్టీరింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ∙పర్యటన ఉన్న నేపథ్యంలో సమ్మెను రెండు రోజులు వాయిదా వేయాల్సిందిగా జేఏసీని ప్రభుత్వం కోరింది. అలాగే 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలకు రావాల్సిందిగా ఆహ్వా నించింది. దీంతో ఆ రోజు వరకూ సమ్మె వాయిదా వేస్తున్నామని, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పాటించి నిరసన తెలిపారు. ప్రధాన డిమాండ్లకు లభించని అంగీకారం: విద్యుత్ సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సంస్థల్లో విలీనం చేయడానికి సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం లేదని జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా స్టీరింగ్ కమిటీ వ్యాఖ్యానించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా 100 శాతం ఇవ్వడం కుదరదని, 50 శాతం ఇవ్వడానికి ఆలోచిస్తామని కమిటీ చెప్పిందని వారు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్ మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్ర«దాన డిమాండ్లపై చర్చల్లో సానుకూలత రాలేదు. సమ్మెలో పాల్గొంటే చర్యలు సమ్మె చేపడుతున్నట్లు జేఏసీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సమ్మెలో పాల్గొని విధులకు హాజరుకాని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను రోజూ సాయంత్రం 5 గంటలకల్లా హెచ్ఆర్డీ చీఫ్ జనరల్ మేనేజర్కు అందజేయాల్సిందిగా ఆదేశించారు. ఆ జాబితా ప్రకారం సమ్మెలో పాల్గొనే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు మంగళవారం అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)లను ఆదేశించారు. -
ఈ ప్రశ్నలకు జవాబేది?
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసిపోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ⇒ ఏ1 జనార్దన్రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్ నివేదికలో ఎక్కడా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ⇒ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? ⇒ విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆఫర్ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా? ⇒ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు? ⇒ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రానికి రప్పించడం లేదు? లుక్ అవుట్ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు? ⇒ అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు? ⇒ నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్లకు ఎందుకు పంపడం లేదు? ⇒ రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్ యాప్’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? ⇒ టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? ⇒ నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నివాసంలో సిట్ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా? -
ఆరోగ్యశ్రీ ఆగి..మంచం మీద రోగి
రాజమండ్రికి చెందిన రమేశ్కు మంగళవారం ప్రమాదవశాత్తూ కాలు విరగడంతో అదే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. తాను ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడినని ఉచితంగా చికిత్స చేయాలని కోరాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదని, ఉచిత చికిత్సలు నిలిపేశామని సిబ్బంది చెప్పారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామన్నారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని రూ.లక్ష వరకూ అవుతుందని చెప్పడంతో రమేశ్ కుటుంబ సభ్యుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. అంత డబ్బు తమ వద్ద లేదని, రూ.5వేలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా కట్టుకట్టి, మందులు ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభించాక కబురుపెడతాం. అప్పుడు వస్తే శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. చేసేదేమీ లేక వైద్యులు చెప్పినట్టుగానే తాత్కాలికంగా కట్టు కట్టించుకుని రమేశ్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇదే ఆస్పత్రికి సోమవారం ఒక వ్యక్తి కాలి మడమ విరిగిందని వచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు నిలిపేశామని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.40వేలు కట్టి చికిత్స చేయించుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు శ్రీనివాస్ ఇటీవల వరకు విజయవాడలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడు. యథావిధిగా సోమవారం డయాలసిస్ చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చాడు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశామని, డయాలసిస్ సేవలు కూడా ఆపేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ ప్రారంభించే వరకూ డబ్బు చెల్లిస్తేనే డయాలసిస్ చేస్తామన్నారు. దీంతో డయాలసిస్ ఆపేస్తే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న తమ పరిస్థితి ఏమైపోవాలని శ్రీనివాస్తోపాటు మరికొందరు రోగులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్య తరగతి రోగులు వైద్యసేవల కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు గడిచిపోయింది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపివేసి వారం రోజులైంది. ఎక్కడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో జనాలు ఏమైపోతే మనకేంటి... అన్నట్టుగానే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలో 1.42 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీమా ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దీంతో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కలిపి రూ.3వేల కోట్లకు పైగా ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిపడింది. సాధారణంగా చికిత్సలు అందించిన 40 రోజుల్లో ఆస్పత్రులకు అందాల్సిన బిల్లులు ఏడాది గడిచినా కనీసం ప్రాసెస్కు కూడా నోచుకోని దుస్థితి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో నెలకొంది. ఆస్పత్రుల నుంచి వచి్చన 10 లక్షలకు పైగా క్లెయిమ్లను ట్రస్ట్ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కి పెట్టింది. వీటి విలువ రూ.2వేల కోట్లకు పైనే ఉంటుందని తెస్తోంది. మరో రూ.650 కోట్ల మేర సీఎఫ్ఎంఎస్లో బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిందని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి. వీటి విలువ రూ.300 కోట్ల పైమాటే. ఇలా అన్ని రకాల బిల్లులు రూ.3వేల కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఆస్పత్రికి రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు బిల్లులు రావాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని యజమానులు చేతులెత్తేసి సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే ఒకసారి ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎంతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 15 నుంచి మరోమారు ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్ సేవలు నిలిపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి సేవలు ఆపేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి బారినపడి ఇటీవల ఏకంగా 45 మందికిపైగా మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యారి్థనులు పెద్ద ఎత్తున పచ్చకామెర్ల బారినపడి అల్లాడుతున్నారు. వారిలో ఇద్దరు మరణించారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్ల సాధన కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ విజయవాడకు వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీంతో గ్రామీణ, గిరిజన మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. అనారోగ్యం బారినపడిన ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో నాడిపట్టే వారు లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే... అక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు.దీంతో రోగాలు ప్రబలుతున్నాయి.వైద్యమూ అందడం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నెలకొన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. పెళ్లిళ్లు, పుస్తక ఆవిష్కరణలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు, వీకెండ్లో హైదరాబాద్ పర్యటనలకు సమయం కేటాయిస్తున్న ప్రభుత్వ పెద్దలు... ప్రజారోగ్యంపై సమీక్ష చేసేందుకు సమయం కేటాయించకపోవడం గమనార్హం. సమ్మె మరింత ఉధృతంప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమకు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల మద్దతు కూడా ఉందని వెల్లడించింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేయడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది.శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తిరుపాల్నాయక్ అనే కూలికి ఈ నెల 13న రాత్రి పురుగు కుట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో చూపించుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి వైద్యులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేసు చూడటం లేదన్నారు. దీంతో అతను రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం కంతా తొడభాగం దెబ్బతినగా.. స్థానిక వైద్యుల సూచన మేరకు 14వ తేదీ (మంగళవారం) అనంతపురంలోని సాయినగర్లో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవలు(ఆరోగ్యశ్రీ) బంద్ అయినట్లు చెప్పడంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వెళ్లాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు లేకపోతే ఎలాగంటూ తిరుపాల్ నాయక్ భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులు రోజూ పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నాయి.ఆరోగ్యశ్రీ లేక అవస్థలునేను నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాను. సర్జరీ చేస్తానని సుమారు 15 రోజుల క్రితం తేదీ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్పత్రికి వచ్చాను. ఆరోగ్యశ్రీ నిలిపేశారని చెప్పి సర్జరీ చేయలేమని చెప్పారు. నాకు సకాలంలో సర్జరీ చేయకపోతే మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్యులే చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత మాకు లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల సేవలకు అంతరాయ ఏర్పడడం దారుణం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.– చలమల సాయి శ్రీధర్, కాకినాడవెన్నెముక సమస్యతో వచ్చాం..నాకు కొన్ని నెలలుగా వెన్నెముక సమస్య ఉంది. దాంతోపాటు విపరీతమైన కీళ్ల నొప్పులున్నాయి. ఆరోగ్యశ్రీ ఉందని ప్రైవేటు ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడకు వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు నిలిపేశామని చెప్పారు. రూ.200 ఇచ్చి ఓపీ తీసుకున్నాం. డాక్టర్ దగ్గరికి వెళితే కొన్ని రకాల రక్త పరీక్షలు రాశారు.వాటికి రూ.5వేల దాకా ఖర్చు అయింది. ఆరోగ్యశ్రీని నమ్ముకుని వచ్చాం. అప్పు చేసి ఆరోగ్యానికి వెచ్చించాల్సి వచ్చింది. ఇలాగైతే పేదలకు ఇబ్బందే. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడంతోపాటు పేదలకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలి. – రామకృష్ణ, చెర్లోపల్లి, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
ఔట్సోర్సింగ్ టీచర్లకు బుజ్జగింపు
సాక్షి, అమరావతి: వారం రోజులు సమయమిస్తే... ఏదో రకంగా సర్దుబాటు చేస్తామంటూ గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్లను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సముదాయించారు. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో డీఎస్సీ ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులు సోమవారం విధుల్లోకి చేరడంతో ఆ పోస్టుల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న 1,143 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఉద్యోగాలు లేకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొరపెట్టుకున్న టీచర్లు, మంగళవారం ఉన్నతాధికారులను కలిశారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, గురుకులాల సంస్థ కార్యదర్శి గౌతమితో వేర్వేరుగా చర్చలు జరిపారు. గిరిజన ఔట్సోర్సింగ్ టీచర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనాయక్, ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున నాయక్ నేతృత్వంలో 26 జిల్లాల ప్రతినిధి బృందం అధికారులతో గోడు వెళ్లబోసుకున్నారు. మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు విధుల్లో చేరినందున ఔట్సోర్సింగ్ టీచర్లను ఎలా సర్దుబాటు చేయాలనేది ఆలోచిస్తున్నామని ఎంఎం నాయక్ తెలిపారు. ఔట్సోర్సింగ్ పోస్టుల విషయంలో ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటామని, జీతాల పెంపు లేదు కాబట్టి అనుమతి సమస్య ఉండదంటూ వారిని సముదాయించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వారం వెసులుబాటు ఇస్తే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామని నాయక్ చెప్పినట్లు సమాచారం. దీనికి అంగీకరించిన ఔట్సోర్సింగ్ టీచర్లు బుధవారం తలపెట్టిన ఆందోళన కార్యాచరణ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. -
బీసీ హాస్టల్ టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫయర్!
ఇంకొల్లు (చినగంజాం): బాపట్ల జిల్లా ఇంకొల్లులోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలోని టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫయర్ను బిగించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాయిలెట్లో ఎవరైనా వాటర్ ప్యూరిఫయర్ను బిగిస్తారా.. అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీసీ జిల్లా అధికారి హాస్టల్ను సందర్శించి వాటర్ ఫ్యూరిఫయర్ను అక్కడి నుంచి తొలగించి, మరో చోట బిగించాలని ఆదేశించారు. ఈ విషయమై హాస్టల్ వార్డెన్ రామాంజనేయులు మాట్లాడుతూ.. నీటి ట్యాంక్ ఆ గదిపైనే ఉన్నందున తొలుత అక్కడ బిగించామని చెప్పారు. అయినా ఈ నీరు పిల్లలు తాగేందుకు కాదని, తాము పిల్లల కోసం మినరల్ వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నామని చెప్పారు. వంట గదిపైన వాటర్ ట్యాంక్ బిగించిన తర్వాత.. ప్యూరిఫయర్ను ఆ గదిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం అవినీతి కూపంలో నిలువెల్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు. బరి తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పన్నుతున్నారు. అందుకోసం టీడీపీ పెద్దల డైరెక్షన్లో చిత్రీకరించిన ‘పొలిటికల్ సోషియో ఫాంటసీ’ కుట్ర ఇప్పటికే బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన కుతంత్రం ఫలించ లేదు. దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్ను రంగంలోకి దించి తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట హడావుడి చేయించారు. టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలేసింది! అయితే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్ధన్రావుతో ప్రభుత్వ పెద్దలు చిలుక పలుకులు వల్లె వేయించారు. నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్ధన్రావు వీడియో బయటకు రావడం వెనుక లోగుట్టు ఏమిటి? ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా నకిలీ మద్యం పాపం వైఎస్సార్సీపీదేనని ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కుట్ర అట్టర్ ఫ్లాప్ టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు. డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది. ఏం చెప్పాలో పోలీసులే పక్కనుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా.. జనార్దన్రావు వల్లె వేసిన మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మడం లేదన్నది స్పష్టమైంది. ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది. అంతేకాదు.. ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించిందన్నది తేటతెల్లమైంది. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్ కేవలం పాత్రధారులేనని, ఈ వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా ప్రభుత్వ పెద్దలేనన్నది రూఢీ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్లో యంత్రాలు, క్యాన్లు (ఫైల్) సిట్ ద్వారా మరో డైవర్షన్ డ్రామా... ఏ 1 జనార్దన్రావు వీడియో డ్రామా ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో కుట్రకు పదును పెట్టారు. ఏడాదికిపైగా రెడ్బుక్ రాజ్యాంగ కుట్రలు అమలు చేస్తున్న తన సిట్ను రంగంలోకి దింపారు. వీడియో డ్రామా ద్వారా జోగి రమేష్ను లక్ష్యంగా చేసుకుని భంగపడ్డ టీడీపీ పెద్దలు.. ఈసారి సిట్ ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిపై గురి పెట్టారు. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో డైవర్షన్తో మరోసారి కుట్రలకు తెర తీశారు. మిథున్రెడ్డి కుటుంబానికి చెందిన తిరుపతి, హైదరాబాద్లలోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలతో హడావుడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను విచారించారు. వాస్తవానికి మద్యం విధానంపై అక్రమ కేసులో ఆయన్ను గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఆ అక్రమ కేసులో సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ఆయన్నుగానీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులనుగానీ విచారించేందుకు ఏమీ లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డిస్టిలరీల మాటున నకిలీ దందా.. ఆధారాలతో సహా బట్టబయలైన నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతూ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా కట్టడి చేస్తున్నారు. అసలు నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్) ఎక్కడి నుంచి సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. ఎందుకంటే.. అత్యంత ప్రమాదకరమైన ఆ స్పిరిట్ను కొనుగోలు చేసేందుకు మద్యం డిస్టిలరీలు, రసాయన పరిశ్రమలకే అనుమతి ఉంది. ఆ స్పిరిట్లో 100 శాతం ఉండే ఆల్కహాల్ను 42 శాతం లోపు తగ్గించి మనుషులు వినియోగించే మద్యాన్ని తయారు చేసే సామర్థ్యం డిస్టిలరీలకే ఉంటుంది. మరి టీడీపీ సిండికేట్ ములకలచెరువుతోపాటు అనకాపల్లి, పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ ఎక్కడ నుంచి సరఫరా జరిగింది? అనేది అత్యంత కీలకంగా మారింది. అంటే.. డిస్టిలరీలే ఆ స్పిరిట్ను కొనుగోలు చేసి అక్రమంగా నకిలీ మద్యం యూనిట్లకు సరఫరా చేశాయని ఎక్సైజ్ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందినవే. వాటిలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అందుకే ఆ డిస్టిలరీలవైపు కన్నెత్తి చూడవద్దని ప్రభుత్వ పెద్దలు పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ బడా బాబుల బండారం బయటపడకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం దందాతో అమాయకుల ప్రాణాలను హరిస్తుండటంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఇలా డైవర్షన్ డ్రామాలతో కుట్రలకు తెర తీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనార్దన్రావు ఇంట్లో సోదాలు ఇబ్రహీంపట్నం : నకిలీ మద్యం నిందితుడు జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు ఇళ్లల్లో పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులను వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గంటపాటు మంతనాల తర్వాత లోపలకు అనుమతించారు. మూడు గంటలపాటు పోలీసులు సోదాలు చేశారు.ఎంపీ మిథున్రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపుసాక్షి, అమరావతి/తిరుపతి : మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ వేధింపులు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం హల్చల్ చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసం, కార్యాలయాలకు వెళ్లిన సిట్ బృందాలు ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పదే పదే అడిగినట్లు సమాచారం. తిరుపతిలోని ఎంపీ మిథున్రెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే అనేకసార్లు విచారించారు. జుడీషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతోనే సిట్ మళ్లీ సోదాలు, విచారణ పేరుతో హడావుడి చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల అండతో సాగుతున్న నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందుకే మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేపట్టడం సందేహాస్పదంగా మారింది. కాగా, ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు, విచారణపై సిట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇంత జరిగినా.. ‘బెల్టు’ తీయరా..? జయచంద్రారెడ్డిని అరెస్టు చేయరా?రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ మద్యం 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే మొదలైంది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దోపిడీపై ఎక్సైజ్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం అసలు గుట్టును బయటపెట్టింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీ పర్యవేక్షకులుగా మారి పక్కాగా దోపిడీని వ్యవస్థీకరించిన తీరే అందుకు నిదర్శనం. ఇక ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను రాష్ట్రానికి స్వయంగా తెచ్చింది తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేతలు సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్రావులే కావడం గమనార్హం. ములకలచెరువు కేంద్రంగా మొదలైన ఈ మాఫియా ఏడాదిలో రాష్ట్రం అంతటా విస్తరించడం విస్మయపరుస్తోంది. అడ్డంగా దొరికిన తరువాత ఏ1 జనార్దన్రావుతో వీడియో డ్రామాకు యత్నించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ మద్యం మాఫియా కుట్రదారు, అంతిమ లబ్ధిదారు టీడీపీ పెద్దలేనన్న వాస్తవాన్ని ఎంతగా దాచాలని యత్నిస్తే.. అంతగా ఆ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది. జనార్దన్రావును విదేశాల నుంచి ఆగమేఘాలపై రాష్ట్రానికి రప్పించిన టీడీపీ పెద్దలు.. జయచంద్రారెడ్డిని ఎందుకు రప్పించడం లేదు? ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో ఊరూరా విస్తరించిన దాదాపు 75 వేల బెల్టు షాపులను నిర్మూలించకపోవడం.. ప్రజల ప్రాణాలను హరిస్తూ అక్కడ విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని జప్తు చేయకపోవడం.. పరీక్షల కోసం ల్యాబ్లకు పంపకపోవటాన్ని బట్టి టీడీపీ పెద్దల అండదండలతోనే పచ్చముఠాలు నకిలీ దందాతో చెలరేగుతున్నట్లు స్పష్టమైందని పేర్కొంటున్నారు. -
అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ పెద్దలేనన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయంతో ఈ సమస్యను అధిగమిద్దామని చూసినా, అది బెడిసి కొట్టడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎటూ పాలుపోక వైఎస్సార్సీపీపై నిందలు వేసి గట్టెక్కుదామనే కుట్రలు చేసినా అవీ ఫలితాన్నివ్వలేదు. ప్రజల్లో పూర్తిగా పలుచనయ్యామని, ఇలాగే చూస్తూ మిన్నకుంటే చాలా నష్టం జరుగుతుందని ఢిల్లీ వేదికగా మరో కుతంత్రానికి తెర తీశారు.ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైకి నెడుతూ పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెర లేపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచి్చన చంద్రబాబు అందుబాటులో ఉన్న కూటమి ఎంపీలతో మంగళవారం సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతుంటే.. ఎంపీలుగా మీరంతా ఏం చేస్తున్నారంటూ వారిపై మండిపడినట్లు సమాచారం. వైఎస్సార్సీపీని టార్గెట్ చేయాలనే ఆలోచన మీకు కలగడం లేదా.. అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా మాజీ సీఎం జగన్కే చుట్టాలని, ఇందుకోసం పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టార్గెట్ చేయాలని ఎంపీలపై ఒత్తిడి తెచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. ఓ వైపు వైఎస్సార్సీపీ.. టీడీపీపై ఉధృతంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు ఉండి ఏం చేస్తున్నారని.. ఇకనైనా మరింత దూకుడుగా మొత్తం వ్యవహారాన్ని ఆ పార్టీపైకి నెట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. డైవర్షన్ల మీద డైవర్షన్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యం చేసుకుని ఎంపీలను ఎగదోయడం పరిపాటిగా మారింది. తాజాగా నకిలీ మద్యం వ్యవహారంలో నిండా మునిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ నకిలీ మద్యం మకిలిని వైఎస్ జగన్పై రుద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ‘రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం జరుగుతోంది.చేసిందంతా వైఎస్ జగనే అని చెప్పాలి కదా? వారి కంటే ముందుగానే సోషల్ మీడియాలో మన యాంగిల్లో ప్రచారం చేయాలి కదా.. అలా ఎందుకు చేయడం లేదు? ’అంటూ ఎంపీలపై మండిపడ్డట్టు తెలిసింది. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది తమ (టీడీపీ) పార్టీ పెద్దలే అనే విషయం తేటతెల్లమయ్యాక, దాన్ని కప్పిపుచ్చి వైఎస్సార్సీపీపైకి నెడితే ప్రజల్లో మనం మరింత చులకన అవుతామని కూటమి ఎంపీలు అంటున్నారు. అయినా సూత్రధారి జగనే అంటూ ప్రచారం చేయాలని ఒత్తిడి తేవడంతో.. ఇదెక్కడ గొడవ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఇది సెల్ఫ్ గోల్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. వేర్వేరు హైకోర్టుల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ఉన్నారు. వీరిలో జస్టిస్ రాయ్ నెంబర్ 2, జస్టిస్ రమేష్ నెంబర్ 6, జస్టిస్ సుబేందు 18వ స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురూ తక్షణమే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందిన జస్టిస్ రాయ్, జస్టిస్ రమేష్ 2023లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వీరు గుజరాత్, అలహాబాద్ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, జస్టిస్ సుబేందు సమంత ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.హైకోర్టుకి ముగ్గురు న్యాయాధికారులు..ఇదిలా ఉండగా.. న్యాయాధికారుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్న గంధం సునీత, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్, రాష్ట్ర జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం హైకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. వీరి పేర్లను హైకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. కేంద్ర హోమ్ శాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లగానే సుప్రీంకోర్టు కొలీజియం వీరి నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ ప్రస్థానం ఇదీ..విజయనగరం జిల్లా, పార్వతీపురానికి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 1964 మే 21న విశాఖపట్నంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విజయలక్ష్మి, తండ్రి నరహరిరావు. ప్రాథమిక విద్యను పార్వతీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలలో, ఉన్నత విద్యను విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. విశాఖపట్నంలోని ఎం.వి.పి. లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988 జూలైలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1988 నుంచి 2002 వరకు 14 ఏళ్ల పాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వారి కుటుంబంలో మూడో తరం న్యాయవాది. ఆయన తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞడు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికైన జస్టిస్ రాయ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబర్ 31 వరకు సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయిన తరువాత తొలి రిజిస్ట్రార్ జనరల్గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ ప్రస్థానం ఇదీ..చిత్తూరు జిల్లా, మదనపల్లె సమీపంలోని కమ్మపల్లికి చెందిన జస్టిస్ దొనడి రమేష్ 1965 జూన్ 27న జన్మించారు. ఆయన తల్లి అన్నపూర్ణమ్మ. తండ్రి డి.వి.నారాయణ నాయుడు. ఈయన పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్గా పదవీ విరమణ చేశారు. జస్టిస్ రమేష్ తిరుపతిలోనిశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1987–90 కాలంలో వి.ఆర్. లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1990లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2007లో ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో ప్రత్యేక ప్రభుత్వ పక్ష న్యాయవాదిగా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ప్రస్థానం ఇదీ.. పశ్చిమ బెంగాల్కు చెందిన జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబర్ 25న జన్మించారు. హమిల్టోన్లో పాఠశాల విద్య, తమ్లుక్లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం హజ్రా క్యాంపస్లో లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. కలకత్తాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగానూ వ్యవహరించారు. అండమాన్ నికోబార్లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబేందు.. కలకత్తా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగానూ వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2025 ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
బాణసంచా ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులు చనిపోయేంతగా పెద్ద ఘటన జరగడానికి కారణాలను ప్రశ్నించింది. రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ‘కోనసీమ జిల్లాలోని కొమరిపాలెం గ్రామంలో బాణసంచా తయారీ యూనిట్లో ఈ నెల 8న జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరిస్తున్నాం. ఈ ఘటనలో తయారీ యూనిట్ యజమాని కూడా మరణించినట్లు మా దృష్టికి వచ్చింది. మీడియా నివేదికలోని విషయాలు నిజమైతే, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందువల్ల ఈవిషయంపై రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేశాం. బాధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా లేదా కూడా నివేదికలో తెలుపుతారని ఆశిస్తున్నాం. పేలుడు జరిగిన సమయంలో 12 మంది కార్మికులు యూనిట్ లోపల ఉన్నారు. పేలుడు పదార్థాల మిశ్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు’ అని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫొటోలు తీసే బాధ్యత
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పనిభారం విపరీతంగా పెరిగిపోయి ,తీవ్ర ఒత్తిడిలో ఉన్న గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం మరింత భారం వేసింది. నకిలీ మద్యం తయారీతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫొటోలు తీసే బాధ్యతలను అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్ సెక్రటరీలు వారి పరిధిలో ఉండే (లైసెన్స్డ్) మద్యం షాపులను ఫొటోలు తీయడంతో పాటు షాపు జియో కోఆర్డినేట్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు వెళ్లాయి. మంగళవారం ఉదయాన్నే పలు జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ సెక్రటరీలకు సమాచారమిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిలో వేరొక పురుష ఉద్యోగి ఆ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. దీంతో ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగులతో మద్యం షాపుల ఫొటోలు తీయించడం ఏంటని మండిపడుతున్నాయి. దీనివల్ల ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెల్టుషాపుల కట్టడికి చర్యలు మానేసి ఇంత హడావుడిగా జియో ట్యాగింగ్ ఎందుకు చేయిస్తున్నారని విమర్శిస్తున్నాయి. -
‘సాక్షి’ నిలిపివేతపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ.. తమ చానల్ను ప్రజలకు చేరకుండా అణచివేస్తున్నారంటూ ‘సాక్షి’ టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి చానల్ను ప్రజలకు దూరం చేస్తోంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎమ్మెస్వోలు నిబంధనల ప్రకారం ‘అలా కార్టే’ పద్ధతిలో చానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే. కోర్టు విచారణకు రెండు రోజుల ముందు మాత్రమే మా చానల్ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్ చానల్ను ‘అలా కార్టే’ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. ‘అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున.. ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత కీలకమని పేర్కొంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
బనకచర్ల డీపీఆర్ చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పన కోసం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడం పూర్తిగా చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2010, 2017లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని గుర్తు చేసింది. దీనికి విరుద్ధంగా వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల జారీ అంశాన్ని ఏ ప్రాతిపదికన పరిశీలిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ, గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు ప్రభావిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేసింది. ఏపీ సమర్పించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రిఫీజిబిలిటీ నివేదిక (పీఎఫ్ఆర్)ను పరిశీలించరాదని కేంద్రాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి ఇచ్చినట్టు పరిగణించాలని పేర్కొంటూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 90 (3)ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ఇచ్చిన సమ్మతి పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే చట్టంలోని సెక్షన్–30(2) ద్వారా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు ఈ ప్రాజెక్టు ఆపరేషన్ ప్రొటోకాల్ను సైతం కేంద్రమే ఖరారు చేసిందని గుర్తు చేసింది. వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను చేపట్టరాదని కేంద్రాన్ని కోరింది. అత్యవసర సమావేశం నిర్వహించాలి ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ ఈ నెల 10న లేఖ రాశారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.5 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దీనికి విరుద్ధంగా ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్ ప్రకటన జారీ చేసిందని అభ్యంతరం తెలిపారు. దీని వల్ల ప్రభావితం కానున్న గోదావరి పరీవాహకంలోని రాష్ట్రాలతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ టెండర్లను ఆహ్వానించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఈఎన్సీ అంజాద్హుసేన్ ఈ నెల 10న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్కు మరో లేఖ రాశారు. -
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత ఇంట్లో పోలీసుల సోదాలు
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు , అతని సోదరుడు జగన్మోహనరావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. జనార్ధన్,జగన్మోహనరావు కుటుంబాన్ని విచారించిన పోలీసులు. జనార్ధనరావు ల్యాప్ టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడిగినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. జనార్ధనరావు రిమాండ్ లో ఉండగా కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడం పై పలు సందేహాలు వెలువడుతున్నాయి.ఎక్సైజ్ అధికారులు ఆయనను గన్నవరం ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే, ముందస్తు సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందాలు జనార్ధనరావును పట్టుకున్నారు.విచారణలో జనార్ధనరావు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరిన్ని నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది -
‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల సమావేశమయ్యారు. ‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా.. నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు. చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా..?, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. సడెన్గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు.. అతను చెప్పినందుకే చేశానంటాడు, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డం దొరికారు. ఆ భయంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్లు ఉన్నాయని చంద్రబాబే ఒప్పుకున్నారు.. కల్తీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం.. ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో తెలుసేలా చేశాం. దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా యాప్ను కూడా సిద్దం చేశాం.. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉండాలి. పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తే నష్టమని చంద్రబాబు అంటున్నారు పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?’ అని సజ్జల ప్రశ్నించారు.ఇదీ చదవండి:‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
ఎమ్మెల్యే బొజ్జల చెప్పేవన్నీ అబద్ధాలే: వినుత కోటా
తిరుపతి జిల్లా: తనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఖండించారు. ఆ ప్రచారమంతా అబద్ధమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను రూ. 8 కోట్లు డబ్బులు అడిగానంటూ బొజ్జల చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అసత్య ప్రచారమేనన్నారు వినుత కోట. ఎన్నికల ప్రచారంలో తనను ఎన్నోసార్లు అవమానించిన పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానని ఆమె తెలిపారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో -
కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
ఢిల్లీ: ఏపీ కురుపాం గిరిజన హాస్టల్లో అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.ఈ భేటీలో కురుపాం గిరిజన హాస్టల్ ఉంటున్న భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడినా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యకు ఫిర్యాదు చేశారు.గిరిజన హాస్టల్స్లో పరిశుభ్రమైన మంచినీరు, భోజనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ ఎత్తున పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారని పేర్కొన్నారు. గిరిజన హాస్టల్స్లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘన, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఆందోళన వ్యక్తం చేసస్తూ.. గిరిజన విద్యార్థులను కాపాడాలని వినతి పత్రం సమర్పించారు.వైఎస్సార్సీపీ నేతల బృందంలో ఎంపీ, డాక్టర్ తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర , పరీక్షిత్ రాజు, రేగమ్ మత్స్య లింగం, భాగ్యలక్ష్మి మాజీ ఎంపీ మాధవి, సుభద్ర, శోభా స్వాతి రాణి ఉన్నారు.అనంతరం తనూజ రాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కనీసం పరిశుభ్రమైన మంచినీరు ఇవ్వలేకపోతోంది కలుషిత తాగునీరు తాగి 170 మంది గిరిజన విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి సోకింది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన విద్యార్థులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యం పాలయ్యారని మంత్రి చెప్పడం దౌర్భాగ్యం’ అని విమర్శించారు. పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇప్పటివరకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు. ఆర్వో ప్లాంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు’ అని మండిపడ్డారు.రాజన్న దొర మాట్లాడుతూ.. ‘ గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం ప్రదర్శించడం లేదు. గిరిజన విద్యార్థులు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వం చలించడం లేదు. చనిపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
‘కూటమి కల్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారు’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు. ‘ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధి రాదని అర్థమైంది’ -
‘చంద్రబాబుకు ఎప్పటికీ మంచి బుద్ది రాదని అర్ధమైంది’
సాక్షి,తాడేపల్లి :సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరకగానే జోగి రమేష్ వెళ్లి ఇది నారావారి సారా అని మాట్లాడారు. దీంతో అతనిపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు.జోగి రమేష్ ఉన్నట్టు జనార్థన్రావుతో చందమామ కథ అల్లించారు.అందుకే ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధిరాదని అర్ధమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం కేసును సీబిఐకి అప్పగించాలి. చంద్రబాబుకు మంచి బుద్ది ఎప్పటికీ రాదని అర్ధమైంది.లైడిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్దమని సవాల్ చేసినా స్పందన లేదు. రెండున్నర నెలల నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులే చెప్పారు. కానీ రెండు మూడేళ్లుగా తయారవుతున్నట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం మీద మా వాళ్లు ఒక్క పోస్టు పెడితేనే కేసులు పెడుతున్నారు. ఒక్క ఫ్లెక్సీ కట్టాలన్నా బెదిరిస్తున్నారు. అలాంటిది మా వాళ్లు ఏకంగా నకిలీ మద్యం కుటీర పరిశ్రమను పెట్టగలరా?నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు.అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు. ఆ కేసును మిగతా పార్టీల మీదకే రుద్దుతే టీడీపీకే నష్టం. మా హయాంలో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్టులు చూపించగలరా?. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమే. కట్టుకథలతో ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిశారు. కస్టడిలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది?. ఎవరు రికార్డు చేశారు?.సిట్ విచారణ చేస్తుందా? వీడియో లీకులు ఇస్తుందా?. ఎంపీ మిథున్రెడ్డితోపాటు కీలక నేతల మీద వేధింపులు ఊహించిందే. ఒక్కొక్కరి మీద పది కేసులైనా పెడతారు.అన్నిటినీ ఎదుర్కోవటానికి మేము సిద్దంగానే ఉన్నాం’అని స్పష్టం చేశారు. -
మిథున్రెడ్డిపై చంద్రబాబు సర్కార్ మళ్లీ కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ మిథున్రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. మళ్లీ మిథున్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంలో మిథున్రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. మళ్లీ మిథున్రెడ్డిని కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి మిథున్రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలపై అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్ఆర్ కంపెనీ సమర్పించింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది. అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం గత నెల (సెప్టెంబర్ 29న)బెయిల్ మంజూరు చేసింది. -
‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’
సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన పేర్కొన్నారు.పేద, మద్యం తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద, మధ్య తరగతి వారి కోసమే. వైద్య విద్యను అధిక ఖరీదు చేస్తే పేదలు ఎలా చదువుకోగలరు?. కోట్లు పెట్టి మెడికల్ సీట్లు కొన్నవారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు మార్చుకోవాలి’’ అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.‘‘నాణ్యమైన విద్య ఒక్కటే సమసమాజాన్ని స్థాపించగలదు. సమ సమాజాన్ని స్థాపనే లక్ష్యంగా వైఎస్సార్సీ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. రాజ్యాంగం ఏం చెప్పేది కూడా కూటమి పాలకులకు తెలియదా?. విద్య, వైద్యం ప్రైవేటీకరణ ప్రజలకు అంగీకారం కాదు. వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే. పలాస కిడ్నీ ఆసుపత్రి, ిసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ పాలనకు గొప్ప నిదర్శనం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. -
శివశివా.. ఇదేం దారుణం?
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం జరిగిన రుద్ర హోమాన్ని వీక్షించిన భక్తులు శివశివా.. ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకున్నారు. శాస్త్రోక్తంగా హోమకుండంలో జరగాల్సిన ఈ హోమాన్ని తాపీ పనులకు వినియోగించే గమేళాలో నిర్వహించడం పట్ల పలువురు భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే శివదేవుని ఆలయంలో ధ్వజస్తంభం ఎదురుగా, ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న యాగశాల షెడ్డులో ప్రతి సోమవారం రుద్ర హోమాన్ని జరుపుతారు. అందులో రూ.516 లు రుసుము చెల్లించి దంపతులు పాల్గొంటారు. ఇదిలా ఉంటే వేరే ప్రాంతంలో యాగశాలను నిర్మించే ఉద్దేశంతో, దేవస్థానం అధికారులు మూడు రోజుల క్రితం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రస్తుత యాగశాల షెడ్డును అకస్మాత్తుగా తొలగించారు. అయితే అందులో హోమకుండం భాగానే ఉండడంతో అర్చకులు సోమవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, హోమ నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. ఇంతలో వర్షం కురవడంతో అర్చకులకు ఏం చేయాలో? పాలుపోలేదు. అప్పటికే నలుగురు భక్తులు హోమంలో పాల్గొనేందుకు ఆన్లైన్ టికెట్లను కొనుగోలు చేశారు. అలాగే భక్తులు ఉన్నా.. లేకపోయినా ఈ హోమాన్ని జరపడం పరిపాటి. దాంతో అర్చకులు తప్పనిసరి పరిస్థితుల్లో, వేరే గత్యంతరం లేక ఆలయ మండపంలో, తాపీ పనులకు వినియోగించే గమేళాలో ఈ రుద్ర హోమాన్ని నిర్వహించారు. ఇది చూసిన భక్తులు విస్తుపోయారు. శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, పురాణ పాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి పరిస్థితులను చూసిన భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అయితే ఈ ఘటనపై సెక్షన్ సూపరింటిండెంట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ షెడ్డు తొలగించిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నది వాస్తమేనని అంగీకరించారు. అయితే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లు పనిలోపడి మర్చిపోయారని, వర్షం కారణంగా ఉదయం టెంటు నిర్మించడం కుదరలేదన్నారు. అర్చకులు ప్రత్యామ్నాయంగా ఆలయంలో రుద్ర హోమాన్ని జరిపారన్నారు. -
‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’
చిత్తూరు జిల్లా: ‘నేను తెలుగుదేశం పార్టీకే ఓటువేశా. ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి. నాశనమైపోతారు. నా.. పోతారు. వద్దు..’ అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది.ఆ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. తనను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోతో మరో సెల్పీ వీడియో పెట్టాడు.వివరాలు అతడి మాటల్లోనే.. ‘నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజులునాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్లు పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను. నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. ఎవ్వరూ కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు. నాశనం అయిపోతారు. నా.. పోతారు. వద్దు..’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వరుస వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి. -
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఓలా ఈ –బైక్ కంపెనీకి జరిమానా
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం బత్తువానిపల్లి గ్రామానికి చెందిన పోలవరపు నాగరాజు 2024 ఏప్రిల్ 19న తన రూపే క్రెడిట్ కార్డు ద్వారా రూ.80,449 మొత్తాన్ని ‘ఓలా ఈ–బైక్’ కొనుగోలు నిమిత్తం చెల్లించాడు. కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని వారికి జమ చేశాడు. అయితే, ఓలా కంపెనీ వారు బైక్ను ఇవ్వకపోగా ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్కు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 18న ఓలా ఈ–బైక్ కంపెనీకి నాగరాజు లీగల్ నోటీసులు పంపాడు. వినియోగదారుల కమిషన్లో కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓలా కంపెనీ ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తమకు ఎలాంటి మొత్తం చెల్లించలేదని, ఆన్లైన్ ద్వారా చెల్లింపు విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కంపెనీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా వారి వివరాల మేరకు ఓలా కంపెనీకి నాగరాజు నగదు చెల్లించినట్లు నిర్ధారణ కావడంతో వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించింది. డబ్బు వెనక్కి చెల్లించకపోవడం, బైక్ ఇవ్వకపోవడాన్ని సేవాలోపంగా పరిగణించింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ. 80,449 మొత్తానికి 9 శాతం వార్షిక వడ్డీతో 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి చెల్లించాలని తీర్పు వెలువరించింది. అలాగే, మానసిక వేదనకు పరిహారంగా రూ.20 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేల చొప్పున మొత్తం సొమ్మును 45 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు గ్రేస్మేరీ, బి. గోపీనాథ్ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు సేవా లోపం లేదని నిర్ధారణ కావడంతో ఎస్బీఐపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
తాడిపత్రిలో ‘కాక’ రేపిన జేసీ
తాడిపత్రి టౌన్: జేసీ కుటుంబం తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాకుండా సొంత పార్టీ నాయకులపై సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశ మైంది. తాజాగా సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీకే చెందిన కాకర్ల బ్రదర్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి ప్రకటించి సొంత పార్టీ నాయకులే విస్తుపోయేలా చేశారు. సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానించడం గమనార్హం. గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో జేసీ, కాకర్ల బ్రదర్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేడుకల్లో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొని రణరంగం సృష్టించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువర్గాలు ఒకరిని మించి మరొకరు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. కాకర్ల బ్రదర్స్ స్టిక్కర్ కనిపిస్తే వాహనాలను ధ్వంసం చేస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకుల ముందు జేసీ ప్రభాకర్రెడ్డి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జేసీ తనకు తానుగా కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి చర్చకు తెరతీశారు. కాగా, కాకర్ల రంగనాథ్ సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మంత్రి నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్న నేపథ్యంలో తాడిపత్రి టీడీపీలో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.పిడుగుపాటుకు ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచిత్తూరు రూరల్: పిడుగుపాటుకు ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ ఏ.జంగాలపల్లిలో చోటుచేసుకుంది. ఏ.జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు కుమారుడు లతీష్కుమార్ (20) చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్కుమార్ పిడుగుపాటుకు గురయ్యాడు.పిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్అల్లూరి జిల్లా: పిడుగుపాటు శబ్దానికి జేబులో ఉన్న సెల్ఫోన్ పేలిపోయి గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల భూసిపుట్టు పంచాయతీ తోటలామెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు తాలబు మోహన్రావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెలపుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా పడింది. ఈ శబ్దానికి ప్యాంట్ జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మోహన్రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. -
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు.
-
పర్యాటక హరివిల్లు..'పొల్లూరు'
ప్రకృతిసిద్ధ అందాలకు నెలవు అల్లూరి జిల్లాలోని పొల్లూరు. ఈ ప్రాంతం జలవిద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా పర్యాటకంగాను గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తుండగా.. పొల్లూరు జలపాతం.. సీలేరు నది ఉరకలేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం, ఏవీపీ డ్యామ్, ఫోర్బే డ్యామ్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మోతుగూడెం: సీజన్తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లి వచ్చిన వారంతా ఈ ప్రాంత సందర్శనకు వస్తుంటారు. » ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇక్కడ 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 230 మెగావాట్ల ఉత్పత్తికి 5,6 యూనిట్లు నిర్మిస్తున్నారు. » పొల్లూరు జలపాతం..అలసిపోయిన మనసుకు ఈ ప్రాంతం ఎంతో హాయినిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరకలేస్తోంది. చూడచక్కని ప్రకృతిలో కొండలమధ్య ప్రవహిస్తూ సందర్శకుల మదిని దోచేస్తోంది. డొంకరాయి ఏవీపీ డ్యామ్ అదనపు నీరు, కొండవాగుల ప్రవాహం ఈ జలపాతంలో చేరుతుంది. » ఫోర్బే డ్యామ్ ప్రత్యేక కట్టడంగా గుర్తింపు పొందింది. పవర్ కెనాల్ నుంచి వచ్చే నీటిలో సుమారు 0.5 టీఎంసీలు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డ్యామ్లో నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్తుంది. దీనిని పూర్తిగా మట్టితో నిర్మించారు. కొండలు, పచ్చదనంతో పరిసరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు » సీలేరు నది.. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు పొల్లూరు నుంచి ప్రారంభమై చింతూరు వద్ద శబరినదిలో కలుస్తుంది. నది పొడవునా దట్టమైన వనాలతో ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. నది వడివడిగా ప్రవహించడం వల్ల దిగేందుకు పర్యాటకులు సాహసించరు.సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు. మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనెపై దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి » జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది. » పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు. రూ.45 లక్షల మంజూరు పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది. అద్భుతం జలపాతం విజయవాడ నుంచి సుమారు 15 మంది మిత్రులతో కలిసి పొల్లూరు, మోతుగూడెం పరిసర ప్రాంతాలు తిలకించేందుకు వచ్చాం. పొల్లూరు జలపాతం అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మైమరిపించాయి. – సతీష్, జియాలజిస్ట్, విజయవాడచాలా సరదాగా గడిపాం పొల్లూరు జలపాతం, సీలేరు నది అందాలు చాలా ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదాన్ని పొందాం. సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపాం. మరిచిపోలేనంతగా అనుభూతి పొందాం. – కె.రూప, భద్రాచలం -
రాజస్తాన్లో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఆర్మీ మేజర్ కన్నుమూత
జైసల్మీర్: రాజస్తాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఒక అధికారి చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మేజర్ టీసీ భరద్వాజ్(33) స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు అని అధికారులు తెలిపారు. ఈ ఘటన జైసల్మీర్ జిల్లాలోని గమ్నే వాలా గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. రామ్గఢ్ వైపు నుంచి లొంగెవాలా వైపు వెళ్తున్న ఆర్మీ జిప్సీ వాహనం మూలమలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్ స్థాయి అధికారులు, డ్రైవర్కు గాయాలయ్యాయి. వెంటనే వీరిని రామ్గఢ్ ఆస్పత్రికి తరలించారు. భరద్వాజ్ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ రాయ్(33), మేజర్ అమిత్, మేజర్ ప్రాచీ శుక్లా, డ్రైవర్ జవాన్ నసీరుద్దీన్లను ప్రాథమిక చికిత్స అనంతరం జైసల్మీర్, జోధ్పూర్లలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మేజర్ ప్రాచీ శుక్లా తలకు, మేజర్ అమిత్ కుడి కన్ను వద్ద తీవ్ర గాయాలైనట్లు తనొత్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మేజర్ భరద్వాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆర్మీకి అప్పగించారు. -
గిరిజన గురుకులాల్లో టీచర్లు అవుట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా దగా చేసింది. వీరి స్థానాల్లో సోమవారం డీఎస్సీ ద్వారా ఎంపికైన రెగ్యులర్ టీచర్లను విధుల్లోకి తీసుకుంది. దీంతో మొత్తం 1,143 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు రోడ్డునపడ్డారు. తమ పరిస్థితి ఏమిటంటూ వీరు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి మొరపెట్టుకున్నారు. మీ పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లను నియమించామని, మిమ్మల్ని ఏమి తీసేయ్యలేదు కదా? అని మంత్రి బదులిచ్చారు. అయితే, ‘మీరేమో ఇలా చెబుతున్నారు.. గురుకులాల్లోని ప్రిన్సిపాల్స్, అధికారులు మాత్రం శాంక్షన్ పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లు చేరారని, అవుట్ సోర్సింగ్ టీచర్లు కొనసాగించలేమని పంపేశారు’.. అని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచి్చన హామీని మంత్రికి గుర్తుచేశారు. మంత్రి అసహనానికి గురై వారిని బయటకు పంపించేశారు. దీంతో బాధిత టీచర్లు అక్కడే రోడ్డుపై కొద్దిసేపు నిరసన వ్యక్తంచేశారు. పోరుబాటకు సమాయత్తం.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ అవుట్ సోర్సింగ్ టీచర్లు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈనెల 15న విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ తెలిపారు. ఎస్టీ కమిషన్ సిఫార్సులు గాలికి.. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఇటీవల చేసిన సిఫార్సులను సైతం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ అమలుచేయకుండా ఆ పోస్టులను డీఎస్సీలో చూపడంతో గతేడాది నవంబరులో వీరు రోడ్డెక్కారు. మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. అయితే, ఇవేవీ అమలుచేయకపోవడంతో బాధితులు జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. వారిని తొలగించవద్దని, ఉద్యోగ భద్రత కల్పించాలని చేసిన సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. -
నకిలీ మద్యం..‘కూటమి’ పతనం తథ్యం
సాక్షి, అమరావతి : నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొనడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టిన పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాయి. సర్కారు తీరును నిరసిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నిచోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యం.. ప్రభుత్వ పతనం తథ్యం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నినదించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకునే యత్నం చేయగా, వారు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టి పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐతో దర్యాప్తు జరపడంతోపాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొంది. వైన్షాప్ల కేటాయింపులో అక్రమాలు గుర్తించి అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మద్యం విక్రయ వేళలు తగ్గించాలని.. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పిన వైన్షాప్లు, బార్ల లైసెన్సులు రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నేతలు నినదించారు. నారావారి ‘సారా పాలన’.. నశించాలి బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కుపై చేపట్టిన ఆందోళనలకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని నకిలీ మద్యంపై అనంతపురంలో నిర్వహించిన రణభేరిలో వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుబట్టాయి. నకిలీ మద్యంపై కర్నూలులో పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహించారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళనలు కొనసాగించారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారావారి సారాపాలన.. నశించాలి, నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి సర్కారు, ఎన్ బ్రాండ్ నకిలీ మద్యంతో జనం బలి, నకిలీ మద్యం మరణాలు.. పవన్కు కనపడవా? బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు.. అంటూ ప్లకార్డులతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనల్లో పాల్గొని నినదించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పచ్చజెండా ఊపి నకిలీ మద్యంతో కూటమి సర్కారు ప్రాణాలు హరిస్తోందని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో బెల్ట్షాపు రూ.9 లక్షలు పలికిందంటే కూటమి సర్కారు పాలనలో ఎలా ఏరులై పారుతోందో ఊహించవచ్చని ప్రజాసంఘాలు, మహిళలు మండిపడ్డాయి. -
గిరిజన బిడ్డల మరణాలు సర్కారు హత్యలే..!
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన విద్యార్థుల మృత్యు ఘోషతో మన్యం విలవిల్లాడుతోందని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను చుట్టుముట్టినా కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన హాస్టల్లో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, విష జ్వరాల బారిన పడగా ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో ‘హెపటైటిస్– ఏ’ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి (ఎన్హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ను ఢిల్లీలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజన్న దొర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభ స్వాతిరాణి, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరిక్షీత్ రాజు తదితరులు కలసి ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను చైర్మన్కు అందచేశారు. కూటమి ప్రభుత్వం ఉదాశీన వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందచేశామన్నారు. గిరిజన కుటుంబాలకు నష్టం జరిగితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎన్హెచ్ఆర్సీ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించి ఈ ఘలనపై దర్యాప్తు చేయాలని కోరగా అందుకు చైర్మన్ అంగీకరించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.తాగునీటిలో మలం కలిసింది గిరిజన విద్యార్థులు తాగే నీటిలో మలం కలిసిందని, ఇది అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆ నీటిని తాగిన కారణంగానే పిల్లలు విష జ్వరాలు, పచ్చ కామెర్ల బారిన పడ్డారన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతో పాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘170 మంది గిరిజన విద్యార్థులు ‘హెపటైటిస్ ఏ’ ఇన్ఫెక్షన్కి గురై విశాఖ కేజీహెచ్లో చేరారు. ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదు. గురుకుల పాఠశాలే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్ధులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆరి్టకల్ 21 (మానవ హక్కుల ఉల్లంఘన) కింద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం’ అని పేర్కొన్నారు.సీఎం కనీసం సమీక్షించరా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులు కల్పన, అంజలి చనిపోయారన్నారు. ఆరోగ్యం సరిగా లేదని తెలిసినా విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చకుండా స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపేసి చేతులు దులిపేసుకుందని మండిపడ్డారు. విద్యార్థిని కల్పన దాదాపు పది రోజుల పాటు నాలుగు ఆస్పత్రులు తిరిగినా సరైన వైద్యం అందక అక్టోబర్ 1న చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిసినా మరమ్మతులు చేయించకపోవడంతో ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల వరకు స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లలేదని విమర్శించారు. జిల్లా మంత్రికి ఇప్పటికీ తీరిక లేదన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కోసం వచ్చిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుకు పక్కనే వంద మీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే తీరిక లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇంత దారుణం జరిగిందని తెలిసినా సీఎం చంద్రబాబు ఇంతవరకు సమీక్ష కూడా చేయలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తానంటూ ఒక నోట్ రిలీజ్ చేసి మౌనం దాల్చారని వ్యాఖ్యానించారు. విశాఖలో క్రికెట్ చూడటానికి వచ్చిన మంత్రి లోకేష్ గిరిజన బిడ్డల కష్టాలను కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు.చలించిన ఎన్హెచ్ఆర్సీ చైర్మన్వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల బృందం ద్వారా ఈ దయనీయ ఘటన గురించి తెలుసుకున్న ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రామసుబ్రహ్మణియన్ చలించారు. పిల్లల విషయంలో ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చదువుల కోసం హాస్టళ్లకు పంపితే గిరిజన విద్యార్థులు ఇలా చనిపోవడం, ఆస్పత్రుల పాలు కావడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తక్షణం బృందాన్ని పంపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ హామీ ఇచ్చారు. -
లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని.. మరి చంద్రబాబు, లోకేశ్లు కూడా సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావుతో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ‘వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అనేలా సాగేది విచారణ కాదు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారు. ఇందులో భాగంగానే నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే.. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు ‘నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేశ్లకు దమ్ముంటే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా? ఈ ఛాలెంజ్కు మీరు సిద్ధమా? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారాను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులో, బెల్టు షాపుల్లో.. చివరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలా నకిలీ మద్యాన్ని పంపిస్తున్నారు.ఇదంతా బయట పడటంతో డైవర్షన్ కోసం జనార్దన్తో వీడియో విడుదల చేయించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో నా పేరు ఎక్కడా లేదు. అయినా పోలీసు కస్టడీలో ఉన్న అతనితో నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుష్ట ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.గతంలో చంద్రబాబు ఇంటి దగ్గరకు నేను ప్రశ్నించడానికి బయలుదేరానని, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. నెలో రెండు నెలలో నన్ను జైలులో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. లోకేశ్.. ఎల్లకాలం అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉండొద్దు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీకి నిలబెట్టిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు. తప్పుడు కేసులకు భయపడేది లేదు ఒక తప్పుడు వీడియోను సృష్టించి, నన్ను జైల్లో పెట్టడం ద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.. భయపడేదీ లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మీ రెడ్ బుక్కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే నా సవాలుకు స్పందించండి.కల్తీ లిక్కర్ స్కామ్లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు.. ‘ఇదే నారా వారి సారా’ అని చూపిస్తే, ఈ కేసులో నిందితుడైన జనార్దన్ను అడ్డుపెట్టుకుని నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్దన్తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఇది కేవలం చంద్రబాబు సృష్టించిన కట్టు కథ మాత్రమే. ప్రజలంతా గమనిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
ఈ ప్రశ్నలకు బదులేదీ.?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే కుతంత్రాలకు పదును పెడుతోందన్నది పక్కాగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావు మాట్లాడిన వీడియో మీడియాకు విడుదల కావడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదు.. పెద్దల పాత్ర, దర్యాప్తు పేరిట పోలీసుల అక్రమాలను బయటపెట్టింది. జనార్దన్రావు టీడీపీ నేతలకే అత్యంత సన్నిహితుడని మరోసారి తేటతెల్లమైంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ రాజకీయ పరిశీలకులు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు ఇవీ...1 జనార్దన్రావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడే కదా...! 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్ధన్రావు అక్కడే ఉన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధన్రావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతం? అంటే ఆయన చంద్రబాబు, జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. మరి ఆయన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథే కదా!2 నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్రావు ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు?3 నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న జనార్ధన్రావు హడావుడిగా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు వల్లె వేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్ధన్రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోంది.4 జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్ను విదేశాల్లో వదిలి రావడం ఏమిటి..? అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు.? ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి..? ఇవీ కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు. వాటిని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆయన ఫోన్ వదిలి వచ్చారన్నది తేటతెల్లమవుతోంది కదా.5 ములకల చెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయలేదు? ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేంతవరకు విదేశాల నుంచి రావద్దని ఆయన్ను ఆదేశించిన ముఖ్యనేత ఎవరు?6 నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించిందని ఒప్పుకున్నట్టే కదా...?7 మొదట పోలీసులు, తరువాత జైలు అధికారుల అదుపులో ఉన్న జనార్ధన్రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు? ఆయన మాట్లాడిన వీడియో అసలు ఎక్కడ షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? పక్కనుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు? ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అంటే.. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోంది కదా. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిది?8 జనార్ధన్రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా.. అందులోని విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని...అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా? వైఎస్సార్సీపీ నేతలకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే... సోమవారం విడుదల అయిన జనార్దన్ రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి? -
కేసరపల్లిలో నకిలీ బీరు కలకలం!
గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారులో ఉన్న ఓ వైన్ షాపులో నకిలీ బీరు కలకలం సృష్టించింది. ఈ షాపులో కొన్న బీరు నకిలీదంటూ కొనుగోలుదారులు సిబ్బందితో గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేసరపల్లి ఏలూరు కాలువ సమీపంలో టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో చిల్లీస్ వైన్ షాపు నడుస్తోంది. ఆదివారం ఈ మద్యం దుకాణంలో ఇద్దరు వ్యక్తులు బీరు బాటిళ్లు కొన్నారు. అందులోని ఒక బాటిల్లో బీరుకు బదులుగా నీళ్ల రుచితో ఉన్న ద్రవం ఉందని, ఇది నకిలీ అని వైన్ షాపు సిబ్బందితో గొడవకు దిగారు. తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ సురేఖ సోమవారం ఈ వైన్ షాపును తనిఖీ చేశారు. వివాదానికి కారణమైన బీరు కేసులను పరిశీలించి, అవి నకిలీవి కాదని తెలిపారు. ఇదిలా ఉండగా, నకిలీ బీరు విక్రయించారనే గొడవ ఆదివారం చోటుచేసుకోగా, సోమవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి.. బీర్లు నకిలీవి కాదని చెప్పడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. బీరు కేసులను మార్చిఉండరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
అన్నీ ప్రభుత్వమే చేసేయాలంటే ఎవరూ ఏం చేయలేం
సాక్షి, అమరావతి/తాడికొండ: ‘పరిపాలనకు కేంద్ర బిందువైన అమరావతి సిటీ ఇక్కడితో ఆగిపోతే చిన్నదైపోతుంది. సిటీ పెరగకపోతే మున్సిపాల్టీగా మారుతుంది. దీని విలువ పెరగాలంటే నిరంతరం సపోరి్టంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దేనికైనా భూమి కావాలి. ఆకాశంలో రాజధాని కట్టం.. కట్టలేం. అమరావతి ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ రాజధాని. గతంలో హైదరాబాద్ చుట్టూ 9 మున్సిపాల్టీలను కలిపి ఔటర్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేస్తే.. కోర్ ఏరియా సైబరాబాద్కు డిమాండ్ పెరిగింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంతంలో జీ ప్లస్ 7 అంతస్తుల్లో నిర్మించిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అమరావతి రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్ కింద అందరూ భూములిచ్చిన ఏకైక చరిత్ర అమరావతికే దక్కుతుందన్నారు. ఫేజ్–1లో భూములిచ్చిన రైతులకు రాజధాని ఫలాలు అనుభవించేందుకు తగిన సహకారం అందిస్తామన్నారు. ఇంటికొక పారిశ్రామికవేత్తవిధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలన్నారు. మీరింకా రైతుల్లాగే ఆలోచిస్తే ఎక్కడికో వెళ్లి ఐదు.. పది ఎకరాల భూమి తీసుకుని వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతి ముఖ చిత్రం మారుతోందని, రైతులు ఆలోచనలు మార్చుకోవాలన్నారు. ‘రైతులు నెక్ట్స్లెవల్లో ఆలోచించాలి. అన్నీ మీరే (ప్రభుత్వం) చేసేయాలంటే ఎవరూ ఏం చేయలేం. నాకు కూడా 176 పనులు ఉంటాయి. అన్నీ చేయలేదంటే ఐదేళ్ల తర్వాత గుర్తు పెట్టుకోండి. ఒకసారి చేసిన తప్పుకు నష్టపోయారు. భవిష్యత్తులో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏనే అధికారంలో ఉండాలి. అందుకే జనసేన, టీడీపీ, బీజేపీ.. ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం’ అన్నారు. భూములు అమ్మి రాజధాని కడతాం హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 5 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తాను చెప్పినట్టే కోటీశ్వరులు అయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. వారిని చూసే రాజధాని రైతులు అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారన్నారు. ఇది సెల్ఫ్ మానిటైజేషన్ అని, ఒక్క రూపాయి ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేయట్లేదని స్పష్టం చేశారు. అమరావతి కంటే విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలని సూచించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విశాఖ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ పై సోమవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఐఐ సదస్సుకు విచ్చేయండి ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానంసాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో ఈ నెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సమ్మిట్–2025కు విచ్చేయాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు. సీఐఐ సదస్సుకు అధ్యక్షత వహించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన మంత్రి లోకేశ్తో కలసి ఇక్కడికి వచ్చారు. కాగా, మంగళవారం ఢిల్లీలో గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. -
ముఖ్యనేత డైరెక్షన్... జనార్దన్ యాక్షన్!
సాక్షి, అమరావతి: భారీ దోపిడీయే లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియాతో బరితెగించి అడ్డంగా దొరికిన ముఖ్యనేత సరికొత్త కుట్రకు తెరతీశారు. ఇప్పటికే భేతాళ కథలతో, అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న ఆయన ఈ కుతంత్రాన్ని పతాకస్థాయికి చేర్చి పొలిటికల్ సోషియో ఫాంటసీ కథతో కనికట్టు చేసే ఎత్తుగడ వేశారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మద్యం దోపిడీ కుట్రలో పాత్రధారి జనార్దన్రావుతో డైవర్షన్ కుట్రకు ముఖ్యనేత పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగారు. ఈ కుట్ర సినిమా షూటింగ్ కోసం పోలీసులే ఆర్ట్ డైరెక్షన్ బాధ్యత భుజానికెత్తుకుని గుర్తు తెలియని ప్రదేశంలో సెట్ రెడీ చేశారు. ముఖ్యనేత స్టార్ట్ కెమెరా అనగానే.. జనార్దన్రావు చిలుక పలుకుల్లా డైలాగులు చెప్పేశారు! ఆయన దారి తప్పకుండా పక్కనుంచి పోలీసులు ప్రాంప్టింగ్ అందిస్తూ డైలాగులు గుర్తు చేశారు. నకిలీ మద్యంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చుట్టూ కట్టుకథ అల్లారు. ముఖ్యనేత అనుకున్నట్లుగా కుట్రకథ చిత్రీకరణ పూర్తి కాగానే ప్యాకప్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఈ కుట్ర కథ గురించి మీడియాకు లీకులు ఇచ్చి టీజర్ విడుదల చేసిన ముఖ్యనేత.. సినిమా విడుదలకు సోమవారం ముహూర్తం పెట్టారు. టీడీపీ వీరవిధేయులతో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే తమ పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్కు పచ్చ జెండా ఊపారు. కథ, స్క్రీన్ప్లే, మాటలు, డైరెక్షన్.. అంతా ముఖ్యనేత కేంద్రంగా సాగిన ఆ తెర వెనుక కుట్ర ఇలా ఉంది.. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మాఫియా.. దిక్కుతోచని స్థితిలో ముఖ్యనేత టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా సూత్రధారిగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. ఎందుకంటే.. ఈ దందాలో బయటపడిన పాత్రధారులు అందరూ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులే. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫాం ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ ప్లాంటు జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్ధన్రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫాం ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫాం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దన్రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పది రోజుల క్రితం బయటపడిన నకిలీ మద్యం మాఫియా వేళ్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బాగోతం అంతా ఫొటో, వీడియో ఆధారాలతోసహా బయటపడింది. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ సరుకును మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారన్న వాస్తవం వెల్లడి కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. పచ్చముఠాల దందా, టీడీపీ పెద్దల నిర్వాకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. దాంతో నకిలీ మద్యం మాఫియా సూత్రధారి, అంతిమ లబి్ధదారుగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో ఆగమేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. సీబీఐ అంటే గుబులు... అందుకే ‘పచ్చ’ సిట్తో పన్నాగం! గతంలో నమోదు చేసిన అక్రమ మద్యం కేసులోగానీ... ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో గానీ సీబీఐ దర్యాప్తు అంటేనే ముఖ్యనేత బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్తో రాజకీయ వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ద్వారానే వేధింపులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్ను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. అయితే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ కుట్రలు వరుసగా బెడిసికొడుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, అప్పటి అధికారులకు వ్యతిరేకంగా సిట్ నమోదు చేసిన అభియోగాలు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. అదే సమయంలో అసలు మద్యం మాఫియాను నిర్వహిస్తోంది టీడీపీ పెద్దలేనన్న విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. 2014–19లో టీడీపీ హయాంలో సిండికేట్ ద్వారా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఆ అవినీతిని గతంలోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం దందాకు బరితెగించినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. భారీగా పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతటా విస్తరించినట్లు నిగ్గు తేలింది. ఆ మాఫియా సూత్రధారి ముఖ్యనేత కాగా... పాత్రధారులు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్రావు... పంపిణీదారులు టీడీపీ సీనియర్ నేతలన్నది బట్టబయలైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీతోపాటు ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం తోసిపుచ్చడం గమనార్హం. తమకు అలవాటైన రీతిలో టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో మరో సిట్ను నియమించింది. తద్వారా నకిలీ మద్యం దందా సూత్రధారులు, పాత్రధారులైన టీడీపీ నేతలను ఈ కేసు నుంచి తప్పించే ఎత్తుగడ వేసింది. వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా ఈ కేసులో ఇరికించే కుట్రకు తెరతీసింది. అందులో భాగంగానే సిట్ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల అయిన కాసేపటికే... ముఖ్యనేత డైరెక్షన్లో ఏ1 జనార్దన్ మాట్లాడిన వీడియోను ఎల్లో మీడి యా ద్వారా విడుదల చేయించారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం మీడియా సమావేశంలో చూచాయగా వెల్లడించిన విషయాలనే జనార్దన్ వీడియోలో వల్లె వేయడం గమనార్హం. మొదట పోలీసుల అదుపులో.. ఇప్పుడు జైల్లో .. అసలు జనార్దన్ మీడియాతో ఎలా మాట్లాడారు? ఎల్లో మీడియా ద్వారా విడుదలైన ఏ1 జనార్దన్రావు వీడియో ముఖ్యనేత కుతంత్రాన్ని బట్టబయలు చేసింది. ఆయన ప్రభుత్వానికి అధికారిక అతిథి అన్నది కూడా స్పష్టమైంది. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించకుంటే నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ పెద్దల పేర్లను బయటపెడతానని జనార్దన్రావు బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. దాంతో కేసును పక్కదారి పట్టిస్తామని ముఖ్యనేత డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న జనార్దన్రావు ఓ సెలబ్రిటీ తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు ప్రభుత్వ అతిథిగా రాచమర్యాదలు చేశారు. ఇక తాజా వీడియో ఆయన ముఖ్యనేత కుట్రలో పాత్రధారేనని స్పష్టం చేసింది. అసలు జనార్ధన్రావు ఎల్లో మీడియాకు ఎలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగలిగారన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే.. జనార్దన్రావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ రోజు గుర్తు తెలియని ప్రదేశంలో విచారించి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. అంటే శుక్రవారం నుంచే ఆయన పోలీసులు, అనంతరం జైలు అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ఎల్లో మీడియా సోమవారం విడుదల చేసింది. మరి ఆయన ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడినట్లు...? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్ధన్రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే.. అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. పచ్చ పలుకులే పలికిన చిలుక... జనార్దన్రావు ఇక ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అసలు కుట్ర మరింత స్పష్టంగా వెల్లడవుతోంది. పక్కన పోలీసులు, టీడీపీ నేతలు పక్కనుంచి చెబుతున్న విషయాలనే జనార్ధన్ రావు వల్లె వేస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది. తమ కుట్రకు అనుకూలంగా అవాస్తవాలను ఆయనతో చెప్పించారన్నది వెల్లడవుతోంది. ఫాంటసీ కథకు క్లాప్ కొట్టిన ముఖ్యనేత.. ఏ1 జనార్దన్రావుతోనే కట్టుకథల వీడియోసోషియో ఫాంటసీ సినిమాలు, యూట్యూబ్ వీడియోలను తలదన్నే రీతిలో ముఖ్యనేత కట్టుకథలతో కుతంత్రానికి తెర తీశారు. పిల్లలను ఊహా ప్రపంచంలో విహరింపచేసి మైమరపింపచేసే జానపద కథల మాదిరిగా పొలిటికల్ ఫాంటసీ కథకు క్లాప్ కొట్టారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అద్దేపల్లి జనార్ధన్రావు ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ కథలను వినిపించారు. ముఖ్యనేత స్క్రిప్టును ఆయనతో చెప్పించారు. ఆ ఫాంటసీ వీడియో షూటింగ్ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించారు. జనార్దన్రావుతో చెప్పించిన కట్టుకథ ముఖ్యనేత కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. ఎంతగా అంటే.. ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్లుగా చిత్రీకరించారు. ఇక మరో పాత్రధారి సురేంద్రనాయుడు ఊసే లేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ... వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ పేరును జనార్దన్రావు నోటితో చెప్పించడం ముఖ్యనేత భేతాళ కుట్రలకు పరాకాష్ట. జోగి రమేశ్ చెబితేనే తాను నకిలీ మద్యం రాకెట్ నిర్వహించానని జనార్ధన్రావు నమ్మబలకడం టీడీపీ మార్కు బరితెగింపు దు్రష్పచారమే. గత ప్రభుత్వ హయాంలోనే తాను కల్తీ మద్యం రాకెట్ నిర్వహించానని... టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నిలిపివేశానని... మళ్లీ కొన్ని నెలల క్రితం జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టానంటూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడే స్థాయిలో నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. ములకలచెరువులో నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులుజనార్దన్రావు వీడియో కుట్రపూరితం.. ఎందుకంటే..?⇒ నిందితులు ఎవరైనా పోలీసుల విచారణలో చేతులు కట్టుకుని నిలబడి వినయంగా మాట్లాడతారు. ఎల్లో మీడియా విడుదల చేసిన వీడియోలో జనార్దన్రావు ఓ కురీ్చలో తాపీగా కూర్చుని మాట్లాడటం గమనార్హం. ⇒ ఇక ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉంది కదా.. అది చెప్పాలంటూ పక్క నుంచి ఎవరో ప్రోత్సహిస్తుండగా జనార్దన్రావు ఆ స్క్రిప్ట్ వల్లె వేశారు. తన పాత్ర, ప్రమేయం ఏదీ లేదని.. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అంతా చేశానంటూ చెప్పుకొచ్చారు. అంటే జోగి రమేష్ పేరు చెప్పాలన్న పోలీసుల ఆదేశాలనే జనార్దనరావు పాటించారన్నది స్పష్టమైంది. ⇒ గతంలో తాను కల్తీ మద్యం వ్యాపారం చేశానని జనార్దన్రావు చెప్పగానే... గతంలో అంటే ఎప్పుడు? అంటూ పక్కనే ఉన్న ఓ పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. దాంతో గత ప్రభుత్వ హయాంలో అని ఆయన చెప్పారు. అంటే గత ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా జనార్దనరావుతో బలవంతంగా చెప్పించారన్నది తేటతెల్లమవుతోంది. ⇒ అంతటితో ఈ కుట్రలు ఆగలేదు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకే నకిలీ మద్యం వ్యాపారం మళ్లీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ చెప్పారని జనార్దన్రావుతో పలికించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీన్ని నిర్వహించాలంటూ తనకు నిర్దేశించారన్నారు. జోగి రమేషే తనను ఆఫ్రికా పంపించారని.. నిధులు సమకూర్చారని.. పోలీసులే జనార్దన్రావుతో దగ్గరుండి మరీ చెప్పించినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. అంటే ఎంత పక్కాగా జనార్దన్రావుతో అవాస్తవాలను చెప్పించారన్నది వెల్లడవుతోంది. -
అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్రెడ్డి పిటిషన్
విజయవాడ లీగల్: ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తరఫున చంద్రగిరి విష్ణువర్ధన్ సోమవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్ధించారు. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 5 వరకు న్యూయార్క్లో నిర్వహించే సమావేశాలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్రెడ్డికి ఆహా్వనం అందింది. ఇప్పటికే ఈనెల 27 నుంచి 31వరకు అమెరికా పర్యటన నిమిత్తం మిథున్రెడ్డి పాస్పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈనెల 20నుంచి వచ్చేనెల 5వరకు అమెరికా వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని మిథున్రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ను ఆదేశిస్తూ, న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదావేశారు. విచారణకు సహకరిస్తున్నా రిమాండ్ పొడిగింపు మద్యం అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్కృష్ణ రిమాండ్ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వారందరినీ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరితోపాటు బెయిల్పై ఉన్న మిథున్రెడ్డి, పైలా దిలీప్, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కూడా ఏసీబీ న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రిమాండ్ ముగుస్తున్న ప్రతీసారి ఏవిధమైన మార్పులు లేకుండా ఒకేవిధమైన రిమాండ్ పొడిగింపు నోటీసును న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.ఇప్పటివరకు ఈ కేసులో సిట్ 35 రూపాయలు కూడా స్వా«దీనం చేసుకోలేదన్నారు. నిందితులందరిపై చార్జిషీటు దాఖలుచేసినా 200 రోజుల నుంచి వారందరినీ జైలులోనే ఉంచారన్నారు. వారిని విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై ప్రాసిక్యూషన్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ను పొడిగించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాణి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సెల్ఫోన్ తెరిచేందుకు అనుమతి మద్యం అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు వద్ద సీజ్ చేసిన సెల్ఫోన్లో మరిన్ని ఆధారాలున్నాయని పేర్కొంటూ సెల్ఫోన్ను తెరిచేందుకు బయోమెట్రిక్కు అనుమతించాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం దీనికి అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న కాలంలో నిధుల అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై రిమాండ్లో ఉన్న ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. -
గర్జించిన విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల మొండివైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ పేరుతో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది ఉద్యోగులు తరలివచ్చారు. డిమాండ్ల సాధనకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) గత నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి స్పష్టమైన హామీ రాలేదు.దీంతో సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 20 వేల మందికి పైగా శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు, తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా లెక్కచేయకుండా ముందు రోజు రాత్రే దూర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే అందులో విజయవాడకు వచ్చారు. చర్చలు విఫలం.. సమ్మె తప్పదు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచాయి. సోమవారం సాయంత్రం రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లను విద్యుత్ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో మంగళవారం ‘వర్క్ టు రూల్’, బుధవారం నుంచి నిరవధిక సమ్మె జరుగుతాయని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య స్పష్టం చేశారు. చర్చల అనంతరం జేఏసీ నేతలు కె.శ్రీనివాస్, ఎంవీ గోపాలరావు, ఎంవీ రాఘవరెడ్డి, కేవీ శేషారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, ఏపీ జెన్కో ఎండీతో కూడిన అధికారుల బృందం చర్చలు జరిపింది.జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో కొన్నిటికి మాత్రమే వారు సానుకూలత వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయడం, బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్విసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్రధాన డిమాండ్లను కమిటీ తిరస్కరించింది. ఫలితంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి’ అని కృష్ణయ్య తెలిపారు. ఉద్యోగులు దాదాపు 59 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిలో ఆఖరి ప్రాధాన్యతగా పొందుపరిచిన వాటిలో మొక్కుబడిగా కొన్నింటికి యాజమాన్యం అంగీకరించింది.ఈ మేరకు సోమవారం రాత్రి పలు ఆదేశాలను జారీ చేసింది. వాటి ప్రకారం.. కారుణ్య నియామకాలను చేపట్టేటప్పుడు 16 ఏళ్ల లోపు ఉన్నవారిని, 45 దాటిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అయితే ఈ వయసు తక్కువ, ఎక్కువ (అండర్ ఏజ్, ఓవర్ ఏజ్) ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నాటికి దరఖాస్తు చేసిన వారికి మాత్రమేనని మెలిక పెట్టింది. ఉద్యోగ సంఘాలతో పీరియాడికల్ నెగోషియేషన్ కమిటీ (పీఎన్సీ) సమావేశం ప్రతి మూడు నెలలకు జరపడానికి ఒప్పుకుంది.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంస్థ అవసరాలకు అడ్వాన్స్గా తీసుకునే నగదును రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. సర్వీస్ ఇంక్రిమెంట్ల క్రమబద్ధీకరణకు ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీ 2022పై ఇంజినీర్స్ అసోసియేషన్లు వేసిన కోర్టు పిటిషన్లను ఉపసంహరింపజేస్తామని హామీ ఇచ్చింది. కాగా కొన్ని డిమాండ్లకు అంగీకరించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని విద్యుత్ జేఏసీ మండిపడింది. -
డీజీపీ నిద్రపోతున్నారా.. పోలీసు శాఖను మూసేయాలి!
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తు, హైకోర్టులఉతర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న హైకోర్టు, ‘డీజీపీ నిద్రపోతున్నారా?’ అంటూ మరో సారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సీఐడీ ఐజీని ఆదేశించామని, అయితే సీఐడీ ఐజీ పోస్టులేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడమేమిటని ఆక్షేపించింది.సెప్టెంబర్ 19న ఆదేశాలిస్తే, అక్టోబర్ 6వ వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారా? అంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా, మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సీఐడీ ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడు ఉన్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది.అయినా కూడా మీరు (పోలీసులు) చోద్యం చూస్తూనే ఉంటారంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసు శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి రూ. 72,000 విలువైన 900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించి తిరుమల వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డుల సీజ్కు మాత్రమే ఆదేశాలిచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సీఐడీలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చునంది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది.ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ని ఆదేశించింది. వీటన్నిటినీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టు రిజి్రస్టార్ (జ్యుడిషియల్) ద్వారా తమ ముందు ఉంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జనార్ధన్తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
‘నకిలీ మద్యం కేసులో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’
తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు, లోకేష్లకు అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ను బయటకు తీసిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నేతలు నకిలీ మద్యం రాకెట్ను నడిపిస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ బురదను వైఎస్సార్సీపీకి అంటించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్థన్రావుతో ఒక వీడియోను తీయించి, దానిలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పిండంతో ఈ కుట్ర బయటపడిందని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జనార్థన్రావు ఎలా వీడియో తీయగలడని, దానిని ఎల్లో మీడియాకు ఎలా చేర్చగలిగాడని వారు ప్రశ్నించారు. ఇంకా వారేమన్నారంటే..టీడీపీ పెద్దల కుట్రలు పరాకాష్టకు..కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి, దాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్రావు వీడియో ఒకటి ఈ సాయంత్రం లీక్ చేశారు. నిజానికి ఆయన ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది? అంటే ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతోంది. ఈ కేసుపై నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, దీనిపై ‘సిట్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే, కేసును ఎలా నీరుగార్చబోతున్నారు? వైయస్సార్సీపీకి ఎలా అంటగట్టబోతున్నారు? అనేది తేటతెల్లమైంది. పైగా ఈ కేసులో లోతులోకి వెళ్లేసరికి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయన్న చంద్రబాబు మాట.. ఆయన కుట్రను బయట పెట్టింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే, కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్ రావు నోటి నుంచి వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు పలికించి, ఆయన్ను ఈ కేసులో ఇరికించే పని మొదలు పెట్టారు. నిజానికి నకిలీ మద్యం తయారు చేస్తున్న, ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు జనార్థన్ రావు, జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు.. స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారు. కాబట్టే అంత పెద్ద రాకెట్ నడిపించారు. ఇంకా చెప్పాలంటే.. ముందు నుంచి మా పార్టీ చెబుతున్నట్లు ప్రభుత్వ, పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది, ఇది వాస్తవం. ఇదంతా టీడీపీ ప్రభుత్వం వచ్చాక, మొదలైన దందా. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని పట్టించడమే జోగి రమేష్ చేసిన నేరమా? ఆఫ్రికా నుంచి దర్జాగా పిక్నిక్ నుంచి తిరిగి వచ్చినట్లు జనార్థన్రావు రావడం.. అంతకు రెండు, మూడు రోజుల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి, నకిలీ మద్యం తయారీలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడం.. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది. ఆఫ్రికా నుంచి దర్జాగా వచ్చిన జనార్థన్రావును గన్నవరం విమానాశ్రయం నుంచే ఎక్సైజ్ అధికారులు ఎక్కడికో తరలించారు. ఏం చెప్పాలో, ఎవరిపై నింద వేయాలో.. అన్నీ ఒక పథకం ప్రకారం ఆయన్ను ప్రిపేర్ చేశారు.వైఎస్సార్సీపీ ఆందోళనలతో కంగారుపడ్డ చంద్రబాబురాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైయస్సార్సీపీ ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడంతో భయపడిన, చంద్రబాబు నిన్న రాత్రి హడావిడిగా ప్రెస్మీట్ పెట్టి, చాలా విషయాలు మాట్లాడి, ఈ కేసులో వైయస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పినట్లు ఆరోపించి, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో దొరికినా, నకిలీ మద్యం తయారీ ఈ స్థాయిలో జరుగుతున్నా.. అందులో ప్రభుత్వ, పార్టీ పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిందను వైయస్సార్సీపీపై వేయడం అత్యంత దారుణం హేయం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? భారత రాజ్యాంగ పరిధిలో ఈ రాష్ట్రం లేదా? ఇంత కంటే నిర్లజ్జగా అధికార దుర్వినియోగం ఎక్కడైనా ఉంటుందా? ఇవి దర్యాప్తు సంస్థలా? లేక చందమామ కధలు చెబుతున్నారా? బేతాళ కథలు అల్లడంలో సిద్ధహస్తులయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత దగుల్బాజీ వ్యవస్థ లేదు. చంద్రబాబు మాదిరిగా వ్యవస్థలను ఎవరూ నాశనం చేయడం లేదు. చట్టం, న్యాయం, కోర్ట్లు అంటే ఏ మాత్రం గౌరవం లేదు. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న నకిలీ మద్యం తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్థన్, సురేంద్రనాయుడు తదితరులపై కేసు నమోదు చేశారు. ఒక పథకం ప్రకారం ముందుగా మాట్లాడుకున్న తరువాత జనార్థన్ నాయుడిని దక్షిణాఫ్రికా నుంచి ఏపీకి రప్పించారు. ఎంత దర్జాగా ఆయన విదేశాల నుంచి ఏపీకి వచ్చారో కూడా ప్రజలు చూశారు. ఆ తరువాత ఒక కుట్రపూరితంగా ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియోతో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. జనార్థన్ను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన కోర్ట్ కు రిమాండ్కు పెట్టారు. ఈ రోజు విడుదల చేసిన వీడియోలో 'నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్కు సంబంధం ఉందని, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబుకు చెడ్డపేరు రావాలని, తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి, ఊరూరా ఆ మద్యాన్ని సరఫరా చేయాలి' అని జోగి రమేష్ చెప్పినట్లుగా ఆ వీడియోలో చూపించారు. మొలకలచెరువులో ఈ వ్యవహారం బయటపడిన తరువాత దాని డిపో ఇబ్రహీంపట్నంలో బయటపడింది. దీనిని కూడా తమకు అనుకూలంగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ సలహా మేరకే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డిపోను ఏర్పాటు చేశారని, మొలకలచెరువు మద్యం తయారీ బయటపడిన వెంటనే, జోగి రమేష్ ఇబ్రహీంపట్నం లోని డిపో గురించిన సమాచారంను ఒక పథకం ప్రకారం లీక్ చేయించారంటూ జనార్థన్తో చెప్పించిన వీడియోను బయటకు విడుదల చేశారు. ఈ వీడియో గురించి పూర్తి వాస్తవాలు బయటపెట్టాలి. సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఎల్లో మీడియా ఈ వీడియోను ఎలా విడుదల చేసిందో చెప్పాలని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
చంద్రబాబు కమీషన్ల దందాపై మల్లాది విష్ణు ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయాలతో అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు దండుకుంటున్న కమీషన్ల దందా దాగి ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సీఆర్డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి దీనిలో ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏకంగా చదరపు అడుగు రూ.11,0002.64 చొప్పున దాదాపు రూ.338.14 కోట్లతో సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారని, దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగుళూరు, ముంబై వంటి చోట్ల, స్టార్ హోటళ్ళే చదరపు అడుగు గరిష్టంగా రూ.4500లకే నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. అంచనాలను పెంచడం, అందులో తమ వంతు ముడుపులను అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...సీఆర్డీఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే... అప్పుచేసి పప్పు కూడు, జనానికి క్షవరం. రెట్టింపునకు మించి నిర్మాణ వ్యయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారేందుకు ఈ సీఆర్డీఏ భవనమే పెద్ద ఉదాహరణ. తొలిగా హెచ్ఓడి పేరుతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయని చెబుతున్నారు. సీఆర్డీఏ భవనంలో ఏ విభాగాలు పనిచేస్తాయి, అందులో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుతం వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారంటే సరైన సమాధానం లేదు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెతను తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజల సొమ్ముతో అవసరానికి మంచిన సామర్థ్యంతో, రెట్టింపు అంచనాలతో భారీ భవనాలను నిర్మించి, తమ ఘనతగా చాటుకోవాలని చూస్తోంది. అనుత్పాదక వ్యయంగా ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా దీని నిర్వహణ కోసం అత్యధిక వ్యయాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియదా? దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదా?చంద్రబాబు కమీషన్ల దందాఅంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు దీనిని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. అందుకే దేశంలో భవనాలు, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా భారీ వ్యయాన్ని కేటాయిస్తున్నారు. అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారు. అప్పులు చేసి రాజధాని పేరుతో భవనాలు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రుణభారాన్ని ప్రజల నెత్తిమీద రుద్దుతున్నారు. ప్రతిసారీ తాను గొప్ప విజనరీనీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన కమీషన్లను పెంచుకోవడానికే, ఈ తరహాలో అంచనాలను పెంచి భారీ నిర్మాణాలను చేపడుతున్నారు.2016లో ఇదే తరహాలో వెలగపూడిలో రూ.1150 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కలిక సచివాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 52,90,426 చదరపు అడుగులతో నిర్మాణాలకు సిద్దమయ్యారు. ఈ భారీ భవనాలు, టవర్స్ కోసం రూ. 4688.82 కోట్లు ఖర్చు చేస్తూ, ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. సచివాలయంలో ఎక్కువలో ఎక్కువ మూడు వేల మంది పనిచేస్తుంటారు. వారి కోసం ఇన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు అవసరమా? రాజధాని నిర్మాణం ముసుగులో సీఎం చంద్రబాబు చేస్తున్న దందా ఇది అని అర్థమవుతోంది.ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా?ఈ రాష్ట్రంలో పేద విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు లేవంటూ, వాటిని ప్రైవేటు వారికి అప్పగించేందుకు ఈ కూటమి ప్రభుత్వం తెగబడింది. ఒకవైపు రాజధాని ప్రాంతంలో విలాసవంతమైన భవనాలను వందల కోట్లతో అప్పులు చేసి మరీ నిర్మిస్తున్న ఈ ప్రభుత్వానికి, పేదలకు ఉపయోగపడే వైద్య కళాశాలలకు, దానికి అనుబంధంగా నిర్మించాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం కనిపించడం లేదా? వాటికి కేటాయించడానికి మాత్రం సీఎం చంద్రబాబు వద్ద నిధులు లేవా? అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు.మరోవైపు ప్రభుత్వ వైద్యరంగాన్ని, మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశలో భూములు ఇచ్చిన రైతులు తమకు ప్లాట్లు ఇవ్వలేదని, కౌలు సొమ్ములు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో రెండోదశ భూసేకరణ కోసం ప్రభుత్వం సిద్దమవ్వడం, భారీ అంచనాలతో నిర్మాణాలకు సిద్దమవ్వడం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటీ? ఒకవైపు రైతులు రాజధానిలో తమకు ప్లాట్లు ఇవ్వలేదని ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు భారీ వ్యయాలతో, విలాసవంతమైన నిర్మాణాలు చేపడతామనే ముసుగులో భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. -
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
‘బాబు కరకట్ట డాబు’.. సీఎం నివాసానికి కోట్లు వెదజల్లిన ఏపీ ప్రభుత్వం!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు తాజాగా మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలస్ ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలే సీఎం నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలస్ మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ. కోటి 21 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇది కొత్తది కాదు. గత రెండు నెలల్లోనే కరకట్ట ప్యాలస్కు సంబంధించి రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధుల్లోరూ.20 లక్షలు: మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకురూ.16.50 లక్షలు: వంటశాల సదుపాయాల కోసంరూ.19.50 లక్షలు: నివాసం చుట్టూ చెదల నివారణకుఇంతకు ముందు కరకట్ట ప్యాలస్ సౌకర్యాల కోసం రూ. కోటి 44 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ రూ. కోటి 21 లక్షలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా, ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఖర్చులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలకు దారి తీస్తున్నాయి. -
దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
విశాఖ : ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావ కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీనిలోభాగంగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
‘కొల్లు కాదు.. సొల్లు రవీంద్ర.. టీడీపీ కార్యకర్తలే నిన్ను తంతారు’
సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంత్రి రవీంద్ర(Kollu Ravindra) ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ(TDP) కార్యకర్తలు తాళ్లతో కట్టేశాడని ఆయన అనుకుంటున్నాడు.. గన్మెన్లు లేకపోతే కార్యకర్తలే తిరగబడి దాడి చేస్తారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా కుటుంబాలు రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు.కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘సారా మంత్రి అంటాడు.. మేము నాణ్యమైన మందు అమ్ముతున్నాం. దాని కోసం ఒక యాప్ కూడా తీసుకొచ్చామని చెబుతాడు. కొన్న వెంటనే స్కాన్ చేసి పరిశీలించుకోండి అని అంటున్నాడు. ఆ సమయంలో పేదవారు, టచ్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?. కల్తీ మద్యం తాగే వారికి కూడా కుటుంబం ఉంటుంది. మద్యం తాగకూడదు అని చెప్పాలి. ఒక వేళ మద్యం తాగకుండా ఉండలేకపోతే నాణ్యమైన మద్యం అయినా ఇవ్వాలి.రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందోమో కానీ మద్యానికి మాత్రం కరువు రాలేదు. ప్రతి గల్లీలో ఎటుచూసినా, ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే కనిపిస్తున్నాయి. దయచేసి కల్తీ మందు జోలికి వెళ్లొద్దు. మద్యాన్ని నిమంత్రించకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్న ఈ సారా మంత్రిని బర్తరఫ్ చేయాలి. మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని మార్చుకోవాలి. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు.. నువ్వు కట్టిన తాళ్లను పరాపరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు. నీ గన్మెన్లు ఉన్నా నిన్ను టీడీపీ కార్యకర్తలు నిన్ను కొట్టకపోతే నన్ను అడుగు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు.. అల్లాడి ఏడుస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో
సాక్షి, చెన్నై: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చరచకు దారి తీసింది. ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. ఆ వీడియోలో సారాంశం ఇలా.. ‘‘మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం.ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని అన్నారామె. మొన్నీమధ్యే కొట్టే సాయిప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్గా పదవి లభించింది. దీనిపై వినుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్(Jana Sena Chief pawan Kalyan)కు ఆమె లేఖ రాశారు. ఈలోపు.. రాయుడి వీడియో కలకలం రేపింది.ఇదిలా ఉంటే.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై బొజ్జల నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ ఏడాది జులై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్యచేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారని కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిందితులు చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పవన్ కొత్త పాట.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ -
NHRC: కురుపాం ఘటన.. ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడుగు వేసింది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేసింది. ఏపీ కురుపాం గిరిజన హాస్టల్స్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడం తెలిసిందే. అయితే వాళ్లకు సకాలంలో చికిత్స అందకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహంతో ఉంది. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మంచి భోజనం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఎన్హెచ్ఆర్సీకి ఫిరయాదు చేసింది. పెద్ద సంఖ్యలో పిల్లలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వైనాన్ని హక్కుల సంఘానికి వివరించింది.గిరిజన హాస్టల్స్ లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర తదితరులు ఉన్నారు. -
ఏపీలో దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఎంతంటే..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ రూ.109.46గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ కొనుగోళ్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల వారీగా వీటి ధరల్లో ఇంత వ్యత్యాసం ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అధిక ధరలకు ప్రధాన కారణాలుగా ఉన్న పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల స్వరూపాన్ని కింద చూద్దాం.రాష్ట్రాల వారీగా ధరల్లో వ్యత్యాసానికి కారణాలుముడి చమురు (Crude Oil) కొనుగోలు ధర అంతర్జాతీయ మార్కెట్పై, డాలర్తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉన్నప్పటికీ తుది వినియోగదారునికి చేరే పెట్రోల్ ధర రాష్ట్రాల వారీగా గణనీయంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ను వస్తు, సేవల పన్ను (GST) పరిధి నుంచి మినహాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక వ్యాట్ విధించడం వల్ల ఇక్కడ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా వ్యాట్ అధికంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా..కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వ్యాట్ను తగ్గించలేదు. దీని ఫలితంగా కేంద్రం ఇచ్చిన తగ్గింపు ప్రయోజనం వాహనదారులకు పూర్తి స్థాయిలో అందడంలేదు. చమురు రిఫైనరీల నుంచి పెట్రోల్, డీజిల్ రవాణా చేసే దూరాన్ని బట్టి ఖర్చులు కూడా ధరను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రధాన వ్యత్యాసానికి కారణం రాష్ట్రాల పన్ను విధానాలేనని గుర్తుంచుకోవాలి. డీలర్ల కమిషన్ కూడా తుది ధరలో భాగమే. ఇది రిఫైనరీల నుంచి డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినందుకు గాను చమురు కంపెనీలు చెల్లిస్తాయి.పన్నుల స్వరూపంపెట్రోల్ తుది ధరలో దాదాపు 50% నుంచి 60% వరకు పన్నుల రూపంలోనే ఉంటుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులుకేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్పై ఒక నిర్ణీత మొత్తం (Fixed Amount)లో ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం తన ఖజానాకు జమ చేసుకుంటుంది. సెస్ (Cess), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)పేరుతో కూడా కేంద్రం పన్నులను విధిస్తుంది. వీటిలో చాలా వరకు రాష్ట్రాలతో పంచుకోకుండా కేంద్రమే తీసుకుంటోంది.రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులురాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ముఖ్యంగా ఇది డీలర్లకు అమ్మే ధర, కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్తో సహా మొత్తం ధరపై విధిస్తారు. దీని కారణంగా ఇంధనం బేస్ ధర పెరిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుంది.🚨 Petrol prices per litre as of today. (High to Low)Andhra Pradesh – ₹109.46Kerala – ₹107.49Telangana – ₹107.46Madhya Pradesh – ₹106.52Bihar – ₹105.60West Bengal – ₹105.41Rajasthan – ₹104.72Maharashtra – ₹103.50Sikkim – ₹103.30Karnataka – ₹102.92Ladakh –…— Indian Tech & Infra (@IndianTechGuide) October 13, 2025ఈ రోజు లీటరు పెట్రోల్ ధరలు (వివిధ రాష్ట్రాల్లో)..ఆంధ్రప్రదేశ్ రూ.109.46కేరళ రూ.107.49తెలంగాణ రూ.107.46మధ్యప్రదేశ్ రూ.106.52బీహార్ రూ.105.60పశ్చిమ బెంగాల్ రూ.105.41రాజస్థాన్ రూ.104.72మహారాష్ట్ర రూ.103.50కర్ణాటక రూ.102.92ఢిల్లీ రూ.94.77అండమాన్ నికోబార్ దీవులు రూ.82.46ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం.. -
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం!
ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. ఉద్యోగాలు అయినా ఇప్పించండి, నగదు అయినా ఇవ్వండి అని బాధితులు మోసగాడిని నిలదీయడంతో వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.... యూ ట్యూబర్ కావడి కృష్ణ గతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అమరావతి సచివాలయం ప్రాంతంలో నివశిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు, బొకేలు అందించే ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 మందిని మాయలో పడేశాడు. వారి వద్ద సుమారు రూ.40 లక్షలు వరకు వసూలు చేశాడు. స్టేషన్కు వచ్చిన ఐదుగురి బాధితులు రూ.10.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు అడుగుతుంటే నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వ్యాపారుల మధ్య పోటీ.. రూ.100కే కిలో చికెన్
కర్నూలు జిల్లా: ఇద్దరు వ్యాపారస్తుల మధ్య నెలకొన్న పోటీతో ఆదివారం చికెన్ చౌక ధరకు లభించింది. కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఇటీవల కర్నూలుకు చెందిన ఓ వ్యాపారి నూతనంగా చికెన్ వ్యాపారం ప్రారంభించాడు. తన వ్యాపారం వృద్ధి చేసుకునేందుకు మార్కెట్ రేటు కంటే తక్కువకు చికెన్ అమ్మకాలను చేపట్టాడు. దీంతో అప్పటికే చికెన్ వ్యాపారం చేస్తున్న మరో వ్యాపారి కూడా ఆ వ్యాపారి ఇచ్చే రేటు కంటే తక్కువగా చికెన్ అమ్ముతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కర్నూలుకు చెందిన వ్యాపారి కిలో చికెన్ రూ.110 పెట్టగా, స్థానిక పాత వ్యాపారి రూ.10 తగ్గించి రూ.100కే కిలో చికెన్ అంటూ బోర్డు పెట్టాడు. దీంతో జనం బారులు తీరారు. పట్టణ వాసులతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం కోడుమూరుకు వచ్చి చికెన్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.180 పలుకుతుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 పలుకుతోంది. -
నకిలీ మద్యంపై ఏపీవ్యాప్తంగా YSRCP రణభేరి
నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా.. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై పలువురు నేతలు ధ్వజమెత్తుతున్నారు. -
బాలయ్య ఇంటి ఎదుట బలవన్మరణ యత్నం
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు(Farmer Balachari).. బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటోందని వాపోతూ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోయాడు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బాలాచారిని మీడియా కంట పడకుండా హిందూపురం వన్టౌన్ పీఎస్కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ పర్యటనలో బాలయ్యకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆదివారం చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో ఆయన పర్యటించగా.. మహిళలు చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు. ఈ పరిణామంతో తనదైన శైలిలో ఏదో మాట్లాడుతూ.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనతో చర్చించి స్పష్టమైన హామీ ఇప్పిస్తామని చెబుతూ నిష్క్రమించారు.ఇదీ చదవండి: వినూత వీడియోలిస్తే.. బొజ్జల బాగోతం బయటికి?? -
కడప నగరంలో తీవ్ర విషాదం, కుటుంబ కలహాలతో..!!
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు.అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అవునా బొజ్జలా?
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. వినూత డ్రైవర్గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
ఉచితాలపై పవన్, నాదెండ్ల కొత్త పాట.. ఏకిపారేసిన నెటిజన్లు
సాక్షి, అమరావతి: ‘యువత ఉచితాలను అడగడం లేదు. సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు.’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. తిత్లీ తుపాను సమయంలో 2018 అక్టోబర్ 12వ తేదీన పవన్ కళ్యాణ్తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయాలను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు.ఈ క్రమంలో దానికి కొందరు యువతతో కూర్చుని మాట్లాడుతున్న ఫొటోను జత చేశారు. ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఆ పర్యటనలో మేం అక్కడివారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగలేదు. వారు ఎటువంటి సంక్షేమ పథకాలనూ అడగలేదు. కానీ, వారు మాకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి.. ఉచితాలను కాదని గట్టిగా చెప్పారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి నేను యువతను కలుస్తూనే ఉంటాను’ అని పవన్కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’ We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025నెటిజన్ల ప్రశ్నలు..పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుపై పలువురు ప్రతిస్పందించారు. ‘యువత ఉచిత, సంక్షేమ పథకాలు కోరుకోకపోతే గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం రూ.1.2లక్షల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తామని ఎందుకు ప్రచారం చేశారు..? అంటూ పలువురు పవన్కళ్యాణ్ పోస్టుపై స్పందిస్తూ రీ పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయంలో పవన్కళ్యాణ్ యువతకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ కొందరు పోస్టు చేశారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీ–జనసేన కూటమిని గెలిపిస్తే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని, వాటి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, పది రూపాయలను అదనంగా ఇస్తామని చెప్పారు.ఈ విషయం పదే పదే ప్రజలకు చెప్పాలని జనసేన కార్యాలయంలో 2024 ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. టీడీపీ నాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తామని, పెద్దపెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తే ఉదారంగా వదిలేస్తున్నారని పవన్కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి హామీలన్నింటినీ ప్రశ్నిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Mari nuvvu untunna nee government lo freebies ni Enduku Prothsahistunnav? Schemes teseyochu ga,free education and free medical ivvandi chalu,civil cases nyayam ga undetattu cheyandi,drinking water ivvandi,nityavasaralu tagginchandi,land rates tagginchandi chaalu ivi cheyandi.— Dr.High Voltage (@it_RAR4all) October 12, 2025 -
బాలకృష్ణకు బిగ్ షాక్.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు
సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్.. -
క్షణికావేశం.. తీస్తోంది ప్రాణం
‘బలమే జీవితం.. బలహీనతే మరణం’ అని ఆలోచనాత్మక వాక్యం చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్న సమస్యలకే కుంగిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలనో.. ఆర్థిక ఇబ్బందులనో.. అనారోగ్య సమస్యలనో.. పరీక్ష తప్పామనో.. చదువు ఇష్టం లేదనో.. ప్రేమ విఫలమైందనో.. ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పెరగిపోతున్నాయి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందన్న విషయాన్ని మరచి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కదిరి: ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంలో చేజేతులా సమాప్తం చేసుకుంటే వారి మీద ఆధారపడ్డవారిని, వారి మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నవారిని రోడ్డున పడేసినట్లే అవుతుంది. సత్యసాయి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ కేవలం 9 రోజుల్లోనే 9 మంది పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వీరిలో అధిక శాతం మంది యువతీ యువకులే. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగానే ఇలా బలవన్మరణాలు జరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. భయపెడుతున్న ఘటనలు..మడకశిర పట్టణానికి చెందిన మధు(23) అగళి మండలంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇదే విషయంగా చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే భావంతో క్షణికావేశంలో ఈ నెల 1వ తేదీ ఆత్మహత్య చేసుకున్నాడు.» నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) చిన్నపాటి అంశానికి భార్యతో గొడవ పడి కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నాడు. చివరకు ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి ఈ నెల 5న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.= ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన తొండమాల మహేష్(37) ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. పెళ్లి సంబందాలేవీ కుదరడం లేదని మనస్థాపానికి గురై ఈ నెల 6న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.» మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యంకు చెందిన ప్రవీణ్కుమార్(27) సైతం పెళ్లి సంబందాలు కుదరడం లేదని ఈ నెల 6న రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.» చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన పార్వతి, గంగాధర్ల కుమార్తె అశ్వని(16) రామగిరి కేజీబీవిలో ఇంటర్ చదువుతుండేది. దసరా సెలవుల్లో ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఈ నెల 8న ఇంటి పక్కనే ఉన్న షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ... ఇలా ఒకరిద్దరు కాదు... ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 153 మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన చెందే విషయం. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు లేవు. సగటున ప్రతి రెండు రోజులకు ఒకరు ఆత్యహత్య చేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగా వెలుగు చూసిన ఘటనలే. ఇక అనధికారిక లెక్కలు మరిన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది.కౌన్సెలింగ్ అవసరం మానసిక సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్ ఇప్పిస్తే వ్యతిరేక ఆలోచనల నుంచి బయట పడవచ్చు. మానసిక సమస్యలతో బాధపడే వారిని మరింత కోపానికి, ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వీలైనంత వరకూ వారు అందరిలో ఉంటూ ఆనందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్ఓ ఒక్క క్షణం ఆలోచించాలిజీవితం ఎంతో విలువైనది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నమ్ముకున్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఆ క్షణంలో తలుచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు. సమస్యలకు చావు పరిష్కారం కానే కాదు. ప్రతి పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ సెంటర్ను అందుబాటులోకి తెస్తాం. యువతను మేల్కోలిపే కార్యక్రమాలు చేపడతాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీఇవీ హెచ్చరిక సంకేతాలు.. » ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం » స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం » విపరీతమైన కోపం, భయం ప్రదర్శిస్తూ సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం. » నిరంతరం నిస్సహాయతాభావాన్ని వ్యక్త పరుస్తుండడం. » అతిగా మద్యం సేవించడం, ప్రతీకార కాంక్షతో మాట్లాడుతుండడం. » ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్ర, ఆకలిలో మార్పులు ఉండడం. » పండగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం. » స్నేహితులకు విషాదరకమైన మెజేస్లు పంపడం. » చనిపోతున్నట్లు ముందుగానే వారి మాటల్లో పరోక్షంగా వ్యక్తపరుస్తుండడం. -
నేడు సీఆర్డీఏ భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి/తాడికొండ: రాజధాని ప్రాంతంలో రాయపూడి వద్ద నిర్మించిన సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కార్యాలయ భవనం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ భవనాలను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఇకపై రాజధాని నిర్మాణ పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ–3)–ఎన్11 జంక్షన్ వద్ద సీఆర్డీఏ కార్యాలయ భవనం జీ+1 పద్ధతిలో రూ.39.69 కోట్లతో నిర్మించేలా కాంట్రాక్టర్లకు తొలుత అప్పగించారు. ఆ తర్వాత జీ+1 భవనంపై అదనంగా ఆరు అంతస్తులు నిర్మించే పనులను రూ.45.05 కోట్లతో చేపట్టేలా కాంట్రాక్టర్కు అప్పగించారు. అంటే.. 3,07,326 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను రూ.84.74 కోట్లకు కాంట్రాక్టర్కు అప్పగించారు. ఇందులో 2019, మే నాటికే రూ.43.7 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. సీఆర్డీఏ కార్యాలయాన్ని లోపల, బయట కళాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు భవనం లోపల (ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్), ఎంఈపీఎఎఫ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్) వర్క్స్, ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) వర్క్స్, బయట అభివృద్ధి పనుల (ఎక్సటర్నల్ డెవలప్మెంట్ వర్క్స్)ను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.160 కోట్లకు గతేడాది కాంట్రాక్టర్కు కట్టబెట్టింది. ఇక సీఆర్డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఇతర పనులను పన్నులతో కలిపి రూ.93.4 కోట్లతో చేపట్టేలా అప్పగించింది. అంటే.. సీఆర్డీఏ భవనం నిర్మాణ వ్యయం రూ.84.74 కోట్ల నుంచి రూ.338.14 కోట్లకు చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.11,002.64గా చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఫైవ్ స్టార్ వసతుల భవనాల నిర్మాణ వ్యయం రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏకు 3 ఫ్లోర్లు ఇక సీఆర్డీఏ భవనంలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీస్, 5 భారీ మీటింగ్ హాళ్లు, సీఆర్డీఏ కార్యాలయం కోసం మూడు ఫ్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీస్, సీడీఎంఏ ఆఫీస్, రెరా ఆఫీస్, డీటీసీపీ ఆఫీస్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆఫీస్, మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మున్సిపల్ శాఖలో మిగిలిన విభాగాల కోసం సీఆర్డీఏ ఆఫీస్కు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో మూడు షెడ్ల నిర్మాణ పనులను మార్చి 29న రూ.28.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థ ఎన్సీసీకి అప్పగించారు. ఆ మూడు షెడ్లకు ఆర్కిటెక్చురల్ ఫినిషింగ్ పనులు, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులను ఎన్సీసీకే రూ.40.35 కోట్లకు అప్పగించారు. తాజాగా నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ప్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి పన్నులతో కలిపి రూ.65.55 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్లు పిలిచారు. దీనినిబట్టి చూస్తే నాలుగు షెడ్ల కోసమే రూ.134.59 కోట్లు వ్యయం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. -
ఐఐఎస్సీ బెంగళూరుదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2026లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) దేశంలోనే అగ్రశ్రేణి యూనివర్సిటీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 201–250 ర్యాంక్ బ్యాండ్లో వరుసగా మూడో ఏడాది కొనసాగుతోంది. తాజా జాబితాలో ప్రపంచంలో అత్యధికంగా విశ్వవిద్యాలయాలు ర్యాంకులు పొందిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానానికి చేరుకోవడంవిశేషం.ఇక చెన్నైకి చెందిన సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ 401–500 బ్యాండ్ నుంచి 351–400 ర్యాంకులకు ఎగబాకి దేశంలో రెండో స్థానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జేఎన్టీయూ, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలు 1001–1200 బ్యాండ్లో, ఐఎఫ్హెచ్ఈ–హైదరాబాద్, ఉస్మానియా వర్సిటీలు 1201–1500 బ్యాండ్లో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు 1501 ప్లస్ బ్యాండ్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరో నాలుగు ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. దేశీయ సంస్థలు స్థానాలు ఇలా.. జామియా మిలియా ఇస్లామియా (ఢిల్లీ), షాలిని వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (బజోల్, హిమాచల్ప్రదేశ్) 401–500 కేటగిరీలోను, బనారస్ హిందూ వర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, కేఐఐటీ వర్సిటీ (భువనేశ్వర్), లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఫగ్వారా, పంజాబ్), మహాత్మాగాంధీ వర్సిటీ (కొట్టాయం, కేరళ), యూపీఈఎస్ (డెహ్రాడూన్) 501–600 కేటగిరీలో ర్యాంక్లు పొందాయి. 601–800 బ్యాండ్లో 15కుపైగా భారతీయ సంస్థలు నిలిచాయి. వాటిల్లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, అమిటీ విశ్వవిద్యాలయం (నోయిడా), భారతీయార్ విశ్వవిద్యాలయం (కోయంబత్తూర్), సెంట్రల్ వర్సిటీ ఆఫ్ పంజాబ్ (భటిండా), చిత్కరా విశ్వవిద్యాలయం (చండీగఢ్ ), గ్రాఫిక్ ఎరా విశ్వవిద్యాలయం (డెహ్రాడూన్), ఐఐటీ పాట్నా, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జైపూర్), మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఎన్ఐటీ రూర్కెలా, పంజాబ్ విశ్వవిద్యాలయం (చండీగఢ్), శారదా విశ్వవిద్యాలయం (గ్రేటర్ నోయిడా), సింబయాసిస్ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం (పూణే ), థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (పాటియాలా), ఢిల్లీ విశ్వవిద్యాలయం, విట్ విశ్వవిద్యాలయం (వెల్లూరు) ఉన్నాయి.టాప్–10లో ఏడు అమెరికా సంస్థలుటాప్–10లో అమెరికా విశ్వవిద్యాలయాలు ఆధిపత్యం చెలాయిస్తూ 10లో ఏడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. అంతేస్థాయిలో క్షీణతను కూడా ఎదుర్కొంటున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం, యూకేకు చెందిన కేంబ్రిడ్జి వర్సిటీతో ఉమ్మడిగా మూడవ స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో గత సంవత్సరంతో పోలిస్తే టాప్–20లో ఆరు వర్సిటీలు తగ్గిపోయాయి. టాప్ 100లో 38 నుంచి 35కి పడిపోయాయి. టాప్ 500లో మొత్తం అమెరికా సంస్థల సంఖ్య 102 కాగా.. ఇది రికార్డు స్థాయిలో అత్యల్పమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏకంగా 25 అమెరికా విశ్వవిద్యాలయాలు వాటి అత్యల్ప స్థానాలకు పడిపోయాయి. వాటిలో చికాగో విశ్వవిద్యాలయం (15వ స్థానం), కొలంబియా విశ్వవిద్యాలయం (20వ స్థానం), డ్యూక్ విశ్వవిద్యాలయం (28వ స్థానం) ఉన్నాయి. యూకేలో ఆక్స్ఫర్డ్ మొదటి స్థానంలో ఉండగా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానాన్ని పంచుకుంది. ఇంపీరియల్ కాలేజీ లండన్ 8వ స్థానంలో ఉంది. యూకే సంస్థలు మిశ్రమ ఫలితాలను చూపించాయి.పదో ఏడాదీ ఆక్స్ఫర్డ్ టాప్లోనే.. యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 115 దేశాలు నుంచి 2,191 సంస్థలు నిలిచాయి. ఆక్స్ఫర్డ్ వర్సిటీ వరుసగా 10వ ఏడాది కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి వర్సిటీగా నిలిచింది. ఆక్స్ఫర్డ్లోని పరిశోధన వాతావరణం కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి వర్సిటీగా ఎదురులేకుండా కొనసాగుతోంది. చైనా టాప్–200లో 13 విశ్వవిద్యాలయాలను కొనసాగిస్తూ.. మూడో ఏడాది స్థిరంగా ఉంది. అక్కడ సింఘువా విశ్వవిద్యాలయం వరుసగా మూడవ సంవత్సరం 12వ స్థానంలో నిలవగా, పెకింగ్ విశ్వవిద్యాలయం ఒక స్థానం ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మెరుగుదల లేకుండా 17వ స్థానంలో నిలిచింది. 2012 తర్వాత ఈ సంస్థలు తమ ర్యాంక్లను మెరుగుపరుచుకోకపోవడం గమనార్హం. -
బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు!
కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో.. ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో బెల్ట్షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్షాపు రూ.9 లక్షలు పలికింది. అదే జిల్లా చల్లపల్లి మండలం మాజేరులో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. కృష్ణాజిల్లాలో 1,589 బెల్ట్ షాపులు, ఎన్టీఆర్ జిల్లాలో 1,135 ఉన్నాయి. అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టి నకిలీ మద్యం భారీగా అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటిని టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకొన్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. అదే జిల్లా నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్ షాపు రూ.9 లక్షలు పలికింది. కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతోపాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో... ఎలా వస్తాయో.. సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ మద్యం అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో బెల్ట్షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే. టీడీపీ నాయకుల్లో అలజడి ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు ఊరూరా పుట్టగొడుగుల్లా వెలిశాయి. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యం అమ్మకాలే ఈ బెల్ట్ షాపుల్లో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ మద్యం తాగిన పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నకిలీ మద్యం గుట్టు రట్టు కావడంతో, ఈ మద్యం తాగినవారు బెంబేలెత్తుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఎక్కువగా నకీలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు తనిఖీల్లో వెలుగు చూసిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పేదలు ఎక్కువగా తాగే రూ.99, రూ.130 లాంటి రకాల నకిలీ మద్యం తయారీపైనే సిండికేట్ దృష్టి సారించినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. మరోవైపు విజయవాడ కేంద్రంగా కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగిందని పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 1,135, కృష్ణా జిల్లాలో 1,589 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో ఇట్టే తెలిసిపోతోంది. ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఇన్ని బెల్ట్ షాపులు ఎలా పుట్టుకొచ్చాయని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెల్ట్ షాపులకు ప్రభుత్వమే తలుపులు బార్లా తెరిచిందని చెబుతున్నారు. సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే, మిగతా జిల్లాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులను అధికారులు తనిఖీ చేసిన పాపాన పోవటం లేదు. కరకట్ట బంగ్లా మొదలు టీడీపీ పార్లమెంటు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు వారి స్థాయిని బట్టి ముడుపులు ముట్టడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి, నకిలీ మద్యం అంటగట్టారని మందు తాగే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ వెనుక పార్లమెంట్, మైలవరం నియోజకవర్గ ప్రజాప్రతిధుల పాత్ర ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.కింది నుంచి పైదాకా అందరికీ వాటాలు⇒ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే సాగినట్లు జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడకు కూతవేటు దూరంలో ఇంత పెద్ద నకిలీ మద్యం డంపు నడిచిందంటే, టీడీపీ ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఈ వ్యవహారం జరగదనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, అతని బావమరిదికి తెలియకుండా చీమ కూడా చిటుక్కు మనదని చెబుతున్నారు. ఇసుక, మట్టి, బూడిద, మద్యం వ్యాపారం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందని.. అలాంటప్పుడు ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం వీరి అండ లేకుండా జనార్దన్రావు ఒక్కడే చేయటం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంటు ప్రజాప్రతినిధికి కూడా వాటాలు లేకుండా వ్యాపారం చేయలేరని స్ధానికులు చెబుతున్నారు. ⇒ వీరితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్లో ప్రధాన భూమిక పోషిస్తున్న పలువురు టీడీపీ నేతల హస్తం కూడా ఉందని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పలు మద్యం షాపుల వద్ద మాన్యువల్గా పేపరు మీద రాసుకున్న స్టాకు వివరాల లెక్కలు ఒకసారి పరిశీలిస్తే రోజుకు ఎంత నకిలీ మద్యం అమ్మింది తేలనుంది. మద్యం డిపో నుంచి తెచి్చన సరుకును బార్లకు తరలించి, పలుచోట్ల నకిలీ మద్యమే షాపుల్లో విక్రయించారని పలువురు స్పష్టం చేస్తున్నారు. ⇒ కాగా, పట్టుబడిన నకిలీ మద్యంకు సంబంధించిన కేసు విచారణ ముఖ్యనేత డైరెక్షన్లో సాగుతుండటం గమనార్హం. ఈ వ్యవహారంలో ముఖ్య నేతలకు వాటాలు ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసక బారడంతో కేసు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇందుకు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతుండటం దుర్మార్గం.గుట్టు రట్టుతో గుభేల్.. నకిలీ మద్యం గుట్టు రట్టు కావడం.. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. అద్దేపల్లె జనార్దనరావుతో పాటు ఆయన సోదరుడు, మరి కొందరు మాత్రమే నకిలీ మద్యం తయారీదారులుగా చూపించి సూత్రధారులు సురక్షితంగా బయట పడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కరకట్ట బంగ్లా పాత్రను కప్పిపుచ్చే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అద్దేపల్లె జనార్దనరావు లొంగుబాటు ఓ పథకం ప్రకారమే జరిగినట్లు ఎక్సైజ్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. -
భగ్గుమన్న మత్స్యకారులు
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మరో కరేడుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలంటూ ఆదివారం వేలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు 4 గంటల పాటు కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మత్స్యకారుల ఆందోళనతో సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో 2,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేస్తారని, ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ రాజయ్యపేట మత్స్యకారులు 29 రోజులుగా గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల క్రితం పనుల్ని అడ్డుకున్నారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో గత నెల 30న హోంమంత్రి అనిత గ్రామంలోకి వచ్చారు. మంత్రిని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని, పనులు తాత్కాలికంగా నిలిపివేయిస్తానని హామీ ఇచ్చి, అక్కడినుంచి ఆమె వచ్చేశారు. గ్రామం నుంచి 30 మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇది జరిగి 15 రోజులు గడుస్తున్నా హోంమంత్రి నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి స్పందన లేదు. మత్స్యకారులు గ్రామంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి రానివ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.పోలీసుల వైఖరితో విసిగివేసారి..ఆదివారం దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను ఉపమాకలో అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో రగిలిపోయిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నం నిరాహార దీక్ష శిబిరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మార్గంమధ్యలో పోలీసులు మత్స్యకారులను ట్రాక్టర్లు, ఐరన్ స్టాపర్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నప్పటికీ వాటిని «తొలగించుకుంటూ వందలాది మంది మహిళలు, మత్స్యకారులు జాతీయ రహదారిపై ఉపమాక జంక్షన్ వద్ద ధర్నాకు దిగారు.డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనతక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిమాండ్ చేశారు. మత్స్యకారులు, నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, రాజయ్యపేటలో అమల్లో ఉన్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని, మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వీల్లేదని, ర్యాలీ సందర్భంగా మహిళలపై దౌర్జన్యం చేసి గాయపర్చిన ఎస్.రాయవరం సీఐ లొడ్డు రామకృçష్ణను, నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబును సస్పెండ్ చేయాలని పోలీసులు అడ్డుకున్న వీసం రామకృష్ణను తక్షణమే ఆందోళన వద్దకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వందలాది మంది బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు వచ్చి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదంటూ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4గంటల పాటు జాతీయ రహదారిపైనే ధర్నా చేయడంతో రెండువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిíచిపోయాయి. ఎట్టకేలకు సాయంత్రం 5.30 గంటలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. బుధవారం రాజయ్యపేటలో మత్స్యకారులందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
సమ్మెకు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు దాదాపు 63వేల మంది తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేస్తున్నారు. సోమవారం ‘చలో విజయవాడ’ పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యుత్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని మహాధర్నా చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించి సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో ఉద్యమ వాతావరణం వేడెక్కింది. కాగా, సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలోని విద్యుత్ సౌధలో చర్చలకు రావాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, యూనియన్ల నాయకులకు యాజమాన్యం సమాచారం పంపింది.ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అయినప్పటికీ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. అందువల్లే దశలవారీ ఆందోళనల నుంచి నిరవధిక సమ్మె వరకూ రావాల్సి వచ్చింది. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని ఆపేదేలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తగ్గేదేలేదు. – ఎస్.కృష్ణయ్య, అధ్యక్షుడు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీన్యాయంగా రావాల్సినవే అడుగుతున్నాంవిద్యుత్ ఉద్యోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతామో తెలియదు. అలాంటి ఉద్యోగంలో ఉన్న మాకు న్యాయంగా రావాల్సినవే మేం అడుగుతున్నాం. మా డిమాండ్లలో చాలా వాటికి ఇప్పటికే యాజమాన్యాలు అనేక సమావేశాల్లో అంగీకరించాయి. కానీ ఇంతవరకూ అమలు చేయలేదు. వాటిని అమలు చేయాలని అడుగుతుంటే మొండివైఖరి అవలంబిస్తున్నారు. – కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ న్యాయం జరిగే వరకు పోరాడతాంవన్ ఇండస్ట్రీ–వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్–2 కార్మికులకు న్యాయం చేసే వరకూ మా పోరాటం కొనసాగుతుంది. కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలి. నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలి. – డి.వెంకటేశ్వరరావు, ఎల్.రాజు, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులువిలీనం చేసి నేరుగా జీతాలివ్వాలికాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి. కాంట్రాక్టు కార్మికులకు రూ.కోటి ఇన్సూరెన్స్ చేయాలి. యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి. అలా చేస్తే ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు విద్యుత్ సంస్థలకు ఆదా అవుతాయి. – బాలకాశి, నాగార్జున, నాగరాజు, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేతలు -
వసుధ మిశ్రా నివేదిక ఎక్కడ?
సాక్షి, అమరావతి: కార్మికుల భద్రతను, ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. వరుసగా జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాల్లో అనేకమంది పేదల జీవితాలు బుగ్గిపాలవుతున్నా ప్రభుత్వం పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తోంది. ఏదైనా దుర్ఘటన జరిగిన వెంటనే ఒకటి రెండురోజులు హడావుడి చేసి కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దుర్ఘటనల్లో ఏ ఒక్కదాంట్లో కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. గతేడాది ఏప్రిల్లో అనకాపల్లిలోని ఎస్బీ ఆర్గానిక్స్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించగా 16 మంది గాయపడ్డారు.ఆ తర్వాత ఆగస్టులో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది మృతిచెందగా అనేకమందికి గాయాలయ్యాయి. ఈ రెండు భారీ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెపె్టంబర్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వసుధ మిశ్రా నేతృత్వంలో 17 మందితో ఒక కమిటీ ఏర్పాటుచేసింది. పరిశ్రమలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. వసుధ కమిటీ ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వలేదు. కనీసం ఈ నివేదిక ఏ స్థాయిలో ఉందో ఫ్యాక్టరీస్ డిపార్ట్ట్మెంట్ కూడా చెప్పలేకపోతోందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూళ్ల మత్తు.. భద్రత చిత్తు అనకాపల్లి పార్మా ఘటనల తర్వాత కూడా ఫ్యాక్టరీస్ విభాగం మొద్దునిద్ర వదలడం లేదు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొందరు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. దీంతో వరుస ఘటనల్లో అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనకాపల్లిలో రెండు ఫార్మా ఘటనల తర్వాత తిరుపతిలో ఒక ఉక్కుకర్మాగారంలో ప్రమాదం జరిగింది. అనకాపల్లిలో బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురికిపైనే దుర్మరణం పాలయ్యారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదు. ఈ నేపథ్యంలో రాయవరంలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. -
ముంచంగిపుట్టు సీహెచ్సీకి సెక్యూరిటీ గార్డే దిక్కు
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక సీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరతతో ఇక్కడి సెక్యూరిటీ గార్డే రోగులకు రక్త పరీక్షలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రెండ్రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొనడంతో బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది కొరతతో సక్రమంగా వైద్యసేవలు అందడంలేదని.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల గిరిజనుల పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని.. ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని సీహెచ్సీ, పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని.. లేకపోతే సెక్యూరిటీ గార్డులు, కిందస్థాయి సిబ్బంది అందించే సేవలలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇతరులు రక్త పరీక్షలు చేస్తుండగా కొందరు వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. -
‘సాక్షి’పై సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజాకంటక పాలనను నిగ్గదీస్తూ.. మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి సర్కారు అణచివేత చర్యలకు పాల్పడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని కల్తీ మద్యం పట్టి పీడిస్తున్నా, అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా, చోద్యం చూస్తున్న సర్కారు.. క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేపోతోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాషీ్టకానికి దిగారు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే సాక్షి ఎడిటర్, విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోంది. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాకుండా ఘోర పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా నిలదీస్తున్న సాక్షిపై అక్రమ కేసులతో దాడికి తెగబడుతోంది. అధికార పీఠం ఎక్కింది మొదలు పోలీసులను ఉసిగొల్పుతూ.. యథేచ్ఛగా అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రతికా స్వేచ్ఛ.. భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కక్షసాధింపులకు బరితెగిస్తోంది. ప్రాథమిక హక్కులకు సైతం సంకెళ్లు వేసిన ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలదన్నేలా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపివేసిన నకిలీ మద్యం.. – సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసుల అరాచకం ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం బాగోతం బయటపడటం.. అధికార టీడీపీకి చెందిన, అందులోనూ ముఖ్యనేతతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే సూత్రధారులని బహిర్గతం కావడం యావత్తు దేశాన్ని కుదిపి వేసింది. ఈ ఘటనపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ కూటమి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, నెల్లూరు జిల్లా విలేకరులపై నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో బనాయించిన అక్రమ కేసులే ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అక్రమ కేసును అడ్డుపెట్టుకుని ఆదివారం తెల్లవారకముందే విజయవాడ ఆటోనగర్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. గేట్లు తెరవకముందే తెల్లవారుజాము 5 గంటల నుంచి 9 గంటల వరకు అరాచకం సృష్టించారు. విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు సోదాల పేరిట ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి.. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల్లో పోలీసులు దాడికి తెగబడ్డారు. విజయవాడ ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో వీరంగం వేశారు. కార్యాలయం తాళాలు కూడా తెరవక ముందే నోటీసులు తీసుకోవాలంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇక కలిగిరిలో మరో అక్రమ కేసు పెట్టడమే కాకుండా సోదాల పేరిట ఏకంగా విలేకరుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు.. దీనిపై కథనాలు రాసిన విలేకరులకు నోటీసులు ఇవ్వడం కూటమి సర్కారు కక్షసాధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా నోటీసులు ఇస్తూ.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. ఆది నుంచి ‘సాక్షి’ ఒక్కటే టార్గెట్.. ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులు, విలువలను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎక్కడో చోట.. సంబంధం లేని వ్యక్తులతోనూ ఫిర్యాదు చేయించి సాక్షిపైకి పోలీసులను ఉసిగొల్పుతోంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో– అత్యంత ప్రధానమైన ఆరి్టకల్ 19 (1) (ఏ) ప్రకారం దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడికి తెగబడుతూ దుస్సాహసానికి పాల్పడుతోంది. ఈ అక్రమ కేసులను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారట్లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో భావ ప్రకటన విషయంలో అందే ఫిర్యాదులకు సంబంధించి కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసు శాఖ మాత్రం టీడీపీ పెద్దలకు జీహుజూర్ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే విధానంగా మార్చుకున్నారు. మస్తాన్రెడ్డికి నోటీసులు అందజేస్తున్న పోలీసులు నెల్లూరు బ్యూరో ఇన్చార్జీకి అర్థరాత్రి పోలీసుల నోటీసుఎక్సైజ్ అధికారులతో వరుసగా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇప్పిస్తూ.. పాత్రికేయులను టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తూ, చంద్రబాబు సర్కారు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోంది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జీ చిలకా మస్తాన్రెడ్డికి తాజాగా పోలీసులు అర్థరాత్రి సమయంలో ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయ్యప్పమాల ధారణలో ఉన్న ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పొద్దున్నే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జర్నలిస్టుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్థరాత్రి సమయంలో ఓ జర్నలిస్టు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఇదేం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా? ఇదేం ప్రజాస్వామ్యం? సాక్షి పత్రికపై ఎందుకు అంత క్షకపూరితంగా దాడులు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – విశ్వసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే సుపరిపాలన అందిస్తే భయమెందుకు? సాక్షి మీడియా, ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులు పెడుతున్నారంటేనే మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. మీరు సుపరిపాలన అందిస్తే మీడియాను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబూ? – బుర్రా మధుసూదన రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జీ -
నకిలీ మద్యంపై విచారణకు సిట్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇకపై రాష్ట్రంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మడానికి వీలు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యం నకిలీదో, నాణ్యమైనదో తనిఖీ చేసుకునేందుకు సురక్ష యాప్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి ఆయన ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై ఐదుగురు ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు రాహుల్దేవ్ శర్మ, కె.చక్రవర్తి, మల్లికా గర్గ్, ఎక్సైజ్ శాఖ నుంచి మరో సీనియర్ అధికారిని ఇందులో సభ్యులుగా నియమిస్తామని చెప్పారు.నకిలీ మద్యంపై సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారు చేయడం నేర్చుకుని దాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఇలాంటివి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. నేరాలు చేసి వాటిని ఎదుటి వారిపై వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటపెట్టిందే తామని చెప్పారు. ఈ వ్యవహారంలో రాజీ ఉండదని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏ షాపులో మద్యం కొన్నా ఆ బాటిల్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసిన సురక్ష యాప్లో స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఏ బ్యాచ్ వంటి వివరాలన్నీ వస్తాయని చెప్పారు.ఒకవేళ అది నకిలీదైతే ఎర్రర్ వస్తుందని, వెంటనే ఆ వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మద్యం షాపుల యజమానులూ ముందే తమ వద్దకు వచ్చిన బాటిళ్లను చెక్ చేసుకుని అమ్మేలా ఈ యాప్ను వృద్ధి చేశామన్నారు. సోమవారం నుంచి మద్యం వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని, మద్యం షాపుల వారికి 16వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా మద్యం ఇకపై షాపుల్లో మాత్రమే అమ్మే అవకాశం ఉంటుందని, బెల్టు షాపులు ఉండవని చెప్పారు. బెల్టు షాపుల్లో అమ్మితే బెల్టు తీస్తామని హెచ్చరించారు. నకిలీ మద్యం వ్యవహారంపై శవ రాజకీయాలు చేస్తున్నారని, తండ్రి చనిపోతే ఐదేళ్లు శవ రాజకీయాలు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 30వేల మందికి అనారోగ్యం గత ప్రభుత్వంలో అమ్మిన మద్యం వల్ల 30 వేల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మద్యం తాగి 27 మంది చనిపోతే కనీసం విచారణ జరపలేదని, పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని చంద్రబాబు విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ వేరే కారణాలతో చనిపోయిన వారిని నకిలీ మద్యం వల్ల మరణించారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని అంటున్నారని, అలా వేస్తే 10, 11 ఏళ్లు కాలక్షేపం చేయవచ్చని భావిస్తున్నారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. నకిలీ మద్యం విషయంలో రాజకీయ కుట్ర కోణం ఉందని, దానికి సంబంధించిన విషయాలు మున్ముందు బయటపెడతామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లి ఆఫ్రికాను చెడగొట్టారని, ఆఫ్రికాను కూడా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వంలో డిస్టలరీ నుంచి సరఫరా వ్యవస్థ వరకూ అంతా తమ నియంత్రణలో పెట్టుకుని నేరాలు చేశారని విమర్శించారు. దానిపై జరుగుతున్న విచారణను పక్కదారి పట్టించేందుకే నకిలీ మద్యం ద్వారా డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. -
కొనసాగుతున్న పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటున్నారు. అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు.తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్బాండ్ పదోన్నతులు, స్కేల్స్ వర్తింపు వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిలే దీక్షల్లో అసోసియేషన్ నాయకులు డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ రవీంద్రనాయక్, డాక్టర్ గోపినాథ్, డాక్టర్ కిషోర్తో పాటు, వందలాది వైద్యులు పాల్గొన్నారు.నేటి నుంచి సిబ్బంది నిరసన..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, సెకండరీ హెల్త్ సెంటర్స్లోని వైద్య సిబ్బంది సోమవారం నుంచి వైద్యులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకానున్నారు. లంచ్ సమయంలో సమావేశాలు, నిరసనలు తెలిపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైద్యులతో పాటు, వైద్య సిబ్బంది కూడా నిరసనలో పాల్గొంటారని డాక్టర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. -
కొత్త టీచర్లకు టోకరా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహణలోనే కాదు.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంలోనూ ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపికలో అభ్యర్థులు ఆప్షన్స్ పెట్టే సమయంలోనూ వారిని తప్పుదారి పట్టించింది. దీంతో చాలామందికి క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగ్స్ వచ్చాయి. మరోపక్క.. చాలామంది అభ్యర్థులకు ఏ స్కూలూ కేటాయించకుండానే జాయినింగ్ రిపోర్టులు జారీచేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. కొత్త టీచర్లు అందరూ సోమవారం వారికి కేటాయించిన స్కూళ్లల్లో రిపోర్టు చేయాలని, వెంటనే విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే, ఏ స్కూలూ కేటాయించని తాము ఎక్కడ రిపోర్టు చేయాలో అర్ధంగాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కస్టర్లలో పోస్టింగ్లు..డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన టీచర్లకుఈనెల 3 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోనే పోస్టింగ్స్ కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అనుమతించారు. దీంతో అభ్యర్థులు మండలాల వారీగా ఉన్న స్కూళ్లను ఎంచుకున్నారు. కానీ, చాలామంది అభ్యర్థులకు క్లస్టర్లలో పోస్టింగ్స్ వచ్చాయి. దీంతో వీరు మొదటి నుంచే మిగులు ఉపాధ్యాయులుగా మారినట్లైంది. ఆప్షన్ల సమయంలో సర్కారు దొంగాట..మరోవైపు.. పాఠశాల విద్యాశాఖ మేలో చేపట్టిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో దాదాపు ఐదువేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలారు. వీరందరినీ డీఈఓ పూల్, క్లస్టర్ పూల్లో ఉంచారు. స్కూళ్లు కేటాయించకుండా ఉపాధ్యాయులను సర్ప్లస్ చేయడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. డీఈఓ పూల్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి, క్లస్టర్ పూల్లో ఉన్నవారిని అలాగే ఉంచారు.ఇలా ఐదు నెలలుగా వీరికి స్థానాలు కేటాయించలేదు. తాజా డీఎస్సీ–2025లో ప్రకటించిన పోస్టుల్లో 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే. ఇప్పుడు కొత్తగా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన అత్యధికులను కూడా క్లస్టర్ కాంప్లెక్స్ల్లో వేసినట్లు తెలిసింది. రెగ్యులర్ ఉపాధ్యాయులు సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ సమయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటారు. అయితే, ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలోనే కొత్త టీచర్లను సర్కారు తికమకకు గురిచేసి దొంగాట ఆడినట్లు తెలుస్తోంది. ఎక్కడ రిపోర్టు చేయాలో?ఇదిలా ఉంటే.. జాయినింగ్ ఆర్డర్ అందిన అభ్యర్థులు సోమవారం తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. కొందరు అభ్యర్థులకు స్థానాలు చూపకపోవడంతో ఎక్కడ రిపోర్టు చేయాలో తెలీక వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కొత్త టీచర్లలోని కొందరిని రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లలో మిగులు ఉపాధ్యాయులుగా మారిస్తే మరికొందరిని ఎటూగాకుండా చేసింది.రూ.50 వేల బాండ్ ఇవ్వాలంట..ఇదిలా ఉంటే.. సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నియమితులైన కొత్త టీచర్లు రూ.50 వేల పూచీకత్తుతో బాండ్ను సమర్పించాలని నిబంధన విధించారు. అంతేగాక.. కనీసం ఐదేళ్లు సొసైటీలో పనిచేస్తామని హామీ ఇవ్వాలని పేర్కొనడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలు విధించే నిబంధనలను టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టడంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ రణభేరి
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తారు.నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యంవల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరనున్నారు.ఇక వైన్షాప్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన వైన్షాప్లు, బార్ల లైసెన్సులు రద్దుచేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సిఫార్సు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తారు. -
నకిలీ మద్యంపై సిట్ దర్యాప్తు హాస్యాస్పదం
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా... ఇప్పటివరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు.ఆదివారం మాజీ మంత్రులిద్దరూ సంయుక్త ప్రకటన చేస్తూ.. కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చంద్రబాబు వేసిన ‘సిట్’లన్నీ కేవలం కక్షసాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమేనని వారు గుర్తు చేశారు. ఆ ప్రకటనలో నారాయణస్వామి, కాకాణి ఏమని పేర్కొన్నారంటే.. పరిశ్రమల మాదిరిగా.. ‘రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా.. పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజానికి ‘సిట్’ అనేది చంద్రబాబు జేబులోని సంస్థ. మేం డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో ఒకచోట మాత్రమే బయటపడటం లేదు.దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్పై తానే సిట్ వేయడం హాస్యాస్పదం. నిజానికి ములకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్షాపుపై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు. పరి్మట్ రూమ్లు, బెల్టు షాప్లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా ఇప్పుడు కూడా గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్, స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్షాపులు నడపడం వల్ల ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి మద్యం షాపులన్నిటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తన మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులు కట్టబెట్టి, వాటికి పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాపులకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు కేసు డైవర్షన్ కోసం ఈ సిట్ డ్రామాకు తెరలేపారు.ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోతే.. కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు నకిలీ మద్యంపై సిట్తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్షాపుల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో.. ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జయచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్ ద్వారా ముడుపులు అందుకున్న లోకేశ్పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుంది’ అని మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్రెడ్డి తేల్చి చెప్పారు. -
అద్దేపల్లి ఫోన్ అదృశ్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో కరకట్ట బంగ్లా డైరెక్షన్తో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావుకు టీడీపీ పెద్దలతో లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయోనని ముఖ్యనేతలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ తరహాలో విస్తరించిన నేపథ్యంలో జనార్దనరావు నోరు తిప్పితే తమ కొంప కొల్లేరు అవుతుందని ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు.నకిలీ మద్యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారు. జనార్దనరావు తమ డైరెక్షన్లో లొంగిపోయేలా డ్రామాకు తెర తీశారు. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంలో కరకట్ట బంగ్లాకు నెల వారీగా రూ.కోట్లాది ముడుపులు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావు ఫోన్ తాజాగా అదృశ్యమైంది. జనార్దనరావును అరెస్టు చేసిన తరువాత ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్పోర్టులో పోయిందని చెప్పినట్లు కట్టుకథ అల్లారు. లొంగిపోయే వరకు టచ్లోనే..! అద్దేపల్లె జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేశారు. అందులో వెల్లడైన విషయాలను వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారు. దీనినిబట్టి కరకట్ట బంగ్లాతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. జనార్దనరావు ఫోన్ దొరికితే పలువురు టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు, ఫోన్ సంభాషణలు వెలుగు చూస్తాయని ముందు జాగ్రత్తగా మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే వరకు టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే కేసును నీరుగార్చే కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లే సమయంలో మైలవరం ప్రజాప్రతినిధి బావ మరిదికి అద్దేపల్లి జనార్దనరావు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ
విజయవాడ తమ సమస్యలను పరిష్కరించకపోతే ‘పవర్’ ఏమిటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఏపీ విద్యుత్ జేఏసీ.. రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో ఉద్యమానికి సిద్ధమైంది విద్యుత్ సిబ్బంది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లు చేస్తుంది విద్యుత్ జేఏసీ. విద్యుత్తు యాజమాన్యాలు, ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా పరిష్కారం రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 15వ తేదీ నాటికి తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనడానికి అరవై వేలమంది విద్యుత్ సిబ్బంది సన్నద్ధమైంది. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి విద్యుత్ సిబ్బంది వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ» కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.» విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి.» జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్మెన్గా పదోన్నతి కల్పించాలి.» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.» పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి.» ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.» అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీలలో నియమించాలి. » 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.» పర్సనల్ ‘పే’ని ఎన్క్యాష్మెంట్ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవుతో కలిపి పేమెంట్ చేయాలి.» విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్లను నిర్వహించాలి.ఇదీ చదవండి: మా ‘పవర్’ ఏమిటో చూపిస్తాం! -
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? -
బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత
బాపట్ల: జిల్లాలోని చీరాల మండలం వాడరేవు చూడటానికి వచ్చిన విహారయాత్ర కాస్తా విషాదం మిగిల్చింది. సముద్రస్నానానికి వెళ్లిన పలువురు యువకులు గల్లంతయ్యారు. వాడరేవులో సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాసి అలలకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దర్ని పోలీసులు రక్షించారు. ఈ విహార యాత్రకు ఏడుగురు యువకులు బృందంగా వచ్చినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో మణిదీప్(19), సాత్విక్(19), సాకేత్ (19) మరియు సూర్యాపేటకు చెందిన సోమేష్లుగా గుర్తించారు. -
నాకు కాస్త టైమ్ ఇవ్వండి: మత్స్యకారులకు కలెక్టర్ విజ్ఞప్తి
అనకాపల్లి: బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ధర్నా చేపట్టిన మత్స్యకారులతో కలెక్టర్ సంప్రదింపులు జరిపారు. తనకు కాస్త టైమ్ ఇవ్వాలని మత్స్యకారులను కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం వరకూ తనకు సమయం ఇవ్వాలన్నారు కలెక్టర్. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా హైవేపై ధర్నాను విరమించారు మత్స్యకారులు. బుధవారం తర్వాత సమస్యకు పరిష్కారం రాకపోతే మరొకసారి ఆందోళన బాట పడతామని మత్స్యకారులు హెచ్చరించారు. అనాకపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికే 25 రోజులు కొనసాగుతోంది.మత్స్యకారుల ఆందోళనకు ప్రధాన కారణాలు:పర్యావరణ హానికి భయం: ఇప్పటికే ఉన్న మందుల పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే, సముద్ర జీవనానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రసాయన పరిశ్రమల వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుందని, తమ జీవనాధారం ప్రమాదంలో పడుతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. తమను ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు నాలుగు డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని నెరవేర్చని పక్షంలో పోరాటం దిశగా అడుగులు వేస్తూ తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్12) అమరావతి రైతులు గుంటూరులో సమావేశయ్యారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభానికి భూమి ఇచ్చిన రైతులను కూడా ఆహ్వానించ లేదని మండిపడ్డారు. సీఆర్డీఏలో అవినీతి పెరిగిపోందన్న అమరావతి రైతులు.. 15నెలలు గడుస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు.తమ సమస్యల్ని పరిష్కరించాలని సీఆర్డీఏ మున్సిపల్ శాఖ మంత్రి వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం తప్పదని అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 👉ఇదీ చదవండి: ఎవరి అక్షయపాత్ర అమరావతి? -
‘ఎల్లుండి జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం’
పార్వతీపురం మన్యం జిల్లా: పచ్చకామెర్లు సోసిక కురుపాం గిరిజన విద్యార్థుల వైద్క నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. ఎల్లుండి(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) వైఎస్సార్సీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. హెపటైటస్ కేసులు ఇన్ని వస్తున్నా ఇప్పటివరకు గ్యాస్ట్రోఎంట్రలిజిస్ట్ను కురుపాం ఆస్పత్రికికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అలాగే మిగతా హాస్టల్స్ విద్యార్థులకు వాక్సిన్ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. గిరిజనుల వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. -
కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్
సాక్షి,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బొజ్జల సుధీర్రెడ్డి (Bojjala Sudhir Reddy).. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు. 👉ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్కు అంతా తెలుసుఆ వీడియోలో కోట వినూత,ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని (Kota Vinutha Driver Rayudu ) పావుగా వినియోగించుకున్నాడు.కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్రెడ్డి రూ.30లక్షలు ఆఫర్ చేశాడు. ముందుగా కోట వినూత, చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి రూ.20లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు. ఈ వరుస పరిణామాలల నేపథ్యంలో జులై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత, చంద్రబాబు హత్య చేశారు. జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవంజులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరఫున చాలా యాక్టీవ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. -
‘మోదీకి విజ్ఞప్తి.. NDA అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే’
సాక్షి, నగరి: ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే(NDA) అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం(AP Liquor Case) మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు(CM Chandrababu) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?.సాక్ష్యాలతో దొరికిన పచ్చ బ్యాచ్..దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.మహిళా ద్రోహి చంద్రబాబు.. చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి. మహిళలు అంటే గౌరవం లేదు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మరి ఆడవాళ్ళ మానప్రాణాలకు ఏం విలువ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంది. ఏపీలో 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్లపై లైంగిక దాడులు జరిగాయి. ఎంత మందిని హత్య చేశారు. కొంత మంది మహిళలు అదృశ్యం కాగా.. ఇప్పటివరకు కూడా దొరకలేదు’ అని విమర్శలు చేశారు.కమీషన్లు, దందాలు బయటకు రావాలి..తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ కోవర్టు అయితే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు.. ఎందుకిచ్చారు?. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మైన్స్, వైన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతోంది. ప్రధాని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమీషన్లను సీబీఐ బయటకు తీయాలి అని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్సార్సీపీ కోవర్టులు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. ఈ లిక్కర్ కేసుకి మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి.. లోకేష్కు ఎంత సన్నిహితులు అనేది అందరూ కూడా గమనించాలి. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య చేసిన వ్యక్తి. జీవితకాలం శిక్ష ఉంది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక క్షమాభిక్ష పెట్టించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చారు అని మండిపడ్డారు. -
నకిలీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జనార్థన్ ఫోన్ ఎక్కడ?
సాక్షి, అమరావతి: ఏపీలో నకిలీ మద్యం(AP Liquor case) కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నకిలీ మద్యం కేసులో టీడీపీ(TDP) గ్యాంగ్.. సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాని నిందితుడు, టీడీపీ నాయకుడు జనార్థన్ రావు ఫోన్ మిస్సింగ్ అని కొత్త కోణాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలను దాచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును(Janardhan Rao) అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు(AP Police) ఆరా తీశారు. అయితే, ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్ చేస్తున్నారు. ఇక, జనార్థన్ రావు ఫోన్ దొరికితే మరికొందరు టీడీపీ నాయకులు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఫోన్లో ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, ముంబై ఎయిర్పోర్టులో ఫోన్ పోయిందనే ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ సిండికేట్..ఇదిలా ఉండగా.. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్వర్క్ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్. -
‘కంగారు’ పడతారా? పెట్టిస్తారా
విశాఖ స్పోర్ట్స్: ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్లో అత్యంత రసవత్తరమైన పోరుకు విశాఖ వైఎస్సార్ స్టేడియం సిద్ధమైంది. వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో గత రన్నరప్ భారత్ ఆదివారం డే–నైట్ మ్యాచ్లో ఢీకొట్టనుంది. ఈ పోరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఐదు పాయింట్లతో ఆ్రస్టేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గత మ్యాచ్లో ఓటమిపాలైన భారత జట్టు, ఈ మ్యాచ్లో విజయం సాధించి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్లో శ్రమించారు. మంధాన రికార్డుపై దృష్టి భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్లో మరో 58 పరుగులు చేయగలిగితే.. వన్డేల్లో 5,000 పరుగుల మార్కును చేరుకోనుంది. టాస్ గెలిస్తే బౌలింగ్కు అనుకూలం విశాఖలో వర్షాల కారణంగా పిచ్ కొద్దిగా తడిగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది. మిథాలీరాజ్ స్టాండ్, కల్పన ఎంట్రీల ప్రారంభం భారత మాజీ కెపె్టన్ మిథాలీరాజ్ పేరిట ఒక స్టాండ్ను, ఆంధ్ర మహిళా క్రికెటర్ కల్పన పేరిట ఒక ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ స్టాండ్, ప్రవేశద్వారాలను ప్రారంభించనున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 12-19)
-
లివర్ మార్పిడి తప్పదా!.. కురుపాం విద్యార్థుల్లో ప్రమాదకర సంకేతాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హెపటైటిస్–ఏ బారినపడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో కొందరి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందా?... ఈ వ్యాధి సోకినవారు వెంటనే కోలుకునే స్థితిలో లేరా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారా?.. అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.ఒకవైపు ఇప్పటికే కురుపాం ఆశ్రమ పాఠశాలలో వందల మంది విద్యార్థులను వణికిస్తున్న హెపటైటిస్–ఏ.. పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలకూ పాకింది. ఇక్కడ కూడా వందల మంది విద్యార్థులు హెపటైటిస్–ఏతో ఇబ్బంది పడుతున్నట్టు పరీక్షల ద్వారా తెలుస్తోంది. అయితే, సాధారణ హెపటైటిస్–ఏ వేరియంట్ కంటే పిల్లలకు సోకిన వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు. గోప్యంగా ఉంచిన ప్రభుత్వం!ఈ వ్యాధి బారినపడిన వారు వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా లేదని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. అందువల్ల మూకుమ్మడిగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒక విద్యారి్థకి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజీ–1గా కూడా వైద్యులు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల పరిస్థితి విషమిస్తే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్)కి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. వెంటనే కాలేయ మారి్పడికి అవసరమైన ప్రొటోకాల్స్ను సిద్ధం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటే మంచిదని ప్రభుత్వానికి వైద్య నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ గిరిజన విద్యార్థులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల కిందటే గుర్తించినా...! పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో నెల కిందటే ఒక విద్యార్థికి హెపటైటిస్–ఏ సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తానికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ వైద్య బృందం వెంటనే విద్యార్థులు అందరికీ పరీక్షలు కూడా చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.మరొకరు కూడా మృతి చెందినప్పటికీ... హెపటైటిస్–ఏ కారణం కాదని చెబుతున్నారు. మరోవైపు తాజా పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలినందున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కురుపాం ఆశ్రమ పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులకు, వారిని కలిసినవారికి, ఆయా గ్రామాల్లో వెంటనే మూకుమ్మడిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. -
విశాఖలో 70 కోట్ల భూమి.. పిఠాపురం వర్మ కుమారుడి పేరుతో స్వాహా
సాక్షి, తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకున్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుమారుడు ఎస్వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్ధరాజు వరలక్ష్మి శనివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. 13.2, 14.1, 15.1, 15.4, 15.5, 15.6, 15.8, 92.2, 93.1 తమ భూమి సర్వే నెంబర్లని చెప్పారు. అయితే, దంతులూరి రామకృష్ణరాజు కుమారుడు నారాయణరాజు వారసుల్లో ఒకరైన పకీరురాజు, మిగిలిన వారసులకు తెలీకుండా, ఆయనొక్కడే వారసుడినని చెప్పుకుని మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించి, 2023 అక్టోబరులో గిరీష్కు జీపీ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాళ్లవలస టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు, పూసపాటి గోపాలమూర్తి రాజు సహకరించారని బాధితులు వివరించారు.దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు.. ఈ మోసాన్ని తాము గుర్తించి భీమిలి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పకీరు ఒక్కడే వారసుడు అనడానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదన్నారు. ఈ భూములపై జిల్లా కోర్టులో ఓఎస్ 115/2025 కేసు రిజిస్టర్ అయి, ఆర్ఓఆర్ పిటిషన్పై విచారణ జరుగుతున్నప్పటికీ, జీపీ పొందిన టీడీపీనేత గిరీష్ దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు పొందాడని ఆరోపించారు.ఈనెల 5 నుంచి గిరీష్ తన మనుషులతో వచ్చి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు రాత్రింబవళ్లు చేస్తున్నారని తెలిపారు. గిరీష్ అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు తమకు న్యాయం చేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల కారుతో తొక్కించి తమను అంతమొందించేందుకు కూడా యత్నించారని బుద్ధరాజు వరలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ రాజు ఆరోపించారు. తప్పుడు పత్రాలతో జీపీ చేసిన వారిపైనా, చేయించుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. -
తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు..
-
నకిలీ మాఫియాకు ముఖ్యనేత దన్ను!
సాక్షి, అమరావతి: అనుకున్నట్టుగానే నకిలీ మద్యం మాఫియా దందాను గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. ఈ దందాను అద్దేపల్లి జనార్దన్ వరకే పరిమితం చేసి, దర్యాప్తును పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ‘నకిలీ మద్యం దందా వెనుక సూత్రధారుల గుట్టు రట్టు చేస్తాం’ అన్న ములకలచెరువు గ్యాంగ్ బెదిరింపులకు ముఖ్యనేత భయపడ్డారన్నది తేటతెల్లమవుతోంది. నకిలీ మద్యం దందా అంతా ఒక్క జనార్దన్ మాత్రమే చేసినట్టుగా తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, అలాగే కీలక నాయకుడు సురేంద్రనాయుడుతో తనకు లిక్కర్ వ్యాపార సంబంధాలు ఉన్నాయని జనార్దన్ తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు, అసలు వీరికి ఈ దందాలో భాగం ఉన్నట్లు అర్థం వచ్చేలా అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. జయచంద్రారెడ్డి పేరు నిందితునిగా చేరిస్తే, ఆయన వెనుక ఉన్న ముఖ్యనేత పేర్లు బయటకు వస్తాయని, ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ నేతల పేర్లు బట్టబయలవుతాయన్న భయంతో ఈ ఎత్తుగడ వేశారు. మద్యం దుకాణాల వ్యాపారంలో లాభాలు రావడం లేదని 2025 జూన్ తర్వాత జనార్దన్తో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు చేతులు కలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం ఏమిటంటే.. ఈ మాఫియాకు మూలం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు.జనార్దన్ వారి అనుచరుడు మాత్రమే. 2024 ఎన్నికలకు ముందే నకిలీ మద్యం దందా కోసం ముఖ్యనేతతో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు డీల్ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో జనార్దన్ను మాత్రమే నకిలీ మద్యం నిర్వాహకునిగా పేర్కొనడం ముఖ్యనేత కుట్రకు నిదర్శనం.తద్వారా మాఫియాకు మూలమైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడులను పూర్తిగా తప్పించాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. పైగా అద్దేపల్లి ఈ ఏడాది జూన్లోనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్టు సూచించడం విడ్డూరం. మొత్తంగా నకిలీ మద్యం దందా తీవ్రతను తగ్గించి అంతిమ లబ్ధిదారులకు కొమ్ముకాయడమే రిమాండ్ రిపోర్ట్ లక్ష్యమని అర్థమవుతోంది. -
కోడికి పందెం పాఠాలు
పుంజులకు పందెం పాఠాలేంటీ అనుకుంటున్నారా? సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎంత ఫేమస్సో తెలిసిందే. రూ.కోట్లలో చేతులు మారడం ఒకెత్తయితే.. తమ కోడి.. పందెం కొట్టడం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో ఎత్తు. పుంజులను పందేలకు సిద్ధం చేసేందుకు మూడు నెలల ముందు నుంచి పెద్ద కసరత్తే జరుగుతుంది. రానున్న సంక్రాంతి కోసం దసరా నుంచే పందెంరాయుళ్లు తమ పుంజులకు శిక్షణ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ రోజుల్లో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టే పుంజుల పెంపకంలో పందేలరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అధిక శాతం మంది తమ ఇళ్లు, మకాంల వద్ద పుంజులను పెంచితే.. పండుగలకు దేశ విదేశాల నుంచి వచ్చేవారు తెలిసిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తుంటారు. -సాక్షి, భీమవరంమెనూ ప్రత్యేకమే..పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యరి్థపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి రాగులు, గంటులు, అరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మరెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు. అంతా గోప్యమే కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయస్సు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తుంటారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తారు. శిక్షణ మొదలవుతుందిలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లలో పటుత్వం, ఆయాసం రాకుండా, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు నెలరోజుల పాటు రోజు విడిచి రోజు చెరువులు, నీటి తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. ‘వి’ (ఇంగ్లిష్ లెటర్) ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ పరుగులు పెట్టిస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తుంటారు. పండుగలు దగ్గరపడే కొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులు తగ్గడానికి ప్రత్యేక ట్రైనర్లతో వేప, జామాయిల్, కుంకుడు తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాలతో గంటల కొద్దీ మరిగించిన ద్రావణాన్ని కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చి పుంజును అందులో ఉంచి పైనుంచి ద్రావణం పోస్తారు. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తారు. చివరిగా పొయ్యిపై మూకుడు వేడిచేస్తూ అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దానిని కోడి శరీరం అంతా అద్దుతూ శాఖల చేయిస్తారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతినిచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. ఈ ప్రక్రియలన్నిటినీ నిర్ణీత పద్ధతుల్లో చేయిస్తుంటారు. కోట్లలో వ్యాపారం.. మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలుంటాయి. వీరు ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్ల పోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లకు సిట్టింగ్కు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందంటున్నారు. వీటి జాతి, రంగు, ఎత్తును బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తుంటారు. పండుగల కోసం నాలుగు వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పుంజులకు ఉన్న డిమాండ్తో జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. కొందరు స్థలాలను లీజుకు తీసుకుని వీటి పెంపకం సాగిస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కోచోట వంద నుంచి 250 వరకు వివిధ రకాల జాతుల పుంజులు, కోళ్లను పెంచుతుంటారు. -
నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్జైలుకు తరలించారు.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్కు రిమాండ్రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడిగాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్ను నెల్లూరు జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్తోపాటు శ్రీనివాస వైన్స్లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్లో ఈ–7 అనే బార్లో పార్టనర్గా చేరి అక్కడ చీప్ లిక్కర్ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్లో విక్రయించాడు.నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం. -
టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు..!
చిత్తూరు అర్బన్: ‘‘ఎమ్మెల్యే చెప్పినా అంతే. చట్టం చట్టమే. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు’’ అంటూ చిత్తూరు కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడుపై జనసేన నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిత్తూరులోని ఓ హోటల్లో శనివారం హై రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరులోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామన్నారు. పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఇంతలో సభలో కూర్చున్న జనసేన నాయకుడు దయారాం నాయుడు మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? ఎమ్మెల్యే ఓ పొరంబోకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినపుడు హైరోడ్డు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. ఇప్పుడు కూడా ఆయన వద్ద్దకే వెళ్తాం. కూటమి ఉంటుందో, ఊడిపోతుందో తర్వాత కథ. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది. కొట్టండి నీవానది ఆక్రమణల్ని. చంద్రబాబు అమెరికా, యూరప్ పోయి ఫండ్స్ తీసుకొస్తా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు. ముందు చిత్తూరు హై రోడ్డును అభివృద్ధి చేయండి. శ్మశానంలాగా తయారయ్యింది హై రోడ్డు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం పనికిరాని భూములకు రూ.కోట్లలో పరిహారం ఇచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలియదా? ఎంతసేపు బిల్డింగ్ కొట్టేయండి, కొట్టేయండి అని ఎమ్మెల్యే అంటున్నారు. ఆయనకు పేరు వచ్చేయాలి. మరి మేము రోడ్డున పడాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని, టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. -
పోలీసుకు న్యాయం కరువు
అనంతపురం సెంట్రల్ : సామాన్య ప్రజలు అన్యాయానికి గురైతే ఠక్కున గుర్తొచ్చేది పోలీసులు. అలాంటిది న్యాయం చేసే పోలీసుకే పోలీసుస్టేషన్లో అన్యాయం జరుగుతోంది. తన భార్యపై దాడిచేసిన వారి మీద కేసు నమోదుచేయాలని రెండ్రోజులుగా ఓ కానిస్టేబుల్ పోలీసులను వేడుకుంటున్నా కనికరించడంలేదు. దాడికి పాల్పడిన వారు టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు కావడంతో చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులు శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు.వివరాలివీ..అనంతపురం శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎలైట్ హోమ్స్లో పోలీసు డాగ్స్క్వాడ్లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్కుమార్ ఉంటున్నారు. కింది పోర్షన్లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు తేజ సంబంధీకులు భువన్ చక్రవర్తి కుటుంబం ఉంటోంది. అయితే, శుక్రవారం సాయంత్రం హరినాథ్కుమార్, అతని స్నేహితుడు వాకింగ్కు వెళ్లారు. అదే సమయంలో.. పక్కింటి బాలుడు క్రికెట్ ఆడుకుంటూ బంతి వేయాలని వీరిని కోరాడు. దీంతో సదరు కానిస్టేబుల్ బంతి వేయడంతో బాలుడు బ్యాట్తో కొట్టాడు. బంతి భువన్ చక్రవర్తి కారుకు తగిలింది. దీంతో.. ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యే అమిలినేని అనుచరులను తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇంటిపై దాడిచేశారు. ఇక ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగీదీష్ను వివరణ కోరగా.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని.. కానిస్టేబుల్ భార్య సుజాత తమతో దురుసుగా ప్రవర్తించారంటూ భువన్ చక్రవర్తి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. స్టేషన్లో కూడా దాడి చేశారుకానిస్టేబుల్ భార్య సుజాత మాట్లాడుతూ.. ‘మాకు న్యాయం చేయాలని స్టేషన్కు వస్తే అక్కడ కూడా వారు దాడిచేశారు. చెప్పుకోలేని మాటలు మాట్లాడారు. స్టేషన్లో శుక్రవారం రాత్రి 2 గంటల వరకూ ఉన్నాం. శనివారం కూడా మ.2 గంటల వరకూ ఉన్నప్పటికీ పోలీసులు మాకు న్యాయం చేయలేదు. పైగా నీ ఉద్యోగం ఊడిపోతుంది.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో.. బట్టలు తీసుకుని కర్నూలు బందోబస్తుకు పో అంటూ నా భర్తను బెదిరిస్తున్నారు. పోలీసుశాఖలో పనిచేసి ఏం ఉపయోగం? ఇంత అవమానకరమైన బతుకు బతకడం కంటే చావడమే మేలు. సీఎం సార్.. మమ్మల్ని కాపాడండి. మా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత’.. అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?ఈ సందర్భంగా స్టేషన్ వద్ద హరినాథ్కుమార్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖలో పనిచేస్తున్న నాకే రక్షణ లేకుండాపోతోంది. దాదాపు 20 మంది రౌడీలను నా ఇంటిపైకి తీసుకొచ్చి భువన్ చక్రవర్తి, అతని భార్య కళ్యాణి, చెల్లెలు అంజలి కలిసి నా భార్య సుజాతపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు వచ్చి వేడుకున్నా. కేసు తీసుకోవడానికి సీఐ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వారి వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నారట. ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి కూడా ఏం ప్రయోజనం? ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తా’.. అని చెప్పారు. -
అప్పులు తెచ్చి అడ్డగోలు వ్యయం!
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయ భవనం, దానిపక్కనే మున్సిపల్ శాఖ విభాగాల (ఏపీయూఎఫ్ఐడీసీ, ఏపీ టిడ్కో, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, ఏపీయూజీబీసీ ఆఫీసు, ఏపీ రెరా అప్పిలేట్ అథారిటీ, డీటీసీపీ, రెరా ఆఫీసులు, మెప్మా, ఇతర విభాగాలు) కోసం పీఈబీ (ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్) పద్ధతిలో ఇప్పటికే మూడు షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. తాజాగా సీఆర్డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు రూ.72.69 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్డీఏ శనివారం స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనరేజీ, జీఎస్టీ లాంటి పన్నుల రూపంలో రూ.20.71 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. మున్సిపల్ శాఖ నిర్మాణాలకు విపరీత ఖర్చు.. ఇక మున్సిపల్ శాఖ విభాగాల కోసం 37,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.49.63 కోట్ల అంచనా వ్యయంతో శనివారం సీఆర్డీఏ స్వల్పకాలిక టెండర్ నోటిపికేషన్ జారీ చేసింది. పన్నుల రూపంలో అదనంగా రూ.15.92 కోట్లు ఇస్తామంది. దీంతో సీఆర్డీఏ భవనం, మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం కోసం రూ.469.95 కోట్ల వ్యయంతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరో వైపు అమరావతిలో వెలగపూడి వద్ద రూ.1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో 2016లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. శాశ్వత సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల కోసం 52,20,496 చ.అడుగుల నిర్మిత ప్రాంతంలో ఐదు భారీ భవనాల నిర్మాణ పనులను రూ.4,688.82 కోట్లకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటికే అప్పగించింది. అందులో మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం భారీగా స్థలం కేటాయించింది. ఆ భవనాలు పూర్తయితే.. ఇప్పుడు నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యాలయం, మున్సిపల్ శాఖ కోసం నాలుగు పీఈబీ షెడ్లు వృథాగా మారుతాయని.. వాటి కోసం చేసే వ్యయం రూ.469.85 కోట్లు.. తాత్కాలిక సచివాలయం కోసం చేసిన వ్యయం రూ.1,151 కోట్లు మాదిరిగానే వృథా అవుతాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను భారీ ఎత్తున వృథా చేస్తూ రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేయకుండా కమీషన్ల కోసం షెడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సీఆర్డీఏ భవనంలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీసు, ఐదు భారీ మీటింగ్ హాళ్లు, సీఆర్డీఏ కార్యాలయం కోసం మూడు ప్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీసు, సీడీఎంఏ ఆఫీసు, రెరా ఆఫీసు, డీటీసీపీ ఆఫీసు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆఫీసు, మున్సిపల్ శాఖ మంత్రి, శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మిగిలిన విభాగాల కోసం సీఆర్డీఏ ఆఫీసుకు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో మూడు షెడ్ల నిర్మాణ పనులను మార్చి 29న రూ.28.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థ ఎన్సీసీకి అప్పగించారు. ఆ మూడు షెడ్లకు ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులను ఎన్సీసీకే రూ.40.35 కోట్లకు అప్పగించారు. తాజాగా నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నులతో కలిపి రూ.65.55 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్డీఏ స్వల్ఫకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని బట్టి నాలుగు షెడ్ల కోసమే ఏకంగా రూ.134.59 కోట్లు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జీ+1 నుంచి జీ+7 స్థాయికి సీఆర్డీఏ కార్యాలయం విస్తరణ..» రాజధానిలో సీఆర్డీఏ కార్యాలయ భవనం నిర్మాణ పనులకు తొలుత జీ+1 పద్ధతిలో 55,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో.. జీ+7 అంతస్తులతో భవనాన్ని నిర్మించేలా పునాది, డిజైన్ పనులకు రూ.39.80 కోట్ల అంచనాతో 2017, అక్టోబర్ 21న టెండర్లు పిలిచారు. ఆ పనులను 0.27 శాతం తక్కువకు అంటే రూ.39.69 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.17.12 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. » ఆ తర్వాత జీ+1 నిర్మిస్తున్న భవనంపై అదనంగా ఆరు అంతస్తులు నిర్మించే పనులకు రూ.43.35 కోట్ల అంచనా వ్యయంతో 2018, మే 14న టెండర్లు పిలిచారు. ఈ పనులను 3.93 శాతం అధిక ధరకు అంటే రూ.45.05 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ సంస్థే దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.26.58 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది.» సీఆర్డీఏ భవనంలో జీ+3 వరకూ లోపల, బయటా విద్యుదీకకరణ, ఫర్నిచర్ సహా ఇంటీరియర్ వర్క్స్, చిల్డ్ వాటర్ సిస్టమ్, ఐటీ, బీఎంఎస్ తదితర పనులకు 2019 జనవరి 12న రూ.38.19 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.39.90 కోట్లకు కేపీసీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. » సీఆర్డీఏ కార్యాలయాన్ని లోపలా, బయటా కళాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు భవనం లోపల, బయట అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతి తీసుకోకుండానే 2024, సెపె్టంబరు 18న రూ.129.69 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులను రూ.135.97 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కేపీసీ ప్రాజెక్ట్స్ సంస్థే దక్కించుంది. ఆ పనులను కేసీపీ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగిస్తూ 2024, అక్టోబర్ 16న సీఆర్డీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి ఈ పనుల వ్యయం రూ.160 కోట్లు అవుతుంది. ఇదే రకమైన పనులను జీ+3 అంతస్థు వరకూ 2019, జనవరి 12న రూ.39.90 కోట్లకు ఇదే సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే అంచనాలు పెంచేసి గతంలో అప్పగించిన సంస్థకే మళ్లీ కొత్తగా పనులు అప్పగించారనే ఇంజనీర్లు చెబుతున్నారు.» తాజాగా సీఆర్డీఏ భవనానికి ఫర్నీచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు పన్నులతో కలిపి రూ.93.4 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 3,89,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో చేపట్టిన సీఆర్డీఏ భవనం కోసం రూ.335.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంటే.. చదరపు అడుగుకు రూ.8,616.64 వ్యయం చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఫైవ్స్టార్ వసతులతో కూడిన భవనాల నిర్మాణ వ్యయం సైతం రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ భవన నిర్మాణంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెబుతున్నారు. -
మూడో వారంలో ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి.. ఈ నెల 14 నాటికి రాష్ట్రం నుంచి, 15 నాటికి దేశవ్యాప్తంగా నిష్క్రమించనుంది. ఇదే సమయంలో ఈ నెల మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది. 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి. 1998, 2005, 2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందించాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 2 లేదా 3 తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు సాక్షి, అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా వరకూ విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లిలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 3.1, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 2.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
అంతర్రాష్ట్ర జలవివాదంగా పోలవరం–బనకచర్ల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు అదనంగా దక్కే వాటా నీటిని వినియోగించుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్ తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు మహారాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సవితా బోధేకర్ ఈ నెల 8న లేఖ రాశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా తమకు 14 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చిందని గుర్తు చేశారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 243 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతిస్తే.. అదే రోజు నుంచి కృష్ణా జలాలను గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన దామాషా ప్రకారం అదనంగా వాడుకుంటామని తెలిపారు. ఇక ఎన్డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన గోదావరి–కావేరి అనుసంధానానికి అనుమతిస్తే.. మళ్లించే గోదావరి జలాలను బట్టి దామాషా పద్ధతిలో కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని స్పష్టం చేశారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి కోసం ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్(పీఎఫ్ఆర్)ను మే 22న సీడబ్ల్యూసీకి ఏపీ ప్రభుత్వం సమర్పించింది. జూన్ 11న మహారాష్ట్ర సర్కార్ అభిప్రాయాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ లేఖ రాసింది. మహారాష్ట్ర స్పందిస్తూ.. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు వచ్చే అదనపు వాటా జలాలను వాడుకుంటామని స్పష్టం చేసింది. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇస్తే.. తమ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలైన విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలకు గోదావరి వరద జలాలను మళ్లించే ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇక పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలను అదనంగా 64.75 టీఎంసీలు వాడుకుంటామని కేంద్ర జల్ శక్తి శాఖకు గత నెల 17న కర్ణాటక సర్కార్ లేఖ రాసింది. గోదావరి జలాల్లో తమ వాటా 1,000 టీఎంసీలని.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జూన్ 19న లేఖ రాశారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సంప్రదించాకే ఆ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు గత నెల 23న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను ఏపీ పభుత్వం శనివారం మీడియాకు విడుదల చేసింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. పోలవరం–బనకచర్ల అంతర్రాష్ట్ర జల వివాదంగా మారుతోందన్నది స్పష్టమవుతోంది. -
పేదలకు వైద్యవిద్యను దూరం చేయొద్దు మెడికల్ కళాశాలల పీపీపీ ఆపండి
గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తోందని మేధోమథన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వం రంగంలోనే నడపాలని పట్టుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమికి సహకరించిన ఎన్ఆర్ఐలు, కార్పొరేట్లు, తమకు కావాల్సిన వారికి మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు లోపభూయిష్టమైన పీపీపీ విధానం ముందుకు తెచ్చిందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు డబ్బులు లేవని సర్కారు కుంటి సాకులు చెబుతోందని, వాస్తవంగా డబ్బులు లేకపోతే తాము జోలెపట్టి డబ్బులు అడిగి ప్రభుత్వానికి ఇస్తామని, వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మహోద్యమం తప్పదని హెచ్చరించారు. రాబోయే రెండు నెలల్లో సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించి ప్రభుత్వ కుట్రలు బహిర్గతం చేస్తామన్నారు. వాస్తవాలు వివరించేందుకే సదస్సు..‘‘వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో ఐదు కళాశాలలు వైఎస్సార్సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కూడా పూర్తవగా, ఎన్నికల తర్వాత ఒక కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరో కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కూటమి ప్రభుత్వం వద్దని ఎన్ఎంసీకి లేఖ రాసింది. మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి నేతలు మెడికల్ కాలేజీలకు జీవోలు లేవని, అసలు నిర్మాణం జరగలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే మేధోమథన సదస్సు నిర్వహించాం. ఈ విషయంలో వైఎస్ జగన్కే మా మద్దతు. ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. కమీషన్లకు ఆశపడి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పీపీపీపై మోజు పెంచుకున్నారు. సర్కారు తీరువల్ల ఏటా 2,500 మంది ఏపీ విద్యార్థులు నష్టపోతారు. హోమంత్రి అనిత తన శాఖ పనిని వదిలేసి మెడికల్ కాలేజీలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అసంబద్ధం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమూ భాగస్వాములం అవుతాం.’’ అని వక్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఒక్కొక్కటి చదివి వినిపించారు. సదస్సులో వైఎస్సార్సీపీ నాయకురాలు మంచా నాగమల్లేశ్వరి, వైఎస్సార్సీపీ వైద్యవిభాగం ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, న్యాయవాది సాయిరామ్, రిటైర్డ్ జడ్జి జయసూర్య, ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కరువునేలలో పసిడి పంట
తుగ్గలి (కర్నూలు జిల్లా): కరువు నేలల్లో పసిడి పంట పండనుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల పాటు చేసిన సర్వేలు, పరిశోధనలు ఫలించడంతో ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లి, జీ.ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సర్వేల్లో గుర్తించారు. ఆ నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. కంపెనీలో 70 శాతం వాటాతో త్రివేణి ఎర్త్మూవర్స్, ప్రాకార్, లాయిడ్స్ మెటల్స్ ప్రధాన వాటాదారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 27.27 శాతం వాటా కలిగి ఉంది. ప్రధాన వాటాదారు మైనింగ్ దిగ్గజం బి. ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.40 ఏళ్లకు పైగా సర్వేలు, పరిశోధనలుఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా పలు సంస్థలు సర్వేలు, పరిశోధనలు చేశాయి. మొదట జీఎస్ఐ, ఎమ్మీసీఎల్ సంస్థలు సర్వే చేశాయి. ఆ తర్వాత 1994 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేపట్టింది. బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న సంస్థ ప్రభుత్వ అనుమతులు కోరడంతో 2013లో అనుమతులు వచ్చాయి. పలు పరిశోధనల అనంతరం సంస్థ నిర్ధారించుకున్న తర్వాత 2023 సెపె్టంబరు 2న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు భూమి పూజచేశారు. మొదట చిన్నప్లాంట్ ఏర్పాటుచేసి అందులో ప్రాసెసింగ్ ట్రయల్ నిర్వహిస్తూనే మరో రూ.200 కోట్లతో పెద్ద ప్లాంట్ నిర్మాణం పూర్తిచేశారు. బంగారం ఉత్పత్తికి సిద్ధందాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్టోబరు నెలాఖరు నుంచి గానీ, నవంబరు ప్రారంభం నుంచి కానీ బంగారం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రధాన వాటాదారు బి. ప్రభాకరన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రారంభంలో ఏడాదికి 500 కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులతో క్రమంగా ఏడాదికి సుమారు 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. అలాగే, ప్రభుత్వ అనుమతులతో ఇక్కడే 24 క్యారెట్ల బంగారం ప్రాసెసింగ్ చేయనున్నారు. 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు నిజానికి.. ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఎకరా రూ.4,500 చొప్పున రైతుల నుంచి లీజుకు తీసుకుని సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ చేపట్టింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.బంగారం వెలికితీతకు ఎకరా రూ.12 లక్షల చొప్పున రైతుల నుంచి ఇప్పటివరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగిలిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తోంది. కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. మున్ముందు మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు.. మరోవైపు.. జియో మైసూర్ కంపెనీ బంగారం నిక్షేపాలు వెలికితీస్తూనే సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి, పగిడిరాయిలో పాఠశాలలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తోంది. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు కృషిచేస్తోంది. చెన్నంపల్లి, పీ.కొత్తూరు, బొల్లవానిపల్లి విద్యార్థులు ఉన్నత చదువుకు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిoచింది. ఉత్పత్తి బాగా జరిగితే విద్య, వైద్యంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. -
‘సాక్షి’పై మరో రెండు అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై అనేక అక్రమ కేసులు పెట్టించింది. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది.నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది. నకిలీ మద్యంపై ‘సాక్షి’ రాసిన కథనాలు తమ శాఖ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ జలీల్, నెల్లూరు–1 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ బాబు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వెంటనే పోలీసు అధికారులు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై 353(2), 356(3) ఆర్/డబ్ల్యూ 3(5)బీఎన్ఎస్ కింద అక్రమ కేసులు నమోదు చేశారు. రిపోర్టర్ ఇంట్లో ‘ఎక్సైజ్’ సోదాలు అంతేకాకుండా కలిగిరి ‘సాక్షి’ రిపోర్టర్ ఆర్.రాజగోపాల్రెడ్డి ఇంటిపై దాడి చేశారు. శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విలేకరి ఇంటికి వెళ్లారు. ‘రాజా అంటే నువ్వేనా? అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారని నీపై ఫిర్యాదులు అందాయి. మీ ఇంట్లో తనిఖీలు చేయాలి’ అని చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు. ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ సిబ్బంది ఓవర్ యాక్షన్తో రాజగోపాల్రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని శనివారం నెల్లూరు ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జికి నెల్లూరు రూరల్ పోలీసులు బీఎన్ఎస్ 179(1) నోటీసు అందజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి కూడా నోటీసులు అందజేసేందుకు పోలీసులు హైదరాబాద్కు వెళ్తున్నట్టు సమాచారం.