Andhra Pradesh
-
టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
విజయవాడ: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కుట్రను బట్టబయలు చేశాడు ముదునూరి సత్యవర్థన్. గన్నవరం టిడిపి ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని జడ్జి ముందు తేల్చిచెప్పాడు. కేసు విరమించుకుంటున్నట్లు జడ్జికి తెలిపాడు సత్యవర్థన్. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ముందు తనను పోలీసులు ఎలా ఒత్తిడి పెట్టారో స్పష్టం చేశాడు. తనకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకున్నాడు సత్యవర్థన్.కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, స్వయంగా అఫిడవిట్ సమర్పించాడు. తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని సత్యవర్థన్ తెలిపాడు. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన తనపై పోలీసులే ఒత్తిడి తెచ్చి కేసును నమోదు చేయించారన్నాడు. టీడీపీ నేతలు , పోలీసులు కుట్ర చేసి ేకేసు నమోదు చేశారన్నాడు,. సత్యవర్ధన్ స్టేట్మెంట్ను స్వయంగా రికార్డు చేశారు జడ్జి. సత్యవర్ధన్కు అతని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడుపవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడునిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయిచంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదుచంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారువైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారుచంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయిస్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడులడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడువాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడుతిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవుచంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసిందిచిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదుప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారాచిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందిప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి -
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్రెడ్డి లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
మాధవిరెడ్డి రివేంజ్ పాలిటిక్స్..!
సాక్షి,వైఎస్సార్జిల్లా:కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మళ్లీ వాటర్ప్లాంట్ రాజకీయాన్ని ప్రారంభించారు. ప్రజలేమైపోయినా పర్లేదని వైఎస్సార్సీపీ నేతల మీద కక్ష సాధించడానికి కడపలోని వాటర్ప్లాంట్లను మూసేయిస్తున్నారు. మొన్న కడప 26వ డివిజన్ కార్పొరేటర్ త్యాగరాజు వాటర్ప్లాంట్ కూలదోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే భంగపడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య వాటర్ప్లాంట్ సీజ్ చేయించారు.అన్ని అనుమతులున్నా ప్లాంట్ను పాఠశాల భవనం అంటూ సాకు చూపి అధికారులతో సీజ్ చేయించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నిధులతో వాటర్ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డట్టు చెబుతున్నారు. అంతకుముందు 26వ డివిజన్ వాటర్ప్లాంట్ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే కూల్చివేతకు ఆదేశించినప్పటికీ అధికారులు,పోలీసులు వెనక్కి తగ్గారు.ఎమ్మెల్యేగా ఉండి వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చాలి కానీ..ఇలా వాటర్ప్లాంట్లపై పగబట్టడం మాధవిరెడ్డికే చెల్లిందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత ఆదిత్య వాటర్ప్లాంట్ సీజ్పై చట్టప్రకారం కోర్టులను ఆశ్రయిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు. -
జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్
సాక్షి, తిరుపతి: జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా బాధితురాలు లక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం లక్ష్మి ప్రెస్మీట్ పెట్టారు. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్ఘతం చేశారు. అయితే, ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెక్బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కాగా, కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
ఆరున్నొక్కరు.. జారితే దక్కరు
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు. - సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడబంతికాదది భానుడే చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప సండే సందడివారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
చంద్రబాబు విధ్వంసాన్ని కళ్లకు కట్టిన జగన్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి సర్కార్ పనితీరును ఉతికి ఆరేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అరటి పండు ఒలిచి పెట్టినట్లు వివరించారు. పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకి లెక్కలతో కాకుండా.. పక్కా సమాచారంతో, అంకెలతో తన వాదన వినిపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడిగా ప్రజల ముందు నిలబెట్టారు.దాదాపు రెండు గంటలపాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ అనేక అంశాలపై మాట్లాడారు. స్థూలంగా వీటిని నాలుగు విడతలుగా చెప్పవచ్చు కానీ.. అన్నింటినీ ఒకేసారి విడమరచి చెప్పడం ద్వారా ఆయన ప్రజలపై ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా చేసిన దావోస్ యాత్ర.. తరువాతి పరిణామాలు, ఆ టూర్కు ఎల్లోమీడియా ఇచ్చిన బిల్డప్ వంటి అంశాలన్నింటినీ ఈనాడు పత్రిక పాత క్లిప్పింగ్స్ సాయంతోనే వివరించిన తీరు ఆసక్తికరం. ఆనాటి ఈనాడు కథనాలు చూస్తే.. ఏపీకి పరిశ్రమలు వెల్లువలా వచ్చేస్తున్న భ్రమ కలుగుతుంది. వీటిపై వైఎస్ జగన్ వివరిస్తూ ‘2016లో చంద్రబాబు దావోస్ సమ్మిట్కు వెళ్లి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ప్రముఖ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఏపీకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అది రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. ఆ తర్వాత చంద్రబాబు మూడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. అయినా ఆ కంపెనీ ఏపీకి వచ్చింది లేదు.అలాగే, 2017లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం ఏపీకి రాబోతోందని, 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తోందని, 2019లో జెన్ప్యాక్ట్ సంస్థ ఏర్పాటు కాబోతోంది అని ఎల్లోమీడియా గొంతు చించుకుందని ఆధారసహితంగా వివరించారు. ఇవే కాదు.. అప్పట్లో ఏపీకి ఏకంగా 150 సంస్థలు వచ్చేస్తున్నాయని ఈనాడు దినపత్రిక కథనాన్ని ఇచ్చింది. మరో పెద్ద సంస్థ అలీబాబా, ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ మొదలైనవి ఏపీ వైపు చూస్తున్నాయని ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. దావోస్లో ఎవరైనా పారిశ్రామికవేత్తతో చంద్రబాబు బృందం భేటీ అయితే చాలు.. ఆ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కావడమే తరువాయి అన్న చందంగా ఊదరగొట్టేవారు. కానీ, వాటిలో 90 శాతం కంపెనీలు రానేలేదు. ఒకటి, అరా వచ్చాయేమో చెప్పలేం.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రిక, టీవీలు చూసేవారికి చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ భూతల స్వర్గం కాబోతున్నట్లు అనిపించేలా వార్తలు వస్తుంటాయి. అదే వైఎస్ జగన్ అధికారంలో ఉంటే అంతా చీకటే కనిపిస్తుంది. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వచ్చినా అవేవీ వీరికి కనిపించేవి కావు. ఎల్లో మీడియా సరిగ్గా అదే పద్దతిని చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుత టర్మ్లో కూడా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ల రెడ్బుక్.. పారిశ్రామివేత్తలను భయపెడుతోందని, జిందాల్ అంతటి పెద్ద పారిశ్రామికవేత్తపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే, తరిమేస్తే, ఇక్కడ వేరే వారు పరిశ్రమలు పెట్టాలంటే భయపడరా? అని జగన్ ప్రశ్నించడం కరెక్ట్. ఇక చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడుగా జగన్ అభివర్ణించిన తీరు వింటే ఏపీ ప్రజలను మోసం చేసి కూటమి పాలన చేస్తోందా అన్న భావన కలగక మానదు.వైఎస్ జగన్ తన హయాంలో చేసిన అప్పులు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులను పోల్చి చెప్పారు. తాను పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా, అభివృద్ది కూడా జరిగిందని పోర్టులు, వైద్య కళాశాలలు, గ్రామగ్రామాన ప్రభుత్వ భవనాలు నిర్మించానని జగన్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్లో అనుమతించిన అప్పులు చేశారని, బడ్జెట్తో సంబంధం లేకుండా మరో రూ.50వేల కోట్ల అప్పు తెస్తున్నారని జగన్ విడమరిచి చెప్పారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్ లేదా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్లు ఎవరైనా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడదు. సూటిగా జవాబు ఇవ్వకుండా ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేసి డైవర్షన్ రాజకీయాలు సాగించడమే కూటమి నేతలు తమ వైఖరిగా పెట్టుకున్నారు. కేశవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిధుల మంజూరులో ఆయనది నామమాత్రపు పాత్రే. ఢిల్లీ వెళ్లి నిధులను టాప్ చేసే అవకాశం ఆయనకు లేదు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సూచన మేరకు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి నిధులు సంపాదించుకు వచ్చిన తీరును ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పోల్చితే ఈ ఏడాది కూటమి సర్కార్కు తక్కువ నిధులు అందాయని, అలాగే ఆర్థిక సంఘం నిధులు కూడా సరిగా రావడం లేదని అధికారులు చంద్రబాబుకు వివరించారట. ఇది ఒక కోణం అయితే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నీతి ఆయోగ్ నివేదిక అంటూ తనకు అనుకూలమైన అంకెలను చెప్పి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దానికి జగన్ దిమ్మదిరిగే జవాబు ఇచ్చారు.మొత్తం ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణకు, 2014-19 టర్మ్లో ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులకు పోల్చుకుందామా అని సవాల్ చేశారు. పోనీ ఈ ఏడాది చేసిన అప్పులపై చంద్రబాబు వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్న వేశారు. నిజంగానే చంద్రబాబు గత టర్మ్లో దాదాపు రూ.3.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. చిత్రమేమిటంటే ఆ అప్పులను కూడా కలిపి జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వారు దుష్ప్రచారం చేశారు. ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ దుర్మార్గంగా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించి అప్పుడేమో కాని, ఇప్పుడు మాత్రం అప్పుల్ని రూ.14 లక్షల కోట్లకు తీసుకు వెళ్లేలా ఉన్నారని విమర్శించారు.రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ హయాంలో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్న సంగతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు టైమ్లో అలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు అధ్వాన్నంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు అన్నదానికి ఆన్సర్ దొరకదు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అంటూ ఒక్కో పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎగవేసింది జగన్ వివరించారు. అందుకే బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జగన్ అందుకున్నారు.ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, ఒక్క నెల తప్ప, మిగిలిన ఏ నెలలో అయినా మొదటి రోజు జీతాలు చెల్లించారా అని జగన్ అడిగారు. ఇది ఆశ్చర్యకరమే. అటు స్కీములలో ఒక్కటీ అమలు చేయక, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తీర్చకుండా, జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తయారైందో అర్థం కాదు. జనం సంగతి పక్కనపెట్టి, టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ద వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల లక్షల ఉద్యోగాలు తొలగించారని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం షాపులలో సుమారు 18వేల మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరికి ఉద్యోగాలు పోయాయి.రెండున్నర లక్షల మంది వలంటీర్లకు పది వేల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్లో పీహెచ్డీ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని వైఎస్ జగన్ స్పష్టంగా వివరించగలిగారు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP: నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ కార్యకర్త అమానుషం.. దివ్యాంగురాలిపై అఘాయిత్యం
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెను బెదిరించి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పలాస మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలి(20)పై కన్నేసిన భాస్కరరావు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది ఆమె.ఇక, తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . అదివారం అర్ధరాత్రి వరకు 84,536మంది స్వామిని దర్శించుకున్నారు.25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఎవరీ కిరణ్ రాయల్?
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్వారు.. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటి వెలుగులోకి.. కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.మాయమాటలతో మహిళలకు వల!తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది. రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది. నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.సస్పెన్షన్కు రంగం సిద్ధం! సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు స్పష్టం చేశారు.ఎవరీ కిరణ్? కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్కల్యాణ్కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.దర్శన టికెట్లలో అవినీతి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం. ‘గో బ్యాక్ ఆరణి అంటూ’.. జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్కల్యాణ్కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ను సైతం బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్కళ్యాణ్గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ.. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్ఫోన్లకు ఈ ఆడియోను రింగ్టోన్లుగా పెట్టేసుకున్నారు.ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. -
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్కు రెండువైపులా సర్వీస్రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. కూలీల దుర్మరణం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముప్పాళ్ల: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్యంత బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
బూడిదలో కాసుల వేట
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చో లేదోగానీ బూడిద నుంచి మాత్రం మన ‘పచ్చ’నేతలు కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు చొప్పున ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ నుంచి హైదరాబాద్కు సాగుతున్న బూడిద దోపిడీ(illegal ash trade) కథాకమామిషు ఏమిటంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెలరేగిపోతున్నారు.ప్రణాళిక ప్రకారం పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ఇతరుల స్టాక్ పాయింట్లు మూసివేయించి తన కనుసన్నల్లోనే స్టాక్యార్డు నడుపుతున్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి ఉచితంగా లోడింగ్ చేసిన ఫ్లైయాష్ ను ఈ స్టాక్ పాయింట్ ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. బూడిద వ్యాపారులు ఎవరైనా తమ స్టాక్ పాయింట్కే తోలాలని.. ఇతర ప్రాంతాల లారీలు తమవద్దే లోడింగ్ చేసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. – సాక్షి ప్రతినిధి, విజయవాడతెలంగాణకు అక్రమ రవాణా..ఎన్టీటీపీఎస్ విద్యుదుత్పత్తి ద్వారా వెలువుడే ఫ్లైయాష్ను ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు, రోడ్ల నిర్మాణం, ప్లైఓవర్ నిర్మాణాలు, భవన నిర్మాణాలకు వినియోగించాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థలకు కావల్సి వస్తే ముందుగా ఎన్టీటీపీఎస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలి. అనుమతి పొందిన వారికే చెరువులో లోడింగ్ చేయాలి. పైగా.. బూడిద లోడింగ్పై నామమాత్రపు ధర వసూలుచేయాలని ఏపీ జెన్కో పెద్దలు గతంలో ఆదేశాలిచ్చారు. కానీ, ఇవి అమలుకాకుండా సదరు ప్రజాప్రతినిధి అ«ధికారులపై ఒత్తిడి తెచ్చి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందులో అనేకమంది పెద్దలకు భాగస్వామ్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.మా స్టాక్ పాయింట్లేఉండాలి...కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమ బూడిద వ్యాపారంతో ప్రజాప్రతినిధులు చెలరేగిపోతున్నారు. సంపద సృష్టించుకునేందుకు ఫ్లైయాష్ వ్యాపారాన్ని అయుధంగా మలుచుకున్నారు. తమవి తప్ప ఇతరుల బూడిద స్టాక్ పాయింట్లు ఉండకూదని అధికారులకు హుకుం జారీచేశారు. మూతపడిన స్టోన్ క్రషర్లు, సడక్ రోడ్డు, కొండ ప్రాంతాల్లో చిన్నచితక ఫ్లైయాష్ నిల్వలు మూసివేయాలని సదరు ప్రజాప్రతినిధి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు.దీంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి కనిపించిన స్టాక్ పాయింట్లలో జేసీబీలు పెట్టి వారి లారీలతో బూడిదను బయటకు తరలించి స్వామిభక్తిని చాటుకున్నారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ స్టాక్ పాయింట్లు పెట్టొద్దని గట్టిగా హెచ్చరించి వ్యక్తిగతంగా హాజరుకావాలని వాటి నిర్వాహకులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. బైండోవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకూ గురిచేశారు. దీంతో.. తన స్టాక్ పాయింట్ మూసివేయించి తనపైనే బైండవర్ కేసు పెట్టారని.. మూలపాడులో నడుస్తున్న స్టాక్పాయింట్పై కూడా చర్యలు తీసుకోవాలని బైండోవర్ అయిన ఓ వ్యక్తి ఇటీవల తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశాడు. రోజుకు 300 లారీలు.. ఏటా రూ 64.80 కోట్ల ఆదాయం.. ఇక మండలంలోని మూలపాడు గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన పాత స్టోన్ క్రషర్ స్థలంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఓ స్టాక్పాయింట్ నడుస్తోంది. ఫ్లైయాష్ చెరువులో ఉచితంగా లోడింగ్ జరిగిన లారీలు చాలావరకు ప్రజాప్రతినిధి స్టాక్ పాయింట్కు చేరుతున్నాయి. అందుకుగాను 20–30 టన్నుల లారీకి రూ.4 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. కొన్ని లారీలు సొంతంగా టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధే ఏర్పాటుచేసుకున్నారు.ఈ స్టాక్యార్డ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీసైజు లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఒక్కో లారీకి టన్నుకు రూ.360 చొప్పున 30 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ఒక లారీకి రూ.10,800 వసూలుచేస్తున్నారు. వీరికి టన్నుకు రూ.200 చొప్పున లారీకి రూ.6,000లు మిగులుతోంది. ఈ లెక్కన రోజుకు 300 లారీలకు సుమారు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు.. ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు. గ్రామాలకు కాలుష్యం కాటు.. ఇదిలా ఉంటే.. గ్రామాల సమీపంలో జాతీయ రహదారి పక్కన ఫ్లైయాష్ లోడింగ్ అన్లోడింగ్తో తీవ్ర వాయుకాలుష్యం వెలువడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అ«ధికారులను, టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కోరుతున్నప్పటికీ చర్యలు శూన్యం. మొక్కుబడిగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. -
రైతు బజార్లలో సబ్జి కూలర్లు
కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగాయలతోపాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్ లేదా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. – సాక్షి, అమరావతిమూడు మోడల్స్లో సబ్జి కూలర్లుఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసింది.వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.కుప్పంలో 50 మంది రైతులకు...కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్ ఆర్గజనైషన్స్(వీవో) భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. -
నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా: కిరణ్రాయల్
నీ పిల్లల కాళ్లు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన బాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరెంతో మంది కిరణ్రాయల్ బాధితులు బయటకొస్తారు మీడియాతో బాధితురాలు లక్ష్మి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది.తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కిరణ్రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.పత్రికలో రాయలేని భాషలో ఆ మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్కళ్యాణ్ న్యాయం చేయాలి: బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని చెప్పారు. కాగా, కిరణ్రాయల్పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలి.. ఇదిలా ఉండగా.. కామాంధుడు కిరణ్రాయల్ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతాయాదవ్, మధుబాల, విజయరాయల్, దుర్గా, రాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించండి : పవన్కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్రాయల్పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించారు. అతని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్రాయల్పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదుఅయినా పట్టించుకోని పోలీసులు తిరుపతి క్రైం: కిరణ్రాయల్పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్గా మారింది. లక్ష్మి భర్త బృందకుమార్రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్రెడ్డికి కిరణ్రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నా వెనుక పవన్కళ్యాణ్ ఉన్నాడు.. ‘నా ఆరి్థక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లలను చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారు నగలను, డబ్బులను తిరిగి ఇచ్చేస్తా..’ అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్రాయల్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం రూ.పదకొండు లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రూ.కోటీ ముప్పై రెండు లక్షలు, 300 గ్రాముల బంగారు నగలను తీసుకుని.. ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే ‘నిన్ను, నీ బిడ్డలను నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా’ అంటూ బెదిరించే వాడని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెనుక పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద వాళ్లున్నారని బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని ఆధారాలనూ సైతం పోలీసులకు అందించారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
రెడ్బుక్ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్
సాక్షి, అమరావతి: ⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం ⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి ⇒ సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు ⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. ఎందుకంటే.. అధికారులపై రెడ్బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్లోనో లేదంటే సస్పెన్షన్లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. ‘వెయిటింగ్’లో పెట్టు...‘వీఆర్’లో ఉంచూ వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్లోనే ఉంచింది. పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్ డీఎస్పీ ఉన్నారు. – ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సీఐలను ‘వీఆర్’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్లో, వీఆర్లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది. -
ముందు చూపే లేదు డబ్బులొద్దంట!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ముందుచూపు కరువైంది. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని డప్పు కొట్టీ కొట్టీ.. అలవిగాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నాలుక తిరగేస్తోంది. సరిపడా డబ్బుల్లేనందున హామీలు అమలు చేయలేమని సిగ్గు విడిచి చెబుతోంది. కేంద్ర పథకాల అమలు కోసం వచ్చే నిధులనూ వదులుకుంటోంది. ఎందుకంటే ఆ పథకాలు నిరాటంకంగా కొనసాగితే గత సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందన్న కసే కారణంసాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని స్పష్టమైంది. కేంద్ర ప్రాయో జిత పథకాల కింద నిధులు రాబట్టడంలో విఫలమవ్వ డమే ఇందుకు నిదర్శనం. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన పథకాలను నిలుపుదల చేయాలన్న కసే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ వినియోగ పత్రాలను పంపించినట్లయితే ఆయా పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేసేది.వినియోగ పత్రాలు పంపక పోవడంతో జాతీయ హెల్త్ మిషన్, పీఎంఏవై, గ్రామీణ సడక్ యోజన, మధ్యాహ్న భోజన పథకం తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులు అందలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరు నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి కేవలం రూ.5,524.48 కోట్లు విడుదలవ్వగా, గత ఆర్థిక ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా రూ.14,669.63 కోట్లు వచ్చాయి.కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధుల రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందడం గమనార్హం. పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా రాష్ట్రానికి కేంద్ర నిధులు వచ్చాయి. తెలంగాణకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.12,281.60 కోట్లు వచ్చాయి. ప్రతిపాదనలు పంపనందునే.. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపక పోవడంతోనే మిగతా రాష్ట్రాల కన్నా అతి తక్కువగా నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలుపుతాయని, అనంతరమే నిధులు వస్తాయని అర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం కేంద్ర పథకాల నుంచి నిధులు తెచ్చుకోవడంపై దృష్టి సారించకుండా ఇన్ని రోజులు గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తోంది.గత ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి కోసం చేపట్టిన మన బడి నాడు–నేడు, మౌలిక సదుపాయాల కల్పన పనులను ఈ ప్రభుత్వం నిలుపుదల చేసిందని, దీంతో ఆయా పథకాలకు కేంద్రం నుంచి నిధులు రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బిహార్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల కన్నా అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదలయ్యాయి.ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను మళ్లించేసిందంటూ కూట మి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రూ.2,51,294.84 కోట్లు విడుదలైతే ఇందులో ఏపీకి వచ్చింది కేవలం రూ.5,524.48 కోట్లేనని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
శీతల దేశాల నేస్తం.. మార్కాపురం పలక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు.. పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో పోటీ.. కరోనాతో డీలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి -
డొక్కా.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్(YS Jaganmohan Reddy), పార్టీ నేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు(Kommuri Kanakarao) చెప్పారు. డొక్కా నోరు అదుపులో పెట్టుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటున్న డొక్కా, వెన్నుపోట్లు గురించి.. అది కూడా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో ఉండి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డొక్కాను రాజకీయ వ్యభిచారి అని అనాలని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మెప్పుకోసం డొక్కా చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మంత్రిగా పనిచేసింది ఈ వ్యక్తేనా అని సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబుకి కూడా డొక్కా వ్యవహారం తెలుసు కాబట్టే ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని చెప్పారు.జగన్ అన్నం పెట్టడంలేదని విజయమ్మ ఏమైనా డొక్కాకు ఫోన్ చేసి చెప్పారా అని మండిపడ్డారు. వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత కార్డును అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపాటేనని చెప్పారు. ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని తెలిపారు. వైఎస్ జగన్ 5 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని, 15 మంది ఎస్సీలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారని తెలిపారు. డొక్కాకు చేతనైతే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ప్రశ్నించాలని కనకారావు చెప్పారు. -
జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు
సాక్షి, అమరావతి: తాగు నీటి(Drinking water) కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దూరంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకొంటుంటారు. అవీ ఎండితే నీరే దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్ధం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy).. నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజల నీటి వెతలను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్సభకు తెలిపింది.కేంద్ర జల శక్తి శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ లోక్సభకు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్ల ఉన్నాయి. 2019 ఆగస్టు 15 వరకు.. అంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభుత్వాలు తాగు నీటి కొళాయిలు ఏర్పాటు చేశాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36 వేల ఇళ్లకే కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వంఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షత మంచి నీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 11,400 కోట్ల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదేమని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది.