Andhra Pradesh
-
టీడీపీ నేతల వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ‘ ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు, పత్తిపాటి రామారావు వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్ల కు చెందిన టిడిపి నాయకులు ఖలీల్ రామారావు పత్తిపాటి రామారావు వంశీలు పోలీసులు వేధిస్తున్నారు. డీఎస్సీ ఆఫీసుకు పిలిచి మరిచి వేధించారు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మవాడివా.. కమ్మవాడివైతే వైఎస్సార్సీపీలో ఎలా ఉంటావని దూషించారు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్.. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో ఆయన పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్కు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడ: శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.విద్యార్థుల పరిస్థితి ఏంటి?శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు. -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
ఆంధ్రప్రదేశ్లో పచ్చ మాఫియా అరాచకాలు... యథేచ్ఛగా డ్రగ్స్ దందా... పేకాట క్లబ్బులతో భారీగా దోపిడీ
-
కోర్టు కేసులా.. అయితే నాకేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అండదండలతో సూర్యనారాయణ ఇష్టానుసారం చెలరేగిపోతుండగా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదేనని ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో మూడు కేసులున్నా లెక్క చేయకుండా సూర్యనారాయణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించేసుకోవడం గమనార్హం.ఏడాది నుంచి రగడప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదంటే తమదని ఏడాది నుంచి సూర్యనారాయణ, ఆస్కార్రావు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. సూర్యనారాయణ గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తను మరిపించేలా కూటమి గెలుపు కోసం పని చేశారు. ఏడాది కిందట ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సూర్యనారాయణ, ఆస్కార్రావు మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్కార్రావును సంఘం నుంచి తొలగిస్తున్నట్లు కొద్ది నెలల కిందట సూర్యనారాయణ ప్రకటించారు. తనను తొలగించే అధికారం సూర్యనారాయణకు లేదని, అసలు ఆ సంఘం తమదేనని ఆస్కార్రావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నెల 3వ తేదీతో సంఘం రాష్ట్ర కార్యవర్గం గడువు ముగిసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే కొత్తగా ఎన్నికలు పెట్టడానికి సూర్యనారాయణ సన్నాహాలు మొదలుపెట్టారు.సమావేశం ముసుగులో ఎన్నికలు సూర్యనారాయణ వర్గానికి మండల స్థాయిలో కమిటీల నిర్మాణం లేదు. అందువల్ల ఆయన ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగులను సమీకరించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని ప్రచారం చేశారు. తన పలుకుబడి ఉపయోగించి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా గురువారం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇస్తూ ప్రభుత్వంతో ఉత్త్వులు జారీ చేయించారు. తద్వారా ఉద్యోగులను రప్పించి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.దీనిపై ఆస్కార్రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ముసుగులో సూర్యనారాయణ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నోటిఫికేషన్ లేకుండా, కింది స్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుతున్నారని, దాన్ని ఆపాలని హైకోర్టులో ఒకటి, మచిలీపట్నం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం కోర్టులో దీనిపై బుధవారం విచారణ జరిగి, గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ఉదయమే సూర్యనారాయణ కోర్టులను కూడా లెక్క చేయకుండా విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికలు నిర్వహించి తాను అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తల హాజరు?ఈ సమావేశం కోసం ప్రతి జిల్లాకు ఐదు బస్సులు పెట్టి ఉద్యోగులను రప్పించారు. కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సులు ఎక్కించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లోనూ ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్లను బదిలీలకు అనుమతించవద్దని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వులివ్వడం విశేషం. ఇన్ని ఆరోపణలున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం సూర్యనారాయణకు మద్దతిచ్చి ఆయన అక్రమంగా నిర్వహించిన ఎన్నికలకు సహకరించడంపై ఉద్యోగవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
గంజాయి అక్రమ కేసు పెట్టి.. ప్రాణం తీసిన పోలీసులు
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగా ల భర్తీకి నిర్వహించే డీఎస్సీ–2025 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 44 దశల్లో ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుంది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.సీబీటీ విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు, రాష్ట్రం వెలుపల హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో 87.8 శాతం మందికి వారి జిల్లాల్లోనే కేంద్రాలు కేటాయించారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, ఏమైనా ఫిర్యాదులుంటే 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286 9963069286, 7013837359 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. -
లోకేశ్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు
సాక్షి, అమరావతి, మంగళగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పులతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు.లోకేశ్ అసమర్థత వల్లే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హడావుడికి విద్యార్థులు బలయ్యారని, లోకేశ్కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చిన విద్యా శాఖ, అందులో జరిగిన తప్పులకు టీచర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధర్నాలో వారు ఏమన్నారంటే..విద్యా శాఖను భ్రష్టు పట్టించారు..‘‘పదో తరగతి పరీక్షలను సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ ఘోరంగా ఫెయిలైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు నిర్వహించే శాఖలోనే పనితీరు ఇంత ఘోరంగా ఉందంటే.. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్కదాంట్లో కేవలం 5, 10, 20 మార్కులతో ఫెయిలవడం, రీకౌంటింగ్ లో 90 మార్కులు రావడం చూస్తే విద్యాశాఖ ఎంత భ్రష్టుపట్టిందో అర్థమవుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 66,363 మంది రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. రికార్డుల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలు వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఘనతగా చెప్పుకోవాలని భావించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది. సంఖ్యను పెంచకుండా ఉన్నవారితోనే మూల్యాంకనం చేయించడంతో టీచర్లు ఒత్తిడికి లోనయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాలో గంగిరెడ్డి మోక్షితకు సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వేశారు. రీకౌంటింగ్ లో 84 మార్కులొచ్చాయి. బాపట్లలో తేజశ్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతంకి పైగా మార్కులు వస్తే సాంఘిక శాస్త్రంలో 26 మార్కులతో ఫెయిలైంది. రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. రాష్ట్ర చరిత్రలో రీవెరిఫికేషన్ తర్వాత కేవలం 5, 10 మార్కులు పెరిగేవి. కానీ, ఇంత దారుణంగా 70 పైగా మార్కులు పెరిగిన సందర్భాలు లేవు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసమర్థతను తెలియజేస్తుంది.విద్యార్థుల డబ్బులు తిరిగి చెల్లించాలిచాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేక, రుసుములు భరించలేక రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. లేదంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉండేవేమో? రాజమహేంద్రవరంలో మణికంఠకు మొత్తం 505 మార్కులు రాగా.. హిందీలో 52 మాత్రమే వచ్చాయి. రీవెరిఫికేషన్ లో కొన్ని జవాబులను కొట్టేసి ఉన్నట్టు వెల్లడైంది. దీనిపై ప్రశ్నిస్తే అవి సరైన సమాధానాలేనని.. కానీ, విద్యార్థే కొట్టేశాడని చెబుతున్నారు. కష్టపడి రాసిన విద్యార్థి ఎందుకు కొట్టేస్తాడు? మంత్రి లోకేశ్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి.రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ విద్యా శాఖ మీద పెడితే బాగుంటుంది. విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కు అవకాశం కల్పించాలి. ఇప్పటికే రుసుములు చెల్లించినవారి డబ్బులు తిరిగివ్వాలి. లోకేశ్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు టీచర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు’’ అని పానుగంటి చైతన్య, రవిచంద్ర దుయ్యబట్టారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, నాయకులు కోమల్ సాయి, గోపీచంద్, ఐ. శ్రీనివాస్, ఎస్కే ఆర్మాన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..విద్యా భవన్ కు బైక్ ర్యాలీగా వస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పరీక్షల విభాగం అధికారి కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి విద్యార్థి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. -
దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు
అభం శుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ వినీ ఎరుగని రీతిలో దారుణంగా కాటేశాయి.. స్కూలుకెళ్లే పిల్లలను సైతం వదిలి పెట్టని దారుణ రోజులు దాపురించాయి.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది వంతు లేసుకుని.. వీడియో తీసి బెదిరిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది.. అధికారం అండ ఉండగా అడిగే వారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం విస్తుగొలుపుతోంది.. తండ్రి లేని పిల్ల.. మతి స్థిమితం లేని తల్లి.. పైగా ఎస్సీ బాలిక.. ఏం చేస్తుందిలే అన్న కండ కావరం, అధికార మదంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అద్దం పడుతోంది.. పాపం.. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది.. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదేపదే బెదిరింపులతో చంపేశారు.. దుప్పటి పంచాయితీలు, రాయ‘బేరాలు’తో వెల కట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టం.సాక్షి, టాస్క్ఫోర్స్ : అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు. వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాధిత బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు. ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాల్లో తప్పెట కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థినిపై తొలుత కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ‘నీ వీడియో ఒకటి మా వద్ద ఉంది’ అంటూ బెదిరిస్తూ.. మరికొందరు లొంగదీసుకున్నారు. గత ఆరు నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆటబొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయితీ చేసి మూసి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఇబ్బందులు తప్పవని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ.. ఆర్నెల్ల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితుల్లో బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హరిజన సురేశ్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితుల్లో కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు.బాధిత కుటుంబం అదృశ్యంగురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా.. బాధిత బాలిక ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలే వారిని ఎక్కడికో తరలించారని గ్రామంలో చర్చ జరుగుతోంది. అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపు?సదరు బాలిక అబార్షన్ చేయించుకుని.. ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆస్పత్రికి తరలించి, అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పన్నినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. హరియాన్ చెరువుకు చెందిన రౌడీషీటర్ నాగరాజు కనుసన్నల్లో బాధిత బాలికను దాచినట్లు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపు ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.ఎవరూ ఫిర్యాదు చేయలేదువిషయం నా దృష్టికి రాగానే గురువారం మధ్యాహ్నం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశాం. అయితే ఎవరూ వివరాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బాధిత బాలిక కుటుంబం నివసిస్తోన్న ఇంటికి తాళం వేసి ఉంది. వారి బంధువుల ఇళ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదు వస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వెనుక ఎవరు ఉన్నా చట్టానికి అతీతులు కారు.– శ్రీధర్, రామగిరి సీఐహోం మంత్రి సమాధానం చెప్పాలి దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళిత, గిరిజనులపై రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనిత ఇందుకు సమాధానం చెప్పాలి.– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుమహిళా సమాజం సిగ్గు పడేలా.. రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే. పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడుగుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం? శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే. ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.– తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
పడగ విప్పిన పచ్చ మాఫియా
ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం పచ్చజెండా ఊపుతోంది.మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేసిన టీడీపీ కూటమి సర్కారు.. బాలికలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల పట్ల చోద్యం చూస్తోంది.కూటమి ఎమ్మెల్యేలతో ఊరూరా పేకాట క్లబ్బుల దందాకు తెరతీసిన బాబు ప్రభుత్వం... పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులు ఆత్మహత్యకు పాల్పడేంత తీవ్రస్థాయిలో అక్రమ కేసులతో వేధిస్తోంది....గురువారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మూడు సంఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని స్పష్టం చేశాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చిచెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ముకాస్తోందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పేకాట క్లబ్బుల దందాతో ఎందరో జీవితాలను రోడ్డు పాల్జేస్తోందని నిర్ధారించాయి. అరాచక, అసాంఘిక కార్యక్రమాలతో యావత్ రాష్ట్రం బెంబేలెత్తుతోందని కుండబద్దలు కొట్టాయి.సాక్షి, అమరావతి; ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగుచూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా అప్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ను సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్నచిన్న ప్యాకెట్లుగా వెండార్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండార్స్ గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. విద్యాసంస్థలే టార్గెట్డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండార్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిసు్తన్నారు. విజయవాడలోని ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం.డ్రగ్స్పై చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారురాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. ఏపీ–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. ఇందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలతో అక్రమ రవాణాను అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులు కూటమి రాకతో..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది.రాష్ట్రంలో ఏరులై పారుతున్నమద్యంఇంటింటికీ డెలివరీ చేస్తున్న బెల్ట్ షాప్లుపోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్న వైనంపైనుంచి కిందివరకు చేతులు మారుతున్న లంచాలుకూటమి ప్రభుత్వం పాలనలో డ్రగ్స్ దందాకు తోడు మద్యం ఏరులై పారుతోంది. వసూ్తనే ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తెచ్చిన చంద్రబాబు సర్కారు.. పోలీసులను పెట్టించి మరీ దగ్గరుండి అమ్మకాలు సాగిస్తోంది. బార్లకు తోడు పర్మిట్ రూమ్లనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు బెల్టు షాపులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఒక్కో ఊరిలో రెండు, మూడు బెల్టుషాపులు వెలిశాయి. ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నాయి. ఇక మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు–ఘోరాలకు అంతే ఉండడం లేదు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ అయినవారిపైనే దాడులకు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కాగా, మద్యం దందాలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు భారీఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయి.అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంమహిళలు, బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు, హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. చంబల్ లోయను తలపిస్తున్న రీతిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతుండడంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకూ భద్రత కరువుచంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా సాగుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట... ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు ఏమాత్రం భద్రత లేకపోవడం తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దారుణపర్వంలో మరో దుర్ఘటన అనంతపురం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 13 మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటకు పొక్కింది. నిందితులు అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.బెజవాడలో డ్రగ్స్ రాకెట్పటమట (విజయవాడ తూర్పు): డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా కనిపించారు. వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, మరో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనాల డిక్కీల్లో ఉన్న తెలుపు రంగు క్రిస్టల్ ఎండీఎంఏ (మిథలిన్ డయాక్సి మిథపేటావిున్) డ్రగ్ రెండు ప్యాకెట్లు, ఊదా రంగు క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్, ఎరుపు రంగు ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్ లభించాయి. సుమారు 33 గ్రాములు గల ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని తీసుకొస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ రామాలయం వీధికి చెందిన తిరుమలశెట్టి జీవన్కుమార్ (29), పటమట ఫన్టైం క్లబ్ రోడ్డులో నివాసం ఉండే బొంతు నితీష్కుమార్ (28), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు ఇందిరానగర్–1కు చెందిన తులిమిల్లి తరుణ్ప్రసాద్(20)ను అరెస్ట్ చేశారు.ఢిల్లీ నుంచి నూజివీడుకు..ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ను ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ట్రాక్ఆన్, డీటీడీసీ కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్కు సరఫరా చేశారని డీసీపీ చెప్పారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు విజయవాడకు తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు జీవన్కుమార్, మనోహర్ ఇంటర్ క్లాస్మేట్స్. వీరికి యూపీలో ఉంటున్న మనోహర్కుమార్ మేనమామ ద్వారా ఢిల్లీకి చెందిన రింకూ పరిచయమయ్యారని డీసీపీ వివరించారు. విజయవాడ సరఫరా అయిన డ్రగ్స్ను నగర శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తారని చెప్పారు. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన రింకూ, నూజివీడుకు చెందిన మనోహర్కుమార్, యూపీలో ఉండే మనోహర్ మేనమామ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 2 స్కూటర్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పటమట సీఐ పవన్కిషోర్, ఎస్సై దుర్గాదేవీలను డీసీపీ అభినందించారు. డీసీపీ వెంట ఏసీపీ దామోదర్ ఉన్నారు.ఉసురు తీస్తున్న రెడ్బుక్ వేధింపులుపేకాట దందా కూటమి ఎమ్మెల్యేలది.. బలయ్యేది ప్రజలుఆత్మహత్య చేసుకునేంతగా తీవ్ర స్థాయి వేధింపులుచంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు అధికారిక గూండాల మాదిరిగా బరితెగిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేలా అక్రమ కేసులతో వేధించడం దీనికి నిదర్శనం. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పుప్పగిరిదారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో పేకాట క్లబ్బులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధించింది. కానీ, పేకాట మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసింది. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చింది. కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జూదరులు వచ్చి పేకాడేలా అతిపెద్ద కాసినోలు నడుపుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎంపిక చేసిన అపార్టుమెంట్లు, రిసార్టులు, లాడ్జిలు, మూసివేసిన సినిమా థియేటర్లు... ఇలా అన్నీ కూడా పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ కూటమి ఎమ్మెల్యేలు భారీగా కమీషన్లు తీసుకుంటూ రోజుకు రూ.వందల కోట్లలో పేకాట దందా సాగిస్తున్నారు. కానీ, అసలు పేకాటతో నిమిత్తం లేని అమాయకులను ఇరికించి.. ఆత్మహత్యకు పాల్పడేలా అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. ఇదీ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం. -
‘ఈవీ’లకు ఫుల్ పవర్
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.2,000 కోట్లతో దేశ వ్యాప్తంగా 72 వేల ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030కి సంప్రదాయ వాహనాల స్థానంలో 30% ఈవీ కార్లు, 80 %ఈవీ టూ వీలర్లు, 70% ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 8 కోట్ల విద్యుత్ వాహనాలు వచ్చే ఐదేళ్లలో రోడ్లమీద నడవాలని నిర్దేశించుకుంది. తద్వారా 2030కి 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ఈవీల వినియోగం పెరగాలి. అందుకోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.ఆలోచించి కొంటున్నారు..2024–25లో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈ విద్యుత్ వాహనాల్లో సగం (60%)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24%గా ఉంది. దాదాపు లక్ష విద్యుత్ కార్లను వినియోగదారులు గతేడాది కొనుగోలు చేశారు.ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు మాత్రం 3% తగ్గాయి. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వాటికి చార్జింగ్ పెట్టడమనేది ప్రధాన సమస్యగా మారడంతో ఎక్కువ మంది సంశయిస్తున్నారు. కొనాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సమస్యను అధిగ విుంచాలంటే కేంద్రం చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలి.ప్రపంచ స్థాయికి చేరలేదు ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో ఇంకా ఆ స్థాయిలో ఈవీల వినియోగం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. దేశంలో ప్రస్తుతం 12,146 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2030కి దేశ వ్యాప్తంగా 39 లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరం. భారత్లో ప్రతి 135 ఈవీలకు ఒక పబ్లిక్ చార్జర్ మాత్రమే ఏర్పాటైంది. ఇండియా ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ మార్కెట్ గడిచిన ఐదేళ్లలో రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించింది. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను, ప్రోత్సాహకాలను పెంచడం, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ సమస్యను అధిగవిుంచవచ్చని గుర్తించిన కేంద్రం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు కేటాయించింది. బాటలు వేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీలో ప్రస్తుతం 1,23,396 విద్యుత్ వాహనాలున్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 7,82,660కు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలను ప్రత్యేక పాలసీగా రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది.అందుకు అవసరమైన 4,000 స్థలాలు అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖ, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల(పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ తీసుకోనవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కేంద్రం అదే బాటలో నడుస్తోంది. దేశవ్యాప్తంగా 50 జాతీయ రహదారుల వెంబడి, టోల్ ప్లాజాలు,విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రజా రవాణా ఉండే ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు పెట్టనుంది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది. -
ఇలాగైతే.. మాకు చావే గతి
సాక్షి, అమరావతి: “ఏడాదిగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మాకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దగ్గర ఉన్న బస్సులు తగులబెట్టి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతర లేదు’ అని వాపోతున్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడాదిలో ఒక్క రూపాయైనా ఇవ్వలేదు ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద వీరంతా బస్సులు కొనుగోలు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులుగా నడుపుతున్నారు. 300 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ యువత గత ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిలిపివేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన ఎస్సీలకు సుమారు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద లబ్ధి పొందారన్న ఏకైక కారణంతో బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు లోకేశ్, టీజీ వెంకటేష్తోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్లను అనేకసార్లు కలిసి తమ కష్టాలు మొరపెట్టుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వాపోయారు. కనీసం రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులతోనైనా మాట్లాడండి అని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు. ఏడాది కావస్తున్నా బకాయిలతో పాటు ఈ ఏడాది ప్రోత్సాహకాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క అద్దె బస్సు నుంచి ప్రభుత్వానికి అన్ని ఖర్చులు పోనూ ప్రతినెలా రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని బస్సు యజమానులు చెబుతున్నారు. ప్రతినెలా 300 అద్దె బస్సుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లకుపైగా ఆదాయాన్ని బడుగు పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే లోగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని.. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేసి సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమంటూ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డబ్బులు లేనప్పుడు హామీ ఎందుకిచ్చారు? చదువుకున్నా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంటర్ప్రెన్యూర్గా తయారవుదామన్న ఆశతో వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద బస్సు కొనుగోలు చేసి నెల్లూరు–పామూరు మధ్య తిప్పుతున్నాను. ఈ పథకం కింద ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడంతో నాలాగే అనేకమంది ఎస్సీ, ఎస్టీ యువకులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. రాయితీలు ఇప్పుడు ఇవ్వలేం అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇందుకు ఇచ్చారు. – హరి, నెల్లూరు–పామూరు అద్దె బస్సు ఓనర్ మా గోడు వినేవారేరి? బడుగులు గోడు వినిపించుకునే అధికారులే కనిపించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ వంటి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వస్తున్న డబ్బులు మా ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న కంపెనీలకు వచ్చేసరికి ఎందుకు ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాం. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అధికారులనైతే లెక్కలేనన్నిసార్లు కలిశాం. అయినా ఉపయోగం లేదు. బ్యాంకు వాళ్లు పెడుతున్న ఇబ్బందులతో మేం బస్సులు నడపలేకపోతున్నాం. తక్షణం ప్రోత్సాహకాలు ఇప్పించండి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – రాపాక మహేష్, అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
కానిస్టేబుల్పై ‘అధికార’ జులుం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటులపైనా అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాలివీ.. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్బాషా 3వ తేదీ రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయికుమార్ బైక్పై అటుగా వెళ్తున్నాడు. కానిస్టేబుల్ అతన్ని ఆపి తనిఖీ చేయగా.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్నంటూ రెచ్చి పోయి నానా హంగామా సృష్టించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో డ్రైవర్కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 145గా చూపించడంతో అతని సంతకం తీసుకుని ఎస్ఐ ఫైన్ చలనా రాసి పంపేశారని తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తనపై దాడిచేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్ మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో.. బుధవారం ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అన్వర్ బాషాను శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే కానిస్టేబుల్పై డ్రైవర్ సాయికుమార్ దాడిచేశాడని, సీఐ ఆ దాడిని అడ్డుకున్నారని సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, కానిస్టేబుల్పై దాడి అవాస్తవమంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కానీ, కానిస్టేబుల్ అన్వర్బాషా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తిలో పోలీసు కానిస్టేబుల్ అన్వర్బాషాపై దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్పై షేక్ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. కారు హారన్ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. ముగ్గురినీ కారులో చిట్వేల్ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్ చౌదరి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్యఅకారణంగా కొట్టారు మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు. – షేక్ రసూల్పోలీస్ స్టేషన్లోనూ రెచ్చిపోయారుచిట్వేల్ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్లో కూడా అలాగే రెచ్చిపోయాడు. – కె పెంచలయ్య -
గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. -
అయినవారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెబుతోంది. పలుకుబడి ఉన్నవారికి, ముడుపులిచ్చిన వారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పట్టణాల్లో పనిచేసే సిబ్బందికే మేలుచేసేలా ఉన్నాయని.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న వారు పట్టణాలకు వచ్చే వీల్లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కమిటీల సూచనల మేరకు ‘0’ నుంచి 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీచేస్తున్నారు. ఇందుకోసం శాఖల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ వేసి అందుకనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తారు. కానీ, సాంకేతిక విద్యాశాఖలో మాత్రం అందుకు భిన్నంగా కొందరు కిందిస్థాయి సిబ్బంది సూచనలతో రెండేళ్లు సర్వీసు దాటిన వారిని బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లడంతో వాటిని రద్దుచేశారు. దీంతో.. కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అయితే, ఇవి కూడా అయినవారికి మేలు చేసేలాగే ఉన్నాయని పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు ఇటీవల డైరెక్టరేట్కు వచ్చి నిలదీసినట్లు తెలిసింది. డెప్యుటేషన్లు అడ్డంపెట్టుకుని ఆటలు..ఉద్యోగుల బదిలీల్లో వారు పనిచేస్తున్న ప్రాంతాలను ఫొకల్ (పట్టణం), నాన్–ఫోకల్ (గ్రామీణ/ఏజెన్సీ)గా పేర్కొంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి 3 పాయింట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 4 పాయింట్లు బదిలీల్లో కేటాయిస్తారు. అవసరాన్నిబట్టి పని సర్దుబాటుపైనా, డెప్యుటేషన్ పైనా సిబ్బందిని ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అధికారులు పంపిస్తారు. అయితే, ఈ సర్దుబాటు సాంకేతిక విద్యాశాఖలో విచిత్రంగా జరుగుతోంది. నాన్–ఫోకల్కు బదిలీ అయిన వారిలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి ఫోకల్ ప్రాంతాలకు డెప్యుటేషన్ వేయించుకుంటున్నారు. ఇందుకోసం ఫోకల్లో ఉన్న వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్పై నాన్–ఫోకల్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని కాలేజీల్లో పోస్టులు వచ్చిన వారు ఫోకల్ (పట్టణ) ప్రాంతాల్లోకి వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై వచ్చి పనిచేస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వీరు ఏజెన్సీ పాయింట్లు పొందుతున్నారు. వేతనం పొందే ప్రాంతం ఆధారంగా నిబంధనలు.. ఇక తమను పట్టణ ప్రాంతాల్లో (ఫోకల్) పోస్టింగ్ ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో డెప్యుటేషన్ వేశారని, కొన్నేళ్లుగా తాము అక్కడే పనిచేస్తున్నందున తమను నాన్–ఫోకల్గా గుర్తించాలని ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ, వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా జీతం పొందుతున్న ప్రాంతం ఆధారంగా పాయింట్లు కేటాయించేందుకే డైరెక్టరేట్ నిబంధనలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని, ఇప్పటికే నాన్–ఫోకల్లో డెప్యుటేషన్పై పనిచేస్తున్న తాము బదిలీల్లో మరి కొన్నేళ్లు ఇక్కడే పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా పనిచేస్తున్న ప్రాంతాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.స్కూలు అసిస్టెంట్లకు తప్పనిసరి బదిలీ..మరోవైపు.. ప్రభుత్వ పాఠశాల విద్యను తిరోగమనంలోకి నెట్టేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయ (ఎంపీఎస్ హెచ్ఎం) పోస్టుల్లోకి మరికొందరిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. చట్టానికి, ఉపాధ్యాయ నియామక నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో 3–5 తరగతుల విద్యార్థులకు మెరుగైన బోధన కోసం సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వారిని తొలగించింది. అంతేగాక.. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం స్కూల్ అసిస్టెంట్ల బోధనను రద్దుచేసింది. ఇలా మిగులుగా తేలిన 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను బోధనకు దూరంచేసి ఎంపీఎస్ హెచ్ఎంలుగా నియమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొత్తం 3,781 మంది ఎస్ఏలను ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు. మరో 912 మందిని ఈ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో.. మిగిలిన ఈ పోస్టుల్లో డీఎస్సీ–2025 వారికి 415 పోస్టులు కేటాయించారు. మరో 461 పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమిస్తారు. మిగిలిన 36 పోస్టుల్లో తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.వాస్తవానికి.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను ఎస్జీటీలకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతిపై భర్తీచేస్తారు. కానీ, ఎన్నడూలేని విధంగా సబ్జెక్టు టీచర్లయిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో నియమిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్ధంగాక స్కూల్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.టెక్నికల్గా ఎన్ని విచిత్రాలో..» ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్పురంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2014 నుంచి పూర్తిస్థాయిలో పోస్టుల్లేవు. దీంతో మైదాన ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బందిని డెప్యుటేషన్, వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద బదిలీ చేశారు. కొన్నేళ్లుగా వారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వేతనం మాత్రం పోస్టింగ్ ఇచ్చిన పట్టణ కాలేజీల నుంచి పొందుతున్నారు. దీంతో వీరికి ఫోకల్ కింద ఏడాదికి 3 పాయింట్లే వస్తున్నాయి. » కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ వచి్చన ఒకరు డెప్యుటేషన్పై కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయనకు నాన్–ఫోకల్ కింద ఏడాదికి 4 పాయింట్లు పొంది బదిలీల్లో తిరిగి ఫోకల్కే వెళ్లే అవకాశం ఉంది. » అలాగే, రాయలసీమలోని ఓ ఐటీడీఏ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ పొందిన ఓ ఉద్యోగి కొద్దిరోజులకే రాష్ట్ర కార్యాలయానికి డెప్యుటేషన్ వేయించుకున్నారు. కానీ, ప్రస్తుత బదిలీల్లో ఆయనకు ఏజెన్సీ పాయింట్లు పొంది తిరిగి ఫోకల్ ప్రాంతానికి వెళ్లే ఛాన్స్ తెచ్చుకున్నారు. » మరికొందరు ఉద్యోగులు విజయవాడ ప్రసాదంపాడులోని డైరెక్టరేట్ ఉన్న సమయంలో కొన్నేళ్లు పనిచేశారు. డైరెక్టరేట్ తాడేపల్లికి మారే క్రమంలో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీకి పోస్టింగ్ వేయించుకున్నారు. దీంతో వారి స్టేషన్ మారిందని చెప్పి ప్రస్తుత బదిలీ తమకు వర్తించదని చెబుతున్నారు. ఇలాంటి చిత్రాలెన్నో సాంకేతిక విద్యాశాఖలో జరుగుతున్నాయి. రెండు మూడ్రోజుల్లో బదిలీలు చేపట్టనున్న క్రమంలో వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై నాన్–ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తారా.. లేక పలుకుబడి ఉన్నవారికే ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తారా అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. -
ఈ రేయి వేడైనది..!
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతిఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడిదేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది. కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.పగలూ రాత్రీ ఏకమైపోతాయిగత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది. ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. -
AP: రాష్ట్రంలో చాప కింద నీరులా..'కోవిడ్'
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. యోగా దినోత్సవం నిర్వహణే మీ ముందున్న లక్ష్యమని వైద్య శాఖకు సీఎం అల్టిమేటం జారీ చేయడంతో, ప్రాణాంతక వైరస్ కట్టడిని వైద్య శాఖ తేలికగా తీసుకుంటోంది. దీంతో చాప కింద నీరులా రాష్ట్రంలో వైరస్ వ్యాపించడమే కాకుండా, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వైరస్ సోకిన వ్యక్తుల మరణాలను బయటకు పొక్కనివ్వకుండా వైద్య శాఖ కప్పెడుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. -సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్)/కర్నూలు(హాస్పిటల్)కొన్ని ఘటనలు ఇవీ..1 విజయవాడ జీజీహెచ్లో గురువారం కోవిడ్ సోకిన యువకుడు మరణించగా అధికారులు చడీచప్పుడు లేకుండా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిసింది. 2 ఇదే ఆస్పత్రిలో గడిచిన ఐదారు రోజుల్లో వైరస్ బారిన పడిన ఇద్దరు మహిళలు మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. 3 గత వారంలో విశాఖపట్నంలో వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందాడు. అతని చికిత్సకు సంబంధించిన కేస్ షీట్లో సైతం కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సదరు వ్యక్తి ఇతర అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని వైద్య శాఖ అధికారులు కొట్టిపడేశారు. 4 రెండు రోజుల క్రితం వరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి మెడికల్ కళాశాలలోని మైక్రో బయాలజి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ గురువారం కరోనా నిర్థారణ అయింది. వీరిలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులున్నారు. వారు కేరళ నుంచి వచ్చి నెల్లూరులో వేర్వేరు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. అలాగే నగరంలోని భక్తవత్సలనగర్కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, వెంకటాచలం మండలం అనికేపల్లి, పెదకూరపాడు, గూడూరు ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. 5 కర్నూలు జిల్లాలో మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్ బాధితుల సంఖ్య 7కు చేరింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులకు బుధ, గురు వారాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు. -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
సజ్జల కుటుంబ సభ్యుల భూములపై స్టేటస్ కో కొనసాగించండి
సాక్షి, అమరావతి :వైఎస్సార్ కడప జిల్లా, సీకేదిన్నె మండల పరిధిలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు చెందిన 63.72 ఎకరాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 30 వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ భూమిని అటవీ భూమిగా పేర్కొంటూ స్వాదీనం చేసుకోవాలని కడప కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ, కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీకి ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం గురువారం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్పై గురువారం జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం విచారణ జరిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లకు ఉన్న 201 ఎకరాల భూమిలో 63.72 ఎకరాలు అటవీ భూమి అని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యుల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా, తమ వాదన వినకుండానే కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే పంచనామా కూడా చట్ట విరుద్ధమేనని వివరించారు. పంచనామా కాగితాలపై మాత్రమే జరిగిందని, అధికారులు సర్వే నివేదికను తమకు అందజేయలేదని వాదించారు. ఈ భూముల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భూమి స్వా«దీనం విషయంలో గత విచారణ సమయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించింది. భూమి ప్రభుత్వ స్వా«దీనంలో ఉన్న నేపథ్యంలో, ఆ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
భగ్గుమన్న పొగాకు రైతు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నల్లబర్లీ పొగాకును వారంలోగా జీపీఐ నుంచి కొనకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య హెచ్చరించారు. గుంటూరు విద్యానగర్లోని జీపీఐ పొగాకు రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు కొనకుండా రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు వేయాలని ప్రోత్సహించిన జీపీఐ సంస్థతోపాటు ఇతర పొగాకు కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జీపీఐ సంస్థ రైతుల నుంచి పది లక్షల టన్నుల తెల్లబర్లీ పొగాకు కొంటామని, బాండ్లు ఇచ్చి ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వి.ప్రసాద్, కొల్లా రాజమోహన్, చుండూరు రంగారావు, కంచుమాటి అజయ్కుమార్, రాధాకృష్ణ, వేల్పూరు నరసింహారావు, పచ్చల శివాజీ, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రామారావు, జగన్నాథరావు, హనుమరెడ్డి, వేణుగోపాలరావు, నళినికాంత్ పాల్గొన్నారు.ధర ఇంత అధ్వానమా?» ఒంగోలు, కనిగిరిలో పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు » పనిగట్టుకుని ధర తగ్గించారంటూ నిరసన » ఆందోళనను అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు » వ్యాపారులకు వత్తాసు పలికిన పొగాకు బోర్డు అధికారులు ఒంగోలు సబర్బన్/కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2లో వ్యాపారుల తీరును నిరసిస్తూ బేళ్లను అమ్మేందుకు రైతులు నిరాకరించారు. ఎఫ్–3 రకం పొగాకును రూ.18,500కు కూడా కొనుగోలు చేయక పోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో వేలం కేంద్రానికి వచి్చన ఉలిచి, దశరాజుపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ మద్దతుదారులైన కొందరు వేలం జరగాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. వేలం కేంద్రంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులు పోరాటం చేస్తుంటే.. టీడీపీకి చెందిన కొందరు రైతుల పేరుతో దాన్ని అడ్డుకోవటాన్ని ఒంగోలు మండలంలోని రైతులు తీవ్రంగా ఖండించారు. గిట్టుబాటు ధర వస్తే రైతులంతా బాగు పడతారని, అందుకోసం పోరాటం చేయాల్సిందిపోయి.. ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వేలం కేంద్రం అధికారిణి తులసి టీడీపీ వర్గీయులకు మద్దతుగా మాట్లాడటంతో రైతులు ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఏకంగా 186 బేళ్లను రిజెక్ట్ చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ఇదే విధంగా కొనసాగితే వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లు తీసుకు రావటం మానుకుంటామని చెప్పారు. ఇదే అన్యాయం ఇంకా కొనసాగితే పొగాకు బేళ్లను తగలేస్తామన్నారు. కనిగిరిలోనూ ఆగిన వేలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కూడా గురువారం వేలం ఆగిపోయింది. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ శాతం బేళ్లను తిరస్కరించడంతో ఆందోళన చెందిన రైతులు కొద్దిసేపు పొగాకు వేలాన్ని ఆపేశారు. దీంతో వేలం నిర్వహణ అధికారి కోటేశ్వరరావు జోక్యం చేసుకుని రైతులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజులుగా పొగాకు బేళ్ల తిరస్కరణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనిగిరి కేంద్రంలో గురువారం 164 బేళ్లను తిరస్కరించారు. -
‘రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి’
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్మెన్తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
రాష్ట్రవాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దాం’’ అని సజ్జల పిలుపునిచ్చారు.‘‘ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలి. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలి. రెడ్బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలి’’ అని సజ్జల చెప్పారు.ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, పూడి శ్రీహరి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేద్దామన్నారు. -
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
‘కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం సడుస్తోంది’
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట
సాక్షి, గుంటూరు: మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్ కేసులో ఆర్కేకు సీఐడీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి గత నెల.. సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు 126 మందిపై కేసులు నమోదు చేయగా.. ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చారు. కూటమి సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఆర్కేను వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఈ భూ మండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం. దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఈ భూమండలాన్ని ప్లాస్టిక్ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై… pic.twitter.com/v1nn0zvnqy— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2025 -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. -
వంచనపై గర్జన
ఎన్నికల హామీలను గాలికొదిలి చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అరాచకాలపై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటు దినం’కు అనూహ్య స్పందన వచ్చింది. మండుటెండను లెక్కచేయకుండా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి దగాపై కదం తొక్కారు. ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులు అందజేశారు.సాక్షి, భీమవరం: వెన్నుపోటు దినం వేదికగా కూటమి ఏడాది పాలనపై ప్రజల్లోని వ్యతిరేకత బుధవారం సుస్పష్టంగా కనిపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని సూర్యప్రతాపం, ఉక్కపోతను ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పేదవర్గాలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొట్టు సత్యనారాయణ, వెన్నుపొటు దినం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనపై జనాగ్రహానికి వెన్నుపోటు దినం ఘన విజయం సాధించడమే నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటికి గాలికొదిలేసి మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ఇప్పుడు దానినే రిపీట్ చేశారన్నారు. చెప్పినవి చేయకపోగా ప్రజా సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేసిన పథకాలను నిలిపేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితర అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలను పెంచేశారని, ఇంటింటికి రేషన్ రద్దు చేశారని, విపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంచనపై సమాధానం చెప్పాలి: ముదునూరి నరసాపురం: వైఎస్సార్సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు నెలనెలా అప్పులు చేస్తూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో సమాధానం చెప్పా లని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. నరసాపురంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ముదునూరి మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. జగనన్న కాలనీలో నిరుపేదకుల ఇళ్లస్థలాలు ఇస్తే, నేడు ఆ కాలనీల అభివృద్ధిని ఎండమావి చేశారు. నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ ఊదరగొట్టి మహిళలను మోసం చేసిన కూటమి నేతలు నేడు మాట్లాడడం లేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. అమ్మఒడి పథకం ఎగ్గట్టారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి, ఏడాదిలోనే వేల కోట్ల భారం మోపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టారు. అక్రమ కేసులు పెడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.’ అని దుయ్యబట్టారు.చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం: కారుమూరి తణుకు అర్బన్: సంక్షేమం, అభివృద్ధి పథంలో ఏపీని నడిపిస్తానంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో ముసలమ్మ బటన్ నొక్కుతుందని చంద్రబాబు హేళన చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే ముసలోడు గట్టిగా నొక్కేస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారని కానీ అసెంబ్లీకి వెళ్లి ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందని అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని, రైతు భరోసా లేదు, ఫీజురీయింబర్స్మెంట్ లేదు, ధాన్యం డబ్బు వేయలేదు, బీమా లేదు, తల్లికి వందనం వేస్తానని, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఏడాది గడిచినా ఇవ్వలేదు అని నిలదీశారు. ఎండీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. తణుకు ఎమ్మెల్యే పశువధ శాలలో మూగజీవాలను బలి ఇస్తుంటే, స్థానికంగా ఉండలేకపోతున్నామని మహిళలు మొరపెట్టుకున్నా డబ్బుకోసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించడం వెన్నుపోటు కాదా అన్నారు. ఏ పనిచేయాలన్నా కమిషన్, తణుకులో ఆర్కే ట్యాక్స్ విచ్చలవిడిగా అమలవుతుందని చెప్పారు. తణుకులో ఏ పని జరగడం లేదని ప్రజానీకం అల్లాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు సైతం తిడుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలో వెన్నుపోటు దినం విజయవంతంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్లు మేర భారీ నిరసన ప్రదర్శన సాగింది. వాగ్దానాల అమలుకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎండీయూ వాహన ఆపరేటర్లు ర్యాలీకి మద్దతు పలికారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి హెడ్పోస్టాఫీస్ రోడ్డు, కేఎన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైఫల్యాలపై ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ఆచంట వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. భీమవరంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేశారు. పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీగా పాదయాత్ర చేశారు. సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ∙ఉండిలోని వెన్నుపోటు దినం నిరసనలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ మురళీకృష్ణంరాజు, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాబాల, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యా లయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. -
టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్!
సాక్షి, అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేశారు. అయితే.. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. -
Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం
సరిగ్గా ఏడాది క్రితం అబద్ధపు హామీలతో అధికారాన్ని దొరకబుచ్చుకున్నారు. ప్రజల నుంచి ఓట్లు దండుకుని.. వారికే పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీలు కాకుండా.. ఏడాది కాలంగా కొత్త కథలు చెబుతూ నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారంటూ జనం రోడ్లపైకి వచ్చారు. వెన్నుపోటు సర్కారుపై నిరసన ప్రకటిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజావాహిని నిరసనల జోరుతో ఊరూవాడా దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రోజిది. ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజిది. అప్పుడు మామ ఎనీ్టఆర్కు వెన్నుపోటు పోడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జిల్లా ప్రజలు గొంతెత్తారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై కదం తొక్కారు. కిలోమీటర్ల మేర పాదయాత్రగా ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలతో జిల్లా హోరెత్తిపోయింది. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా ఎక్కడా తగ్గలేదు. అన్నింటిని అధిగమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనపై ఉక్కుపాదం మోపేందుకు గత వారం రోజులుగా అనుమతుల విషయంలో కుట్ర పన్నినా పారలేదు. వైఎస్సార్సీపీ కేడర్తో పాటు సామాన్య జనం నిరసన ర్యాలీల్లో వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పారీ్టలో నూతనోత్తేజం కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.మహిళా ద్రోహి చంద్రబాబు ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం.. అధికారం చేపట్టాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మహిళలంతా ఓటేసి మోసపోయాం. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి అమాయక ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. సూపర్సిక్స్ హామీలు అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచారు. – బెండి పూర్ణ, పాత్రునివలస జగనన్న కాలనీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి నినదించారు. వేలాది మంది ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ర్యాలీ అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్ రావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో.. ఇచ్ఛాపురంలోని దాసన్నపేట జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేలాది మంది తరలిరావడంతో ఇచ్ఛాపురం కిటకిటలాడింది. హామీల అమలు చేసేదెప్పుడు? రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అని చెప్పారే తప్ప ఏడాదవుతున్నా ఇవ్వలేదు. మిగిలిన అన్ని వర్గాలను మోసం చేశారు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాతపట్నంలో.. పాతపట్నంలోని పాతబస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కోర్టు కూడలి, వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త రెడ్డి శాంతి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని కూటమి ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.కుప్పం రైల్వే స్టేషన్లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం పుష్పుల్ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది. కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తీరుపై నిరసన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్పంచుకోగా.. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మద్దతు పలికారు. ఎక్కడికక్కడ మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. సీఎం డౌన్డౌన్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్నూలులో ఎండీయూ వాహన ఆపరేటర్లు తమ వాహనాలతో నిరసన ర్యాలీలో మద్దతు తెలిపారు. ఏడాదంతా రెడ్ బుక్ పాలనే.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన దినం చేపట్టారు. కర్నూలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి బుధవారపేట, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, ఎనీ్టఆర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూటమి నేతలు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో మరింత వ్యతిరేకత ఉందని, కూటమి నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికక్కడ తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు.జిల్లా వ్యాప్తంగా నిరసనలు మంత్రాలయం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, ప్రదీప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలూరు: ఎమ్మెల్యే బి.విరూపాక్షి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాణ్యం: కల్లూరులో నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్యతో కలిసి వెన్నుపోటు నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. కల్లూరులోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదోని: పట్టణంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను వినతిపత్రం అందజేశారు. పత్తికొండ: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు: నియోజకవర్గంలోని గూడురులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ పాల్గొన్నారు. పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు: పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుకా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్నోహాన్ రెడ్డి పాల్గొన్నారు.పోరాటాన్ని కొనసాగిస్తాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడు. రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రూ.1000లు కూడా సంక్షేమ పథకాల కింద ఇవ్వలేకపోయాడు. మరి అంత డబ్బు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు నిరసన దినం చేపట్టింది. నిరసనలను ఇంతటితో ఆపం.. ప్రజలతో కలిసి ఇక మీదట కూడా చంద్రబాబు మెడలు వంచేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుచంద్రబాబు నైజం ప్రజలకు తెలిసిపోయింది ఏడాది గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. తాము మోసపోయామనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తిరగబడటం ఒక్కటే మిగిలింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. – మధుసూదన్, ఎమ్మెల్సీ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసినట్లుంది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు చూసి చూపించారు. ఈ ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పడంతో ఓట్లేశాం. ఇప్పుడు చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు అందింది లేదు. సంవత్సరమైనా ఎదురుచూడటంతోనే సరిపోతుంది. సూపర్సిక్స్ పథకాలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసినారు. ఈ నాయకులకు మళ్లీ మా దగ్గరికి రావాలంటే మొహం ఎలా వస్తుంది. బుద్ధి ఉంటే ఇంకోసారి నమ్ముతామా?. – దస్తగిరి, హాలహర్వి గ్రామం, నందవరం మండలం -
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)
-
ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం
కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పవన్ కళ్యాణ్.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్ డీసీఎంగా పవన్కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, అనూప్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శేషగిరిరావు, సతీష్రెడ్డి, షాహుల్, వైస్ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్ తదితరులు ఉన్నారు. మోసం చేయడంలో దిట్ట ∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.నమ్మించి నట్టేట ముంచాడు∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు∙బుర్రా మధుసూదన్యాదవ్ కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్సిక్స్ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలకే పంగనామాలు∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (అర్బన్): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ విజయకుమార్కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్ఖాన్, అబ్దుల్ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు. రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్కు వినతి పత్రం సమరి్పంచారు. అనపర్తినియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. -
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.పర్యాటకులకు అవగాహన కల్పింస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ -
బిడ్డను చంపి.. తనువు చాలించి..
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ‘వెన్నుపోటు దినం’పేరిట నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ జంక్షన్ వద్ద ప్రారంభమైన వెన్నుపోటు నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ‘వెన్నుపోటు చంద్రబాబు.. మోసగాడు చంద్రబాబు’అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, కోలా గురువులు, రవిరెడ్డి తదితరులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదని, వారి వైఫల్యాలకు నిరసనగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్ పార్టీ కార్యాలయం పర్య వేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షుడు విజయచంద్ర, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ వెంకట స్వాతి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, మువ్వలలక్ష్మి, సాడి పద్మారెడ్డి, చెన్నా జానకీ రామ్, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, శశికళ, ఉత్తరాంధ్ర యువజన విభాగం రీజనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, ఎండీ ఫరూఖీ, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, రవి రాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథ్రెడ్డి, శ్రీని వాసరెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బొండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, మనలత జాబ్దాస్(చిన్ని), నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్బాబు, వార్డు నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిందా? తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మోసం చేసినందుకే ఇది వెన్నుపోటు ప్రభుత్వం. మూడు లక్షల పింఛన్లు తొలగించి, కొత్తగా ఒక్క పింఛను అయినా ఇచ్చిందా? రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి తొలి అడుగు’ అని అన్నారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గాజువాక పాత చెక్పోస్టు ప్రాంతం నుంచి ప్రారంభమై శాంతిగిరి కాలనీ, ములగాడ హౌసింగ్ కాలనీ మీదుగా ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అక్కడ ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి పేడాడ జ్యోత్స్న, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి చుక్కా వరలక్ష్మి, కార్పొరేటర్లు పి.వి.సురేష్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతగాజువాక జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా చినగంట్యాడ 100 అడుగుల రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. తహసీల్దార్ తోట శ్రీవల్లికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు, కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాంపురం నుంచి పెందుర్తి జూనియర్ కళాశాల వరకూ బైక్లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ రోడ్డు, బీఆర్టీఎస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ గా సాగారు. ముఖ్య నేతలు బి.భగవాన్ జైరాం, పైలా శ్రీనివాసరావు, కొటాన రాము, జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎస్.రాజు, ఎంపీపీలు. నేతలు హాజరయ్యారు.సంపద సృష్టి పేరుతో మోసంరాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘వెన్నుపోటు దినం’.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు ఒక మలుపు అవుతుంది. కూటమి ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యా లు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ లేవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు అమలుకాని హామీలిచ్చారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు. బాబూ మీ కుమారుడు లోకేష్కు సంపద సృష్టిస్తున్నావా? అని ప్రశ్నించారు. విశాఖ నగరంపై చిన్నచూపుపార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు, మంత్రి లోకే‹Ù, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేమి సమాధానం చెబుతారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రను కూటమి నేతలు దోచుకుంటున్నారు. విశాఖ నగరంపై చిన్నచూపు చూస్తున్నారు. అమరావతి భ్రమలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసింది. ఈ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిరీ్వర్యం చేసింది. రైతులను అప్పుల పాల్జేసింది. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన.. కూటమి ప్రభుత్వ పతనానికి నాందిగా మారుతుంది’ అని అన్నారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీ 3.8 శాతానికి పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది 8.9 శాతంగా ఉండేది. ఇది చాలదా చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని చెప్పడానికి.? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించింది. ప్రస్తుతం చంద్రబాబు కూటమి నేతల జేబులు నింపుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మా ప్రపంచం నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యాలు జరిగితే.. అట్టర్ ప్లాప్ సిని మా(ఏడాది పాలన)కు బాణసంచా కాల్చి పండగ చేసుకోవా లని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజలే చీపుర్లతో పండగ చేస్తారు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో మోసా లు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండగలు నిర్వహిస్తారా? మ్యానిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళితే వారే చీపుర్లు, గరిటెలతో మీకు అన్ని పండగలు చేస్తారు. మహిళల భద్రతను గాలికొదిలేశారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన కాదని.. ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి నియోజకవర్గంలో భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి వుడా మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్స్టేషన్, మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా నూకాలమ్మ ఆలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ వేదిక వద్ద శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం భీమిలిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏవో మనోరంజినికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది ఆటోలు, 100 కార్లు, 1000 బైక్లతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, ముఖ్య నేతలు దాట్ల పెదబాబు, చెన్నాదాస్, ఎంపీపీలు దంతులూరి వాసురాజు, కె.రాంబాబు, మజ్జి వెంకట్రావ్, పోతిన హనుమంతురావు, అక్కరమాని రామునాయుడు, గండిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Vennupotu Dinam: నిరసన హోరు
జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు జెండాలతో దండులా కదిలివచ్చింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని నిరసనలకు కదిలివచ్చారు. ఉవ్వెత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో నిరసన హోరుతో దద్దరిల్లింది.చిత్తూరు అర్బన్ : హామీల పేరిట ప్రజలను దగా చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేలా వెన్నుపోటు దినం నిర్వహించారు. మండు టెండను లెక్కచేయని జగనన్న సైన్యం రోడ్డెక్కి కూటమి సర్కారు మోసాన్ని ఎండగట్టింది. వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినంతో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి హామీల అమలుపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ∙చిత్తూరులో జరిగిన నిరసనలో సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. పార్లమెంటు పరిశీలకులు చువ్వా రాజశేఖర్రెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కెపి.శ్రీధర్, జగదీ‹Ù, గాయత్రీదేవి, లీనారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, విజయసింహారెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా హాజరు కావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు దినంలో కదంతొక్కారు. పాత బస్టాండు, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేడ్కర్ కూడలి వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి , అనూషారెడ్డి, పోకల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు నిరసనకు దిగారు.ఈకార్యక్రమంలో సమన్వయకర్త కృపాలక్షి్మ, మండల కనీ్వనర్లు పాల్గొన్నారు. అలాగే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపాటు నిరసనలకు కదం తొక్కారు. ఇక పలమనేరులో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులుతో కలిసి పలమనేరు సెంటర్లో వెన్నుపోటు నిరసన కార్యక్రమం హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్కుమార్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, పార్టీ నేతలు కుమార్రాజా, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసమే బాబు నైజం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసగించడం చంద్రబాబు నైజం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన దాఖలాలు లేవు. – రాజశేఖర్రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా ఏడాది పండుగ నిర్వహిస్తోంది. ప్రజల్లో ఏడాది తిరగకుండానే తిరుగుబాటు మొదలయింది. నాణ్యమైన మద్యం, తక్కువ ధరలకు అందిస్తామని ఎరగా చూపి చంద్రబాబు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా మద్యం కుంభకోణమే నడుస్తోంది. కూటమి పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజలు నిలదీసే రోజులు వస్తాయి 30 యాక్టు అమల్లో ఉందని, కేసులు పెడతామనే బెదిరింపులు, పోలీసుల హెచ్చరికలను కార్యకర్తలు లెక్కచేయలేదు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. హామీల నుంచి పాలకులు తప్పించుకోలేరు. ప్రజలే నిలదీసే రోజులు త్వరలో వస్తాయి. – భరత్ , ఎమ్మెల్సీ, కుప్పం అప్పులు తీసుకురావడమే సంపద సృష్టా? సంపద సృష్టించడమంటే ప్రతి మంగళవారం అప్పు లు తీసుకురావడమేనా..? పోలీసులు 110 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ..వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో గగ్గోలు పెట్టిన పెద్దలు ఇప్పుడు అప్పులు చేయడం దేనికో ప్రజలకు చెప్పాలి. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు -
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పాత ఆర్టీసీ బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ రాజగోపాల్రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సు«దీర్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్ ఫిల్టింగ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అని రుజువు చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్సిక్స్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా తల్లులకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ పథకం ఊసేలేదు. , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – పి.రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతులను నిండా ముంచారు.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు. జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్ పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు. కూటమి నేతలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. – రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీవెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. – అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు. మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. – సురేష్ బాబు, కడప మేయర్ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ? కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
బాబు 'సూపర్ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలను అందజేశారు. ‘సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్బుక్తో టెర్రర్ సృష్టిస్తున్నావు.. ఇక చాలు మీ నిర్వాకం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల డ్రైవర్లు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. ఆ పిలుపే ప్రభంజనమై.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగన్ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహించిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయడానికి కుట్రలు చేసింది. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్ బుక్తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. గుంతకల్లు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉసిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు. -
భద్రతకు ‘డ్యామే’జ్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని సాగు నీటిరంగ నిపుణులు, అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్పూల్(భారీ గొయ్యి) స్పిల్ వైపు విస్తరించకుండా ఏప్రాన్కు చివరన వేసిన కాంక్రీట్ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. వరద వచ్చేలోగా వాటిని పునరుద్ధరించాలని ఎన్డీఎస్ఏ పదేపదే సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలకు అడ్డుకట్టవేయడానికి గ్రౌటింగ్ చేయాలన్న సూచననూ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రాజెక్టుకు శాశ్వత భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం ప్రాజెక్టు భద్రతపై ఈ ఏడాదిమార్చి 6న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గత నెల 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనిల్ జైన్ తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు. వరద వచ్చేలోగా ఏప్రాన్కు చివరన ధ్వంసమైన కాంక్రీట్ సిలిండర్లను పునరుద్ధరించాలని.. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలను అడ్డకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని ఆదేశించారు. ప్లంజ్ పూల్ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్ సీఈని ఆదేశించడం గమనార్హం. 2009 వరదకు భారీ నష్టం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తయింది. 1975–76లో ప్రాజెక్టు స్పిల్ వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే(బకెట్) ప్రాంతం కోతకు గురై భారీ గుంత(ప్లంజ్ పూల్) ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984–85లో ఎప్రాన్కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాప్ వేశారు. అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కానీ.. 2009, అక్టోబర్ 2న ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీరట్లకు పెరిగిపోవడంతో స్పిల్ వే గేట్లపైన వరద ప్రవాహం ప్రవహించింది. ఈ బీకర వరద 78 గంటలపాటు పోటెత్తడంతో ప్లంజ్ పూల్ మరింత పెద్దగా మారింది. ప్రాజెక్టు స్పిల్వే దిగువన ఏప్రాన్ నుంచి 50 మీటర్ల నుంచి 220 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో ప్లంజ్ పూల్ విస్తరించింది. ఈ భారీ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది దిగువకు విస్తరిస్తోందేమోనని ఎన్డీఎస్ఏ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. -
హృదయం అద్దమనీ.. పగిలితే అతకదనీ..
ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? - సాక్షి, అమరావతిటకోట్సుబో కార్డియో మయోపతి.. బ్రోకెన్ హార్ట్ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ జర్నల్ను ప్రచురించింది. 1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం 2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు. ఆ వయస్కులవారికే అధికం సాధారణంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవత్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య 2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూడిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు. సమస్య తలెత్తితే.. బ్రోకెన్ హార్ట్ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.భావోద్వేగ మద్దతు అవసరం కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు -
విదేశాల్లోనూ వెన్నుపోటు దినం విజయవంతం
సాక్షి, అమరావతి/జి.కొండూరు: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఇది సుస్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ యూకే కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఇలాగే ఎన్నికల సమయంలో మోసపు మాటలతో అమాయక తెలుగు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విదేశాల్లోనూ వెన్నుపొటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వ ర్యంలో బుధవారం లండన్లో డా.ప్రదీప్ చింతా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు కదంతొక్కారు. లెస్టర్లో వైఎ స్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ చలపతి సర్ప ఆధ్వ ర్యంలో.. నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈస్ట్ లండన్లో వైఎస్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ మలిరెడ్డి కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ‘‘నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు ఏదీ’’, ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎక్కడ?’’, ‘‘50 ఏళ్లకు పెన్షన్ ఏది బాబూ?’’ ‘‘రెడ్బుక్ రాజ్యంగంతో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు’’, ‘‘ఉచిత బస్సు తుస్సు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అన్నావ్.. ఆడపడుచులనూ మోసం చేశావ్..’’ అంటూ ప్లకార్డులతో నినాదాలుచేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి విజయంతం చేశారు. జేబులు నింపుకోవడమే కూటమి కార్యక్రమంకూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కూటమి నేతల జేబులు నింపుకొనే కార్యక్రమం చేపట్టిందని ప్రదీప్ చింతా దుయ్యబట్టారు. వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే సాయం వరకు, మహిళలకు ఫ్రీ బస్సు నుంచి తల్లికి వందనం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చక కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మలిరెడ్డి కిషోర్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనన్నారు.ఎన్నికల ప్రచార సభల్లో ఒకరికి ముగ్గురు చొప్పున బాబు, పవన్, పురందరేశ్వరి చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని చలపతి సర్ప విమర్శించారు. కార్యక్రమంలో చల్లా మధు సూదన్ యాదవ్, ప్రణయ్ గడిమే, ఆనంద్ అక్కి దాసు, రామిరెడ్డి జయచంద్రారెడ్డి, చలపతి గుర్ర, యశ్వంత్ గరికపాటి, సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటాలో వెన్నుపోటు దినంసీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అమెరికాలోని అట్లాంటాలో బుధవారం వెన్నుపోటు దినం నిరసనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ‘‘2019–24 మధ్య ఏ రంగంలోనైనా సమస్య ఏర్పడినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చురుగ్గా నడిపించారు. సమస్యలను పరిష్కరించే దాక విశ్రమించలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదు. ఎక్కడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, వాటి పరిష్కారాన్ని చూపే ప్రయత్న చేయడం లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి ప్రకటించిన డీఎస్సీ పరీక్షలు ఉపాధ్యాయ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తిగాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది నమ్మి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులను షాక్కు గురిచేస్తూ మరుసటి రోజే మెయిన్స్ నిర్వహించారు. దీంతో వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కూటమి సర్కారు డీఎస్సీ పరీక్షలకూ అనుసరించింది. దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది సిలబస్ పూర్తిగాక, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన 6100 పోస్టుల నోటిఫికేషన్ను రద్దు చేసి, మెగా డీఎస్సీ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు హామీ ఇచ్చింది. అలాగే సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్పై చేశారు. అంతేగాక, వెంటనే నోటిఫకేషన్ ఇచ్చి డిసెంబర్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపై వాయిదాలతో సుమారు ఏడాదిదాకా సాగదీశారు. అంధకారంలోకి అభ్యర్థుల జీవితాలు ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. ప్రధానంగా 50 శాతం అర్హత మార్కుల నిబంధన విధించి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను నిర్దయగా కోల్పోయేలా చేసింది. 50 శాతం మార్కుల అర్హత పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు.టెట్ అర్హత మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే వరుసలో ఉన్న జనరల్ అభ్యర్థుల అర్హత కనీసం మార్కులను మాత్రం 50 శాతం అలాగే ఉంచారు. వాస్తవానికి టెట్కు జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆమేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్ను, ఆశలను అంధకారంలోకి ప్రభుత్వం నెట్టేసింది.గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలకు ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డీఎస్సీ–2025లోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపుర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. టెట్ రాసేటప్పుడే ఈ నిబంధన విధించి ఉంటే సమస్య ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్ను నాశనం చేసిందని వాపోతున్నారు. ప్రణాళికాబద్ధంగా మోసంప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేస్తామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ నెలలో ప్రకటించింది. అనంతరం అదే సమయంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని జూలై నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రచారం చేశారు. దీనిప్రకారం ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ రావాలి. తర్వాత టెట్కు, డీఎస్సీకి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం సెప్టెంబర్లో నిర్వహించాల్సిన టెట్ ను అక్టోబరులో జరిపిన ఫలితాలను ప్రకటించారు. టెట్ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి. కానీ తొలుత నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తర్వాత 6వ తేదీన నోటిఫికేషన్ అన్నారు. ఆరు నెలలుగా డీఎస్సీ నోటిఫికేషన్పై ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. నోటిఫికేషన్ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. -
ప్రైవేటుకు పాలధార
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పశుపోషణ భారంగా మారడం, పాల సేకరణ ధరలు తగ్గించడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా.. ప్రైవేటు డెయిరీలు నిర్దేశించిన ధరను మాత్రమే చెల్లిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయి. ఏడాదిగా గిట్టుబాటు ధరలేక, ప్రైవేట్ డెయిరీల ఆగడాలు తాళలేక జీవనాధారమైన పశు సంపదను అమ్ముకుని పాడి రైతులు ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మళ్లుతున్నారు.అమూల్ను తరిమేసి.. ప్రైవేటుకు పట్టంప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాల సేకరణ నుంచి తప్పుకుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాల సేకరణను నిలిపివేసింది. మిగిలిన జిల్లాల్లోనూ నామమాత్రపు పాత్రకే పరిమితమైంది. గతంలో అమూల్ సంస్థ రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా.. ప్రస్తుతం 40 వేల లీటర్లకు మించి జరగడం లేదు. గతంలో లీటర్కు సగటున గేదె పాలకు రూ.89, ఆవు పాలకు రూ.42 చొప్పున ధర లభించేది. ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలు గేదె పాలకు లీటరుపై రూ.50 నుంచి రూ.60 మాత్రమే ఇస్తుండగా.. ఆవు పాలకు రూ.28 నుంచి రూ.32 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నాయి.ప్రతి రైతుకు రూ.7,500 నుంచి రూ.15 వేల నష్టంఅనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతి పాడి రైతుకు సగటున 4 ఆవులుంటాయి. రోజుకు 40 నుంచి 80 లీటర్ల పాలను అక్కడి రైతులు సేకరణ కేంద్రాలకు పోస్తుంటారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం లీటర్కు రూ.6 నుంచి 10 మేర రోజుకు రూ.250 నుంచి రూ.500 చొప్పున నష్టపోతున్నారు. తద్వారా ప్రతి రైతుకు నెలకు రూ.7,500 నుంచి రూ.15,000 వరకు నష్టం వాటిల్లుతోంది. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాడి రైతుకు సగటున 2నుంచి 5 వరకు గేదెలుంటాయి. సగటున ఒక్కో గేదె 8 లీటర్ల చొప్పున పాల దిగుబడి వస్తుంది. గతంతో పోలిస్తే లీటర్కు రూ.30 నుంచి రూ.40 చొప్పున రోజుకు ఒక్కో రైతుకు రూ.250 నుంచి రూ.350కు పైగా నష్టపోతున్నారు. నాడు క్షీర విప్లవంవైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో జగనన్న పాల వెల్లువ కేంద్రాలను 2020 అక్టోబర్లో ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాల సేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున అమూల్ సంస్థ 3.95 లక్షల లీటర్ల పాలను సేకరించేది. అప్పట్లో ప్రైవేటు డెయిరీలు 10 శాతం వెన్న ఉండే లీటర్ ఆవు పాలకు రూ.25 నుంచి రూ.28, గేదె పాలకు రూ.56 నుంచి రూ.60 చొప్పున చెల్లించేవి. అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్కు రూ.71. 47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 పర్యాయాలు ధరలు పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున సగటు ధర చెల్లించేది. ఇలా 40 నెలల్లో గేదె పాలకు లీటర్పై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్కు గేదె పాలపై రూ.15 నుంచి రూ.20, ఆవు పాలపై రూ.10నుంచి రూ.15 వరకు రైతుకు అదనంగా లబ్ధి చేకూరేది.మరోవైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని లెక్కగట్టి 10 రోజులకు ఒకసారి నేరుగా వారి ఖాతాలకు అదనంగా నగదు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్కు రూ.112, ఆవు పాలకు లీటర్కు రూ.53.86 చొప్పున గరిష్ట ధర లభించింది. దీంతో ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలపై లీటర్కు రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీల దోపిడీ హద్దుమీరిందికూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమూల్ ప్రాజెక్టు అటకెక్కింది. ప్రైవేట్ డెయిరీల దోపిడీకి తెరలేచింది. ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన పశువులను రూ.50నుంచి రూ.60 వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలు మిగలడం గగనంగా మారింది. – ఎన్.మురళీమోహన్రెడ్డి, మరిమిరెడ్డివారిపల్లె, అన్నమయ్య జిల్లా ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమాకు మూడు పాలిచ్చే ఆవులున్నాయి. రెండు పూటలు కలిపి 20 లీటర్ల వరకు డెయిరీకి పాలు పోస్తున్నాం. గతంలో లీటర్కు రూ.35 నుంచి రూ.42 వరకు వచ్చేది. కానీ.. ఇప్పుడు లీటర్కు రూ.30 నుంచి రూ.33 ఇస్తున్నారు. ఈ నెల నుంచి మరో రూ.2 తగ్గుతుందంటున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే పశుపోషణ ఏ విధంగా చేయగలం. డెయిరీలు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గడమే తప్ప పెరగడం లేదు. ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. – భాస్కర్ నాయుడు, అనంతపురం, చిత్తూరు మండలం పాడిని వదులుకోవడం తప్ప మరో మార్గం లేదుమాకు మొత్తం ఐదు ఆవులుంటే.. ఇందులో పాలిచ్చేవి రెండున్నాయి. ఇవి రోజుకు 20లీటర్ల పాలు ఇస్తే.. డెయిరీకి పోస్తున్నాం. గతంలో డెయిరీలు లీటర్కు రూ.35 నుంచి రూ.40వరకు ఇచ్చేవి. 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించేవారు. నెలకు రూ.30వేలకు పైగా ఆదాయం వచ్చేది. కానీ గతేడాది నుంచి పాల సేకరణ ధర తగ్గించేస్తూ వచ్చారు. ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.22–30 మధ్య వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.15వేలకు మించి రావడం లేదు. దాణా ఖర్చులు పోనూ పెద్దగా మిగలడం లేదు. ఈ స్థాయిలో ధరలు తగ్గిస్తే పశు పోషణ ఎలా సాధ్యం? – ఎం వెంకటేశ్, తయ్యూరు, ఎస్ఆర్పురం మండలం, చిత్తూరు జిల్లా -
కన్నూమిన్నూకాన‘కొండ’..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగు తమ్ముళ్ల కన్నుపడితే కొండలు కూడా పిండైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్డులోని రామేశంమెట్ట కొండను తెలుగుతమ్ముళ్లు గుల్లచేసేశారు. నాడు దాదాపు మూడున్నరేళ్లు ఏకబిగిన రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యమేలింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలి ఉన్న కొండను ఇప్పుడు టీడీపీ నేతలు, వారి అనుచరులు తవ్వేస్తున్నారు. మీకు సగం, నాకు సగం అంటూ పంపకాలు వేసుకుని మరీ సొమ్ము చేసుకుంటున్నారు.టీడీపీ, జనసేన కుమ్మక్కై..రామేశంమెట్టలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకూ 823 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితుల స్వయం ఉపాధి కోసం 1975లో అప్పటి ప్రభుత్వం రామేశంమెట్టను కేటాయించింది. 2014–19 మధ్య ఈ కొండలపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. అంతే పది పదిహేను అడుగుల లోతున తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశంమెట్ట కొండను గుల్ల చేసేసింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నుల గ్రావెల్ను జిల్లా సరిహద్దులు దాటించేయడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆ మెట్టపై పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్లీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరీ మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు.రోజుకు రూ.15 లక్షల వరకూ దోపిడీ..! కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశంమెట్ట ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశంమెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014–19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు. కొండకు రెండోవైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నాడు. మెట్ట ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి, పగలు పదుల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ను తరలించేసి రామేశంమెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లలో గ్రావెల్ తరలించేసి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నట్టు సమాచారం. -
హాజరు తక్కువైతే అంత పనిచేస్తారా?
సాక్షి, అమరావతి: అనారోగ్య కారణాలతో తరగతులకు హాజరు కాలేకపోయిన ఓ బీటెక్ విద్యార్థిని హాజరు తక్కువగా ఉందన్న కారణంతో నాలుగో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడం, మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హాజరు విషయంలో కేవలం 10 శాతం వరకు మాత్రమే మినహాయింపునివ్వగలమంటూ జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జీఎంఆర్ఐటీ) రూపొందించిన నిబంధనను తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కాలేజీ రూపొందించిన ఏకపక్ష నిబంధన ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొంది. ఈ నిబంధన రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్న సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనారోగ్య కారణాలతో విద్యార్థి తరగతులకు హాజరు కాలేని సందర్భాల్లో ఎలాంటి కఠిన, నిర్దిష్ట నిబంధనలను రూపొందించడానికి వీల్లేదని వెల్లడించింది. ‘అనారోగ్యమనేది మనిషి అదుపులో లేని వ్యవహారం. ఈ విషయం అందరికీ తెలిసిందే. రకరకాల రోగాలు మనిషిని తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటాయి. మానవ నియంత్రణలో లేని ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి నిబంధనలు రూపొందించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇంత శాతం హాజరు ఉండి తీరాలన్న నిబంధనను ఏ రకంగానూ తీసుకురాలేరు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ విద్యాపరంగా తీసుకొచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో మేం జోక్యం చేసుకుంటున్నాం.’ అని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ బీవీకే కౌశిక్ మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించాలని జీఎంఆర్ఐటీని హైకోర్టు ఆదేశించింది. అలాగే అతన్ని నాలుగో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలనీ ఆదేశించింది. భవిష్యత్తులో కౌశిక్ ఇతర నిబంధనలన్నింటికీ లోబడి నడుచుకుంటే, ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా బీటెక్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు అతన్ని అనుమతించాలని జీఎంఆర్ కాలేజీ, రాష్ట్ర విద్యాశాఖ, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు. 75 శాతం హాజరు లేదంటూ పరీక్షలకు అనుమతించని వైనం శ్రీకాకుళం జిల్లా కేంద్రం మధురానగర్కి చెందిన బీవీకే కౌశిక్ రాజాంలోని జీఎంఆర్ఐటీలో బీటెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అండ్ డాటా సైన్స్ కోర్సు చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల 2024ఆగస్టులో 12రోజులు, అదే ఏడాది అక్టోబరులో మరో 10 రోజులు కాలేజీకి హాజరు కాలేదు. తన అనారోగ్యానికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు, వైద్య పరీక్షల రిపోర్టులను కాలేజీకి విద్యార్థి సమర్పించారు. అయితే కాలేజీ వర్గాలు కౌశిక్ను మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. 75 శాతం హాజరు లేదని, అందువల్ల పరీక్షకు అనుమతించలేమని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థి కౌశిక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పిటిషనర్ విద్యార్థిని మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలని, పరీక్ష ఫీజు స్వీకరించాలని కాలేజీ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు విద్యార్థిని మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించారు. కౌశిక్ తరఫు న్యాయవాది రిజ్వాన్ అలీ షేక్ వాదనలు వినిపించారు. 75 శాతం హాజరు ఉండాలని కాలేజీ నిబంధనలు చెబుతున్నాయని, ఇవే నిబంధనలు 10 శాతం మేర మినహాయింపునిచ్చేందుకు అనుమతినిస్తున్నాయన్నారు. పిటిషనర్ కౌశిక్కు 57.5 శాతం హాజరు ఉందని కాలేజీ వర్గాలు చెప్పాయన్నారు. 10 శాతం మినహాయింపుతో కనీస హాజరు శాతాన్ని 65 శాతంగా తీసుకుంటే కేవలం 7.5 శాతం మాత్రమే హాజరు తక్కువగా ఉందని వివరించారు. అలాగే న్యాయమూర్తి అటు జీఎంఆర్ఐటీ కాలేజీ తరఫు న్యాయవాది, జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ 75 శాతం హాజరు లేదన్న కారణంతో విద్యార్థులు కఠిన పర్యవసానాలు ఎదుర్కొనేలా చేయడానికి వీల్లేదంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. -
17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీ ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు క్షమాభిక్ష ద్వారా విడుదలైన ఖైదీలు ప్రతీ మూడు నెలలకొకసారి ప్రొబేషన్ అధికారి, దాని పరిధిలోని పోలీసుస్టేషన్లో హాజరుకావాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరాలకు పాల్పడితే క్షమాభిక్ష రద్దుచేస్తారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. స్రత్పవర్తన కలిగిన జీవిత ఖైదీలకే క్షమాభిక్ష మంజూరుచేశారని, ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. మంత్రి వెల్లడించిన మరిన్ని నిర్ణయాలు ఏమిటంటే.. » 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. » ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు వీలుగా కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా వైద్యసేవ చట్టాల్లో పలు సెక్షన్ల సవరణకు ఆమోదం. దీనివల్ల మహిళల పనిగంటలు పెరుగుతాయి. ఓవర్టైమ్ కూడా పెరుగుతుంది. వ్యవస్థీకృత రంగంలో లింగ వివక్ష లేకుండా రాత్రిపూట తగిన భద్రత, రవాణా సౌకర్యాలతో మహిళలు రాత్రిపూట పనిచేసేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. » ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఆమోదం. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపునకు గ్రీన్సిగ్నల్. » అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటుకూ ఓకే. » గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లకు నష్టం వచ్చినందున వారికి రూ.5.75 కోట్లు, రూ.8.22 కోట్లు చొప్పున వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేందుకు అంగీకారం. » ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి గ్రామాల్లోని 94.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా హోంశాఖకు ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్. » వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ జారీచేసిన నోటిఫికేషన్కూ ఆమోదం. » విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రీనివాస్ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలుచేసిన పనులకు గ్రీన్సిగ్నల్. » ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వేమవరం గ్రామంలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తికి లైన్క్లియర్. » ఏలూరు జిల్లాలో నిర్మిoచదలచిన ఐ ఇన్స్టిట్యూట్ కోసం ఐఏఎస్ అధికారి దమయంతి దానంగా ఇవ్వనున్న 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపునకు ఆమోదం. » గతంలో సూరత్లో 1.53 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించేలా జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ యోగా డేను నిర్వహించాలని నిర్ణయం. ఇక ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే సమయానికి 25 కాగిత రహిత ఈ–కేబినెట్ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ను కూడా అభినందించారు. -
‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు...బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నపోటు దినంలో పాల్గొన్న బొత్స.. ప్రసంగిస్తుండగానే సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే తిరిగి కోలుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రసంగిస్తుండగా.. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో కోలుకున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. -
Sirimanu Utsavam అంబరాన్నంటిన సిరిమాను సంబరం
పార్వతీపురం టౌన్: మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధారణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి. 450 మందితో పోలీస్ బందోబస్తు పార్వతీపురం ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్ మార్గం గుండా మళ్లించారు. పోలీస్ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు పర్యవేక్షించారు. -
బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు. -
అంబటి రాంబాబుపై సీఐ జులుం
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ అంబటి రాంబాబుకు మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎంత పని చేశావ్ బ్రహ్మయ్య!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: తోపూరి నరసింహంను దారుణంగా హత్య చేసిన చలంచర్ల బ్రహ్మయ్యను అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హజరుపరిచినట్లు గుడ్లూరు సీఐ మంగారావు చెప్పారు. బంగారు ఉంగరం కోసమే బ్రహ్మయ్య హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వివరాలను సీఐ మంగళవారం వెల్లడించారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చలంచర్ల బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పదేళ్ల నుంచి పెంట్రాల ఎస్టీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత నెల 30వ తేదీన నరసింహం నిమ్మతోటకు కంచె వేసేందుకు బ్రహ్మయ్యను తీసుకెళ్లాడు. పని చేస్తుండగా నరసింహం చేతికున్న పచ్చరాయి బంగారపు ఉంగరాన్ని చూసి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని బ్రహ్మయ్య భావించాడు. నరసింహంను మొద్దుకత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉంగరాన్ని తీసుకుని కందుకూరులో విక్రయించాడు. రాత్రి మృతదేహాన్ని పక్క పొలంలోకి లాక్కెళ్లి ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బ్రహ్మయ్యను విచారించగా తాను బంగారు ఉంగరం కోసమే నరసింహంను హత్య చేసినట్లు అంగీకరించాడని సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హాజరుపరచగా మేజి్రస్టేట్ రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. -
ఏపీకి ట్రబుల్ మేకర్గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
రండి బాబూ రండి! తాగండి.. రోడ్లపై పొర్లండి
కర్నూలు: పూటుగా మద్యం తాగి పొర్లుతున్న ఈ దృశ్యాలు కూటమి పాలన తీరుకు అద్దం పడుతున్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా వ్యాపారాన్ని కొనసాగిస్తూ పేదల ఒళ్లు, ఇళ్లను గుళ్ల చేస్తోంది. డోర్ పట్టణంలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో రోడ్లపై పడివున్న మందుబాబులే కనిపిస్తున్నారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా 16 మద్యం షాపులతో పాటు రెండు గీతా కార్మికుల మద్యం దుకాణాలున్నాయి. వీటికి తోడు కూల్డ్రింక్ షాప్లు, హోటళ్లు, కిల్లీ కొట్లలో సైతం మద్యాన్ని విక్రయిస్తూ టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. సిట్టింగ్కు అనుమతి లేకపోయినప్పటికీ ప్రతి మద్యం దుకాణం పక్కనే అదనపు గదులను ఏర్పాటుచేసి అందులో వాటర్ప్యాకెట్లు, స్నాక్స్ మద్యం ప్రియులకు అంటగట్టి జలగల్లా మద్యపానీయుల రక్తం పీల్చుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఏడెనిమిది బెల్టుషాపులను ఏర్పాటు చేసుకునేందుకు టీడీపీ నాయకుడొకడు.. ఒక్కో బెల్ట్షాప్కు రూ.25 వేల చొప్పున విక్రయదారుల నుంచి వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. టీడీపీ అగ్రనాయకునితో పాటు ఎక్సైజ్, సివిల్ పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పేందుకే డిపాజిట్లు వసూలు చేశామని ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెబుతుండటం గమనార్హం. -
అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏడాది కాలంలో చేసిన అప్పులకు చంద్రబాబులో జవాబుదారితనం లేదని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తహసీల్దార్కు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అప్పుడు చంద్రబాబు అధికారంకోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఉచిత హామీలు పేరుతో ఏడాది కాలంగా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన లక్షా 51వేల కోట్ల రూపాయాల అప్పులకు జవాబు చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. కానీ, ప్రజలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపింది. .. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ విలాసాలకు హెలికాప్టర్లను, విమానాలను కొనుగోలు చేశారు. సాయంత్రం కాగానే హైదరాబాద్కు, పగలు అమరావతికి తిరుగుతున్నారు. సెకీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనిట్ కు సోలార్ ఎనర్జీ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంటే పెద్ద రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా.. ఇవాళే చంద్రబాబు సర్కారుకు యూనిట్ కు 4.60 పైసల కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని 11వేల కోట్లు అవినీతికి పాల్పడింది. ఏడాది కాలంలో ఎన్నికోట్లు ఉచిత గ్యాస్ కు ఖర్చు చేశారో వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు సరైన ధర లేక పొలాల్లో మామిడి పంట విడిచి పెట్టేశారు. పొగాకు, మిర్చి , టమోటో రైతులుది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నేతలు ను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 26 లక్షలు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఎంతో సక్రమంగా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించారు. కానీ, ఇవాళ పదో తరగతి పరీక్షలు ఫలితాలు తప్పడు తడకగా ప్రకటించి విద్యార్ధులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయంలో పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో తప్పిదాలు జరిగితే.. నాటి మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పదో తరగతి తప్పుడు ఫలితాలు పై కొడుకు మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినం నిరసనల్లో అనీషా రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. -
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
ఎస్పీబీ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SPB) జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ‘‘తన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.తన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/KHAoH0cov2— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు పలు భాషల చిత్రాల్లో ఆయన తన సుమధుర గానంతో సంగీత ప్రియులను, సామాన్య శ్రోతలను దశాబ్దాలపాటు అలరించారు ఎస్పీబీ. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్ రికార్డు సాధించారాయన. -
అవకాశవాదమే పవన్ సిద్ధాంతం!
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్ఎస్తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు. 2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట. ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన
పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్ జగన్ సర్కార్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్ను ఆపేసిన కూటమి సర్కార్.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. నేను బతికే ఉన్నా కదా.. ‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్కళ్యాణ్కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
ఆర్సీబీకి హృదయపూర్వక శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: అభిమానుల పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టీం ఐపీఎల్ కప్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ విజయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆ జట్టు ట్రోఫీని ఎత్తిన ఫొటోతో తన సందేశం ఉంచారు. Heartfelt congratulations to #RCB on creating history in #IPL2025! A long awaited moment for millions of fans across the world. pic.twitter.com/CeDobHFMoK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
Vennupotu Dinam: నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటుకూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనవెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలుకూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహంచంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు👉ప్రకాశం జిల్లా:చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజుఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజు ఈరోజుఅప్పుడు మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారుచంద్రబాబు గతంలో కూడా చెప్పిన హామీలను నెరవేసిన ఘనత ఎప్పుడూ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారుచంద్రబాబు మారాడు మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడుచంద్రబాబు ఎప్పటికీ మారకపోవడం, వెన్నుపోటు ఆయన రక్తంలోనే ఉందిఅందుకే ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 👉నంద్యాల జిల్లా డోన్లో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందిఅధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారుగత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు.కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెంచి, సూపర్ సిక్స్ అంటూ పిల్లల నుంచి ముసలి వారి వరకు మోసం చేసారు.సంపద సృష్టిస్తాం అని చెప్పి చివరకు పథకాల హామీలలో చేతులు ఎత్తేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు 👉వైఎస్ఆర్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ. 1500, రైతన్నలకు ఏడాదికి ూ. 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేదు👉తిరుపతి జిల్లా :నేడు వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినానికి పిలుపు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు.చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలిరెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలికూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాముకూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది.విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వంఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదుపవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదుపదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలికూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం👉పశ్చిమగోదావరి జిల్లా:వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజలు👉పశ్చిమగోదావరి జిల్లా:పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు వెన్ను పోటు దినంపాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కు వినతిపత్రంవెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు👉పశ్చిమగోదావరి జిల్లా:పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంఅంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా:రావులపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసనపెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ..👉ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు..బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు👉అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు👉విశాఖ .. ఈస్ట్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినంగురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావుభారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు👉గుంటూరు:గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంపాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు👉విజయవాడతూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంభారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు👉గన్నవరంఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నానిముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారుజగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారుజగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు ఉచిత బస్సు తుస్సు మందిసంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారురోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయిపనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదుపథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉందిరూపాయి లేదని చెపుతారులోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారులోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడుఅమ్మ ఓడికి ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరుదోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారుచికెన్లో కూడా కమిషన్ అడుగుతారుMla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారురాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారుదేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారుఅన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారుమోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలిగన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు వంశీ పై 11 కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు.. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది👉ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినంమైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంభారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులుకూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు👉అనంతపురం:చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంవినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉గన్నవరంవైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నానివెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు👉విశాఖ:పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసనగాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా:రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావంచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాంమాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాంప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదుఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారుఅక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయితిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాముడాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఅమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారుసంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందిభూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారురాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం👉శ్రీసత్యసాయి జిల్లా:పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమంమాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీపార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులుప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీమునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..బొబ్బిలిలో మొదలైన ర్యాలీబొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.👉అనకాపల్లి. నర్సీపట్నంవెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.నిన్న సాయంత్రం బైక్లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.👉అనంతపురం:మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంచంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతిఅయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణనేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుకూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలుచీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వంఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణచంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులుఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వంఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటునమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారుహామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనంటీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాటఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపుఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలుతక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు -
ప్రజలకే వెన్నుపోటు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదంతొక్కుతున్నాయి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఒనగూరే ప్రయోజనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల్లో 143 హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి, గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోయేలా అబద్ధాలు వల్లె వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ‘నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న’ సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు.. అప్పుల్లో రికార్డులు సృష్టించినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తుంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటూనే ఉన్నారు.తల్లికి వందనం పేరుతో అమ్మలకు మోసం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇచ్చిన పాపాన పోలేదు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.మహిళలకు ద్రోహం ⇒ ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా ఆడబిడ్డ నిధి ఊసే లేదు.. ⇒ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఏడాది అయినా ఉచిత బస్సు జాడే లేదు. ⇒ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మబలికారు. గతేడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్తో సరిపెట్టి, మహిళలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ మాటే లేదు..అన్నదాతకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకూ రూ.20 వేలు అందించలేదు. తొలి ఏడాది రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన రూ.10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది సీజన్ ప్రారంభమైనా పైసా పెట్టుబడి సాయం అందించకుండా నిలువునా ముంచేశారు. ఐదేళ్లుగా పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి వారిపై బీమా భారం మోపారు.ఖరీఫ్ 23 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల మేర పంటల బీమా పరిహారం రైతులకు దక్కకుండా చేశారు. కరువు బకాయిలతో సహా గడిచిన ఏడాదిలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 8.94 లక్షల మంది రైతులకు రూ.554 కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచారు. ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాటు పాడి రైతులకు అండగా నిలిచిన అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి.. కార్పొరేట్, ప్రైవేటు డెయిరీల దోపిడీ బారిన పడేలా చేశారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతకు టోపీ సూపర్ సిక్స్ హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని– ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్న హామీ ఒకటి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమం కోసం ఒక్కపైసా కూడా విదిల్చలేదు. ఏపీలో గతేడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా, నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు అయితే ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండి చెయ్యి చూపించింది. 2025–26 బడ్జెట్కు వచ్చే సరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు చొప్పున ఏడాదికి రూ.61,200 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి వ్యయం అవుతుంది. ఇచ్చిన హామీలో భాగంగా ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు నిరుద్యోగుల కోసమే వెచ్చించాలి. కానీ, చంద్రబాబు చాణిక్యంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ దగాకు గురయ్యారు.జాబ్ క్యాలెండర్ హుష్కాకి..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పటి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగులను నియమించారు. 2019–24 మధ్య శాశ్వత, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి కొలువులిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లా పారిపోయే బ్యాచ్ కాదు మేము’ అని చంద్రబాబు, లోకేష్ బీరాలు పోయారు. జనవరి పోయి 5 నెలలు దాటినా జాబ్ కేలండర్ దేవుడెరుగు.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచి్చన గ్రూప్–1, 2 మెయిన్స్ను పలుసార్లు వాయిదా వేసి, అభ్యర్థులను నిలువునా మోసం చేసి గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపే నిర్ణయం తీసుకుని గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేసేందుకు ప్రణాళిక వేశారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ దాదాపు వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతించింది. వాటికి నోటిఫికేçÙన్లు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బాబొచ్చారు.. జాబేదీ? బాబు వస్తే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఏడాదయినా ఒక్కరికీ ఉద్యోగం వచి్చంది లేదు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు.బట్టబయలైన దుష్ప్రచారంగుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారకముందే తలుపుతట్టి వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ అందించడం దగ్గరనుంచి అన్ని ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా సమకూర్చారు.పరిపాలన సంస్కరణల్లో ఇదో విప్లవమనే ప్రశంసలు పొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ విషం చిమ్మారు. 2023 అక్టోబరు 7న రెండో విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు రోడ్ షోలో.. 33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ పవన్ హేయంగా మాట్లాడారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరు 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమేనని.. 46 మంది బాధితులని వెల్లడించడం గమనార్హం. ఇసుక దోపిడీ.. అడ్డగోలు తవ్వకాలువైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేసింది. దీంతో రూ.750 కోట్ల ఆదాయం వచి్చంది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం వచి్చన కొద్ది రోజుల్లోనే 80 లక్షల టన్నుల ఇసుకను పచ్చ మాఫియా దోచేసి, జేబులు నింపుకొంది. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తవ్వేసి.. అధిక ధరలకు అమ్ముకుంటూ భారీఎత్తున దోచేస్తోంది. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకు వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.రెడ్బుక్తో టెర్రర్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు.. పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతును నొక్కేందుకు రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి వెంటాడి, వేటాడి హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 390 మందిని చంపేశారు.హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి.. 500 మంది నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 79 మందిని జైలు పాల్జేశారు. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. 63 అక్రమ కేసులు నమోదు చేసి.. 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి.. ఇద్దరిని జైలుపాల్జేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.మద్యం మాఫియా బయటకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతిపెట్టిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి చంద్రబాబు సర్కారు మళ్లీ ఊపిరిపోసి వదిలింది. మద్యం ఏరులై పారించడం ద్వారా భారీ దోపిడీకి టీడీపీ మద్యం సిండికేట్ పన్నాగం పన్నింది. ప్రైవేటు దుకాణాలను తిరిగి తెచి్చంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా టీడీపీ గూండాలతో పాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 3,396 మద్యం దుకాణాల పరిధిలో దాదాపు 55 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది.ఎంఆర్పీ కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అన్ని దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచి్చన రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని 2025–26లో రూ.35 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కనీసం రూ.10 వేల కోట్లు చొప్పున మద్యం ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2028–29 నాటికి ఏకంగా రూ.75 వేల కోట్లకు చేరాలన్న ఉద్దేశంలో ఉంది.రాజధాని నిర్మాణంలో అడ్డగోలు దోపిడీ..తాను, తన సన్నిహితులు, బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరలకే కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి అధిక వడ్డీలకు రూ.31 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. మరో రూ.21 వేల కోట్లు అప్పునకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రూ.77 వేల కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.అధిక వడ్డీలకు తెచి్చన నిధులతో.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. దేశంలో ఎన్హెచ్ఏఐ కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున జాతీయ రహదారులను నిరి్మస్తుంటే.. రాజధానిలో మాత్రం కి.మీ.కు రూ.66 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేశారు. చదరపు అడుగు రూ.1,800 నుంచి రూ.2 వేల లోపు వ్యయంతో భవనాలను నిరి్మంచవచ్చు. కానీ.. ఏకంగా చదరపు అడుగు రూ.పదివేల చొప్పున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో అధిక వడ్డీలకు తెచి్చన అప్పులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. పప్పులు బెల్లాల్లా.. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు పప్పులు, బెల్లాల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం పంచిపెడుతోంది. ఊరూపేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉర్సా.. మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడిది. ఇక లులూ సంస్థకు మాల్ నిర్మాణానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండడం భూదోపిడీకి పరాకాష్ట. మొదటి సంతకమే దగా.. దగాఅధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సీఎం హోదాలో 16,437 పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేశారు. గత ఏడాది డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా దాదాపు 11 నెలలు కాలయాపన చేసి మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనూ అనేక కొర్రీలు పెట్టారు. 50 శాతం అర్హత మార్కుల నిబంధన తెచ్చి అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని డీఎస్సీకి దూరం చేశారు. టెట్ ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు.ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటరీ్మడియట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసినవారికి ఈ నిబంధన వర్తించదని 2019లో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల ఉసురు తీసింది.తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలు ఇచి్చంది. జనరల్ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 50 శాతంగా అలాగే ఉంచింది. జనరల్ అభ్యర్థులకు టెట్లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆ మేరకు తగ్గించకపోవడం గమనార్హం.పాలనలో అట్టర్ ప్లాప్.. డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతున్నారు. కూటమి వచి్చన వెంటనే పచ్చమూకలు.. వెంటాడి, వేటాడి 36 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంపేశాయి. 300 మంది నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.ఈ దారుణాన్ని దేశానికి చాటిచెప్పేందుకు జూలై 24న ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాకు దిగారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. కృష్ణా, బుడమేరు వరద నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో విజయవాడను వరద చుట్టుముట్టి 50 మంది పైగా బలితీసుకుంది. దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో గేట్లను ఢీకొట్టే కుట్ర చేశారని ఆరోపించారు. వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. ఇంటింటికీ కరెంట్ షాక్ కరెంటు చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని గెలిచాక.. కరెంటు చార్జీలను పెంచేసి.. ఇంటింటికీ కరెంట్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.ఇంటింటికీ రేషన్ రద్దు.. మద్యం సరఫరా ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడంతో 20 వేల మంది రోడ్డున పడ్డారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ బియ్యం, సరుకులు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ దుకాణం వద్ద గంటల కొద్దీ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.వలంటీర్లపై సమ్మెట దెబ్బ తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.పది వేల వేతనం ఇస్తామని పవన్ కళ్యాణ్ సైతం వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసి వారిని నట్టేట ముంచేశారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ఫ్రచారం చేశారు. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం తప్పుడు కథనాలను వండివార్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు.చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రూ.7,21,918 కోట్లే. ఈ లెక్కన 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు మాత్రమే. ఇందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం సంపద సృష్టించి.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నమ్మలికారు. కానీ.. సంపద సృష్టి మాటలకే పరిమితమైంది. సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన ప్రజలనుద్దేశించి.. సంపద సృష్టించడం ఎలాగో తన చెవిలో చెప్పాలంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్రాన్ని 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు.లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిరాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై యూటర్న్ ప్రజల భూములు లాక్కునేందుకే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారని, దస్తావేజులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని దారుణమైన అబద్ధాలతో కూటమి నేతలు ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. 13 వేల గ్రామాలకుగాను 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ కుట్రలో ఈ చట్టం బలైపోయింది. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయత్నించారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు. -
రెడ్బుక్ వత్తాసు.. అదుపు తప్పిన ‘పోలీసు’
రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తు కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి, పోలీసులకింత, ఎమ్మెల్యేకు ఇంత, చంద్రబాబుకు ఇంత, లోకేశ్కు ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది.ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్ రూములకు అనుమతిస్తున్నారు. ప్రతి పర్మిట్ రూమ్, ప్రతి బెల్ట్ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్ , ల్యాటరైట్.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా?గొడవల వల్ల కేసులుండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు.. ఏది న్యాయం.. అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారు. కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా? అలా చేస్తే అది ధర్మమేనా?-వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఎవరి మీదైనా కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై ముగ్గురు యువకులను అరికాళ్లపై కొడుతూ హింసించిన ఘటనకు సంబంధించి బాధిత యువకుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేస్తోందో కనిపిస్తోందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలేం జరిగిందంటే.. ⇒ పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరిముల్లాలు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్ తెనాలిలో ఉండడు. పాలిటెక్నిక్ చదివిన అతను హైదరాబాద్లో జొమాటో కంపెనీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా యువకులు. చిన్నతనంలో ఏదో పాత కేసు వాయిదా కోసం రాకేష్ తెనాలి వచ్చాడు. అతన్ని చూడటానికి అతని స్నేహితుడు జాన్ విక్టర్ మంగళగిరి నుంచి వచ్చాడు. అతను జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయ్యాడు. విక్టర్ వెంట అతని స్నేహితుడు మెకానిక్ అయిన కరీముల్లా కూడా వచ్చాడు. ⇒ ఈ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతా నగర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్విక్టర్ బైక్తో పాటు, అతడి మొబైల్ను సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించి ఆ కానిస్టేబుల్ నుంచి బైక్ కీ, మొబైల్ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్ విక్టర్ మంగళగిరి వెళ్లారు. ఇది జరిగింది ఏప్రిల్ 24న. ⇒ ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్.. జూనియర్ అడ్వకేట్ అయిన జాన్విక్టర్తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాకేష్ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్ పీఎస్లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 26న ముగ్గురినీ స్టేషన్కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ తెనాలి టూ టౌన్సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు. (ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చూపారు) ⇒ అంతటితో ఊర్కోక, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 27న కూడా మరో రోడ్ సెంటర్కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా, విక్టర్ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించారు. ఆ మర్నాడు, ఏప్రిల్ 28న వారిని కోర్టులో హాజరు పర్చారు. పోలీసుల దెబ్బలకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషషన్కు తీసుకెళ్లి, ప్రైవేట్ పార్టులకు కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారు.ఈ ప్రశ్నలకు బదులేది?⇒ ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూపినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి. ⇒ ఏప్రిల్ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీరి్ణంచుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు. ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.అన్ని వ్యవస్థలూ నాశనం⇒ లా అండ్ ఆర్డర్ కుప్పకూలిన పరిస్థితుల మధ్య.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వక పోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేదు. ⇒ మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.అందుకే ‘వెన్నుపోటు దినం’ ⇒ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ను గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా బుధవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని మరోసారి పిలుపునిస్తున్నా. ⇒ ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నా. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.పలకరించిన వారే లేరు.. జగన్ భరోసా ఇచ్చారుమా అబ్బాయి బాబులాల్ అలియాస్ కరిముల్లా మంగళగిరిలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలసి తెనాలి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించ లేదు. వైఎస్ జగన్ ఒక్కరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.– షేక్ అమీర్బాషా, రాంతున్ (బాబులాల్ తల్లిదండ్రులు) బాధలో ఉన్న మాకు ధైర్యం చెప్పారు మా అబ్బాయి రాకేష్కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్ వేశారు. కాలులో రాడ్ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. – దోమ వాసు, మాధవి (రాకేష్ తల్లిదండ్రులు)పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?⇒ ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవరు? ⇒ జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్విక్టర్ జూనియర్ అడ్వకేట్ కాదా? రాకేష్ చెల్లెలు ఇంజనీర్ (ఆమెను చూపుతూ). రాకేష్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, కొట్టి పరువు తీయడం ధర్మమేనా? ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి? అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్ ⇒ కరీముల్లాపై కూడా గతంలో ఎలాంటి కేసులు లేవు. కానీ అతడని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్విక్టర్, రాకేష్ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొచ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్ మీడియా ఇష్టానుసారం దు్రష్పచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు. ⇒ కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా.. పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరు అయితేనేం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాల పరువు తీస్తారా? ⇒ పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశారు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టుల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని, పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ పరువు తీయడం భావ్యమేనా? ⇒ ఇది రాకేష్ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్రే. అతడి కాలు విరిగితే ఆపరేషషన్ చేసి లోపల రాడ్ వేశారు. ఆ విషయం మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చితకబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమేనా?⇒ ఈ పాప రాకేష్ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. వీరి పరువు తీశారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా? విక్టర్ జూనియర్ అడ్వకేట్. విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్. ఒక మాజీ జర్నలిస్ట్ కొడుకు పరిస్థితి ఇది. ఇది ధర్మమేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి.పోలీస్ రాజ్యం.. హింసాకాండ⇒ ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడిపై తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్లో పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామçÜ్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. కానీ హరికృష్ణ ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉన్నాడు. ⇒ రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. వీరు పోలీసులా.. రాక్షసులా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అతడిని హింసించారు. చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు సుధారాణి, కృష్ణవేణి మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.జగన్ పర్యటనలో భద్రత లోపాలుచింతలపూడి చెక్పోస్టు నుంచే ఆటంకాలుట్రాఫిక్ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యంటీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో వచ్చినా అడ్డుకోని వైనంకనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్ పోలీసులువైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. కొంత మంది పోలీసులను కేటాయించినా, వారు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కి ఆటంకాలు మొదలయ్యాయి. జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసినా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏ మాత్రం దారి మళ్లించలేదు. దీంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి ఆలస్యం అయ్యింది. పట్టణంలోకి అడుగు పెట్టాక కూడా కనీసం రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్ వస్తున్న మార్గంలో వారు నల్ల బెలూన్లతో వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు. వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టిన జనం.. కానరాని పోలీసులు ఓ దశలో వారు జగన్ కాన్వాయ్కి అడ్డం పడే ప్రయత్నం చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించడానికి వస్తున్నారన్న కారణంతోనే పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐతా నగర్లో దోమా రాకేష్ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుకు సందులో ఉన్న రాకేష్ ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు, జగన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరిద్దరు అధికారులు తప్ప పోలీసు సిబ్బంది కనపడలేదు. జగన్ కాన్వాయ్లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్ కూడా దిగలేదు. దీన్ని బట్టి కావాలనే జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన సమాచారం ముందుగానే జిల్లా ఎస్పీకి అందించినా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. -
జనం సొమ్ముతో జల్సా!
సాక్షి, అమరావతి : స్త్రీనిధి సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీ సొమ్మును ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిగారి జల్సాల కోసం దుబారా చేస్తున్నారు. రూ.35 లక్షలతో ఓ కారు కొనడమే కాక.. నెలనెలా దాని పెట్రోల్ ఖర్చుల కోసం మరో రూ.30 వేల చొప్పున సమర్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం స్త్రీనిధి సంస్థ మేనేజింగ్ కమిటీ (ఎంసీ) సమావేశంలో ఇప్పటికే తీర్మానం కూడా జరిగిపోయిందని.. అమలుచేయడమే తరువాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో స్త్రీనిధి సంస్థలోకి డిప్యూటేషన్పై వచ్చిన ఓ ఉన్నతాధికారే ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు సమాచారం. నిజానికి.. స్త్రీనిధి సంస్థ ఎండీగా కొనసాగుతున్న సదరు అధికారి వినియోగానికి ఇప్పటికే ఓ ఇన్నోవా కారు ఉండగా, ఆయన అవసరాల కోసమంటూ కొత్తగా రూ.35 లక్షల సంస్థ నిధులతో మరో ఇన్నోవా కారు సిద్ధంచేస్తున్నారు. ఈ రెండింటిలో ఒకటి సదరు మంత్రి తన సొంత నియోజకవర్గంలో ఉన్నప్పుడు వినియోగించుకోవడానికి అప్పగించాలని నిర్ణయించారు.మంత్రి పేషీ ఉద్యోగులకూ స్త్రీనిధి నుంచే జీతాలు.. ఇదే కాదు.. సదరు ఉన్నతాధికారి స్త్రీనిధి సంస్థలో కొందరు అస్మదీయులకు భారీగా వేతనాలు పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. ఓ మంత్రి పేషీలో పీఏగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు సీఎంఓలో పనిచేసే మరో ఇద్దరికీ స్త్రీనిధి సంస్థ నుంచే వేతనాలు చెల్లించేందుకు సదరు ఉన్నతాధికారి ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. పీఏగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొకరికి నెలకు రూ.35 వేల చొప్పున వేతనంతో ‘స్త్రీనిధి’లో ఉద్యోగం ఇచ్చి, నెలల వ్యవధిలోనే దానిని రూ.45 వేలకు పెంచారు. దీనికి అదనంగా టీఏ, డిప్యూటేషన్ భత్యం అంటూ మరో రూ.20 వేలు చెల్లించేలా స్త్రీనిధి ఉన్నతాధికారి చక్రం తిప్పారని అందులోని సిబ్బంది చెబుతున్నారు. అలాగే, ఐదేళ్ల క్రితం వివిధ కారణాలతో ఈ సంస్థ నుంచి తొలగించిన ముగ్గురు అధికారుల పునరి్నయామకానికి ఆ ఉన్నతాధికారి ఆమోదం తెలిపారని.. పైగా వారి వేతనాలూ భారీగా నిర్ధారించారని సంస్థలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. పొదుపు మహిళల వడ్డీ మార్జిన్లో కోత.. ఇదిలా ఉంటే.. మంత్రి కోసం స్త్రీనిధి సంస్థ ద్వారా కారు కోనుగోలుకు తీర్మానం చేసిన సమావేశంలోనే మరో కీలక తీర్మానం చేశారు. దుబారా ఖర్చుల కోసమా అన్నట్లుగా పొదుపు సంఘాల రుణాలపై వసూలుచేసే వడ్డీలో గ్రామ, మండల సమాఖ్యలకిచ్చే వడ్డీ మార్జిన్ను 50 శాతం మేర తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం స్త్రీనిధి సంస్థ మహిళలకిచ్చే రుణాలపై 11.5 శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తుండగా, అందులో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి ఏడాది చివరిన ఆయా గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలకు చెల్లిస్తున్నారు. కానీ, ఇప్పుడా వడ్డీ మార్జిన్ కోత నిర్ణయంతో పొదుపు మహిళలు భారీగా నష్టపోనున్నారు. వడ్డీ మార్జిన్ను రెండు నుంచి ఒక శాతానికి కోత వేయడంవల్ల వారు ఏటా దాదాపు రూ.10 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. -
సీ వీడ్ .. సో గుడ్
కైకలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది.సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు. పోషకాల గని.. సముద్రపు నాచు సముద్రపు నాచు (మెరైన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది. రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సముద్రపు నాచు విశేషాలివీ! » భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ » సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది » పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది » సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు » సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది » పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనినిఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు » సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది » సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం » ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు » తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది » మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశంతొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ అవగాహన పెంచాలి సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ -
కర్నూలు జిల్లాలో ముగ్గురికి కోవిడ్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు బీపీ, షుగర్తో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతనికి గత నెల 30న ఆయాసం అధికమవడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చే ర్పించారు. లక్షణాలను గమనించిన వైద్యులు కోవిడ్ పరీక్ష చేయించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే మంత్రాలయం మండలం పారందొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి గత నెల 8న తిరుపతిలోని స్విమ్స్లో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆమెకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో 30న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించి పరీక్ష చేయించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని 54 ఏళ్ల ఓ వైద్యురాలికీ కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు. ఈమె హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటుండగా, మిగిలిన ఇద్దరూ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక కోవిడ్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. -
రిజిస్ట్రేషన్ కష్టాలు ఇన్నిన్ని కాదయా!
ఒక ఎకరం భూమిని ముగ్గురు కొనుగోలు చేసి ఒకరికి 50 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు రిజిస్టర్ చేయించుకోవాలంటే.. ఒక్క రోజులోనే ముగ్గురికి రిజిస్ట్రేషన్ అయిపోయేది. – ఇది గతంలో అత్యంత తేలిగ్గా జరిగిన పద్ధతిఎకరం భూమిని ముగ్గురు కొంటే.. సర్వే నంబర్ను సబ్ డివిజన్ చేయించుకుని, మ్యుటేషన్కి పెట్టుకుని అడంగల్లోకి మారిన తర్వాత వారిలో ఒకరికి రిజిస్ట్రేషన్ అవుతోంది. దీనికి పది నుంచి 15 రోజుల సమయం పడుతోంది. మూడో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్లీ సబ్ డివిజన్, మ్యుటేషన్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇందుకు మరో 10, 15 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ఆస్తిని రిజిష్టర్ చేసుకోవడానికి అంతా సవ్యంగా ఉంటే నెల నుంచి 45 రోజులు.. ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకో నెల ఆలస్యం అవుతోంది. – ఇది ప్రస్తుతం నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితిసజావుగా ఉన్న వ్యవస్థను బాగు చేసే పేరుతో అస్తవ్యస్తంగా మార్చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబఅలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్కు చెందిన ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్కు 2 నెలలు దాకా తీసుకుంటోంది. ఇది వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. – సాక్షి, అమరావతిగతంలో ఎందరికైనా రిజిస్ట్రేషన్లు ఒక్క రోజులోనే అయిపోయేవి. ఎవరికివారు తమ భాగాన్ని రిజిస్టర్ చేయించుకుని డాక్యుమెంట్లు తీసుకునేవారు.కూటమి సర్కారు వచ్చాక రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్లో తెచ్చిన మార్పుల కారణంగా సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఒక వ్యక్తి తన కుమారులకు ఆస్తి పంచి ఇవ్వాలన్నా ఇబ్బందులు నెలకొంటున్నాయి. భూముల రీ సర్వే పూర్తయిన తర్వాత కొత్తగా ఎల్పీఎం నంబర్ల రిజిస్ట్రేషన్లలోనూ ఇదే తరహా ఇబ్బంది నెలకొంది. ఒక రోజు అయ్యే పనికి ఇన్ని రోజులు జాప్యం ఏమిటని ప్రజలు అడిగితే తాము చేసేదేమీ లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. స్లాట్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మళ్లీ చలానాసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్తో.. సులభంగా మారాల్సిన రిజిస్ట్రేషన్లు ఇంకా కష్టతరం అవుతున్నాయి. ఆస్తుల క్రయవిక్రయాల కోసం వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలాచోట్ల బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. వినియోగదారులు స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల కింద ప్రభుత్వానికి కట్టిన చలానాలు చెల్లడం లేదు. ఇచ్చిన స్లాట్లో రిజిస్ట్రేషన్ జరక్కపోతే తర్వాత రోజు మళ్లీ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం కొత్త చలానా నంబర్ చూపించాల్సి వస్తుండడంతో మళ్లీ కొంత కనీస మొత్తాన్ని చలానా కట్టాల్సి వస్తోంది. పలుచోట్ల దీనికోసం రూ.500, రూ.600 తీసుకుంటున్నారు. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్ష చలానా కట్టిన వ్యక్తికి ఇచ్చిన స్లాట్లో రిజిస్ట్రేషన్ చేయలేదనుకుంటే.. మరుసటి రోజు రూ.లక్ష బదులు రూ.500, రూ.600 అదనంగా చలానా తీయమంటున్నారు. ఆ చలానా నంబరుతో రిజిస్ట్రేషన్ పెట్టి, పాత స్లాట్లో కట్టిన చలానా మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలా చేసినందుకు మళ్లీ అదనంగా వినియోగదారుల నుంచి కమీషన్ గుంజుతున్నారు. -
కాపుల కన్నెర్ర.. తోకముడిచిన బాబు
సాక్షి, అమరావతి: కాపు సామాజిక వర్గంపై రెడ్బుక్ కుట్రకు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం.. 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం భగ్గుమనడం.. కాపు సామాజిక వర్గానికి మద్దతుగా వైఎస్సార్సీపీ పోరుబాట పడతామని ప్రకటించడంతో చంద్రబాబు సర్కారు విధిలేక వెనక్కి తగ్గింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా చోటుచేసుకున్న తుని ఘటనపై నమోదు చేసిన కేసులను తిరగదోడాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు ఉద్యమకారులపై కోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడుతూ సోమవారం జారీచేసిన జీవోను ఉపసంహరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ప్రభుత్వ ముఖ్యనేత, మంత్రి ఆదేశాలతో జారీ చేసిన ఈ జీవోపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. కేవలం హోం శాఖ ఉన్నతాధికారిపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకు ముఖ్యనేత ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం. భగ్గుమన్న కాపు సామాజిక వర్గం అధికారంలోకి వచ్చేశాం కాబట్టి మరోసారి కాపు సామాజిక వర్గాన్ని వేధించాలన్న చంద్రబాబు కుతంత్రం బెడిసికొట్టింది. టీడీపీ కూటమి దుర్నీతిపై కాపు సామాజిక వర్గం భగ్గుమంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా 2016లో తుని ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వమే అక్రమ కేసు నమోదు చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించింది.మరోవైపు విజయవాడ రైల్వే న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. అయినా గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభు త్వం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపునకు ఆ కేసును తిరగదోడాలని నిర్ణయించింది. సాక్షాత్తు రైల్వే న్యాయస్థానం కొట్టివేసిన కేసులో పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.దాంతో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బట్టబయౖలెంది. ప్రభుత్వ పన్నాగంపై కాపు సామాజిక వర్గం తీవ్రస్థాయిలో స్పందించింది. 2014 ఎన్నికల్లో తమను వాడుకుని వదిలేసినట్టే.. 2024ఎన్నికల్లో కూడా తమను ఉప యోగించుకుని ప్రస్తుతం కరివేపాకులా తీసిపారేయడం పట్ల ఆ వర్గం నేతలు విరుచుకుపడ్డారు. కూటమి కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. బలిపీఠంపై హోం శాఖ కార్యదర్శిని నెట్టి.. ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో చంద్రబాబు బెంబేలెత్తారు. తమ కుట్రను కొనసాగిస్తే ఎన్నికలకు ముందే తమ పుట్టి మునుగుతుందని గ్రహించారు. పన్నాగం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు తాను తప్పించుకునేందుకు మరోసారి తనదైన డైవర్షన్ రాజకీయాలతో కనికట్టు చేసేందుకు సిద్ధపడ్డారు. తుని ఘటనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేసిన తీర్పును సవాల్ చేయడం.. ఆ కేసును పునరి్వచారణకు సిద్ధపడటం అత్యంత కీలకమైన అంశమే కాదు.. అంతకుమించి అత్యంత సున్నితమైన వ్యవహారం. యావత్ కాపు సామాజికవర్గ మనోభావాలతో ముడిపడిన అంశం. అంతటి కీలకమైన అంశంపై జీవో జారీ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం హోం శాఖకే పరిమితమయ్యే అంశం కూడా కాదు. హోం శాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అనుమతి తీసుకున్న అనంతరమే జీవో జారీ చేస్తారన్నది ప్రభుత్వ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిన విషయమే. తుని ఘటనపై కేసుపై పునర్విచారణ కోరాలన్న నిర్ణయం సీఎం చంద్రబాబు స్థాయిలో తీసుకున్న నిర్ణయమేనన్నది నిస్సందేహం. కానీ.. తమ కుతంత్రం బెడిసికొట్టడంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే హోం శాఖ అధికారులు జీవో జారీ చేశారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్పై చర్యలు తీసుకోనున్నట్టు కూడా మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. అంటే త్వరలోనే ఆయనపై బదిలీ వేటు వేస్తారని స్పష్టమవుతోంది. తద్వారా తమ పన్నాగానికి హోం శాఖ కార్యదర్శిని బలి చేసి తాను తప్పించుకోవాలన్నదే ప్రభుత్వ పెద్దల తాజా యోచన. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి తప్పుదారి పట్టించాలన్నది అసలు లక్ష్యం. ఓ కుట్ర బెడిసికొడితే వెంటనే మరో కనికట్టు కుట్రకు తెగబడటం చంద్రబాబు మార్కు రాజకీయం మరి. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గానికి పూర్తి సంఘీభావం ప్రకటించింది. తుని ఘటనను తిరగదోడి కాపులను వేధించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఇప్పటికే పేదలు, బడుగు, బలహీన వర్గాలను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని విరుచుకుపడింది. టీడీపీ కూటమి కుట్రకు వ్యతిరేకంగా కాపు సామాజికవర్గ పోరాటానికి అండగా నిలుస్తామని ప్రకటించింది. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మేన్గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
అప్పుల భారం @ రూ.1,51,604 కోట్లు
‘అప్పు’డు అలా..మేం అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే రాష్ట్ర సంపద పెంచుతాం.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను భారీగా చేపడతాం –ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పలుఇప్పుడు ఇలా.. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది.. ఏడాది గిర్రున తిరిగింది.. మరి సీఎంగా చంద్రబాబు చేసింది ఏమున్నది అంటే.. రాష్ట్ర ప్రజలపై రూ.1,51,604 కోట్ల అప్పు భారం మోపడం. సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మి.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసి.. ప్రజలకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పుల భారం వేసింది. తాము గెలిచి ఏడాది అయినందుకు.. ప్రజలకు బహుమానంగా మంగళవారం మరో రూ.7 వేల కోట్లు అప్పు చేసింది.» తాజా అప్పుతో సరిగ్గా ఏడాదిలో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,01,194 కోట్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా 6.61 శాతం నుంచి 6.84 శాతం వడ్డీకి ఈ మొత్తం అప్పును సమీకరించింది. » బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. » ఇంత పెద్దమొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచి్చన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. » ఏడాది పాలనలో చంద్రబాబు సర్కారు చేసింది ఏమైనా ఉంది అంటే.. అది భారీగా అప్పులే. ఏపీఎండీసీకి చెందిన 436 మైనర్ గనుల లీజుల విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా రూ.9 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల మేర బాండ్లు జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్లు జారీ ద్వారా అప్పు చేయనుంది. » ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున గతంలో ఏ ప్రభుత్వమూ అప్పులు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. లేని అప్పులను ఉన్నట్లు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలు తెలియజేయడం లేదు. పైగా చంద్రబాబు సర్కారు ఆస్తుల కల్పనకు గానీ సంక్షేమానికి గానీ పైసా వ్యయం చేయడం లేదు. ఒకపక్క ఎక్కువగా అప్పులు చేస్తూనే మరోపక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ఏడాదిగా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. -
ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు...ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the @ncbn Garu-led government.In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a… pic.twitter.com/vuvKiJidBn— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో: -
కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యపై అటు కాపు నేతలు, ఇటు వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు సర్కార్ వెనకడుగువేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్లీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం,. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని సరికొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందనేది వాస్తవం. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే యత్నం చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు -
టాలెంట్ ఉండాలే గానీ.. అమెరికన్ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం
బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు. పట్టుదల, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. దీనికి నిడుమోలు లక్ష్మీ నారాయణరావు దానికి ఒక ఉదాహరణ. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంలో అద్భుతమైన ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు. చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు.రూ. 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవాడు నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో 2021-2025 బ్యాచ్కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.ఇదీ చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీమలుపు తిప్పిన ఇంటర్న్షిప్తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు అమెరికన్ కంపెనీ రుబ్రిక్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది. రావు అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్ను తిరస్కరించాడు.. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ (AIML)కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ ఇన్స్స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిBIT మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ రావును అభినందించింది. గతంలో, గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి రూ. 52 లక్షలుగా నమోదైందని BIT మెస్రా ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు. -
కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: భారత అథ్లెట్ కుంజా రజిత(Kunja Rajitha)కి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని తన సందేశంలో ఆకాంక్షించారాయన.Congratulations to Kunja Rajitha for winning gold in women’s 4x400 relay at the 26th Asian Athletics Championships held in Gumi, South Korea. This gem of an athlete from Ramachandrapuram (V) in Alluri Sitarama Raju Dist. is a pride of our state. Wishing her all the success in… pic.twitter.com/hC2ZRw5ORo— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్స్టేషన్కు, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.దీంతో ఎస్ఐ రమేష్బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్డ్రైవ్లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్స్టేషన్లోను, ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)లో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజురీయింబర్స్మెంట్ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం(Vennupotu Dinam) నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నించడమే ఆ యువకుల తప్పా? -
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గతేడాది నవంబర్లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. -
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్ జగన్
సాక్షి, తెనాలి: రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్బుక్తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్లో జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్. బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న ఐతానగర్లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్ ప్రశ్నించారు. -
తెనాలి: వైఎస్ జగన్ భద్రతలో లోపాలు
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. మళ్లీ అదే.. అదే నిర్లక్ష్యం వహిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. భారీగా జనసందోహం వస్తారని తెలిసి కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం.. అరకోర సిబ్బందిని కేటాయించినా వాళ్లు పట్టిపట్టనట్లుగా వ్యవహారించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.పోలీసుల చేతిలో హింసకు గురైన బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ తెనాలి వెళ్లారు. మార్గమధ్యంలో.. చింతలపూడి చెక్ పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కు ఆటంకాలు కలిగాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను పోలీసులు కావాలనే నిలవరించలేదని స్పష్టమైంది. ఇక.. తెనాలిలోకి ఎంటరయ్యాక కూడా రోప్ పార్టీ కనిపించలేదు. దీంతో కార్యకర్తలే జగన్ వాహనానికి రక్షణగా నిలిచి ముందుకు తీసుకెళ్లారు. చివరకు ఐతా నగర్లోని జాన్ విక్టర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. జగన్ వచ్చేదాకా కూడా ఆ ఇంటి వద్ద ఒక్క పోలీసు సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు.. జగన్ తెనాలి పర్యటనలో భద్రతాలోపాలపై వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వం, పోలీసులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు వెన్నుపోటు: ఏపీలో తిండిగింజలకు పరేషాన్ (చిత్రాలు)
-
నా పిల్లలు.. మోదీ తాతను మిస్ అవుతున్నారు: ఉషా వాన్స్
వాషింగ్టన్ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని నరేంద్ర మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) గుర్తు చేశారు. జేడీ వాన్స్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్ అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.Usha Vance about Modi ji 🔥 pic.twitter.com/44qcmseFFX— desi mojito 🇮🇳 (@desimojito) June 3, 2025అమెరికా వాషింగ్టన్ డీసీలో యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మీరాబెల్లు భారత్ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. 'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన ఐదేళ్ల కుమార్తె మీరాబెల్ పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
ఇచ్ఛాపురం టౌన్(శ్రీకాకుళం): మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు. అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు. -
ఆ ధైర్యం బాబు, పవన్తో సహా ఎవరికీ లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ శెభాష్ అనిపించుకున్నట్లే.. లోకేశ్ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్బుక్’ అంటూ వైఎస్సార్సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 👉గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో విద్యార్ధికి వెరిఫికేషన్లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే 93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్ ప్రస్తావన కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే ఒక రకం. .. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా కథనాలు ఇస్తే విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా, ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్కు వెళ్లిన వారంతా వైఎస్సార్సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పల్లా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ కార్మికులపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలామంది పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పల్లా వ్యాఖ్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మండిపడ్డారు. ఊసరవెల్లి రాజకీయాలను పక్కనపెట్టి కార్మికులకు క్షమాపణలు చెప్పాలంటూ పల్లాను డిమాండ్ చేశారు. పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?. అంత ప్రేమ ఉంటే.. మహానాడులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు చర్చించలేదు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయి. ఇకనైనా తన ఊసరవెల్లి రాజకీయాలను పల్లా పక్కనపెడితే మంచిది’’ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ(Vizag Steel Plant JAC) నాయకులు అన్నారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో ఘోస్ట్ ఉద్యోగులు ఉన్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. 400 మంది కార్మిక నాయకులు ఈ లిస్ట్లో ఉన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే నాలుగేళ్లలో ప్లాంట్ మూసేయాల్సి ఉంటుంది’’ అని పల్లా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానపరిచేలా ఉన్నాయంటూ కార్మికులు పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉర్సా భూముల వ్యవహారం.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి సవాల్ -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 84,418 మంది స్వామిని దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.89 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
తెనాలి: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
మా బాధలు మీకేం తెలుసు?.. మంత్రి కందుల దుర్గేష్ను నిలదీసిన రైతులు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్కు నిరసన సెగ తగిలింది. ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులైనా ధాన్యం డబ్బులు జమ కావట్లేదనీ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని.. ధాన్యానికి ఈ దుస్థితి ఎప్పుడూ లేదని ఉండ్రాజవరం రైతులు నిలదీశారు.ధాన్యం సొమ్ము ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించిన అన్నదాతలు.. మిల్లర్లు 1,600మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారని మద్దతు ధర రూ.1,720 ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఉడ్రాజవరం, పెరవలి మండలాల రైతులకు ధాన్యం సొమ్ము రూ. 22 కోట్లు రావాల్సి ఉందని, దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెప్పారని, కానీ అది ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ‘బాబు’
కడప సెవెన్రోడ్స్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధ్వజమెత్తారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. అందుకే ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఎన్నికల హామీలు తుంగలో..తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని అంజద్బాషా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. సీ్త్ర శక్తి కింద 18+, 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 15 వేలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల అరియర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి పాత పద్దతిని పునరుద్దరించడం వల్ల పేదలు, మహిళలు రాత్రి 8.30 గంటల సమయంలో కూడా ఎఫ్పీ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సమావేశంలో వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభా గం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, కార్పొరేటర్ షఫీ, నాయకులు యానాదయ్య, వేణుగోపాల్ నాయక్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అమరావతి తప్ప సీమ, ఉత్తరాంధ్ర పట్టడం లేదుముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమి పట్టడం లేదని అంజద్బాషా విమర్శించారు. తన కోటరీలో ఉన్న రియల్టర్లు, బాబు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకే అమరావతి నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఎంతో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించడం అన్యాయమన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు వచ్చాక 66 వేల మంది విద్యార్థులు రీ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయడం మంత్రి లోకేష్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఏడాదయినా.. ఎగరని కిసాన్ డ్రోన్
సాక్షి, అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారే అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వంలో కిసాన్ డ్రోన్ ప్రాజెక్టు పరిస్థితి. పగ్గాలు చేపట్టి ఏడాదైనా కూటమి డ్రోన్స్ ఎగరనంటున్నాయి. గతంలోనే డ్రోన్ పైలట్ల శిక్షణ ఇచ్చారు. రైతు కమిటీలను సిద్ధం చేశారు. కానీ, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో కిసాన్ డ్రోన్స్ అడుగు ముందుకుపడలేదు. తొలి ఏడాది విఫలమైనప్పటికీ రెండో ఏడాది రెట్టింపు టార్గెట్ పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.రైతు సేవా కేంద్రాల (పూర్వపు రైతు భరోసా కేంద్రాలు)కు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (సీహెచ్సీ)కు కిసాన్ డ్రోన్స్ను పంపిణీ చేయాలని గత వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి 596 మండలాల్లో 1,755 ఆర్బీకేలను ఎంపిక చేసింది. యూనిట్ రూ.10 లక్షల అంచనాతో రూ.85 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. డ్రోన్స్ నిర్వహణకు నలుగురు లేదా ఐదుగురు రైతులతో సీహెచ్సీలను సైతం ఏర్పాటు చేసి, వారిలో అర్హులైన 676 మందికి ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఏపీ సెన్సార్ అండ్ స్మార్ట్ అప్లికేషన్స్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ (అప్సరా) ద్వారా పైలట్లుగా శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ సరి్టఫైడ్ డ్రోన్స్ ఎంపిక, తయారీదారులతో ఎంప్యానల్ కోసం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. సరిగ్గా.. కంపెనీ ఎంపిక సమయంలో పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై గడిచిన రబీ సీజన్కు ముందుగానే కిసాన్ డ్రోన్స్ ఎగరవేస్తామంటూ గొప్పలు చెప్పింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బడాయి పోయింది. డ్రోన్ సమ్మిట్లో సైతం కిసాన్ డ్రోన్స్పై ఊదరగొట్టారు. లక్ష్యానికి దూరంగా.. ఆర్కేవీవై–ఎఫ్పీఆర్ 2024–25లో సబ్సిడీ కింద రూ.80 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. డీజీసీఏ ధ్రువీకరించిన హెక్సా కాప్టర్ మోడల్ డ్రోన్స్ (కనీసం 30 కేజీల బరువుతో)ను ఎంపిక చేయాలని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ) సిఫార్సు చేసింది. కనీసం 20 ఎకరాల విస్తీర్ణంలో పంటకు ఒకేసారి పిచికారీ చేయగల బ్యాటరీ సామర్థ్యం ఉన్నవాటిని మాత్రమే ఎంపిక చేయాలని ప్రతిపాదించారు.17 కంపెనీలు 23 మోడల్స్ను ప్రదర్శించగా, క్షేత్రస్థాయి పరిశీలనలో 15 కంపెనీలకు చెందిన 19 మోడల్స్ను డీజీసీఏ ప్రమాణాల సాకుతో తిరస్కరించారు. కేవలం విహంగ టెక్నాలజీస్, డ్రోగో డ్రోన్స్ కంపెనీలను ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు గతంలో రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేసిన సీహెచ్సీలను పక్కనపెట్టి కూటమి రైతుల (సాగుకు దూరంగా ఉన్నవారితో) కమిటీలు ఏర్పాటు చేశారు. 80% సబ్సిడీ అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం తొలుత 100% రైతు కమిటీలే భరించాలని, యూనిట్ గ్రౌండింగ్ తర్వాత సబ్సిడీని విడతల వారీగా జమ చేస్తామని ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఏడాది పాటు ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అదిగో ఇచ్చేస్తున్నామంటూ కాలయాపన తప్ప ఒక్క డ్రోన్ కూడా పొలాల్లో ఎగురవేయలేని దుస్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది (2025–26)లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం గమనార్హం. నిరుడు 875 కిసాన్ డ్రోన్స్లో ఒక్కటీ ఇవ్వలేకున్నా.. ఈసారి దాదాపు రెట్టింపుగా 1,515 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రైతు సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 80 శాతం సబ్సిడీపై వెయ్యి, వ్యవసాయ పట్టభద్రులకు 50 శాతం సబ్సిడీపై 75 కిసాన్ డ్రోన్లు ఇవ్వాలని సంకల్పించారు. ఇందుకోసం రూ.83.75 కోట్లు రాయితీగా ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు.నమో డ్రోన్నూ ఖాతాలో వేసుకునే ఎత్తు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్ ప్రాజెక్టు అమలులో విఫలమైంది. కొత్తగా భారీగా ఇస్తామని చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకంపై కన్నేసింది. దీని ద్వారా మహిళా సంఘాలకు 80 శాతం రాయితీపై ఇవ్వబోతున్న 440 డ్రోన్లను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తు వేస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై కేసు.. ఈ సారి ఏం చేశారంటే?
సాక్షి,పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై మరో మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్ కాల్లో అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్మెయిల్కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలుడ మండిపడ్డాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరో మహిళ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఫిర్యాదు చేయడం గమనార్హం. -
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’.. డీజీపీకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం బుధవారం (4వ తేదీ) నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త శాంతియుత ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో విడుదలైన లేఖలో ముఖ్యాంశాలు ‘వెన్నుపోటు దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత ర్యాలీలు నిర్వహించి, ఆయా చోట్ల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ కార్యక్రమం కోసం ముందస్తు అనుమతి కోరుతూ, చాలా రోజులకు ముందే స్థానికంగా ఆయా పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసినా, ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ, మా పార్టీ కార్యక్రమం నిర్వహించకుండా చేయాలని చూస్తున్నారు. ఇది కచ్చితంగా ఇండియన్ పోలీస్ యాక్ట్, సెక్షన్– 30 ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రధాన విపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి శాంతియుతంగా తాము తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా, తాము ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలకు స్థానికంగా పోలీసు అధికారులు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలివ్వాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఆ విధంగా ప్రభుత్వం పట్ల ప్రజలు తమ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది’ అని పేర్కొన్నారు. -
డీలర్ల ద్వారా రేషన్.. మంత్రి నాదెండ్ల మాటల అర్థమేంటి?
సాక్షి, అమరావతి: డీలర్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దాటవేత ధోరణిని అవలంభించారు. రేషన్ డిపోల్లో తొలిరోజు నుంచే పేదల వేలిముద్రలు తీసుకుని బియ్యం దొడ్డిదారిన తరలిస్తున్నారన్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పైగా గతంలో బఫర్ గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు.. అక్కడ నుంచి నేరుగా బియ్యం పంపిణీ వాహనాలకు (ఎండీయూలకు) సరఫరా జరిగేదని, తద్వారా బియ్యం ఎక్కడికి వెళ్లేవో లెక్కలు ఉండేవి కావని అవగాహన రాహిత్యంతో మాట్లాడారు.సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకేసారి ఎక్కువ మంది దుకాణాలకు వస్తుంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పడం ద్వారా పంపిణీలో డొల్లతనాన్ని బయటపెట్టారు. మరోవైపు సమాచారం లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం డిపోలకు వస్తున్నట్టు అంగీకరించారు. 3.73 లక్షల మంది వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించామని చెప్పుకొచ్చారు. రేషన్ పంపిణీ తొలిరోజే చాలాచోట్ల బియ్యం అక్రమ రవాణా జరిగిందని మీడియా ప్రశ్నించగా.. భవిష్యత్లో ప్రతి బ్యాగ్కు క్యూఆర్ కోడ్, షాపుల్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. బియ్యానికి బదులు డీలర్లు డబ్బులిచ్చి పంపిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వే సమాధానమైంది. ఈ–పోస్ సమస్యలపై ప్రశ్నించగా కొన్నిచోట్ల సమస్య వచ్చి ఉండొచ్చన్నారు. వైఎస్ జగన్ పర్యటనపై గాబరా దళిత యువకులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ, బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి మనోహర్ గాబరా పడ్డారు. రేషన్ సేవలపై మీడియా సమావేశం పెట్టి వైఎస్ జగన్ పర్యటనపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. -
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?. సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
ఇసుక దోపిడీపై టీడీపీలోనే ఆగ్రహ జ్వాల!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దోపిడీపై టీడీపీ శిబిరంలోనే అసంతృప్తి భగ్గుమంటోంది. జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో టీడీపీ కార్యకర్త సనపల సురేశ్ తన సొంత పార్టీకి చెందిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఆయన అనుచరులపై ఇసుక దోపిడీకి సంబంధించి నేరుగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. లంచం లేకపోతే చర్యలు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర అధికారుల సమక్షంలోనే రూ.1.50లక్షల నగదు జేబులోంచి బయటకు తీయడం మరింత సంచలనం రేపింది. లంచమిస్తా.. చర్యలు తీసుకోండి: సనపల సురేశ్గ్రీవెన్స్ సెల్లో సురేశ్ మాట్లాడుతూ, ‘ఇసుక అక్రమ తవ్వకాలను ఆపండి. ఇప్పటికే ఎన్నో సార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాను. మైనింగ్ అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నాను. కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్నానని ఎమ్మెల్యే అనుచరులు నాపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. నాపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు.ఒకవేళ తప్పుడు ఫిర్యాదులు చేశాననుకుంటే నాపై చర్యలు తీసుకోండి. లంచాలకు అలవాటు పడి ఇసుక అక్రమాలను అడ్డుకోవడం లేదు. అదే లంచం నేను ఇస్తాను.. చర్యలు తీసుకోండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ‘ఇదిగో.. లంచం అంటూ’ తన జేబులో నుంచి రూ.1.50 లక్షలు తీసి ఇవ్వడానికి సిద్ధమవడంతో అందరూ షాక్కు గురయ్యారు. సుదీర్ఘకాలంగా టీడీపీకి విధేయుడిగా, సీనియర్ కార్యకర్తగా కొనసాగుతున్న సురేశ్, ఇసుక అక్రమాలను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో అడ్డగోలు తవ్వకాలువంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన తవ్వకాలతో ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడి దీవుల్లా కనిపిస్తున్నాయి. వందలాది లారీల రవాణాతో రోడ్లన్నీ ఛిద్రమైపోతున్నాయి. ఒక్క ఆమదాలవలస నియోజకవర్గంలోనే ఇసుక ద్వారా రోజుకి రూ.50 లక్షలకు పైగా తెలుగు తమ్ముళ్లు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. అనుమతులిచ్చిన ర్యాంపుల గడువు ముగిసినప్పటికీ తవ్వకాలు ఆపడం లేదు. డీసిల్టేషన్ పాయింట్లోనైతే పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారు. పరిమితికి మించి లోడింగ్, రవాణా చేయడంతో లారీల చక్రాలు కూడా విరిగిపోతున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. -
కర్నూలు జిల్లాలో మరో సీఐ వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలను బెదిరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పి.ప్రవీణ్కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. పోలీస్స్టేషన్లో బెదిరింపులు.. రెండేళ్ల క్రితం దూదేకొండ గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి నుంచి రూ.10 వడ్డీతో ప్రవీణ్కుమార్ రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. రూ.50 వేలు చెల్లించాడు. ఇంకా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే, కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమారుడు రంగస్వామి, రంగన్న ఇద్దరు కలిసి పోలీసుస్టేషన్కు వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సీఐ జయన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రవీణ్కుమార్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో వారు ఒత్తిడి పెంచారు. పైగా.. గతంలో కొంత చెల్లించినా కూడా మళ్లీ అప్పు ఉన్నట్లుగా ప్రామిసరి నోటు రాయించారు. మిగిలిన బాకీ రూ.50వేలు తనకిస్తే అప్పు ఇచ్చిన వారికి తాను ఇచ్చి సెటిల్చేస్తానని సీఐ కొద్దిరోజుల క్రితం చెప్పారు. అలాగే, పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన రూ.లక్ష నగదు, తలారి కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన రూ.50వేలు మే 31లోగా చెల్లించకపోతే రౌడీషిట్ ఓపెన్ చేస్తానని పచ్చిబూతులు తిడుతూ బెదిరించారు. అంతేకాక.. గతంలో జరిగిన ఇంటి గొడవలో ఎలాంటి విచారణ చేపట్టకుండానే ప్రవీణ్కుమార్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. జేఎం తండా, హోసూరుకు చెందిన ఇద్దరి వద్ద చీటీ విషయమై రాసుకున్న ప్రామిసరీ నోటుకు బదులుగా పోలీసుస్టేషన్లో మరో ప్రామిసరీ నోటు బలవంతంగా రాయించారు. ఇలా కక్షపూరితంగా టార్గెట్ చేసి వేధిస్తుండడాన్ని భరించలేక తాను పురుగుల మందు తాగినట్లు బాధితుడు ప్రవీణ్కుమార్ చెప్పాడు. -
జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్ రజిత్గుప్తా
సాక్షి, అమరావతి/నరసన్నపేట/పిఠాపురం/బేస్తవారిపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ సోమవారం ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,80,422 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయగా, 54,378 మంది అర్హత సాధించారు.వారిలో అత్యధికంగా 12,946 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు ఉండటం విశేషం. మొత్తం అర్హత సాధించిన వారిలో 44,974 మంది పురుష అభ్యర్థులు, 9,404 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన రజిత్ గుప్తా కామన్ ర్యాంక్ లిస్టులో జాతీయ స్థాయి టాప్ ర్యాంకర్గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను అతను 332 మార్కులు సాధించారు. ఐఐటీ ఖరగ్పూర్ జోన్కు చెందిన దేవదత్త మాఝీ 312 మార్కులతో మహిళల విభాగంలో టాపర్(జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు)గా నిలిచారు.టాప్–10లో ఇద్దరు ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు అర్నవ్ సింగ్ 9వ ర్యాంక్, వడ్లమూడి లోకేష్ 10వ ర్యాంక్ సాధించారు. తొలి రెండు స్థానాలతోపాటు మొత్తం టాప్–10 ర్యాంక్లలో ఐఐటీ ఢిల్లీ జోన్కు నాలుగు, ఐఐటీ ముంబయి జోన్కు మూడు, ఐఐటీ హైదరాబాద్ జోన్కు రెండు, ఐఐటీ కాన్పూర్ జోన్కు ఒకటి చొప్పున వచ్చాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం జోసా కౌన్సెలింగ్కు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్..ఐఐటీ హైదరాబాద్ జోన్ తర్వాత ఢిల్లీ జోన్లో 11,370 మంది, ముంబయి జోన్లో 11,226, రూర్కీ జోన్లో 5,445, ఖరగ్పూర్ జోన్లో 5,353, కాన్పూర్ జోన్లో 5,295, గువాహటి జోన్లో 2,743 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన జోన్లతో పోలిస్తే అడ్వాన్స్డ్లో హైదరాబాద్ జోన్ విద్యార్థులు గణనీయమైన ఫలితాలు సాధించారు.టాప్–10లో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 57 మంది, టాప్–300లో 78 మంది, టాప్–400లో 116 మంది, టాప్–500లో 136 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐఐటీ హైదరాబాద్ జోన్కు చెందిన వంగల అజయ్రెడ్డి, ఓబీసీ–ఎన్సీఎల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి మొదటి ర్యాంకులు పొందారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ టాపర్గా అర్నవ్ సింగ్, మహిళల కేటగిరీలో కోరికన రసజ్ఞ (జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్) టాపర్గా నిలిచారు.శ్రీకాకుళం జిల్లా విద్యార్థికి ఓబీసీ కేటగిరీ టాప్ ర్యాంక్ జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి ఓబీసీ–ఎన్సీఎల్(నాన్ క్రిమిలేయర్) కేటగిరీలో మొదటి ర్యాంక్ పొందాడు. జనరల్ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకు వచ్చింది. ఓవరాల్గా 310 మార్కులు వచ్చాయి. అతనికి జేఈఈ మెయిన్ పరీక్షలో కూడా 99.99 శాతం మార్కులు వచ్చాయి. తమ కుమారుడికి జేఈఈ అడ్వాన్స్డ్లో అత్యుత్తమ ర్యాంక్ రావడంపై జ్ఞాన రుత్విక్ సాయి తల్లిదండ్రులు ధర్మాన లత, శంకర్ నారాయణ ఆనందం వ్యక్తంచేశారు.దివ్యాంగుల కేటగిరీలో తన్వీకి రెండో ర్యాంక్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన అప్పన రాజరాజేశ్వరి తన్వీ దివ్యాంగుల కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి రాజేష్ పిఠాపురంలో వ్యాపారి. తల్లి సుప్రియ గృహిణి. కంప్యూటర్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేసి, సివిల్స్ సాధించాలన్నదే తన ధ్యేయమని తన్వీ తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురానికి చెందిన మంతు వెంకట రవిచంద్రారెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాతీయ స్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. అతని తల్లిదండ్రులు మంతు రాజశేఖరరెడ్డి, వెంకట రత్నాలు సంతోషం వ్యక్తంచేశారు.జాతీయ స్థాయిలో టాప్ 10 అభ్యర్థులుర్యాంకు పేరు జోన్1 రజిత్ గుప్తా (332 మార్కులు) ఐఐటీ ఢిల్లీ2 సక్షం జిందాల్ (332 మార్కులు) ఐఐటీ ఢిల్లీ3 మాజిద్ ముజాహిద్ హుస్సేన్ (330 మార్కులు) ఐఐటీ ముంబయి4 పార్థ్ మందర్ వర్తక్ (327 మార్కులు) ఐఐటీ ముంబయి5 ఉజ్వల్ కేసరి (324 మార్కులు) ఐఐటీ ఢిల్లీ6 అక్షత్ కుమార్ చౌరాసియా (321 మార్కులు) ఐఐటీ కాన్పూర్7 సాహిల్ ముఖేష్ డియో (321 మార్కులు) ఐఐటీ ముంబాయ్8 దేవేష్ పంకజ్ భయ్యా (319 మార్కులు) ఐఐటీ ఢిల్లీ9 అర్నవ్ సింగ్ (319 మార్కులు) ఐఐటీ హైదరాబాద్10 వడ్లమూడి లోకేశ్ (317 మార్కులు) ఐఐటీ హైదరాబాద్జేఈఈ అడ్వాన్స్డ్–2025కి గణాంకాలు ఇలా..జెండర్ నమోదు హాజరు అర్హతపురుషులు 1,43,810 1,39,085 44,974మహిళలు 43,413 41,337 9,404మొత్తం 1,87,223 1,80,422 54,378 -
కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం 'కాపులు కరివేపాకులా'?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కక్ష సాధింపులో వారినీ టార్గెట్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నరీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తమను కూరలో కరివేపాకులా తీసిపారేయడం మాత్రమే కాదు.. ఏకంగా అక్రమ కేసులు పెట్టి వేధించే కుట్రకు తెగబడటంపై ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టివేసినా సరే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాటిని తిరగదోడాలని నిర్ణయించడం.. పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించడం కాపు సామాజికవర్గాన్ని షాక్కు గురి చేసింది. ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రస్తుతం అధికారంలోకి రాగానే తన అసలు నైజాన్ని చూపించారని కాపు సామాజికవర్గం దుయ్యబడుతోంది. కక్ష సాధింపు కోసం చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిన ఈ దుష్ట సంప్రదాయం రాష్ట్ర రాజకీయాలను మరింత కలుషితం చేయడమే కాకుండా రాష్ట్రంలో వర్గ వైషమ్యాలు రేకెత్తించే ప్రమాదం ఉందని కూడా పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరోసారి గురయ్యామని కాపు సామాజికవర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేపడితే 2016లో అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కేసులను న్యాయస్థానాలే తోసిపుచ్చడంతో కాపులకు ఊరట లభించింది. కాగా 2024 ఎన్నికల్లో మరోసారి కాపులను మాయమాటలతో చంద్రబాబు కనికట్టు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 2016 నాటి కేసును తిరగదోడి కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం తెగబడటం గమనార్హం. గతంలో చేసిన మోసానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించామని, ఈసారి చేస్తున్న మోసానికి కూడా అదే రీతిలో శిక్షిస్తామని కాపు సామాజికవర్గం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడతామని... తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు మరోసారి రుచి చూపిస్తామని చెబుతోంది. హామీని నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం 2014 టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమను ఓబీసీల్లో చేర్చాలంటూ కాపులందరూ కూడా 2016 జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా, తునిలో ‘కాపు గర్జన’ పేరుతో సభను ఏర్పాటు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ కార్యక్రమంలో వేల మంది కాపులు పాల్గొన్నారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొందరు గుర్తు తెలియని విద్రోహులు అందులో చేరి రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పుపెట్టారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులు ఆందోళనకారులపై 329 కేసులు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో కాపులపై కేసులు పెట్టారు. అయితే కాపులు కేసులకు భయపడకుండా ఆ తరువాత కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కాపు ఉద్యమకారులపై గతంలో పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులను ఉపసంహరించుకున్నారు. కొన్ని కేసుల్లో విజయవాడ కోర్టు 2023లో ఉద్యమకారులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.కాపు సామాజికవర్గమే లక్ష్యంగా కుట్రఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వంరాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కాపులు 2016లో చేపట్టిన ఆందోళనకారులపై అప్పట్లో కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి ఆ ఉద్యమకారులను జైలు పాల్జేయడానికి కంకణం కట్టుకుంది. కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్తో ఆందోళన చేపట్టినందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా పలువురు కాపులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కేసులు నమోదు చేసింది. మొత్తం 329 కేసులు పెట్టింది. ఇందులో పలు కేసులను ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించింది. మరికొన్ని కేసులపై విచారణ జరిపిన విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభంతోపాటు 41 మందిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఆ మేర 2023 మే 1న తీర్పు వెలువరించింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ కేసులను తిరగదోడుతోంది. కాపు ఉద్యమకారులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కి అనుమతినిచ్చింది. విజయవాడ రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం జీవో 852 జారీ చేశారు. చంద్రబాబు కాపు వ్యతిరేకిసీఎం చంద్రబాబు కాపు వ్యతిరేకి. కాపులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కోర్టు కొట్టేసిన కేసుపై పునర్విచారణకు వెళ్లాలని చూస్తున్నారు. అన్యాయంగా కాపు జాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు. తగిన గుణపాఠం చెబుతాం.– చినమిల్లి వెంకటరాయుడు, కాపునాడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుకాపులను ఇబ్బంది పెడితే సహించం..గత ప్రభుత్వంలో రైలు దగ్థం కేసులో కాపులపై పెట్టిన కేసులు కొట్టేస్తే.. ఈ ప్రభుత్వం వాటిని తిరగదోడి కాపులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాపులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపులపై కేసులు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే సీట్లు తగ్గించారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం కాపులపై వివక్ష చూపడం సమంజసం కాదు. – సంకటి లక్ష్మణరావు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులుకేసు తిరగదోడటం మంచి పద్ధతి కాదు..కాపు సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణిస్తున్నాం. రైలు ప్రమాద ఘటన అనేది ముగిసిన అధ్యాయం. తిరిగి ఆ కేసును రీ ఓపెన్ చేయడం బాధాకరం. కాపులమంతా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇది కాపు జాతి మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తాం. – బండి శ్రీనివాసరావు, కాపు సామాజికవర్గ ఐక్యవేదిక నాయకుడు, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా కాపుల జోలికొస్తే సర్కారు పతనమే..తుని కేసును పునర్విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపుల కారణంగానే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. అది మరిచిపోయి కాపు జాతిపై కక్ష సాధింపునకు పాల్పడితే చంద్రబాబు సర్కారుకు పతనమే.– తోట రాజీవ్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్రంగా కేసును ముందు పునర్విచారణ చేయాలి..గతంలో కాపులను టీడీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధించింది. కాపులను అణచివేసే ప్రయత్నం చేసింది. అక్రమ కేసులు బనాయించింది. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేసింది. కాపులే లక్ష్యంగా ఆ కేసును పునర్విచారించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. కాపులను వేధింపులకు గురిచేస్తే సహించేదిలేదు. పాత కేసులు పునర్విచారణ చేయించాలనుకుంటే ముందుగా వంగవీటి మోహన్రంగా హత్య కేసును పునర్విచారణ జరపాలి.– యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘంఇలాగైతే బలిజలు కూటమిలో ఇమడలేరు..రెండేళ్ల క్రితం తుని ఘటనపై సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కొట్టేసిన కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావాల్సిన అవసరంలేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. బలిజలంతా కూటమిలో ఇమడలేని పరిస్థితులు తలెత్తుతాయి. – రామమూర్తి, కాపు జేఏసీ రాష్ట్ర సహ కార్యదర్శి, బీజేపీ చిత్తూరు జిల్లా నాయకుడు, చిత్తూరు. -
ఉర్సా భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా..?
సాక్షి, అమరావతి: ఉర్సా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బయటపెట్టడంతో పాటు ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రి నారా లోకేశ్కు సవాల్ విసిరారు. ఉర్సా భూముల వ్యవహారంలో మంత్రి లోకేశ్ చేసిన సవాల్కు స్పందిస్తూ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి లోకేశ్కు పలు ప్రశ్నలు సంధించారు.⇒ ఉర్సా కంపెనీకి విశాఖపట్నం ఐటీ హిల్లో ఎకరం కోటి రూపాయలకు మూడున్నర ఎకరాలు, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున రూ.56.36 కోట్లకు కేటాయించామంటూ మీరు ప్రకటించడం ఏంటి? దీనికి సంబంధించిన జీఓ విడుదల కాకుండా ఇప్పుడు మీరు చెప్పడం ఏంటి? ⇒ కుంభకోణం బయటపడ్డ దాదాపు 50 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం ఏంటి? దీనివెనుక నడిచిన తతంగం ఏంటి?⇒ ఉర్సాకు కేటాయించిన భూమి రేటు విషయమై యాభై రోజులుగా గప్చుప్గా వ్యవహరించిన మీరు, ఇవాళ అకస్మాత్తుగా మీ బినామీ కంపెనీ గత ఏప్రిల్ 21నాడు విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యవహారంలో మీరు మూసేయాల్సినవి మూసేశారా? ఫైళ్లు చింపేసినా, తగలబెట్టినా స్కిల్ స్కాం తరహాలో బయటకు వస్తాయి కదా?⇒ మీరు 2024 అక్టోబర్ 25న అమెరికాకు వెళ్లారు. 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో కంపెనీ రిజిస్టర్ అయ్యింది. 2025 ఫిబ్రవరి 12న హైదరాబాద్లో ప్రారంభం అయ్యింది. ఈ పరిణామాల వెనుక అసలు అర్థం ఏంటి? ⇒ 2025 ఏప్రిల్ 10న చంద్రబాబు అధ్యక్షతన సమావేశమై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, ఆ తర్వాత ఏప్రిల్ 15న కేబినెట్లో ఆమోదం వెంటవెంటనే జరిగిపోయాయి. ఏమిటీ మీకు అంత ప్రేమ?⇒ రూ. 5,728 కోట్ల పెట్టుబడి పెడతామంటున్న ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్ను, లక్ష రూపాయిల పెయిడప్క్యాపిటల్ను మాత్రమే కలిగి ఉండడం వెనుక అర్థం ఏంటి? అలాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా ఇవ్వడం ఏంటి? ⇒ ఉర్సా చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఆ కంపెనీ సృష్టించిన టెక్నాలజీ ఏంటి? మీరైనా చెప్పగలరా?⇒ రూ.5 వేల కోట్ల కంపెనీ హైదరాబాద్లోని ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఉంది. ఒక కుటుంబం ఎంత కరెంటు బిల్లు కడుతుందో అంతే మొత్తాన్ని ఈ కంపెనీ కడుతోంది. ఇలాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములను అప్పగించడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు?⇒ ఉర్సాకు ఎకరా రూ.50 కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తున్నారు. మరి ఎవరికైనా ఇలాగే ఇస్తారా? ⇒ ఉర్సా కంపెనీకి చెందిన సతీష్ అబ్బూరి 21 సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేశారని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇందులో పాలుపంచుకున్నాడని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై మీరెందుకు దర్యాప్తు చేయించడంలేదు. ⇒ కేశినేని చిన్ని ద్వారా సతీష్ అబ్బూరితో ఈ కంపెనీని సృష్టించి దాని ద్వారా విశాఖలో విలువైన 60 ఎకరాలు కొట్టేశారన్న ఆరోపణలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? -
కోవిడ్ పరీక్షలు పెంచండి..
సాక్షి, అమరావతి : కొత్త వేరియంట్ రూపంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో నియంత్రణ చర్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిన తీరుపై ‘కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్యశాఖ సోమవారం కదిలింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సోమవారం హుటాహుటిన సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో పరీక్షల సామర్థ్యం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.రోజుకు వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాధిపతులకు చెప్పారు. పాత జీజీహెచ్లలో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్లలో రోజుకు 50 చొప్పున పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటూ.. నెలరోజులకు అవసరమయ్యే కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి, రోజువారీ పరీక్షల తీరును గమనించాలని చెప్పారు. గత పది రోజులుగా బయటపడ్డ కోవిడ్ కేసులను విశ్లేషించాలన్నారు. ఈ సమీక్షలో వైద్యశాఖ అధికారులు వీరపాండియన్, గిరీశా, డాక్టర్ నరసింహం పాల్గొన్నారు.12 నుంచి 11వ స్థానానికి..రాష్ట్ర వైద్యశాఖ హడావుడిగా సమీక్ష నిర్వహించి పరీక్షల సామర్థ్యం పెంచాలని ఆదేశించడం చూస్తుంటే.. ఇప్పటివరకు కరోనా పరీక్షలు అంతంతమాత్రంగా చేపట్టినట్లు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లయింది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే.. రాష్ట్రంలో ఇంకా పరీక్షలు పెంచే యోచనల్లోనే ప్రభుత్వం ఉండడం ఏమిటని.. ఈవెంట్స్ మేనేజ్మెంట్పై చూపుతున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై చూపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు..యాక్టివ్ కేసుల్లో ఇప్పటివరకు దేశంలో 12వ స్థానంలో ఉన్న ఏపీ తాజాగా సోమవారం 11వ స్థానానికి ఎగబాకింది. -
డీల్ కాదు.. జేబు ఖాళీ!
ఒక వస్తువు కావాల్సి వచ్చి ఆన్స్ లైన్స్ లో వెతికేటప్పుడు.. ఆ ఉత్పాదన తాలూకు పేజీలో ‘ఒకటి మాత్రమే ఉంది’, ‘10 నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్’, ‘ఫ్లాష్ డీల్ ఈ రోజు వరకే’ వంటి సందేశాలు దర్శనమిస్తాయి. అవి నిజమనుకుని నమ్మి కస్టమర్లు వెంటనే కొనేస్తారు. అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా చేసే ఈ మాయాజాలాన్ని ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలుస్తారు. ఈ–కామర్స్ కంపెనీలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్భాటంగా నిర్వహించే ‘ఆన్స్ లైన్స్ సేల్స్’ సమయంలో ఈ మాయాజాలం విభిన్న రూపాల్లో ‘స్క్రీన్స్ ’పైన దర్శనమిస్తుంది.ఓ సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా ఆకర్షితులై 40% కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తున్నారట. షాపింగ్ వెబ్సైట్ల తప్పుదారి పట్టించే, మోసపూరిత, చట్టవిరుద్ధ వ్యూహాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ కంపెనీలు వివిధ రకాల డార్క్ ప్యాటర్న్స్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో.. లేదా అంతగా ఉపయోగకరం కాని ఉత్పత్తులను కొన్నామనో వినియోగదారులు తరువాత తెలుసుకుంటున్నారు. ఆన్స్ లైన్ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తు, సేవలను వేగంగా, సౌకర్యంగా పొందడం కోసం తరచూ డబ్బు, సమాచారం, గోప్యతతో రాజీ పడుతున్నారనేది నగ్న సత్యం.ఒకటికి రెండుసార్లు..ఏ వెబ్సైట్ ఉపయోగిస్తున్నా, సర్వీస్ ప్రొవైడర్ను ఎంతగా విశ్వసించినా మీ నుండి ఏ సమాచారం అడుగుతున్నారు, ఎటువంటి అనుమతులు కోరుతున్నారు అనే అంశాలపై వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలి. స్క్రీన్స్ పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ‘బై’ బటన్స్ క్లిక్ చేసే ముందు మీకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటికి రెండుసార్లు గమనించాలి. ఆన్స్ లైన్ సేవల కోసం సైన్ అప్ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు స్పష్టమైన, కచ్చిత అవకాశం ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కనీసం ఒకటి..అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా–2024 నివేదిక ప్రకారం.. అత్యధికంగా డౌన్స్ లోడ్ అయిన టాప్–53 భారతీయ యాప్స్లో ఒకటి మినహా మిగిలినవన్నీ కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ ఉపయోగించాయట. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 50% భారతీయ వినియోగదారులు ఆన్స్ లైన్ చెల్లింపుల సమయంలో కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ సమస్యను ఎదుర్కొన్నారట.రంగంలోకి కేంద్ర ప్రభుత్వంఈ–కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ఈ మోసపూరిత విధానాల పట్ల వినియోగదారులు, ఆఫ్లైన్స్ ట్రేడర్ల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉత్పత్తులు పరిమితంగా ఉన్నాయని బుకాయించడం, పేమెంట్ చేసే సమయానికి అదనపు చార్జీ, నకిలీ కౌంట్డౌన్స్ టైమర్స్, ఒక వస్తువు చూపించి మరొకటి అంటగట్టడం, లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం, యూజర్ కోరకున్నా ప్రకటనల వీడియో ప్లే కావడం, తప్పుడు రివ్యూలు, పోల్చుకునే అవకాశం లేకపోవడం వంటి 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ను గుర్తించింది.నిబంధనలను పాటించకపోతే చట్ట పరంగా చర్యలు ఉంటాయని ఈ–కామర్స్ కంపెనీలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వినియోగదారుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే, అనాలోచిత కొనుగోళ్లు, చర్యలకు దారితీసే తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ను తొలగించడానికి చేసిన మార్పులను వివరిస్తూ అంతర్గత వార్షిక తనిఖీ నివేదికలను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. విదేశాల్లో చట్టాలుభారత్లో ఇప్పటివరకు ఈ పద్ధతిని నిషేధించే నిర్దిష్ట చట్టాలు లేవు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా గుర్తిస్తూ డార్క్ ప్యాటర్న్స్ను అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) 2023 నవంబర్లో మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికా, ఈయూ తదితర దేశాల్లో దీనికి సంబంధించి చట్టాలు అమలులోనూ ఉన్నాయి. వినియోగదారులు కుకీజ్ను అంగీకరించడం కంటే తిరస్కరించడం కష్టతరం చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ రెండింటికీ ఈయూ, ఫ్రెంచ్ డేటా రక్షణ చట్టాల ప్రకారం 2022లో జరిమానా విధించారు. -
ముఖ్యనేత.. ‘ఐకానిక్’ మేత
రాజధాని ప్రాంతంలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేయడమే కాకుండా.. ఆ పనులను పాత ‘సిండికేట్’ సంస్థలకే కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ చక్రం తిప్పారు. అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడంతోపాటు పాత కాంట్రాక్టు సంస్థలనే తెరపైకి తెచ్చి.. పోటీదారులు లేకుండా పక్కా వ్యూహ రచన చేశారు. నచ్చిన సంస్థలకే అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి భారీ దోపిడీకి తెరలేపారు. సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో సిండి‘కేటు’ లాలూ‘ఛీ’ పర్వం ఐకానిక్ టవర్ల టెండర్ల సాక్షిగా మరోసారి బట్టబయలైంది. మూడు ప్యాకేజీల కింద ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఆ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే.. 2018లో ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకే ఇప్పుడూ కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ పథకం పన్నారు. తద్వారా పాత సంస్థలకే మూడు ప్యాకేజీలను అధిక (ఎక్సెస్) ధరకు కట్టబెడుతూ సీఆర్డీఏ సోమవారం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.159 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు ఖజానాను కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టి నీకింత.. నాకింత అంటూ పంచుకుతినడానికి ముఖ్యనేత సిద్ధమయ్యారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్–జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులకు టెండర్లు పిలిచి 2018 ఏప్రిల్లోనే కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే⇒ సచివాలయం 1, 2 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ ఐకానిక్ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ⇒ ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేటులోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. ⇒ 1, 2 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఇదే షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.24 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.3, 4 ఐకానిక్ టవర్లు నిర్మాణంలోనూ ఇలా..3, 4 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.57 శాతం అధిక ధరకు అంటే రూ.1,304 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.7 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.761.08 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.జీఏడీ టవర్ పనులూ అధిక ధరకే..జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.49 శాతం అధిక ధరకు అంటే రూ.882 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,045.6 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఇదే ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.491.54 కోట్లు పెరిగింది. అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలాఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ఇదే ఐకానిక్ టవర్ల పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,082.86 కోట్లు పెరిగింది. ఐదు ఐకానిక్ టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడుతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఐటీ శాఖకు అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత జారీ చేసిన జీవో ప్రకారం సోమవారంతో గడువు ముగిసింది. వీటిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు మరింత సమయం కోరారు.దీంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఉద్యోగుల బదిలీకి సంబంధించి మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల బేరసారాలకు సమయం సరిపోకపోవడంతో గడువు పొడిగించారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. -
వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం
సాక్షి, అమరావతి: వైద్యశాఖలో బదిలీల కోసం శనివారం జారీచేసిన మార్గదర్శకాలు ఉద్యోగులను గందరగోళపరుస్తున్నాయి. రెండేళ్ల సర్విసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం కల్పించారు. ఐదు ఆప్షన్లను ఎంచుకోవాలని సూచించారు. అయితే, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల స్థానాలను ఖాళీలుగా ప్రకటిస్తారా? ఎంచుకున్న ఐదు స్థానాల్లో ఖాళీలేని పక్షంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి బదిలీ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో రెండేళ్ల సర్విసు పైబడిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే అయోమయం నెలకొంది.మరోవైపు.. బదిలీ దరఖాస్తుల సమర్పణకు మంగళవారం తుది గడువు విధించారు. అయితే, సోమవారం సాయంత్రానికి కూడా అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను ప్రదర్శించనేలేదు. దీంతో ఖాళీల వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేదెలా అని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా డీఎంఈ పరిధిలోని రాష్ట్రస్థాయి కేడర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ ఖాళీల వివరాలను సోమవారం సాయంత్రం వరకూ ప్రకటించలేదు. మీకేమైనా సమాచారం ఉందా అంటూ వైద్యులందరూ తాము పనిచేస్తున్న కళాశాలల ప్రిన్సిపాల్స్ కార్యాలయాల చుట్టూ సోమవారం ప్రదక్షిణలు చేశారు. ఖాళీలు చూపకపోవడంపై ఆరోపణలు.. ఐదేళ్లు సర్వీసు పూర్తయినప్పటికీ కొందరు వైద్యులు, ఇతర ఉద్యోగులు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లోని పరిపాలన సిబ్బంది, బాస్లను మేనేజ్ చేసుకుని తమ స్థానాలను ఖాళీలుగా చూపకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐదేళ్లు పైబడిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) జాబితాలో కొన్ని స్థానాలు పొందుపరచలేదని తెలుస్తోంది.ఐదేళ్లు పైబడినప్పటికీ తిరుపతి రుయా, విశాఖ కేజీహెచ్లలో ముగ్గురు సీఏఎస్ స్థానాలను ఖాళీగా చూపలేదని వైద్యుల నుంచి ఫిర్యాదులున్నాయి. మిగిలిన కేడర్లలోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. వీరి సీనియారిటీని రెగ్యులరైజ్ అయిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటారా? లేక మరేదైనా నిబంధనలున్నాయా అనే ప్రస్తావన కూడా చేయకపోవడంతో వీరంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. -
రేషన్ వాహనాల రద్దు.. ప్రజలకు మరో వెన్నుపోటు
తణుకు అర్బన్: రేషన్ వాహనాల రద్దు.. ప్రజలకు చంద్రబాబు పొడిచిన మరో వెన్నుపోటు అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు బాధపడుతుంటేనే చంద్రబాబుకు ఇష్టమని, వారికి ఏది బాగున్నా.. ఆయనకు నచ్చదని, ఆయన కన్నుకుడుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాల రద్దుతో ప్రజలు చౌక దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో రేషన్ బియ్యం కోసం క్యూలో ఉన్న వృద్ధురాలు ఎండ వేడికి తట్టుకోలేక ప్రాణం కోల్పోయిందని, ఈ పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.రేషన్ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాకు సర్కారే తెరలేపిందని, ప్రారంభించిన రోజే విశాఖపట్నంలో 40 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేలాది కుటుంబాల ఉపాధిని దెబ్బతీసిందని, వలంటీర్లు, మద్యం దుకాణాల్లో గుమాస్తాలు, రేషన్ వాహనాల డ్రైవర్లను, అసిస్టెంట్లను తొలగించిందని విమర్శించారు. రేషన్ వాహనాల రద్దుతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలను ఎత్తుకుని మహిళలు కొండలు, కోనల్లో నడుచుకుంటూ చౌక దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.పండించిన పంటలకు సరైన ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని కారుమూరి కార్యకర్తలను కోరారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని గతంలో మంత్రి నారా లోకేశ్ అనేవారని, ఇప్పుడు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను ఆయన పగలగొడతారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు రాక.. ఎంటీఎస్ టీచర్ ఆత్మహత్య
కోరుకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా అందకపోవడంతో తూర్పుగోదావరి జిల్లాలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడేనికి చెందిన కన్నాబత్తుల విజయకుమార్ (43) కాపవరం మండల పరిషత్ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నారు. మే నెలలో జీతాలు అందకపోవడంతో అప్పులపాలై, ఆర్థిక సమస్యలతో మానసిక వేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. పిల్లలు ఇంటర్మిడియెట్ చదువుతున్నారు. విజయకుమార్ 2008 డీఎస్సీలో ఎంపికై, నాలుగేళ్లుగా సర్విసులో ఉన్నారు. ఆ టీచర్లకు సక్రమంగా జీతాలు లేకే సమస్యలు.. 1998, 2008 సంవత్సరాల్లో టీచర్లుగా చేరిన వారికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రెగ్యులర్గా జీతాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యోగానికి ఎంపికైనా కూడా వారికి 16 సంవత్సరాలుగా ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998, 2008 సంవత్సరాల్లో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరికి సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. వారిలో పలువురు వయస్సు రీత్యా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రిటైర్మెంట్ వయస్సుకు చేరుకుంటూ, కుటుంబ పోషణ కష్టమై, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమస్యలు పరిష్కరించాలి.. ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషిచేయడంలేదు. ఎంటీఎస్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆత్మహత్యలను అరికట్టాలి. – కె.చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్రెగ్యులరైజ్ చేయాలి.. ఎంటీఎస్ టీచర్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలి. – బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. టీచర్ల ఆత్మహత్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వసతుల కల్పనలో, జీతాలందించడంలో ప్రభుత్వం విఫలమైంది. – మార్తార్ బాల్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ -
తిండిగింజలకు నానాతిప్పలు
సాక్షి, అమరావతి: నడవలేని స్థితిలోనూ చేతికర్రల సాయంతో వచ్చిన వృద్ధులు..! సర్వర్లు మొరాయించడంతో గంటల కొద్దీ క్యూలైన్లు, రోడ్లపై మహిళల పడిగాపులు..! సమయం దాటినా తెరుచుకోని చౌక దుకాణాల వద్ద నిరీక్షించిన చిన్నారులు..! చంటిబిడ్డలను చంకన ఎత్తుకుని తల్లుల ఎదురుచూపులు..! ఒకేసారి రద్దీతో డిపోల్లో కుస్తీలు..! ఈ–పోస్ మిషన్లు పనిచేయక దుకాణాలు మూసేసి వెళ్లిపోయిన డీలర్లు..! ఉసూరుమంటూ వెనుదిగిరిన కార్డుదారులు..! ..ఇదీ రాష్ట్రంలో రెండో రోజు పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అధ్వాన స్థితి.పొట్ట నింపుకొనేందుకు చౌక బియ్యమే పరమాన్నంగా భావించే పేదలను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతోంది కనికరం లేని సర్కా రు. వృద్ధులు, దివ్యాంగులపై దయ చూపకుండా మండుటెండల్లో రోడ్లపై నడిపిస్తోంది. పేదల మేలును మరిచి.. ఇంటి వద్దకే రేషన్ ఇచ్చే వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు సోమవారం రేషన్ పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా.. లబ్ధిదారుల్లో ఎవరిని పలకరించినా రేషన్ అవస్థలే వినిపిస్తున్నాయి. అక్కరకు రాని వైనం.. రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీని గొప్పగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటికే బియ్యం అందిస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే వీరు చౌక బియ్యం కోసం ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాల్సి వస్తోంది. జీవిత చరమాంకంలో.. ఊతకర్రల సాయంతో బియ్యం కోసం రేషన్ షాపుల వద్దకు వచ్చిన వయోధికులు అక్కడే కూలబడుతున్నారు.బియ్యం మూటను భుజంపై కూడా పెట్టుకోలేని దుస్థితిలో చుట్టుపక్కలవారిని సాయం కోసం బతిమలాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దనే హాయిగా రేషన్ తీసుకున్న పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం తమను అవస్థల పాలు చేస్తోందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ⇒ 65 ఏళ్లు దాటినవారికి దివ్యాంగులకు ఇంటికే డీలర్ల ద్వారా రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా 15 లక్షల మందిని లెక్కించింది. వీరిలో తొలి రోజు ఏకంగా మూడు లక్షలమందికి పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తోంది. మరి ప్రభుత్వమే ఇంటికి రేషన్ ఇస్తుంటే లక్షలమంది వృద్ధులు, దివ్యాంగులు ఎందుకు దుకాణాలకు వస్తారు? వచ్చినా డీలర్ ఇంటికే బియ్యం పంపిస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇదంతా కూటమి కుటిలతంత్రం.ఒకటే మాట.. సర్వర్ల మొరాయింపు టెక్నాలజీ వినియోగం తమ పేటెంట్ హక్కుగా చెప్పుకునే చంద్రబాబు అండ్ కో పేదలకు ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేయలేక చేతులెత్తేస్తోంది. రేషన్ దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులకు ఒక్కటే మాట వినిపిస్తోంది.. సర్వర్ పనిచేయట్లేదు అని. దీంతో ప్రజలు పాట్లు పడుతున్నారు. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. రేషన్కు 65 ఏళ్లా? రాష్ట్రంలో ప్రభుత్వం 60 లక్షలకుపైగా వృద్ధాప్య, దివ్యాంగ, ఇతర పింఛన్లను ఇస్తోంది. వీళ్లందరికీ తెల్ల రేషన్ కార్డులే ఉంటాయి. ఇందులో 48 లక్షలకు పైగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు ఉంటారు. ఇన్ని లక్షల్లో వృద్ధులు, దివ్యాంగులు ఉంటే ప్రభుత్వం 15 లక్షల మందికి.. అది కూడా 65 ఏళ్లు దాటినవారికి మాత్రమే రేషన్ ఇంటికి చేరవేస్తామని చెబుతోంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తూ.. రేషన్కు వచ్చేసరికి 65 ఏళ్లకు పెంచి చూపి ప్రజలను మోసం చేస్తోంది. తూకంలో అంతా మోసం.. కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీని ఒక్కరోజులోనే భ్రషు్టపట్టించింది. గతంలో లబ్ధిదారుల కళ్లముందే బియ్యం తూకం వేసి.. ఈ–పోస్, తూకం యంత్రం అనుసంధానాన్ని చూపించి బియ్యాన్ని సరఫరా చేసేవారు. ఇప్పుడు సిగ్నల్ సమస్య వల్ల మాన్యువల్గా బియ్యం పరిమాణాలను నమోదు చేసి, తూకం లేకుండా ఇస్తున్నారు. వేలిముద్రలు తీసుకుని బియ్యం బదులు పేదల చేతుల్లో డీలర్లు అరకొర నగదు పెడుతున్నారు.రేయింబవళ్లు పడిగాపులుసోమవారం చాలాచోట్ల అసలు రేషన్ దుకాణాలు తెరుకోలేదు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో సాయంత్రం 4.30 దాటినా చౌక దుకాణం తీయకపోవడంతో వృద్ధులు డీలర్ కోసం ఎదురుచూశారు. నెహ్రూనగర్లో 4.50కు కూడా దుకాణం తెరవకపోవడంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరిగారు. కడప హౌసింగ్బోర్డు కాలనీలో 9.50 దాటినా తెరవలేదు. ఇక్కడే ఎన్జీవో కాలనీలో సర్వర్ పనిచేయకపోవడంతో డీలర్ వెళ్లిపోయారు. ఒంగోలు బలరాం కాలనీలో సర్వర్ పనిచేయక రాత్రి సమయంలోనూ ప్రజలు పడిగాపులు పడ్డారు. వాస్తవానికి రేషన్ డీలర్ ఇల్లు ఒకచోట ఉంటుంది.. దుకాణం ఎక్కడో ఉంటుంది. దీంతో సమయపాలన పాటించడంలేదు.తలలు పట్టుకుంటున్న డీలర్లు ⇒ సర్వర్ మొరాయించడంతో ఒంగోలు జిల్లాలో రెండో రోజూ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కార్డుదారులు గంటల తరబడి ఎదురుచూశారు. వృద్ధులు కూడా దుకాణానికి వచ్చి రేషన్ తీసుకోవాలనని డీలర్లు చెబుతుండడంతో.. సుదూరంగా ఉన్నప్పటికీ కాలినడకన వెళ్లి బియ్యం గోతాలను ఎత్తుకుని అష్టకష్టాలు పడుతూ ఇళ్లకు తెచ్చుకున్నారు. ⇒ సర్వర్ సక్రమంగా పనిచేయక రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో కార్డుదారులు రెండు రోజులుగా కష్టాలు పడ్డారు. సర్వర్ ఎప్పుడు పని చేస్తుందోనని నిరీక్షించి.. డీలర్లు సైతం తలలు పట్టుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉదయం, సాయంత్రం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని వాపోయారు. ⇒ కడపతో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో సర్వర్ సమస్య కారణంగా కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సరుకులు అయిపోతాయేమోనని వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. సరుకులను ఇంటికి తీసుకెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ⇒ తిరుపతి జిల్లాలో చౌక దుకాణాల వద్దకు వెళ్లడానికి లబ్ధిదారులు నానా తిప్పలు పడ్డారు. జిల్లాలో 300 దుకాణాల బాధ్యతను∙ఇంచార్జి డీలర్లుకు అప్పజెప్పారు. వీరంతా ఒక గంట తమ షాప్ వద్ద.. మరో గంట ఇంచార్జి రేషన్ షాపు వద్ద సరుకులు ఇస్తున్నారు. కందిపప్పు, చక్కెర అరకొర ఇస్తున్నారు. ⇒ చిత్తూరు జిల్లాలో రెండోరోజు కూడా రేషన్ పంపిణీ మొరాయించింది. ఉదయం నుంచి రాత్రి వరకు సర్వర్ సమస్య వేధించింది. సర్వర్ పనిచేసినప్పుడల్లా ఒక్కో కార్డుదారుడికి రేషన్ ఇచ్చేందుకు డీలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. క్యూలో వేచి ఉన్న కార్డుదారులకు మధ్యాహ్న సమయంలో నీరసం ఆవరించింది. చాలామంది డీలర్లు ఇష్టానుసారంరేషన్ తలుపులు తీశారు. ⇒ ఏలూరు జిల్లాలో రేషన్ పంపిణీ గందరగోళంగా సాగుతోంది. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి సర్వర్ల సమస్యలతో గందరగోళం నెలకొంది. ⇒ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సోమవారం కూడా ప్రజలు రేషన్ కష్టాలు ఎదుర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు.అసలే వృద్ధురాలు. ఊతకర్ర లేనిదే నడవలేదు. అయినా బియ్యం కోసం దుకాణానికి వచ్చింది. సర్వర్ పనిచేయక గంటల తరబడి నిరీక్షించింది. ఎట్టకేలకు బియ్యం ఇచ్చాక.. సంచి భుజాన పెట్టుకుని మోయలేక అవస్థలు పడుతూ ఇంటికి బయలుదేరింది. నెల్లూరు ఈద్గామిట్ట ప్రాంతంలో సోమవారం కనిపించిన దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
నేడు తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్టు తెలిపింది.మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరుతారని వెల్లడించింది. -
ఔను.. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ మెరుపులు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసిన జీఎస్టీ ఆ తర్వాత గణనీయంగా పడిపోయిందని స్టేట్ ట్యాక్స్ కమిషనర్ ఎ.బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో గణాంకాలతో సహా వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.25,331.43 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు.. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.44,298.36 కోట్లకు పెరిగాయి.అంటే కోవిడ్ వంటి మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్తో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయినా గడచిన ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం అదనంగా రూ.18,966.57 కోట్లు పెరిగింది. అంటే ఏటా సగటున 14.97 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. కోవిడ్ తర్వాత వరుసగా మూడేళ్లు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021–22లో 25 శాతం, 2022–23లో 23 శాతం, 2024–25లో 10.1 శాతం వృద్ధి నమోదైనట్టు ఎ.బాబు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూస్తోందని.. 2024–25లో రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.44,824.51 కోట్లకే పరిమితమైందని ఎ.బాబు పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఏప్రిల్ నెలలో జీఎస్టీ ఆదాయం 3.36 శాతం తగ్గి రూ.4,686 కోట్లకు, మే నెలలో 2.24 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైందని పేర్కొన్నారు. ఒకపక్క జీఎస్టీ ఆదాయం పడిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. కిందపడ్డా మాదే పైచేయి అన్న చందంగా రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయంటూ పత్రికా ప్రకటన ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.గత ప్రభుత్వం హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదవడానికి కోవిడ్ కారణంగా రిటర్న్లు దాఖలు చేయడానికి వ్యాపారులకు గడువు పెంచరాదని, దీంతో భారీ వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 2024–25లో ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ లేకపోవడం కారణమని పేర్కొన్నారు. 2017–18 నుంచి 2019–20 వరకు లేవనెత్తిన డిమాండ్లపై వడ్డీని మాఫీ చేస్తూ పాత బకాయిలు చెల్లించడానికి అనుమతించడం ద్వారా అదనపు ఆదాయం రావడం, ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం వల్లే 2024–25లో 1.2 శాతం వృద్ధి నమోదైందని జీఎస్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. -
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?
సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలనపై లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకొంటున్నారు. కానీ, ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏం ఇచ్చింది?’’ అంటూ ‘ఎక్స్’వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణంలో.. కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కారు 44 శాతం అప్పు చేసిందని దెప్పిపొడిచారు. ‘‘ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా, భారీగా అప్పు చేసినా సంక్షేమం ఊసేలేదు.అభివృద్ధి జాడే లేదు. దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా?’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఎంవోఎస్పీఐ (కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ) నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. కాగ్, ఎంవోఎస్పీఐ నివేదికలు, ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ఉటంకిస్తూ.. ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ సోమవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో ఏమన్నారంటే..1. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ద్రవ్య లోటు 4.08 శాతం నుంచి ఏడాదిలోనే 5.12 శాతానికి పెరిగింది. 2. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 2.65 శాతం నుంచి ఏడాదిలోనే 3.61 శాతానికి చేరింది. 3. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జీఎస్డీపీలో అప్పుల వాటా 35.64 శాతానికి పెరిగింది. 4. 2024–25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49 శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ.., మా ప్రభుత్వ హయాంలో 33.25 శాతం మూల ధన వ్యయం చేశాం. -
సీఐ వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
-
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు. -
మహిళపై ‘ఎల్లో’ ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యం
ప్రకాశం జిల్లా: కొండెపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు దౌర్జన్యానికి దిగారు. సీసీ ఫుటేజ్ తనిఖీ పేరుతో అనుమతి లేకుండా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళను ఎస్సై రమేష్ పక్కకి తోసేశాడు. పోలీస్ బృందంతో ఇంట్లో హాల్ చల్ చేశాడు. మాకు సహకరించకపోతే మా విధానమే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి సీసీ కెమెరా డీవీఆర్ ఎత్తుకెళ్లినట్టు ఇంటి యజమాని కొండలరావు ఇవ్వాళ ఎస్పీకి పిర్యాదు చేశారు. -
కాపు ఉద్యమ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష.. హైకోర్టులో
సాక్షి,విజయవాడ: కాపు ఉద్యమ కారులపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ కేసులు మళ్ళీ తిరగదోలాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కాపు ఉద్యమ కారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వుల ద్వారా సమాచారం అందించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ రైల్వే కోర్టు తీర్పును వెలువరించింది. తాజాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్ళీ తుని ఘటనలో కాపు ఉద్యమ కారుల కేసులు విచారించేందుకు సిద్ధమైంది. కాగా, ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళీ అప్పీల్కు వెళ్లాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యమకారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో చూశారా?
-
తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
తూర్పు గోదావరిజిల్లా,సాక్షి: తూర్పు గోదావరిజిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు కాకినాడ బీచ్ చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం వద్ద కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నకారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల వివరాలు :-1.రేలంగి శివన్నారాయణ ( 40 )2. రేలంగి దేవి లలిత ( 34 )3. రేలింగి వర్షిత ( 13 )4. తీగిరెడ్డి శివ ( 30 )5. తీగ రెడ్డి సాన్వి ( 4 )క్షతగాత్రుల వివరాలు :-1. తీగి రెడ్డి భవాని ( 26 )2. రేలంగి హర్షిత ( 13 ) -
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్ సమ్మరీతో సహా సీల్డ్ కవర్లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. -
‘అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు’
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్లో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు కురసాల కన్నబాబు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు. -
‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి : మంత్రి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడమే కాకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల దిద్దుబాటులో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. ‘ జరిగిన తపఉకు అంగీకరించకపోగా ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. పదో తరగతి విద్యార్తుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మార్కులు తక్కువ వేసి వేలాది మంది విద్యార్థులను ఫెయిల్ చేశారు. రీవెరిఫికేషన్ చేయిస్తే ఎంతోమందికి మంచి మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ అనేది పిల్లలకు సున్నితమైన దశ. అలాంటి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రికార్డుల కోసం వారం రోజుల్లోనే పేపర్లు దిద్దాలని చూశారు. కనీసం టీచర్లు సంఖ్యను కూడా పంచకుండా పేపర్లు దిద్దించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. రీవెరిఫికేషన్ కు తీసుకున్న రూ. 6 కోట్ల ఫీజను వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తప్పించుకోవాలని చూస్తే సహించలేదు’ అని హెచ్చరించారు. -
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?
గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ చేశారు.Warm wishes to all the brothers and sisters of Telangana on this momentous #TelanganaFormationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్? ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి? -
ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. రెడ్బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే... గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు.ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పాలనమాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది.ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం(Vennupotu Dinam) పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు’ అని సజ్జల స్పష్టం చేశారు. -
బుగ్గ మఠం భూములు.. ఏపీ సర్కార్కు సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలోని బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.బుగ్గ మఠం భూములపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం, వారం రోజుల్లోగా పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జవాబు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటివరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. -
రేపు తెనాలికి వైఎస్ జగన్.. జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) రేపు తెనాలికి వెళ్లనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్(John Victor) కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి మధ్యాహ్నం 12.00గం. ప్రాంతంలో తాడేపల్లికి బయలుదేరుతారని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలకు దిగారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశాయి. -
జగన్ అడిగిందేంటి? బాబు చెప్పేదేంటి!!
అమరావతి రాజధానైతే జగన్కు వచ్చే నష్టమేమటి?.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఇది. అయితే తనకు నష్టమని జగన్ ఏనాడూ చెప్పలేదు. భారీ స్కాములతో.. వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణాలు చేపడితే ఆ నష్టాన్ని భరించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారాయన. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోనో ఇంకో చోటో.. 500 ఎకరాలలో నిర్మిస్తే సరిపోయే దానికి లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలంటూ ప్రజల నెత్తిన పెద్ద అప్పుల కొండ పెట్టడం ఎందుకు? అని జగన్ అడిగారు. దీంతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు నేరుగానే అడిగారు. కానీ.. చంద్రబాబు వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేక దబాయింపులకు దిగినట్లు స్పష్టమవుతుంది ఆయన స్పందన చూస్తే. పైగా ఆయన తప్పు చేస్తూ దానిని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి(Amaravati) పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) నిలదీస్తే, దానికి జవాబు ఇవ్వకుండా, అసూయ అని, ఇంకొకటని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? చదరపు అడుగుకు రూ.పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు చేస్తున్న మాట నిజమే కదా?. దేశంలో ఎక్కడ కూడా నిర్మాణ వ్యవయం ఎంత ఎక్కువ లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కాదు.. అమెరికాలోనూ ఉండవు. పైగా అమరావతిలో భూమి ఖర్చు లేనే లేదు. 👉గతంతో.. పోలిస్తే సిమెంటు, ఉక్కు ధరలు తగ్గాయి. ఇసుకేమో ఉచితం! అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 2018 నాటి ధరల కంటే ఎక్కువ ఎందుకు చెల్లించేందుకు సిద్ధపడుతోందని జగన్ అడిగితే.. రైతులు భూములు రాజధానికి ఇస్తే మీకెందుకు అసూయ? అనడం అసలు విషయాన్ని దాచివేయడం కాదా! మంత్రులు,హైకోర్టు జడ్జీల బంగ్లాలకు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10418, ఐఎఎస్ అధికారుల బంగ్లాలకు రూ.9771, ఐదు టవర్ల నిర్మాణానికి రూ.8981 వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి నగరంలోనే చదరపు అడుగుకు మహా అయితే రూ.నాలుగు వేలు అవుతుంది. భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా, అంతకు రెట్టింపు కంటే ఎక్కువ రేట్లు ఇస్తున్నారంటే, అందులో అవినీతి ఏ స్థాయిదో అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి రూ.77 వేల కోట్లు అవసరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. లక్ష కోట్లు పెట్టి ఏమి చేస్తావు? అంటే అలా అడగకూడదని జగన్ కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా? లేక చంద్రబాబేమైనా ఏపీకి నియంత? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్పై ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు? జగన్ ఇప్పుడు ఆధార సహితంగా ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా! నిజానికి అమరావతి కోసం ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పు సమీకరించారట. 👉గతంలో తీసుకున్న 33 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలలోనే ఇంతవరకు అభివృద్ది జరగకపోతే, ఇంకో 44 వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం కౌలుగా రూ.వందల కోట్లు చెల్లించడం.. చివరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఇదంతా ఏపీకి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అమరావతికి అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయనవసరం లేదని చంద్రబాబే అన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఎనిమిదివేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు. ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు. కాని, ముందుగా రూ.లక్ష కోట్ల అప్పయితే పడబోతోంది. అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడు అయితే దాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా? లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీనిని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ గా చేయడం ప్రభుత్వానికి తగునా!. 👉అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో చెప్పిన దానిని ఎవరైనా నమ్ముతారా?. బడ్జెట్లోనే రూ.6,000 వేల కోట్లు కేటాయించారు కదా? అందులో నుంచి సుమారు రూ.2,800 కోట్లు సీఆర్డీఏకి విడుదల చేసింది అసత్యమా?. ప్రపంచ బ్యాంక్, జర్మని సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా?.. లేదు కదా!. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా? అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చిత్తశుద్దితో అలాంటి భావన ఉండి ఉంటే పది పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్లు వ్యయం చేయవలసిన అవసరం ఏమి ఉంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడీ భారమే ఉండదు కదా! ఈ పల్లెల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు తమ ప్రాంతానికి కూడా అంత పెద్ద మొత్తం చొప్పున ఖర్చు చేయండని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తే అంగీకరిస్తారా?. 👉బెంగుళూరును మించిన విమానాశ్రయం ఏపీకి కావాలట. అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. అంటే ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడి బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్టులో నిర్మాణాలు చేయడం..అదంతా వృథాయేనా?. శంషాబాద్ విమానాశ్రయం వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు మూసివేసినట్లు గన్నవరం ఎయిర్ పోర్టును నిలిపివేయక తప్పదు కదా! పోనీ ఇప్పుడు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు విజయవాడ, గుంటూరులకు కూడా నలభై, ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది. దీనిని కట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారుడు ఎన్ని షరతులు పెడతారో? ప్రపంచంలో అతి రద్దీ ఉన్న విమానాశ్రయలు ఏవీ కూడా ఇంత విస్తీర్ణంలో లేవట. భారత్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన పలు ఎయిర్ పోర్టులు రద్దీ లేక కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయని చెబుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్యే విమానాలు నడపలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయే!. వీటన్నిటిని కప్పిపుచ్చి ప్రజలను మభ్య పెట్టడం అవసరమా?. నిజంగానే గన్నవరం వద్ద అంత భారీగా రద్దీ పెరిగితే కొత్త ఎయిర్ పోర్టు కట్టినా ఫర్వాలేదు.అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ కబుర్లు అన్నీ దేనికి! 👉కేవలం సూపర్ సిక్స్(Super Six Promises) తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం,వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం..ఇదే ఏపీలో జరుగుతున్న తంతు.ఇప్పటికే సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏమి చేస్తారు.అవి వృథాయేనా? ఒక్కొక్కటి నలభై, ఏభై అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి, ఎవరి భూములో తీసుకుని ప్రభుత్వం వేల కోట్లతో అభివృద్ది చేయవలసిన అవసరం ఏమిటి? వీటికి జవాబు లేక జగన్ ను నిందిస్తే కధ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGHవరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,031 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.46 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
టీడీపీకి గుడ్బై.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు. జి.కొండూరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన వైఎస్సార్సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. నాలుగు రోజులుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా వేగంగా విస్తరించేందుకు ఇది దోహపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు కొద్దిమేర తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు విజయనగరం, వైఎస్సార్ కడప, నంద్యాల, అనకాపల్లి, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గుర్ల, వైఎస్సార్ కడప జిల్లా ఎస్.మైదుకూరులో 24 గంటల వ్యవధిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
వైద్యశాఖలో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి : వైద్యశాఖలో ఆదివారం నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. 15 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులకు స్థానచలనం అవకాశం ఉంది. ఖాళీల ప్రకటన, బదిలీ దరఖాస్తుల స్వీకరణకు మంగళవారం వరకూ గడువు విధించారు. 6–8 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి, 9న సీనియారిటీ జాబితాలు ప్రదర్శిస్తారు. 10–11 తేదీల్లో వినతుల స్వీకరణ, 12–14 తేదీల్లో తుది మెరిట్ జాబితా ప్రదర్శన అనంతరం 15–17 తేదీల్లో బదిలీల ఉత్తర్వులు జారీచేస్తారు. 19లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తారు. 23న.. బదిలీ అయిన వారందరినీ ప్రస్తుత స్థానాల్లో రిలీవ్ అయినట్లుగా పరిగణిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒకేచోట ఐదేళ్లయితే తప్పనిసరి బదిలీ..ఈ ఏడాది మే 31 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అర్హత కల్పించారు. మూడేళ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న పాలనా సిబ్బందికి, ఒకేచోట ఐదేళ్లు పైబడిన ఇతర ఉద్యోగులందరినీ తప్పనిసరి బదిలీల్లోకి తెచ్చారు. అలాగే, ఒకేచోట మూడు నుంచి తొమ్మిదేళ్ల సర్వీస్ ఉండి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని అదే ఊర్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేయనున్నారు.అక్కడ ఖాళీలు లేనిపక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) స్థాయి వైద్యులకు పరిపాలన అవసరాలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. 30న బదిలీలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యశాఖలోని బదిలీల ప్రక్రియలో జిల్లాస్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పొరపాట్లకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
బలవంతపు బదిలీలు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో బదిలీలలపై ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని ఆ ప్రభుత్వమే అభాసుపాలు చేస్తోంది. గత నెలలో ప్రారంభమైన బదిలీలు అడుగడుగునా వివాదాస్పదంగా మారుతున్నాయి. చట్టంలో ఉన్న అంశాలను పక్కనబెట్టి అవసరం లేకున్నా టీచర్లతో బలవంతంగా అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు వేధిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి, వారినుంచి అభ్యంతరాలను స్వీకరించినా చట్టంలో వాటికి చోటు కల్పించలేదు.బదిలీలకు ఉత్తర్వులు రాగానే అందులోని అంశాలపై సంఘాల ప్రతినిధులు ఆందోళన చేయడంతో కొన్ని ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పి ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లబరిచి.. తర్వాత ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలోకి తమకు అర్హత లేకున్నా బలవంతంగా బదిలీ చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్టేషన్ పాయింట్ల అంశంలోనూ అన్యాయం జరుగుతోందని, వీటిపై కోర్టులకు వెళితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సెలింగ్ విధానంలో జరుగుతున్నా అత్యంత వివాదాస్పదమైన బదిలీలు ఇవేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒత్తిడి చేసి మరీ వెబ్ ఆప్షన్లుస్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ద్వారా గ్రేడ్–2 హెడ్ మాస్టర్లుగా బదిలీ చేసేందుకు గతనెల 29న వెబ్ ఆప్షన్స్కు అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఉదయం ప్రారంభం కావాల్సిన ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొలిక్కి రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పోస్టును భర్తీ చేసేముందు సీనియారిటీ, అర్హతలు పరిశీలించాలి. అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ స్కూల్ అసిస్టెంట్లకు ఎలాంటి దిశానిర్దేశం లేకుండా మే 31 ఒక్క రోజు గడువునిచ్చి ఆప్షన్లు పెట్టాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీనిపై తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు రావడంతో మరో రోజు పొడిగించారు. ఫిర్యాదులు పరిష్కరించకుండా.. ఫైనల్ సీనియారిటీ జాబితా ప్రకటించకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అర్హత లేకున్నా ఆప్షన్ ఇవ్వాల్సిందే!ప్రస్తుత బదిలీల్లో సర్ప్లస్, లాంగ్ స్టాండింగ్తో పాటు స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సర్ప్లస్ కాని, లాంగ్ స్టాండింగ్ కాని, కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులను సైతం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందేనంటూ డీఈవోలు తీవ్ర ఒత్తిడి చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. క్యాడర్ జూనియర్లంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,477 మంది స్కూల్ అసిస్టెంట్లను కచ్చితంగా పీఎస్ హెచ్ఎం పోస్టులకు ఆప్షన్ ఇవ్వాలంటూ శనివారం రాత్రి అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు జాబితాలు విడుదల చేయడంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. సబ్జెక్టు నిపుణులు పర్యవేక్షణకే పరిమితంకూటమి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఇప్పటివరకు హైసూ్కళ్లల్లో సబ్జెక్టు నిపుణులుగా ఉన్న 4,706 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పర్యవేక్షణకే పరిమితం కానున్నారు. ఉత్తర్వుల్లో స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు టీచర్లు, పీఎస్ హెచ్ఎంగా నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం కల్పించారు. కానీ దీనికి భిన్నంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో పీఎస్ హెచ్ఎం ఖాళీలకు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా విద్యాశాఖ మార్పు చేసింది. దీంతో బోధనపై ఇష్టం ఉన్న సబ్జెక్టు టీచర్లు పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది. ్డబదిలీల్లో ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులివీ⇒ బదిలీల్లో సర్ప్లస్ గాని.. లాంగ్స్టాండింగ్ గాని.. కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని టీచర్లను సైతం వెబ్ అప్షన్లు ఇవ్వాలని డీఈవోలు ఒత్తిడి చేస్తున్నారు.⇒ పాఠశాల యూనిట్గా సర్వీస్ను బట్టి సీనియర్, జూనియర్ కేడర్ నిర్ణయించాలి. కానీ జిల్లాని యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా కేడర్లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు.⇒ సర్ప్లస్ పోస్టులను సీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేయాలి. ఇవేమీ చేయకుండా బదిలీ ప్రక్రియ నడుస్తోంది. దీనివల్ల ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుంది.సీనియర్లను జూనియర్లుగా మార్చేసి..పాత జీవోలు, ప్రస్తుత జీవో–22 ప్రకారం పాఠశాల యూనిట్గా సర్వీస్ను బట్టి సీనియర్/జూనియర్ కేడర్ నిర్ణయిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జిల్లాని యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా ఆ కేడర్లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు. ఇలా పాఠశాలలోని సీనియర్లను జిల్లా యూనిట్గా తీసుకుని జూనియర్లుగా మార్చేశారు. తొలుత ఉపాధ్యాయుల సర్ప్లస్ను 1:53 టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ప్రకటించింది, అనంతరం ఆ సంఖ్యను 1:49 నిష్పత్తికి కుదించింది. ఈ మేరకు సవరించి ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు సర్ప్లస్ పోస్టులను పీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేయాలి. కానీ.. ఇవేమీ చేయకుండానే బదిలీ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీంతో ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
దళారులే దిక్కు
రంపచోడవరం: గిరిజన సహకార సంస్థ లక్ష్యానికి దూరంగా పనిచేస్తోంది. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి బాసటగా ఉండాల్సిన సంస్థ అరకొరగా కొనుగోళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటోంది. కొన్ని రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే మానేసింది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్లో రేటు లేదనే కారణాన్ని చూపుతూ కొనుగోలుకు దూరంగా ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులకు మంచి ఆదాయాన్నిచ్చే కొండచీపుళ్లు ధర పడిపోయిందన్న కారణంతో కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు వారు సేకరించిన చీపుళ్లను మారేడుమిల్లి తీసుకువచ్చి కట్ట రూ.50 నుంచి రూ.60కు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు రూ.70 నుంచి రూ.90కు అమ్ముకుని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వీటికి సంబంధించి జీసీసీ నిర్ణయించిన ధరకు దళారులు చెల్లించే ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. మొదటి రకం ధర (గ్రేడ్–1) రూ. 45, గ్రేడ్ –2 రూ. 40, గ్రేడ్ –3 రూ. 35గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో గిరిజనులు గ్రేడ్లతో సంబంధం లేకుండా ఒక కట్ట రూ. 50 ధరకు పైగా అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన 20 వేల కొండ చీపుళ్లను కాకినాడ జిల్లా ఏలేశ్వరం గొడౌన్లో నిల్వ చేశారు. ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏటా బయట మార్కెట్లో కొండచీపుళ్లకు రేటు ఉన్న జీసీసీ నామ మాత్రపు ధరతో కొనుగోలు చేస్తోంది. దీంతో తమ ఉత్పత్తులను జీసీసీ చెల్లించే ధర కంటే బయట వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. చింతపండు కిలో రూ.36 ధర నిర్ణయించగా బయట మార్కెట్లో వ్యాపారులకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకవాడ గండి చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. ఈరకాన్ని వ్యాపారులు రూ.180 నుంచి రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ మాత్రం ఈ రకాన్ని ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే చింతపండుకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో జీసీసీకి విక్రయించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. మారేడుమిల్లి ప్రాంత గిరిజనులకు శీకాయ మంచి ఆదాయ వనరు. దీనిని జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గతంలో విదేశాలకు ఆర్గానిక్ శీకాయను సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ తరువాత జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. జీసీసీ గిరిజనులు సేకరించే, పండించే సుమారు 34 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు అవి అంతరించిపోకుండా చూడాల్సి బాధ్యత కూడా ఆ సంస్థపై ఉంది. కోవెల జిగురు కోసం చెట్టు బెరడును సేకరిస్తారు. దీంతో కొంత కాలానికి ఆ చెట్టు చనిపోతుంది. కోవెల చెట్లు అంతరించిపోకుండా వీటి మొక్కలను గిరిజనులతో నాటించి సంతతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. జీసీసీకి సేకరణపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనివల్ల చాలా వరకు కోవెల చెట్లు అంతరించిపోయాయి. నరమామిడి చెట్లది అదే పరిస్థితి. ఆయుర్వేద విలువలు ఉన్న తిప్ప తీగ, కొవెల జిగురు తదితర వాటి కొనుగోళ్లను పూర్తిగా తగ్గించింది. గానుగ పిక్కలు, కరక్కకాయలు, ముసిడి గింజలు, నల్ల జీడిపిక్కలు,నేపాల గింజలు రెల్ల చెక్క, తానికాయలు వంటి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు.