breaking news
Andhra Pradesh
-
NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు. ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబం. జర్నలిస్టులు నేరస్థులో, ఉగ్రవాదులో కాదు.అయినప్పటికీ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి చర్యల వలన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయి.మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
విశాఖలో మాంజా టెర్రర్
విశాఖ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎగురేసే గాలిపటాల కారణంగా మాంజా(అత్యంత పదునుగా ఉండే దారం) దడపుట్టిస్తోంది. ఈ మాంజా బారిన పడి అనేక మంది గాయాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో మాంజా కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఉదంతం వెలుగుచూసింది. మాజీ సైనిక ఉద్యోగి నోటిని మాంజా కోసేసింది. మాంజా దారం తగిలి వెంకట్రావు అనే మాజీ సైనికోద్యోగి గాయపడ్డారు. రెండు పెదవుల మధ్య తీవ్ర గాయమైంది. దాంతో తీవ్ర రక్త స్రావంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నోటికి రుండు వైపులా కుట్ల వేసేంతంగా గాయమైంది. మధురవాడలో బైక్ పై కొడుకుతో కలిసి ప్రయాణిస్తుండగా ఇది చోటు చేసుకుంది. తెలంగాణలో ఘటనలుజనవరి 13 వ తేదీన ఓ పోలీసు అధికారి విధుల్లో భాగంగా బైక్పై వెళ్తుండగా మెడకు చైనీస్ మాంజా తగిలి తీవ్ర గాయపడ్డాడు. రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆసుపత్రికి తరలించారు.నిజామాబాద్: ఒక రైతు గాలిపటాల దారంలో చిక్కుకుని తీవ్ర గాయపడ్డాడు.మాంజా వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఘటనలుసంక్రాంతి సీజన్లో: చైనీస్ మాంజా కారణంగా పదుల సంఖ్యలో గాయాలు నమోదయ్యాయి.పోలీసుల చర్యలు: "సీజ్ ది కైట్" ఆపరేషన్లో మాంజా విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేశారు. కానీ అమలు కఠినంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.ప్రమాదాల తీవ్రతగాజు పొడి, లోహపు పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని, గొంతును కోసేంత పదునుగా ఉంటాయి.ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.నిషేధం ఉన్నప్పటికీ: మార్కెట్లో మాంజా సులభంగా లభిస్తోంది. పోలీసులు అరెస్టులు చేసినా, వినియోగం తగ్గడం లేదు -
కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు
కాకినాడ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోళ్ల పందాల జోరు ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయయాయి. ఏడు నియోజకవర్గాలక గాను 60కి పైగా పందెం బరులు ఏర్పాటు చేశారు. బరిలో కాలుదువ్వుతున్న కోళ్లపై భారీగా పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పందాలను తిలకించేందుకు బరుల వద్దకు తరలివస్తున్నార పందెం రాయుళ్లు. ఆ ప్రాంగంణాల్లోనే విచ్చలవిడిగా గూండాట జూదాలు కొనసాగుతున్నాయి. -
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. ఏడాది గడిచినా.. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
మీరు మారరా? ఎక్కడ చూడు కొట్టుకోవడమే..
ప్రకాశం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గలాటా జరగటంతో బస్సు డ్రైవర్ మహిళలను పోలీస్స్టేషన్ సమీపంలో దింపి వెళ్లిపోగా ఎస్సై మహిళల మధ్య సర్దుబాటు చేసి వేరే బస్సుల్లో పంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి సింగరాయకొండలో జరిగింది. స్థానికుల కథనం మేరకు కావలి, రామాయపట్నం ప్రాంతాలకు చెందిన మహిళలు సింగరాయకొండ లోని బంధువుల ఇళ్లకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒంగోలు–కావలి బస్సులో వెళుతుండగా సీటు విషయమై మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఒక మహిళ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోలీస్స్టేషన్ సమీపంలో సుమారు 10 మంది వరకు మహిళలను దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బి.మహేంద్ర హుటాహుటిన మహిళల వద్దకు వచ్చి వారిని శాంతపరచి వీరిని వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఉచిత బస్సుల వల్లే ఈ ఘటనలు ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు
-
బాబూ.. ఓటుకు నోటు కేసు భయమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. -
లాయర్తో వివాహేతర సంబంధం! భర్తను సర్వం దోచేసి..
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్లలో నివాసం ఉండే వెంకటరమణను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఏపీలో సీజ్ ద కైట్!
పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. దీంతో నిషేధిత మాంజా అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు అమలు కావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అటు పోలీసు శాఖలు చేపడుతున్న డ్రైవ్స్.. అరకొర ఫలితాలనే ఇస్తున్నాయి.. తెలంగాణలో చైనీస్ మాంజా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్లో మాంజా చుట్టుకుని ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్లో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకొక ఘటన చోటు చేసుకుంటోంది. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. ఆఖరికి ఆ మాంజాతో గాలి పటాలు ఎగరేసినా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఖరికి పీడీ యాక్టు ప్రయోగిస్తామన్న ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చైనీస్ మాంజా విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు.. ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తాలుకా వివరాలతో పూర్తి నివేదికను ఫిబ్రవరి 26వ తేదీలోపు అందజేయాలని కమిషన్ ఆయన్ని ఆదేశించింది.ఇటు ఏపీలోనూ చైనీస్ మాంజా విషయంలో పోలీసులు చేస్తున్న ప్రకటనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనీస్ మాంజా అమ్మినా.. కొన్నా.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో 112కి డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. చైనీస్ మాంజా ఉన్న 650 గాలి పటాలను సీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ పోలీసులు అమ్మేవారిని ఏం చేయలేక.. కొనేవారిని, ఎగరేసే వారిని పట్టుకుని వాళ్ల చేతుల్లోని గాలి పటాలు సీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. చైనీస్ మాంజాలో.. సింథటిక్ పదార్థాలతో(నైలాన్, ప్లాస్టిక్) తయారు చేసి.. గాజు లేదంటే లోహపు పొరతో దారానికి పూత పూస్తారు. అందుకే ఇది తీవ్రమైన గాయాలు చేస్తుంది. పైగా ఇది పర్యావరణానికి హానికరం(బయోడిగ్రేడబుల్ కాదు). అందుకే భారత ప్రభుత్వం 2017లో చైనా మాంజా (Chinese Manjha)పై నిషేధం విధించింది. తొలుత ఇది చైనా నుంచి దిగుమతి అయ్యేది. అలా దానికి చైనీస్ మాంజా, చైనా మాంజా అనే పేర్లు స్థిరపడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో మన దేశంలోనే దీనిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం తయారీకి మినహాయింపు ఇచ్చారు. ఇదే అదనుగా కాసుల కక్కుర్తితో చైనీస్ మాంజాను మార్కెట్లలోకి తెస్తున్నారు. చైనా మాంజా తయారీ.. నిల్వ.. విక్రయం(అమ్మడం) నేరం. ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రూ.1 లక్ష వరకు జరిమానా ఒక్కోసారి రెండూ విధించవచ్చు. వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. చైనీస్ మాంజా కారణంగా ప్రమాదాల బారిన పడ్డవాళ్లు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. -
కొత్త అల్లుళ్లకు మర్యాదలే వేరు..
విజయనగరం: హరిలోరంగ హరి అంటూ సమస్తం చల్లగా ఉండాలని దీవించే హరిదాసుల కీర్తనలు.. అయ్యగారికి వందనం.. అమ్మగారికి చందనమంటూ డూడూ బసవన్న దీవెనలు.. వేకువజామున జంగమదేవరలు మోగించే గంటలు.. బుడబుక్కలి వాయించే ఢమరుక నాదాలు.. బడాయి పోతూ నాకేం తక్కువంటూనే మామూళ్లడిగే పిట్టల దొరలు.. చమత్కారాలతో చిందులేస్తూ ఎంతోకొంత సమరి్పంచుకుంటే కానీ కదలని కొమ్మదాసరులు.. ఇలా చెప్పుకొంటే పోతే పెద్ద జాబితాయే పెద్ద పండుగది. ప్రతి ఏటా నిర్వహించుకునే హిందువుల అతిపెద్ద సంప్రదాయ పండగకు పట్టణాలు నుంచి సొంత ఊర్లకు తరలివస్తున్నారు బంధువులంతా. ఆకాశమంత ఆనందం.. భూమండలమంత సంతోషం.. జతకలిస్తే ఎలాగుంటుందో సంక్రాంతి సందడి అలా ఉంటుంది. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి అంటే నెలరోజుల ముందుగానే పల్లెల్లో పండగ హడావుడి ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పల్లెల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడంతో సందడి ప్రారంభమైంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికివారే సందడిగా ఉండే పండగ సంక్రాంతి మాత్రమే. భోగిపండగ వచ్చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో పండగను జరుపుకునేందుకు సర్వం సన్నద్ధమయ్యారు. కొత్త అల్లుళ్లకు మర్యాదలే వేరు.. కొత్త అల్లుళ్లకు సంక్రాంతి కానుకగా ద్విచక్రవాహనాలు ఇవ్వడం జిల్లాలో ఆనవాయితీ. ఆ ఏర్పాట్లలో మామయ్యలు మునిగి తేలుతున్నారు. ఇదిగాకుండా ఇంటికొచ్చిన బంధుమిత్రులకు నూతన దుస్తులు పెట్టడం సంస్కృతిగా వస్తోంది. వస్త్ర దుకాణాల్లో ఇటువంటి సందడే కనిపిస్తోంది. జనజాతర సంక్రాంతి మూడు రోజులూ ఎక్కడ చూసినా జనజాతరలానే కనిపిస్తుంది. స్వగ్రామాలకు వచ్చిన వారంతా ఆయా వీధుల్లో తిరుగుతూ తెలిసినవారిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటుంటారు. ఎవరి ఇంటికెళ్లినా ఏదో ఒకటి తినకతప్పదు. పండగ రోజుల్లో అనాథలకు అన్నసమారాధనలు చేసే కుటుంబాలు జిల్లాలో కోకొల్లలు. వచ్చిన అతిథులకు లేకుండా అన్ని మర్యాదలు చేసే సత్సంప్రదాయం జిల్లా ప్రత్యేకత. ఇక పట్టువ్రస్తాల్లో మహిళలు, సంప్రదాయ దుస్తుల్లో యువత మెరిసిపోతుంటారు. మొత్తమ్మీద పండగంటే జిల్లాలోనే చూడాలని ఇక్కడకు తరలివచ్చే అతిథులు అనేకమంది ఉన్నారు. పందెం రాయళ్లకు పండగే.. పండగ సంక్రాంతి పండగ నేపథ్యంలో పందెం రాయళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. మూడురోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని మరీ జూదమాడేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. జూదంతో పాటు కోడి పందాలు జిల్లాలో జోరుగా సాగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వివిధ జాతుల కోళ్లు బరిలోకి దిగేందుకు కాళ్లు రువ్వుతున్నాయి. అయితే, కోడి, పొట్టేళ్లు పందాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు. ప్రతి ఇంటా ప్రత్యేక వంట సంక్రాంతికి ప్రత్యేక వంటలు పల్లెల్లో ప్రసిద్ధి. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, జంతికలు, కారంబూందీ, కారపూస, బొబ్బట్లు వంటి వంటకాలు సంక్రాంతి ప్రత్యేకమైనవి. అరిసెల్లో నువ్వులు వేసి చేస్తే మరో ప్రత్యేకం. స్వచ్ఛమైన నేతితో, అచ్చమైన బెల్లంతో చేసే సున్నుండలు నోరూరిస్తాయి. భోగిరోజున భోగిమంటలో కాలి్చన వంకాయలతో చేసిన పచ్చడి, మకర సంక్రాంతి నాడు పులిహోర, గారెలు, పాయసం, కనుమకు గ్రామదేవతలకు సమరి్పంచే నైవేద్యాల్లో మాంసాహారం ఉంటుంది. ఇవిగాకుండా ఇష్టాలనుబట్టి తయారుచేసుకునే దద్దోజనం, పొంగలి వంటివి అతిథులకు ప్రత్యేక వంటకాలుగా చెప్పవచ్చు.అన్నింటా సంక్రాంతి.. చిన్ననాటి బాల్య స్నేహితులంతా స్వగ్రామాలకు వస్తుంటారు. అంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సదావకాశం ఇచ్చేది సంక్రాంతే. కుటుంబంలో తరతరాలుగా ఉన్నవారంతా ఒకచోట చేరి కుటుంబాల పండగ నిర్వహిస్తారు. పూర్వ విద్యార్థులంతా కూడా ఒక వేదికపైకి చేరే అపూర్వ కలయిక సంక్రాంతికే చేసుకుంటున్నారు. పిల్లలకు ఇష్టమైన బొమ్మల కొలువు సంక్రాంతి ప్రత్యేకత. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు బొమ్మల కొలువు వద్ద చేసే సందడి అంతా ఇంతాకాదు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల వంటివి పల్లెల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్నిచోట్ల చూస్తే కళాకారులకు సత్కారాలు నిర్వహించి సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు కతజ్ఞతలు తెలియజేస్తారు.ఎన్నాళ్లయ్యిందో ఆలకించి ఒక పంక్తి.. ఎన్నేళ్లయ్యిందో ఆరగించి సహపంక్తి అన్నచందాన స్నేహితులంతా కలిసి చెప్పుకొనే ముచ్చట్లు, కుటుంబ సభ్యులంతా కలిసి చేసే భోజనాలు మధురానుభూతులను మిగులుస్తాయి. స్నేహితులతో కలిసి స్వీయచిత్రం దిగాలంటే చరవాణి తెర పట్టనంతగా ఉంటుంది సంక్రాంతి సందర్భం. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ వేషధారణలు చిన్నారులకు పరిచయం చేయాలి. రోజు ఆధునిక దుస్తుల్లో విసిగిపోయినవారికి ఊరటగా ఉంటుంది. -
ఇంటి వంటకు బ్రేక్.. నగరాన్ని నడుపుతున్న కర్రీ పాయింట్లు
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణ జీవనం రోజురోజుకూ వేగం పుంజుకుంటోంది. ఒకప్పుడు పల్లె వాతావరణంతో నిదానంగా సాగిన జీవితం, ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పనిపాటలతో పరుగులే పరుగులుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంటికొచ్చేసరికి వంట చేయడానికి ఓపిక, సమయం రెండూ కలిసి రావడం లేదు. అందుకే చాలామంది ఇంటి వంటకు కాస్త విరామం ఇచ్చి, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఇంటి వంట మానేసి బయట కూరలు తెచ్చుకుంటే బద్ధకం అంటూ వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల మధ్య సమయానికి భోజనం కావాలంటే కర్రీ పాయింట్లే సరైన దారి అయ్యాయి. సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలు, కోట జంక్షన్, రింగ్ రోడ్, కంటోన్మెంట్, బాలాజీ నగర్, పీఎస్ఆర్ కాంప్లెక్స్ ప్రాంతాల్లోని కర్రీ పాయింట్లు జనంతో కిటకిటలాడుతాయి. చేతుల్లో స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లతో నిలబడి ఇంకా కూర అయిందా లేదా అంటూ అడుగుతూ క్యూ కడతున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, దుకాణాల్లో పని చేసే యువకులు, చిన్న పిల్లలున్న కుటుంబాలు, ఒంటరిగా గదుల్లో ఉండే బ్యాచిలర్లు..ఇలా అన్ని వర్గాల వారికీ ఈ కర్రీ పాయింట్లు ఊరటగా మారాయి. పప్పు,కూర, ప్రై, పులుసు వంటి వంటకాలు ఇంటి వంట రుచిని గుర్తు చేస్తాయని వినియోగదారులు చెబుతున్నారు. పైగా చౌకగా, సమయానికి, కడుపు నిండేలా దొరుకుతుండడంతో డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.పెరిగిన ఖర్చులే కారణం..గ్యాస్ సిలిండర్ ధరలు, నూనె, కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరి కోసం వంట చేయాలంటే ఖర్చు తక్కువ కాదు. రూ.800–900 పెట్టి గ్యాస్ తెచ్చుకోవడం, రోజూ కూరగాయలు కొనడం కంటే రూ.20 లేదా రూ.50 పెట్టి రెడీ కర్రీ తెచ్చుకోవడం నయం అని వినియోగదారులు లెక్కలు చెబుతున్నారు.విద్యార్థులు, బ్యాచిలర్లకు భోజన భరోసా...ఉత్తరాంధ్రలో పెద్ద విద్యా కేంద్రం విజయనగరం. వేల సంఖ్యలో విద్యార్థులు హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటున్నారు. తోటపాలెం, మయూరి జంక్షన్, బాబామెట్ట, అయ్యకోనేరు, రాజీవ్నగర్ కాలనీ చుట్టుపక్కల విద్యార్థుల కోసం మినీ కర్రీ పాయింట్లు వెలిశాయి. రోజూ హోటల్ భోజనం తింటే ఖర్చు, ఆరోగ్యం రెండూ పాడవుతాయి. ఇక్కడ పప్పు, ఒక వేపుడు, ఒక గ్రేవీ కూర తీసుకుంటే ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది.మారుతున్న ఆహార సంస్కృతి..ఒకప్పుడు రోజూ ఇంటి వంట తప్పనిసరి అనుకున్న విజయనగరం ప్రజలు, ఇప్పుడు అవసరానికి తగ్గట్లు ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతుండడంతో కర్రీ పాయింట్లు నగర జీవితంలో భాగమయ్యాయి. శుభ్రత, నాణ్యతపై మరింత శ్రద్ధ తీసుకుంటే ఈ రంగం ఇంకా విస్తరించే అవకాశం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.ఆఫీస్ అలసటకు కర్రీ పాయింటే ఉపశమనంఉదయం ఆఫీసుకి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఒళ్లంతా అలసట. మళ్లీ కూరగాయలు తరగడం, వంట చేయడం అంటే కష్టం. గ్యాస్ ధరలు, నూనె ధరలు చూస్తే ఇంట్లో వండడం కన్నా రూ.30 నుంచి 50 పెట్టి కర్రీ తెచ్చుకోవడమే నయం అనిపిస్తోంది. పిల్లలకు కూడా ఇంటి భోజనం లాంటి రుచి దొరుకుతోంది.– పెనుగంటి వనజ, ప్రైవేట్ ఉద్యోగి, విజయనగరంఇంటి రుచే మా గుర్తింపు..మేము ఇంట్లో వండినట్లు ఉండాలని ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం. మసాలాలు అన్నీ ఇంట్లోనే దంచి తయారు చేస్తాం. అందుకే మా దగ్గరికి వచ్చే వాళ్లు ఇంటి కూరే అంటున్నారు. రోజూ సాయంత్రం ఆరు దాటితే జనం క్యూలో నిలబడతారు. ఒకప్పుడు కర్రీ పాయింట్ అంటే చిన్నగా చూసేవాళ్లు..ఇప్పుడు అదే మా కుటుంబానికి ఉపాధి అయింది.– ఆకుల సూర్యకుమారి, అమ్మ కర్రీ పాయింట్, విజయనగరంహోటల్ భోజనం కంటే.. కర్రీ పాయింటే భరోసా..విజయనగరంలో చదువుకోవడానికి వచ్చాం. హాస్టల్లో వంట సౌకర్యం లేదు. బయట హోటల్ భోజనం రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. కరీ పాయింట్లలో మాత్రం తక్కువ ధరలో పప్పు, కూర దొరకుతుంది. చదువుకునే మాకు ఇవే పెద్ద ఆధారం.– రౌతు రామునాయుడు, విద్యార్ధి -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్కు పేరు వస్తుందనా? లేక రేవంత్కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ను విమర్శిస్తూ జగన్కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చెడును దహనం చేసేది భోగి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు.మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
భర్త ఆశయం కోసం అక్షయపాత్ర పట్టిన ఇల్లాలు
విశాఖపట్నం: తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి అంటేనే హరినామ స్మరణ. నెల రోజుల పాటు సాగే ఈ ధనుర్మాస ఉత్సవాల్లో అక్షయపాత్రను నెత్తిన మోస్తూ, చిడతల సవ్వడితో, తంబురా మీటుతూ వచ్చే హరిదాసులను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. తరతరాలుగా పురుషులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ పవిత్ర వృత్తిలో, విధి ఆడిన వింత నాటకంలో ఒక సామాన్య మహిళ ‘హరిదాసి’గా మారి అరుదైన బాటను ఎంచుకుంది.. విశాఖకి చెందిన కందుల నాగమణి. భర్త మరణానంతరం ఆయన వదిలివెళ్లిన భక్తి వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆమె చేస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. భక్తి సామ్రాజ్యంలో ... సాధారణంగా హరిదాసులంటే కాషాయ వస్త్రాలు, నుదుట తిరునామాలు, తలపై అక్షయపాత్రతో కనిపిస్తారు. ఇది పురందరదాసు, కనకదాసుల కాలం నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. హరిదాసుల గానామృతం కేవలం ఆధ్యాతి్మక చింతననే కాకుండా, సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇన్నాళ్లూ పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి నాగమణి అడుగుపెట్టడం వెనుక ఒక కన్నీటి గాథ, అంతకు మించిన గుండె నిబ్బరం ఉన్నాయి. జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని సాయిరామ్నగర్లో నివసించే నాగమణి భర్త కందుల చంద్రం, గతంలో బ్రాండిక్స్ కంపెనీలో బస్సు డ్రైవర్గా పని చేస్తూనే, ఏటా ధనుర్మాసంలో హరిదాసుడుగా మారి భక్తిని పంచేవారు. భర్త కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయే నాగమణి, ఆయనతో పాటే ఆ ఆధ్యాత్మిక గీతాలను నేర్చుకుంది. 2018లో గుండెపోటుతో చంద్రం మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అధైర్యపడని ఆత్మవిశ్వాసం భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కానీ నాగమణి కుంగిపోలేదు. భర్త పనిచేసిన కంపెనీలోనే స్టిచింగ్ ఆపరేటర్గా చేరి పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కుమార్తె చంద్రిక పదో తరగతి, చిన్న కుమార్తె వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అయితే కేవలం ఆర్థిక అవసరాలే కాకుండా, తమకు మగపిల్లలు లేరనే వెలితి రాకూడదని, తన భర్త కొనసాగించిన కులవృత్తి ఆగిపోకూడదని నాగమణి దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ సంకల్పమే ఆమెను ‘హరిదాసి’గా మార్చింది. తన భర్త గతంలో ఏ ఏ వీధుల్లో అయితే హరినామ స్మరణ చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో ఇప్పుడు నాగమణి తంబురా పట్టుకుని కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపిస్తున్నారు. కఠినమైన నిష్ట.. నిరంతర నామస్మరణ ధనుర్మాసం మొదలవగానే నాగమణి దినచర్య ఎంతో కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, స్నానపానాలు ముగించుకుని, దైవ ప్రార్థన అనంతరం హరిదాసి వేషధారణలో సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విరామం లేకుండా సాయిరామ్నగర్, మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో కీర్తనలు పాడుతూ భక్తులను ఆశీర్వదిస్తోంది. హరిదాసుల సంప్రదాయం ప్రకారం తలపై ఉన్న అక్షయపాత్రను ఇంటికి వెళ్లే వరకు కింద పెట్టకూడదు. ఒకవేళ భక్తులు ఇచ్చే బియ్యం, కానుకలతో పాత్ర నిండిపోతే, ఒక రాయిపై దించి సంచిలోకి మార్చుకుంటారు. తిరిగి ఇంటికి చేరుకున్నాకే అక్షయపాత్రను దేవుడి మూల ఉంచి, పూజ నిర్వహించి అప్పుడు భోజనం స్వీకరిస్తారు.చేయూత కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా నాగమణి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. సొంతంగా తంబురా కొనుగోలు చేసే స్తోమత లేక ఇతరుల నుంచి తీసుకుని వాడుతోంది. స్థానిక దాత పైలా దేముడు నాయుడు ఆమెకు 7 కేజీల రాగి పాత్రను బహూకరించి తన వంతు సాయం అందించారు. ‘భర్త నేరి్పన విద్యను, మా కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. పిల్లల చదువుల కోసం, నా వృత్తి కోసం ఎవరైనా దాతలు సహకరిస్తే కృతజ్ఞతతో ఉంటాను’ అని నాగమణి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు అంతరించిపోతున్న కళారూపాన్ని మహిళగా భుజాన మోస్తున్న నాగమణి నిజంగానే అభినందనీయురాలు. -
‘ఫ్రీ’ బాబు మాటలు నమ్మొద్దు: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు: సంక్రాంతి అంటే రైతులు సంతోషంగా జరుపుకునే పండగ అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. రైతులకు 20వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పండగ జరుపుకునే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులకు 400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నాళ్లు రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు, రైతులకు ఏం మేలు చేస్తారు?. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని వైఎస్సార్, వైఎస్ జగన్ నమ్మారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఒక్క మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వారికి మేలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచితం అనే మాటలను నమ్మవద్దు అంటూ ప్రజలకు హితవు లిపాకరు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. -
గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నా. సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరు. ఎందుకంటే నేను పొలిటీషియన్ను.. వాళ్లు కాదు కాబట్టి’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అంబటి నేరుగా చురకలంటించారు.మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయం అని అంబటి అన్నారు. -
భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో
సాక్ష, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు వైవిధ్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి బాబు సర్కార్కు వ్యతిరేకంగా నిరసన చెబుతున్నాయి. ఈ నిరసనల్లో అటు వామపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి.పనికిరాని వస్తువులన్నీ ‘భోగి’ మంటల్లో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అహం తొలగిపోవాలని కోరుకున్నాం. ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చాం. వెంటనే ఆ జీవోను వెనక్కు తీసుకోవాలి. లేదంటే మరింతగా ప్రజా ఉద్యమాలు చేపడతాం అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. వైయస్సార్ జిల్లా కేంద్రంలో.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకుడు సురేష్ బాబు, మేయర్ పాకా సురేష్ పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మెడికల్ కాలేజీల పిపిపిని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను పక్కనపెట్టేసింది. ప్రతీ అంశంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పన్నులు,సెస్ లు వేసి ప్రజల పై భారాలు మోపుతోంది. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హత లేదు అని విష్ణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో.. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు ,హరిదాసులు గంగిరెద్దులతో ఘనంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారాయన. కూటమి హయాంలో కేవలం చంద్రబాబు కుటుంబం రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని.. కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా.. మెడికల్ కళాశాలల పిపిపి జీవో ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు.ప్రకాశం జిల్లా భోగి వేడుకల్లో.. చీమకుర్తిలోని తన నివాసం వద్ద నిరవహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఉపయోగ పడే విధంగా ప్రభుత్వమే 17 మెడికల్ కాలేజీ లను నిర్మించడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్కు మంచి పేరు వస్తుంది అని ప్రవేటు వారికి దారదత్తం చేయడానికి మెడికల్ కాలేజీ లను పీపీపీ విధానంలో కి మార్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని మెడికల్ కాలేజీ లను ప్రభుత్వమే నిర్మించాలి అని డిమాండ్ చేశారు. వైయస్సార్ జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గృహం వద్ద భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జిల్లా ప్రజలకు భోగి , మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.చిత్తూరు జిల్లా నగరిలో తన నివాసం వద్ద ఆర్కే రోజా భోగి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ‘‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషం జరుపుకునే పండుగ ఇది, 20 వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని సంతోషంగా నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. నాలుగుసార్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకు రాలేదు. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రవేట్ మెడికల్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన రోజా.. ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మవద్దు అని రాష్ట్ర ప్రజలను కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో.. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద భోగి మంట వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలు మంటల్లో వేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి.. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. జీవో 590, 847 రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ.. ఏకంగా కూటమి మేనిఫెస్టోని భోగిమంటల్లో వేసిన ఏఐవైఎఫ్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
ఆరిలోవ (విశాఖ): విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీలోని 9వ నంబర్ సచివాలయంలో సుంకర ఉదయ్కుమార్(40) టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సింహాచలం ప్రాంతానికి చెందిన ఆయన మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యారు. ప్రత్యక్ష విధులతో పాటు తూర్పు జోన్ జెడ్సీ శివప్రసాద్ నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్నారు.సంక్రాంతి మూడు రోజుల అనంతరం ఈ నెల 17న అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని కలెక్టర్ సూచించినట్టు జెడ్సీ శివప్రసాద్ తెలిపారు. అప్పగించిన పని తప్పకుడా చేయాల్సిందేనని, సరిగా పనిచేయనివారి గురించి క్లస్టర్ల వారీగా రిపోర్టు తీసుకొని చర్యలు చేపడతామని హెచ్చరిచారు. ఆ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఆరిలోవ ప్రాంతంలో జెడ్సీ శివప్రసాద్ పర్యటనకు వస్తారని తెలిసి తోటి సిబ్బందితో కలసి ఆయన ముడసర్లోవ పార్కు సమీపంలో నిరీక్షిస్తున్న ఉదయ్కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంక్రాంతి జరుపుకోవాల్సిన ఇంట్లో విషాదం నింపావంటూ కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతం.పని ఒత్తిడే కారణంఉదయ్కుమార్ గుండెపోటుతో మృతి చెందడానికి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున ఒత్తిడే కారణమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి తీసుకోలేనంతగా పని ఒత్తిడి పెంచారని వాపోయారు. బీపీఎల్, ఎల్ఆర్ఎస్, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టౌన్ ప్లానింగ్ స్కీం వంటి పనులతో నిత్యం ఒత్తిడి ఉంటోందని చెప్పారు. దీంతోపాటు సచివాలయం సర్వేలు, ఎన్నికల వర్క్, సెలవు రోజుల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారుల ఫోన్ కాన్ఫరెన్స్లు, అన్నీ పనులకూ ఒకేసారి టార్గెట్ ఇచ్చి సమయానికి పూర్తిచేయాలని, లేదంటే మెమోలు ఇవ్వడం చేస్తున్నారని తోటి సిబ్బంది వాపోయారు. -
బడి.. అలజడి!
ఓ కుక్కను కొట్టాలంటే పిచ్చిదని దానికి ముద్ర వేయాలి. అప్పుడు ఎవరూ ఏమీ అనరన్నది ఓ నానుడి. రాష్ట్రంలో సర్కారు బడుల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఆ సూత్రాన్నే వర్తింప చేస్తోంది. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత ప్రభుత్వ సంస్కరణలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ.. ప్రభుత్వ స్కూళ్లంటే అయిష్టం ఏర్పడేలా చేస్తోంది. ఫలితంగా గత రెండేళ్లలోనే 17.99 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. విద్య, వైద్యం ప్రైవేట్ చేతుల్లో ఉండాలన్నదే తమ లక్ష్యం అంటూ ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు తీరుపై విద్యా రంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయి. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. యూడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) లెక్కల ప్రకారం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 69,42,009కి పడిపోయింది. ఈ లెక్కన ఏకంగా 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలను (ఎయిడెడ్ సహా) తీసుకుంటే జగన్ ప్రభుత్వంలో 41,75,608 విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33,79,835కు పడిపోయింది. తద్వారా ఏకంగా 7,95,765 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. మరోవైపు డ్రాప్ అవుట్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. 2024 వరకు ప్రైవేటు స్కూళ్లల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా విద్యార్థులుండగా, ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు.. వాటిని కల్పించే పరిస్థితి లేదు.. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలను ఇప్పుడు అదే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. 2024 జూన్లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం పేద పిల్లలకు చదువులను దూరం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ.. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయేలా చేసింది. సర్కారు బడుల్లో తగ్గిపోయిన విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోయేలా ప్రస్తుత ప్రభుత్వం విధానాలను అనుసరించింది. అందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను అధికారంలోకి వచ్చిన 2024 జూన్ నుంచి ఒక్కొక్కటిగా రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. పేద పిల్లలను ఇంగ్లిష్ భాషలో ప్రవీణులుగా తిర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన టోఫెల్ను రద్దు చేశారు. ఐబీ సిలబస్ను ఆరంభంలోనే నిలిపివేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మనబడి నాడు–నేడు పనులను ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీని సైతం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా ఇస్తూ.. ఇవ్వాల్సిన సొమ్ములో కోత పెట్టారు. దీంతో ప్రభుత్వ బడులపై నమ్మకం పోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో 42 లక్షల మంది విద్యార్థులుండగా, 2024–25లో ఆ సంఖ్య 36 లక్షలకు తగ్గిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2025–26)లో ఈ సంఖ్య మరింత దిగజారి 33 లక్షలకు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 35.62 లక్షలకు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వ స్కూళ్లల్లో కంటే ప్రైవేటులో దాదాపు 2.62 లక్షల మంది విద్యార్థులు అధికంగా చేరారు.పెరిగిన డ్రాపౌట్లు.. పడిపోయిన జీఈఆర్యూడైస్ ప్లస్ నివేదికలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో డ్రాప్ అవుట్లు పెరిగాయి. బడి బయట పిల్లలు ఎంత మంది ఉన్నారో గమనించి.. వారిని బడుల్లో చేర్చాలన్న లక్ష్యం పూర్తిగా నీరుగారింది. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో కలిసి బడి బయటి పిల్లలను గుర్తించి, తప్పనిసరిగా స్థానిక పాఠశాలల్లో చేరి్పంచే ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల సిబ్బందిని విధులకు దూరం చేయడంతో పిల్లల చేరికల బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయులకు అప్పగించారు. రెండు విద్యా సంవత్సరాల్లో ఈ విధులు ప్రభుత్వ ఉపాధ్యాయులే చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం పూట బడుల్లో బోధించిన టీచర్లు.. మధ్యాహ్నం బడి బయటి పిల్లల సర్వేకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలే చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బాబు ‘సంక్రాంతి’ బాదుడు!
సాక్షి, అమరావతి: పండగ పూట కూడా ప్రజలపై పన్నుల బాదుడే..! అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పేరుతో రోడ్ సెస్ బాదుడుతో వాహనదారులపై ఏటా రూ.1,500 కోట్ల భారీ ఆరి్థక భారాన్ని మోపింది. మరోచేత్తో పండుగ వేళ టీడీపీ సిండికేట్కు అడ్డగోలుగా లాభాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఏటా రూ.350 కోట్లు సిండికేట్కు దోచిపెట్టేందుకు పచ్చ జెండా ఊపింది. అందుకోసం హడావుడిగా మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిది. చంద్రబాబు సర్కారు సంక్రాంతి బాదుడు ఇలా ఉంది..! కేంద్రం కరుణించినా... బాబు పన్నుల కొరడా కేంద్ర ప్రభుత్వం కరుణించినా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటూ రాష్ట్ర ప్రజలపై పన్నుల కొరడా ఝళిపించారు. జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించడంతో కాస్త ఊరట లభించిందనుకునేలోపే.. చంద్రబాబు ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకుని పన్నుల భారం ప్రజలపైనే వేశారు. కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి వాహన కొనుగోళ్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ వచ్చింది. ఇటీవలే జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దాంతో 10 శాతం జీఎస్టీ భారం తగ్గిందని ప్రజలు కాస్త ఊరట చెందారు.కానీ దీన్ని చంద్రబాబు సహించలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపు ఊరట మిగల్చకూడదని భావించి రోడ్ సెస్ పేరుతో కొత్త పన్ను రూపొందించారు. ఏపీలో వాహనాల కొనుగోళ్లపై 10 శాతం రోడ్ సెస్ విధించాలని ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఆమేరకు ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సెస్ విధించేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించింది. సద్వినియోగంపై సందేహాలు.. ప్రజలపై పన్నుల భారానికి చంద్రబాబు ప్రభుత్వం రహదారి భద్రత సెస్సు అనే ముసుగు వేసింది. ఆ సెస్సు ద్వారా వసూలు చేసే నిధులు ఎలా వెచి్చస్తామన్నది వెల్లడించలేదు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా అందుకోసం వెచ్చించడం లేదనే విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. హోం, వైద్య–ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా ఆ నిధులను వెచి్చంచాలి. కానీ ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెస్సు పేరిట ఏటా వసూలు చేసే రూ.1,500 కోట్లను సద్వినియోగం చేస్తారనే నమ్మకం ఏమాత్రం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ రద్దు వాహన కొనుగోలుదారులపై పన్నుల బాదుడు బాదిన చంద్రబాబు ప్రభుత్వం... టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మాత్రం తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లపై విధిస్తున్న 15 శాతం ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)ని రద్దు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఖజానాకు ఏటా రూ.350 కోట్ల మేర గండి పడనుంది. 2014–15లో కూడా ఇదే రీతిలో టీడీపీ సిండికేట్ బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును ఏకపక్షంగా రద్దు చేసింది. తద్వారా ఖజానాకు రూ.5,400 కోట్ల మేర గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతోపాటు అప్పటి మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ కేసును చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బార్లపై ఏఆర్ఈటీ రద్దు చేస్తూ మరో దందాకు తెర తీసింది. మద్యం బాటిల్పై రూ.10 బాదుడు.. ఇక మద్యం ప్రియులపై కూడా చంద్రబాబు ప్రభుత్వం పన్నుల మోత మోగించింది. ప్రతి మద్యం బాటిల్పై రూ.10 చొప్పున ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 20,135 కోట్ల మేర కరెంట్ చార్జీల బాదుడు కాగా, అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఏకంగా రూ. 20,135 కోట్ల మేరకు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారు. ఏటా పన్నుల భారం రూ.270 కోట్లు కాదు... రూ.1,500 కోట్ల బాదుడేరోడ్ సెస్ పన్నుల భారంపై చంద్రబాబు సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారని... ఆ ప్రకారం కొత్తగా విధించిన 10 శాతం రోడ్ సెస్తో వాహనాల కొనుగోలుదారులపై నెలకు రూ.22.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.270 కోట్ల భారం పడుతుందని మంత్రులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రజలపై పడే పన్నుల భారాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించేందుకు యతి్నంచారు. వాస్తవానికి అందుకు ఏడెనిమిది రెట్లు అధిక భారం పడుతుందని కేంద్ర జీఎస్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.కేంద్ర జీఎస్టీ విభాగం అధికారిక గణాంకాల ప్రకారం వాహనాలపై 28 శాతం జీఎస్టీ పూర్తిగా అమలులో ఉన్న 2024–25లో రాష్ట్రంలో వాహనాల విక్రయాల ద్వారా రూ.4,200 కోట్ల జీఎస్టీ పన్ను ఆదాయం వచ్చింది. అంటే.. 28 శాతం జీఎస్టీ రేటుతో రూ.4,200 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రేటును కేంద్రం ఇటీవల 18 శాతానికి తగ్గించింది. దాంతో జీఎస్టీ రేటు 10 శాతం తగ్గడంతో ఏడాదికి రూ.1,500 కోట్లు పన్ను ఆదాయం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.1,500 కోట్ల మేర ఊరట కలుగుతుందని పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ 10 శాతం పన్ను ఉపశమనం లేకుండా చేసింది. వాహనాలపై 10 శాతం రోడ్సెస్ విధించింది. అంటే రాష్ట్రంలో వాహనాల కొనుగోలుదారులపై ఏటా రూ.1,500 కోట్ల ఆర్థిక భారం పడనుందన్నది స్పష్టమవుతోంది. -
చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి
కడప సెవెన్రోడ్స్: సీఎం చంద్రబాబు తొలి నుంచీ రాయలసీమ వ్యతిరేకి అని పలువురు నేతలు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. రాయలసీమ నీటి అవసరాల దృష్ట్యా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచినపుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు తన పార్టీ నాయకులు దేవినేని ఉమ తదితరులతో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు చేయించారని గుర్తుచేశారు.వర్షాభావ పరిస్థితుల్లో ఇక్కడి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు వీలుగా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా చంద్రబాబు తెలంగాణలోని తమ పార్టీ నాయకులతో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని చెప్పారు. సీమపై బాబుకు ఉన్న వ్యతిరేకతకు ఇవే నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలం కలిగిస్తున్నాయన్నారు. ముచ్చుమర్రి వద్దే అదనపు లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని, సీమ ఎత్తిపోతల పథకం అనవసరమని మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడటం అర్థరహితమని విమర్శించారు. ముచ్చుమర్రి నుంచి నెలరోజులు ఎత్తిపోస్తే ఒక్క టీఎంసీ నీళ్లు మాత్రమే వస్తాయని చెప్పారు. వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. సీమ ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.కృష్ణాలో వరదరోజులు 30కి పడిపోయాయిఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిలో వరదరోజులు 30కి పడిపోయాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దిండి, పాలమూరు–రంగారెడ్డి వంటి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోందన్నారు. శ్రీశైలంలో నీరు 854 అడుగుల కంటే తగ్గినపుడు తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయకూడదన్నారు. ఈ అంశంపై పోరాటాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్సెల్ నాయకుడు ఇల్లూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎరువుల ధరలు తగ్గించి అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. -
ఉద్యోగులకు పండుగ ఏది?
కానుకలు కాదు మాయ‘‘వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే... హామీ ప్రకారం పది రోజుల్లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. గెలిచాక వాటిని పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల ఆందోళన పెరిగిపోతుండడంతో ఏదో ఒక మాయ చేస్తున్నారు. దీపావళి కానుక, సంక్రాంతికి తీపి కబురు అంటూ కాలక్షేపం కబుర్లు చెబుతున్నారు తప్ప, మా ఖాతాల్లో మాత్రం డబ్బులు పడడం లేదు’’ - ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదనసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ ఝలక్ ఇచ్చారు. పండుగ కానుకగా ఒక డీఏ, పోలీసులకు బకాయి ఉన్న ఒక సరెండర్ లీవు సొమ్మును విడుదల చేసినట్లు సోమవారం రాత్రి ప్రకటించినా... మంగళవారం సాయంత్రం వరకు ఏ ఒక్క ఉద్యోగికి ఆ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. దీంతో అసలు జమ అవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బకాయిల విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు సంక్రాంతి కానుక గత ఏడాది ఇచ్చిన దీపావళి ఉత్తుత్తి కానుక వంటిదేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఇచ్చామని చెబుతున్న మొత్తం గత ఏడాది దీపావళి కానుకగా ఇవ్వాల్సి ఉంది. దీనిపై అప్పట్లో... చంద్రబాబు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమై నానా హంగామా చేశారు. బకాయి ఉన్న నాలుగు డీఏల్లో ఒకటి, పోలీసులకు పెండింగ్లో ఉన్న రెండు సరెండర్ లీవ్లను రెండు విడతలుగా ఇస్తామని ప్రకటించారు. అయితే, అందుకు విరుద్ధంగా... వెంటనే ఇస్తామన్న డీఏను రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలతో కలిపి ఇస్తామని జీవోలు జారీ చేశారు. పెన్షనర్లకు మూడు విడతలుగా ఇస్తామని మరో జీవో ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో తనకు తెలియకుండా జరిగిందంటూ చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. డీఏను 2026, 2027 సంవత్సరాల్లో నాలుగు విడతలుగా ఇస్తామని జీవోను సవరించారు. దీపావళి కానుకే సంక్రాంతి తీపి కబురునాలుగు విడతల్లో ఇస్తామన్నదాంట్లో... ఒక విడత మొత్తాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ, అది కూడా తమకు రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో సంక్రాంతి కానుక మళ్లీ వచ్చే ఏ పండుగకో అని వెటకారంగా చర్చించుకుంటున్నారు. ⇒ పోలీసుల సరెండర్ లీవుల్లో రెండింటిని గత డిసెంబర్లోపు రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉంది. అందులో ఒకటి ఈ పండుగ కానుకగా ఇస్తున్నట్లు చెప్పారేమోనని భావించినా అదీ పడలేదు.⇒ చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలని్నంటినీ గాలికొదిలేశారని, బకాయిలను దీపావళి కానుక అని చెప్పి అప్పుడు ఇవ్వనేలేదని అంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుక అని మభ్యపెడుతుండడంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. నాలుగు డీఏల్లో ఒక్కటి ఇవ్వడానికి ఏడాదిన్నర తర్వాత ఒప్పుకొని దాన్నీ ఇవ్వకుండా నయవంచన చేస్తున్నారని మండిపడుతున్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వకుండా కానుకలంటూ వాయిదాలు వేయడం ఏమిటని నిలదీస్తున్నారు.ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్.. 2014–19 మధ్య బాబు పాలనలో 7 డీఏలేచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పడం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడు కూడా ఒక్క డీఏ ఇవ్వడానికి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 కాలంలో ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఐఆర్ ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా గెలిచాక పట్టించుకోలేదు.ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతుండడంతో 14 నెలల తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. అందులో చెప్పిన మాటలు కూడా అమలు చేయకుండా కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పుడు దానిగురించి కనీసం మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. పీఆర్సీ ఇచ్చే ఆలోచన కూడా లేనట్లుంది. అందుకే... కమిషనర్ రాజీనామా చేసినా ఏడాదిన్నరగా మరొకరిని నియమించలేదు. 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. కమిషన్ నియమించడానికే చంద్రబాబు సిద్ధంగా లేనందున.... పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లుఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లు ఉన్నా ఇప్పటివరకు ఎంత విడుదల చేశారో చంద్రబాబు చెప్పడం లేదు. వీటిలో ఎప్పుడు ఎంత ఇస్తారో చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఈ విషయంలోనూ మోసపోయినట్లుగా భావిస్తున్నారు.⇒ పోలీసుల రెండు సరెండర్ లీవుల్లో ఒకటి రూ.110 కోట్లు ఇప్పుడు ఇచ్చినట్లు చెబుతున్నా ఎవరికీ జమకాలేదు. ఒక డీఏ బకాయిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చామంటున్నా ఖాతాల్లో పడలేదు. ఈ రెండు మినహాయించినా ఇంకా రూ.33,780 కోట్లు ఎప్పటికి వస్తాయోనని ఉద్యోగులు వాపోతున్నారు. టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్య విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ, ఇంకా ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కూడా అందులో ఉన్న చిన్న మెలికను సాకుగా చూపుతూ మొత్తం వ్యవహారాన్నే పక్కన పెట్టేశారు.⇒ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. ఒక్క ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించలేదు. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై పాత విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్ను ఎత్తివేయడానికి సిద్ధం అవుతుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. వారికి పండుగ నాడు తీపి కబురు అని చెబుతున్న మాటలు ప్రచారమేనని స్పష్టమవుతోంది. -
‘పల్లె’ మళ్లీ మొదటికొచ్చింది
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ కళ తప్పింది.. ప్రజల చేతిలో డబ్బులు లేక మునుపటి సందడి కానరావడం లేదు.. ప్రకృతి వైపరీత్యాలు, వరుస తుపానులతో పంటలు దెబ్బతిన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. అరకొరగా చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఏ పంట అయినా సరే ‘కొందామంటే కొరివి.. అమ్ముదామంటే అడవి’ అన్నట్లు పరిస్థితి తయారైంది.టమాటా, ఉల్లి, ధాన్యం, మిర్చి, అరటి.. ఇలా పంటలన్నీ మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.. ఎరువుల ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి.. యూరియా సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.. వీటన్నింటికీ తోడు గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేసింది.. మరోవైపు గత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచింది.. ఫలితంగా వ్యాపారాలూ మందగించాయి.. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.. అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులాడట్లేదు.. పంట చేతికొచ్చి లాభాలార్జించి.. కొనుగోళ్లు, అమ్మకాలు బాగా జరిగితే ఇటు రైతాంగం, అటు వ్యాపార వర్గాల్లో సంతోషం వెల్లివిరిసేది.. తద్వారా ఇతర వృత్తుల వారికీ మెరుగైన ఉపాధి లభించేది.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండటంతో పల్లెల్లో సంక్రాంతి మొక్కుబడిగా మారింది.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు సాగుతున్న తీరుపై ‘సాక్షి’ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు ఈ విషయాలు కళ్లకు కట్టాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండుగ కోసం సొంతూళ్లకు వచ్చినా, రెండేళ్ల క్రితం ఊళ్లలో న్న పరిస్థితికి ృ ప్రస్తుతానికి మధ్య వచ్చిన మార్పును గమనించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఊళ్ల రూపురేఖలు సమూలంగా మార్చి వేసింది.. రెండేళ్ల క్రితం వరకు ఊళ్లలో అందమైన పాఠశాల, ఆర్బీకే, పీహెచ్సీ, గ్రామ సచివాలయం, ఇతరత్రా పలు ప్రభుత్వ బిల్డింగ్లన్నీ కళకళలాడుతూ కనిపించాయి.. ఇప్పుడవన్నీ వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం ఏమిటి? రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయడం ఏమిటి? అన్నీ బేరీజు వేసుకుంటే మునుపటి ప్రభుత్వ పాలనే నయం. గ్రామాలన్నింటిలో అభివృద్ధి వెనక్కు వెళ్లిపోయింది’ అని ఊరూరా జనం చర్చించుకోవడం కనిపించింది. కళకళలాడిన భవనాలన్నీ వెలవెలఊరు: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు శివారు గ్రామమైన భీమవరప్పాడుతో కలిపి 1,438 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 5,509. వీరిలో బయట ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వారు 1,200 మందికిపైనే. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు 2, వెల్నెస్ సెంటర్లు 2, రైతు భరోసా కేంద్రాలు 2, ఆయుర్వేద ఆస్పత్రి 1, పాఠశాలలు 3, అంగన్వాడీ కేంద్రాలు 5 ఏర్పాటయ్యాయి. 27 మంది గ్రామ వలంటీర్లు, 14 మంది సచివాలయ ఉద్యోగులు సేవలందించే వారు. గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవనం, గోడౌను, కేడీసీసీ బ్రాంచి భవనం, సహకార సొసైటీ అదనపు గదుల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం భవనం, నాడు నేడు కింద పాఠశాలల ఆధునికీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి చేశారు.గత ప్రభుత్వంలో డీబీటీ రూపంలో రూ.13.64 కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.52.47కోట్లు ప్రజలకు అందాయి. 5,142 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 1,816 మంది వైద్య సేవలు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భవనాల్లో సగానికి సగం మూతపడ్డాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిలో పండుగ కోసం గ్రామానికి వచ్చిన వారిలా మాట్లాడుకున్నారు. అశోక్కుమార్ (మార్కెటింగ్ ఉద్యోగి, హైదరాబాద్): వెంకటేశ్వరరావు బాబాయ్ బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? వెంకటేశ్వరావు (గ్రామస్తుడు, రైతు): ఏముంది నాన్నా.. వయస్సు మీద పడుతుందిగా.. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. సర్లే నువ్వెప్పుడు వచ్చావ్.. కుటుంబం అంతా బాగున్నారా.. అశోక్కుమార్: నిన్ననే వచ్చాం బాబాయ్.. అందరం బాగానే ఉన్నాం.. కానీ ఏంది బాబాయ్ మన ఊళ్లో సంక్రాంతి సందడి అంతగా కనిపించడం లేదు.. రెండు మూడేళ్ల క్రితం చూసిన ఊపు కనిపించడంలేదు.. వెంకటేశ్వరరావు: ఏముంటది నాన్నా.. పోయిన ఏడు బుడమేరు వరదలతో పంటలన్నీ దెబ్బ తిన్నాయ్.. ఈ ఏడు చూస్తే వర్షాల వల్ల పత్తి పంట పోయింది.. మామిడి పోయింది.. వరి పంట అంతంతమాత్రమే.. జగన్ ప్రభుత్వంలో ఇచ్చే పథకాలన్నీ ఎత్తేశారు.. జనం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయ్ నాన్నా.. జనం దగ్గర డబ్బులు లేకపోతే పండగ ఊపు ఎక్కడ నుంచి వచ్చుద్ది? (అంతలో జగదీష్ అనే యువకుడు అక్కడికొచ్చి కల్పించుకున్నాడు) జగదీష్: పండగలా ఉందా అసలు.. గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక రూపంలో అకౌంట్లలో డబ్బులు పడేవి. వాటితో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని డబ్బులు రెట్టింపు చేసుకునేవాళ్లు.. ఇప్పుడు ఏం ఉంది.. డబ్బులు లేవు.. ఇస్తానన్న పథకాలూ లేవు. అశోక్కుమార్: అదేందన్నా సూపర్సిక్స్ సూపర్ హిట్ అని తెగ ప్రచారం చేస్తున్నారుగా.. చంద్రబాబు పాలన సూపర్ అంటూ నా సహచరులు కొంత మంది తెగ చెబుతున్నారు.. జగదీష్: సరే చంద్రబాబు పాలన ఎలా ఉందో ఇప్పుడే చూద్దాం.. (అక్కడే ఉన్న రాజే‹Ùను ఉద్దేశించి..) రాజే‹Ù.. నువ్వు చదువుకొని ఉద్యోగం చేయడం లేదుగా.. మరి నీకు నిరుద్యోగ భృతి వస్తుందా? రాజేష్: లేదు అన్నా.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాదిన్నర అయ్యింది. నాకే కాదు. ఏ ఒక్కరికీ ఇచ్చింది లేదు. నాకు నిరుద్యోగ భృతి కింద రూ.54 వేలు రావాలి. వెంకటేశ్వరరావు: నిరుద్యోగ భృతినా వాళ్ల బొందనా.. ఊళ్లో కట్టాల్సిన బిల్డింగ్లను ఏడాదిన్నరగా కట్టలేకపోయారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటరు భవనం అలానే వదిలేశారు. ఆ భవనాలు మందు తాగేవాళ్లకి మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఇదేనా అభివృద్ధి అంటే.. వాన వస్తే మన రోడ్డంతా చెరువులా మారుతుంది.. ఏం అభివృద్ధి వాళ్లు చేసేది? అంతా కల్ల»ొల్లి మాటలే.. (వీళ్ల మాటలను సిద్దార్థ అనే బీటెక్ విద్యార్థి విని కల్పించుకున్నాడు) సిద్దార్ధ: ఏంటో మీరు అభివృద్ధి అంటున్నారు.. పథకాలు అంటున్నారు.. అసలు ఈ ప్రయివేటు పరం గురించి చెప్పరేంది బాబాయ్.. ప్రతి దాన్నీ ప్రయివేటు పరం అంటోంది ఈ ప్రభుత్వం. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల ఎంత నష్టమో మీకు తెలుసా? డబ్బులు లేవంటూనే ఆవకాయ అమరావతి, యోగాంధ్ర పేరుతో రూ.కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం బాబాయ్? (అప్పుడే అక్కడికొచ్చిన గ్రామస్తుడు అభిద్నగో కల్పించుకున్నాడు) అభిద్నగో: ఒక్క ఆవకాయ అమరావతి ఏంటి.. టూర్లు.. ప్రత్యేక విమానాలు.. ఈవెంట్లు.. వీళ్లని చూస్తుంటే ప్రజల సొమ్ముని పప్పూ బెల్లాల్లా పంచుకొని కాజేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని ఇట్టే తెలుస్తోందిగా.. జగదీష్: ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు గాల్లో కలిసిపోయాయి.. జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, పాఠశాలలు నిరీ్వర్యం చేశారు. పేద వాళ్ల పొట్ట కొడుతున్నారు.. ఈ ప్రభుత్వం వల్ల ఎంతగా నష్టపోయారో మనకంటే మహిళలు ఇంకా బాగా చెబుతారు. వెంకటేశ్వరరావు: అసలు మన చెరువుకి నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరగా వదిలేశారు.. ఈ ఏడు నారుమళ్లు ఎండిపోయి, నానా తిప్పలు పడ్డాం..పేదలన్నా, రైతులన్నా ఈ ప్రభుత్వానికి పట్టదబ్బాయ్.. అప్పుడే అక్కడికొచ్చిన శ్రీరాములు, హనమయ్య, రమేష్ కల్పించుకుంటూ: ఏం ప్రభుత్వమో నాయనా.. ఇదివరకు ఇంటికి వచ్చి ఏం కావాలన్నా ఇచ్చే వాళ్లు.. రేషన్ ఇంటి ముందుకే వచ్చి ఇచ్చే వాళ్లు.. ఇప్పుడు రేషన్ షాపుకు పోయి క్యూలో నిలబడాలి.. ఇప్పుడు ఏదైనా సర్టీ ఫికెట్ కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏదైనా జగన్ ప్రభుత్వంలో పేదోళ్లు నిశి్చంతగా బతికారయ్యా. వెంకటేశ్వరరావు: ఆరే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకో మూడేళ్లు ఈ నరకం అనుభవించాల్సిందే.. వీళ్లు చెప్పే అభివృద్ధి కాగితాలపై మాత్రమే కనిపిస్తుంది. ఊళ్లలోకి వస్తే చూస్తే అసలు రంగు బయట పడుతుంది. అశోక్కుమార్: అవును బాబాయ్.. నేనే విన్నది ఒక్కటి.. ఇక్కడ చూస్తున్నది, వింటున్నది మరొకటి.అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట!ఊరు: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్: అన్నా.. లక్ష్మి పిల్లలు బాగా చదువుకుంటున్నారని తెలిసింది. ఎక్క డ చదువుతున్నారు.. ఇప్పుడు ఎలా ఉంది వారి పరిస్ధితి? బాబూరావు: ఏమి చెప్పమంటావు తమ్ముడూ. పేదోళ్ళయినా పిల్లలను బాగా చదివించాలనుకున్నారు. ఇద్దరు పిల్లలూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పెద్దోడికి మూడేళ్ళ క్రితం ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లించింది. చిన్నబ్బాయ్ రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రెండేళ్ళ నుంచి వారికి ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదంట. కాలేజీ వాళ్ళు బాగా ఒత్తిడి తెస్తే ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజులు కట్టింది. వాళ్ళ చదువులు పూర్తయితేగానీ లక్ష్మి కష్టాలు తీరవు. యశ్వంత్: కోటేసు మావయ్యా.. రాందాసు పిల్లలు ఏమి చేస్తున్నారు.. పెద్దోడు బాగానే చదివేవాడని విన్నాను. కోటేసు: రాందాసు పిల్లలు డిగ్రీలు చదివారు అల్లుడూ.. పెద్దోడుకి కాలేజి ఫస్ట్ వస్తే సన్మానాలు చేశారు. ఉద్యోగం లేక ఏదాడిన్నర నుంచి ఊరిలోనే ఉంటున్నాడు. వ్యవసాయ సీజన్లో పొలం పనులకు వెళుతున్నాడు. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఏదీ లేదు. చదువుకున్నోళ్ళకు నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఏదీ ఇవ్వడం లేదు. చేసేది లేక వయస్సు మీదపడినా కుటుంబాన్ని లాక్కురావడానికి రాందాసు ఇంకా కష్టపడి పనులకు వెళుతున్నాడు. యశ్వంత్: రాంబాబు బాబాయ్ మూడేళ్ళ క్రితం ఊరొచ్చినపుడు వలంటీర్ రవి మేము తీసుకున్న పొలం తాలూకా ఏదో పనుంటే దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు వలంటీర్ పోస్టులు తీసేశారుగా ఏం చేస్తున్నాడు? రాంబాబు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు పది వేలు ఇస్తామని హామీ ఇస్తే అందరూ చాలా సంబర పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చాక వారందరినీ తీసేయడంతో ఎవరికి తోచిన పనులు వారు చేసుకుంటున్నారు. రవికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఏమి చేస్తాడు.. ఊరిలో పనులు లేకపోవడంతో విజయవాడ వెళ్ళి ఏదో షాపులో గుమస్తాగా పనిచేస్తూ భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాడు. యశ్వంత్: తమ్ముడూ విజయ్.. ఆ వెళ్లే మనిషి వెంకటేశ్వరమ్మలా ఉంది. అలా నడుస్తుందేంటి? విజయ్: వాళ్ళాయన ఐదు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రెండు నెలల క్రితం ఆమె పడిపోతే కాలు విరిగింది. ఆపరేషన్ చేశారు. ఒక్కగానొక్క కూతురుకి పెళ్ళి చేసి అత్తింటింకి పంపింది. పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంది. దాని కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. యశ్వంత్: ఈ ప్రభుత్వం బాగా చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసి నిజమేననుకున్నా. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందే.. అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట.. రంగారావు: రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామంటే నమ్మి ఓట్లేశాం. చేసిందేం లేదు. పైగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలు తీసేశారు. ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఏముంది? ఈ ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరన్నది మాత్రం నిజం. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఇంతే. ఏం పండగో ఏమో.. సెయ్యాడితేగా! ఊరు: విజయనగరం జిల్లాడెంకాడ మండలం గుణుపూరుపేట రమణ: ఏరా శ్రీనూ.. పండగ సందడే లేకుండా పోయింది. చేతిలో డబ్బుల్లేవు. చేద్దామంటే పనుల్లేవు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు పండగ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్లకు తప్ప ప్రజలకు లేకుండా పోయింది. శ్రీను: నిజమే బావా.. ఆరు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు కూడా పడలేదు. నాకు దాదాపుగా పాతిక వేల వరకు రావాలి.. అవి వచ్చినా పండక్కి పిల్లలకు బట్టలైనా కొనేవాడిని. సూర్యనారాయణ (రైతు): ఈ గవర్నమెంట్ వచ్చింది మొదలు పేదలు, రైతుల ఇళ్లలో కష్టాలే తప్ప నవ్వులు కనపడలేదు. రైతులకు సరిపడా యూరియా అందించలేకపోయింది. ఇదీ ఓ ప్రభుత్వమా? లక్ష్మి (డ్వాక్రా సంఘం నాయకురాలు): ఏం చిన్నాయనా.. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. మేం మాత్రం కష్టాల్లో ఉన్నాం. గతంలో వైఎస్ జగన్ ఉన్నపుడు నిత్యం మాకు అండగా ఉండేవారు. పిల్లల చదువులకు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. చిన్నాచితకా వ్యాపారాలకు కూడా ఆసరా పథకం ఉండేది. ప్రజల వద్ద నిత్యం డబ్బు కదిలేది. మా సొంత అవసరాలు తీరేవి. పిల్లలకు కొత్త బట్టలు కొనేవాళ్లం. ఇప్పుడు ఆ రోజుల్లేవు.. పది రూపాయలు కూడా మా ఆయనను అడగాల్సి వస్తోంది. అప్పన్న: జగన్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎప్పుడూ అగలేదురా.. కానీ ఈ సర్కారు వచ్చాక ఆరోగ్యశ్రీ ప్రాణం తీసేస్తోంది. మొన్నామధ్య నాకు కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని చేర్చుకోలేదు.. అప్పుచేసి వైద్యం చేయించుకున్నాను.. ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ కడుతున్నాను. కాలు ఇంకా సరిగా నడవడానికి కూడా రావట్లేదు. కుంటుకుంటూ నడవాల్సి వస్తోంది.బతకడమే కట్టమైతే పండగయాడబ్బా..ఊరు: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి లక్ష్మన్న: ఏందప్పా రామన్న.. పొలం పోలేదా?రామన్న: ముందు ప్రభుత్వంలో పంచాయతీ కాడ ఉన్న ఆర్బీకేలోకి వెళ్లి యూరియా తీసుకుని పంటకు వేసేవాడిని. ఇప్పుడు చూస్తే యూరియా బంగారమైందప్పా.. ధర్మవరానికి వెళ్లి ప్రైవేటోళ్ల దగ్గర దొడ్డిదారిన రెండింతలు ధర ఇచ్చి కొనే పరిస్థితి ఏర్పడింది. రైతులకు కరువు వచ్చినా, ఆపదొచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదప్పా.. పట్నం నుంచి వచ్చిన నా కొడుకు, కోడలు ఈ పరిస్థితి చూసి ఎందుకు నీకు వ్యవసాయం.. అంటున్నారు. వాళ్లతోపాటు రమ్మంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదప్పా. ఆళ్లు చెప్పినట్లు పట్నంపోతే అక్కడ నాకు ఏమీ తోచదు. ఈన్నే ఉందామంటే బతికే దారి లేకుండా పోయింది. లక్ష్మన్న: ఏం సాంబయ్యా బియ్యం తెచ్చుకున్నావా.. సాంబయ్య: ఔనప్ప.. పట్నం నుంచి వచ్చిన నా మనుమడిని తీసుకుని పొరుగూరికి వెళ్లి మూడు గంటలు లైన్లో నిల్చుని తెచ్చుకున్నా. ముందు ప్రభుత్వంలో అయితే ఇంటికాడికే రేషన్ బండి వచ్చేది. ఇప్పుడంతా యాతనేకదప్పా. మన గురించి ఆలోచించే వారు ఎవరున్నారు? ముందు రోజులే ఎంతో మేలప్పా. లక్ష్మన్న: ఏం లింగన్నా.. ఆరోగ్యం బాగోలేదంటివి ఆసుపత్రికి పోయినావా.. లింగన్న: ఏం చెప్పాలిలేప్పా.. ముందు ప్రభుత్వంలో అయితే పంచాయతీ వద్దకు వెళితే ఇలేజ్ క్లినిక్లో డాక్టరోళ్లు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు వెళితే పట్టించుకునే వారే లేరప్పా. అందుకే కొడుకుని పిలుచుకుని ధర్మోరం వెళ్తున్నానప్పా. అయినా ఇదంతా ప్రభుత్వం చాతకాని తనమప్పా.. కాదు కాదు చాతకాని ప్రభుత్వానికి ఓట్లేసిన మనప్రజలదప్పా తప్పు. ఇంతకు ముందు మనూరికి పతీ నెలా 10వ తేదీలోపు 104 అంబులెన్స్ వ్యాన్ వచ్చేది. ఇక్కడే పరీక్షలు చేసి.. బీపీ, షుగర్తో పాటు ఏ ఇబ్బంది ఉన్నా మందులు ఇచ్చేవారు. ఇపుడా ఊసేదీ? ఉన్న పట్టా పాసు పుస్తకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేదానికి డబ్బులు కట్టాలట. అందులోనూ అన్నీ తప్పులే. సుబ్బరాయుడు: అవును.. లింగన్న చెప్పింది నిజమే.. ఈ ప్రభుత్వం దేని గురించీ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నా. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు. కనీసం కొనుగోలు చేసే నాధుడే లేడు. విడ్డూరమేంటంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథనాన్ని చంద్రబాబుతో మాట్లాడి నేనే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఈ ప్రభుత్వ ఉలుకూ పలుకూ లేదు. పైగా ఆ పథకాన్ని మొదలెట్టిన జగన్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోంది. రేవంత్ రెడ్డి చెప్పిందాంట్లో నిజముందా.. లేదా చెప్పమంటుంటే ఆ పథకమే అక్కర్లేదంటోంది చంద్రబాబు ప్రభుత్వం. సొంత రాష్ట్రానికి నష్టం చేసే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. మన రాత బోగోలేదు కాబట్టే ఇన్ని కష్టాలని అనుకోవాల్సి వస్తోంది. మరో మూడేళ్లు తప్పవీ తిప్పలు. పదండి ఇళ్లకు.. పొద్దు పోయింది.. ఇళ్ల కాడ తిడతారు. సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా.. ఊరు: విశాఖ జిల్లా తాటితూరు ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేష్: అప్పల్రాజూ.. ఏం పండక్కు కొత్త బట్టలు కొన్నావా.. లేదా? అప్పల్రాజు: రా డాక్టరూ.. కూర్చో.. ముందు వెయ్యి కళ్లతో సూసి.. వెనకున్న గోతిలో పడ్డట్టుంది మా యవ్వారం. మొన్నటి దాకా జగనన్న హయాంలో రైతు భరోసా పైసలు సరిగ్గా పండక్కి ముందే పడేవి. అమ్మ ఒడి.. ఆసరా.. ఇలా ఇంటి ఖర్చులకు ఎలాటి లోటుండేది కాదు. ఇప్పుడు బట్టలు కొనడానికి జేబులో పైసా ఉంటే కదా. ఆనంద్: అవునన్నా.. ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడమే మానేసింది. ఆర్బీకేలు ఉంటే రాజులా ఉండేవాళ్ళం. విత్తనం కావాలన్నా, ఎరువు కావాలన్నా అక్కడికెళ్లేవాళ్లం. పండించిన ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పట్టుకెళ్లే తిప్పలు లేకుండా ఊర్లోనే కొనేవారు. ఇప్పుడు మళ్ళీ దళారీలు తయారయ్యారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మద్దతు ధరేమో రూ.2,369 అంటారు. అక్కడికెళ్తేమో రూ.1,650 ఇత్తన్నారు. ఇంకేటి మిగుల్తాది? బోని లలిత్ ఆదిత్య: అన్నా.. మీ మాటలేమో గానీ మందు (లిక్కర్) మాత్రం బాగా దొరుకుతోంది. అందరూ ఒక్కసారిగా: మందు ఊసెత్తకు ఆదీ.. 24 గంటలూ ఎక్కడ సూసినా మందే కనిపిస్తోంది. కుటుంబాలు నాశనమైపోతుండాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆ మందులోనూ సగం నకిలీ అని తేలింది. ఆ మందు తాగితే త్వరగా చస్త్రారా.. చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు మందులు ఇవ్వడం లేదుగానీ.. ఊరూరా మాత్రం మందు విందు పథకం మొదలెట్టేసింది. సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా. సూస్తే బాధేస్తాంది. అప్పల్రాజు: ఇంకా మూడేళ్ల పాటు పండగ ఇంతేలే.. మా షావుకారి దగ్గరకెళ్లి రూ.రెండు వేలు అప్పు తీసుకోవాలి. తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలున్నాయో తెలుసా? నేను యూఎస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేశాను. ఇక్కడ కూటమి ప్రభుత్వ పోకడ చూస్తుంటే బాధేస్తోంది. రాష్ట్రంలో పేదవాడు మెడిసిన్ చదివే పరిస్థితి కన్పించడం లేదు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులేవని ఈ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలుసా? గత ప్రభుత్వం మంజూరు చేయించి, మొదలు పెట్టిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి డబ్బులు లేవు గానీ, ప్రచార ఆర్భాటానికి మాత్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం? ఉద్యోగాలివ్వని కంపెనీలకు రూపాయికి, అర్ధ రూపాయికి భూములు కేటాయిస్తున్నారు. ముందు చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. – కాసం నాగార్జున, పావులూరు, బాపట్ల జిల్లాప్రచారం మాత్రం ఆహా.. ఓహో.. రాష్ట్రంలో అభివృద్ధిపై ఆహా.. ఓహో.. అంటూ ఆర్భాటం చేస్తున్నారు గానీ.. ఇక్కడ గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతుల్లో గంపెడు మట్టి వేయలేదు. హైదరాబాదు నుంచి జాతీయ రహదారిలో వచ్చి, గ్రామీణ రహదారిలోకి రాగానే గోతులతో ఇబ్బందులు పడ్డాం. అంతటా గోతులమయమే. జుత్తిగ – సిద్ధాంతం రహదారిలో ప్రయాణం భయంభయంగా ఉంది. రెండేళ్లలో గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ భవన నిర్మాణాలూ లేవు. రెండేళ్ల క్రితం వరకు జరిగిన మార్పు అలానే ఉండిపోయింది. – కర్రి ఉమామహేశ్వర్, జుత్తిగ, పశి్చమ గోదావరి జిల్లా (హైదరాబాద్ నుంచి వచ్చారు)చదివించలేక పోతున్నాం గతంలో మాకు జగనన్న చేదోడు వచ్చేది. ఆ ఆరి్థక సాయంతో టైలరింగ్ షాపు నడిపేవాళ్లం. ఇప్పుడు ఆ సాయం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణాలోని సిర్పూరు కాగజ్నగర్లో బెడ్డింగ్ టైలర్గా పనిచేస్తున్నాను. చాలా ఒత్తిడిగా ఉంటుంది. నాతో పాటు నాభార్య కూడా కష్టపడుతుంది. గతంలో వైఎస్సార్ ఆసరా, చేయూతా వచ్చేవి. అవి ఇప్పుడు లేవు. పిల్లల్ని ఇంటి వద్ద ఉంచి చదివిస్తున్నాం. ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. – సవిరిగాన శ్రీహరి, వన్నలి గ్రామం, రేగిడి మండలం, విజయనగరం జిల్లా ఏ పనులూ కావడం లేదు నేను తిరుపతిలో పని చేస్తుంటాను. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు మా ఊరికి వస్తాను. గ్రామంలో ఎక్కువ మంది తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి ఇతర ప్రాంతాలకు పనికి వెళ్తారు. దీంతో వృద్ధులైన వారు రేషన్ షాపునకు వెళ్లి బియ్యం మూట తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ కోసం కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. ఏవైనా పనుల కోసం మా గ్రామ సచివాలయానికి వెళ్లడానికి అడ్డదారిన నడిచి వెళితే సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. మోటారు సైకిల్ వేసుకుని రోడ్డుపై వెళితే నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి. ఇంత కష్టబడి తీరా గ్రామ సచివాలయానికి వెళితే సీట్లో అధికారులు ఉండడం లేదు. ఫోన్ చేస్తే సర్వేలో ఉన్నామంటున్నారు. దీంతో చచీ్చచెడి మళ్లీ ఉసూరుమంటూ ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఈ కష్టాలే ఉండేవి కావని గ్రామస్తులు చెబుతున్నారు. – డోలా హనుమంతరావు, బేల్దారి మేస్త్రి, చిన్న కనుమళ్ల గ్రామం, కనుమళ్ల పంచాయతీ, ప్రకాశం జిల్లా -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురు దెబ్బ
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన గన్మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్మెన్తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు అనంతపురం రాజకీయ వాతావరణంలో కొత్త మలుపు తిప్పింది. -
‘చంద్రబాబు స్కిల్ కేసు మూసివేత రాజ్యాంగ విరుద్ధం’
అనంతపురం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్నెట్ కేసు, లిక్కర్ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు అత్యంత హేయంగా స్కిల్ కేసు కూడా క్లోజ్ చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు. డొల్ల కంపెనీలకు రూ.371 కోట్ల ప్రభుత్వ నిధులు మళ్లించి, అక్కణ్నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు, అన్ని ఆధారాలతో సహా దొరికి, జ్యుడీషియల్ రిమాండ్లో జైలుకి కూడా వెళ్లారని చెప్పారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు దోషిత్వంపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిన సీఐడీ.. ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) తుది నివేదిక ఇవ్వడం, వెంటనే ఆ నివేదికను ఆమోదించి ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని శైలజానాథ్ అన్నారు. ఇది చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని స్పష్టం చేశారు. నాడు తీవ్ర అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందిన చంద్రబాబు, తిరిగి అధికారంలోకి రాగానే, తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని గుర్తు చేశారు.స్కిల్ స్కామ్ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పిన సీఐడీ.. మరి అప్పుడు సేకరించిన ఆధారాలు, నాటి ఈడీ ఛార్జిషీట్ అన్నీ అబద్ధాలేనా? అని అనంతపురంలోని పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్ ప్రశ్నించారు.శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు కేసుల మాఫీ రాజ్యాంగ విరుద్ధంసీఎం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని నేరాలు, దందాలు చేసినా తమ కార్యకర్తల్ని కాపాడుకుంటున్నారు. అనంతపురంలో వారానికో భూకుంభకోణం బయటపడుతోంది. ఎవరో ఒక ప్రజాప్రతినిధి బెదిరించారని చెప్తుంటారు. అధికారులు మాత్రం మౌనంగా ఉండిపోతుంటారు. ఇదే క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు తన సొంత కేసుల్ని ఎత్తేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. తనకు తానే కితాబిచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్నెట్ కేసు, లిక్కర్ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, తాజాగా స్కిల్ కేసు కూడా క్లోజ్ చేయించుకున్నారు. నిజానికి స్కిల్ కేసులో సీమెన్స్ కంపెనీ తమకు ఏ మాత్రం సంబంధం లేదని కూడా చెప్పింది. దీంతో చంద్రబాబు దోషిత్వం పూర్తి ఆధారాలతో సహా బయటపడింది, అయినా అలా వరసగా కేసులు మూసివేయించుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్తో పాటు, హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కేసుల ఎత్తివేతపై న్యాయపోరాటం కొనసాగిస్తాంచంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న సీఐడీ విభాగమే గతంలో అన్ని ఆధారాలు సేకరించి కేసు పెడితే.. ఈడీ కూడా కేసు పెడితే.. ఇవన్నీ కేసుల మాఫీకి అడ్డు రాలేదంటే ఈ వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో అర్దమవుతోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, సాక్ష్యాలు మార్పించి నేరాల్ని మాఫీ చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు ఓ చెడ్డ ఒరవడిని సృష్టిస్తున్నారు. మీ పార్టీ ఆఫీసు ఖాతాల్లో రూ.77 కోట్లు రాలేదా?. మీరు అంత కడిగిన ముత్యమైతే కోర్టుల్లో పోరాడి ఎందుకు గెలవలేకపోయారు? చివరికి ఈడీ కూడా బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారని కేసు పెట్టింది కదా? మరి ఆ రిపోర్ట్ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారా?.ఈ ధోరణి అస్సలు మంచిది కాదు. ఎవరూ ఎవర్నీ కాపాడలేరు. నిజానికి, సత్యానికి దూరంగా ఓ మనిషి కోసం అధికారులు సాగిస్తున్న హననం ఎంతో కాలం సాగదు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబు కేసుల మాఫీపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుంది అని స్పష్టం చేశారు. -
చెంతన ఉన్నది చేజార్చుకుంటారా?
డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.“ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది. ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు."నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘దర్యాప్తు సంస్థలను ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారు’
కాకినాడ: చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, దర్యాప్తు సంస్థలను ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు కొట్టేయించుకోవడమే ఉదాహరణ అని అన్నారు. ‘ ఈ సంక్రాంతికి చంద్రబాబు ఆయనకు ఆయనే కానుక ఇచ్చుకున్నారు. ఆయన మీద ఉన్న స్కిల్ స్కామ్ కేసున ఎత్తివేసుకున్నాడు. ఈ కేసులో ఆయనే నిందితుడు ,ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పు ఇచ్చేసుకున్నారు. ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా తన మీద తన కేసునే ఎత్తివేసుకున్నాడు. ఉద్యోగుల డిఎలు, కాంట్రాక్టులకు బిల్లు చెల్లింపులను సంక్రాంతి కానుక అని ఎల్లో మీడియాలో రాశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఎత్తివేశారు. దర్యాప్తు సంస్ధలను తన గుప్పెట్లో పెట్టుకుని తన కేసులను ఎత్తివేసుకుంటున్నాడు. జగన్ జన్మదినం సందర్భంగా మేకను కోస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టి ధర్డ్ డిగ్రీ వారిపై ప్రయోగించారు.రేపు కొబ్బరి కాయ కొడితే కేసు పెట్టేలా ఉన్నారు. *చంద్రబాబు మీద ఉన్న స్కామ్ కేసులపై వైఎస్ఆర్ సిపి న్యాయపోరాటం చేస్తుంది’ అని స్పష్టం చేశారు. -
ఇరుసుమండ బ్లోఅవుట్ వెనుక అనుమానాలు: భూమన
సాక్షి, తిరుపతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ మోరి బావి–5లో భారీ బ్లోఅవుట్పై సందేహాలు వ్యక్తం చేస్తూ.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో భూమన కరుణాకర్రెడ్డి ఏమన్నారంటే..ఏ అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్:భారీ డ్రిల్లింగ్లో ఏ మాత్రం అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్కు ఇరుసుమండలో ఓఎన్జీసీ కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని వల్ల మోరి బావి–5 వద్ద భారీ బ్లోఅవుట్ జరిగి, 150 అడుగలకు పైగా మంటలు చెలరేగి వేలాది ఎకరాల్లో పంటలు తగలబడి, వందల కోట్ల నష్టం జరిగింది. ఈ దుర్ఘటన వెనుక ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంటే, దీన్ని సహజంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించి ప్రభుత్వ పెద్దలు మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.డీప్ ఇండస్ట్రీస్ అనే ఓ అమెరికన్ కంపెనీకి అనుభవం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అందుకే బ్లోఅవుట్ జరగ్గానే తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు సీరియస్గా సహాయ పనులు చేయాల్సిన అధికారులు నవ్వుతూ కనిపించారు. అందువల్లే బ్లోఅవుట్పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.లోతైన విచారణ జరపాలి:అందుకే డీప్ ఇండస్ట్రీస్ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది. అసలు ఎవరి ద్వారా ఈ కంపెనీ సహజ వాయువును వెలికి తీసే కాంట్రాక్టు దక్కించుకుందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాగా, ప్రమాద ఘటనను కూడా కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్నారని, అది మరీ దారుణమని భూమన కరుణాకర్రెడ్డి ఆక్షేపించారు. -
వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్ పార్కింగ్ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం రేపింది. విచక్షణ కోల్పోయి భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై దాడి చేశారు.భక్తులపై దాడి చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై స్పష్టత లేదంటూ దుర్గగుడి అధికారులు ప్రకటించారు. దుర్గగుడి అధికారుల బాధ్యతా రాహిత్యంపై భక్తులు మండిపడుతున్నారు.కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో ఈ ఘటన చోటుచేసుకోగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్ గ్రూప్లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది. -
నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: గ్రూప్–1, గూప్–2 మెయిన్స్ ఫలితాలు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఏడాది కావొస్తున్నా, దీనిపై వేసిన కేసులన్నీ క్లియర్ అయినప్పటికీ ఇంకా ఫలితాలు వెల్లడించకుండా నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫలితాలు వెల్లడించవచ్చని కోర్టు ఆదేశించినా ఏపీపీఎస్సీని చంద్రబాబు తన జేబు సంస్థగా మార్చేసుకుని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని విమర్శించారు.అత్యంత కీలకమైన ఈ విభాగానికి ఇప్పటికీ శాశ్వత చైర్మన్ను నియమించకుండా కాలక్షేపం చేయడం నిరుద్యోగులను వంచించడమేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే నియామకాలు పూర్తి కావాల్సి ఉన్నా, వైఎస్ జగన్కి మంచి పేరొస్తుందన్న అక్కసుతో చంద్రబాబు తన వారితో కేసులు వేయించి మెయిన్స్ పరీక్షలు జరగకుండా అడ్డుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు:గత వైయస్సార్సీపీ హయాంలోనే గ్రూప్–1లో 90 పోస్టులకు, గ్రూప్–2లో 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2024 ఫిబ్రవరిలోనే ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం అదే ఏడాది మే నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి, ఆ పరీక్షను అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాకుండా, దాదాపు ఏడాది తర్వాత, 2025 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మరో ఏడాది పూర్తవుతున్నా, ఆ ఫలితాలు ప్రకటించకుండా, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.నిజానికి టీడీపీ వేయించిన కేసుల వల్లే ప్రిలిమ్స్ పరీక్ష జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ నియామకాలు జరగడం లేదు. కోర్టు ఆదేశాలను సైతం ఈ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒకసారి ఏపీపీఎస్సీ చైర్మన్ని కలిసి ఫలితాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకుని, వెంటనే గ్రూప్స్ మెయిన్స్ ఫలితాలు ప్రకటించి, నియామకాలు పూర్తి చేయాలని ఎ.రవిచంద్ర డిమాండ్ చేశారు. -
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబే ప్రధాన దోషి: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: స్కిల్ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. చంద్రబాబే ఈ కేసులో ప్రధాన దోషి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఐడీ పక్కా ఆధారాలు సేకరించిందని.. రూ.372 కోట్లు పక్కదారి పట్టినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. అలాంటి కేసును కొట్టేయటం విడ్డూరం అని సతీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబే తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం దారుణం. ప్రభుత్వంలో ఉండి మాఫీ చేసుకోవడం అభ్యంతరకరం. చంద్రబాబు కేసును ఎదుర్కొని తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంతేగానీ ఇలా కేసును నీరు గార్చటం సబబు కాదు. దీనిపై మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు సర్వనాశనం చేశారు. అది నిరర్ధక ప్రాజెక్టు అయితే మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి నిలదీశారు.‘‘ప్రాజెక్టు సందర్శన చేస్తున్న నెల్లూరు నేతలను అడ్డుకోవడం ఎందుకు?. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుండి నీరు తీసుకెళ్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా?. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తే ప్రకాశం జిల్లా సస్యశ్యామలమవుతుంది. కానీ చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు...రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబు అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. 19వ తేదీ లోపల అందరినీ తీసుకెళ్లాలి. లేకపోతే మేమే స్వయంగా పరిశీలనకు వెళ్తాం. అక్కడ ఏమాత్రం పనులు జరుగుతున్నాయో ప్రపంచానికి తెలుపుతాం. కాంట్రాక్టర్ల నుండి 25-30 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వర రావుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు?. నీళ్ల విలువ గురించి ఏబీవీకి ఏం తెలుసు?. ఒకసారి ఆయన రాయలసీమ వచ్చి ప్రాజెక్టులను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రాయలసీమ లిఫ్టు నిరర్థకం అంటున్న చంద్రబాబే నిరర్థకం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అక్కడి ప్రజలే తగిన బుద్ది చెప్తారు. నామమాత్రపు సీట్లు కూడా సాధించలేరు’’ అని సతీష్రెడ్డి అన్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
'మన శంకర వరప్రసాద్ గారు' కాస్త తగ్గితేనే మంచిది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ డే రూ. 84 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్ రీవర్షన్ చేయడంతో బాగుందని టాక్ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్ వస్తే.. టికెట్ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. టికెట్ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి టికెట్ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇలా..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్ స్క్రీన్లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అధనంగా సింగిల్ స్క్రీన్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026 -
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. -
పులివెందులలో పోలీసుల కళ్లకు టీడీపీ గంతలు
పచ్చ ఖద్దరు చొక్కాల ముందు ..ఖాకీ యూనిఫాం తెల్లబోయిందా...!అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసు మాట తమ్ముళ్ల పాదాల కింద చిక్కి నలిగిపోయిందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పండుగ మాటున పట్ట పగలే బరులు రూపుదిద్దుకుంటున్నాయ్... కోడి పందాలకు షామియానాలు లేస్తున్నాయ్.. జూదశాలల కోసం లక్షలు చేతులు మారుతున్నాయ్...అధికారం ఉందనే అహంకారమో.. పోలీసులు ఏం చేయలేరనే ధీమానోగానీ పచ్చ నేతలు బరి తెగించారు.సాక్షి, పులివెందుల: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కోడి పందేలు, జూదాలు కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి నిర్వహణ ద్వారా టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జూదాలను అరికట్టాల్సిన పోలీ సులు వారికి సహకరిస్తున్నట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగు, మురారిచింతల, పార్నపల్లె గ్రామా ల్లో టీడీపీ నాయకులు కోడి పందాలు నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోడి పందాలు, జూదాలు, గుండాట, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు ఉన్నతాధికారులు సైతం పర్మిషన్ ఇచ్చారని టీడీపీ నాయకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా వాటి నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ మేరకు గుండాట, పేకాట ఆడించేందుకు వివిధ ప్రాంతాల వారిచే నిర్వాహకులు డబ్బులు కూడా తీసుకున్నారని సమాచారం. డబ్బులు ఇచ్చిన వారు తప్ప వేరేవారు ఆడేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీగా జూదాలు లింగాల మండలానికి చెందిన టీడీపీ నాయకుడొకరు వారం రోజుల నుంచి జూదాలు నిర్వహించడానికి దొండ్లవాగులో 5నుంచి 7ఎకరాల స్థలాన్ని చదును చేశాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో జూదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షామియానాలను కూడా సిద్ధం చేశాడు. దీనికోసం జూద నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 14, 15, 16వ తేదీల్లో లోపల.. బయట అనే పేకాట (మంగతాయి) ఆడించేందుకు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సదరు లింగాల మండల నాయకుడికి లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. అలాగే అక్కడే గుండాట నిర్వహించడానికి కడపకు చెందిన వ్యక్తి టీడీపీ నాయకుడికి రూ.15లక్షలు సమరి్పంచినట్లు సమాచారం. ఇవే కాకుండా కోడి పందాల నిర్వహణలో ఇప్పటికే పందెం దారులు కోట్లల్లో పందాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై కూడా టీడీపీ నిర్వాహకుడైన మండల నాయకుడికి లక్షల్లో సమరి్పంచినట్లు సమాచారం. పోలీసులతో పనిలేదంటున్న టీడీపీ నాయకులు జూదరులకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని సదరు టీడీపీ మండల నాయకుడు గట్టిగా భరోసా ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు తమను ఏమి చేయలేరని వారితో తమ నాయకుడు ముందుగానే మాట్లాడారని ఎలాంటి ఇబ్బంది ఉండదని, స్వేచ్చగా మూడు రోజులపాటు జూదం ఆడుకోవచ్చునని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున జూదం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ఇంత జరుగుతున్నా ఖాకీలు కన్నెత్తి చూడడం లేదు. నిన్నా మొన్నటి వరకు సంక్రాంతి పర్వదినాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు విరివిరిగా ప్రచారాలు నిర్వహించారు. పైగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జూదశాలలు నిర్వహించకూడదని, అలా జూదాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇదివరకే మీడియా సమావేశంలో హెచ్చరించారు. పులివెందులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక లింగాల మండలంలోనే కాకుండా పులివెందుల మండలంలోని కొత్తపల్లె, అచ్చివెళ్లి ఇతర గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జూదశాలలు నిర్వహించేందుకు ఆయా మండలాలకు చెందిన టీడీపీ నాయకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పేకాటశాలలు వెలుస్తున్నా.. కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నా స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు పోలీసుల తీరును తూర్పారబడుతున్నారు. -
భోగికి దూరంగా బూరవిల్లి గ్రామం
శ్రీకాకుళం జిల్లా: గార మండలంలోని బూరవిల్లి గ్రామం భోగి ఉత్సవానికి దూరంగా ఉంటోంది. అన్ని గ్రామాల మాదిరిగా వేకువజామున వేసే భోగి మంట అక్కడ వేయరు. పెద్దల కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని తామంతా కొనసాగిస్తున్నామని అక్కడి గ్రామపెద్దలు చెబుతుంటారు. ఇక్కడ ఉగాది రోజున రైతులు ఏరువాక చేయకుండా, మరో రోజు ముహూర్తం చూసి ఏరువాక చేస్తారు. నాగుల చవితి రోజు కాకుండా అదే నెలలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి రోజున పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు. మంట వేస్తే అరిష్టమని నరసన్నపేట: నరసన్నపేట మండలం చోడవరం, చింతు వానిపేట, బసివలస, గోకయ్యవలస, సుందరాపురం గ్రామాల ప్రజలు భోగి మంటలకు దూరంగా ఉంటారు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మంట వేస్తే గ్రామానికి అరిష్టం కలుగుతుందని వీరి నమ్మకం. అయితే పూజలు, పిల్లలకు భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుపుతారు. 150 ఏళ్లుగా.. జలుమూరు: లింగాలవలస గ్రామం భోగి పండుగ జరుపుకోదు. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి భోగి మంటే వేయలేదు. 150 ఏళ్ల కిందట గ్రామంలో భోగి పండగ చేసేందుకు కర్రలు, పిడకలు సిద్ధం చేశారు. మంట వెలిగించేందుకు నిప్పు పెడుతుండగా ఒక పెద్ద పులి వచ్చి గ్రామంలో ఓ వ్యక్తిని నోట కరుచుకొని తీసుకెళ్లిపోయిందనే కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి ఇక్కడ భోగి మంట వేయకూడదని పెద్దలు తీర్మానం చేశారు.ఆ రెండు గ్రామాల్లో.. కొత్తూరు: మండలంలోని ఓండ్రుజోల, బడిగాం గ్రామాల్లో భోగి పండుగ జరుపుకోరు. అప్పట్లో మంట దగ్గరకు పులి వచ్చి ఒకరిని ఎత్తుకుపోవడంతో నాటి నుంచి రెండు గ్రామాల్లో భోగి చేసుకోవడం లేదని వృద్ధులు చెబుతున్నారు. ముందురోజే.. కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామంలో భోగి పండుగను ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంప్రదాయంగా వచ్చే భోగికి ముందు రోజు రాత్రి మంట వెలిగిస్తారు. రాత్రి సుమారు 9 గంటలు తర్వాత భోగి మంటకు గ్రామ పెద్దలు నిప్పు పెడతారు. భోగి రోజు యథావిధిగా పిల్లలు పిడకలను మంటలో వేస్తారు. కక్క.. ముక్క.. పెరిగిన లెక్క సంక్రాంతికి ముందే మాంసాహార ధరలు పెరిగాయి. నాటుకోళ్లు, చేపలు, మటన్ ధరలన్నీ బాగా పెరిగాయి. సోమవారం సంతలో నాటు కోళ్లు కిలో రూ. 800కు విక్రయించారు. నాటు కోడి చికెన్ ధర రూ. 1200 ఉంది. మటన్ రూ.900 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి తాకింది. చెరువు చేపల ధరలు కూడా పెరిగాయి. –నరసన్నపేటహరిలో రంగ హరి సంక్రాంతి అతిథులు వచ్చేశారు. హరిలో రంగా.. హరీ అంటూ హరిదాసులు, భలే దొడ్డ దొరండీ మా బసవన్న అంటూ గంగిరెద్దుల వారు, అంబ పలుకు అంటూ కోయిదొరలు, హరోం హరా అంటూ జంగమ దేవరలు ఊరికి కళ తీసుకువచ్చారు. వీరు వేకువ జాము మొదలు ఆయా గ్రామాల్లో శంఖారావం చేస్తూ ఇంటింటా తిరిగి దీవిస్తున్నారు. –జలుమూరు -
సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది. -
డబ్బు కోసం సొంత తమ్ముడిని దారుణ హత్య
కడప జిల్లా: మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారి పక్కనే సత్యాటౌన్షిప్లో ఆదివారం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మూడే పెద్దతిరుమలయ్య, గురమ్మలకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీరిలో చిన్న కుమారుడు మూడే చిన్నగురయ్య (41) సీడ్ వ్యాపారంలో పని చేస్తున్నాడు. చిన్నగురయ్య అతని మూడవ అన్న గురయ్యకు డబ్బులు ఇవ్వడం జరిగింది. గురయ్య పోరుమామిళ్లలో టీచర్గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో బద్వేలులో నివాసముంటున్న చిన్న తమ్ముడు చిన్నగురయ్యను డబ్బులు విషయం మాట్లాడదామని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు పిలవడం జరిగింది. అందరూ కలిసి సత్యాటౌన్షిప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చిన్నగురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తన అన్న పెద్దగురయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. ఈయన కలసపాడులో నివాసముంటూ కడప వాటర్షెడ్లో పని చేస్తున్నాడు. ఘర్షణలో చిన్నగురయ్య మృతి చెందడం, పెద్దగురయ్య తీవ్ర గాయాలతో కిందపడటంతో మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పరారైనట్లు తెలిసింది. పరారైన అన్నదమ్ముల్లో ఒకరు బెంగళూరులో పీజీ నడుపుతున్నారు. మరొకరు టీచర్గా పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బద్వేలు అర్బన్, రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ పెద్దగురయ్యను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన చిన్నగురయ్యను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అన్నదమ్ముల మధ్యే జరిగిన ఘర్షణలోనే చిన్నగురయ్య మృతి చెందాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతిచెందిన చిన్నగురయ్య కుటుంబ సభ్యులు, బంధువులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. -
మద్యం ఏరులై.. సూర్యుడు ఉదయయించక మునుపే..
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. నెల్లూరు నగరంలో వేకువజాము నుండే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. సూర్యుడు ఉదయయించక మునుపే బార్ తెరుచుకుంది. ఉదయాన్నే హరినాధపురం సమీపంలోని పికాక్ బార్ అండ్ రెస్టారెంట్లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. షెటర్ పూర్తీగా తెరిచి మరీ విక్రయాలు జరుపుతున్నారు. సిట్టింగ్కు సైతం అనుమతి ఇచ్చేశారు. బార్ ముందు మద్యం మత్తులో ఓ వ్యక్తి తూలుతూ హల్చల్ చేశాడు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అటువైపు కన్నెత్తి అయినా చూడటం లేదు.కాగా, రాష్ట్రంలో ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. -
ఇదెక్కడి రాజకీయం పవనూ?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు. ఒకరకంగా జనసేన కేడర్ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్కిల్ స్కామ్ కేసు అలా ముగిసింది..
సాక్షి, విజయవాడ: అధికార దుర్వినియోగంలో చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా 53 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును మొత్తానికి క్లోజ్ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లయ్యింది.ఆంధ్రప్రదేశ్లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9, 2023లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్ వేయించారు. గతంలో స్కిల్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేసులు మూయించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
పెద్దపండగకు భాగ్యవంతులొస్తున్నారు!!
సాక్షి,ప్రతినిధి, విజయనగరం: ఆశలు మూటలు నెత్తిన మోస్తూ.. గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ.. పెద్దపండగకు ఒక్కొక్కరుగా భాగ్యవంతులు ఇంటిల్లిపాదీ చేరుకుంటున్నారు. వారిని వలసకూలీలని సామాజికవేత్తలు అంటున్నా.. నా లాంటి అల్ప సంతోషుల దృష్టిలో వారు నిజమైన భాగ్యవంతులు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదల ని మేధావులు పేర్కొంటున్నా.. నా లాంటి సామా న్యులకు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులు. ఏ పల్లెలో చూసినా వారి ముచ్చటే ఎక్కువ. అక్కడ రాత్రీపగలూ శ్రమించి సంపాదించిన నాలుగు రూపాయలతో ఊరిలో ఆనందంగా గడుపుతా రు. సంక్రాంతి తమదే అన్న రీతిన ఊరంతా కలియతిరిగి తిరుగుప్రయాణమవుతారు. ఊళ్లలోకి వచ్చిన భాగ్యవంతుల ముచ్చటకు ‘సాక్షి’ అక్షర రూపం. హైదరాబాద్ నుంచి వచ్చిన అప్పలనాయుడు, లక్ష్మి, నాయుడి వీరకాడు నారాయణ.. వీధి మధ్యన దమట ముట్టించి చుట్టూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు.. మరేటిబావా హైదరాబాద్లో అంతా బాగు న్నట్టేనా.. అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మి అందుకుని.. పర్లేదన్నయ్యా.. ఇద్దరం డ్యూటీకి వెళ్తాం.. మాతోబాటే మా మహేష్ కూడా వస్తాడు. ముగ్గురికి బాగానే వస్తాది.. ఆదివారం సెలవు.. ఒకరి జీతం అద్దెకి.. ఖర్చులకు పోయినా.. రెండు జీతాలు మిగుల్తాయి. ఆ డబ్బులతోనే కదా ఈ ఇల్లు పునాదులు, రేకులు వేయడం, పెద్దదాని పెళ్లి అప్పు లక్షన్నర తీర్చడం.. చిన్నదాని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మి ఆత్మవిశ్వాసం కని పిస్తుంది. అంతలోనే లక్ష్మి మళ్లీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నయ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు మాంసాహారం ఉండాలి అంటున్నప్పుడు.. ఆరేడేళ్లు కిందట ఇదే ఊరిలో అడ్డెడు బియ్యం.. తవ్వెడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం.. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోనిలేరా ఊరిలో అయినోళ్ల ముందు చెడి.. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింటి వదిన చేటలో చెత్త పెంట మీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ లచ్చిమొదినా.. చెవులోవి కొత్తవా ఏటి అంటూ పలకరించినప్పుడు.. లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అవును మంగొదినా.. ఇన్నాళ్లకు అరుతులం చెయిను అరుతులం జుంకాలు చేయించాడు మీ అన్న య్య అని చెబుతూ... భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జుంకాలు మరింత మెరుస్తూ కనిపించా యి. ఇదిగో ఈ చీర్లన్నీ పెద్దషాపు లో కొనేశాం ఒకేసారి అంటున్నప్పుడు.. అప్పట్లో పాత చీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మి గొంతు నుంచి.. మాకిప్పు డా అవసరం లేదన్న భరోసా వినిపించింది. మొన్నామధ్య యాదగిరి వెళ్లాం.. తిరుపతి కన్నా పెద్దది తెలుసా... అని చెబుతున్నప్పుడు.. మేం.. విహారయాత్రలకూ వెళ్తాం.. మేం అప్పట్లా లేం..అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ ఉమ్మడి విజయనగరంలోని పలు గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి.. ఆరేడేళ్లు కిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్.. బస్సు ఎక్కి.. పని ఉన్న చోటకు వెళ్లాయి. రైస్ మిల్లులు.. నూలు మిల్లులు.. టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు.. చేపలు.. రొయ్యల చెరువులు.. ఫామ్ హౌస్లు, కోళ్లఫారాలు.. డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయాయి. పాపం అమాయకులు. నిజాయితీగా ఒళ్లొంచి పని చేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇషు్టలైపోయారు.. చాలామందికి.. చిన్నపాటి షెడ్.. ఇల్లు.. రేషన్ కూడా యజమానులే ఇస్తారు. ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్లు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్లకే స్పష్టంగా కనిపిస్తోంది. రూ.కోట్లు లేకపోవచ్చు.. రూ.లక్షలూ అక్కర్లేదు.. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది.. తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది.. ఓపికున్నన్నాళ్లు చేద్దాం.. ఊళ్లోకొచ్చిమాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం.. ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్ని కోణాలూ.. అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచిన వాళ్లు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ల జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసి పట్టుకుని అలాక్కాదు... మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు స్వామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్లెవరూ పేదలు కారు... అవును పేదలు కారు... అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి.. శ్రమ ఉన్న చోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి.. ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు..! -
కోర్టు వద్దన్నా.. బరితెగింపే
సాక్షి నెట్వర్క్: సంక్రాంతి ముసుగులో కోడి పందేలు, జూదాలను నిర్వహిస్తే సహించేది లేదని.. ఎట్టిపరిస్థితుల్లో వాటిని అడ్డుకుని తీరాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. పందేలు, జూదాలకు అడ్డుకట్ట వేయాలని.. ఇందుకోసం ఎక్కడికక్కడ వివిధ శాఖల అధికారులతో కమిటీలు వేయడంతోపాటు ఆయా కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు, దాడులు జరపాలని మార్గదర్శకాలు జారీ చేసింది. పైకి మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్టు నటిస్తూ.. పందేలు, జూదాలను చూసీచూడనట్టు వదిలేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ కావడంతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు పుంజుకున్నాయి.అనేక ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం కాగా.. పందేల మాటున కోతాట, గుండాట వంటి జూద శిబిరాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వీటికి సంబంధించిన వేలం పాటలు సైతం పూర్తయ్యాయి. మరోవైపు బరుల్లోనే ఎనీటైమ్ మద్యం కౌంటర్లు తెరిచి అక్కడే తాగించి.. తూలించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులకు కోట్లాది రూపాయల్ని వాటాలు ఇచ్చేలా ఒప్పందాలు కుదిరాయి. పశి్చమాన వందకు పైనే బరులు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో వందకు పైనే కోడిపందేల బరులను కూటమి నేతలు సిద్ధం చేశారు. భీమవరం పరిసరాల్లోని డేగాపురం, పెద అమిరం, సీసలి, మహదేవపట్నం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో 30 వరకు పెద్ద బరులు సిద్ధమయ్యాయి. పందేలకు పేరొందిన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో గ్రామానికి రెండు, మూడు చొప్పున 70కి పైగా చిన్న బరులు సిద్ధం చేశారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, గుండాట, పేకాట, కోతాట, ఇతర జూదాలు నిర్వహించేందుకు వీలుగా జర్మన్ షెడ్లు, ఫ్లడ్ లైట్లు, ఇతర సెట్టింగ్లతో సిద్ధం చేస్తున్న కొన్ని బరులకు ఒక్కో దానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. బరి ప్రత్యేకత, అక్కడికి వచ్చే జనం రద్దీని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఇచ్చేలా నిర్వాహకులు జూదాలు ఏర్పాటు చేసుకునే వారితో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది.తూర్పున క్యాసినో డీలర్ల సాయంతోతూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, సీతానగరం, చినకొండేపూడి, సింగవరం తదితర ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పందేలు, జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు, సోఫాలు, కురీ్చలు సిద్ధం చేస్తున్నారు. ఫ్లడ్లైట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పెద్దఎత్తున జనరేటర్లు అందుబాటులో పెడుతున్నారు. బరుల వారీగా మద్యం అమ్మకాలకు. నెంబర్లాట, గుండాట, పేకాట నిర్వాహకులకు సైతం వేలం నిర్వహించారు.ఒక్కో బరికి రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ బరిని రూ.20 లక్షలతో ఏర్పాటు చేస్తే అందులో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీసులకు రూ.3 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. బరి స్థాయిని బట్టి ఈ మొత్తం మరింత పెరగనుంది. సీతానగరం మండలం చినకొండేపూడిలో పేకాట, కోడిపందేలు, గుండాటలతోపాటు పెద్దఎత్తున క్యాసినో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోవా, నేపాల్ నుంచి క్యాసినో డీలర్లను రప్పిస్తున్నట్టు సమాచారం. త్రీకాట్స్, ప్లాన్, ఫుల్గేమ్, లోన బయట, గుండాట, పోకల్, కోతముక్క వంటి జూద క్రీడలు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.కోనసీమ జిల్లాలో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోడిపందేలు, గుండాటలు, పేకాటల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు అనధికార మద్యం షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రూ.లక్షల్లో వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వీఐపీల కోసం కూలర్లు, సోఫా సెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భోగి పండుగ నుంచి మూడు రోజులపాటు అర్ధరాత్రి వరకు పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. కీలక నేతల వత్తాసుతో బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన చోటామోటా నాయకులు సైతం పందేల నిర్వహణకు సై అంటున్నారు. మంత్రి అండతో బాపట్ల జిల్లాలోనూ.. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో పెద్దఎత్తున కోడిపందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరుకుపల్లి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందాలు, పేకాట కోసం బరి సిద్ధం చేశారు. ఇందులో ఒకటి పెద్ద బరికాగా.. మిగిలిన పది బరులు చిన్నవి. పెద్ద బరిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల పందాలు జరగనుండగా చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకు జరగనున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన వారికి ఐదు రోజులపాటు పేకాట ఆడుకునేందుకు రూ.60 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సమాచారం.వేమూరు నియోజకవర్గంలో ఐదు బరులు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు మార్కెట్ సమీపంలో టీడీపీ నేత పది ఎకరాల్లో ఒక బరి సిద్ధం చేయగా.. చావలి–కోడిపర్రు మధ్యన జనసేన నేత పది ఎకరాల్లో మరో బరి నెలకొల్పారు. కొల్లూరు సమీపంలో క్రాప వద్ద ఒక బరి, అనంతవరం వద్ద మరొక బరిని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. చుండూరు మండలం వేటపాలెం వద్ద బరి సిద్ధం చేశారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద టీడీపీ నేతలు భారీ బరి ఏర్పాటు చేశారు. ఎంట్రీ టికెట్లు పెట్టిమరీ.. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బక్కరాములకుంటలో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. పత్తిపాటివారిపాలెం–కొండికందుకూరుకు వెళ్లే తారురోడ్డులో నుంచి పందేల స్థావరం వరకు ప్రత్యేకంగా రోడ్డు కూడా వేశారు. ఎంట్రీ టికెట్లు పెట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. పలుకూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాలో.. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో భారీ హంగులతో బరి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బరి నిర్వాహకులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రూ.2 కోట్లతో బేరం కుదుర్చుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరుతో పాటు కంకిపాడు మండలంలోని 8 పెద్ద బరులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రూ.3 కోట్ల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం. విజయవాడ సమీపంలోని నున్న, రామవరప్పాడు, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు.గుడివాడ నియోజకవర్గంలో కోతముక్క, గుండాటకు అధికార పార్టీ నాయకులు బరులు సిద్ధం చేస్తున్నారు. మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో కాలనీలో భారీ బరిని ఏర్పాటు చేసి కోడిపందాలు, కోతముక్క, గుండాటకు సర్వం సిద్ధం చేస్తున్నారు. గుడ్లవల్లేరు, వేమవరం, కూరాడ, అంగలూరు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు భారీగా బరులు ఏర్పాటుచేస్తున్నారు.మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, రంగాపురం, మొర్సుమల్లి, పొందుగల, వెల్వడం, చంద్రగూడెం, గణపవరం, కీర్తిరాయినిగూడెం, మైలవరం, జి.కొండూరు మండల పరిధిలో కోడూరు, వెల్లటూరు, కందులపాడు, కవులూరు, చెరువుమాధవరం, మునగపాడు, గంగినేని, కట్టుబడిపాలెం, కుంటముక్కల, ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి చిన్నలంక, మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, తుమ్మలపాలెం, చిలుకూరు, విజయవాడ రూరల్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో బరులు సిద్ధమవుతున్నాయి. పేకాట అనేక రకాల జూడ క్రీడలు, ఫుడ్ స్టాళ్లు, మద్యం స్టాళ్ల ఏర్పాటుకు మూడు రోజులకు అద్దె రూపంలో భారీఎత్తున వేలం పాటలు ఖరారయ్యాయి. -
మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (77) సోమవారం మృతి చెందారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్చారు.అక్కడ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని అరసవల్లిలోని స్వగృహానికి తరలించారు. కుమారులు అమెరికా నుంచి సోమవారం అర్ధరాత్రి రానున్నారు. మంగళవారం అంత్యక్రియలు జరVý నున్నాయి. ఆయన మృతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేశారు. -
ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని,. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్పై కనీసం స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా చేయలేదని, పీఆర్సీ వేయలేదని విమర్శించారు.గత సంక్రాంతికి ఇస్తారని చూసినా ఉద్యోగులకు నిరాశే మిగిలిందని, మళ్లీ సంక్రాంతి వచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని, ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచే ప్రభుత్వమని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత సంక్రాంతికి పోలీసులకు 2 సరెండర్ లీవ్ల బిల్లులు చెల్లిస్తామని స్వయంగా ఆరి్ధక మంత్రి హామీ ఇచ్చారని, మళ్లీ సంక్రాంతి వచ్చినా అవి పూర్తిగా చెల్లించలేదని విమర్శించారు. దీపావళి సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నాయకులందరి సమక్షంలో పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బిల్లు రూ.210 కోట్ల రూపాయలను సగం సగం చేసి రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్ నెలలలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు సగం చెల్లించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉంటే అందులో రూ.210 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి అవి కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులంటే ఇంత నిర్లక్ష్యమా? పోలీసులకు రికార్డు స్థాయిలో 6 సరెండర్ లీవ్ల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రిటైరయిన వారికి 18 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా ఇంతవరకు ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్ను సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే హడావుడిగా గత ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిందని, 20 నెలలు అవుతున్నా ఇంతవరకు సీపీఎస్ గురించి మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఇక ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీకి తిలోదకాలు వదిలిందని, గతంలో 4 – 5 తేదీల్లో జీతం వచ్చేదని, ఇపుడు కొన్ని నెలల్లో ఉద్యోగులకు 10, 11 తేదీలొచ్చినా జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఉద్యోగులను ఈ సర్కారు తీవ్రంగా వేధిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచే స్థాయికి కూటమి సర్కారు దిగజార్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని, ఈ సంక్రాంతికైనా పీఆర్సీ వేయడంతోపాటు ఐఆర్ ఇవ్వాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. -
మా భూములు తీసుకుంటే సహించేది లేదు
గుంటూరు వెస్ట్: ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్డులో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు ప్రాంత రైతులు సుమారు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకుని చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు చేశారు. నారా కోడూరు ప్రాంతంలో ఔటర్రింగ్ రోడ్డు పేరిట సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్రమంగా తీసుకుంటున్నారని వారు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు.అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదంటున్నారు. 2014–19 కాలంలో రాజధాని పేరిట సుమారు 35 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారిని ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రైతులను ఇబ్బందులు పెట్టలేదని.. జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరుతామని చెబుతున్నారు. రాజకీయ క్రీడ ఆడుతున్నారా ? ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారా కోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగారని రాంబాబు అనే రైతు తెలిపాడు. రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారని.. అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందా? అని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలు ఆడితే భవిష్యత్ గల్లంతేనని హెచ్చరిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామసభ కూడా నిర్వహించకుండా, రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామనడం దారుణమన్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని రైతులంతా చెబుతున్నారు. -
సివిల్ దావా వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఆర్టీకల్ 32 (రిట్ పిటిషన్) కింద విచారించలేమని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటే అన్ని సాక్ష్యాధారాలతో కూడిన ‘సివిల్ సూట్’దాఖలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్తగా దావా వేసుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ప్రస్తుత పిటిషన్పై విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముగించింది. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఏపీ వాటా 484 టీఎంసీలే.. అంతకు మించి వాడకూడదు: సింఘ్వీ అంతకుముందు సాగిన విచారణలో ఆద్యంతం తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఏపీకి కేటాయించింది 484 టీఎంసీలే. అది వరద నీరైనా సరే అంతకుమించి వాడుకునే హక్కు ఆ రాష్ట్రానికి లేదు. కానీ ఏపీ ప్రభుత్వం 484 టీఎంసీలకు మించి నీటిని మళ్లించుకోవడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బచావత్ అవార్డు 1979–80 ప్రకారం వరద జలాల పేరుతోనైనా సరే దీనికి మించి ఒక్క చుక్క నీటిని మళ్లించినా అది చట్టవిరుద్ధమే. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు, గోదావరి బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధం’అని సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. వాస్తవాలు తేలాల్సిందే: సీజేఐ సింఘ్వీ వాదనలను విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆర్టీకల్ 32 కింద నేరుగా రిట్ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ముడిపడి ఉంది. ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు? ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత? అన్నది తేలాలి. సాక్షులను విచారించాలి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు. మీరు సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గం’అని ధర్మాసనం సూచించింది. అందుకు వీలుగా ప్రస్తుత పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ ‘ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ, జల వివాదం. డిస్మిస్ అనే పదం వాడితే మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందన్నట్లుగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. పిటిషన్ను ఉపసంహరించుకుంటాం.. ‘డిస్పోజ్’చేసినట్లు ఉత్తర్వులివ్వండి’అని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేయకుండా ఉపసంహరణకు అనుమతిస్తూ ‘డిస్పోజ్’చేసింది. చట్టప్రకారం తగిన పరిష్కారం కోసం, లేవనెత్తిన అన్ని అభ్యంతరాలతో ‘సివిల్ సూట్’వేసుకునేందుకు తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్లో లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సివిల్ సూట్లోనూ ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది. -
పండుగనాడు పస్తులేనా?
సాక్షి, అమరావతి: అసలే భద్రతలేని ఉద్యోగాలు.. ఆపై ఇచ్చే అరకొర జీతాలు నెలల తరబడి చెల్లించరు.. ఇలా అయితే ఎలా.. పండుగనాడు పస్తులేనా.. అంటూ గిరిజన, ఏకలవ్య, సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి వచ్చినా తమకు వేతనాలు అందకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డలకు, అట్టడుగు వర్గాల పిల్లలకు అక్షరాలు దిద్దించే తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులపాలవుతున్నామని బాధపడుతున్నారు.రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే సుమారు 1,600 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులకు రెండు నెలల (నవంబర్, డిసెంబర్) జీతాలు ఇవ్వలేదు. వారిలో గతం నుంచి పనిచేçస్తున్న వారితోపాటు డీఎస్సీ–2025 ద్వారా భర్తీ అయిన రెగ్యులర్ టీచర్లు కూడా ఉన్నారు. వారితోపాటు అవే గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్సోర్సింగ్ టీచర్లకు డిసెంబర్ నెల వేతనం ఇవ్వలేదు. రెగ్యులర్ టీచర్లతో పోస్టులు భర్తీ కావడంతో అవుట్సోర్సింగ్ వారిని సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడంతోపాటు ఆరునెలలుగా సకాలంలో వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఏకలవ్య గెస్ట్ టీచర్లను దగా చేశారు రాష్ట్రంలో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో (గురుకులాల్లో) పనిచేస్తున్న 200 మంది గెస్ట్ టీచర్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. వారికి ఇచ్చే జీతానికి సైతం ఈ ఏడాది జూన్ నుంచి దారుణంగా కోతపెట్టింది. ఆ తగ్గించిన జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఏకలవ్య గురుకులాల్లో పనిచేసే టీచర్లలో నెలకు రూ.45 వేలు ఉన్న జీతాన్ని రూ.35 వేలకు, రూ.42 వేలు ఉన్న జీతాన్ని రూ.33 వేలకు తగ్గించారు. తగ్గించిన జీతాలను కూడా రెండు నెలలుగా ఇవ్వలేదు. అంబేడ్కర్ గురుకులాల్లోనూ వేతన వెతలే.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ రెనిడెన్షియల్ స్కూల్స్లో (గురుకులాల్లో) పనిచేసే సుమారు 2,300 మందికీ వేతన వెతలు తప్పలేదు. మూడునెలలుగా జీతాలు రాక వీరు పడుతున్న అవస్థలను గతేడాది నవంబర్లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో అప్పటికప్పుడు రెండునెలల వేతనాలిచ్చిన ప్రభుత్వం తరువాత పట్టించుకోలేదు. వీరికి గత నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 800 కాంట్రాక్ట్ టీచర్లు (సీఆర్టీలు), 1,700 మంది పార్ట్టైమ్, అడ్హాక్, ఔట్సోర్సింగ్ టీచర్లకు రెండునెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గురుకులాల్లో పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ పేరుకు పార్ట్టైమ్ అని చిన్న జీతాలు పొందుతున్న టీచర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శనీయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు సక్రమంగా జీతాలు వచ్చేవని, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారని ఆయా టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
వక్ఫ్ భూములేగా.. ఉఫ్మనిపిద్దాం
సాక్షి, అమరావతి: వక్ఫ్ భూములా..! ఉఫ్ మనిపించేద్దాం అన్నవిధంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ ధోరణి. రూ.వందల కోట్ల విలువైన భూములను పచ్చ గద్దలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేసింది. గత ఏడాది మొదలైన ఈ ప్రయత్నాలకు వక్ఫ్బోర్డు తీర్మానంతో తాత్కాలిక బ్రేక్ పడినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ చట్టానికి విరుద్ధం అంటూ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నా... లీజుకైతే ఓకే, వక్ఫ్ ఆస్తుల టైటిల్ మార్పునకు వీల్లేదు.. అని బోర్డు చెబుతున్నా భూములను కాజేసే కుట్రలు ఆగడం లేదు. విలువైన ఆస్తులను పరులపాలు చేసి, దాతల ఆశయాన్ని దెబ్బతీయొద్దని ముస్లిం సమాజం ఎన్ని విధాలుగా కోరుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తన దారుణమైన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ⇒ గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలు, గుంటూరులోని అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోంది. మల్లాయపాలెంలోని భూములను ఏపీఐఐసీకి భూ సేకరణ పేరుతో అప్పగించేందుకు గత ఏడాది మార్చిలో తెనాలి సబ్ కలెక్టర్ ఏపీఐఐసీ అ«ధికారులకు లేఖ రాయడాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను పచ్చ నేతలకు అప్పగించేందుకు చేసిన ఆ ప్రయత్నాలను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. టైటిల్ మార్చడానికి కుదరదన్నా... మల్లాయపాలెం వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయం సాధించలేమని భావించిన వక్ఫ్బోర్డు గతంలో రెండుసార్లు సమావేశాలను వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత జిల్లా నెల్లూరులో నిరుడు జూలైలో నిర్వహించిన సమావేశం వక్ఫ్ టైటిల్ను మార్చడాన్ని (పూర్తిగా అన్యాక్రాంతం) తిరస్కరించింది. భూములను లీజు, పీపీపీ పద్ధతిలో మాత్రమే ఇస్తామని తీర్మానించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికీ నివేదించింది. ఏపీ భూ సేకరణ చట్టం–2018లోని సెక్షన్ 22ని అనుసరించి అతి తక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేయగా... కుదరదని తేలి్చచెప్పింది. లీజు, పీపీపీలో అభివృద్ధి ఏది కావాలో ఎంచుకోమని సూచించడం గమనార్హం. అయితే, ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చేసిన లీజు, పీపీపీ రెండు ప్రతిపాదనలను కొందరు బోర్డు సభ్యులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ భూములను లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం–1995లోని సెక్షన్–51 స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. మళ్లీ నోటిఫికేషన్తో కలకలం తాజాగా గుంటూరు అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూ సేకరణ ద్వారా తీసుకుంటున్నామని, అభ్యంతరాలు ఉంటే 60రోజుల్లో తెలపాలని జిల్లా కలెక్టర్ డిసెంబరు 19న నోటిఫికేషన్ ఇచ్చారు.దీంతో వక్ఫ్ భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లైంది. మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను కూడా మలేసియా కంపెనీలకు ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ధారాదత్తం చేసేందుకు చర్చలు జరిగాయి. ఆ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. తాడికొండ జామియా మసీదుకు చెందిన వంద ఎకరాలు, కొండపల్లి ఖాజీ మాన్యం 50 ఎకరాలను కూడా భూ సేకరణ పేరుతో తీసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ఊపందుకున్నట్టు సమాచారం.న్యాయ పోరాటం చేస్తాం ముస్లిం సమాజంలోని పేదల అభివృద్ధి, సంక్షేమం, పిల్లల విద్యను కాంక్షిస్తూ దాతలు మహోన్నత ఆశయంతో భూములు ఇచ్చారు. దానిని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం. వక్ఫ్ భూములను ఇతర శాఖలు, వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడం సరికాదు. ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వానికి వక్ఫ్బోర్డు ఆస్తుల టైటిల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయడం సాధ్యం కాదు. లీజు, పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి వక్ఫ్బోర్డుకు ఆదాయం పెంచి ముస్లింల సంక్షేమం, విద్యకు ఉపయోగించాలి. – షేక్ నాగుల్మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడుచినకాకాని వక్ఫ్ భూముల భూ సేకరణ నిలిపేయాలి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చినకాకాని గ్రామంలో ఉన్న వక్ఫ్ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ కార్యదర్శి షేక్ సైదా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించింది. పారిశ్రామిక పార్కు పేరుతో 71.57 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ భూములు వక్ఫ్ చట్టం–1995 ప్రకారం నమోదైన వక్ఫ్ ఆస్తులని, వాటిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా సేకరించడం చట్టవిరుద్ధమని, ఈ భూ సేకరణ చర్యలు చెల్లుబాటు కావని చెప్పారు. వక్ఫ్ భూముల భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్కు అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు
సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమందిని బదిలీ చేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వలేదు. వారికి పోస్టింగ్లు ఇస్తూ విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. -
ఆధార్ సేవల టెస్టు పాస్ కాకుంటే ఇంక్రిమెంట్ కట్
సాక్షి, అమరావతి: నిర్ణీత అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ధారించిన ఎన్ఎస్ఈఐటీ పరీక్ష గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఈ ఏడాది మార్చిలోగా ఉత్తీర్ణత కాకుంటే ఆయా డిజిటల్ అసిస్టెంట్లకు తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి అందించిన ఆదేశాల మేరకు ఆయా జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు తమ పరిధిలోని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.ఆయా పరీక్ష ఉత్తీర్ణత కాని వారితో పాటు అసలు పరీక్షకు హాజరు కాని వారికీ, పరీక్షకు దరఖాస్తే చేయని వారికి, పరీక్ష ఉత్తీర్ణత అయినా ఆధార్ సేవలు అందించేందుకు అయిష్టత తెలిపిన వారికీ తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులతో పాటు డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఎన్ఎస్ఈఐటీ పరీక్ష వచ్చే మార్చిలోపు తప్పనిసరిగా పాస్ కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డిసెంబరు 31వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాల్లో ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాల్లో కేవలం డిజిటల్ అసిస్టెంట్ల విషయంలోనే వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల అంశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘గ్రూప్స్’ ఫలితాలపై నీలినీడలు!
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెలగాటమాడుతున్నాయి. తాము రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫలితాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు మొగ్గు చూపకపోవడం.. ఫలితాలిస్తామని ఏపీపీఎస్సీ పైకి చెబుతున్నప్పటికీ అది ఎప్పుడో తెలీక అభ్యర్థులు రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఎందుకంటే.. ఫలితాలు ప్రకటించుకోవచ్చని న్యాయస్థానం చెప్పినా మరికొంత సమయం పడుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. గత ప్రభుత్వం 2023 డిసెంబరులో ఇచ్చిన గ్రూప్–2 నోటిఫికేషన్కు మూడునెలల్లో ప్రిలిమ్స్ పూర్తిచేసి మేలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు నిర్వహించొద్దని నాటి ప్రతిపక్ష నేతలు హైకోర్టులో కేసులు వేయించారు. అనంతరం 2024 జూన్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కానీ, గత ప్రభుత్వంపై కక్షగట్టి హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రస్తుత అధికార పక్షం.. ఇప్పుడు కూడా అదే పంధాను అనుసరించడం చూస్తుంటే 2026లో కూడా గ్రూప్–2 ఫలితాలు వస్తాయన్న ఆశలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పోర్ట్సు కోటాతో ఫలితాలను ముడిపెట్టి అడ్డుపడుతోందని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనకు యతి్నంచిన అభ్యర్థులను కార్యాలయానికి రాకుండానే బెదిరించి వెనక్కి పంపేసినట్లు తెలిసింది. మూడు నెలల్లో ప్రిలిమ్స్.. ఏడాది తర్వాత మెయిన్స్.. నిజానికి.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబరులో 905 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25న నిర్వహించింది. మెయిన్స్ అదే ఏడాది మే/జూన్లో జరుగుతాయని ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి నెలరోజుల్లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసి మేలో మెయిన్స్కు ఏర్పాట్లుచేశారు. అలాగే, గ్రూప్–1కి కూడా 2023 డిసెంబరులోనే దాదాపు 90 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో కొందరు టీడీపీ నాయకులు అభ్యర్థులతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు.ముఖ్యంగా గ్రూప్–1పై ఈ కేసులు వేయడంతో పాటు గ్రూప్–2పైనా అదనపు పిటిషన్లు వేయించారు. దీంతో 2024 మే, జూన్లో జరగాల్సిన మెయిన్స్కు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో అడ్డంకులు తొలగిపోతాయని అభ్యర్థులు ఆశించారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీని అస్తవ్యస్థం చేసింది. అనేక రకాల డ్రామాల నడుమ 2025 ఫిబ్రవరి 23న గ్రూప్–2 మెయిన్స్.. నిర్వహించి గతనెలలో సరి్టఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు పూర్తిచేశారు. అదే ఏడాది మేలో గ్రూప్–1 మెయిన్స్ నిర్వహించారు. హైకోర్టు అడ్డంకులు తొలగినా సరే.. ఇక గ్రూప్–1, 2 ఫలితాల విడుదలకు హైకోర్టులో అడ్డంకులు తొలగినప్పటికీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్సు కోటా పోస్టులను పక్కనబెట్టి, మిగిలిన పోస్టులకు ఫలితాలు ప్రకటించుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. అయితే, ఫలితాలు మరింత ఆలస్యమవుతాయని ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించడం అభ్యర్థుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఫలితాలు ప్రకటించకపోతే మెయిన్స్ రాసి సీపీటీకి ఎంపికగాని అభ్యర్థులు మళ్లీ డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ పూర్తికావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈ నోటిఫికేషన్ పూర్తికాకుండా కొత్త జాబ్ కేలండర్ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. దీంతో ఎంపికగాని అభ్యర్థులు మరోసారి డివిజనల్ బెంచ్కు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. జగన్ పాలనలో దేశంలోనే నం.1గా ఏపీపీఎస్సీ.. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్విస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకోగా.. వివాదరహిత కమిషన్గా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీని తిరిగి వివాదాల్లోకి నెట్టి నిరుద్యోగ యువత ఆశలను ఛిద్రం చేస్తోంది. 2018 డిసెంబరులో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో 2018 నాటి పరిస్థితే కనిపిస్తుండడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది. -
కూటమిలో ‘పెద్ద’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జనసేన కోటాలో లింగమనేని త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండు సీట్లకు బీజేపీ పట్టు ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.సానాకే మరోసారి చాన్స్..!రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదాయం రావట్లేదు.. మీదే ఫెయిల్యూర్
సాక్షి, అమరావతి: లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదని, కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులను వ్యయం చేసి తిరిగి తెచ్చుకోవడంలో అధికారులు, కలెక్టర్లు వైఫల్యం చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనపర్చాలని, సాకులు చెబితే కుదరదని స్పష్టం చేశారు. జీఎస్డీపీ పెరిగితే ఆ మేరకు ఆదాయ వనరులు కూడా పెరగాలని, లేదంటే ఎక్కడో తేడా వస్తోందన్నారు. జీఎస్డీపీని కేంద్ర ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని, మనం రాసుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు.సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు వర్చువల్గా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలను సమీక్షించారు. గతేడాది 12.05 శాతం వృద్ధి సాధిస్తే, ఈ ఏడాది అంచనాల మేరకు 11.5 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే వీలుందన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది తగ్గిపోతున్నామని పెదవి విరిచారు. నిజానికి ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 16 శాతంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, విభాధిపతులు పది సూత్రాలను సాధించేందుకు రోజువారీ, నెలవారీ క్యాలెండర్తో ప్రణాళికలు తయారు చేసుకుని పనితీరు కనపరచాలని, ఉపన్యాసాలు చెబితే కుదరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని, దానికి ముందు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మంచి వృద్ధి..! గతేడాది మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర నిధులను వ్యయం చేయకపోవడంపై మంత్రులు, అధికారులు, కలెక్టర్లపై సీఎం విరుచుకుపడ్డారు. కొంత మంది కలెక్టర్లు డేటా కూడా అప్డేట్ చేయడం లేదని, అలాంటి వారిని ఎక్స్పోజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కనపెడతానన్నారు. కలెక్టర్లు, అధికారులు పనితీరు కనపరచాలన్నారు. కేంద్ర పథకాల నిధుల్లో ఒక రూపాయి కూడా మురిగిపోకూడదని, ఆ పరిస్థితి వస్తే మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.చాలా శాఖలు 50 శాతం నిధులను కూడా వ్యయం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలన్నరలో నిధులన్నీ వ్యయం చేసి మార్చి 15వ తేదీన కేంద్రం నుంచి అదనపు నిధులు తేవాలని సూచించారు. పెన్షన్ మినహా మిగతా పథకాలపై ప్రజల్లో సంతృప్తి తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, విభాగాధిపతులు డేటా తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలపై 80 శాతం సంతృప్త స్థాయి తేవాలని నిర్దేశించారు. ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగకుంటే మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల వైఫల్యంగానే పరిగణిస్తామన్నారు. విభాగాధిపతులు మౌనంగా కూర్చుంటే కుదరదని, పనితీరు చూపించాక మాట్లాడాలన్నారు. పీపీపీలో 290 ప్రాజెక్టులు.. నిధులు లేవని ప్రాజెక్టులు నిలిపి వేయకుండా పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పీపీపీ ప్రాజెక్టుల కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన 290 ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్న ట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్చంద్ర తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులు కడితే నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు... తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. పుష్కరాల్లోగా పోలవరం నిర్మించి జాతికి అంకితం చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు.కాగా తెలంగాణ సర్కారు కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చంద్రబాబు ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని సాగునీటి నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. జన్మభూమికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేసిన చంద్రబాబు ఇంత అన్యాయంగా, బాహాటంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు బడాయి మాటలు చెబుతున్నారని నీటి పారుదల నిపుణులు మండిపడుతున్నారు. -
బాబు సర్కారు మరో బాంబు.. రూ.13,100 కోట్ల బాదుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్బులు, విద్యుత్తు చార్జీల బాదుడుతోపాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా.. ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్లు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో రూ.13,100 కోట్ల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లాటరీ.. ఆన్లైన్ గేమింగ్ పన్నులు..ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడం ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించాలని చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ.1,400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. ఎస్జీఎస్లపై ఒక శాతం సెస్ విధించడం ద్వారా రూ.4,700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ.2,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు. అలాగే రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ విధించడం ద్వారా రూ.1,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదన చేశారు. వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.400 కోట్లు, విజయవాడ, విశాఖపట్టణం మున్సిపల్ పరిధిలో వృత్తి పన్ను వసూళ్లను బదిలీ ద్వారా రూ.110 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు.వసూళ్ల పెంపు కోసం పన్ను ఆధార విస్తరణ, బకాయిల వసూళ్లు, ఐటీ ఆధారిత పర్యవేక్షణ, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి పెట్టడం ద్వారా 2025–26లో రాష్ట్రం స్వంత ఆదాయ వృద్ధి లక్ష్యాలను అధిగమించనున్నారు. ఈమేరకు ఆదాయ విభాగాల లక్ష్యాలు, సాధనపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. బడ్జెట్ లక్ష్యాలకు తగినట్లు ఆదాయం రావడం లేదన్నారు. -
ఆదాయాన్ని మళ్లించి అరుపులు!
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం వరకూ అన్నింటా దోపిడీ.. కేవలం 19 నెలల్లోనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో రూ.3.02 లక్షల కోట్ల అప్పులు.. అయినా సరే సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఇన్నాళ్లూ ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వాస్తవాలను అంగీకరించారు. ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనపర్చాలని.. సాకులు చెబితే కుదరదని.. అలాంటి అధికారులు, కలెక్టర్లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతానంటూ హూంకరించారు.చంద్రబాబు సీఎం కాగానే ఇకపై పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ప్రకటన చేయడం తెలిసిందే. ఇదే అదునుగా పచ్చ ముఠాలు ఇసుక నుంచి క్వార్ట్జ్, సిలికా, మైనింగ్, లేటరైట్ వరకూ సహజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. మద్యం షాపులు, బెల్ట్షాపులను గుప్పిట్లో పెట్టుకుని నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒకపక్క రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు టీడీపీ నేతల దోపిడీని ప్రోత్సహిస్తూ.. చివరకు రాబడి తగ్గితే అధికార యంత్రాంగాన్ని బాధ్యులుగా చేస్తామని చంద్రబాబు బెదిరింపులకు దిగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక రెడ్ బుక్ పేరుతో టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తుండటంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీసే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశి్నంచే గొంతులను నులిమేందుకు బాబు సర్కారు చేయని కుట్రలు లేవు. ఖజానాకు గండి.. పచ్చ ముఠాలకు రాబడి కూటమి సర్కారు అవినీతి విశృంఖలంగా సాగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి చేరుతోంది. దీనివల్లే ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందన్నది బహిరంగ రహస్యం. పొలిటికల్ గవర్నెన్స్తో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని.. విచ్చలవిడి అవినీతి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఐఏఎస్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇసుక ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది.ఇప్పుడు పేరుకే ఉచిత ఇసుక.. ఇసుక ర్యాంప్లను తమ అ«దీనంలోకి తీసుకుని టీడీపీ ముఠాలు యథేచ్ఛగా తవ్వేస్తూ, అధిక ధరకు విక్రయించి దోచేస్తున్నాయి. ఫలితంగా గతంతో పోల్చితే ఇప్పుడు ఇసుక ధర డబుల్ అయ్యింది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఆ ఆదాయమంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇక టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే మద్యం షాపులను తమ అధీనంలోకి తీసుకుని.. ఊరూ వాడా బెల్ట్ షాపులు తెరిచారు. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో అమ్మే ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిలే! ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ, అడ్డగోలుగా దోచేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. దీంతో అవినీతి వ్యవస్థీకృతమైపోయినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోసాలుగా సూపర్ సిక్స్ హామీలు.. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. గతేడాది, ఈ ఏడాదీ ఎగ్గొట్టారు. ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేల చొప్పున ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీకి ఎగనామం పెట్టారు. ఇక 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 చొప్పున పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని గతేడాది, ఈ ఏడాదీ అమలు చేయకుండా మోసం చేశారు. తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటివరకూ ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే.. అదీ ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించి.. 21 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చి.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టి మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్సహా అన్ని హామీలదీ అదే తీరు. ఓవైపు సహజ వనరులను దోచేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినా హామీలను చంద్రబాబు సర్కార్ అమలు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.అప్పుల్లో రికార్డు.. హామీలకు వెన్నుపోటు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేసింది. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసింది. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో ప్రజల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా జమ చేసి రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేయగా, అందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద పేదల ఖాతాల్లో జమ చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ నాడు చంద్రబాబు దుష్ఫ్రచారం చేశారు.దానికి ఎల్లో మీడియా తందాన పాడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ 19 నెలల్లోనే ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు అప్పులు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో.. చంద్రబాబు సర్కార్ కేవలం 19 నెలల్లోనే 90.87 శాతం అప్పులు చేసింది. అయినా సరే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నీళ్లొదిలారు. -
మోసాల ద్వారా బాబు సర్కారు యువత లక్ష్యాలకు అడ్డుపడుతోంది
సాక్షి, అమరావతి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని, కానీ... రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను విస్మరించి యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయన పాలన యువత, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేస్తూ... చంద్రబాబు యువతకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు.టీడీపీ కూటమి మేనిఫెస్టో వాగ్దానమైన యవతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా చెల్లింపు లేదని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టీఫికేషన్ కోర్సులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇలా మోసాలకు పాల్పడడం ద్వారా చంద్రబాబు సర్కారు యువత వారి లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వివేకానంద ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ ‘‘ఇకనైనా కదలండి.. మేల్కోండి.. యువత వారి లక్ష్యాల సాధనకు తోడ్పడండి’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
ఏపీ ప్రభుత్వం కొత్త ఆదాయం టార్గెట్ రూ. 13 వేల కోట్లు
విజయవాడ: రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ప్రజల నుండి ఈ ఆదాయాన్ని వసూలు చేసేందుక కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ. 13 ఏల కోట్లు కొత్త ఆదాయం టార్గెట్ను పెట్టకున్నట్లు హెచ్ఓడీ సదస్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం సాధించాలనే ప్రతిపాదించారు. 55వ GST కౌన్సిల్ సమావేశంలో సెస్ పరిశీలనలో ఉంది. ఇక ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు సాధించే ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు. -
కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం
కాకినాడ: జిల్లాలోని రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్ర వేళ సార్లంక గిరిజన గ్రామంలోని పూరిళ్లు దగ్ధమయ్యాయి,. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు బూడిదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కాలి బూదిదం కావడంతో ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము సర్వస్వం కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. -
‘ఆలయ ఆస్తులపై కూటమి కన్ను పడింది’
విజయవాడ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల్లో అపచారాలు, దారుణాలు, దుర్ఘటనలు నిత్యకృత్యమయ్యాయని, వాటిని సమీక్షించి సరిదిద్దాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేయడంతో కూటమి నాయకులు చివరకు ఆలయాల అర్చకులపైనా దాడులు చేస్తున్నారని వైయస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు.« ధార్మిక సంస్థలకు లీజు పేరుతో ఆలయాలకు చెందిన విలువైన భూములు కాజేసేందుకే కొత్తగా జీఓ నెం:15 జారీ చేశారని ఆరోపించిన వారు, ప్రభుత్వం తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాల్లో ఇటీవల వరసగా అపచారాలు, దుర్ఘటనలు జరుగుతున్నాయని, దీంతో దర్శనాల కోసం వచ్చే భక్తులు తగ్గిపోతున్నారని చెప్పారు. మరోవైపు అర్చకుల మీదా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేసిన వారు, వాటిని అరికట్టేందుకు తక్షణం ప్రత్యేక చట్టం తేవాలన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద ఉన్న ‘శ్రీ కామధేనువు అమ్మవారి’ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం చేశారు. దుర్గగుడిలో జరుగుతున్న అపచారాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టేలా చూడాలని, ఆ దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని.. ముఖ్యంగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కోరారు. అమ్మవారికి ప్యాకెట్ పాలతో అభిషేకాలను తీవ్రంగా తప్పు పట్టిన వారు, తక్షణం గోశాలను కానూరు నుంచి కొండ మీదకు తరలించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో భక్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. తనకుతాను సనాతన హిందూవాదిగా ప్రకటించుకున్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇకనైనా స్పందించాలన్నారు. -
పవన్పై అంబటి సెటైర్లు.. ‘అది ఓ ఆర్టే’
సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి.పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్ జగన్ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు. -
AP: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్
విజయవాడ: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 12వ తేదీ) మద్యం ధరలకు పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వగా, ఇప్పుడు మాత్రం ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు. బాటిల్పై రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో బాటిల్పై రూ. 10 పెంచిన బాబు సర్కార్.. ఇప్పుడు మరో రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు లిక్కర్ సిండికేట్కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించింది. అయితే సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికే ఏపీ ప్రభుత్వం మద్యం ధరను పెంచిందని పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టిస్తానని పదే పదే ఎన్నికల్లో ప్రచారం చేసిన బాబు.. మరి ఇప్పుడు లిక్కర్ ధరల పెంపు ద్వారా సంపద సృష్టిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత గురువారం (జనవరి 8 వ తేదీన) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా పెంపునకు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
‘దేవాలయ పూజారిపై దాడి అమానుషం’
కాకినాడ:: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పూజారి సుందర సీతారామయ్యశర్మపై దాడి అమానుషమని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ ఆక్షేపించారు. పదునైన ఆయుధంతో పూజారిపై దాడి, నాగరిక సమాజాన్ని తలదించుకు ఘటన అని ఆయన అభివర్ణించారు. పూజారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడి, కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పురోహితుడు సుందర సీతారామయ్య శర్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్, ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..:క్షమించరాని నేరంభగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రాహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం. వేట కొడవలితో దాడి చేయడం, ఆ పని చేసిన వ్యక్తి నైజాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీకి చెందిన గ్రామ నాయకుడి కుమారుడు కొండమూరి శివయ్య, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు మానసిక పరిస్థితి పేరిట ముసుగులు వేయడం చాలా పెద్ద తప్పు. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే.కూటమి పాలనలో ఏ ఒక్కరికీ భద్రత లేదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయి. రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. మహిళలు, చిన్నపిల్లలు, దేవాలయ సేవకులకూ భద్రత లేకుండా పోయింది. పేద బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర సీతారామయ్య శర్మ అప్పుల్లో కూరుకుపోయి పురోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గం. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలురాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. తిరుపతి తొక్కిసలాట, సింహాచలంలో అమాయక భక్తుల మరణాలు, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలు.. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. పూజారిపై జరిగిన దాడి ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పొన్నాడ వెంకట సతీష్కుమార్ హెచ్చరించారు. -
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీ యువతకు బాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని.. కానీ, ఆంధ్రప్రదేశ్లో యువత మాత్రం అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో 8 త్రైమాసికాలకు గానూ ఫీజు రీయింబర్స్మెంట్లు, రూ.4,900 కోట్ల విద్యా దీవెన (Vidya Deevena), రూ2,200 కోట్ల వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు పేరుకుపోయాయని.. అలాగే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మోసం ద్వారా యువతను తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో కూటమి పాలన పరిస్థితులు యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇకనైనా మేల్కొని యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని.. వివేకానందుడి ప్రముఖ సూక్తిని ఒకదానిని(Arise, Awake, and facilitate..) ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ హితవు పలికారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. -
Sankranti 2026: అక్కడ పండగ అయిపోయింది
సంక్రాంతికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా.. కానీ ఆ సామంత గ్రామాల్లో మాత్రం పండగ అయిపోయింది. గిరిజనులుగా పిలిచే సామంతులకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారమే అసలైన పండగ. ఆదివారం నాడు వారు అమ్మవారి ప్రతి రూపంగా భావించే వేప చెట్టును పసుపు, కుంకుమతో అలంకరించారు. అమ్మవారి ప్రతి రూపంగా భావించే గజముద్దను పూలతో అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. – ఇచ్ఛాపురం రూరల్ఊరికి స్వాగతం పెద్ద పండుగకు ఊరికి వచ్చే వారిని ఓవీపేట వాసి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పాలకొండ–ఆమదాలవలస రోడ్డు లచ్చయ్యపేట కూడలికి ఓవీపేట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రా మానికి బస్సు సదుపాయం లేదు. దీంతో పండగకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఆయన ఉచితంగా ఆటో నడుపుతున్నారు. 20వ తేదీ వరకు ఉచితంగానే బండి నడుపుతానని ఆయన చెబుతున్నారు.–శ్రీకాకుళం జిల్లా -
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
తిరుమల మెట్లు ఎక్కలేని పవన్కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'.. అసలు కథ ఇదే
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీని గురించి పూర్తిగా వివరాలు తెలియకపోవడంతో చివరకు పవన్ ఫ్యాన్స్ కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్లకు విషయం తెలియకపోవడంతో 'పవన్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్' అంటూ పుష్ప డైలాగ్స్ కొడుతున్నారు. కొందరైతే ఇదీ అరుదైన ఘనత.. అంతర్జాతీయ గౌరవం అంటూ పవన్ ఫొటోలతో షేర్ చేస్తున్నారు. వాస్తవం తెలిసిన వారు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఆగాపురాలో ఉండే 'గోల్డెన్ డ్రాగన్స్' కరాటే ట్రైనింగ్ సంస్థ నుంచి పవన్ కల్యాణ్కు "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదును ప్రదానం చేశారు. హైదరాబాద్లో సుమారు నలభై ఏళ్లకు పైగా డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీ వేల మందికి కరాటేలో కోచింగ్ ఇచ్చారు. ఆయన చేతుల మీదుగానే పవన్కు ఈ గౌరవం దక్కింది. అందరూ అనుకున్నట్లు జపాన్లోని ఏ మార్షల్ ఆర్ట్స్ సంస్థ పవన్కు ఈ బిరుదు ఇవ్వలేదు.పవన్కు 'ఫిఫ్త్ డాన్' పురస్కారం కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీనే ఇచ్చారు. జపాన్లో సంప్రదాయ యుద్ధకళలకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఒకటైన ‘సాగో బుడో కన్’ నుంచి బ్లాక్బెల్ట్లో ఫిఫ్త్ డాన్ పురస్కారం ఇస్తున్నట్లు ఒక పత్రాన్ని పవన్ చేతికి ఇచ్చాడు. అయితే, ఇక్కడ ఫైనల్గా ఇంకో విషయం ఉంది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ (కెంజుట్సు)లో పవన్కు ఎంట్రీ దొరికింది అని చెప్పారు. బహుషా కత్తిసాము నేర్చుకునేందుకు ఆయన జపాన్ వెళ్తారేమో చూడాల్సి ఉంది.మార్షల్ ఆర్ట్స్తో పాటు 'చేతబడి' కూడా..పవన్ కల్యాణ్కు అవార్డ్ ప్రదానం చేసిన డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్కు మార్షల్ ఆర్ట్స్లో మంచి నైపుణ్యం ఉంది. నాలుగు దశబ్దాలుగా ఆయన చాలామందికి శిక్షణ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టర్, మాగ్నెటో థెరపీ, అరోమా థెరపీలలో నైపుణ్యంతో పాటుగా 'చేతబడి, మంత్రాలకు విరుగుడు' చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ ఎంతో సిద్ధహస్తుడని ఆయన ప్రొఫైల్లో పేర్కొనడం విశేషం. ఆయన చేతుల మీదుగా పవన్ కల్యాణ్కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.కెంజుట్సు అంటే ఏమిటి? పవన్కు సాధ్యమేనా?ఇది జపాన్లోని సమురాయ్ యోధులు యుద్ధంలో ఉపయోగించే ఖడ్గ యుద్ధకళ. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు. కత్తితో ప్రత్యక్ష యుద్ధరంగంలోకి దిగితే ఎలాంటి కదలికలు ఉండాలో చూపుతారు. గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే అత్యంత కఠిణమైన శిక్షణగా జపాన్ యోధులు తెలుపుతారు. ఇందులో రాణించాలంటే శరీర శక్తి మాత్రమే కాకుండా మనసు స్థిరత్వం, క్రమశిక్షణ అతి ముఖ్యమైనవి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉన్న పరిస్థితిల్లో జపాన్ వెళ్లి కెంజుట్సు నేర్చుకునేందుకు సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.తిరుమల మెట్లు ఎక్కలేని పవన్కు సాధ్యమయ్యేనా..?సుమారు ఏడాది క్రితం ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ తిరుమల బయలుదేరారు. ఆ సమయంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. అయితే, ఆ మెట్లు ఎక్కేందుకు పవన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో పలుమార్లు ఆగుతూ.. ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కారు. ఈ క్రమంలో మోకాళ్ల నొప్పి రావడంతో స్విమ్స్కు చెందిన ఫిజియోథెరఫిస్ట్ రావాల్సి వచ్చింది. ఆపై హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కంటే డూప్ ఎక్కువ భాగం కనిపించారు. గ్రాఫిక్స్తోనే పని పూర్తిచేశారు. ఇంత హిస్టరీ ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు కెంజుట్సు(ఖడ్గ యుద్ధకళ) నేర్చుకునే చాన్స్ ఉందా..? అంటే సందేహమే..!పవన్ కల్యాణ్ సినీ రంగంలోకి రాకముందు చెన్నైలో కరాటేలో శిక్షణ పొందారు. ఆయన గురువు 'షిహాన్ హుస్సేని' చివరి రోజుల్లో బ్లడ్ క్యాన్సర్తో.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని మరణించారు. సాయం చేయాలని బహిరంగంగానే పవన్ను కోరారు. కానీ, ఆయన కష్టాల కేకలు పవన్ వరకు వినిపించలేదేమో.. చివరకు అనారోగ్యంతో ఆయన గత ఏడాది మరణించారు. కరాటే అంటే ఆయనకు చాలా ఇష్టం కావడంతో జానీ, తమ్ముడు, ఖుషి, ఓజీ వంటి సినిమాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు. View this post on Instagram A post shared by DrSiddiq Mahmoodi (@drsiddiq) View this post on Instagram A post shared by GOLDEN DRAGONS (@goldendragonsindia) -
బాబుకు సీమ కన్నా.. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం: విశ్వేశ్వర రెడ్డి
సాక్షి, అనంతపురం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సూటిగా స్పందించకపోవడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది వ్యాఖ్యలు చేశారు.ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లుగా టీడీపీ, కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది. రాయలసీమ కు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు.అలాగే, లిఫ్ట్ కాదు తెఫ్ట్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. తాను చేసినట్టే అందరూ అవినీతి చేస్తారని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు ఎందుకు మంజూరు చేశారు?. రాయలసీమ లిఫ్ట్ను ప్రాజెక్టే కాదని మంత్రి కేశవ్ ఎలా అంటారు?. ప్రాజెక్టు కాదన్నవారు రూ.190 కోట్లు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి నేటి దాకా చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. చంద్రబాబుకు సీమ ప్రయోజనాల కన్నా.. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు. -
పీఎస్ఎల్వీ సీ–62 ప్రయోగంలో విఫలం: ఇస్రో ప్రకటన
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ–62 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్ ప్రయోగం నాలుగో దశలో శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సి ఉండగా.. శాటిలైట్తో లింగ్ తెగిపోయినట్టు ఇస్రో అధికారులు గుర్తించారు. దీంతో, ప్రయోగం విఫలమైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ మాట్లాడుతూ.. ప్రయోగంలో సాంకేతిక లోపం గుర్తించాం. అన్వేష ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. డేటా విశ్లేషిస్తున్నాం. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సింది. కానీ, అలా జరగలేదు. నాలుగో దశ ప్రారంభంలోనే శాటిలైట్తో లింక్ తెగిపోయింది అని తెలిపారు. లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. Third Stage failure confirmed. pic.twitter.com/SMjrshHUgC— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) January 12, 2026 ఇక, ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (అన్వేష) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనది. అలాగే, ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగ్రం ఇదే. #WATCH | Sriharikota, Andhra Pradesh: The PSLV-C62/EOS-N1 mission launches from Satish Dhawan Space Centre (SDSC-SHAR).PSLV-C62 will carry EOS-N1 and 15 co-passenger satellites. EOS-N1 and 14 co-passengers are planned for injection into Sun Synchronous Orbit; the KID capsule is… pic.twitter.com/b4mrfQMTM2— ANI (@ANI) January 12, 2026ఈ చిన్న ఉపగ్రహాల్లో మనదేశంలోని మూడు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. Launch of PSLV-C62 / EOS-N1 Mission | @isro https://t.co/hcKKNRQfx0— Ministry of Information and Broadcasting (@MIB_India) January 12, 2026ఈ దఫా రాకెట్లోని నాలుగోదశ (పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన కెస్ట్రెల్ ఇనిషియల్ టెక్నాలజీ, డిమాన్స్ట్రేటర్ (కిడ్) అనే పేలోడ్ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్రణాళిక రూపొందించారు. డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్–ఎన్1 పీఎస్ఎల్వీ సీ–62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం. -
మూల్యం చెల్లించాల్సిందే!
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పంట ఉత్పత్తుల కోత.. ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం.. సంప్రదాయాలను పాటించడం.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం.. బంధాలను బలోపేతం చేసుకోవడం.. పిండి వంటలు వండుకోవడం.. నూతన వస్త్రాలు, వాహనాలలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం.. సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడం.. పండగ నాలుగు రోజులు సొంతవారితో సందడి చేయడం.. ఇలా సంక్రాంతి పండుగల్లో అన్నీ ఆనందకరమైన విషయాలే. కాని పంటి కింద రాయిలా ఈ ఏడాది పండగకు నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. రొయ్యలు, చేపలు, మాంసాహారాలు.. బస్సు టిక్కెట్లు, వెండి, బంగారాలు ఇలా ప్రతీ ధరలు నింగినంటడంతో సామాన్యులకు పండుగ భారంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు కనపడేవి. దీంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగి నగదు చెలామణీ జరిగేది. ప్రభుత్వం మారాక నగదు బదిలీలు లేకపోవడం.. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడకపోవడంతో ఏం కొనాలన్నా నాలుగుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. హతవి«దీ.. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంతో మూల్యం చెల్లించుకుంటున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారు.పిండి వంటలకు ధరా ఘాతం నూనె, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పిండి వంటల పేరు చెబితేనే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. 2024 పండగతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కిలో వంట నూనె ధర సగటున రూ.140 వరకు ఉండగా నేడు రూ.160కి పెరిగింది. కందిపప్పు రూ.120, మినపప్పు కేజీ రూ.80 నుంచి రూ.110, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120 వరకు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చిక్కీ గోధుమ పిండి ఇస్తామని కేవలం అమలాపురం పట్టణంలో 11,634 కార్డుదారులకు మాత్రమే పరిమితం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం (ఫోరి్టఫైడ్) అందించేవారు. అరకిలో పంచదార, కిలో చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. బాబు వచ్చిన తరువాత కందిపప్పును నిలిపివేశారు. రాకపోకల్లో బాదుడు.. సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంతూళ్లు అయిన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సులు, రైళ్లు సీట్లు లేకపోవడం ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి.బస్సులలో నాన్ ఏసీ సీటింగ్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సీటింగ్ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదో తేదీన అయితే ఏకంగా రూ.2,600 నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సీటింగ్ ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉండగా, స్లీపర్ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం. కోడి.. చేప.. రొయ్య.. ఆలోచనే రానంతగా.. సంక్రాంతి పండగ ప్రభావంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది. పందెం కోడి పుంజు రకాన్ని బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉంది. నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. ఇక మాంసం ధరలకు వస్తే బ్రాయిరల్ కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. వనామీ రొయ్యల ధర 100 కౌంట్ కేజీ ధర రూ.250 వరకు ఉండగా, చందువా చేప కిలో రూ.500, పండుగప్ప రూ.400 వరకు పలుకుతోంది.పండగ కానుకలు లేవు రేషన్ దుకాణాల ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు పంచదార, నెయ్యి, ఆయిల్, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగనే కాకుండా ఇతర రోజుల్లోనూ కూడా ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. బయట నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి. – మట్టపర్తి విజయ్ కుమార్, గంగలకురు అగ్రహారం, అంబాజీపేట మండలం -
నిమ్మళంగా ముంచింది
పెరవలి: నిమ్మ మార్కెట్ కుదేలై రైతులు విలవిలలాడుతున్నారు. మార్కెట్లో కాయల నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోయకుండా తోటల్లోనే వదలివేస్తున్నారు. గతంలో ధరలు లభించిన సమయంలో తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యారు. ఇప్పుడు దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. ఒక బస్తా నిమ్మకాయలు (50 కిలోలు) మార్కెట్లో కాయ సైజుని బట్టి ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1000కు కొనుగోలు చేయడంతో కోత, రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని దీనంగా చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో బస్తా నిమ్మకాయలు రూ.1800 నుంచి రూ.2100కు కొనుగోలు చేశారు.వ్యాపారులు నేడు మార్కెట్లో వీటి వంక చూసేవారు లేరని రైతులు దిగులు చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పతనమయ్యాయని చెపుతున్నారు. కోత కోయాలంటే ఇద్దరు కూలీలు అవసరం ఉంటోందని, వీరికే రూ.వెయ్యి అవుతున్నదని ఇక రవాణా ఖర్చులు, మార్కెట్లో కమీషన్ తీసేస్తే చేతికి ఏమీ రావడం లేదని వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.60 నుంచి రూ.80 పలికేది. ఒక బస్తా నిమ్మకాయలకు నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4000 వచ్చేదని ఇప్పడు కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని, ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటం లేదని వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో 3200 హెక్టార్లలో సాగవుతోంది. పెరవలి, దేవరపల్లి, చాగల్లు, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి, రాజానగరం, సీతానగరం, అనపర్తి మండలాల్లో సాగవుతోంది. పెరవలి మండలంలో నిమ్మసాగు ఖండవల్లి, లంకమాలపల్లి, ముత్యాలవారిపాలెం, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముక్కామల గ్రామాల్లో 50 ఎకరాల్లో సాగవుతుండగా ఈ రైతులందరూ నష్టాలకు గురవుతున్నారు. ఒక ఎకరం నిమ్మ పంటలో ఏడాదికి దిగుబడి 5 నుంచి 6 టన్నులు వస్తుంది. సాగుపై ఆధారపడి.. తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మసాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది రైతులు, వ్యాపారులు, కూలీలు, రవాణా దారులు ఈ సాగుపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు లేకపోవటంతో ఇటు కూలీలకు, వ్యాపారులకు, సంచులు సరఫరా చేసే వ్యాపారులకు, కోత కూలీలకు, జట్టు కూలీలకు పనులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ధరలిలా.. నిమ్మకాయలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బస్తా ధర రూ.1800 నుంచి రూ.2100 పలికితే నేడు అదే నిమ్మకాయలు రూ.800 నుంచి రూ.వెయ్యి పలకడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుపోతున్నారు. అది కూడా కాయలు బాగుంటే ఈ ధర వస్తున్నదని లేకపోతే మరో రెండు వందలు తక్కువకు అడుగుతున్న పరిస్థితి. పెట్టుబడి తప్పటం లేదు ఒక ఎకరం నిమ్మ సాగుకు ఏడాదికి రూ.25 నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ప్రస్తుత ధరల వల్ల నిమ్మకాయలకు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు.వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సీజన్లో తెగుళ్ల బెడద, దిగుబడి వచ్చే సమయంలో ధరల సమస్య నిమ్మరైతులను కుంగదీస్తోంది. మరోవైపు ఈ నిమ్మను వాడటానికి సీజన్ కాకపోవడం, శుభకార్యాలు లేకపోవడంతో వీటి వినియోగం బాగా తగ్గిందని అందుకే నిమ్మధరలు పతనమయ్యాయని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్లో అన్ని రకాల పండ్లు తక్కువ ధరలకే లభించడం, వీటి ఉపయోగం అంతంతమాత్రంగా ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు. ఇంత పతనం ఎన్నడూ లేదు గతంలో ఎన్నడూ ఇంతటి తక్కువ ధరలు పలకలేదు. నేడు మార్కెట్లో కిలో నిమ్మకాయలు నాణ్యతను బట్టి రూ.15 నుంచి రూ.20కు కొనుగోలు చేస్తున్నారు. దీనితో కోత ఖర్చులు కూడా రావటం లేదు. నష్టాల పాలవుతున్నాం. – చిట్టీడి సూరిబాబు, నిమ్మరైతు, ముత్యాలవారిపాలెంఅదనపు ఖర్చులవుతున్నాయి సీజన్ లేకపోయినా ధరలు బాగానే ఉండేవి. నేడు కోత ఖర్చులు రావటం లేదు. అదనంగా రవాణా, సంచుల ఖర్చులు అవుతున్నాయి. కోయకుండా వదిలేస్తే చెట్లు దెబ్బతింటాయి. కోస్తే జేబులో సొమ్ము అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. – వలవల బాలాజీ, రైతు ముక్కామల గత ప్రభుత్వంలో రూ.4 వేలునిమ్మసాగు చేపట్టి పదేళ్లు అయ్యింది. ఇంతటి తక్కువ ధరలు ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేశారు. అదే బస్తా నేడు రూ.800 నుంచి రూ.వెయ్యి పలుకుతోంది. – నిడదవోలు శ్రీనివాస్, రైతు ముక్కామల -
నేడు పీఎస్ఎల్వీ సీ–62 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్ఎల్వీ సీ–62 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి 22 గంటల ముందు.. ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ కౌంట్డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాత్రి 12 గంటల తరువాత రెండోదశలో 41.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపట్టారు. ఆ తరువాత రాకెట్లోని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చిన్న ఉపగ్రహాల్లో మనదేశంలోని మూడు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు.ఈ దఫా రాకెట్లోని నాలుగోదశ (పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన కెస్ట్రెల్ ఇనిíÙయల్ టెక్నాలజీ, డిమాన్్రస్టేటర్ (కిడ్) అనే పేలోడ్ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. షార్ రోడ్డులో ముమ్మర తనిఖీలు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్కి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. షార్కి వెళ్లే మార్గంలోని అటకానితిప్ప వద్ద భద్రతాదళాలు తనిఖీ చేస్తున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా వస్తున్న పర్యాటకుల ముసుగులో ఎవరైనా వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. షార్ ప్రధాన గేటు వద్ద కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ప్రయోగం అయ్యే వరకు బంగాళాఖాతంలో, పులికాట్ సరçస్సులో ఎవరూ చేపలవేటకు వెళ్లరాదని షార్ అధికారవర్గాలు ప్రకటించాయి. సముద్రం వైపు కోస్ట్గార్డ్స్ గస్తీ చేపట్టారు. షార్, అటవీప్రాంతంలో షార్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్–ఎన్1 పీఎస్ఎల్వీ సీ–62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం. -
లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు.. ప్రభుత్వమే మాది.. మా దోపిడీని ఆపేదెవర్రా.. అన్నట్లుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ బరితెగింపు. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి, మూడు రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి.. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు సంక్రాంతి సీజన్ వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. ఒక్కో బాటిల్పై రూ.10 పెంపునకు నిర్ణయించింది. కాగా, అందుకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో ఇంకా విడుదల కాలేదు. అంటే మద్యం ధరల పెంపు అధికారికంగా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ అధికారిక ప్రక్రియతో తమకు సంబంధం లేదంటూ మద్యం సిండికేట్ బరితెగించింది. ఈ నెల 9 నుంచే మద్యం ధరలు పెంచేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో ధరల పెరుగుదల అనధికారికంగా అమలులోకి వచ్చేసింది. ‘ముఖ్య’ ప్రజా ప్రతినిధి దన్ను ఉండటంతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది.సంక్రాంతి స్పెషల్ బాటిల్పై రూ.10 అదనం అంటే ఏముందీలే అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాలు, 540 బార్లు ఉన్నాయి. వాటిలో నెలకు 6 లక్షల కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా బాటిల్పై రూ.10 పెంపుదలతో రోజుకు రూ.5 కోట్లు చొప్పున అనధికారికంగా కొల్లగొడుతున్నారు. ఇలా మూడు రోజులుగా రూ.15 కోట్ల వరకు దందా సాగించారు. ఇక సంక్రాంతి సీజన్ను సొమ్ము చేసుకునేందుకు మద్యం సిండికేట్.. బెల్ట్ దుకాణాల్లో మరో రూ.5 అదనంగా పెంచింది. అందుకోసమే ఏకంగా 75 వేల వరకు బెల్ట్ దుకాణాలను బరితెగించి మరీ ఏర్పాటు చేసింది. మద్యం ధర పెంపు జీవో వచ్చిన తర్వాత కూడా అధికారిక పెంపుదల రూ.10తోపాటు అనధికారికంగా మరో రూ.10 పెంపుదలకు సిండికేట్ ఇప్పటికే నిర్ణయించింది. వెరసి ఒక్కో బాటిల్పై రూ.15 అదనపు దోపిడీ ఇకపై కూడా వర్తించనుందన్నది సుస్పష్టం. కూటమి ప్రజాప్రతినిధులకు మామూళ్లుమద్యం సిండికేట్ డిమాండ్ను తమ ప్రభుత్వం ఆమోదించి ధరలు పెంచింది కాబట్టి.. తమకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో సిండికేట్.. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.50 వేలు, ఒక్కో బార్ నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసి కూటమి ప్రజా ప్రతినిధులకు ముట్టజెబుతోంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి రూ.18.18 కోట్లు, బార్ల నుంచి రూ.10.80 కోట్లు కూటమి ప్రజా ప్రతినిధులు వసూలు చేశారు. మద్యం దుకాణాల నుంచి సంక్రాంతి మామూళ్ల వసూళ్ల ప్రక్రియను కూటమి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. -
సంక్రాంతి వేళ సంప్రదాయ సంబరాలు
సాక్షి, అమరావతి: ‘ప్రకృతి ఒడిలో పసిడి కాంతుల పరవశం.. ముంగిట ముగ్గులు.. మురిపించే గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. ఆకాశంలో గాలిపటాల విన్యాసాలు.. అంబరాన్నంటే కేరింతలు.. కొత్త బియ్యం పాయసాలు.. కమ్మని నెయ్యి పరిమళాలు.. భోగి మంటల వెచ్చదనం.. ఆతీ్మయ కలయికల మాధుర్యం.. రైతు కంట ఆనందం.. ఇంటింటా సంక్రాంతి వైబోగం..’ అంతటితో సరిపెడితే ఎలా అనుకున్నారో ఏమో.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకత చాటుకునేలా సంక్రాంతి కోలాహలాన్ని కొనసాగిస్తూ మరింత జోష్ నింపుతున్నారు. పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి వేళ ప్రత్యేక సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తూనే మరింత సందడి నింపేలా చేస్తున్న కార్యక్రమాలు ఆ ప్రాంతాలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. అవి ఏమిటంటే.. కత్తులు దూసే పందెం కోళ్లు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాలకు పెద్ద క్రేజ్ ఉంది. పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ మధ్య పోరాటంలో కోడి పందేలు సైతం పౌరుషాన్ని చాటాయని చరిత్ర చెబుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. తొలినాళ్లలో కత్తులు కట్టకుండా సరదాగా నిర్వహించిన కోడి పందేలు రానురాను సంప్రదాయం ముసుగులో జూదాల జాతరను తలపించేలా సాగుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలనూ కోడి పందేలు తాకాయి.ప్రధానంగా భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, దెందులూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించే భారీ పందేలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వస్తుంటారు. నెత్తురోడుతున్నా గెలుపు కోసం జూలు విదిల్చి కత్తులు దూసే కోడి పందాల్లో బెట్టింగ్లకు పలు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి ఈ ప్రాంతానికి వ్యయ ప్రయాసలకోర్చి చేరుకుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఈ ప్రాంత వాసులు ప్రత్యేక బస ఏర్పాట్లు చేయడంతోపాటు విందు, వినోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇప్పుడు భారీ టెంట్లు, ఫ్లడ్లైట్లు కాంతులు, ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, బౌన్సర్లు, అతిథులకు విందు, వినోదాలతో కోడి పందేలు నిర్వహించే తీరు అబ్బో అనిపిస్తుంది.ప్రభల తీర్థం.. కోనసీమ ప్రత్యేకం 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభల తీర్థం కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకం. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శైవ ఉత్సవంగా నిర్వహించే ప్రభల తీర్థంలో సమీపంలోని 11 గ్రామాల నుంచి 11 ప్రభలు (తడికెలు, కర్రలతో తయారు చేసినవి) తీసుకొస్తారు. ఏకాదశ రుద్రులుగా పరిగణించే ప్రభలను వరి పొలాలు, కాలువలు, కౌశిక నది (గోదావరి పాయ) దాటి తీసుకుని వచ్చి జగ్గన్నతోట ప్రాంతంలో కొబ్బరి తోటల్లో ఉంచుతారు.ఎడ్ల పందేలు చూసి తీరాల్సిందే.. సంక్రాంతి వేళ ముఖ్యంగా కనుమ రోజున పశువులను పూజించి ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడ్ల అందాల పోటీలు, బండ లాగుడు పోటీలు, పరాక్రమ పోటీలు నిర్వహించడం ఆచారంగా మారింది. తొలినాళ్లలో రైతులు నిర్వహించిన ఈ పోటీలు రానురాను ప్రత్యేక ప్రదర్శన, ఆకర్షణగా మారాయి. రాష్ట్రంలో ప్రధానంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడ్ల పరుగు పందేలు, బరువైన బండ్లను లాగుతూ వేగంగా పరిగెత్తించడం, ఒంగోలు గిత్తల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించడంతో వేల సంఖ్యలో తిలకించేందుకు వస్తారు. జల్లికట్టు.. ప్రాణాలతో చెలగాటమే తమిళనాడుకు చెందిన జల్లికట్టును ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అనేక గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా పశువుల పండగను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. అదుపు తప్పి పరుగులు తీసే ఎద్దులకు ఎదురెళ్లి కట్టడి చేసేందుకు యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ జల్లికట్టులో పాల్గొంటారు. ఎద్దులను, గిత్తల కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునే క్రమంలో వాటి కొమ్ములు దిగి, కాళ్ల కింద నలిగి గాయాలపాలైనా వాటిని కట్టడి చేసేందుకు చేసేందుకు ప్రయత్నిస్తారు.గుర్రపు పందేలు.. పందుల పందేలు.. సంక్రాంతి రోజుల్లో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాలోని కొన్నిచోట్ల గుర్రపు పందేలు నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వినోదం కోసం పందులు, పొట్టేళ్ల పందేలు నిర్వహించడం జరుగుతోంది. -
పట్టపగలే మహిళపై వ్యక్తి దాడి
అల్లిపురం (విశాఖ): విశాఖ జగదాంబ జంక్షన్లో పట్టపగలు బస్సుదిగి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై బలంగా కొట్టాడు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశురాలైన ఆమె హాహాకారాలు చేసినా స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో బాధితురాలు తన ఆవేదనను వెలిబుచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె కథనం ప్రకారం.. మధురవాడకు చెందిన దేవి జగదాంబ జంక్షన్లో బస్సు దిగి నడిచి వెళ్తుండగా కనకమహాలక్ష్మి మాలధారణలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఈ దాడికి ఆమె కళ్లజోడు కిందపడి విరిగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే జగదాంబ సెంటర్లో ఈ ఘటన జరిగినప్పటికీ, స్థానికులు, పోలీసులు స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిశ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు మానసిక రోగి అని పోలీసులు ముక్తాయింపునివ్వడం గమనార్హం. -
సందడి తెచ్చిన గండికోట ఉత్సవాలు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: వైఎస్సార్ కడప జిల్లాలో పర్యాటక ప్రాంతమైన గండికోటలో వారసత్వ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. హస్తకళల ప్రదర్శన, స్థానిక వంటకాల స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. హెలికాప్టర్ రైడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను రాయలసీమ సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా డిజైన్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు లైవ్ కాన్సర్ట్లు (రామ్ మిరియాల, డ్రమ్స్ శివమణి వంటి ప్రముఖుల ప్రదర్శనలు), డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్, హెలికాప్టర్ రైడ్స్, పారాగ్లైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలు ఉన్నాయి. లేజర్ షో, ముషాయిరా తదితర కార్యక్రమాలు ఆకట్టుకోగా.. మంగ్లీ పాట కచేరీ ఉర్రూతలూగించింది. తొలుత సాహితీవేత్తలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తవ్వా ఓబులరెడ్డి, సగిలి సుధారాణి గండికోట చరిత్రను వివరించారు. శోభాయాత్రలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం
సాక్షి, పుట్టపర్తి: క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టనున్నామని, సంస్థాగత కమిటీలు త్వరలోనే పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులతో పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విస్తృత స్థాయి సమావేశంలో మిథున్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.పార్టీ టాస్్కఫోర్స్ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఐటీ విభాగం జోనల్ ఇన్చార్జ్ చల్లా మధుసూదన్రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పీఏసీ సభ్యుడు శంకర్నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేశ్కుమార్రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకులు రమేశ్కుమార్రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం పీవీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ జెండా మోసే ప్రతి ఒక్కరికీ సభ్యత్వం ఇవ్వడంతోపాటు గ్రామ/వార్డు స్థాయి నుంచి కమిటీల్లో లక్షలాది మందికి చోటు కల్పిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసి.. ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి వరకు అనుబంధ విభాగాల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మిథున్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉండాలని జగనన్న భరోసా ఇచ్చినట్లు తెలియజేశారు. నాయకులందరూ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా పని చేస్తారన్నారు. ఢిల్లీకి మించి భూముల ధరలు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు భవనం నిర్మాణాలు చదరపు అడుగు విలువ కంటే అమరావతిలో అధిక ధరలకు నిర్మాణాలు చేపడుతున్నారని మిథున్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు కట్టిన చదరపు అడుగు ధర కంటే రెండింతల అధిక ధరలకు అమరావతిలో నిర్మాణాలు చేపట్టిన విషయంపై వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందన్నారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ పేద రైతులకు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ అతీగతీ లేదన్నారు.ఈ విషయంలో ఇటీవల ఓ రైతు తన బాధను తెలియజేసి గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. వైఎస్ జగన్ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని, మీడియా సమావేశంలో ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కూటమి నాయకులు.. వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రయోజనాలను పక్కనబెట్టి.. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నీటి పంపకాల విషయంలో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్వీర్యం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూపీహెచ్సీలు)ను సైతం నిర్విర్యం చేస్తోంది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీహెచ్సీలు మూతపడేలా చంద్రబాబు సర్కార్ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోంది. సెలవుల్లో సైతం అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సుల కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన క్యాజువల్ లీవ్లను.. ప్రస్తుత ప్రభుత్వం సగానికి సగం కుదించేసింది.తద్వారా యూపీహెచ్సీలు మూత పడే పరిస్థితి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 560 యూపీహెచ్సీలను వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో సైతం ఆరోగ్య కేంద్రాలు పనిచేసేలా అప్పట్లో చర్యలు తీసుకుంది. సెలవు రోజుల్లో కూడా స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండి.. ప్రజలకు వైద్య సేవలు అందించేలా వారికి 35 రోజుల క్యాజువల్ లీవ్లు(సీఎల్స్) మంజూరు చేసింది. దీంతో పండుగలు, ఇతర సెలవు రోజుల్లో మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరవ్వకపోయినా.. స్టాఫ్ నర్స్లు మాత్రం ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలందించేవారు.ఆ నర్సులు అదనంగా మంజూరైన సెలవులను తమకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుండేది. కానీ, ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెల 24న వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్య కేంద్రాల నర్సులకు కూడా 15 సీఎల్స్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల నర్సులు సెలవు దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు పడతాయని తెలిసినా చంద్రబాబు సర్కార్లో మాత్రం చలనం లేదు. -
కూలీలకు డబ్బుల్లేవ్... పనులకు కోత కూలిన ‘ఉపాధి’!
సాక్షి, అమరావతి: ఎండల్లో చెమటోడ్చి చేసిన పనికి కూలి డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్ నిరుపేదలను వేధిస్తోంది. ఒకపక్క ఉపాధి పనుల్లో కోత.. మరోపక్క దాదాపు ఆరు నెలలుగా కూలి డబ్బులు అందక నిరుపేదలు నరక యాతన పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు పండగ పూట సైతం పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో లక్షలాది పేద కుటుంబాల్లో సంక్రాంతి సంతోషం ఛాయలు కానరావడం లేదు. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీలకు కూలి డబ్బులు బకాయి పెట్టకూడదని కేంద్ర చట్టం చెబుతోంది.అయితే రాష్ట్రంలో గతేడాది ఆగస్టు 10 తర్వాత ఉపాధి కూలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కూలీలకు రూ.425 కోట్ల మేర కూలి డబ్బుల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. జనవరి 10వతేదీ నాటికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.454 కోట్లకు పెరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కూలి డబ్బులపై ఆధారపడి జీవనం సాగించే లక్షలాది నిరుపేద కుటుంబాలు రోజువారీ అవసరాల కోసం అల్లాడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.‘ఉపాధి’ బకాయిలు ఏపీలోనే అత్యధికం దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.1,766 కోట్లు వేతన బకాయిలు ఉండగా అందులో నాలుగో వంతు ఏపీలోనే ఉండటం గమనార్హం.పనులు భారీగా తగ్గుదల..మరోవైపు గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పన కూడా భారీగా తగ్గిపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 21.75 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ పేదలను ఆదుకోగా.. చంద్రబాబు సర్కారు 2025 ఏప్రిల్ – డిసెంబరు మధ్య కేవలం 16.29 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు ఐదున్నర కోట్ల మేర పని దినాల కల్పన తగ్గిపోవడం గమనార్హం.తగ్గిపోయిన లబ్ధిదారులు.. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 47 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది పేదలు ఏటా వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ప్రయోజనం పొందుతుంటారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో 75.43 లక్షల మంది కూలీలు 25.30 కోట్ల పనిదినాల ద్వారా రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. అదే 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి 10 వరకు కేవలం 41 లక్షల కుటుంబాలకు సంబంధించి 65 లక్షల మంది ఉపాధి కూలీలకు రూ.4,400 కోట్లు మాత్రమే ప్రయోజనం చేకూరింది.నిరుపేద ఎస్సీలకు కోత..చంద్రబాబు సర్కారు వచ్చాక ఉపాధి హామీ పధకం పనులు భారీగా తగ్గిపోవడంతో నిరుపేద ఎస్సీలే అధికంగా నష్టపోయారు. 2023–24లో గత ప్రభుత్వం కల్పించిన మొత్తం 25.30 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర పనిదినాలు ఎస్సీలకే దక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 2025–26లో కల్పించిన 16 కోట్ల పనిదినాల్లో ఎస్సీలు కేవలం 20.60 శాతం పనిదినాలు మాత్రమే పొందగలిగారు.పండుగ చేసుకునే పరిస్థితి లేదుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉపాధి హామీ పథకం కూలీల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే గత ఐదు నెలల నుంచి రూ.454 కోట్లు వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు సక్రమంగా వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికీ కనీసం రూ.3 వేల మేర కూలి అందేది. ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా పేద కుటుంబాలైతే, పండుగ ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం సంక్రాంతి లోపు కూలీలకు వేతన బకాయిలని్నంటినీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. – వి.వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపనులే కల్పించడం లేదు రెండు నెలలుగా మా గ్రామంలో ఉపాధి పనులు పెట్టలేదు. వర్షం పడిందని పనులు ఆపేశారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. పనులు పెట్టమని అడుగుతున్నాం. ఉపాధి పనులు చేస్తే మాకు కాస్త చేదోడుగా ఉంటుంది. పనులు ఉంటే చేతిలో కాస్త డబ్బులు ఉంటాయి. సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేవాళ్లం. అధికారులు స్పందించి మాగ్రామంలో ఉపాధి పనులు ఏర్పాటు చేయాలి. – దగ్గుమాటి శ్యామల, ఆత్మకూరు గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లాడబ్బులు జమ చేయడం లేదుఉపాధి హామీలో నేను పని చేసి నాలుగు నెలలైంది. అప్పటి నుంచి పని కల్పించడం లేదు. కనీసం మా ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. సంక్రాంతి పండుగ సమయంలో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి సొమ్ములు ఖాతాలో జమ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. – మెరుగు బాబూరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లాతినడానికి కూడా కష్టంగా ఉంది..ఉపాధి హామీ పనులే మాకు జీవనాధారం. ఈ పనులు చేసుకునే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చేసిన పనులకు కూలి డబ్బులు పడకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తినడానికి కూడా కష్టంగా ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో కూడా కూలి డబ్బులు పడకపోతే పస్తులు ఉండాల్సిందే. – గోదా వెంకట్రావు, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లాఎలా నెట్టుకురావాలో ?రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పనులు చేస్తేనే కుటుంబం గడిచేది. ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ కూలి డబ్బులు ఇంతవరకు జమ కాలేదు. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియక నానా కష్టాలు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకుదెరువు కోసం మరో పని చూసుకోవాల్సిందే. త్వరగా కూలి డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలి. – వల్లెల మేరి, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా -
అల్లుడు చేతిలో అత్త దారుణ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా అల్లుడు నాగ సాయి అత్త కోలా దుర్గపై దాడి చేసి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. సంఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీసినందుకు ప్రజలు షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
విజయవాడలో కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: భవానిపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాక్షి టీవి ప్రతినిధి నాగేంద్ర చేతికి తీవ్ర గాయమైంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన యూట్యూబర్కి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఎలక్ట్రికల్ కారులో మంటలు.. మరో ఘటనలో బెంజ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రికల్ కారులో మంటలు చెలరేగాయి. కారు యాజమాని అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కారు కానూరుకు చెందిన పీఆర్ హాస్పిటల్ డాక్టర్ చెందినదిగా గుర్తించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
‘పవన్.. అంబటి రాంబాబును ఫాలో అవుతున్నారు’
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు.. ఆయననే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారని తెలిపారు.గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ నేతలు అన్నబత్తుని శివ కుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకట రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీల్లో గీతాంజలి లక్ష రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనుక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్ జగన్కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా?మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే మొదట గుర్తు వచ్చేది ముగ్గుల పోటీలు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు. గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారు. వాళ్లే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారు. అందరి ఆత్మీయుడు అంబటి రాంబాబు.వైఎస్ జగన్ను ఎవరు విమర్శిస్తే వారికి.. అంబటి రాంబాబు తన మాటల చురకులతో తాట తీస్తారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, చేయూత, రైతు భరోసా లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. వైఎస్ జగన్ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘సంక్రాంతి అంటే సాంప్రదాయం. ఆటలు, పాటలు, కోడిపందాలు ఎన్నో ఉంటాయి. ప్రతీ సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన్ను కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకి వెళ్ళాడు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. -
సంక్రాంతి సంబరాల్లో కూటమి నేతల మాఫియా: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు నిర్వహించి వేల కోట్లు దోపిడి చేసేలా కూటమి నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా 450కి పైగా బరులు సిద్ధం చేశారని, ప్రతి నిర్వాహకుడి నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఒక్కో బరి వద్ద సగటున 40 వరకు పందేలు నిర్వహిస్తారని, ఒక్కో పందెం విలువ విలువ రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులకు వాటాలు చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇవే కాకుండా ఆ కోడి పందేల బరుల వద్ద ఫుడ్ స్టాళ్లు, లిక్కర్ అమ్మకాలు, కూల్ డ్రింక్స్, పేకాట డెన్లు నిర్వహిస్తూ అధికార పార్టీ నాయకులు మరో భారీ దోపిడీకి తెరదీశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సంక్రాంతి సంబరాల్లో ‘కేపీఎల్’:క్రికెట్లో ఐపీఎల్ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్’ (కోడి పందేల లీగ్)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు చేశారు. అసలు కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, పోలీసులతో కుమ్మక్కై వాటి ద్వారా వేల కోట్లు దోచుకునేందుకు కూటమి నాయకులు ఈ సంక్రాంతి సంబరాల్లో స్కెచ్ వేసుకున్నారు. పోలీస్ స్టేషన్కి రూ.10 లక్షలు ముట్టజెప్పి పందేలు నిర్వహించుకుందామని, మూడు రోజుల తమకు అదే పని అంటూ వారు మాట్లాడుకున్న వీడియో ఇందుకు సాక్ష్యం.పండగ వేడుకలనూ ఈవెంట్లా మార్చారు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పులు, ఈవెంట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. పెన్షన్ పంపిణీ పేరుతో ప్రతి నెలా 1న సీఎం చేస్తున్న ఈవెంట్, ఏటా స్కూళ్లలో రొటీన్గా జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను కూడా ఏ స్థాయిలో ఈవెంట్లా మార్చి హంగామా చేశారో చూశాం. ఇప్పుడు చివరకు సంక్రాంతి పండగను కూడా విడిచిపెట్టకుండా, ఆ వేడుకలను కూడా ఈవెంట్లా మార్చి దోపిడికి సిద్ధమయ్యారు. ఇటీవలే దసరా సందర్భంగా విజయవాడలో గొల్లపూడి వద్ద ఎగ్జిబిషన్ నిర్వహించి ఏం చేశారో చూశాం. కాగా, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలనూ ఈవెంట్లా మార్చిన కూటమి నాయకులు, యథేచ్ఛగా వేల కోట్ల దోపిడి పర్వానికి తెర తీశారని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. -
బాబూ.. అరెస్ట్లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేయిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరు అని చెప్పుకొచ్చారు. అరెస్ట్లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు అని అన్నారు.కండలేరు డ్యామ్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. సీమ లిఫ్ట్ నిలిపేసి నెల్లూరు జిల్లాకు బాబు ద్రోహం చేశారు. లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు భయపడేవాళ్లం కాదు. పోలీసులను అడ్డుకుని చంద్రబాబు.. దాడులు చేయిస్తున్నాడు. పోలీసు శాఖ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మొండి వైఖరి ప్రవర్తిస్తోంది.కండలేరు డ్యామ్ పరిశీలనకు వెళ్ళకుండా అరెస్టులు చేస్తారా?. అరెస్టులతో మా పోరాటం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆశయాలు, ఆదేశాలతో పోరాడుతూ ముందుకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల వలన నెల్లూరు జిల్లాకు కూడా చంద్రబాబు తీరని లోటు తలపెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘బాబూ.. ఎన్నికల్లో మభ్యపెట్టి ఉద్యోగులు, టీచర్లను మోసం చేస్తారా?’
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. డీఏలు, ఐఆర్ను ప్రకటించి.. విడుదల చేస్తామని ఇప్పటికీ అందించలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులను మభ్యపెట్టి.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో దోహదం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. వారికి డీఏలు, ఐఆర్ను ప్రకటించి విడుదల చేస్తామని ఇప్పటికీ అందించడం లేదు. వైఎస్ జగన్ హయాంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శత్రువుగా మారిపోయింది. టీచర్స్ పట్ల టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, సచివాలయంలో లక్ష సమస్యలుగా కూటమి ప్రభుత్వం మారింది.ఉద్యోగులకు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా తుంగలో తొక్కారు. రూ.34వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఐఆర్ అందిస్తామని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పీఆర్సీ ఇస్తామని ఆ ఊసే లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రస్తావించడం లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేయకుండా మభ్యపెడుతున్నారు.గతంలో వైఎస్ జగన్ హయాంలో ఐఆర్ 27 శాతం అందించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి కేబినెట్ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోని ఉద్యోగులకు అందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. 16 నెలలు అవుతున్నా డీఏలు అందించడం లేదు. వైఎస్ జగన్ కరోనా సమయంలో కూడా ఐఆర్, డీఏలు, పీఆర్సీ అందించారు. మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగులకు ఎందుకు బకాయిలు చెల్లించలేదు?. సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని కామెంట్స్ చేశారు. -
వడ్డెరలను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే
సాక్షి, తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురు నిలబడి వడ్డే ఓబన్న చూపిన తెగువను నాయకులు గుర్తుచేసుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.వడ్డే ఓబన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వడ్డె రామదాసు వంటి వడ్డెర నాయకులను ఈ సందర్భంగా కీర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వడ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కృషిని రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు మాచర్ల, చీమకుర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు చైర్మన్లుగా గుంటూరు జెడ్పీ వైయస్ చైర్ పర్సన్గా వడ్డెర కులస్తులకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామని చెప్పారు. వడ్డెర కులస్తులతో వైఎస్ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సహిస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా మరింత ముందుకు తీసుకెళ్లారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా జెడ్పీ వైఎస్ చైర్పర్సన్ బత్తుల అనూరాధ, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బత్తుల రామారావు, చిత్తూరు జిల్లా పార్టీ సోషల్ మీడియా అడ్వైజర్ పవన్, హైకోర్టు అడ్వకేట్ బేబీ రాణి, వివిధ పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు ఓబన్న: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/IZfKKe17d7— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2026 వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. -
కూటమి.. రాయచోటి ప్రజలకు అన్యాయం చేస్తోంది: గడికోట
సాక్షి, అన్నమయ్య: కూటమికి ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు రాయచోటి ప్రజలను గుండెకోతకు గురిచేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారని అన్నారు. పక్క ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.అన్నమయ్య జిల్లా తరలింపుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పినా సంబరాల పేరిట ప్రజలను ఏమార్చారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నాం, మా వాదనలు వినిపించాను. నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయపోరాటం ఒకటే మార్గం. జన గణన ప్రారంభమవుతుంది ఈ లోపల సరిహద్దులు మార్చకూడదనే నిబంధన కూడా ఉంది. ఉన్న జిల్లాను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు, ఈ ప్రాంత ప్రజలను కోతకు గురి చేశారు.ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేరు. జిల్లా కేంద్రం నుంచి చుట్టూ ముప్పై కిలోమీటర్ల వరకు లక్షల కోట్ల మా సంపదను ఆవిరి చేసి నష్టం చేశారు. ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు. రైతులను వ్యాపారులను యువతను అన్ని విధాల మోసం చేశారు. మమ్మల్ని గుండు కోతకు గురి చేసిన ఓ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుత తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుంది.జన గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాల విభజన జరిగి ఉంటే స్వాగతించే వాళ్లం. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి అన్ని ప్రాంతాల పెట్టుబడులన్నీ ఒక అమరావతిలోనే పెడుతున్నారు చంద్రబాబు. 100 కోట్లతో రాయచోటి కలెక్టరేట్ తయారవుతుంది. కానీ 1800 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో తిరిగేందుకు విహారయాత్రలు చేసుకునేందుకు వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని మంత్రులు మాట్లాడుతున్నారు. 5000 కోట్లతో బనకచర్ల, గండికోట పనులు గతంలో ప్రారంభించాం. రాయచోటిని జిల్లా చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాం. జిల్లా తీసుకు వస్తాం. ఈ ప్రాంతానికి వచ్చిన సైనిక్ స్కూల్, యునాని మెడికల్ కాలేజ్, జిల్లా కేంద్రం తరలిపోవడం బాధాకరం.రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటే ఏ విధంగా కట్టుబడి ఉన్నారు?. రాయచోటిలో యూనివర్సిటీ కోసం, కలెక్టరేట్ కోసం, జడ్పీ కార్యాలయం కోసం వేలాది ఎకరాలు కేటాయించి పెట్టాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నమయ్య జిల్లా పేరు మీదే వచ్చింది. అందుకే అన్నమయ్య జిల్లాపై కుట్ర పన్నారు. గతంలో అమరావతి రాజధాని చేస్తామంటే వైఎస్సార్సీపీ అభ్యంతరం చెప్పలేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా అమరావతి కూడా ప్రతిపాదించాం. అమరావతి కోసం 50 వేల ఎకరాలు తీసుకుంటే చనిపోయిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఘాటు విమర్శలు చేశారు. -
‘వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధైర్య పడొద్దు’
శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎంపీ మిధున్రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురి చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ వేధింపు చర్యలను తాను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే విజయమన్నారు. వైఎస్సార్సీపీ సంస్థాగత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మిథున్రెడ్డి సూచించారు. -
అమానుషం: ‘మా ప్రభుత్వంలో.. మా గ్రామంలోకి వస్తావా!
పల్నాడు: గురజాలలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతల బెదిరింపులతో ఊరు విడిచి వెళ్లిపోయాడు సాల్మాన్. అయితే తాజాగా కుటుంబ సభ్యుల్ని చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు సాల్మాన్. దీన్ని అదునుగా చేసుకుని ‘నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మా గ్రామంలోకి వస్తావా’ అంటూ సాల్మన్పై దాడికి పాల్పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. -
వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్శన అడ్డగింత
నెల్లూరు: రాపూర్ మండలంలోని కండలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం(జనవరి1వ తేదీ) వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్భనన అడ్డుకున్నారు. పొదలకూరు సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నేతల్ని అడ్డగించారు పోలీసులు. అదే సమయంఓ కండలేరు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కాకాణితో పాటు పలువురు నేతలు.దీనిపై నేదురమల్లి రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తమను అడ్డకుంటున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అర్థాంతరంగా నిలిపివేస్తే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబులు లోపాయకారీ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తన్నారు. -
రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి
విశాఖ : రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం, చింతగట్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. అక్రమ నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత నరసింగరావును రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. నిర్మాణం చేపడుతున్నారని సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిర్మాణం తొలగించేందుకు జేసీబీ తీసుకెళ్లారు సిబ్బంది. అయితే జేసీబీతో సహా రెవెన్యూ సిబ్బంది రాళ్లు, కర్రలతో దాడి చేసింది టీడీపీ నేత నరసింగరావు అనుచరులు. ఆపై తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సిందే
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చినప్పటికీ.. సచివాలయాలు మాత్రం పనిచేయాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలకు లిఖితపూర్వక, మౌఖిక ఆదేశాలిచ్చారు. సంక్రాంతి పండుగ రోజులతో పాటు శని, ఆదివారాల్లో సచివాలయంలో ఎవరైనా ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండేలా విధులు కేటాయించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు.. ఇతర పనిదినాల్లో తిరిగి సెలవు తీసుకునే వెసులుబాటు కలి్పంచకపోవడాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. -
రెచ్చిపోతున్న పచ్చనేతలు.. రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి
సాక్షి,విశాఖ: పచ్చనేతలు పేట్రేగిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా,టీడీపీ నేత నరసింగరావు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై నరసింగరావు అనుచరులు రాళ్లు,రాడ్లతో దాడులకు తెగబడ్డారు. విశాఖపట్నం పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత నరసింగరావు పై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మాణం జరుగుతోందని సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, విఆర్ఓ ఆధ్వర్యంలో జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ నేత నరసింగరావు అనుచరులు రాళ్లు, కర్రలతో రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. జేసీబీ వాహనాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.దాడిలో తాను ప్రాణహానికి గురయ్యానని విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. అధికారులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సంక్రాంతికి వస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి. రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు... సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జాతీయ రహదారిపై రద్దీ పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద మొత్తం 16టోల్బూత్లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే, అదనంగా కేటాయించిన టోల్బూత్లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు. -
సరిహద్దున బ్లాక్ దందా
శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులో ‘బ్లాక్’ దందా జోరుగా సాగుతోంది. జిల్లాలోని చాలా మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉండటంతో పొరుగు రాష్ర్టంలోని సరుకు యథేచ్ఛగా జిల్లాలోకి వచ్చి చేరుతోంది. ముఖ్యంగా నిషేధిత గుట్కాతో పాటు డీజిల్, పెట్రోల్ సరిహద్దు మండలాలను ముంచెత్తుతోంది. ఈ దందా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దున నిఘా లేకపోవడంతో గుట్కా దందా, డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, గోరంట్ల, హిందూపురం, మడకశిర, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. నెలవారీ ‘మామూళ్ల’తో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చ నేతల సిండికేట్.. టీడీపీకి చెందిన కొందరు సిండికేటుగా మారి అక్రమ వ్యాపారాలకు తెరదీసినట్లు తెలుస్తోంది. కొందరు ఖాకీలు మామూళ్లకు అలవాటు పడటంతో అక్రమ వ్యాపారులు కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు. ముఖ్యంగా నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు బెంగళూరు నుంచి నేరుగా హిందూపురం, మడకశిరకు వస్తున్నాయి. అక్కడి రహస్య ప్రాంతంలో సరుకు డంప్ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఇక పెనుకొండ సమీపంలో ‘కియా’ కార్ల పరిశ్రమలో ఎక్కువగా ఉత్తరాది కారి్మకులు పనిచేస్తుండటం...వారంతా గుట్కాలకు అలవాటు పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్కా విక్రయాలు విపరీతంగా జరుగుతున్నట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా డీజిల్ దందా.. పెట్రోలు, డీజిల్ ఆంధ్రాతో పోలిస్తే కర్ణాటకలో లీటరుపై కనీసం రూ.7 తక్కువగా ఉంటోంది. దీంతో అధికార పార్టీలోని కొందరు నేతలు కర్ణాటక నుంచి డీజిల్, పెట్రోల్ను జిల్లాకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. డీజిల్ పావగడ నుంచి రామగిరికి ఎక్కువగా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల సమయంలో పోలీసుల నిఘా ఉండదన్న ఉద్దేశంతో ఆ సమయంలోనే అక్రమ రవాణా ఎక్కువగా సాగిస్తున్నట్లు సమాచారం. కొడికొండ చెక్పోస్టు నుంచి జాతీయ రహదారి మీద పలు చోట్ల డీజిల్ దుకాణాలు వెలిశాయి. వాటన్నింటిలో కర్ణాటకకు చెందిన ఇంధనమే అమ్ముతున్నట్లు సమాచారం. నెలకు రూ.100 కోట్ల వ్యాపారం.. మత్తు పదార్థాలకు చాలా మంది బానిస కావడంతో గుట్టు చప్పుడు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గుట్కాను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆంధ్ర కంటే తక్కువగా ఉండటంతో రాత్రిపూట తీసుకొచ్చి.. పగటి పూట అమ్ముతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. డిమాండ్కు అనుగుణంగా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఇరుకు సందుల్లో అద్దెకు గదులు తీసుకుని గోదాములుగా వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు గుట్కా అక్రమంగా సరఫరా అవుతోంది. అదేవిధంగా కొడికొండ చెక్పోస్టు నుంచి పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ఎన్ఎస్ గేటు, మామిళ్లపల్లి వరకు డీజిల్ అమ్మకాల దుకాణాలు కనిపిస్తున్నాయి. ‘మామూళ్ల’ ముసుగులో అడ్డుకోకుండా.. నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నా.. పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులు పట్టుబడినప్పటికీ.. అరకొర జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీనికి తోడు కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారుల సహకారంతోనే గుట్కా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా కొన్ని చోట్ల సరుకు పట్టుబడినా.. అంతో ఇంతో డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. రామగిరి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ నేతలు సిండికేటుగా మారి డీజిల్, పెట్రోల్ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.నామమాత్రపు జరిమానాతో సరి..నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అక్రమ డీజిల్, పెట్రోల్ పట్టుబడితే అధికారులు కేసు నమోదు చేసి నామమాత్రపు జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీంతో ఈ అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్కా, ఖైనీ హోల్సేల్ వ్యాపారులు, డీజిల్ అక్రమంగా విక్రయించే వాళ్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 70 మంది ఉన్నట్లు తెలిసింది. వీళ్లందరూ సరుకును కావాల్సిన ప్రాంతానికి పంపిస్తారు. అప్పుడప్పుడూ ఎవరైనా నిఘా పెట్టి పోలీసులకు ఫోన్ చేసినా.. ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. లేదంటే జరిమానా కట్టి వెళ్లిపోతున్నారు. అక్రమంగా సరుకు తరలిస్తూ ఎవరైనా పట్టుబడినా రూ.2 వేల నుంచి రూ.10 వేలలోపు జరిమానా విధిస్తున్నారు. దీంతో రూ.లక్షల్లో సంపాదించే వారికి రూ.వేలు లెక్క లేకుండా పోయింది.ప్రత్యేక బృందాలతో తనిఖీ నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యక్షంగా.. పరోక్షంగా గుట్కా అక్రమ వ్యాపారానికి సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గుట్కా వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాం. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ అక్రమ సరఫరా నేరం. అక్రమంగా ఇంధనం తరలించే వారిపై ప్రత్యేక నిఘా పెడతాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ -
సమాధానం చెప్పలేకే తిట్ల దండకం!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతి.. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తిట్ల దండకం అందుకున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో పోటీ పడి దూషణలకు దిగుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు, మంత్రులు వాటికి సమాధానాలు చెప్పాల్సిందిపోయి, దూషణల పర్వానికి దిగడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ చోరీ, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్బీఐ నివేదిక, పారిశ్రామిక ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ చేస్తున్న అవినీతిపై సాక్ష్యాధారాలతో గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. ఇదే సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండో దశలో మళ్లీ 50 వేల ఎకరాలు సమీకరిస్తుండటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తమకు అలవాటైన రీతిలో తిట్ల దండకాన్ని అందుకున్నారు. వారితో పాటు ఎల్లో మీడియా సైతం పోటీ పడి దూషణల పర్వానికి దిగింది.స్వలాభం కోసం ఎందాకైనా బాబు సిద్ధం⇒ స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి మోసాన్ని చేయడానికైనా సీఎం చంద్రబాబు వెనుకాడరన్నది రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిచూపడంతో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ⇒ 2014–19 మధ్య భూ సేకరణను కోర్టు కేసులతో సంక్లిష్టం చేసి చంద్రబాబు సర్కార్ చేతులెత్తేస్తే 130 కేసులను పరిష్కరించి, 2019–24 మధ్య 2,700 ఎకరాల భూమిని సేకరించి.. రూ.960 కోట్లతో మూడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. భోగాపురం ఎయిర్పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్ జగన్. 2026 నాటికి ఎయిర్పోర్టు సిద్ధమవుతుందని అప్పుడే చెప్పిన అంశాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీ నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడంతో బాబు అబాసుపాలయ్యారు. ⇒ 2019–24 మధ్య రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. ఎవరెవరి ఖాతాల్లో ఏ పథకం కింద ఎంత వేశామన్నది ఆధార్ కార్డులతో సహా ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదని.. అప్పుగా తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని వైఎస్ జగన్ నిలదీయడంపై కూడా వారెవరూ జవాబు చెప్పలేదని మేధావులు స్పష్టీకరిస్తున్నారు.⇒ ఇసుక నుంచి క్వార్ట్జ్ వరకూ ఎడాపెడా దోచేస్తూ.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నారని గణాంకాలతోసహా ఎత్తిచూపితే ఎందుకు వాటిపై స్పందించరని మేధావులు నిలదీస్తున్నారు. అమరావతి మదర్ ఆఫ్ స్కామ్స్ కాదా?⇒ బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యంత అధునాతన సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేల చొప్పున భవనాలను నిర్మిస్తుంటే.. రాజధానిలో చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తున్నారని ఎత్తిచూపుతూ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులను కి.మీ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే.. రాజధాని అమరావతిలో కిలోమీటర్కు రూ.180 కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నాని ఎత్తిచూపుతూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి నీకింత–నాకింత అంటూ దోచుకుంటున్నారని నిగ్గదీసి అడిగారు. దీనిపై కూడా సమాధానం రాలేదు. ⇒ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతమైన ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తోంది. దీని అభివృద్ధికి మరో రూ.లక్ష కోట్లు కావాలి. మొత్తంగా రూ.రెండు లక్షల కోట్లు. అంతపెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఎవరైనా రాజధాని నిర్మిస్తారా? అని వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకూ సమాధానం లేదు.⇒ ‘మచిలీపట్నంలో పోర్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పూర్తయింది. గన్నవరం ఎయిర్పోర్టు ఉంది. విజయవాడ–గుంటూరు మధ్యలో రహదారికి సమీపంలో లేదా విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారికి సమీపంలో రాజధానిని నిర్మించి ఉంటే తక్కువ ఖర్చుతో ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేది కాదా?’ అని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నకూ వారి నుంచి సమాధానం లేదు.సమాధానం చెప్పేందుకు నోరు పెగలట్లేదెందుకు?⇒ రాజ్యాంగంలో ఎక్కడైనా రాజధాని ప్రస్తావన ఉందా? వైఎస్ జగన్ చెప్పినట్టుగా సీఎం, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. ఇది అబద్ధమని సాక్ష్యాధారాలతో ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా?⇒ రివర్ బేసిన్లో, ముంపు ప్రాంతంలో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మించారా? అన్న వైఎస్ జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ⇒ కొండవీటి వాగు, పాల వాగు వరద వల్ల తరచుగా రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుండటం నిజం కాదా. ఈ వరద ముప్పును తప్పించడానికే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా? కొండవీటి వాగు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల చేపట్టలేదా? తాజాగా 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల చేపట్టింది వాస్తవం కాదా? ⇒ రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చి 11 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక పోవడం నిజం కాదా? రైతులకు అభివృద్ధి చేయకుండా ఇచ్చిన ప్లాట్లను కూడా చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇవ్వడం నిజం కాదా?⇒ తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్–8 రోడ్డు వంటి రోడ్ల విస్తరణ పేరుతో రైతుల ఇళ్లను కూడా సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుంటే.. ఈ అన్యాయంపై మంత్రి నారాయణను రైతు రామారావు ప్రశ్నిస్తూ ఆవేదనతో గుండె పగిలి చనిపోవడం నిజం కాదా?⇒ రెండో దశ భూ సమీకరణ చేసేందుకు వడ్లమానులో నిర్వహించిన గ్రామసభలో ఇదే అంశంపై మంత్రి నారాయణను రైతులు నిలదీయడం వాస్తవం కాదా? -
దారి దోపిడీకి ‘పచ్చ’జెండా!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీకి చంద్రబాబు సర్కారు డూడూ బసవన్న తరహాలో తలాడిస్తోంది. ప్రభుత్వ కీలక నేతకు రూ.వంద కోట్ల ముడుపుల మూట ముట్టజెప్పేందుకు పక్కా డీల్ కుదరడంతో అడ్డగోలు దందాకు సర్కారు పచ్చ జెండా ఊపింది. దీనికోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ భారీగా కోత విధించింది. ప్రయాణికులు అనివార్యంగా ప్రైవేటు ట్రావెల్స్పై ఆధార పడాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా కోటి మంది ప్రయాణికులను దోచుకునేందుకు పథక రచన చేసింది. రూ. కోట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ప్రయాణ వ్యవహారాలు చూసే కీలక మంత్రి మాఫియాకు అండగా నిలిచినట్టు సమాచారం. సంక్రాంతి అంటే ఆంధ్రనాట పెద్ద పండగ. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, విద్యార్థులు సొంత ఊళ్లకు తరలివస్తారు. బంధు మిత్రులతో పండగ మూడు నాలుగు రోజులూ ఆనందంగా గడిపి తిరిగి కార్యస్థానాలకు వెళ్తారు. ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వస్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులో వచ్చే వారిని మినహాయిస్తే దాదాపు 40 లక్షల మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కాగా, ఈ ఏడాది ఆర్టీసీ సర్సీసుల్లో భారీ కోత విధించడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణించక తప్పదని స్పష్టమవుతోంది. ఏటా సంక్రాంతికి వచ్చి వెళ్లే వారిలో 40 శాతం మంది హైదరాబాద్వాసులే ఉంటారు. అందుకే టీడీపీ సిండికేట్ హైదరాబాద్ బస్ సర్వీసులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. ఆర్టీసీ సర్వీసులను కుదించేలా పావులు కదిపింది.ఆర్టీసీ దొంగాటఏటా సంక్రాంతి స్పెషల్ బస్సు సర్వీసుల వివరాలను ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వెల్లడించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వ కీలక నేతతో డీల్ కుదరడంతో సంక్రాంతి స్పెషల్ బస్సులపై కేవలం చిన్న నోట్ విడుదల చేసి ఆర్టీసీ చేతులు దులిపేసుకుంది. అందులో హైదరాబాద్ నుంచి కేవలం 240 సర్వీసులే నిర్వహిస్తామని వెల్లడించడం గమనార్హం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్టీసీ కనికట్టు చేసేందుకు యత్నించింది. హైదరాబాద్నుంచి ఏటా మాదిరిగానే సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతామని మరో చిన్న ప్రకటన మొక్కుబడిగా ఇచ్చింది. కానీ మొదటి ప్రకటనలో పేర్కొన్నట్టుగా వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసుల పట్టిక ఇవ్వక పోవడం గమనార్హం. అంటే టీడీపీ ట్రావెల్స్ సిండికేట్ దోపిడీకి వత్తాసు పలుకుతున్నట్టేనని ఆర్టీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.గతంలో హైదరాబాద్ నుంచి 2,500 సర్వీసులుకొన్నేళ్లుగా ఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 2,500 బస్ సర్వీసులు నడిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి ముందు ఐదు రోజులపాటు రోజుకు 2,500 బస్ సర్వీసులు.. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల కోసం మూడు రోజులపాటు రోజుకు 2 వేల బస్ సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్కు 2,100 బస్ సర్వీసులు నడిపారు. అయితే ఈసారి టీడీపీ సిండికేట్ అక్కడే దెబ్బ కొట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ 240 బస్ సర్వీసులను మాత్రమే నడుపుతామని తొలుత ప్రకటించింది. ఇక హైదరాబాద్ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు నుంచి కూడా కేవలం 102 బస్ సర్వీసులు, చెన్నై నుంచి కేవలం 15 బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య కేవలం 3,500 బస్ సర్వీసులనే నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించడం మాఫియాతో ప్రభుత్వం డీల్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. మూడు నాలుగు రెట్ల చార్జీల బాదుడుప్రభుత్వంతో డీల్ కుదరడంతో టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా భారీ దోపిడీకి తెగబడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేసింది. తద్వారా కృత్రిమ కొరత సృష్టించి ప్రయాణికులను హడలెత్తించింది. ఆ వెంటనే టికెట్ల రేట్లను ఐదు రెట్లు పెంచేసింది. ఆర్టీసీ బస్సుల కోతతో హీనపక్షంగా 50 లక్షల మంది ప్రైవేటు బస్సులపై ఆధార పడతారని అనుకున్నా.. రానుపోను అంటే కోటి మంది దోపిడీకి ప్రైవేటు మాఫియా పథక రచన చేసింది. ఇందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్కు దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వంలో కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతి సీజన్లోనే ఆయనకు రూ.50 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ప్రయాణికులు రెట్టింపు కావడంతో ముడుపుల మూట కూడా రెట్టింపు చేసినట్టు సమాచారం. -
వీఆర్వోలపై టీడీపీ నేత హత్యాయత్నం
పెందుర్తి : విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతల దుర్మార్గాలు తారస్థాయికి చేరాయి. పెందుర్తి మండలం చింతగట్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఆ పార్టీ నాయకుడు.. అందులోని నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరు వీఆర్వోలు, ఆక్రమణ తొలగించేందుకు వచి్చన జేసీబీ, ఆపరేటర్పై రాళ్లు, రాడ్లతో ఆ పార్టీ సీనియర్ నేత చీపురపల్లి నరసింగరావు, అతని కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పెందుర్తి పోలీస్స్టేషన్లో నరసింగరావు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. చింతగట్ల రెవెన్యూ సర్వే నెంబర్ 57/1, 2లలో దాదాపు 20 సెంట్ల ప్రభుత్వ భూమిని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరుడు చీపురపల్లి నరసింగరావు ఆక్రమించి అందులో నిర్మాణాలు ప్రారంభించాడు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. విశాఖ జిల్లా జేసీ స్పందించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఐ.వెంకట అప్పారావును ఆదేశించారు. ఈ క్రమంలో నరసింగరావు వద్ద ఏమైనా పత్రాలుంటే తీసుకురావాలని అధికారులు కోరారు. దీనిని పెడచెవిన పెట్టడంతో ఆ నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా తహసీల్దార్ సిబ్బందిని ఆదేశించారు.వీఆర్వోలు నాగహనుమాన్ కుమార్ ధర్మేంద్ర కట్టడాలను తొలగించేందుకు సన్నద్ధమవుతుండగా నరసింగరావు, అతని భార్య చిన్నీ, కుమారుడు రాజేష్, ఇద్దరు వీఆర్వోలు, జేసీబీపైకి రాళ్లు రువ్వారు. రాడ్లు పట్టుకుని దుర్భాషలాడుతూ చంపుతామంటూ మీదకు దూసుకెళ్లారు. దీంతో వీఆర్వోలు, జేసీబీ ఆపరేటర్ పరుగులు తీశారు. వారి దాడిలో జేసీబీ ధ్వంసమైంది. ఘటనపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో నరసింగరావు 90 రోజుల రిమాండ్ అనుభవించినట్లు సమాచారం. ఘటనపై తహసీల్దార్ వెంకట అప్పారావు మాటా్లడుతూ.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించామని.. చట్ట ప్రకారం వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. -
జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏపీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.తహసీల్దార్, ఎస్ఐలతో తనిఖీ బృందాలుసంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.కోడి పందేలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవసరమైతే 144 సెక్షన్ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉపయోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయవచ్చు’’ అని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. -
దుర్గగుడిలో మరో ఘోరం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా శనివారం వెలుగులోకి వచి్చంది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్ గ్రూప్లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది.ఆలయ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై దేవస్థాన స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఓ విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ), ఏఈఓలు, సూపరింటెండెంట్లతో కలిపి మొత్తం ఐదుగుర్ని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ శ్రీ చక్ర నవావరణార్చన పూజ జరిపించిన అర్చకుల నుంచి వివరాలను అడిగి నమోదు చేసుకుంది. నివేదికను దేవదాయ శాఖ కమిషనర్కు అందజేయనున్నట్లు ఆలయ ఈఓ శీనా నాయక్ తెలిపారు. ప్రొవిజన్స్ స్టోర్స్లో తనిఖీలు.. ఇక పూజలో ఉపయోగించే పాలలో పురుగుల ఘటనపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆలయ ప్రొవిజన్స్ స్టోర్స్లో తనిఖీలు చేపట్టారు. దేవస్థానానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, పరిపాలనా విభాగం ఏఈఓ వాసు స్టోర్స్ సిబ్బందిని ఆరా తీశారు. టెట్రా ప్యాకెట్ల పాల సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి అభిషేకాలు, పూజలు, మల్లేశ్వరస్వామి వారి అభిషేకాలకు వినియోగిస్తున్న టెట్రా ప్యాకెట్లలోని పాలను తనిఖీ చేశారు. పురుగులున్న ప్యాకెట్ ఏ బ్యాచ్కు చెందినది? పాలు వినియోగించాల్సిన గడువు తేదీ వంటి అంశాలను రికార్డు చేసుకున్నారు. దేవస్థానంలో ప్రతీరోజు నాలుగు లీటర్లకు పైగా ఆవు పాల వినియోగిస్తుండగా, అవన్ని టెట్రా ప్యాకెట్ల రూపంలోనే సరఫరా అవుతున్నట్లు ఆలయ సిబ్బంది అధికారులకు తెలిపారు.ఆలయ గోశాల తరలింపు పర్యవసానమేనా..!?నిజానికి.. అమ్మవారి ఆలయంలో పూజలు, అభిషేకాల నిమిత్తం అవసరమైన ఆవుపాల కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోనే గోశాలను నిర్వహిస్తోంది. అందులో నాలుగు గోవులను ఓ వ్యక్తి సంరక్షించే వారు. అయితే, ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీయగా, దాని పర్యవసానమే ఇప్పుడు తెలుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాలకు ముందు భక్తుల భద్రత పేరుతో ఆలయ గాలి గోపురం, లక్ష్మీగణపతి విగ్రహాల వద్ద ఉన్న గోవులను కానూరులోని వేద పాఠశాల ఆవరణలోకి తరలించారు. అప్పటి నుంచి ఆవుపాల కోసం దేవస్థానం టెట్రా ప్యాకెట్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గో సంరక్షణ పేరుతో భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సైతం సేకరిస్తోంది. -
ఆగిన బ్లోఅవుట్
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5న సంభవించిన భారీ బ్లోఅవుట్ మంటలను శనివారం ఉదయం 10.30 గంటలకు పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఆరు రోజుల శ్రమ ఫలించడంతో ఓఎన్జీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున మంటలు బాగా తగ్గడంతో నీరు చల్లుతూ సిబ్బంది వెల్ మౌత్ వద్దకు వెళ్లారు.పరిస్థితిని అధ్యయనం చేసి దెబ్బతిన్న భాగాలను తొలగించి.. బ్లోఅవుట్ ప్లగ్ను ప్రత్యేక క్రేన్తో వెల్కు అమర్చడంతో గ్యాస్ మంటలు పైకి వెళ్లడం ప్రారంభమైంది. అనంతరం ప్లగ్ ద్వారా గ్యాస్ లీకేజీని అదుపుచేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకున్న ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, రెస్క్యూ టీమ్ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం 12 గంటలకు వెల్ మూసివేత చర్యలలో భాగంగా ప్రత్యేక యంత్రాల ద్వారా బావిలోకి మడ్ పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు.ఇది సమష్టి విజయం ఇరుసుమండ బ్లోఅవుట్ను ఆరు రోజులు శ్రమించి సమష్టి కృషితో అదుపు చేశాం. సిబ్బంది, రెస్క్యూ టీమ్ అహర్నిశలూ శ్రమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పూర్తిస్థాయిలో సహకరించారు. ప్రస్తుతానికి బ్లోఅవుట్ ప్లగ్ వేసి మూసేశాం. వెల్ను కూడా మడ్తో మూసివేశాం. తరువాత చర్యలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. – శంతన్దాస్, ఓఎన్జీసీ ఈడీ–కం–అసెట్ మేనేజర్, రాజమహేంద్రవరంత్వరితగతిన మూసివేశాం బ్లోఅవుట్ మంటలను చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ చేశాం. ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది సాంకేతికతతో పనిచేశారు. ఘటన సంభవించిన నాటినుంచి ఈ రోజు వరకూ అలుపెరగకుండా పని చేశాం. – గాజుల శ్రీహరి, ఇన్చార్జి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ -
ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరి్థక ప్రయోజనం చేకూర్చే విధంగా సంక్రాంతిలోపు 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈనెల 20 నుంచి ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహించారు.ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలుగా మన ఊరుబడిని కాపాడుకుందామని.. అప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్న అధికార దర్పం, వ్యవహార శైలి మార్చుకోవాలని, బోధన కంటే బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల నాణ్యమైన విద్య అందించడంపై శ్రద్ధ వహించలేకపోతున్నారని అన్నారు. విద్యారంగంలోనూ పీపీపీపై ఆగ్రహం పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని మెడికల్ కళాశాలలతో పాటు విద్యారంగంలోనూ ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్లకు విద్యారంగాన్ని దోచిపెట్టడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించడంలో వైఫల్యంతో పాటు ప్రభుత్వ విధానాలతో సర్కారు బడుల నిర్వీర్యం, ఉపాధ్యాయులపై మోయలేని పనిభారం తదితర అంశాలకు నిరసనగా వందలాది టీచర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోండి
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ /అల్లిపురం/ఒంగోలు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణ మూర్తి తదితరులు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.ఇదే విషయమై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులతో కలిసి విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్కమల్కు ఫిర్యాదు అందజేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు.. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్తో కలిసి ఫిర్యాదు చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం యాంకర్, యాజమాన్యం రాధాకృష్ణ, చర్చలో పాల్గొని విషం చిమ్మిన విశ్లేషకుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం ఎయిర్పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వక్రీకరించాయి. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే. – కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, – అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడుఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం రామవరప్పాడు: విజయవాడ రూరల్ రామవరప్పాడు ఫ్లైఓవర్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన గేట్ వద్ద శనివారం వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏబీఎన్ డిబేట్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ జగన్పై విషం కక్కడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. -
పీఎస్ఎల్వీ సీ–62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ– 62 రాకెట్ ప్రయోగంతో 2026లో భారత్ శుభారంభం చేస్తుంది. నాలుగు దశల రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి ఎంఎస్టీ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి ప్రయోగసమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం మ«ద్యాహ్నం 12.17 గంటలకు కౌంట్డౌన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. సోమవారం ఉదయం 10.17 గంటలకు ప్రయోగం చేయనున్నట్టు ల్యాబ్ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 65వది కావడం విశేషం. పీఎస్ఎల్వీ–డీఎల్ అంటే రెండు స్ట్రాపాన్ బూస్టర్లు రాకెట్ వెర్షన్లో ఇది ఐదో ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ–62 రాకెట్ వివరాలు పీఎస్ఎల్వీ సీ–62 రాకెట్ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగంలో నాలుగుదశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధనంతో 112.06 సెకెండ్లకు పూర్తి చేయనున్నారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 107.86 సెకెండ్లకు శాటిలైట్కు రక్షణ కవచంగా ఉన్న హీట్షీల్డ్ విడిపోతాయి.అంటే మొదటి దశ ప్రయాణ సమయంలోనే విడిపోతాయన్నమాట. అనంతరం 41.8 టన్నుల ద్రవ ఇంధనంతో 263.36 సెకెండ్ల రెండోదశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 494.72 సెకెండ్లకు మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 984.62 సెకెండ్లకు నాలుగోదశను కటాఫ్ చేస్తారు. ఆ తర్వాత నాలుగోదశలో ద్రవ ఇంధన మోటార్తోనే 1074.62 సెకెండ్లకు (18.9 నిమిషాల్లో) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు.ప్రత్యేకతలు ఇవీ ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన ఈవోఎస్–ఎన్1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. మరో 10 సెకెండ్ల తర్వాత 14 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు. ⇒ అనంతరం పీఎస్–4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్దేశానికి చెందిన కిడ్ అనే పేలోడ్ను ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా డిజైన్ చేశారు. -
సోమశిల సందర్శనపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జి కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు. -
మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?
ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతా వని సిగ్గుతో తలదించు కోవాల్సిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వేసిన వీరంగం చూస్తే వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉండవేమోనన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేమి చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్పాత్లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు వీక్షకులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం అంటే కేవలం మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటానే అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్లో 93 బాటిళ్ల చొప్పున అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం.యువత భవితవ్యం ప్రశ్నార్థకంమద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు మళ్లుతోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలు ఇప్పుడు నగరాల శివార్లలోని ఫామ్హౌస్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. కేవలం మద్యం తాగడానికే పరిమితం కాకుండా, యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో కూరుకుపోతోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు మత్తులో జోగుతున్నారని తెలిస్తే వారి గుండెలు పగిలిపోవా?మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికత, సుశిక్షితులైన పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపించాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసు గులో గంజాయి సాగు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలుమరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి కూడా విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియో గానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎందుకు పాకులాడు తున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాల గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి?మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధాపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని ‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించడం దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి, మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కూడా అని గుర్తించాలి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..!
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు నేరుగా వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం కొనకంచి సమీపంలో జరిగింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇది చూసిన స్థానిక యువకులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని రక్షించారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై లు సూర్య శ్రీనివాస్ ,సాయి మణికంఠ సిబ్బందితో ప్రమాదస్థలిని కలిసి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సిపీఆర్ చేసి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులను హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి, సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. -
ఏపీలో 'రవితేజ, నవీన్' సినిమాలకు టికెట్ ధరలు పెంపు
సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రాలకు ప్రీమియర్ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా సింగిల్ స్క్రీన్స్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. -
ఇసుక దందాపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఇసుక దందాపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక దందా చేస్తున్నది తెలుగు దేశం పార్టీ వారే అంటూ నారాయణ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నెల్లూరు సిటీ టీడీపీ కోఆర్డినేషన్ టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరులో అక్రమ ఇసుక దందాపై ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారు. మామిడాల మధు, మస్తాన్ అయ్యా, మల్లీ జేసీబీలు పెట్టి టిపర్లతో ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో అయితే ఓకే.. టిపర్లతో ఇసుక తరలిస్తే సమస్య వస్తుంది. రాత్రి, పగలు టాక్టర్లతో కావాలంటే తరలించుకోండి.. టిపర్స్ వద్దు. టిప్పర్లను పోలీసులతో చెప్పి సీజ్ చేయిస్తున్నా అని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వైఎస్ జగన్పై అదే పనిగా వ్యక్తిత్వ హననం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావుఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, భోగాపురం ఎయిర్పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్ చేశాయి.జగన్పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్ జర్నలిజమ్ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తిరాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్గారిని నిందించాయి. జగన్ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు. -
దేవాలయాల్లో అపచారాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: కారుమూరి
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందేరం చేసే కుట్రలకు తెర తీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచి పెట్టేందుకు కేబినెబ్లో తీర్మానం చేశారు. మూడు వేల కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారుచౌకగా 25 కోట్లకు కట్టబెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు.దేవాలయాల పవిత్రను దెబ్బతీస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చూపిస్తే.. అలా చూపించిన వారిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో జరుగుతున్న ఘటనలకు ఏమని సమాధానం చెబుతుంది?. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీపై విషప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘కూటమి సర్కార్ అరాచకాలపై అలుపెరగని పోరాటం’
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి అన్నారు.సుధాకర్ బాబు మాట్లాడుతూ.. నేడు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదలు కొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ పని చేస్తోందని.. ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైఎస్ జగన్ ఒక్కరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారింది’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు.టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటం చేస్తాం’’ అని సుధాకర్బాబు చెప్పారు. -
‘బాబూ.. సీమకు ద్రోహం చేస్తారా.. బాధ్యత లేదా?’
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్ట్ విషయంలో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమకు ద్రోహం చేస్తూ మీడియా సమావేశాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేయడమేంటి?. నిజాయితీగా నీటిని అందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు కృషి చేయాలి. కూటమి నేతలు సవాల్ విసరడం బాగానే ఉంది కానీ పాలకులుగా మీకు బాధ్యత లేదా?. చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్కు మేము సిద్ధమే. రాయలసీమ ప్రాంతవాసులకు నీరు అందించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. -
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
రైల్వేస్టేషన్(విజయవాడ): తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్లాట్ఫాంలు కిటకిట.. సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కశాశాలలకు సెలవులు రావటంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకుంటుండటంతో అన్ని ప్లాట్ఫాంలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి, ఆరు, ఏడు ప్లాట్ఫాంలలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ, పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్కు వస్తుండటంతో ప్లాట్ఫాంలు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులలో చార్జీలు రెట్టింపు వసూలు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్ రైళ్లు నెలరోజుల కిత్రమే నిండిపోయి భారీగా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయింది. దీంతో రైల్వేఅధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.విజయవాడ మీదుగా 150 ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
‘ఆ ప్రాంతంలో అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?’
తాడేపల్లి : అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తన తందాన కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఆ కంపెనీల నుంచి 4 శాతం కమీషన్లు బాబు తీసుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. మొబలైజేషన్ అడ్వాన్స్లతో బాబు అండ్ కో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటైనా.. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు.. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. మేం అమరావతిని తక్కువ చేయలేదుతాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్లను ప్రశ్నిస్తున్నామన్నారు సజ్జల. ‘విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం. అమరావతిని వైఎస్సార్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. చంద్రబాబు బెదిరింపులు అరుపులు కాకుండా సూటిగా సమాధానం చెప్పాలి. గొంతెత్తి, కళ్లు పెద్దవి ేసి బెదిరిస్తే సమాధానం దొరకదు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాలిరాయలసీమ ప్రయోజనాలు ఎలా.?శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీలు వాడుకుంటుంది. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటుందే రాయలసీమ ప్రయోజనాలు ఎలా?, రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబ విఫలమయ్యారు. ఆర్గనైజ్జ్ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. చంద్రబాబు సైలెంట్ ఉండటం అంటే రేవంత్ చెప్పింది నిజమే అని అర్థం చేసుకోవాలివిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీవిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని సజ్జల విమర్శించారు. పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ అనేది వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఉందని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే అందులో దాపరికం ఎందుకని ప్రశ్నించారు. ‘లక్షా 80 కేజీల గోమాంసం విశాఖలో పట్టుబడితే ఏం చేశారు. క్వశ్చన్ చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వకుండా.. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. అధికారం వచ్చాక కూడా వారంలో మూడు, నాలుగు రోజులే బాబు ఇక్కడ ఉంటున్నారు. ప్రతివారం హైదరాబాద్లో చంద్రబాబు, లోకేష్లకు ఏం పని? అని నిలదీశార సజ్జల. చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందాంచంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందామన్నారు సజ్జల ‘ వైఎస్ జగన్ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. రూ. 3.30 లక్షల కోట్లలో రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు తిరగకుండానే రూ. 3 లక్షల కోట్లపైగా అప్పు చేశారు. చంద్రబాబ పాలనను ప్రజలు, విజ్ఞులు మేధావులు ప్రశ్నించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ బ్లోఅవుట్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది. దీంతో అక్కడికి ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది కాలిన వ్యర్థాలను తొలిగించారు. మంటలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.జనవరి 5న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో ఓఎన్జీసీ మోరి బావి5లో భారీ బ్లోఅవుట సంభవించింది. ఓఎన్జీసీ సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ ఎగజిమ్మింది. దీంతో పెద్దఎత్తున 100 మీటర్ల పైకి మంటలు లేశాయి. అగ్నికీలల తీవ్రత చూసి బెంబేలెత్తిపోయిన రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదం జరిగిన మోరి-5 నంబర్ బావి ఓఎన్జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. భద్రతాకారణాలు సరిగ్గా లేకపోవడంతో 12 ఏళ్లక్రితమే దీనిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించడంతో దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం మళ్లీ అక్కడే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పందెం కోడి కయ్యానికి రెఢీ..!
సంక్రాంతి వచ్చిందంటే..కోడి పందేల జోషే వేరు. పండుగ ముందుగానే బరులు సిద్ధమవుతాయి. పందెంకోళ్లు యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. శిక్షణ పొందిన కోళ్లు హోరా హోరీగా పోట్లాడుతాయి. ఊపిరి ఆగేదాక రక్తం చిందించి మరీ పోరాడతాయి.బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. పందేలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడి పందేలు ప్రత్యేకం. మూడు రోజుల ముందుగానే జిల్లాలో బరులు సిద్ధమయ్యాయి. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో కోడి పందేల నిర్వాహకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కత్తి కట్టి కదనరంగానికి దూకేందుకు కోళ్లను దువ్వుతున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతం, తీర ప్రాంతాలు, పశి్చమ ప్రకాశంలోని కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించనున్నట్లు సమాచారం. అధికార టీడీపీ నాయకులు బరులు తమ ఆ«దీనంలో ఉంచుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పల్లెసీమల్లో కోడి పందేల జోష్... జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతిసారి కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందేలు నిర్వహిస్తుంటారని వినికిడి. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు ముందుగానే బరులు సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, రాజుపాలెం, గవండ్లపాలెం, మడనూరు, రాజుపాలెం పట్టపుపాలెం, గుండమాల గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఒంగోలు మండలంలోని కరవది, గుండాయిపాలెం సముద్రం ఒడ్డున, చేజర్ల, పాతపాడు తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ మండలంలోని పాకల, పాత సింగరాయకొండ, ఊళ్లపాలెం, సోమరాజుపల్లి, జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు, పొన్నలూరు మండలంలోని కె.అగ్రహారం గ్రామాల్లో పోటాపోటీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. టంగుటూరు మండలంలోని కొణిజేడు, కొత్తపట్నం మండలంలోని రాజుపాలెం, గవళ్లపాలెం, సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామాల్లో జరిగే పోటీలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు అత్యధికంగా వస్తుంటారని చెప్పుకుంటున్నారు. చీమకుర్తి మండలంలోని తొర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అలాగే గుడ్లూరు సరిహద్దులోని రామాయపట్నం, కొండపి, సంతనూతలపాడు సరిహద్దుల్లోని మద్దలూరు వాగు ఒడ్డులో కోడి పందేలు నిర్వహించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో కోడి పందేలు పుంజుకుంటున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు మండలాల్లో కూడా అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ.... జిల్లాలో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. చీమకుర్తి రోడ్డు, దర్శి దగ్గర రాజంపల్లి, తాళ్లూరు, తూర్పు గంగవరం, కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామాల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కోడి పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఒక్కో కోడి రూ.10 వేల నుంచి లక్ష రూపాయలు విక్రయిస్తుంటారని సమాచారం. ఈ కోళ్లను కొందరు ఇళ్ల వద్దనే పెంచితే మరికొందరు మాత్రం పొలాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వీటికి బాదంపప్పు, పిస్తా, జీడిపప్పుతో పాటుగా కోడిగుడ్లు, మటన్ వంటి పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. అలాగే పందేలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.రూ.కోట్లలో పందేలు... జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేల్లో భారీగా చేతులు మారుతాయని ప్రచారం జరుగుతోంది. పందెంకాసిన దానికి రెట్టింపు లాభం వస్తుండడంతో బెట్టింగ్ రాయుళ్లు కొందరు అప్పులు చేసి మరీ పందెం కాస్తుంటారని ప్రచారం జరుగుతోంది. రెండు గ్రూపులను కలిపి జోళ్లు అని పిలుస్తుంటారని, జోళ్లు పందెం కాసినవాళ్లు లక్ష, రెండు లక్షల రూపాయలు కాస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి పోటీలకు నెల్లూరు, గుంటూరు నుంచి ఇక్కడకు వస్తుంటారని సమాచారం.నెమలి...అబ్రాస్...సీతువా... పందెం కోళ్లను చాలా మక్కువగా పెంచుతుంటారు. వాటికి ఖరీదైన ఆహారం ఇస్తుంటారు. అంతేకాకుండా ముద్దుగా నెమలి, అబ్రాస్, సీతువా వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కాకిడేగ, కక్కెర, రసంగి, పింగల, కాశీ, కొక్కెరాయి వంటి పేర్లతో పిలుస్తుంటారు. కత్తి కట్టి కదన రంగంలోకి... కోడి పందేల సమయంలో పందెం కోళ్లకు కత్తి కట్టి బరిలోకి దింపుతారు. హోరాహోరీగా జరిగే పోరులో ఓటమిపాలైన కోడి కత్తి గాయాలతో తీవ్రంగా గాయపడి మరణిస్తుంటాయి. వన్యప్రాణి ప్రేమికుల విజ్ఞప్తి మేరకు పందెం సమయంలో కత్తి కట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పట్టించుకునే వారు లేరు. సంప్రదాయం ప్రకారం సరదాగా కోడి పందెం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న నిర్వాహకులు దీన్ని ఫక్తు వ్యాపార ధోరణిలోనే సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పందెం కోళ్లకు కత్తులు తయారు చేసేవారున్నారు. నగరంతో పాటుగా అనేక మండలాల్లో కత్తులు తయారు చేస్తున్న సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పోలీసుల అనుమతి కోసం ఒత్తిళ్లు... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందేలు నిర్వహించుకోడానికి పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు విముఖంగా ఉండడంతో ప్రభుత్వ పెద్దల నుంచి చక్రం తిప్పేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయతి్నస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కోడి పందేలకు ఇలాగే అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఏడాది కూడా పోలీసుల అనుమతి ఇప్పించాలని అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కడప: మెడికల్ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది. .పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు రావడంతో పీపీపీ కింద ప్రైవేట్ పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగుల బదిలీ చేస్తోంది ప్రభుత్వం. వారిని పొమ్మనలేక పొగబెట్టినట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగుల బదిలీ చేసింది. తక్కువ జీతంతో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఈ బదిలీలు శరాఘాతంగా మారాయి. మరొకవైపు 600 మంది ఉద్యోగుల బదిలీతో ప్రశ్నార్థకంగా మారింది ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం. వైఎస్ జగన్ హయాంలో వారి నియామకం జరిగిందనే అక్కసుతోనే ఈ బదిలీలు అనే విమర్శ వినిపిస్తోంది. ఆయా మెడికల్ కాలేజీల నుంచి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు తరలింపు ఇప్పటికే జరిగిపోగా, ఇప్పుడు ఉద్యోగుల బదిలీ కార్యక్రమం చేపట్టింది కూటమి సర్కారు. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం బదిలీ చేస్తూ వస్తుంది. మరో వైపు పీపీపీ టెండర్లలో ఆయా మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు సంస్థలు ముందుకు రాకపోగా, బదిలీలతో పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
‘అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి’
విజయవాడ: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతుండటంపై వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ.. పవిత్రతను కాపాడటం లేదా ఈవో గారు అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు. ‘కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశ్రుతులు జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో వెంటనే శుద్ధి కార్యక్రమం చేపట్టాలి.వైదిక కమిటీ ఏం చేస్తుంది?, ఆలయంలో సెక్యూరిటీ ఏం చేస్తుంది? తనిఖీలు గాలికి వదిలేశారా? అని నిలదీశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు పోతిన మహేష్.పోతిన మహేష్ లేవెనెత్తిన అంశాలు..1. అమ్మవారి ఆలయంలో కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేయడం అమ్మవారికి చీకటిలోనే నైవేద్యం సమర్పించే దుస్థితికి చేరుకోవడం 2. అన్న ప్రసాదంలో పనిచేసే వర్కర్లకు రోజువారి వేతనం అన్నదాన సర్వీస్ కాంట్రాక్టర్ తక్కువగా చెల్లిస్తున్నారని ఆలయంలోనే ఆందోళన చేసిన సంఘటన 3. విశిష్ట పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగులు 4. అమ్మవారి గర్భగుడికి అతి చేరువలోనే కేక్ కటింగ్ కార్యక్రమం 5. ఒక అమ్మవారి ఆలయంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాల లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు మిగిలిన దేవాలయాల్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అధికారుల అవినీతి వలన అని స్పష్టంగా చెప్పగలం 6. అమ్మవారి ఆలయం లో కమిషనర్ గారు కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినా EO గారు కాంట్రాక్టర్ లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు స్టాండింగ్ కౌన్సిల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ కోర్ట్ వారికి నిజాలు తెలియజేయరా?7. తిరుమలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిసారి ఏదో ఒక అపశ్రుతి అపచారం జరుగుతూనే ఉంది మద్యం మాంసాహారం చెప్పులు వేసుకుని ప్రధాన ఆలయ ద్వారా వరకు వెళ్లడం తొక్కిసలాట ఘటనలు మరణాలు సంభవించడం అనేకం ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆలయ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మరీ రాజీనామా చేశారు అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యం తిరుమలలో అధికారుల అవినీతి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో హిందూ భక్తులు అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి:విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు కాకాణి చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. ఈరోజు (శనివారం) సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కార్యక్రమం రూపొందించారు. అయితే వారి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆనేతలను అక్రమంగా హౌస్ అరెస్టు చేశారు. అనంతరం వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం
విజయవాడ: దుర్గమ్మ వారి గుడిలో అధికారుల మరో నిర్లక్ష్యం బయటపడింది. విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. శనివారం( జనవరి 10వ తేదీ) ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులు క్యూలైన్లో ఉన్న సమయంలో విద్యుత్ షాక్ సంభవించింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దాంతో ప్రసాదం పంపిణీని విద్యుత్ లేకుండానే పంపిణీ చేశారు. అయితే గత 15 రోజుల నుంచి చూస్తే దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం వ్మవహరించడం మూడోసారి. డిసెంబర్ 27వ తేదీ పవర్ కట్ చేశారు. ఆపై నిన్న(శుక్రవారం, జనవరి 9వ తేదీ) శ్రీ చక్ర అర్చనలో ఆవు పాలలో పురుగులు కనిపించడంతో అర్చన నిలిపి వేయాల్సి వచ్చింది. ఆపై ఈరోజు(శనివారం,జనవరి 10 వ తేదీ) విద్యుత్ షాక్ చోటు చేసుకోవడం, కరెంట్ లేకుండానే ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. -
Hyd: సంక్రాంతి పండుగ రద్దీ షురూ..
హైదరాబాద్: సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రధానంగా నగరాలను నుంచి పల్లెలకు వెళ్లే జనం.. శుక్రవారం(జనవరి 9వ తేదీ) నుంచే క్యూకట్టేశారు. దాంతో హైదరాబాద్ బిజీబిజీగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. ప్రధానంగా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరొకవైప ఇప్పటికే పంతంగి టోల్ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు. సంక్రాంతి నేపథ్యంలో హైవే 65పై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.విజయవాడ వైపు టేకుమట్ల వద్దపాత డైవర్షన్ ఎత్తివేశారు. రాజమండ్రి-విశాఖ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్-గుంటూరు వెళ్లేవాహనాలు నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. నియంత్రణకు చర్యలు..సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.2 లక్షల మంది.. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతి రోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. లింగంపల్లి నుంచి 50 వేల మంది, నాంపల్లి నుంచి మరో 35 వేల మంది ప్రయాణం చేయనున్నట్లు అంచనా. దీంతో అన్నిచోట్లా అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో 17 టిక్కెట్ బుకింగ్ కేంద్రాలతో పాటు 20 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. తొక్కిసలాటకు తావివ్వకుండా.. రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా ఆరీ్పఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలను అందజేసేందుకు టీటీఈలను అదనంగా నియమించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా, ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. పరిమితంగా పికప్,డ్రాప్ సదుపాయం మాత్రం ఉంటుంది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు విశాలమైన పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.అదనపు ఏర్పాట్లు ఇలా.. పదో నెంబర్ ప్లాట్ఫామ్ గేట్– 2, గేట్– 4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు. రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘రైల్వన్’ యాప్ ద్వారా సాధారణ టికెట్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు 3 శాతం రాయితీ లభించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)
-
దరఖాస్తుతో.. దేవుడి భూములు!
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆ«దీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మీక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకు ఇవ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మీక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్కు కల్పించింది. లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ధార్మీక పరిషత్కు కల్పించింది. అయితే గతంలో దేవదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్దేశించడం గమనార్హంనిన్న ఆమోదం.. నేడు జీవో.. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల దేవుడి భూములను ఎలాంటి వేలం లేకుండా ధార్మీక సంస్థల పేరిట కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2025 మే 2వతేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత తుది మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా.. శుక్రవారం జీవో ఎంఎస్ నెంబరు 15 ద్వారా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే లీజు ధరలను సైతం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం. అధికారుల విచక్షణ మేరకు లీజు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు... రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో ఆలయాలు, సత్రాలు, మఠాలు పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో 4,244 ఎకరాల మేరకు అత్యంత విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. వీటిలో 1.55 కోట్ల చదరపు గజాలు ఖాళీ భూములుగానూ, మరో 50 వేల చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి. -
బిగిసిన సంకెళ్లకు బెదరని పిడికిళ్లు
గాందీనగర్(విజయవాడసెంట్రల్)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్)/నరసరావుపేట/కర్నూలు(సెంట్రల్): ఉక్కు సంకెళ్లు బిగిసినా సంకల్పం సడలలేదు. పిడికిలెత్తిన విద్యార్థిలోకం బెదరలేదు. సర్కారు తీరుపై గళమెత్తి గర్జిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగ పాలనపై సమరభేరి మోగిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నినదించారు. అక్రమ కేసులపై కన్నెర్రజేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నేతలపై రౌడీషిట్లు ఓపెన్ చేసి, అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండించారు. శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నల్లరిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజేంద్ర బాబు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీషీట్లు తెరిచి అక్రమ ఆరెస్ట్లకు పాల్పడడం తగదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ‘మెగా డీఎస్సీ’, ‘జాబ్ క్యాలెండర్’, నిరుద్యోగభృతి ‘ఫీజు రీయింబర్స్మెంట్’ హామీలను అమలు చేయాలని కోరడం నేరమా! అని ప్రశ్నించారు. విశాఖలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, పార్టీ యువజన విభాగం నేతలు పాల్గొన్నారు. ⇒ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ⇒ పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ నేతలు పాల్గొన్నారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలని.. లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలైనా ఇవ్వాలంటూ విద్యార్థి, యువజన సంఘాల వేదిక కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టింది. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోమన్న, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ పాల్గొన్నారు. -
ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికే పీపీపీ
సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని ఎంచుకున్నారని మే«ధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో నిరి్మంచిన ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతూ ప్రపంచంలో ఎన్నడూ చూడని అతిపెద్ద స్కామ్కు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నాచౌక్లో సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షకు భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. దీక్షలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని, ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, ఎన్.తులసిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పానుగంటి చైతన్య, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు మద్దతు తెలుపుతున్న నాయకులు 100కి 150 శాతం తప్పుడు నిర్ణయం గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు చేపట్టింది. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు 10 కళాశాలలు ప్రైవేట్కు ఇస్తామనడం 100కి 150 శాతం తప్పుడు నిర్ణయం. కళాశాలలు ప్రభుత్వరంగంలో ఉంటే దానికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. – వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వినర్ మోసగాడినేనని నిరూపించుకుంటున్న లోకేశ్ గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానం తెస్తే తీవ్రంగా ఖండించిన లోకేశ్.. తాము అధికారంలోకి రాగానే రద్దుచేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం కళాశాలలనే ప్రైవేట్కు ఇచ్చేస్తున్నారు. తండ్రిలాగా తాను కూడా మోసగాడినే అని లోకేశ్ నిరూపించుకుంటున్నారు. – విజయ్కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రభుత్వం ప్రైవేట్కు ఇస్తున్న 10 వైద్యకళాశాలలు ఉన్న ప్రాంతాల్లో ఏడు అత్యంత వెనుకబడినవే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని విరమించుకోవాలి. దీనిమీద ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. – కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్నే ప్రైవేట్కు ఇచ్చేయ్ 18 నెలల నుంచి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు చేస్తోంది. అన్నింటికి అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్యకళాశాలల కోసం రూ.3 వేలకోట్ల నుంచి రూ.4 వేలకోట్లు ఖర్చు చేయలేరా? ఎవరైనా ప్రశ్నిస్తే ప్రైవేట్ వ్యక్తులయితేనే కళాశాలలు మెరుగ్గా నిర్వహిస్తారని చెబుతున్నారు. అలాగైతే మొత్తం ప్రభుత్వాన్నే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేయండి. వాళ్లే బాగా ప్రభుత్వాన్ని నడుపుతారు. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శిబాబు ప్రభుత్వానికి శరాఘాతం పది వైద్యకళాశాలలను ప్రైవేట్పరం చేయాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వానికి శరాఘాతం అవుతుంది. రాష్ట్రంలో వైద్య శాఖ నిరీ్వర్యం అయిపోయింది. రెండేళ్లు తిరగకుండానే రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు వైద్యకళాశాలలకు నిధుల్లేవంటున్నారు. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడుచంద్రబాబు తగ్గకపోతే ప్రజలే ఆయన్ని తగ్గిస్తారువైద్యకళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు తగ్గకపోతే 2029లో ప్రజలే ఆయన్ని తగ్గిస్తారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం భవిష్యత్లో రాజ్యాంగంపైనా ప్రభావం చూపుతుంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. – జి.ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిపార్టీలకు అతీతంగా ఉద్యమించాలి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి పాడిగేదెలాగా మార్చే నీచమైన ఆలోచన కలిగిన నాయకుడు చంద్రబాబు. ఆయన ఆలోచన మార్చుకునే వరకూ ప్రజలందరు ఉద్యమం చేయాలి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతదానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు ఇవ్వడంపై ప్రశి్నస్తే 99 పైసలకు భూములు ఇచ్చేస్తా మీరెవరు అడగానికి అని లోకేశ్ అంటున్నారు. ఉచితంగా దానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు. అంతలా దానం చేసుకోవాలని ఉంటే హెరిటేజ్, ఇంకా సొంత ఆస్తులను దానం చేసుకోవాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిప్రపంచంలో ఎక్కడా చూడని కుంభకోణం ప్రభుత్వ రంగంలోని 10 వైద్యకళాశాలలను ప్రైవేట్కు దోచిపెడుతున్న ఇలాంటి కుంభకోణాన్ని ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండం. సంవత్సరానికి రూ.రెండువేల కోట్ల చొప్పున మూడేళ్లు ఖర్చుచేస్తే కళాశాలలన్నీ ప్రభుత్వరంగంలోనే అందుబాటులోకి వస్తాయి. – వి. లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోంది. ఆ భూములను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోంది. దాన్ని సమర్థించుకునేందుకు మంత్రి లోకేశ్ 99 పైసలకే కార్పొరేట్లకు భూములిచ్చేస్తా... మీకేంటి ఇబ్బంది? అని బరితెగించి మాట్లాడుతున్నారు. రైతుల పొట్టకొట్టి బలవంతంగా లాక్కున్న పంట భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా?’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథంతో కలిసి ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.గతంలో తాము ఎవరికీ ఉచితంగా భూములు ఇవ్వలేదని లోకేశ్ చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు మార్కెట్ రేటుకే భూములు ఇస్తున్నామని, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలకు భూములిచ్చారో లెక్కలతో సహా వెల్లడించారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పడం బరితెగింపేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి ఆస్తి? ఎవరికి 99 పైసలకిస్తారు? అలా ఇవ్వడానికి లోకేశ్కు ఏం హక్కుంది? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ రీజనల్ డెవలప్మెంట్ పేరుతో స్టీల్ ప్లాంట్ భూముల మళ్లింపు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అంటూ నీతి ఆయోగ్ ఓ రిపోర్టు తయారు చేసిందని, దానిలో విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 2,500 ఎకరాలను నక్కపల్లిలో పరిశ్రమలు పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించండి... అని స్పష్టంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. భూములను ఇష్టానుసారం ఇస్తున్నారని ప్రశ్నించినందుకు సీపీఎం నాయకుడు అప్పలరాజును తీసుకెళ్లి డిటైన్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పలరాజుపై కేసు లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు... ఎవరినీ కలవనీయడం లేదని ధ్వజమెత్తారు.ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి, ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించి రైతుల భూములను లాక్కుంటారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘సీపీఎం నాయకులు వేరేవారి స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి లోకేశ్ ఆరోపించడం సరికాదు. గత ప్రభుత్వంపై మేం పోరాటాలు చేస్తే ఒప్పు.. ఇప్పుడు మీ తప్పులను నిలదీస్తే తప్పా?’ అని లోకేశ్ను శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొత్త ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు ర్యాలీల ద్వారా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ నెల 14న కొత్త ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
విశాఖలో మరో ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే విశాఖలో విలువైన భూములను లులు, సత్వా, కపిల్ చిట్స్ వంటి సంస్థలకు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చిరునామాగా మారిన ఎండాడలోని భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తోంది. ఎండాడ సర్వే నంబర్–1లో ఉన్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ)కు చెందిన భూమిని హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం పేరిట ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తోంది.సుమారు 2,500 చదరపు గజాల విస్తీర్ణంలో జీ+5 నుంచి జీ+10 అంతస్తులు ఉండే విధంగా హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీటీపీసీ బిడ్లను ఆహ్వనించింది. 33 ఏళ్ల కాలానికి లీజు విధానంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బీవోటీ) విధానంలో నిరి్మంచడానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వనించింది. కాలపరిమితి తీరిన తర్వాత ఏపీటీపీసీ సమ్మతి మేరకు లీజును పొడిగిస్తామని టెండరు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆసక్తిగల సంస్థలు ఈ నెల 19లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. కారుచౌక బేరం ప్రస్తుతం ఎండాడ ప్రాంతంలో వాణిజ్య భవనాల అద్దె చదరపు అడుగు రూ.40పైనే పలుకుతోంది. ఇప్పుడు ఏపీటీపీసీ అభివృద్ధి చేస్తున్న 2,500 చదరపు గజాలు అంటే 22,500 అడుగుల విస్తీర్ణానికి తక్కువలో తక్కువ ఎంత కాదన్నా నెలకు రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అద్దె లభిస్తుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమికి కనీస అద్దెను రూ.4 లక్షలుగా నిర్ణయించింది. రూ.4 లక్షలకుపైన ఎవరు ఎక్కువకు కోట్చేస్తే వారికి ఈ స్థలాన్ని అప్పగిస్తారు.నిర్దేశించిన ధర కంటే ఎక్కువ కోట్చేసిన మొత్తంపై ఏడాదికి 3 శాతం రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభివృద్ధి చేసిన స్థలంలో 10 శాతం ఏపీటీపీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని, రెండు నుంచి నాలుగు కార్లకు పార్కింగ్ సదుపాయం కలి్పంచాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. రూ.15 కోట్ల కనీస నెట్వర్త్ కలిగి, గత మూడేళ్లుగా ఏడాదికి కనీసం రూ.7 కోట్లపైన వ్యాపారం చేస్తున్న సంస్థలు బిడ్డింగ్లో పాల్గొనడానికి అర్హతగా నిర్ణయించారు. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతరు.. బాబు కోసం బరితెగింపు
ఈ కేసులో చంద్రబాబు కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారే తప్ప తాను అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదు. సెక్షన్ 17(ఏ)ను ఉటంకిస్తూ ఈ కేసు తనకు వర్తించదన్న చంద్రబాబు వాదన సరికాదు. నిజాయితీపరులైన అధికారులను రక్షించడానికి సెక్షన్ 17(ఏ) ఉద్దేశించిందే తప్ప.. అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదు. ఈ దృష్ట్యా ఈ కేసును కొట్టివేయలేము. – జస్టిస్ బేలా త్రివేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిసాక్షి, అమరావతి: చంద్రబాబే నిందితుడిగా, చంద్రబాబే పోలీసుగా సాగుతున్న పచ్చ నాటకం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న కుట్ర దేశంలో కొత్త దుస్సంప్రదాయానికి తెరతీస్తోంది. చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి బాగోతాన్ని అడ్డగోలుగా మూసి వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ బరితెగింపు విస్మయ పరుస్తోంది. చంద్రబాబు కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేత కోసం సీఐడీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది.న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంపై న్యాయ నిపుణులే విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసు అడ్డగోలు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పిటిషన్పై విచారణ, తదుపరి పరిణామాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లను ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేశాయన్నది గమనార్హం. ఈ అవినీతి కేసు దర్యాప్తు, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఆ మూడు న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా ఆధారాలు.. కొట్టేయడం కుదరదు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత సమరి్పంచిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిది. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగానే ఆయనకు బెయిల్ మంజూరైంది.కాగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిచినా ఆయనకు చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన వాదనను హైకోర్టు తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగానే స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపునకు అనుమతిచ్చానన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చిది. ప్రజాధనాన్ని స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులను విచారించి, నాలుగు వేల డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే దొంగాట చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ను అర్ధంతరంగా మూసివేతకు కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలకు విరుద్ధంగా కుట్రకు తెగబడుతోంది. వాస్తవానికి స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై కేసు నమోదు, విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సీఐడీకి అనుమతినిచ్చిది. అనంతరమే సీఐడీకి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు.కానీ సీఐడీ మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ’ ముసుగులో కేసును మూసి వేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారి బాధ్యుడు అవుతారు. ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నింది. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సీఐడీ అధికారులు బరితెగించారు. ఆ అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఈ కేసు మూసివేత వ్యవహారంలో ఏపీఎస్ఎస్డీసీ పూర్వ ఎండీ, ప్రస్తుత ఎండీ పరస్పర భిన్న వాంగ్మూలాలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఎండీగా వ్యవహరించిన బంగార్రాజును ప్రభుత్వ పెద్దలు తమదైన శైలిలో బెదిరించి లొంగ దీసుకున్నారు. దాంతో ఈ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. కాగా ప్రస్తుత ఎండీ గణేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఆయన తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.అంతే కాకుండా న్యాయపరంగా నిబంధనలను పాటించడంతోపాటు.. ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంటే కేసు మూసివేయవచ్చని.. అందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పలేదు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అంటే సీఐడీ నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెబితే తాను భవిష్యత్లో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే ఈ కేసు మూసివేత ప్రతిపాదనను ఆయన సమర్ధించ లేదు. అడ్డగోలుగా మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న ఆతృతలో సీఐడీ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారును పక్కన పెట్టేసి, తమ గుప్పిట్లో ఉండే అధికారుల ద్వారా కుట్ర కథ నడుపుతోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి సీఐడీ కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చింది. కాగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసు మూసివేత ప్రక్రియలో అజయ్ రెడ్డిని విస్మరించింది.అప్పటి ఎండీగా ఉన్న బంగార్రాజు ద్వారా పావులు కదుపుతోంది. కేసు మూసివేతపై అభ్యంతరం ఉందా లేదా తెలపాలని సీఐడీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన్ను ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం జరిగిపోయింది. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథకు పన్నాగం పన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ కుట్రను అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి తిప్పి కొట్టారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారు తానే అని, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు స్కిల్ కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ను దాఖలు చేశారు. కమీషన్లు దండుకున్న వారు అరెస్టు.. కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా!? స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విస్మయ పరుస్తోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉండీ.. కొల్లగొట్టిన నిధుల్లో కమీషన్లు దండుకున్న వారిని ఈడీ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది.ఈడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కుంభకోణం సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబుపై కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా మూసి వేస్తుందని నిపుణులు ప్ర శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార దురి్వనియోగానికి పాల్పడి, లేని ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఆయనే. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధుల జారీకి ఆదేశాలు జారీ చేసిందీ చంద్రబాబే. కొల్లగొట్టిన నిధుల్లో సింహ భాగం ఏకంగా రూ.271 కోట్లు చంద్రబాబు ప్యాలస్కే చేరాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబుపై కేసును తొలగించడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఐడీ క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి ⇒ స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు, ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ⇒ ఈ కుంభకోణంలో ఆధారాలున్నందునే చంద్రబాబుపై కేసు.. రిమాండ్ ⇒ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురు ⇒ చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర ⇒ అసలు ఫిర్యాదుదారుడినైన నాకు నోటీసు ఇవ్వలేదు ⇒ ఇలా నోటీసు ఇవ్వక పోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం ⇒ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లోనూ నేను పార్టీగా ఉన్నాసాక్షి అమరావతి : స్కిల్ డెవలప్మెంట్æ కార్పొరేషన్ కుంభకోణంలో ఫిర్యాదుదారునైన తనకు తెలియకుండానే కేసును మూసి వేయడానికి వీల్లేదని ఆ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం కేసుని మూసివేసేందుకు సీఐడీ, ప్రాసిక్యూషన్, నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని అయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై కేసును మూసి వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు. ఈ కుమ్మక్కు కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడు 37వ నిందితుడిగా ఉన్నారని చెప్పారు.ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో సీఐడీ ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిందని, ఆ మరుసటి రోజు అంటే 2023 సెపె్టంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్కు పంపిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైందన్నారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు బెయిల్ పొంది బయటకు వచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ప్రస్తుత దర్యాప్తు అధికారి నిందితులతో కుమ్మక్కై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారు అయిన తనకు విచారణ పురోగతి గానీ, క్లోజర్ రిపోర్ట్ దాఖలు గురించి గానీ తెలియజేయలేదన్నారు.ఇది మీనూ కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అని తెలిపారు. ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కేసు మూసివేతకు ఇఐఈ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్, నిందితులు కలిసి కుట్ర పన్నారు. ఎఫ్ఐఆర్ లో కాలమ్ 6లో ఫిర్యాదుదారుగా నా పేరు స్పష్టంగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లో కూడా నేను పార్టీగా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసి వేసేందుకు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ముందుగా నాకు నోటీసు ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశించండి. ఆ క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ సందర్భంగా నా వాదనలు వినాలి’ అని అజయ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్పై ఏం జరగనుంది.. సర్వత్రా తీవ్ర చర్చస్కిల్ స్కామ్ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న సీఐడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజయ్రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణ కేవలం స్కిల్ స్కామ్ కేసుపైనే కాదు.. భవిష్యత్లో ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులపై కూడా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం. అందుకే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం 40 మందికిపైగా సాక్షులను విచారించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వారు చెప్పిన సాక్ష్యాలు, నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ఎఫ్ఐఆర్లు, చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఏకంగా నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లలో పేర్కొన్న విషయాల్లోని ప్రామాణికతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో పాల్పడిన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసి వేయడం ఒక దుస్సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే జరిగితే మునుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బరితెగించి అవినీతికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు, విచారణ కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ.3,300 కోట్లుగా నిగ్గుతేల్చిన సీఐడీ2014–19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. రూ.370 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది. అంతిమంగా ఈ కుంభకోణం విలువను రూ.3,300 కోట్లుగా తేల్చింది. అటు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. స్కిల్ కుంభకోణం నిధులను నిందితులందరూ కలిసి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ తేల్చింది.స్కిల్ కుంభకోణం కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, చంద్రబాబు నాయుడిని 2023 సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమరి్పంచింది. సాక్షుల వాంగ్మూలాలను సైతం కోర్టుకిచ్చిది. చంద్రబాబును రిమాండ్కు పంపాలని కోరింది. 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం మొదలు నిధుల మళ్లింపు వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచింది.చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేవలం మూడు రోజుల లోపే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే స్కిల్ కుంభకోణంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కూడా కోరారు. చంద్రబాబు పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేస్తూ 2023 సెపె్టంబర్ 22న తీర్పునిచ్చిది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, అలాగే 4,000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దర్యాప్తు విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సీమెన్స్కు నిధుల చెల్లింపుల నిర్ణయాన్ని అధికారిక విధుల్లో భాగంగానే తీసుకున్నానన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసి పుచ్చిది. పబ్లిక్ సర్వెంట్ ప్రజాధనాన్ని తన స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని తేల్చి చెప్పింది. కేసు కొట్టివేతకు సుప్రీం నిరాకరణఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాలు చేశారు. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరించారు.అయితే ఇరువురు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు కుమ్మక్కుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమరి్థస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు నిరాకరించారు. సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా, అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. సెక్షన్ 17(ఏ)ను నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే తప్ప, అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు.స్కిల్ స్కామ్లో అసలు దోషి బాబే ఆధారాలతో నిగ్గు తేల్చిన ఈడీ, సీఐడీ⇒ దాచాలన్నా చంద్రబాబు అవినీతి బాగోతం దాగేది కాదు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అనే పేరుతో కుట్రకు తెరతీశారు. కానీ స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనని ఇప్పటికే ఈడీ, సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చాయి. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో సమరి్పంచిన రిమాండ్ నివేదికలో సిట్ వెల్లడించింది. ⇒ జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.370 కోట్ల ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. లేని ఈ ప్రాజెక్టును కాగితాలపై చూపించి.. సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ⇒ నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపునకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 13 నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేసి ఈ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారు. అలా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చారు. ⇒ 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయట పడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చిది. ⇒ సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. కొల్లగొట్టిన అవినీతి సొమ్ములో రూ.77.37 కోట్లను హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిల్లోని టీడీపీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా నిధులను డిపాజిట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో బట్టబయలైంది. ⇒ ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్ïÙట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా ఎవరూ చెప్పక పోవడం గమనార్హం. ⇒ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. ⇒ రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. -
'చిరంజీవి' సినిమా.. టికెట్ ధరల పెంపునకు అనుమతి
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. -
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్ బుక్లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన. జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్ బుక్కులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా. చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్ ఇంజిన్ సర్కార్తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదారాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. -
చరిత్ర మిమ్నల్ని క్షమించదు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన.. అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.మరో వైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైఎస్ జగన్కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైఎస్ జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..తప్పును సరిదిద్దుకోని చంద్రబాబు..కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు అత్యంత దుర్మార్గం.ఈ తరహా వార్తలు రాసే వారు ముందు పూర్తిగా అవగాహన కలిగించుకుని.. జరుగుతున్న నష్టాన్ని తెలియజేయాలే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని కనీసం అంచనా వేయడం లేదు. కేవలం వైయస్సార్సీపీ, వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పుదోవ పట్డిస్తూ అసత్యాలు ప్రచురించడం శ్రేయస్కరం కాదు.మచ్చుమర్రి సహా ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ చలువే..మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కింద స్థాయిలో నీళ్లు తోడేస్తున్న నేపథ్యంలో.. 834 అడుగులకి చేరడం కష్టం అవుతుంది కాబట్టి.. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డే కేసీ కెనాల్కు, హంద్రీనీవాకు వేసవిలోనే, తాగునీరు ఇచ్చేందుకు మచ్చుమర్రికి జీవో ఇచ్చారు. మచ్చుమర్రి పనులు ప్రారంభమైన తర్వాత అందులో నాలుగు పంపులుకే సీ కెనాల్కు, మిగిలిన పంపులు హంద్రీ నీవా ద్వారా జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.అవేవీ తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి క్యూసెక్కులుకు, టీఏసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. 790 అడుగుల్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు 0.31 టీఎంసీ సామర్ధ్యం అంటే దాదాపు 3వేల క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది. దాన్ని 3 టీఎంసీలు అని మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచురించారు. దాదాపు 33 వేల క్యూసెక్కులు వస్తే తప్ప... 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు, అది కూడా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం ముచ్చుమర్రి ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండూ సేమ్ అన్నట్టు వార్తలు రాశారు.సీమకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం..చంద్రబాబుకి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంతగా... అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ఆయన ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆయను రాలేదు. మల్లెల, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పోతిరెడ్డుపాడు, ముచ్చుమర్రి, గండికోడ, తెలుగుగంగ ముందుకు తీసుకెళ్లే యోచన, హంద్రీనీవా చేపట్టే ఆలోచన కానీ, చివరకు పోలవరాన్ని చేయాలన్న తలపు కూడా మీకు లేదు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్టులు, నెల్లూరుకు చెందిన సోమశిల, నెల్లూరు బ్యారేజీ ఈ ప్రాజెక్టులు వేటి మీద మీరు ఆలోచన చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి,కొత్త రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసానని చెప్పుకోవడానికి తప్ప... రాయలసీమకు, రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్న తపనతోనే..మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు సమానమని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు 825 అడుగులులోపే 8 టీఎంసీలు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి... రాయలసీమలో కూడా వ్యవసాయానికి మేలు చేస్తూ.. స్టెబిలైజ్ చేయడానికి వాళ్లతో పాటు మనకూ సమాన అవకాశం ఉంటే భవిష్యత్తులో కలిసి నీటిని పంచుకునే ఆవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. మీరు మాత్రం ఆ ప్రాజెక్టును బలహీనపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ ను అర్ఱం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరగకూడదనే..శ్రీశైలం రిజర్వాయర్ పుల్ లెవల్ కి రావాలంటే ఎన్ని క్యూసెక్కులు నీళ్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా నీళ్లు రాని పరిస్ధితులలో ఎగువనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి ఎస్ ఎల్ బీ సీ, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తెలంగాణా 820 అడుగులు లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మరీ అన్యాయంగా 780 వరకు పవర్ జనరేషన్ కోసం 4 టీఎంసీలు రోజూ కిందకు వదిలేస్తున్నారు.ఇవన్నీ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నీటి ప్రవాహం తక్కువగా 70వేలు, 80 వేలు క్యూసెక్కులు వచ్చినప్పుడు ఒకేసారి వాళ్లు 8 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మనకు అదే లెవల్ లో 3 టీఎంసీలు కెపాసిటీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంతిమంగా అన్ని ప్రాంతాలు బాగుంటాయి. కానీ చంద్రబాబు గారూ మీకు ఆ ఆలోచన లేదు.పోలవరాన్నీ నిర్వీర్యం చేసిన చంద్రబాబు..ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో వైయస్సార్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం కట్టకుండా అడ్డుకుని బలవంతంగా లాక్కుని ప్రాజెక్టుని అవినీతి మయం చేశారు.కాపర్ డ్యామ్ మందు కట్టి.. నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే నాణ్యతతో వచ్చేది. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టడంతో కాపర్ డ్యాంలో నీళ్లు ప్లో అరికట్టలేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పోలవరం ఆలస్యమయ్యేలా చేసింది మీరు కాదా చంద్రబాబూ?దివంగత నేత వైయస్సార్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆ తర్వాత వైయస్.జగన్ హయాంలో ప్రాజెక్టు నిధులు, ఆర్ అండ్ ఆర్ కోసం కేంద్రాన్ని ఒప్పించి జీవో సైతం విడుదల చేయించి, స్పిల్ వే సహా నిర్మాణం చేపట్టారు. మీ అనాలోచిత నిర్ణయం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు. మీ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారకులయ్యారు. కమిషన్ల కోసం మీ కక్కుర్తే ఇందుకు కారణం. 3 వేలకు 33 వేల క్యూసెక్కులకు తేడా తెలియదా?మచ్చుమర్రి చంద్రబాబు చేశాడు.. దాని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న పత్రికలు అసులు ఆ ప్రాజెక్టు జీవో ఎప్పుడు వచ్చిందో చూడాలి. దానిలో ఎంత నీరు తీసుకోవచ్చో చూడండి. 834 అడుగులు వద్ద మల్లెల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే... మచ్చుమర్రికి మాత్రం 790 అడుగుల వద్ద కేవలం 0.31 టీఎంసీ అంటే 3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే 33 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. ముచ్చుమర్రి అనేది కేసీ కెనాల్, హంద్రీనీవాకు సమాంతర కాలువ ఉంది. అదే రాయలసీమ లిఫ్ట్లో 33 వేల క్యూసెక్కుల కోసం జరిగిన కాలువలు ఎలా ఉన్నాయి?పనులెంత జరిగాయో చూడండి? నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత 33వేల క్యూసెక్కుల నీరు పోవడానికి కాలువలు ఉండాలి. ఈ కాలువలు కూడా పోతిరెడ్డిపాడు దాటిన తర్వాత బనకచర్ల క్రాస్ ముందు కలుస్తుంది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్లాస్ వరకు ఉన్న కాలువ కూడా 80వేలక్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా కాలువలు వెడల్పు చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టు చేసినప్పుడు.. హంద్రీనీవా స్థాయిని పెంచాలని కాలువల సామర్ధ్యం 3300 క్యూసెక్కులుంటే దాన్ని 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా వెడల్పు చేశారు.ఉద్యమానికి సిద్ధమైన రాయలసీమ..విధ్వంసం చేయాలన్న ఆలోచనే మీది. ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఖరీఫ్ లో వేగంగా నీళ్లు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఇక్కడ రైతుల పంటలను కాపాడ్డం కోసం, వాళ్లు కూడా సరైన సమయంలో పంటలు పెట్టుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ పని జరుగుతుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ గుండె చప్పుడు. దయచేసి ఈ ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు కూడా హేళనగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ, అమరావతి, గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతం ఏదైనా రైతులందరూ బాగుండాలన్నదే మా విధానం.మేం రైతుల పక్షాన నిలబడతాం. ఇవా అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా, గుంటూరు రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్చి ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్మాణ పనులు మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అంతే తప్ప కేవలం వ్యక్తిగత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరైన విధానం కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పనిచేస్తోంది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు. ఉప్పెనలా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాయలసీమ నుంచి చంద్రబాబు తరలించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.రాజధాని పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..దీంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ మరలా రాజధాని అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అక్కడ రైతులకు మంచి జరగాలన్నదే మా విధానం. తొలివిడతలో రాజధానికి భూమిలిచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన ఓరైతు మంత్రి సమక్షంలో గుండాగి చనిపోయారు. వారికి అండగా నిలబడాలన్నదే మా విధానం. వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండో విడత భూసేకరణకు వెళ్లడాన్ని మేం తప్పుపడుతున్నాం.దయచేసి రాజకీయ కోణంలో విమర్శలు చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ను రద్దు చేయడం ముమ్మాటికీ తప్పు. ఏడాదిలోగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి.. తక్షణమే పూర్చి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి చేస్తుందన్ని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలను మాత్రం అబద్దాలతో తప్పుదోవపట్టించొద్దని హెచ్చరించారు. అలా చేస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులను చరిత్ర క్షమించదని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
సాక్షి, తిరుపతి: టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బాలాజీనగర్ ఫ్లాట్ నంబర్ 2 రద్దు విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాలు.. మనస్తాపానికి గురిచేశాయన్న కృష్ణమూర్తి.. కనీసం తనను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు. -
లోకేష్.. హెరిటేజ్ ఆస్తులను రూపాయికి ఇస్తారా?: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.వైఎస్ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘కేక్ కట్ చేసుకున్నా.. కోడిని కోసుకున్నా కేసులు’
తాడేపల్లి : ఏపీలో పోలీసుల వైఖరి వింతగా ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి విమర్శించారు. కేక్ కట్ చేసినా, కోడిని కోసుకున్నా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. చివరికి జగన్ ఫ్లెక్సీలను చూసినా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘ఇది రెడ్ బుక్ పాలనకు నిదర్శనంగా ఉంది. జగన్ పుట్టినరోజున కోడిని కోశారని తిరుపతిలో కేసు పెట్టి అపహాస్యానికి గురయ్యారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. వారిని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు సైతం దిగ్భ్రాంతికి గురైంది. కేక్ ను కత్తితో కట్ చేశారని ఇంకో కేసు కూడా పెట్టారు. అసలు రాష్ట్రంలో పోలీసుల వైఖరి దారుణంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కోళ్ల పందేలు చట్టరిత్యా నేరం.మరి సంక్రాంతి సందర్భంగా జరిగే కోళ్ల పందేలపై పోలీసులు ఏం చేయబోతున్నారు?. కనుమ రోజు అందరూ నాన్ వెజ్ తింటారు అప్పుడు కూడా జనం మీద కేసులు పెడతారా?, జగన్ ఫ్లెక్సీలను జనం చూస్తే వారి మీద కూడా కేసులు పెట్టేలా ఉన్నారు, నిందితులకు ముసుగులు వేయకూడదు, కొట్టకూడదు, రోడ్లమీద ఊరేగించ కూడదు, చేతులకు సంకెళ్లు వేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పాయి. చట్టప్రకారం పని చేయకపోతే తర్వాత పోలీసులే ఇబ్బంది పడతారు. అధికరం శాశ్వతం కాదు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి’ అని హెచ్చరించారు. -
మెడకు ‘ఉరి’.. చేతిలో పవన్ ఫోటో.. గిరిజనుల వినూత్న నిరసన
బొబ్బిలి (విజయనగరం జిల్లా): ‘మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌకర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం’ అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావలస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు.వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించుకుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పలరాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు. -
Bapatla: చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
సాక్షి, బాపట్ల: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెరువులోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగరం మండలం చిలకావారిపాలెంలో వద్ద ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 7న కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్ బస్సుగా గుర్తించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని డ్రైవర్ తెలిపాడు. సుమారు అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్స్కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్సీపీ కార్యకర్త మణిని కొట్టారు.బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP: పోలీసుల ఏకపక్ష వైఖరి.. రివర్స్ కేసులు!
అనంతపురం: జిల్లాలోని యల్లనూరు ఘటనలో పోలీసుల ఏకపక్ష వైఖరి బయటపడింది. జనవరి 1వ తేదీన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం జరిగిన కేసుకు సంబంధించి దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. ఆ సమయంలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకవైపు వైఎస్సార్సీపీ నేతలపై తిరిగి కేసులు నమోదు చేస్తున్నార పోలీసులు. 13 మంది వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేశారు.మారణాయుధాలతో దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై పోలీసులు కన్నేత్తి కూడా చూడలేదు. 23 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. దీనికి సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ బరితెగించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రతాప్రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. -
తిరుమలలో చిరుత కలకలం
సాక్షి,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. శ్రీవారి 450వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కలకలం రేగింది. భక్తులకు చిరుత కనిపించడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.భక్తులు మెట్లు ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది. వెంటనే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి, భక్తులను ఆ మార్గంలో అనుమతించడం నిలిపివేశారు. అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శబ్దాలు చేసి చిరుతను దారి మళ్లించారు. అనంతరం ఆ ప్రాంతంలో గస్తీ పెంచి, చిరుతను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. టీటీడీ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే భక్తులను గుంపులుగా అనుమతిస్తామని ప్రకటించారు.చిరుత ప్రత్యక్షమవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భక్తులు అధికారులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. తిరుపతి శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మార్గాల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. -
జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు
చిత్తూరు అర్బన్: ఏపీలోని పలు జిల్లా కోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గురువారం చిత్తూరు, అనంతపురం, ఏలూరు, విశాఖ జిల్లా కోర్టులను మానవ బాంబులతో పేల్చుతామని, ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు వాడుతున్నట్లు కోర్టులకు మెయిల్స్ వచ్చాయి. బుధవారం రాత్రి వచి్చన మెయిళ్లను న్యాయమూర్తులు గురువారం కోర్టులకు హాజరయ్యాక గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అన్ని చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు.తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ ద్వారా అవమానానికి గురైన తాము లిబరేషన్ టైగర్స్ ఆఫ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) నుంచి విడిపోయి, కశ్మీర్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రూపొందించినట్లు, మధ్యాహ్నం 1.15 గంటలకు ఆత్మాహుతి దాడులు చేయనున్నట్లు మెయిల్స్లో పేర్కొన్నారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసింది. సాయంత్రం వరకు కొనసాగించిన గాలింపుల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ మెయిల్స్ ఆకతాయిలు పంపారా? లేక ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా..?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) మచిలీపట్నం టౌన్, ఈడేపల్లిలో నిబంధనలకు అనుగుణంగా నిరి్మంచిన పార్టీ కార్యాలయ భవనం విషయంలో మునిసిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసిన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ పదే పదే నోటీసులు జారీ చేయడంపై మండిపడింది.‘ఇంపాక్ట్ ఫీజు వసూలు చేసి ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ (ఓసీ) జారీ చేయాలన్న మా ఆదేశాలకు విరుద్ధంగా, అలాగే సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ ఎలా నోటీసులు ఇస్తారు? మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడుతాం. మా ఆదేశాల మేరకు ఎందుకు ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వలేదో, ఎందుకు పదే పదే నోటీసులు ఇస్తున్నారో కమిషనర్ వివరణ ఇవ్వాలి. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలి. కోర్టు ఆదేశాలంటే నవ్వులాట అనుకుంటున్నారా? కోర్టు పవర్ ఏంటో రాష్ట్రంలోని అధికారులందరికీ చూపిస్తాం. చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో తమకు బాగా తెలుసు. ఒక అధికారిని కటకటాల వెనక్కి పంపితే అధికారులందరూ దార్లోకి వస్తారు’’ అని హెచ్చరించింది. వాదనల సమయంలో కమిషనర్ తరఫు న్యాయవాది ఆయన చర్యలను సమర్థిస్తుండగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటే కమిషనర్కు ఇంగ్లీష్ రాదని అనుకోవాలా? లేక అర్ధం కాలేదని అనుకోవాలా?’ అంటూ మండిపడ్డారు. తానిచ్చిన ఉత్తర్వులతో పాటు సీజే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తే,. ఇవ్వడం సాధ్యం కాదన్నారు..తమ పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టీఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలకు, అలాగే తాము సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలన్న సీజే ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధంగా మచిలీçపట్నం మునిసిపల్ కమిషనర్ తిరిగి తమకు నోటీసులు జారీ చేశారంటూ వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడానికి నిరాకరిస్తూ జారీ చేసిన ఎండార్స్మెంట్ను కూడా ఆయన సవాలు చేశారు. నాని తరఫున న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పదే పదే నోటీసులు ఇస్తున్నారన్నారు. భవన నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసు ఇచ్చారని తెలిపారు. -
క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ...!
పార్వతీపురం రూరల్: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు అమాయకుల పాలిట సైబర్ ఉచ్చులా మారుతోంది. సాంకేతికతను సామాన్యుడు సౌకర్యం కోసం వాడుకుంటుంటే, సైబర్ నేరగాళ్లు మాత్రం దానినే వలగా మారుస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనల పేరుతో భయపెడుతునో, మరోపక్క పండగ వేళ ఆప్యాయంగా శుభాకాంక్షలు చెబుతునో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వాట్సాప్ వేదికగా ‘ఏపీకే ’ ఫైళ్ల రూపంలో వస్తున్న ఈ కొత్త రకం మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. కంగారు పడేలా చేయడమే మొదటి ఎత్తుగడ ‘అయ్యో! నా బండికి చలానా పడిందా? రెడ్ లైట్ క్రాస్ చేశానా?’ అని సామాన్యుడు కంగారు పడేలా చేయడమే ఈ కేటుగాళ్ల మొదటి ఎత్తుగడ. వాహనదారుల ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా అచ్చం పోలీసుల నుంచి వచ్చినట్లుగా ఒక సందేశం వస్తుంది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలు చూడాలంటే కింద ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆ మెసేజ్ సారాంశం. పోలీసులు పంపారేమో అనే భయం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుతతో జనం ఆ లింక్ లేదా ఫైల్పై క్లిక్ చేస్తున్నారు.ప్లే స్టోర్లో కాకుండా, ఇలా బయట నుంచి వచ్చే ఈ ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోగానే, ఫోన్లోకి ప్రవేశించే మాల్వేర్ ఫోన్ను పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుంటుంది. క్షణాల్లో మొబైల్ హ్యాక్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సర వేళల్లో మన వాళ్లకి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. ఇదే అదనుగా సైబర్ మాయగాళ్లు మరో వేషం కడుతున్నారు. 2026 విషెస్ కోసం ఈ యాప్ వేసుకోండి, సంక్రాంతి గ్రీటింగ్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..అంటూ ఆకర్షణీయమైన లింకులు పంపిస్తున్నారు. తీపి కబురు అనుకొని ఆశగా క్లిక్ చేస్తే.. అది చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ప్లే స్టోర్లో లేని ఈ థర్డ్ పార్టీ యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే, నట్టింట్లో దొంగను కూర్చోబెట్టినట్టేనని సైబర్ నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ‘ఏపీకే’ ఫైళ్లను ఓపెన్ చేయకండి.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్లో లేని ఏ యాప్నూ పొరపాటున కూడా డౌన్లోడ్ చేయవద్దు. ముఖ్యంగా వాట్సాప్లో వచ్చే ఏపీకే ఫైళ్లను అస్సలు ఓపెన్ చేయకండి. ఒకవేళ నిజంగా చలానా పడిందో లేదో తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి తప్ప, ఇలాంటి లింకులను నమ్మవద్దు. ఎవరైనా మోసపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వచ్చే బ్యాంక్ ఓటీపీలు నేరుగా వాళ్లకే వెళ్లిపోతాయిఒకసారి ఆ అప్లికేషన్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యిందంటే చాలు.. ఇక ఆ ఫోన్ మన చేతిలో ఉన్నా, దాని కంట్రోల్ అంతా ఆన్లైన్ నేరగాడి చేతిలో ఉంటుంది. మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు నేరుగా వాళ్లకే వెళ్లిపోతాయి. మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము హుష్ కాకి అవుతుంది. అంతటితో ఆగకుండా, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్ల అందరికీ మన పేరు మీద అదే మోసపూరిత లింక్ వెళ్లిపోతుంది. దీంతో మన బంధువులు, మిత్రులు కూడా మనమే పంపామని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది.ఉచ్చులో పడొద్దు!ప్రస్తుతం పండగ సమయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్టీఓ చలానా పేరుతోనో, శుభాకాంక్షల యాప్ పేరుతోనో వాట్సాప్ ద్వారా వచ్చే ‘ఏపీకే ’ ఫైళ్లను ఏ మాత్రం నమ్మవద్దు. ప్రభుత్వం తరఫున, పోలీస్ శాఖ తరఫున ఎప్పుడూ ఇలాంటి అజ్ఞాత లింకులు లేదా ఏపీకే ఫైళ్లు పంపడం జరగదు. ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తుల్లా మెసేజ్ చేసి ఈ ఫైళ్లు పంపినా, పొరపాటున కూడా వాటిని తెరిచి ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే.. ఈ ఫైళ్లు మీ మొబైల్ ఫోన్ను పూర్తిగా హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతా వివరాలను, ఓటీపీలను దొంగిలించే ప్రమాదం ఉంది. మీ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోండి. అనుమానాస్పద లింకులు, ఆఫర్లకు దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మోసానికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. – ఎస్వీ మాధవ్రెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం


