Chittoor
-
లక్ష్యం దిశగా పనిచేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం దిశగా పనిచేయాలని డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల నుంచి అక్టోబర్ వరకు మీజిల్స్–రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. 9 నెలల నుంచి 24 నెలలలోపు వ్యాక్సిన్ మిస్ అయిన పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. మొదటి విడతగా ఏప్రిల్ 27 నుంచి మే 4 వరకు, రెండో విడతగా జూలై 20 నుంచి 27 వరకు, మూడో విడతగా అక్టోబర్ 12 నుంచి 19 వరకు కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నారు. ఎండల తీవ్రత దష్ట్యా వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని, పీహెచ్సీలోని 6 బెడ్లలో 2 బెడ్లు హీట్ వేవ్ కేసులకు కేటాయించాలని చెప్పారు. గర్భిణులు, శిశువులను తప్పనిసరిగా అభా ఐడీతోనే నమోదు చేయాలని, లేకపోతే సంబంధిత ఏఎన్ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్సీడీ కార్యక్రమంలో 50 శాతం పైగా ఫాలోఅప్ ఉండాలని, ప్రతిరోజూ ఓపీ సెన్సస్ 50కి పైగా అభా ఐడీతో నమోదు కావాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ వెంకటప్రసాద్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ అనూష, జార్జ్, రామ్మోహన్ పాల్గొన్నారు. తప్పిదాలు చేయొద్దు నిండ్ర (నగరి) : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి చూపకుండా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం నిండ్ర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ప్రజల నుంచి 97 వినతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్వో, కార్యదర్శులు తమ గ్రామ స్థాయిలో పారదర్శకంగా, పక్షపాతం లేకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామాలలో మండల సర్వేలు, వీఆర్వోలు, భూసమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. రీ సర్వే నిర్వహించినప్పుడు పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. ఈ రోజు స్వీకరించిన వినతులలో అధి క శాతం రెవెన్యూ సమస్యలపై వచ్చాయని తెలిపారు. సర్వే చేసినప్పుడు అర్జీదారుని కి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు గ్రామ సభ నిర్వహించి రీసర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వే టినగరం, పాలసముద్రం మండలాలలో రీ సర్వే పనులు వేగవంతం చేయా లన్నా రు. పీజీఆర్ఎస్ వినతులను 14 రోజుల్లోపు పరిష్కరించాలని, అందుకు ఆర్డీవో నివే దిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ అ.రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ బన్న వెంకటేష్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో నగరి అనుపమ, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 266వ జయంతిలో పాల్గొన్నారు. -
మృతుని కుటుంబానికి వైఎస్సార్సీపీ సాయం
గంగాధరనెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గంగాధర నెల్లూరుకు మండలానికి చెందిన బాబు కుటుంబానికి వైఎస్సార్సీసీ నేతలు అండగా నిలిచారు. గంగాధర నెల్లూరు పంచాయతీ రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన రైతు బాబుపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్రమంగా పలు కేసులు పెట్టారు. బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పెట్టారు. దీంతో భరించలేక కొద్దిరోజుల కిందట బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి సోమవారం రామానాయుడుపల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన రూ.లక్ష చెక్కును బాబు సతీమణి గోవిందమ్మ, ఆమె కుమారుడికి అందజేశారు. బాబు కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని నారాయణస్వామి, కృపాలక్ష్మి భరోసా, మండల నాయకులు ఇచ్చారు. బాబు కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందిస్తున్న నారాయణస్వామి, కృపాలక్ష్మి, బాబు సతీమణి గోవిందమ్మను ఓదార్చుతున్న కృపాలక్ష్మి -
ఆత్మవిశ్వాసం వీడొద్దు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ గ్రేడ్ వస్తుంది? ఇంట్లో ఏమంటారు? స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు వేలాది మంది విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, విద్యార్థులు ఒక్క విషయం గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిభను నిర్ణయించేది ఒక పేపర్ మీద ఉండే అంకెలు కాదు, ప్రతి విద్యార్థిలో ఉండే పట్టుదల, పోరాట గుణమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్యపరచాల ని మేథావులు, విద్యావేత్తలు అంటున్నారు. పలు కారణాలతో పరీక్ష తప్పిన వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టులాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే అడ్వాన్న్డ్స్ సప్లిమెంటరీలో తిరిగి ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు. 14416 నంబర్ ఉందిగా.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టెలిమానస్ను అందుబాటులోకి తెచ్చింది. 14416 నంబరుకు ఫోన్ చేసి కుంగుబాటు, మానసిక ఆందోళన, నాకు జీవితం ఎందుకు అని అనిపించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముడుతున్నా వెంటనే టెలిమానస్కు ఫోన్ చేస్తే.. కౌన్సిలర్లు ఫోన్న్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు. తల్లిదండ్రులూ ఆలోచించండి ఫలితం ఎలా వచ్చినా.. ఆత్మన్యూనతా భావంతో మానసిక స్థైర్యం కోల్పోరాదు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చరాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్తృత అవకాశాలు తెలిసే అవకాశముంటుంది. ఓటమి కూడా భవిష్యత్లో సాధించబోయే విజయానికి తొలిమెట్టు. పాస్, ఫెయిల్ సాధారణ విష యాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుండా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. ఫెయిల్ అంటే ఓడిపోవడమా? ఫెయిల్ అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. విజయాన్ని ఇంకా అందుకోలేదని అర్థం. గెలుపునకు తగినంత సన్నద్ధత కాలేదని అర్థం. ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలన్నీ గెలుపు లక్ష్యంగానే మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాల్లో విజయాలే కాదు ఓటమి కూడా ఎదురవుతుంది. ఈ విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను మరచిపోకూడదు. నిపుణుల సూచనలు జిల్లా సమాచారం పరీక్ష కేంద్రాలు 129బాలురు (రెగ్యులర్) 10,737బాలికలు (రెగ్యులర్) 10,264 బాలురు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్) 1,318 బాలికలు (ప్రైవేట్, వన్స్ఫెయిల్డ్) 726 మొత్తం విద్యార్థులు 23,095ఓటమి విజయానికి తొలిమెట్టు ఫలితం ఏదైనా..! జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఇందు లో పదో తరగతి అనేది కేవలం ఒక చిన్న మైలురాయి మాత్రమే. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను 129 కేంద్రాల్లో 21,062 మంది విద్యా ర్థులు రాశారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. గతేడాది పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో మరి కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం. ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఫలితం ఆశించిన ట్లు లేకపోతే నిరాశ చెందకూడదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ కీలక సమయంలో విద్యార్థుల కంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. పిల్లలను మరొకరితో పోల్చి వారిలో ఉన్న న్యూన తా భావాన్ని దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. -
భూతగాదాలపైనే అర్జీలెక్కువ
పలమనేరు: భూతగాదాలు, మనీమ్యాటర్లపైనే ఇక్క డ ఎక్కువగా అర్జీలందాయని ఎస్పీ తుషార్డూడి పేర్కొన్నారు. ఆ మేరకు పలమనేరు సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు గ్రీవెన్స్డేని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 దాకా ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఆయన బాధితులకు భరో సా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్డేకి దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఇబ్బందులు పడుతుంటారనే పలమనేరు సబ్ డివిజనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసింగ్ బాగానే ఉందని కితాబిచ్చారు. ముఖ్యంగా ఐపీఎల్ బెట్టింగ్, సెల్ఫోన్ల చోరీ, గంజా స్మగ్లింగ్, డిజిటల్ మోసాలు తదితరాలపై ఇటీవల కాలంలో బాగా దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువగా ప్రచారం చేశామన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంతో మేలుంటుందని సూచించారు. ఇందులో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పలువురు సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమల: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీ వారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. అనంతరం రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల ను పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి విహరిస్తూ ఆల య ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పొగాకు ఉత్పత్తులను పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాలతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ రామచంద్ర సిబ్బందితో కలిసి నగరంలో దాడుల నిర్వహించారు. పొన్నియమ్మ గుడివీధి, కాయనికట్టు వీధి, చర్చి వీధి, స్వామి రెడ్డి వీధి ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 57 బస్తాల్లో నిల్వ ఉంచిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన చంపాలాల్, రవీంద్రబాబు, అబ్దుల్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నగరంలో గుట్కా రాకెట్ వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నాడని .. అతనితో పొసగని అదే పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని పోలీసులకు ఉప్పందించినట్లు సమాచారం. ఎరువుల దుకాణాలు బంద్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా అగ్రి ఇన్పుట్స్ అసోసియేషన్ బంద్కు దిగింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని అగ్రి ఇన్న్పుట్ షాపులు కూడా దానికి మద్దతు ప్రకటించాయి. స్వచ్ఛందంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులకు తాళం వేశాయి. -
రాధాకృష్ణా.. క్షమాపణ చెప్పు?
చిత్తూరు అర్బన్: తమ పార్టీ నాయకుల సతీమణుల పై ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు విజయానందరెడ్డి (చిత్తూరు), వెంకటేగౌడ (పలమనేరు), కృపాలక్ష్మి (జీడీ నెల్లూరు), డా.సునీల్ (పూతలపట్టు) తదితరులతో కలిసి సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్డూడీని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆపై రశీదు తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన నాయకుల సతీమణులపై మాట్లాడే అర్హత రాధాకృష్ణకు లేదని, అతను చేసిన వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. తమ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెడితే అరెస్టు చేస్తున్న పోలీసులు, రాధాకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మావిగన్పై సానుకూల చర్చ అనంతరం కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల మా నాయకుడు జగన్మోహర్రెడ్డి రాష్ట్ర రాజధానికి రూ.20 వేల కోట్లతో అద్భుతంగా తయారుచేయొచ్చని, 30 లక్షల జనాభాతో అత్యంత సుందరంగా చేయొచ్చని మావిగన్ను సూచించారు. దీనిపై ప్రజల్లో విపరీతమైన సానుకూల చర్చ మొదలయ్యింది. కానీ దీన్ని భరించలేని ఏబీఎన్ రాధాకృష్ణ మా పార్టీ నేతల శ్రీమతులపైన అత్యంత అభ్యంతరకరమైన రీతిలో, అమానుషమైన స్థాయిలో, అవమానకర పోకడలతో రాతలు రాశారు. దీనిపై పెద్ద ఎత్తున అలజడి, విమర్శలు ఎదురైతే.. తప్పును సరిదిద్దుకోకుండా, పశ్చాత్తాపం చెందకుండా మళ్లీ అదే వ్యాఖ్యలను సమర్థించుకుంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే.. వందలాది మంది పార్టీ నేతలపై కేసులు పెట్టారు. కానీ రాధాకృష్ణపై కేసు పెట్టలేదు..’ అని అన్నారు. ఈ ఘటనపై గాయపడ్డ హృదయాలతో తమ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు. అన్ని చోట్ల కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కోరితే, పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకే ఎస్పీలను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నాయకులు కెపి.శ్రీధర్, చంద్రశేఖర్, హరిణిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా పెట్రోలు, డీజిల్ కొరత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్రోలు, డీజిల్ కొరత సృష్టిస్తోందని కరుణాకరెడ్డి దుయ్యబట్టారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్లో అధికధరలకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన–టీడీపీ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నా, ఇసుక దందా, భూదందాలు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. ఇంధన పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల లీటరు రూ.200– రూ.300 ఎక్కువకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. -
తొందరపాటు సరికాదు
పిల్లలు ఫెయిలైతే తల్లి దండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు. మరోసారి మంచిగా చదివి ఉత్తీర్ణత సాఽ దించాలని ప్రోత్సహించాలి. అప్పుడే విద్యా ర్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఉంటారు. పెద్దగా చదువుకోలేని వారు.. పదో తరగతి పరీక్షల్లో తప్పిన వారు సైతం ప్రస్తుతం వ్యాపారాల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరి లో ప్రతిభ దాగి ఉంటుంది. తల్లిదండ్రులు దానిని గుర్తించి, పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలి. – పాండురంగస్వామి, మాజీ డీఈవో -
పరిచయం చేసుకుని.. నగలు కాజేసి
పలమనేరు: పరిచయం పేరిట మోసం చేసిన ఘటన పలమనేరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఉషా గతంలో పలమననేరులో ఉండేది. ఆపై ఇప్పుడు బెంగళూరులో ఉంటోది. ఈ నేపథ్యంలో చిత్తూరు నుంచి పలమనేరుకు మూడు రోజు క్రితం వస్తూ బస్సు లో కొందరితో పరిచయం పెంచుకుంది. ఆ మేర కు వారితో మాట్లాడుతూ తాను టౌన్లోని బొరుగులబట్టి వీధికి వెళ్లాలని చెప్పింది. పలమనేరులో బస్సు దిగాక తాము కూడా ఆ వీధికి వెళ్తామంటూ పరిచయం అయిన వారితోపాటు ఆటోలో వచ్చింది. ఆపై ఏమి జరిగిందోగానీ ఆమె స్ఫృహ కోల్పోయింది. ఆమె వద్ద పర్సులో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరాణలు, రూ.5 వేల నగదును చోరీ చేసి ఆటలోంచి దింపేశారు. ఆపై తెలివిలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. షార్ట్సర్క్యూట్తో మంటలు చిత్తూరు కలెక్టరేట్ : నగరంలో అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్లోని ఓ మొబైల్ షాప్ లో సోమవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చెరుకుని మంటలను పూర్తిగా అదుపుకోకి తెచ్చారు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆ దుకాణంలోని కొంత ఫర్నిచర్ రూ.10 వేల లోపు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున విద్యుత్ వైరింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. -
బంకుల మూతపై వైఎస్సార్ సీపీ ధ్వజం
తప్పిదాలు చేయొద్దు గ్రామాల్లో వివక్ష, కక్ష సాధింపులకు పాల్పడ కుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటకలో ఫుల్గా పెట్రోల్, డీజిల్ ●బాబు కుటుంబానికి సాయం కూటమి ప్రోద్భలంతో, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బాబు కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నగరి – తిరుపతి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనదారులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇంధన కొరత వేధిస్తోంది. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో వాహనచోదకులు, యజమానులు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో పలు పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అరకొర గా ఉన్న బంకుల వద్ద ఆయిల్ కోసం బారు లు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తీరా పంపు వద్దకు చేరుకునే సరికి వారు అడిగినంత పెట్రోల్ లేదా డీజిల్ పట్టకపోవడంతో జనం నిరాశ చెందుతున్నారు.జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పెట్రో ల్, డీజిల్ కొరత లేదని ప్రజలు, రైతులు, వాహనదారులు ఆందోళన చెందొద్దని ఎస్పీ తుషార్డూడి, కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. చిత్తూరులోని పలు పెట్రోల్ బంక్లను ఆదివారం రాత్రి ఎస్పీ, కలెక్టర్ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలను పరిశీలించారు. బంక్ నిర్వాహకులకు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్లలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా, సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని తెలిపారు. బంక్ నిర్వాహకులు పారదర్శకంగా విక్రయాలు నిర్వహించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా ఇంధనాన్ని బ్లాక్ చేయడం, నల్లబజారులో విక్రయించడంలాంటివి చేస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచిచంఆరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలలో ఏఎస్పీ డా.తరుణ్ పహ్వా, టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య పాల్గొన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకొని, పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. బాధ్యతను మరువొద్దు చిత్తూరు అర్బన్: పోలీసుశాఖలో అంతర్భాగంగా ఉన్న హోంగార్డులు బాధ్యతతో పనిచేయా లని రాయలసీమ ప్రాంతీయ హోంగార్డుల కమాండెంట్ మహేష్కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుల దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా హోంగార్డులు పనిచేయాలన్నారు. రోడ్డు భద్రత, బందోబ స్తు, శాంతి భద్రతల పర్యవేక్షణపై పట్టు ఉండాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ద్విచ్ర వాహనా లు నడిపే సమయంలో హెల్మెట్లు ధరించాలన్నారు. పలువురు హోంగార్డుల నుంచి వినతు లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, హోంగార్డు డీఎస్పీ చిరంజీవి, ఆర్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, తిరపతి జిల్లాల వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. వాహన చోదకులకు పెట్రోల్, డీజిల్ దొరక్క వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంటింటా పెట్రోల్, డీజిల్ కొరతతో ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతి జిల్లాలో 185 పెట్రోల్ బంకులున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం సోమవారం సగానికిపైగా మూతపడ్డాయి. అధికారులు మాత్రం కేవలం 25 పెట్రోల్ బంకులు మాత్రమే మూతపడ్డాయని చెప్పుకొచ్చారు. ఆదివారం 15 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఎక్కువే. అధికశాతం బంకులు మూతపడడంతో ఉన్న బంకుల వద్ద వినియోగ దారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని బంకుల్లో అధికధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం కనిపించింది. తిరుపతికి చెందిన సుధాకర్రెడ్డి అనే వ్యక్తి రూ.200 ఇస్తే..బంకులోని వ్యక్తి లీటర్ పెట్రోల్ పట్టి రూ.30 తిరిగి చేతికి ఇచ్చాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘అంతే వెళ్లు’ అంటూ సమాధానం ఇచ్చాడని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పలు పెట్రోల్ బంకుల వద్ద కనిపించింది. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లాలో చమురు కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ తిరుపతి జిల్లా పరిస్థితే నెలకొంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 146 పెట్రోల్ బంక్లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 30 పెట్రోల్ బంక్ల వరకు మూతబడ్డాయి. ప్రధానంగా పలు బంక్ల్లో డీజిల్ కొరత కనిపిస్తోంది. మరికొన్ని బంక్ల్లో డీజిల్ ఉన్న రూ.200కు మించి పట్టడంలేదు. దీంతో వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. ఇక పలు బంక్ల్లో వాహనాలు కిక్కిరిస్తున్నాయి. డీజిల్ కోసం వాహన యజమానులు పడిగావులు కాస్తున్నారు. సరఫరాలో లోటు కనిపిస్తోంది. డీజిల్, పెట్రోల్ కోసం గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు. ఆగిన ఆటోలు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి, వచ్చే ఆటోలు పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా రోడ్డు పైకి ఎక్కడం లేదు. ఆటోలు రాకపోవడంతో అనేక మంది పల్లె ప్రాంత వాసులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. ఫలితంగా సోమవారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు జనంతో కిక్కిరిసిపోయాయి. అత్యవసరం అనుకున్న వారు ఆటో, టాక్సీలను ఆశ్రయించారు. వారు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్దె ధరలు అమాంతం పెంచి అడుగుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే.. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని, తామూ బ్లాక్లో కొనుగోలు చేసుకున్నామని సమాధానం చెబుతున్నారు. చిరువ్యాపారులకు తిప్పలు ఆటోలు పల్లె ప్రాంతాల వైపు రాకపోవడంతో అనేక మంది చిరు వ్యాపారులు, కూరగాయలు తీసుకొచ్చేవారు, పెద్ద మార్కెట్కు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే వారు సైతం తిరుపతి రావడం మానేశారు. స్థానికంగానే కూరగాయలను గ్రామాల్లో తిరిగి తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రయాణం రద్దు చేసుకున్నా ఏర్పేడు: మా బంధువుల పిల్లలకు పుట్టెంట్రుకలు తీసే శుభకార్యానికి సోమవారం ఇంటి సొంత ఆటోలో భార్యతో కలసి బయల్దేరాను. దుర్గిపేరి పెట్రోల్ బంకు వద్ద నోస్టాక్ బోర్డు కనిపించింది. అక్కడ నుంచి ఏర్పేడు వైపు బయల్దేరి ఐఐటీ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంకు వద్ద ఆటోకు డీజిల్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడా లేదు. దీంతో ఆలోచనలో పడ్డాను. ట్యాంకులో ఉన్న కొంత డీజిల్తో అంత దూరం వెళ్లి రావటం అసాధ్యమని భావించి మా ప్రయాణం రద్దు చేసుకున్నాను. – సుబ్రమణ్యం, పల్లంపేట, ఏర్పేడు మండలం మూడు రోజులుగా ఇంటికే పరిమితం తిరుపతి తుడా: రోజూ ఆటో నడిపితేనే కుటుంబం జీవనం సాగుతుంది. కానీ మూడు రోజులుగా డీజిల్ కొరతతో ఆటో ఇంటికే పరిమితమైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ మేర క్యూలైన్ ఉంది. క్యూలైన్లో 5 గంటల పాటు వేచి ఉన్నా కేవలం ఒక వెహికల్కు రూ.100 మాత్రమే డీజిల్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఆటో ఈఎమ్ఐ కట్టాలి, ఇంటికి నిత్యావసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. – రాము, ఆటో డ్రైవర్, తిరుపతి డీజిల్ దొరక్క ఇంటి వద్దే ఉంచా రైల్వేకోడూరు అర్బన్ : నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. డీజిల్ దొరక్క ఆటో ఇంటివద్దే ఉంచుకున్నా. ఒక వేళ ఉన్నా పెట్రోల్ బంక్ల వద్ద గంటల తరబడి ఉండాల్సివస్తోంది. అందువల్ల ఆటోను నడపకుండా ఉన్నాను. ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలి. – సుబ్రమణ్యం, రాఘవరాజపురం అరుంధతివాడ ఎనిమిది టన్నుల కూరగాయల వితరణ పలమనేరు: తిరుమలలోని నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన పూసల రవి ఆధ్వర్యంలో ఎనిమిది టన్నుల కూరగాయలను స్థానిక మార్కెట్ నుంచి సోమవారం తరలించారు. ఈ సందర్భంగా కూరగాయల వాహనానికి గోవిందనామ స్మరణల మధ్య పూజలు చేపట్టారు. ఇందులో మదనపల్లి ఏఎంసీ చెర్మన్ శివరామ్, ఆకుల గజేంద్ర, బాబు, వేణుగోపాల్నాయుడు, మండీ యజమానులు పాల్గొన్నారు. ఆకలి కేకలు వినిపించలేదా? సరిహద్దు పెట్రోల్ బంకుల్లో కొనుగోలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో స్థానికులు అనేక మంది సరిహద్దులోని తమిళనాడులో ఉన్న పళ్లిపట్టు, తిరుత్తణి, ఊత్తుకోట, ఆరంబాకం పెట్రోల్ బంక్లకు చేరుకుని, వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని తిరిగి రావడం కనిపించింది. ముందు జాగ్రత్తగా వాటర్ బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్, డీజిల్ నింపుకుని తిరిగి జిల్లాకు చేరుకుంటున్నారు. అధికారులు సైతం కొందరు తమిళనాడు పరిధిలోని పెట్రోల్ బంకులకు వెళ్లి కొనుగోలు చేయడం కనిపించింది. అన్నదాతలకు అవస్థలు వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను వినియోగించే రైతులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పలేదు. రేణిగుంట మండలం వెంకటాపురంలో ఓ రైతు వరి నాట్లు వేసేందుకు ట్రాక్టర్తో దుక్కి సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నతుండగా డీజిల్ లేక మధ్యలోనే ట్రాక్టర్ ఆగిపోయింది. చేసేది లేక పొలంలోనే ట్రాక్టర్ని విడిచి డీజిల్ కోసం బంకుల చట్టూ తిరిగారు. డీజిల్ కొరత కారణంగా సొమవారం పనులు ముందుకు సాగలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేద్యం కోసం వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ కొరత కారణంగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తిరుపతిలో అనేక బంకులు మూతపడ్డాయి. వినియోగ దారుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్తలు భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి నగరంలో పలు పెట్రోల్ బంకులను పరిశీలించి వినియోగ దారుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు. డీజిల్ లేదని ఆటోలు పోలే.. తిరుపతి అన్నమయ్యసర్కిల్: డీజిల్ లేదని ముసిలిపేడుకు ఆటోలు పోలే. అందుకే బస్టాండుకు వ చ్చాను. ఎపుడు ఈ మాదిరిగా లేదు. వచ్చే దారిలో చూస్తూ వచ్చినాను. ఆటోవాళ్లంతా వరుసగా పెట్రోల్ బంకుల వద్ద నిలబెట్టినారు. వాళ్ల కోసం కూచుంటే కాదని బస్సు ఎక్కేందుకు వచ్చినాను. – నాగరాజు, ప్రయాణికుడు, మునగళపాళెం తిరుమలకు బస్సెక్కాల్సిందే.. తప్పదు మరి తిరుమల శ్రీవారి దర్శనం కోసం బస్సు ఎక్కాల్సిందే. జీపుల్లో వెళ్లతామని అనుకున్నాం. డీజిల్ కొరత కారణంగా అవి కాస్తా పె ట్రోల్ బంకుల వద్దకు వెళ్లి క్యూలైన్లో ఉన్నాయి. ఎప్పడికి క్యూలైన్ పూర్తవతుందో తెలియని పరిస్థితి. జీపుల కోసం వేచి ఉండాలంటే జరగని పని. అందుకే అలిపిరి బాలాజీ బస్టాండ్కు చేరాం. – ఓ. నారాయణ, శ్రీవారి భక్తుడు, సదుం మండల కేంద్రం ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు నేను తిరుపతిలోనే ఆటో నడుపుతాను. ఎప్పుడు డీజిల్ కోసం ఇబ్బందులు పడిందిలేదు. మూడు రోజులుగా కొరత ఏర్పడింది. నా ఆటోలో రాత్రి 10 గంటలకు ఆటోలో డీజిల్ అయిపోయింది. అన్ని బంకులు తిరిగాను. అయితే కేటీ రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద డీజిల్ పడుతున్నారని తెలుసుకుని ఆటోను తోసుకుని ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లో ఉన్నాను. ఇపుడు మధ్యాహ్నం 1.30 అవుతోంది. ఇంకా ఎంత సమయం పడుతోందని ఎదురు చూస్తున్నా. – వెంకటేశ్వర్లు, ఆటో నిర్వాహకుడు, తిరుపతి నారు ఎండిపోతోంది.. ఖరీఫ్ సీజన్లో వరినాట్లు వేయాలి. నార్లు పోసుకుని ఉన్నా. నాట్లు వేయాలంటే పొలం దు క్కి చేయాలి. దుక్కి చే యాలంటే రోటావేటర్కు డీజిల్ అవసరం. డీజిల్ లేక రోటావేటర్ను పక్కన పెట్టేసి ఎదురు చూస్తున్నా. రెండు రోజుల్లో నాట్లు వేయకపోతే నారు ఎండిపోతుంది. ఉన్నట్టుండి డీజిల్ ఇంత ఇబ్బంది వస్తుందనుకోలేదు. లేదంటే ముందుగా అయినా తెచ్చుకుని ఉండేవాళ్లం. ఉన్నట్టుండి ఇబ్బంది రావడంతో రైతుగా నాకు నష్టమే మరి.. – దిరసాల మురళి, వద్దిగుంట కండ్రిగ, నాయుడుపేట మండలం -
వేసవి దొంగల హల్చల్
స్మార్ట్ లాక్ ఉత్తమం వేసవిలో పట్టణాలు, గ్రామాల్లో చాలామంది ఆరుబయట, మిద్దైపెన నిద్రపోవడం అలవాటు. ఇదే అదునుగా నిద్రించే వారి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు ఎత్తుకెళుతున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి దోచేస్తున్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్మార్ట్ లాక్లను ప్రజలకు తెప్పించి ఇచ్చాం. ఇలా శబ్దాన్ని మోగించడం వల్ల ప్రజలు అప్రమత్తం అవ్వొచ్చు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. పోలీసు శాఖ తరఫున రాత్రివేళ గస్తీ ముమ్మురం చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. సమాచారమిస్తే.. .. ఈ రెండు ఘటనలేకావు.. జిల్లాలో తరచూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. వేసవి సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చిపెడుతోంది. సెలవుల్లో సొంతూర్లకు వెళ్లడం, విహార యాత్రలు, ప్రయాణాలు, శుభకార్యాలు, ఆరుబయట నిద్ర లాంటివి దొంగలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఊరికి వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేయాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోకుంటే దొంగలు చొరబడి ఉన్నదంతా ఊడ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచిస్తున్నారు. ఆయన సూచనలు ఇలా.. – చిత్తూరు అర్బన్ -
వైభవోపేతం!
తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేర్వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి, భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరులు భాగవతార్ హరికథ గానం భక్తులను అలరించింది. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకీనెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
జనగణన జరుగుతుందా?
● కాగితాలకే పరిమితమైన అవగాహన సదస్సులు చిత్తూరు కలెక్టరేట్ : జగగణన (సెన్సస్) ప్రక్రియ చిత్తూరు జిల్లాలో జరుగుతోందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలే స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రస్తుతం ప్రవేశపెట్టినప్పటికీ, అది క్షేత్ర స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. క్షేత్ర స్థాయిలో ఈ ప్రక్రియ పై అవగాహన కల్పించాల్సిన క్షేత్రస్థాయి అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో అవగాహన కల్పించాలన్న నిబంధన కేవలం కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు సర్వర్లు మొరాయింపు.. మరోవైపు ఓటీపీలు రాక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి వస్తోంది. వాటిని పరిష్కరించేందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ సైతం అందుబాటులో లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. 33 రకాల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో భద్రపరచడం పై సామాన్యుల్లో ఉన్న భయాందోళనలను తొలగించే ప్రయత్నం ఏ కోశానా కనిపించడం లేదు. మే ఒకటి నుంచి సిబ్బంది తనిఖీలకు వస్తారని చెబుతున్నా, అసలైన సిబ్బందిని గుర్తించడం ఎలాగో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. ప్రచార ఆర్భాటమే.. జిల్లా వ్యాప్తంగా జనగణనపై కనీస అవగాహన కల్పించడంలో క్షేత్ర స్థాయి యంత్రాంగం విఫలమైంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా, ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. సామాన్య ప్రజలకు ఈ ఆన్లైన్ విధానంపై సరైన అవగాహన లేక ఎన్యుమరేటర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యే సమయంలో ఓటీపీలు రాకపోవడం, మ్యాపింగ్లో ఇంటి లొకేషన్ తప్పుగా చూపడం వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు గోప్యత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరూ అందుబాటులో లేరని జిల్లా వాసులు వాపోతున్నారు. భద్రతపై ఆందోళన మే 1 నుంచి సిబ్బంది ఇంటింటికీ వస్తారని చెబుతున్నప్పటికీ, గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ప్రజలు అపరిచితులను అనుమతించడానికి భయపడుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల ని చెబుతున్నా, అసలు ఆ గుర్తింపు కార్డులు అసలైనవో కాదో తేల్చుకోవడం సామాన్యులకు కష్టంగా మారింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం వల్ల జనగణన ప్రక్రియ జిల్లాలో అలసత్వంగా సాగుతోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించకపోతే, గణాంకాల సేకరణ అసంపూర్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. -
ముత్యపు పందిరిపై మురిపాల రేడు
– సింహ వాహనంపై యోగశ్రీనివాసమూర్తి అవతారంలో స్వామివారు విహారం గంగవరం: మండలంలో కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అంతకు ముందు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి తోమాలసేవ, అర్చన, చందన పుష్ప తాంబూలాలతో అభిషేకించి ఘంటానాథం తరువాత నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత శ్రీవారిని యోగ శ్రీనివాసమూర్తి అవతారంలో అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం సింహ వాహన సేవ అనంతరం ఉభయదేవేరులు సహా శ్రీవారి ఉత్సవమూర్తులను తిరిగి ఆస్థాన మండపానికి తరలించి తులసి మాలలతో అలంకరించి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉయ్యాలపై కొలువుదీరి అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ ఊంజల్ సేవ చేపట్టారు. కంకణ భట్టార్ శ్రీకాంత్ఆచార్యులు అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి. ముత్యపు పందిరిపై శ్రీకృష్ణ అవతారంలో.. బ్రహ్మోత్సవాల్లో అన్ని కై ంకర్యాలు ముగిసిన తరువాత రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడైన స్వామివారు శ్రీకృష్ణ భగవానుడి అవతారంలో రుక్మిణీ, సత్యభామతో కలిసి ముత్యపు పందిరి వాహనంలో కొలువుదీరి కీలపట్ల పుర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కాగా నాల్గవ రోజు సోమవారం ఉదయం శ్రీవారు కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనాల్లో విహరించనున్న ట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్పెషల్గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ మునిబాల, టెంపుల్ ఇన్స్పెక్టర్ మోహనరమణ, అర్చకులు ఏకే. నరసింహాచార్యులు, దేవరాజాచార్యులు, శ్రీహర్షదీక్షితులు పాల్గొన్నారు. -
వద్దే వద్దు!
చిత్తూరా.. చిత్తూరు కార్పొరేషన్: ‘చిత్తూరా.. వద్దే వద్దు’ అంటూ ట్రాన్స్కో ఉద్యోగులు మొండికేస్తున్నారు. 25 మంది ఉద్యోగులు ఇక్కడ సర్దుబాటుకు ఆమోదం తెలిపినా అందులో 16 మంది ఇంతవరకు చిత్తూరు ముఖం చూడడానికే ఇష్టపడడం లేదు. పోస్టు చిత్తూరుకు మంజూరైనా పని మాత్రం తిరుపతిలోనే చేస్తూ జీతం తీసుకుంటున్నారు. దీంత ఎస్ఈ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లాల విభజన నేపథ్యంలో తిరిగి జిల్లా ట్రాన్స్కో స్వరూపం మారనుంది. గతంలో తిరు పతి కేంద్రంగా ఉమ్మడి జిల్లా పాలన జరిగేది. నవంబర్ 2024లో ట్రాన్స్కో జిల్లా పాలనను వేరుచేసి చిత్తూరులో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు. డివిజన్లు, సబ్డివిజన్లు, సెక్షన్లలో మార్పు చేపట్టారు. అందులో భాగంగా ఇక ఉద్యోగుల బదిలీలు సాగనున్నాయి. మొదట ఎస్ఈ కార్యాలయం, తదుపరి ఈఈ కార్యాలయాల పరిధిలోని ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఈ నెలఖారులోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు బదిలీల ఆప్షన్ కోరారు. ఇందులో సీనియార్టీ ప్రతిపాదికన బదిలీలు నిబంధనల ప్రకారం నిష్పత్తి విధానంలో చేయనున్నారు. స్టోర్స్ కంట్రోల్ మారేనా? ఉమ్మడి జిల్లాకు చిత్తూరులోని స్టోర్స్ నుంచే విద్యుత్ పరికరాలు వెళ్తున్నాయి. ఒక సబ్డివిజన్కు పరికరాలు కావాలంటే ఆరోజు కోసం తిరిగి వేచి చూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా అత్యవసరమైతే అనుమతితో సబ్డివిజన్లకు పరికరాలు ఇచ్చే విధంగా సరళతరం చేయాలి. స్టోర్స్ కంట్రోల్ తిరుపతి జిల్లా టెక్నికల్ ఈఈ పరిధిలో ఉంది. పరికరాలు పంపిణీ చేయాలంటే ఈఈ వచ్చి పరిశీలించి ఆమోదం తెలిపితే తదుపరి అందజేస్తున్నారు. ప్రతిసారీ అధికారి రావాలంటే ఆలస్యమవుతోంది. స్టోర్స్ ఎదురుగానే చిత్తూరు ఎస్ఈ కార్యాలయం ఉంది. ఇక్కడ ఉన్న టెక్నికల్ ఈఈకి పరిశీలన పవర్స్ ఇస్తే పంపిణీ వేగవంతమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రాన్స్కో ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్ గందరగోళం ప్రస్తుతం ట్రాన్స్కో జిల్లా స్వరూపం మారునుంది. అస్తవ్యస్తంగా జిల్లాను మార్పు చేశారు. గతంలో 40 సెక్షన్లు, 10 సబ్ డివిజన్లు, 3 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు 34 సెక్షన్లు, 8 సబ్డివిజన్లు, 2 డివిజన్లుగా విభజించారు. చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలు వస్తాయి. ఇప్పుడు అధనంగా కల్లూరు, రొంపిచెర్లను చేర్చారు. అదేవిధంగా చిత్తూరు రూరల్ పరిధిలో జీడీనెల్లూరు నియోజకవర్గం, నగరి ఉండేవి. ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు చేరనున్నాయి. పుంగనూరు అన్నమయ్య జిల్లాకు వెళనుంది. ప్రస్తుతం చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పుంగనూరు డివిజన్లు జిల్లా పరిధిలో ఉన్నాయి. కొత్తగా చేసిన మార్పు వల్ల వినియోగదారులు అవస్థలు పడనున్నారు. -
మస్టర్ల మాయాజాలం
కార్వేటినగరం : జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలను అరికట్టేండుకు ప్రభుత్వం ఎన్ని విధానాలను ప్రవేశ పెడుతున్నా క్షేత్ర స్థాయిలో సిబ్బంది దోపిడీకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. క్షేత్ర సహాయకులు ఉపాధిహామీ సిబ్బంది కుమ్మకై ్క బోగస్ మస్టర్లతో నిధులను మింగేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉపాధిహామీ పథకంలో పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రతి కూలీ వారి ముఖాన్ని ఆన్లైన్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్(ఫేస్రిగ్నైజేషన్ సిస్థ)లో నమోదు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ నమోదు చేసే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడి నుంచి ట్యాగ్ చేశారో అక్కడ మాత్రమే ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు చేతి వాటంతో వారికి అనుకూలంగా ఉన్న వారికి పనులు చేయించి.. అక్కడ ఫీల్డ్అసిస్టెంట్ ఒక కూలీ ముఖాన్ని ఆన్లైన్లో పెట్టి మిగిలిన వారికి హాజరు నమోదు చేస్తున్నారు. వాస్తవంగా కష్టపడి పనులు చేసిన కూలీలకు తక్కువగా బిల్లులు పడుతున్నాయి. బినామీ మస్టర్లతో ఫొటోలకు ఫోజ్ ఇచ్చేవారికి ఎక్కువగా బిల్లులు వస్తున్నాయని పలువురు కూలీలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఫీల్డ్అసిస్టెంట్లు టీడీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి అక్రమాలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి ఉపాధిహామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని పలువురు కూలీలు కోరుతున్నారు. ఒక ఫొటోని ఆన్లైన్ చేసి..ఒక ఫొటోని ఆన్లైన్ చేసి ఏడుగరికి హాజరు -
సీఆర్రెడ్డికి నివాళి
● ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వందేళ్లు ● ఆయన కృషి మరువలేనిది ● కట్టమంచి హరిణిరెడ్డి చిత్తూరు కార్పొరేషన్: విద్యా ప్రదాత దివంగత సీఆర్రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) అని వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ కట్టమంచి హరిణిరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్ బంగ్లా వద్ద గల సీఆర్రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఆమె ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి వందేళ్లు అయ్యిందన్నారు. దాని ఏర్పాటు వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. సీఆర్రెడ్డి శాసనసభలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 1926లో ఏర్పడిన విశ్వవిద్యాలయానికి వైస్చాన్స్లర్గా సేవలందించారన్నారు. ఆయన వేసిన విద్యా పునాదులే కోట్లాది మందికి చదువు నేర్పిందన్నారు. హరిజనులకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి అప్పట్లో కృషి చేశారన్నారు. ప్రతి ఊరికీ పాఠశాల అనే ఉద్యమాన్ని ప్రారంభించారని వివరించారు. కార్యక్రమంలో నాయకులు తలుపల్లి బాబురెడ్డి, విజయసింహారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, మనోహర్రెడ్డి, శేఖర్రెడ్డి, చిత్తూరు రెడ్డి జేఏసీ సభ్యులు హరిప్రసాద్రెడ్డి, శివరెడ్డి, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,350 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,597 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. నేడు నిండ్రలో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం నగరి నియోజకవర్గం నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పలమనేరులో పోలీస్ గ్రీవెన్స్ పలమనేరు/ చిత్తూరు అర్బన్ : పలమనేరులోని డీఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం ఎస్పీ తుషార్డూడీ ఆధ్వర్యంలో పోలీస్ గ్రీవె న్స్ కార్యక్రమం నిర్వహించనన్నునట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉద యం 10.30 గంటలకు మొదలవుతుందని, పోలీసులకు సంబంధించి లేదా అన్యాయం, అక్రమా లు జరిగిన బాధితులు నేరుగా వచ్చి ఎస్పీతో విన్నవించాలని అందులో సూచించారు. కాణిపాకం కిటకిట కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూలో నిరీక్షించడం కనిపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలో తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్లో మెరిట్ జాబితా చిత్తూరు కలెక్టరేట్: విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల తాత్కాలిక (మెరిట్) జాబితాను www.chittoor.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వినోద్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఆ వెబ్సైట్ను సందర్శించి అభ్యంతరలుంటే రాత పూర్వకంగా ఆ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. సోమవారం నుంచి మే 1 సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయపు పనివేళ్లలో సంబంధిత పత్రాలను ఇవ్వాలన్నారు. ఉద్యోగాల పేరిట దళారులు, మధ్యవర్తుల ప్రమేయానికి గురికాకుండా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీజిల్ నిల్! కాణిపాకం: జిల్లా పరిధిలో డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా సరఫరాలో జాప్యం నెలకొనడంతో పలు పెట్రోల్ బంక్లలో డీజిల్ నిల్వలు ఖాళీవుతున్నాయి. వాహనదారులు పలు బంక్ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంక్ డీలర్లు సైతం డీజిల్ పట్టేందుకు కొన్ని నిబంధనలు పెట్టారు. బల్క్ డీజిల్కు కొంత వరకు మాత్రమే పరిమతం చేశారు. వేల లీటర్లకు నో చెబుతున్నారు. డ్రమ్లు తేవద్దని తిప్పి పంపిస్తున్నారు. జిల్లా లో 146 పెట్రోల్ బంక్లుండగా.. 30కిపైగా మూతపడ్డాయి. దీనికితోడు 60బంక్ల్లో డీజిల్ నిల్వలు జీరో స్థాయికి చేరాయి. ఈ సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
ఇసుకాసురులు!
ఇంధన కష్టాలు అక్రమ ‘మార్గం’ నగరి: పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారుల రద్దీనగరి: డీజిల్ కోసం పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన కార్లు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడం కనిపించింది. చాలా బంకుల వద్ద డీజిల్ అందుబాటులో లేదంటూ బోర్డులు వెలిశాయి. ఆటో, ట్రాక్టర్, లారీ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో డీజిల్ కొరత ప్రభావం పెట్రోల్పైనా పడింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ కూడా దొరకకపోవచ్చన్న భయంతో ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ బంక్ల వద్ద క్యూకట్టి ఫుల్ ట్యాంక్ నింపుకుంటున్నారు. – నగరి చిత్తూరు చుట్టుపక్కలా అనధికారిక ఇసుక డంప్లు చిత్తూరు చుట్టుపక్కలా ఇసుక తోడేళ్లు మాటు వేశాయి. అదును చూసి ఇసుక డంప్లు సిద్ధం చేస్తున్నాయి. ఆపై పోలీసులు, అధికారుల కళ్లెదుటే తమిళనాడుకు తరలిస్తున్నాయి. విచ్చలవిడిగా జేబులు నింపుకుంటు చెలరేగిపోతున్నాయి. అయితే ఈ దందాను చంద్రబాబు ప్రభుత్వంలోని మరో వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. అక్రమార్కులపై హైకమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై చిత్తూరులో సర్వత్రా చర్చ సాగుతోంది. సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు ఇసుక దోపిడీయే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్పేట ప్రాంతం, పూతలపట్టు మండలంలోని వావిల్తోట, జీడీనెల్లూరు మండలంలోని కొట్రకోన తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు. అక్కడ తవ్వకాలు చేసుకుని చిత్తూరు నగరం, మండల సరిహద్దు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. బీఎన్ఆర్పేట, మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగ, మురకంబట్టు, కొత్తగా నరిగపల్లిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద భారీగా నిల్వ చేస్తున్నారు. అధికారుల చోద్యం ఇసుక దందా చిత్తూరులో పేట్రోగిపోతోంది. బహిరంగంగా ప్రజాప్రతినిధుల పేరుతో ఇసుక దందా నడుస్తోంది. పలు శాఖల అధికారులు మాఫియా ఉచ్చులో పడిపోతున్నారు. దందా సాగుతున్నా మామూలేకదా అని లైట్ తీసుకుంటున్నారు. కళ్లెదుటే ఇసుక టిప్పర్లు తిరుగుతున్నా పట్టించుకోవడవం లేదు. పై అధికారులు అడిగినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సొంత పార్టీ నేతల గుర్రు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్లను తోసిపుచ్చేశారని కొందరు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతా పిల్ల నాయకులదే పెత్తనమంటూ.. సీనియర్లు మండిపడుతున్నారు. ఏళ్ల తరబ డి పార్టీకి కష్టపడితే కష్టం మాది.. ఫలాలు వారికా అంటూ..మండిపడిపోతున్నారు. ఇసుక అక్రమ వ్యాపారాల్లో నిన్నగాక మొన్నవొచ్చిన వాళ్లకే పగ్గాలు ఇస్తారా..? అంటూ విరుచుకుపడుతున్నారు. దీన్ని జీర్ణించుకోని సీనియర్లు కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్టు కొందరు నేతలు బహిరంగంగా చెప్పుకుంటు న్నారు. ఇసుకాసురుల ఆగడాలు శ్రుతి మించి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని చెప్పుకొస్తున్నట్టు సమాచారం. -
ఉద్యోగోన్నతి ఎప్పుడు?
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు అంకమ్మరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో సంక్షేమ, విద్యా సహాయకుల అసోసియేషన్ సమావేశం, జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సచివాలయం విద్యా సహాయకులకు తక్షణమే ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మార్పు, పెండింగ్లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్లను త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక సంక్షేమ, విద్యాసహయకుల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా రాజకుమార్, జనరల్ సెక్రటరీగా మురళీనాథ్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసులు, శ్రావణకుమార్, ట్రెజరర్గా మదన్మోహన్, జాయింట్ సెక్రటరీగా రోహిణికుమార్,వినయ్, మహిళా అధ్యక్షురాలుగా సృజనను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. -
అశ్రునివాళి
వైఎస్సార్సీపీ సీనియర్ నేతకు పెద్దిరెడ్డి నివాళి దహనక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ భరత్ మధుసూదన్రెడ్డి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిరామకుప్పం(కుప్పం): కుప్పం నియోజకవర్గ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ స్వరూపారెడ్డి భర్త మధుసూదన్రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న రారష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం చెల్లిగానిపల్లి చేకున్నారు. మధుసూదన్రెడ్డి మృతదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సీనియర్ నేతల మృతి పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. నివాళి అర్పించిన వారి లో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ తదితరులున్నారు. -
కులాల మధ్య చిచ్చుపెడుతున్న చంద్రబాబు
కార్వేటినగరం: సీఎం చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు గౌరవం, హోదా వచ్చింది వైఎస్ రాకశేఖరరెడ్డి ప్రభుత్వంలోనేనన్నారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి రెండడుగులు ముందుకేసి దళితులకు సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల పథకాలను తీసుకొచ్చి అమలు చేశారని తెలిపారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విభజించి వారి మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని తెలిపారు. దళితులంటే చంద్రబాబుకు చులకన అని, గతంలో ఎన్నో బహిరంగ సమావేశాల్లో దళితులను నీచంగా మాట్లాడిన రోజులు ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎస్సీ, ఎస్టీలను అణదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలకు చెందిన వారి కనుసన్నల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు వాస్తున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గాలపై జరుగుతున్న అన్యాయం, సామాజిక అసమానతలపై దళిత ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పేదల సమస్యలను విస్మరించి పెత్తందారుల కోసమే ఆరాటపడుతున్నాడని విమర్శించారు. ప్రశ్నించిన వారి గొంతుకను అణచి వేయడానికి పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు నమోదు చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ఇలాంటి రాజకీయ నాయకులకు చరిత్ర ఉండబోదన్నారు. నేడు వైఎస్సార్సీపీ నిరసన యాదమరి: పంచాయతీరాజ్శాఖలో గత డిసెంబర్ నుంచి ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు కోనాపల్లి మనోహర్ చెప్పారు. ఆధివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ప్రభు త్వం నిర్లక్ష్యం వల్ల ఉపాధి కూలీలకు వేతనాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. సుమారు రూ.1,059 కోట్ల మేరకు ఉపాధి నిధులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. వెంటనే ఆ బకాయిలను చెల్లించి కూలీల కష్టా లు తీర్చాలని డిమాండ్ చేశారు. -
డీఈఈ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : డీఈఈ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 26తో దరఖాస్తులకు సమయం ముగుస్తుంది. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మరో ఐదు రోజులు సమయం పొడిగించారు. జిల్లాలో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. రేపు నిండ్రలో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న నగరి నియోజకవర్గం నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. వార్డుల పునర్విభజన గడువు పెంపు చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంచడానికి చేపట్టిన పున ర్విభజన కార్యక్రమ గడువును పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. వాస్తవానికి వార్డుల సంఖ్య పెంచు తూ, కొత్త వార్డుల జాబితాను ఆదివారం ప్రచురించి.. ఆపై అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందించాల్సి ఉంది. కానీ ఈ గడువును వచ్చేనెల 17వ తేదీకి పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు తనిఖీలు చిత్తూరు అర్బన్: ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. నేరాలు జరగకమునుపే కార్డెన్సెర్చ్ పేరిట జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి.. ప్రజల్లో అవగాహన పెంచుతున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపా రు. చోరీలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను నియంత్రిండానికి ప్రజలు సహకరించాలని కోరారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీరంగరాజపురం: ఐచర్ వాహనం బోల్తా పడిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట సమీపంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా... చిత్తూరు జిల్లా మొలకల చెరువు నుంచి శ్రీరంగరాజపురం మండలంలోని మొదవాడ గ్రామానికి చెందిన ఓ కోళ్ల ఫారానికి మొక్కజొన్నల లోడ్తో వెళ్తూ 49 కొత్తపల్లిమిట్ట సచివాలయం సమీపంలో చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో స్పందించిన స్థానికులు స్వల్పగాయాలతో బయటపడిన వాహనం డ్రైవర్, క్లీనర్లను చికిత్స నిమిత్తం ఆరిమాకులపల్లి పీహెచ్సీకి తరలించారు. టైరు పేలడంతో.. మొలకల చెరువు నుంచి మొక్కజొన్న లోడ్తో మొదవాడకు వస్తున్న ఐచర్ వాహనం టైర్ పేలి అదుపుతప్పి బోల్తా పడిన చోట ఒక్క అడుగు దూరంలో 33/కేవీ విద్యుత్ స్తంభం ఉంది. బోల్తాపడిన వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకుని ఉండేదని, ఒక్క క్షణంలో ప్రమాదం తప్పిందని జనం ఊపిరి పీల్చుకున్నారు. -
పేదల ఆత్మ బంధువులు
సమస్యలను చూసి చలించి పట్టణంలో జీలుబాయి తన స్నేహితులతో కలిసి కులాలతో సంబంధం లేకుండా అనాథలకు అంత్యక్రియలను నిర్వహించడం చేస్తున్నారు. దీంతోపాటు కోవిడ్ సమయంలో తామున్నామంటూ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఎన్నో రకాల సేవలు చేపట్టారు. ముఖ్యంగా అనాథ శవాలను శ్మశానానికి తరలించేందుకు ఓ వాహనం ఏర్పాటు చేశారు. ఇక అత్యవసర పరిస్థితుల్లోని వారికి మెరుగైన వైద్యం కోసం ఉచిత అంబులెన్స్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. దీనికి తోడు గత రంజాన్ నెలలో ఇంకేదైనా మంచి పని చేయాలనే తలంపుతో ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు అవసరనైన సామగ్రిని పలు ప్రాంతాల నుంచి తెచ్చి స్థానిక ఖబరస్థాన్ వద్ద మర్కజ్ గదుల్లో అందుబాటులో ఉంచారు. పేదలకు ఉచితంగానే సామగ్రి డబ్బులిచ్చి కొనుక్కునే వారే కాకుండా పేద ముస్లింల కు ఈ వస్తువులకు ఉచితంగానే అందజేస్తున్నట్టు జీలు బాయ్ తెలిపారు. అయితే వీరు పేదలని సంబంధిత మసీదు పెద్దలతో ఓ లెటర్ తీసుకొని వచ్చి ఇక్కడి చూ పెట్టి అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని ఉచి తంగానే పొందేలా చేశారు. దీంతో నియోజకవర్గంలో ని ముస్లింలు వీరి సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటి దాకా ఎవరికీ రాని మంచి ఆలోచన చేసిన వీరికి అల్లా కృప ఉంటుందని ఆశీర్వదించుతున్నారు. ఎన్నికోట్లుండి.. ఎంతో బాగా బతికిన వారుగాని, పేదరికాన్ని అనుభవిస్తూ జీవించిన వారు కావచ్చు చివరకు చేరేది మట్టిలోకే. సాధారణంగా హిందువులకు సంబంధించి ఎవరైనా పేదలు మృతి చెందింతే కొందరు అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని కొనిచ్చి వారికి ఇవ్వడం చూస్తుంటాం. ఇదే తరహాలో పలమనేరులోని కొందరు ముస్లిం యువకులు స్థానిక సంఘ సేవకుడు జీలుబాయి ఆధ్వర్యంలో ముస్లింలు ఎవరైనా మృతి చెందింతే వారి అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని సేకరించి ఒకేచోట పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు. – పలమనేరు అన్ని వస్తువులు ఒకే కిట్లో.. సాధారణంగా ముస్లింలు మృతి చెందితే వారి అంత్యక్రియల నిర్వహణ కోసం కావాల్సిన వస్తువులు ఓచోట దొరకవు. దీంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి 12 రకాల వస్తువులను కొనాల్సి ఉంటుంది. దీనికితోడు అవసరాన్ని బట్టి వీటి ధరలు పెంచి అమ్ముతుంటారు. ఫలితంగా అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా సామగ్రికి వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నగదు డబ్బున్నవారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాని పేదవారికి చాలా కష్టమైన పనే. దీన్ని గమనించిన జీలుబాయ్ బృందం కదిరి, మదనపల్లి, కర్ణాటకలోని కోలారు తదితర ప్రాంతాల నుంచి కర్రలు, ఈత చాప, రాళ్ల ఉప్పు, కొత్త బట్ట, అవసరమైన సెంట్లు తదితర 12 రకాల సామగ్రిని ఓ ప్యాక్గా చేసి అవసరమైన వారికి అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా పోవాల్సిందే.. డబ్బులున్నవారు అంత్యక్రియలను చేయడం పెద్ద విషయం కాదు. అదే పేద ముస్లింలకు అంత్యక్రియల సామగ్రి కొనాలన్నా కష్టమే. దాంతో పాటు అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట దొరకవు. అందుకే అన్నింటిని కొని అవసరమైన వారికి అందుబాటులో స్థానిక ఖబరస్తాన్ సమీపంలోని మర్కజ్ కాంప్లెక్స్లో ఉంచాం. ఇందుకు సహకరించిన ముస్లిం మర్కజ్ జమాత్ పెద్దలు హామిద్, అజాం, సలాంబైతో పాటు ముస్లిం యువత మద్దతు మరువలేం. – జీలుబాయ్, పలమనేరు -
ప్రసవాల సంఖ్యను పెంచండి
గుడిపాల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్ఓ శశిభూషణ్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎండలు తీవ్రంగా ఉండడంపై హీట్స్ట్రోక్పై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎమ్లు, ఆశావర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కాన్పుల సంఖ్యను పెంచి 24గంటలు వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డాక్టర్లు సంధ్య, చంద్రమహేష్, స్టాఫ్నర్స్ పవిత్ర, వనజ, సీహెచ్ఓ సూర్యనారాయణ, సిబ్బంది త్రిలోక్, విజయ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. -
తెలుగు భాషకు పునర్ వైభవం తెద్దాం
పలమనేరు: తెలుగుభాషకు పునర్ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్ పేర్కొన్నారు. మండలి వెంకటక్రిష్ణారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పలమనేరులోని కళామందిరంలో శనివారం జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ...తెలుగుభాష మనుగడకు ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యం, అధికారులు సమన్వయం అవసరమన్నారు. తెలుగుభాషా రక్షణకు ముఖ్యంగా గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుభాషా వికాసానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్ వివరించారు. కార్యక్రమాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు, జాయినింగ్ దడాట్స్ నిర్వాహకులు ధనుంజయల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రచయిత కట్టమంచి బాలక్రిష్ణారెడ్డి, పలమనేరు బాలాజీ, గంటా మోహన్, ధనుంజయ రామక్రిష్ణప్ప, మంచి కంటి వెంకటేశ్వర్రెడ్డి, పుష్ప, సిద్దార్థతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు చెందిన పలువురు కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. -
రెండు క్వారీలు సీజ్
– హిటాచీ, లారీ స్వాధీనం – నిర్వాహకులు పరారీ కుప్పంరూరల్ : రెండు అక్రమ క్వారీలను సీజ్చేసి అందులో పనులు చేపడుతున్న ఒక హిటాచీ, లారీని స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారధి చెప్పారు. శనివారం ఉదయం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజ్ చేసిన క్వారీల వివరాలు వెల్లడించారు. కుప్పం మండలం, గుట్టపల్లి వద్ద ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్వారీలపై పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. దాడులు సందర్భంగా క్వారీలు కార్యకలాపాలు జరుగుతున్నాయని, పోలీసులను చూసి నిర్వాహకులు పారిపోయినట్లు చెప్పారు. వ్యక్తులు పారిపోగా.. అక్కడే వదిలివెళ్లిపోయినా హిటాచీ, లారీను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ క్వారీలు, నాటు సారా తయారీ, గంజాయి విక్రయాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ముఖ్యంగా మహిళలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రశాంత కుప్పంలో అక్రమ రవాణా, కార్యకలాపాలకు తావులేదని, ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పారు. సమావేశంలో అర్బన్ సీఐ శంకరయ్య తదితరులు ఉన్నారు. -
ఇక్కడ నేనే బాస్!
సాక్షి టాస్క్ఫోర్స్: అదో గ్రామ పంచాయతీ అక్కడ పోలీసులు, అధికారం, నిబంధనలను పాటించడం లాంటివి ఉండవు. అసలు అధికారుల పెత్తనం ఏమీ జరగదు. కేవలం ఓ నేత చెప్పినట్టే అధికారులు తలూపాల్సిందే. ఆయన ఏం చేసినా కరెక్ట్ అంటూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండాల్సిందే. గ్రామంలో ఆయనేమి చేసినా ఎవరూ అడ్డు చెప్పకూడదు. నేటి ప్రజాసామ్యంలోనూ ఇలాంటి ప్రైవేట్ పాలన సాగుతోందంటే నమ్మశక్యం కాదేమో. కానీ ఇది నిజం అదెక్కడోకాదు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామం. ఆ నేత ఏం చేసినా నోరూల్స్.. ఇటీవల గ్రామంలోని ముస్లిం మైనారిటీలు అనాదిగా వస్తున్న ఉరుసును ప్రశాంతంగా చేసుకునేందుకు ఓ పోలీసు పెద్దాయన వద్ద అనుమతి కోసం వచ్చారు. ఆయన గంగవరం స్థానిక పోలీసు అధికారికి రెఫర్ చేశారు. ఆయనేమో ఆ గ్రామంలోని టీడీపీ నేత చెబితేగాని తాము అనుమతులివ్వమని తేల్చి చెప్పాడు. దీంతో ఉరుసు, గంధం పండుగలు ఇప్పటికీ ఆ గ్రామంలో జరగనేలేదు. అదే గ్రామంలో ఆ నేత ప్రమాదకరమైన ఎద్దుల పరుగు పందెంను నిర్వహించి రూ.లక్షల్లో బహుమతులిచ్చారు. ఈ బహుమతులను అక్కడి ఎస్ఐతో పాటు పోలీసులే ఇవ్వడం కొసమెరుపు. ఈ ఎద్దుల పరుగు పందేంలో పలువురు తీవ్రంగా గాయపడినా నో పోలీస్ యాక్షన్. ట్యాంకును అనుమతి లేకుండానే కూల్చేశారు.. సాధారణంగా ఆయా శాఖలకు చెందిన భవనాలను కూల్చాలంటే ఆయాశాఖ అధికారుల అనుమతులుండాలి. కానీ అక్కడ ఇవేమీ లేవు. గ్రామంలోని పాత రక్షిత నీటి ట్యాంకును తాజాగా ఆయన ఆదేశాలతో నేలమట్టం చేశారు. గతంలో ఆయన ప్రైవేట్ స్కూల్ కోసం రూ.లక్షలతో నిర్మించిన ఆర్అండ్బీ డ్రైన్ను పూడ్చేశాడు. గ్రామంలో తన బ్యానర్ ఏర్పాటు కోసం దాని పక్కనున్న హోటల్ను ఖాళీ చేయించేశాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే పోలీసుల ద్వారా కేసులు, దాడులు తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ అయినా పోలీసు నిఘా వ్యవస్థ ద్వారా వాస్తవాలను తెలుసుకొని అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలని అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఎస్పీకి వాట్సాప్ ద్వారా విన్నవించారు. -
బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : గత ఏడాది బదిలీలు పొందిన టీచర్లను తక్షణమే రిలీవ్ చేయాలని వైఎస్సార్టీఏ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బదిలీలు పొందిన టీచర్లకు విద్యాసంవత్సరం పూర్తయినా నిరీక్షణ తప్పడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. విద్యాసంవత్సరం పూర్తయినప్పటికీ రిలీవర్లు లేరనే సాకుతో రాష్ట్ర వ్యాప్తంగా 954 మంది టీచర్లను ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగించడం దారుణమన్నారు. బదిలీ ఉత్తర్వులు చేతిలో ఉన్నా రిలీవ్ చేయకపోవడంతో ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. కొత్త ప్రాంతంలో నివాసం ఎక్కడ ఉండాలో, పిల్లల చదువుల పరిస్థితి ఏమిటో తెలియక ఉపాధ్యాయులు సందిగ్ధంలో ఉన్నారని వాపోయారు. బదిలీ చట్టాన్ని తెచ్చిన విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రిలీవ్ చేయడానికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తక్షణమే రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ మేళాలో 256 మంది ఎంపిక చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ మేళాలో 256 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటాచలపతి తెలిపారు. శనివారం ఆ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. వివిధ బహుళజాతి కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 430 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతిభ చాటిన 256 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అనంతరం ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ రంగనాథం, విద్యాసలహాదారు నారాయణ, సీఈ నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యం – ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తిరుపతి సిటీ: ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే జాతీయ సంస్కృత వర్సిటీ ప్రధాన ధ్యేయమని వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ఎస్యూలో పాక్శాసీ్త్ర(ఇంటర్మీడియట్), యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అడ్మిషన్ సెల్ను నేరుగా లేదా ఫోన్ నంబర్ 7382595500లో సంప్రదించాలని కోరారు. అనంతరం 2026–27 ప్రవేశాల నోటిఫికేషన్ బ్రోచర్ను విడుదల చేశారు. వచ్చేనెల 4వ తేదీ నుంచి వర్సిటీలో యోగా సమ్మర్ క్యాంప్ను నిర్వహిస్తున్నామని, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు వర్సిటీలోని యోగా విభాగంలో సంప్రదించి నిర్ధేశించిన ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందాలన్నారు. వర్సిటీలో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ ఎన్ఎస్యూలో నూతనంగా స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ప్రారంభిస్తున్నట్లు వీసీ తెలిపారు. సంస్కృత విద్యతోపాటు ఆధునిక కోర్సులు, కంప్యూటర్సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, లాంగ్వేజ్ టెక్నాలజీ వంటి యూజీ, పీజీ కోర్సులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. -
టీటీడీ ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్టుకు రూ.10 లక్షలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటీ సంస్థ యజమాని ససపు శ్రీనివాస్ విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళ డీడీని శనివారం స్థానిక పరిపాలనా భవనంలో టీటీడీ ఈఓ రవిచంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణానికి చెందిన చీఫ్ ఇంజినీర్ డి.శ్రీనివాస్రావు, రైల్వే అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కార్పొరేషన్: గ్రంథాలయాల్లో బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వేసవి శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 71 శాఖా గ్రంథాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తారన్నారు. వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ, హ్యాండీ క్రాఫ్ట్స్, ఆటల్లో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్వీ మెడికల్ కాలేజీలో చర్మ మార్పిడిపై పరిశోధన
తిరుపతి కల్చరల్: చర్మ మార్పిడి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఎస్వీ మెడికల్ కళాశాలలో చేప చర్మంతో కాలిన గాయాలకు వైద్య చికిత్స చేసే విధానంలో పరిశోధన చేస్తున్నట్లు ఎస్వీ వైద్య కళాశాల బహుళ పరిశోధన సంస్థ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్.కిరీటి తెలిపారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలిన చర్మాన్ని పునరుత్పత్తి చేసే వైద్యం చాలా ఖర్చుతో కూడుకోవడంతో అది అందుబాటులో లేక ఎంతో మంది వైద్యానికి దూరమవుతున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రముఖ శస్త్ర చికిత్స వైద్యరాలు డాక్టర్ రోజారమణి పరిశోధన చేపట్టారన్నారు. భారతీయ చరిత్రలో మన పూర్వీకులు 2 వేల ఏళ్ల కిందటే చేప చర్మంతో ఈ వైద్యం మొదలు పెట్టారని, అయితే అది కనుమరుగైందని తెలిపారు. దీనిని ఆధునాతన పరిశోధన వైద్య పద్ధతులతో పరిశోధనలు చేసి, దేశవాళి చేప చర్మంతో చర్మ మార్పిడి పద్ధతులను పరిశోధించి రోగికి అందించాలనే ఉద్దేశంతో ఎస్వీ మెడికల్ కళాశాల, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, పశువైద్యశాల, పద్మావతి మహిళా వర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టడం జరిగిందన్నారు. జాతీయ వైద్య పరిశోధనా సంస్థ నుంచి ఈ పరిశోధనకు అనుమతి లభించడంతో ఒన్ హెల్త్ కార్యక్రమం కింద పరిశోధనలు దిగ్విజయంగా చేపడుతున్నామని తెలిపారు. మహిళా వర్సిటీ ఫార్మసీ విభాగం డాక్టర్ విద్యావతి ఈ చేప చర్మాన్ని, డ్రాప్ట్స్ చర్మమని కాలిన గాయాలపై ఉపయోగించేలా తయారు చేశారని తెలిపారు. ఈ చేప చర్మంపై చేసిన పరిశోధనలను ఘనంగా పురోగతి చెందుతున్నాయని, ఎలుకలపై పరిశోధించడానికి సంయుక్తంగా అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రోజా రమణి, పరిశోధకులు వి.మధుసూదన్, డాక్టర్ ఆర్వీ.సురేష్కుమార్, ఎస్వీ వైద్య కళాశాల పీఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ కాలనీలో చోరీ
– 16 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు అపహరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై శనివారం చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలో బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి..ఇంట్లోకి చొరబడ్డారు. రూ.2.50 లక్షల నగదు, 16 తులాల బంగారం దోచుకెళ్లారు. దీనిపై బాధితుడు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని యువకుడి అనుమానాస్పద మృతి బంగారుపాళెం: మండలంలోని కొత్తపల్లె బస్స్టాప్ వద్ద శనివారం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. మహాసముద్రం టోల్ ప్లాజాకు సమీపంలో కొత్తపల్లె బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 40–50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. మృతుడు ఎవరనే వివరాలు తెలియడంలేదన్నారు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి చిరునామా తెలిసిన వారు బంగారుపాళెం పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. -
గుండె గుబిల్లు
కార్వేటినగరం: కార్వేటినగరం మండలంలో విద్యుత్శాఖ అధికారుల నిర్వాహకం నిరుపేదల పాలిట శాపంగా మారింది. ఒంటరి మహిళ ఇంటికి ఏకంగా రూ.14వేలకుపైగా బిల్లు రావడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. పద్మసరస్సు గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. ఆమెకు పిల్లలు లేరు. ఫ్యాన్, ప్రిడ్జ్, ఏసీలాంటివేమీ లేవు. లైటు తప్ప ఇంకేమీ లేవు. అయినా ఆమెకు ఈనెల 21న వచ్చిన బిల్లు చూస్తే గుండె గుభేలు మంటోంది. ఏకంగా రూ.14,902 బిల్లు వచ్చింది. మొత్తం బకాయి మే 6వ తేదీలోపు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు బాధితురాలు వాపోయారు. ఒక్క వెంకటమ్మ పరిస్థితే కాదు. గ్రామంలో ఏడుగురికి వేలల్లో విద్యుత్ బిల్లులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. మీడియా ముందు వాపోతున్న మహిళలు, అత్యధికంగా వచ్చిన విద్యుత్ బిల్లు అదనపు బిల్లులు వసూలు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్ వాడితే అధనంగా వసూళ్లు చేస్తున్నాం. పై అధికారుల ఆదేశాల మేరకే విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను మిగిలిన యూనిట్లకు సంబంధించి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సిందే. – చంద్రబాబు, ఏడీఈ, కార్వేటినగరం -
మెరుగైన వైద్య సేవలు ముఖ్యం
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్రెడ్డి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందివ్వడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. జనాభా నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందికి వారం పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుతం జనాభా పునరుత్పత్తి రేటు 1.5గా ఉండటంతో దానిని పెంచే దిశగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వడదెబ్బలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్సీలు, నిర్మాణ స్థలాలు, పనిస్థలాల్లో ఓఆర్ఎస్ డిమాండ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ యార్డుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ పంపిణీ చేయాలన్నారు. అనుమానిత వడదెబ్బ కేసులు గుర్తించిన వెంటనే 108లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇక సంజీవిని ప్రాజెక్టును, చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్తో ఉచితంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామన్నారు. సమావేశంలో డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ గిరి, డాక్టర్ అనూష, డాక్టర్ నవీన్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా రాజకీయాల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఇన్నాళ్లు ముసుగులో సాగుతున్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కూటమి నేతలకు సవాలు విసురుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలపై జరుగుతున్న అన్యాయం, సామాజిక అసమానతలపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పోరు, సామాజిక సమీకరణాలు, రాజకీయ ఆధిపత్యం కలిసిన సంక్లిష్ట పరిణామంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలను బహిరంగ వేదికపైకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే థామస్, కూటమి నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘ఎస్సీలను ఓట్ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా, టీడీపీలో సామాజిక అసమానతలపై గట్టిగా వినిపించిన స్వరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికి పెత్తనం? జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార, పరిపాలన వ్యవహారాల్లో అదే వర్గానికి చెందిన నేతల ప్రభావం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇతర వర్గాలు, ముఖ్యంగా బడుగు వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసంతృప్తినే ఎమ్మెల్యే థామస్ ఇప్పుడు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని భావిస్తున్నారు. పాలసముద్రం నేత ఎంట్రీతో మారిన సమీకరణాలు పాలసముద్రానికి చెందిన ఓ బడా నేతకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారన్న ప్రచారం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. స్థానికంగా ఎన్నికై న ప్రజాప్రతినిధిని పక్కన పెట్టి బయట నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వడం అసహనానికి దారి తీసిందని తెలుస్తోంది. అది కూడా ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా అతనికి పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణయాల్లో తన పాత్రను తగ్గిస్తున్నారన్న భావనతోనే థామస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.కూటమిలో ఎస్సీ ఎమ్మెల్యేలే టార్గెట్టా? ‘పార్టీలో ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకే విధమైన ప్రయత్నం జరుగుతోంది’ అన్న థామ స్ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ పోరు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ ఎమ్మెల్యేలను అణగాదొక్కడంలో భాగంగానే కొందరు కుట్రతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను ట్రాప్ చేసి ఇరికించారని, ఆఖరుకి ఆయన్ని సస్పెండ్ చేసే స్థాయికి తీసుకొచ్చారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాను ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేని అయితే ఇబ్బంది ఉండేది కాదని రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా మొదటి ర్యాంకు ఇచ్చే వారిని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీ గెలుపునకు ఎస్సీల ఓట్లు అవసరం, పదవులు అనుభవించడానికి మాత్రం పనికిరామ అన్నట్లు చురకలు అంటించారు. టీడీపీలో ఎస్సీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. టార్గెట్ ఎస్సీలే! ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. నిన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నేడు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆ సామాజిక వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. ఆ నియోజకవర్గాల్లో గెలుపొందిన ఒక్కరు తప్ప మిగిలిన కూటమి ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బానిసలుగా బతకాలా? ఎస్సీ వర్గాల పరిస్థితిపై మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ ‘ఎస్సీలు బానిసలుగా బతకాలా?’ అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ఆ సామాజికవర్గంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై నేరుగా విమర్శలుగా మారడమే కాకుండా, సామాజిక న్యాయం అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో తాను ఉన్నంత వరకు గంగాధరనెల్లూరులో వేరొకరు రారు, రానివ్వననే సంకేతాలను ఇచ్చారు. ఒకే రోజు ఇద్దరు టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలు, అధికారుల తీరుపై చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ శ్రేణులు చెబుతున్నదేమిటంటే? నియోజకవర్గంలో తనకు తెలియకుండా.. తన అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడంపై ఎమ్మెల్యే థామస్ అమరావతికి వెళ్లి ముఖ్యనేతలను కలిశారని, అక్కడ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకుంటున్నారు. అమరావతి నుంచి వచ్చిన థామస్ అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమావేశానికి పిలిచినా ఓ సామాజిక వర్గం నేతలు రాలేదని వెల్లడించారు. ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేపట్టినా ఓ సామాజిక వర్గం నేతలు హాజరు కాకపోవడం, స్థానికులను కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘ఓ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు’ ఏ కార్యక్రమానికి రాకపోవడం, ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వారు రాకపోవడం, ఎమ్మెల్యేను అడుగడుగునా అవమానిస్తున్నట్లు స్థానిక శ్రేణులు చెప్తున్నాయి. అందుకే ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. -
దేశ ఆత్మ గ్రామాల్లో ఉంది
చిత్తూరు కార్పొరేషన్: దేశ ఆత్మ గ్రామాల్లో ఉందని, ఈ మేరకు గతంలో మహాత్మాగాంధీ పేర్కొన్నట్టు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్(పీఆర్), అనుబంధ విభాగాల ఉద్యోగుల పనితీరు అభినందనీయమన్నారు. ప్రజలకు పారదర్శక పాలనను ప్రజాప్రతినిధులు అందించాలన్నారు. గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక విధంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు సేవలందిస్తున్నరని కొనియాడారు. దివంగత పీఎం, సీఎంలు రాజీవ్గాంధీ, ఎన్టీఆర్లతో పంచాయతీరాజ్ విభాగంలో పలు సంస్కరణలు వచ్చాయన్నారు. గత సంవత్సరం ఉత్తమ పంచాయతీగా ఐరాల మండలం, బొమ్మసముద్రం, జిల్లా పంచాయతీ అధికారిగా అవార్డులు అందుకున్నట్లు డీపీఓ సుధాకర్రావు గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ఏడాది అవార్డు వచ్చిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అవార్డుల ప్రదానం కార్యక్రమం వాయిదా వేశారన్నారు. కేంద్ర పన్నుల సహకారంతో గ్రామాలు అభివృద్ధి జరుగుతోందన్నారు. అనంతరం డీపీఓ, డీపీఆర్సీ కార్యాలయాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో డెప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, డ్వామా పీడీ రవికుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, డీఎల్డీఓ రవికుమార్, పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్న పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులు -
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నారంటూ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు చేశారు. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు. మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందన్న థామస్.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదు.. తొక్కేయాలా? ఇదెక్కడి న్యాయం. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎస్సీలు కాళ్లు పట్టాలి.. వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు’’ అంటూ థామస్ వ్యాఖ్యానించారు. -
కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి
వడమాలపేట (పుత్తూరు): జనగణన ప్రాముఖ్యతను గుర్తెరిగి కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సెన్సెస్–2027 స్టేట్ నోడల్ అధికారి ఎస్ఎస్ రావత్ పేర్కొన్నారు. గురువారం వడమాలపేట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలసి స్థానిక అధికారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నా రు. జనగణన కార్యక్రమ పురోగతిని పరిశీలిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారులతో కలసి రామసము ద్రం గ్రామంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. అంగన్వాడీ చిన్నారుల ఇంగ్లిష్, తెలుగు రైమ్స్లను ఆసక్తిగా ఆలకించారు. జనగణన డైరెక్టర్ కె.నివాస్, డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్ పాల్గొన్నారు. నేటి నుంచి వేసవి సెలవులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాలలు జూన్ 12న పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దాడి కాదు.. నాన్నకు భయపడి అలా! చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు సమీపంలో తనపై దాడి జరిగిందంటూ బుధవారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం టూటౌన్ సీఐ నెట్టికంటయ్య యువకులను స్టేషన్కు పిలిపించారు. తన తండ్రికి భయపడి, పుట్టినరోజు వేడుకల్లో దాడి జరిగిదంటూ తప్పుడు ప్రచారం చేశామన్నారు. మరోసారి ఇలాచేస్తే కేసు పెడతామంటూ హెచ్చరించిన సీఐ, వాళ్లను పంపించేశారు. -
మాజీ మంత్రి విస్తృత పర్యటన
శాంతిపురం: రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాంతిపురం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకుల ఇళ్లల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ భరత్తో పాటు గురువారం ఆయన కనుమలదొడ్డిలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బుల్లెట్ దండపాణి గృహప్రవేశ పూజల్లో పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని ఆశిర్వదించారు. నాయనపల్లి వద్ద ఇటీవల గృహప్రవేశమైన జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఇంటిని సందర్శించి వారి దంపతులను ఆశిర్వదించారు. చౌడంపల్లిలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, నడింపల్లిలో మాజీ సర్పంచ్ రమేష్, రామకుప్పం మండలం కోటచేనులో పార్టీ నాయకుడు మంజునాథరెడ్డి నివాసాలను సందర్శించారు. ఉన్సిగానిపల్లిలో ఇటీవల వివాహమైన మాజీ ఎంపీటీసీ సుబ్రమణ్యం కుమార్తె, అల్లుడిని ఆశిర్వదించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ అడ్వకేట్ అమరనాథరెడ్డిని బందార్లపల్లిలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. పర్యటనకు వచ్చిన పెద్దిరెడ్డికి నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు రాజుపేటరోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరించి వారితో ఫొటోలు దిగారు. జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డెప్ప, పీఎంకే ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, నాలుగు మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బంగారు గొలుసు అప్పగింత
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చిన ఓ నూతన వరుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును గురువారం ఆలయ సిబ్బంది తిరిగి అప్పగించారు. గొల్లపల్లి, దామలచెరువు ప్రాంతానికి చెందిన నూతన వరుడు భానుప్రకాష్ తన భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చాడు. ఈ క్రమంలో అతని మెడలో ఉన్న సుమారు 2 సవరాల బంగారు చైన్ ఆలయంలో జారిపోయింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ వేణుకకు ఆ చైన్ కనిపించడంతో, వెంటనే ఆలయ ఏఈవో రవీంద్రబాబుకు అప్పగించారు. ఇదే సమయంలో, చైన్ పోగొట్టుకున్న భక్తుడు ఆలయ కార్యాలయాన్ని సంప్రదించగా, అధికారులు సీసీ కెమెరాలతో పరిశీలించి నిర్ధారించారు. ఆ తర్వాత ఆ బంగారు గొలుసును భానుప్రకాష్కు అందజేశారు. హోంగార్డ్స్ ఇన్చార్జ్ వినాయక తదితరులు పాల్గొన్నారు. కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు పలమనేరు: పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద గురువారం చైన్నె– బెంగళూరు రహదారిపై స్కూటీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం, డండపల్లి కురప్పల్లికి చెందిన వీణ కుటుంబం పిల్లల చదువుల కోసం పలమనేరులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీణ గురువారం పాఠశాల వద్దకు వెళ్లి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు తీసుకుంది. అనంతరం తన పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో పట్టణంలోకి వస్తుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణ(30), ఆమె బిడ్డలు రుత్విక్(7), వాసవి(6) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అదే కారులో ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రిలో వదిలి కారు డ్రైవర్ పరారైనట్టు తెలిసింది. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన తల్లీబిడ్డలు -
అపరిచితుడి అరాచకం!
సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని జీడీనెల్లూరు నియోజకవర్గంలో అక్రమ క్వారీ మాఫియా బరితెగిస్తోంది. ‘నాకు ఎమ్మెల్యే అండ ఉంది... ఎక్కడికై నా రాళ్లు తరలిస్తా..’ అంటూ చెలరేగిపోతోంది. అధికారులను సైతం ధిక్కరించే ఆ అపరిచితుడి వ్యవహారం ఇప్పుడు సంచలంగా మారింది. అనుమతులు లేని క్వారీలనే టార్గెట్గా చేసుకుని రాళ్లదోపిడీ సాగుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాళ్ల దోపిడీ జిల్లాలో ఎక్కడ అనుమతి లేని క్వారీ ఉందో అక్కడే అజ్ఞాత వ్యక్తి వాలిపోతాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీల నుంచి గ్రానైట్ రాళ్లను భారీగా తరలిస్తూ పబ్బం గడుపుకుంటాడు. ఎవరూ అడగరు అన్న ధైర్యంతోనే ఈ దందా సాగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు ఎమ్మెల్యే అండ ఉంది.. ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అంటూ అధికారులను బెదిరించడం ఇతని స్టైల్. ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ మద్దతు ఉందని చెప్పి అధికారులను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. అడ్డుకున్నా ఆగడు ఆయన చేస్తున్న అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను బెదిరించి.. వాహనాలను ముందుకు తీసుకెళ్లడం పరిపాటి.ఽ ఆపగలిగితే ఆపండి అన్న ధోరణితో వ్యవహరిస్తూ, అధికారులకు ఒక సవాల్ విసురుతుంటాడు. కొంతమంది అధికారులు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. పోలీసుల వలలో గ్రానైట్ లారీ వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం నుంచి వయా పెనుమూరు మార్గంలో చిత్తూరు వైపుగా అక్రమ గ్రానైట్ తరలిస్తున్న లారీని ఇటీవల పెనుమూరు పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం చేపట్టిన తనిఖీల్లో సరైన అనుమతులు లేవని తేలింది. దీంతో లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. మాఫియా వెనుక ఉన్న పెద్దలెవరు? ఈ అక్రమ వ్యవహారాల వెనుక ఉన్న పెద్దలెవరు? ఇంతటికీ గ్రానైట్ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరు..? తన వెనుక ఉన్నది రాజకీయ నాయకుడా..? లేక ప్రభుత్వ ఉన్నతాధికారులా..? అన్న ప్రశ్న స్థానికంగా తలెత్తుతోంది. రాజకీయ అండదండలు లేకుండా ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి, హల్చల్ రిజిస్ట్రేషన్ వివరాలు స్పష్టంగా లేని ఫర్ూచ్యనర్ వాహనానికి బ్లాక్ స్టికరు వేసుకుని నగరంలో యథేచ్ఛగా తిరుగుతాడు. ఈ వాహనాన్ని ఉపయోగించి క్వారీల వద్ద పర్యవేక్షణ చేస్తాడు. ఆపై రాళ్ల తరలింపును సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకుంటారా? గ్రానైట్ లారీ పట్టుబడడం ఒక్కటే సరిపోదని.. ఈ బడా మాఫియాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తంతు గత 18 నెలలుగా జిల్లాలో కొనసాగుతోందని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ లేని వాహనాల్లో తిరుగుతూ అనుమతులు లేని క్వారీలను ఎంపిక చేసుకుని ప్రకృతి సంపదను దోచుకు వెళ్తున్న వ్యక్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. -
కృత్రిమ ఇసుక దందాలో.. నవ వసంతం!
బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయం పక్కనే కృత్రిమ ఇసుక తయారీ సాక్షి టాస్క్ఫోర్స్: తమ్ముళ్లు మట్టి నుంచి మనీని ఈజీగా తీసేస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీలో కోట్లు కొల్లగొడుతున్నారు. ఓ టీడీపీ నేత ఈ దందాలో నవ ‘వసంతంగా’ వర్ధిల్లుతున్నాడు. మొగిలి ప్రాంతంలో నుంచి మట్టిని తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత టిప్పర్లలో ఇసుకను తమిళనాడు, కర్ణాటకకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ దందా ఆలస్యంగా పలువురి కంట పడింది. రోజూ వందల టన్నుల మట్టిని తరలిస్తూ, భారీ యంత్రాలతో ఇసుక తయారు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అయినా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకో మౌనం? ఇంత పెద్ద స్థాయిలో కృత్రిక ఇసుక దందా సాగుతున్నా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోనే ఈ దందా సాగుతుండగా, అధికారులు తెలియనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీలో నవ ‘వసంతం’గా పేరు పొందిన ఓ నేత ఈ దందాలో ఆరితేరాడని, మామూళ్ల మత్తులో అధికారులు సైతం జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కృత్రిమ ఇసుక తయారీ వెనుక ఒక బడా నేత ప్రమేయం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ నేత ఆశీస్సులతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ముప్పు తప్పదు మొగిలి ప్రాంతంలో మట్టిని అధికంగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, వ్యవసాయ భూము లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, కృత్రిమ ఇసుక తయారీలో ఉపయోగించే యంత్రాల వల్ల ధూళి, కాలుష్యం పెరిగి, సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ ఇసుక దందాపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ఈ మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. టిప్పర్లల్లో ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్న అజ్ఞాతవాసికృత్రిమ ఇసుక తయారీ చేస్తున్న దృశ్యం టిప్పర్ల రద్దీ తయారైన ఇసుకను పగలురాత్రి తేడా లేకుండా టిప్పర్లలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపై టిప్పర్ల రాకపోకలు విపరీతంగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రోజుకు 30 నుంచి 40 టిప్పర్ల ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలుతోందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఒక టిప్పర్ ఇసుక రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నెలవారీ సంపాదన రూ.కోట్లల్లోనే ఉందని తెలుస్తోంది. వచ్చిన ఆదాయంలో కొంత మంది బడా నేతలు, పలు శాఖ అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నట్టు వెల్లడించారు. సీనియారిటీ జాబితా విడుదల చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అన్ని కేడర్ల టీచర్ల తుది సీనియారిటీ జాబితాలు విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే మార్చి 1, 15 తేదీల్లో రెండు విడతలుగా విడుదల చేసిన ప్రాథమిక జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించినట్లు తెలిపారు. సంబంధిత ఎంఈవో, డీవైఈవోలకు మెయిల్ పంపినట్లు చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతుండడంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఈ సీనియారిటీ జాబితా మేరకే జరుగుతుందన్నారు. టీచర్లు తుది జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని ఏప్రిల్ 27లోపు ఎంఈవోలకు డిక్లరేషన్ ఫారాలను సమర్పించాలన్నా రు. డేటాలో, సీనియారిటీ జాబితాలో పేర్లు లేని పక్షంలో తగిన ఆధారాలతో ఈ నెల 25వ తేదీలోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ఎంఈవోలు సేకరించే డిక్లరేషన్లను ఈ నెల 30లోపు డీఈవో కార్యాలయాలనికి పంపాలన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న ప్రక్రియలో టీచర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని డీఈవో సూచించారు. 26న ఓపెన్ చెస్ చాంపియన్షిప్ పోటీలు – చిత్తూరు జిల్లా క్రీడాకారులకు మాత్రమే అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని బృందావన్ పాఠశాలలో ఈ నెల 26న ఓపెన్ చెస్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఆర్బీ ప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక వేపమాను వీధిలోని స్కూల్ ఆఫ్ చెస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–11 ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల వారు ఈనెల 26వ తేదీలోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీచెస్.ఓఆర్జీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోటీలు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. క్రీడాకారులు చెస్బోర్డు, చెస్ క్లాక్ వెంట తెచ్చుకోవాలన్నారు. ఇందులో గెలుపొందే క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. ఇతర వివరాలకు 9849313676, 9000475799 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సునిల్కుమార్, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
కురిసే పూలవాన.. రామయ్య మురిసెలోలోన..
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామి వారి పుష్పయాగం కనుల పండుగగా సాగింది. ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు సీతాలక్ష్మణ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్ మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛ రణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి పుష్పయాగం వైభవంగా జరిపారు. తులసి, రోజా, తామర, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, కలువ తదితర 12 రకాల పుష్పాలు, ఆరు రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేశారు. రాత్రి 7 గంటలకు సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కుప్పంరూరల్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం మండలం, దాసేగౌనూరు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివకుమార్ (45) దాసేగౌనూరు పంచాయతీ, రామ్నగర్కు చెందిన యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏమి జరిగిందో తెలియదుకానీ శివకుమార్ గురువారం అర్చనా గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలోని మామిడి తోట లో శవమై కనిపించాడు. శివకుమార్ మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ను ఎవరో హత్య చేసి ఉంటారని, అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియన మహిళ మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. దాదాపు వయస్సు 60– 65 సంవత్సరాలు మధ్య ఉన్న వృద్ధురాలు సిద్ధంపల్లె మీదుగా చిత్తూరు రైల్వేస్టేషన్కు వస్తున్న కాట్పాడి– తిరుపతి రైలును గమనించకుండా ట్రాక్ దాటుతోంది. ఆ సమయంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు తెలుపు చుక్కలతో కూడిని నల్లపు రంగు జాకెట్, ఎర్ర రంగు చీర ధరించి ఉంది. కుడి ఛాతికిపై, కింద భాగంలో నల్లటి పుట్టుమచ్చ లున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. -
అగ్నిగుండాలు!
గంజాయి స్వాధీనం అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బైరెడ్డిపల్లె మండల పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధిలో..మండుతున్న ఎండలు... ఎండుతున్న కూలీలు శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పొట్టకూటి కోసం ఉపాధి హామీ కూలీలు ప్రాణాలకు తెగించి ఎండలోనే పనిచేస్తున్నారు. కానీ, వారి క్షేమం చూడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుంది. దీంతో జిల్లాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జిల్లాలో ఉపాధి కూలీల దుస్థితి పై సాక్షి కథనం... చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. క్షేత్ర స్థాయిలో వారికి అందాల్సిన కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పనిచేసే ప్రదేశంలో నీడ, నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, మందుల కిట్లు లాంటి వాటిని అందించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కూలి డబ్బులు సైతం సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగితే పై నుంచి రాలేదనే పాత పాట వినిపిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కూలీలు ఎండకు ఎండుతూ.. కడుపులు మాడ్చుకుంటూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గతంలో వేసవి తీవ్రతను తట్టుకోవడానికి అందించిన 30 శాతం వేసవి భత్యాన్ని ప్రస్తుతం చంద్రబాబు సర్కారు అటకెక్కించింది. నీడ.. నీళ్లు ఎక్కడ? జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు టెంట్లు ఏర్పాటు చేయడం లేదు. వృద్ధులు, మహిళలు మండుతున్న ఎండలోనే తట్టలు మోస్తూ, గడ్డపారలతో భూమిని తవ్వుతూ చెమటతో తడిసి ముద్దవుతున్నారు. మధ్యాహ్న భోజనం చేయడానికి కనీసం చెట్టు నీడ కూడా లేదు. నెత్తిన తువ్వాళ్లు కప్పుకుని ఎండలోనే కూర్చొని అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు వేడెక్కిపోయి తాగలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి మజ్జిగ జాడ లేకుండా పోయింది. ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఊసేలేదు. నిబంధనలు అలంకారప్రాయం నిబంధనల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో మెడికల్ కిట్ ఉండాలి. కానీ, పొరపాటున ఎవరికై నా వడదెబ్బ తగిలినా లేదా గాయమైనా ప్రథమ చికిత్స నాథుడే లేడు. ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగితే పై నుంచి రాలేదు అనే పాత పాటనే పాడుతున్నారు. వేసవి భత్యం విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న జాప్యం కూలీల కడుపు కొడుతోంది. కూలీల రెక్కల కష్టాన్ని దోచుకుంటూ, వారికి కనీస గౌరవం, రక్షణ కల్పించలేని సర్కారు పై క్షేత్ర స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా సమాచారం జాబ్కార్డులు 2.46 లక్షలు నమోదైన కుటుంబాలు 2,46,472 నమోదైన కూలీలు 4,22,624 ఉపాధి పొందుతున్న కుటుంబాలు 1,03,386ఉపాధి పొందుతున్న కూలీలు 1,54,316కాగితాలకే పరిమితం ఉపాధి పని చేసే ప్రదేశంలో నిబంధనల ప్రకారం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇవి కాగితాల మీద లెక్కలకే పరిమితమయ్యాయి. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న కూలీలను ఫేషియల్ అటెండెన్స్ పేరుతో సాంకేతిక వేధింపులకు పాల్పడుతున్నారు. సర్వర్లు పనిచేయక, సిగ్నల్స్ అందక అవస్థలు పడుతున్నారు. కష్టపడి పనిచ ఏసినా హాజరు పడకపోవడంతో కడుపులు మాడ్చుకునే పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యమవ్వడంతో, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు పాలకుల మొండి వైఖరి మధ్య ఉపాధి కూలీల బతుకులు అరణ్యరోదనగా మారాయి. -
గంజాయి స్వాధీనం
పలమనేరు: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.24 వేల విలువజేసే 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గంగవరం సీఐ పరశురాముడు బైరెడ్డిపల్లి స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు బైరెడ్డిపల్లి–నాలుగురోడ్లు రహదారిలో సబ్స్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నల్లటి సంచుల్లోని గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు బండ ఇండ్లుకు చెందిన బాబు(60), లక్కనపల్లికి చెందిన రఫీ (54)గా తెలిసింది. వీరికి పుంగనూరుకు చెందిన ఆనంద్ నుంచి సరుకు వస్తోందని, దీన్ని స్థానికంగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు తెలిపారు. ఇతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో అక్కడి తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎస్ఐ చందనప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పుత్తూరు: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన దుర్ఘటన గురువారం తెల్లవారు జామున పుత్తూరు బైపాస్ రోడ్డులో చోటు చేసుకొంది. ఎస్ ఐ వెంకటలక్ష్మి కథనం మేరకు వివరాలు.. స్థానిక సాయినగర్కు చెందిన ప్రముఖ న్యాయ వాది ఎం.సంజీవి కుమారుడు ఎం.ధర్మతేజ (22) తన మిత్రులతో కలసి మారుతీ సుజికీ కారులో తిరుపతికి వెళుతుండగా స్థానిక బైపాస్ రోడ్డులోని పిళ్లారిపట్టు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న ధర్మతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న స్నేహితులు పూర్ణచంద్ర, పవన్సాయి, చరణ్తేజలకు తీవ్ర గాయా లు కాగా పుత్తూరు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. మృతుని తల్లి కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలిసెట్ రేపు తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్– 2026 శనివారం జరగనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ డాక్టర్ వై ద్వారకనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో రేణిగుంట, వెంకటగిరి, సత్యవేడులో ఒక్కొటి చొప్పున, నాయుడు పేట లో రెండు, శ్రీకాళహిస్తిలో రెండు, పుత్తూరులో రెండు, తిరుపతిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 17 సెంటర్లలో 5,143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష కేంద్రాలకు గంట ముందే విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అను మతి లేదని వెల్లడించారు. -
పోలీసు ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నది
– శిక్షణ కానిస్టేబుళ్లతో ఎస్పీ తుషార్ డూడీ చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగమంటే ఫ్యాషన్ కాదని, ఇది బాధ్యతతో కూడుకున్నదని చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై .. శిక్షణ పొందుతున్న అభ్యర్థులను కలిశారు. తొసి సెమిస్టర్ పరీక్షల ముగింపు నేపథ్యంలో అభ్యర్థులతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడానికి పోలీసు ఉద్యోగం బాధ్యతతో చేయాలన్నారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలు, నైపుణ్యాలను భవిష్యత్తులో ఉపయోగపడుతాయన్నారు. ప్రతీ అభ్యర్థి నైతిక విలువలు, ప్రజల పట్ల సానుభూతి, వృత్తిలో నిజాయితీ పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాంబాబు, పర్యవేక్షకులు డా.షానుషైక్, ఇన్స్పెక్టర్ శరత్చంద్ర, వీరేష్ పాల్గొన్నారు. -
దశదిశ మార్చే కోర్సులు
పది రకాల ఉపాధులకు ఇదే తొలిమెట్టు! సాధరణంగా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, హెచ్ఈసీలు మాత్రమే చాలామందికి తెలు సు. కానీ వృత్తి విద్యా కోర్సుల ద్వారా వెంటనే ఉపాధి పొందే పది రకాల కొర్సులున్నాయనే విషయం చాలామందికి తెలియదు. ఈ క్రమంలో సంప్రదాయ కోర్సుల్లోనే పిల్లలను చేర్పిస్తుంటారు. మంచి సౌకర్యాలు పలమనేరులోని ప్రభుత్వ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు, మ ధ్యాహ్న భోజనం, ఎస్సీ, బీసీ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం, ఆన్లైన్ తరగతు లు, ఐఎఫ్బీ ఫ్యానెల్స్ ద్వా రా బోధన, సువిశాలమైన ఆటస్థలం, స్టడీ అవర్, ఉచితంగా పుస్తకాలు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డెయిరీ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెండు రెండేళ్ల డెయిరీ టెక్నాలజీ పూర్తిచేసేలోపే మిల్క్ డెయిరీల్లో ఉద్యోగాలు వస్తాయి. లేదా బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీఎస్సీ డెయిరీ సైన్స్ ఆపై ఎంటెక్లు చేసుకోవచ్చు. త్వరగా ఉపాధిని పొందాలని.. ఉన్నత చదువులకు మాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. అందుకే ఎంఎల్టీలో చేరా. ప్రభుత్వ ఉద్యోగంతో పని లేకుండా ల్యాబ్లలో పని చేసుకోవచ్చు. లేదా నేనే సొంతంగా ల్యాబ్ పెట్టుకోవచ్చు. – పూర్ణచంద్రరావు, ఎంఎల్టీ ఫస్ట్ఇయర్ స్టూడెంట్, పలమనేరు ఉపాధికి ఇది దగ్గర దారి టెన్త్ కాగానే ఇక్కడి వొకేషనల్ కోర్సులో చేరితే స్వయం ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదివిన వారిలో సగానికిపైగా విద్యార్థులు వారి రంగాల్లో స్థిరపడ్డారు. పలు కంపెనీల జాబ్ టైఅప్లున్నాయి. ఇప్పటికే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్లు నేరుగా కళాశాలలో సంప్రదించాలి. – కన్నయ్య, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పలమనేరు ఇప్పుడంతా విద్య వ్యాపారంగా మారింది. చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్వేర్లు కావాలంటే కార్పొరేట్ కాలేజీలకు లక్షలకు లక్షలు ధారబోయాల్సి వస్తోంది. అయితే పదో తరగతి తర్వాత ప్రభుత్వ కళాశాలల్లోనే రెండేళ్ల వ్యవధిలో ఉపాధి అవకాశాలున్న ఒకేషనల్ కోర్సులు పదికిపైగా ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియని విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరుతున్నారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా చేరి ఈ రెండేళ్ల కోర్సులను పూర్తి చేస్తే వెంటనే ఉపాధి, ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 52 ప్రభుత్వ జూనియర్ కళాశాలుండగా పది ఒకేషనల్ కోర్సులున్నది పలమనేరులో మాత్రమే. – పలమనేరు ఉపాధికి మార్గాలిలా.. వొకేషనల్ కోర్సులు మేలు -
తలదాచుకోవాలన్నా తిప్పలే
నాయనా.. ఈ ఎండకి ఎలా తట్టుకునేది. పని చేసే చోట కనీసం తల దాచుకోవడానికి చిన్న నీడ కూడా లేదు. పొద్దున్నే ఎండ ముదరకముందే పనికి వస్తే, ఫేస్ అటెండెన్స్ పడక గంటల తరబడి ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఫోన్లో సిగ్నల్ రాదట.. మా ముఖాలు గుర్తు పట్టలేదట. ఇవన్నీ మాకు తెలియవు కానీ, ఆ హాజరు పడకపోతే ఆ రోజు కూలీ రాదని భయం. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పెట్టడం లేదు. ఇంటి నుంచే తెచ్చుకోవాల్సి వస్తోంది. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. – వెంకటేష్, ఉపాధి కూలీ -
కన్నవారిపై మమకారం
● రూ.40 లక్షలతో విద్యార్థులకు భోజనశాల ఏర్పాటు ● ఉదారత చాటుకున్న వైఎస్సారసీపీ నేత రాజారెడ్డి కూటుంబం యాదమరి: జన్మనిచ్చిన తల్లితండ్రులపై ఉన్న మమకారంతో రూ.40 లక్షల సొంత నిధులను వెచ్చించి విద్యార్థుల సౌకర్యార్థం భోజన శాలను నిర్మించి ఆదర్శంగా నిలిచారు... యాదమరి మండలం, పెరుమాళ్లపల్లికి చెందిన వైఎసార్సీపీ నాయకులు రాజశేఖర్రెడ్డి, అతని సోదరులు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో దివంగత యశోదమ్మ, గోవిందరెడ్డి దంపతుల జ్ఞాపకార్థం నిర్మించిన భోజనశాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఎండలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ సొంత నిధులతో భోజనశాలను నిర్మించామన్నారు. విద్యార్థులతో కలసి భోజనం చేసిన అనంతరం భవనాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. వ్యక్తిగత నిధులతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం పట్ల మండల విద్యాశాధికారులు, స్థానికులు అభినందించారు. అనంతరం వారిని ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సోలార్ పనులు వేగవంతం చేయాలి
చిత్తూరు కార్పొరేషన్: పీఎం సూర్యఘర్ పథకం పనులను వేగవంతం చేసి కనెక్షన్లు త్వరగా ఇవ్వాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాక్షి పత్రికలో సబ్సిడీ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు అలసత్వం పై ‘స్లోలార్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీని పై ఆయన స్పందించారు. కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. రాయితీ ఇస్తున్న సోలార్ రూఫ్ టాప్ పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో అర్హులైన 21,530 ఎస్సీ, ఎస్టీలకు, కుప్పంలో 2,180 ఎస్సీ, ఎస్టీలకు రెస్కో ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్స్ పెట్టాలన్నారు. జిల్లాలో 1,205 ప్యానల్స్ అమర్చడం జరిగిందన్నారు. ఇతర సర్వీసుదారులు సోలార్ మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్ కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చున్నారు. మొదట మొత్తం నగదును చెల్లించి తరువాత ప్రభుత్వం రాయితీ పొందే అంశం పై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ఇందుకు ట్రాన్స్కో, నెడ్క్యాప్ అధికారులు కృషి చేయాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు బ్యాంక్ల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశమున్న మేర సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు, నెడ్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామలింగయ్య, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్, డీపీఓ సుధాకర్రావ్, లీడ్ జిల్లా మేనేజరు హరీష్ పాల్గొన్నారు. -
వెంకటకృష్ణపాళెంలో ఐదుగురి మృతి
● అత్త, కోడలు దారుణ హత్య ● పిల్లలిద్దరినీ రైలుకింద తోసి తనువు చాలించిన తండ్రి ● నారాయణవనం మండలంలో కలకలం నారాయణవనం: మండలంలోని వెంకటకృష్ణపాళెం గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హత్యకు గురికాగా.. మరో ఇద్దరు పిల్లలతో సహా కుటుంబ యజమాని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ‘పంచ’ప్రాణాల మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్యాభర్తల కాల్డేటా ఆధారంగా వివరాలు కనుక్కునేందుకు పోలీసులు విశ్వప్రయతాలు చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకుని.. వెంకటకృష్ణపాళేనికి చెందిన మోహన్(45) రైల్వేకోడూరుకు చెందిన హరిత(33)ను 16 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి హిమని(15), కౌశిక్(12) పిల్లలున్నారు. హరిత స్థానికంగా టైలరింగ్తోపాటు బ్యూటీపార్లర్ నడుపుతోంది. మోహన్ నెలన్నర క్రితమే స్టీలు, సిమెంట్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఇద్దరూ రెండు చేతులతో సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పిల్లలిద్దర్నీ పుత్తూరులోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. వీరితోనే మోహన్ తల్లి చంద్రకళ(65) కూడా ఉన్నారు. పైళ్లెనప్పటి నుంచి దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. మనసెలా ఒప్పింది మోహనా? ఇంతలో మోహన్కు ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ కలవలేదు. పోలీసులకు సమాచారం ఇద్దామన్నా వారు అందుబాటులో లేరు. స్థానికులు కొందరు పుత్తూరులో పిల్లలు చదువుతున్న స్కూల్కు ఫోన్చేసి మాట్లాడారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మోహన్ వచ్చాడని, తమ మామ చనిపోయాడు అని చెప్పి పిల్లలను తీసుకుని స్కూటీపై వెళ్లిపోయాడని చెప్పారు. అనుమానం వచ్చి ఎలాగోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోహన్ ఫోన్ నంబర్తో పాటు స్కూటర్ నంబర్ గుర్తించి ఆచూకీ తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో లోకేషన్ను గుర్తించలేకపోయారు. అయితే సీసీ కెమెరాల సాయంతో స్కూటర్ను గుర్తించగలిగారు. నారాయణవనం నుంచి పుత్తూరు ఆర్డీఎం గేట్ సమీపంలోని కార్పొరేట్ స్కూల్కు, కార్వేటినగరం, తమిళనాడు పళ్లిపట్టు మీదుగా అడవికండ్రిగ దారిలో వేపగుంట రైల్వేస్టేషన్ వరకు సూటర్లో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. వేపగుంట రైల్వేస్టేషన్కు వెళ్లి పరిసరాలను గాలించే లోపే చైన్నె నుంచి కాచిగూడ వెళ్లే రైలు కింద మోహన్, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలచివేసింది. ముక్కపచ్చలారని కొడుకు, చూడచక్కని కుమార్తెను అతికిరాతకంగా రైలుకింద తోసేసినట్టు చూపరులు తెలిపారు. ఆ తర్వాత వేగంగా వెళ్తున్న రైలుకు ఎదురెళ్లి మోహన్ కూడా మృత్యుఒడికి చేరినట్టు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతులేని విషాదం వెంకటకృష్ణపాళెంలో అంతులేని విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో ఐదుగురు మృత్యువాత పడడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. అత్తా కోడళ్ల మృత దేహాన్ని పరిశీలించిన పుత్తూరు డీఎస్పీ రవికుమార్, రూరల్ సీఐ రవీంద్ర కేసును నమోచు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని మీడియాకు తెలిపారు. కౌశిక్ (ఫైల్)ముక్కలైన మృతదేహాలు రైలు కింద పడి మృతి చెందిన మోహన్తో పాటు పిల్లలు హిమని, కౌశిక్ల మృతదేహాలు ముక్కలై, చెల్లాచెదుగా ఉంటడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మోహన్, కౌశిక్ల తలలు మొండెం నుంచి తెగి పట్టాలపై దూరంగా పడి ఉండడాన్ని పోలీసులే చూడలేక పోయారు. మోహన్ తల రెండు ముక్కలై పట్టాలకు రెండు వైపులా పడి ఉంది. రాత్రి 7.15 గంటలకు జరిగిన ప్రమాదాన్ని రైలు పైలట్ పుత్తూరు రైల్వే స్టేషన్కు సమాచారాన్ని అందించాడు. రైల్వే పోలీసులు పట్టాలపై గాలిస్తూ ప్రమాద స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. సమాచారాన్ని అందుకున్న నారాయణవనం పోలీసులు, మృతుని సన్నిహితులు వేపగుంట, పరమేశ్వరమంగళంల మధ్య రైల్వే ట్రా క్కు చేరుకున్నారు. పిల్ల స్కూల్ యూనిఫాంను, శరీర ఆకృతిని గుర్తించిన స్థానికులు మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. రాత్రి 11 గంటలకు మృతదేహాల భాగాలను పోస్ట్మార్టం నిమిత్తం రైల్వే పోలీసులు పుత్తూరుకు తరలించారు. హత్య ఎందుకు చేశారనీ? హరిత, చంద్రకళను దారుణంగా హత్యచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికలావాదేవీలు ఏవీ లేవని.. వివాహేతర సంబంధం లాంటివి కూడా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మోహన్కూడా సౌమ్యుడని, పిల్లలు, భార్యతో అన్యోన్యంగా ఉండేవాడని పేర్కొంటున్నారు. అయితే తల్లి, భార్యను చంపే మనస్తత్వం కాదని అంటున్నారు. మరి వీరిని ఎవరు హత్యచేశారు.. ఎందుకు చేశారో తెలియరావడం లేదు. బ్యాంక్ నుంచి వచ్చిన మోహన్ ఇంటికి రాకుండా పక్కింట్లో డబ్బులిచ్చి.. అటునుంచి అటే వెళ్లిపోవాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లలను రైలు కింద తోసి కర్కశంగా చంపడం చూస్తూ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదైమైనా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
పచ్చదనమే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా 2047 నాటికి 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అటవీ, రెవెన్యూ, అనుబంధ శాఖల అధికారులతో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అమలు పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 34 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు పర్యావరణంతో పాటు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఫలవృక్షాలు, కలప జాతి మొక్కలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని ఏడు నర్సరీలలో రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పలమనేరు డివిజన్ పరిధిలోని ముసలిమడుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో చేపడుతున్న సోలార్ సిస్టమ్స్, ట్రెంచ్ల పనులకు ఈ నెల 10వ తేదీ లోపు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. డీఎఫ్ఓ జి.సుబ్బరాజు మాట్లాడుతూ అగ్రో ఫారెస్ట్రీ పాలసీలో రిజర్వ్డు అడవులకు వెలుపల పచ్చదనాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్, డ్వామా పీడీ రవికుమార్, గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
హామీలు విస్మరించి..పక్క రాష్ట్రంలో షికార్లు!
కార్వేటినగరం: సొంత రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి.. పక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఊకదంపుడు మాటలతో తమిళ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మండల పరిఽధిలోని ఆర్కేవీబీపేట గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద సృష్టిస్తా.. రాష్ట్రా న్ని అగ్రగామిగా నిలుపుతా అంటూ ఊదరగొట్టిన బాబు కనీసం ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా..? అని విమర్శలు గుప్పించారు. పచ్చ నేతలకు ప్రకృతి సంపదను అక్రమంగా దోచిపెట్టడమేనా సంపద సృష్టించడం అని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు సక్రమంగా వేతనాలు చెల్లించ లేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎండలు మండుతుంటే కనీసం చలివేంద్రా లు కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమాన్ని మరువలేదని గుర్తుచేశారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించే పనిలో మంత్రి లోకేష్ నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలన్నీ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని చురకలంటించారు. తిరుమలరెడ్డి చిత్రపటానికి నివాళి మండల పరిఽధిలోని ఆర్కేవీబీపేట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ యువ నాయకుడు /్ఞానసాయిరెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు ప్రభాకర్రెడ్డి తమ్ముడు తిరుమలరెడ్డి గతవారం ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం కర్మక్రియలకు హాజరై తిరుమలరెడ్డి చిత్రపటానికి నారాయణస్వామి ఘన నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ లోకనాథరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నాయకులు శేఖర్యాదవ్, నందగోపాల్శెట్టి ఉన్నారు. -
జనారణ్యంలోకి!
అరణ్యం వదిలి.. ఆ అడవుల నుంచే! జిల్లాలో పెరుగుతున్న చిరుతల రాక అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీరు లేక నీరసించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు చిత్తూరులో చోటు చేసుకుంది. ఇటీవల వరుసగా రెండు చిరుత పులులు జనారణ్యంలోకి వచ్చి మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అక్కడక్కడా తచ్చాడుతూ జనాల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని కట్టిడి చేయాల్సిన అటవీశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్: ఇటీవల నగరంలోని సీజీపల్లె లో చిరుతపుల్లి మెట్లులేని పాడుబడిన బావిలో పడి ప్రమాదవశాత్తు మరణించింది. అలాగే గత ఆదివారం దొడ్డిపల్లె హౌసింగ్ కాలనీలో గాయపడి ఆహారం లేక ప్రాణాలు విడిచింది. ఇది ఒక్క చిత్తూరులోని పరిస్థితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న దుస్థితి. అభయారణ్యంలో సరైన ఆహారం, నీరు దొరకకపోవడంతో చిరుతలు, క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. 2011 నవంబర్ 29 నుంచి 2026 ఏప్రిల్ 19 వరకు తొమ్మిది చిరుత పులులు ప్రాణాలు విడిచాయి. వీటి సంరక్షణ, కట్టడి గురించి అటవీశాఖ లైట్ తీసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పులుల లెక్క తేలేదెట్టా? జిల్లాలో మొత్తం 1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంతో మొత్తం 6 రేంజ్లున్నాయి. మొత్తం 24 సెక్షన్లు, 84 బీట్లు ఉన్నాయి. కానీ అధికారికంగా జిల్లాలో ఎన్ని పులులు ఉన్నాయంటే అటవీశాఖ అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం లేదు. ఇటీవల జరిగిన జంతుగణనలో కూడా సరైన సమాచారం దొరకలేదు. ఎక్కువగా తిరుపతి, తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి ఇటువైపు చిరుతలు వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాలక్రమేణా వాటి సంతతి పెరగడంతో వందల సంఖ్యలో జిల్లాలోని అడవుల్లో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం. వలయాల ఆక్రమణ పులుల వయస్సు ఐదేళ్లు దాటేసరికి తమకంటూ ఓ వలయాన్ని సృష్టించుకుంటాయి. ఆ పై మరో పదేళ్ల పాటు ఆ వలయంలో జీవిస్తాయి. ఇవి ఆక్రమణలకు గురైతే వాటి ఆవాసం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సమయంలో అడవులను దాటి జనావాసాలకు వస్తుంటాయి. ఇలా 2011 నుంచి ఇప్పటి వరకు అనేక కారణాలతో చిరుతలు మృతిచెందాయి. సిబ్బంది కొరత పులుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అంటూ లేరు. వాటి సంరక్షణకు చర్యలు పెద్దగా లేవు. ప్రస్తుతం ఉన్న కింద స్థాయి సిబ్బందితోనే పనులు చేస్తున్నారు. ఉదాహరణకు చిత్తూరు ఈస్ట్, వెస్ట్ పరంగా ఎఫ్బీఓ, ఏబీఓలు 65 మంది ఉండాల్సి ఉండగా దాదాపు 30 మంది వరకు సిబ్బంది కొరత ఉన్నారు. అలాగే ఔట్స్సోరింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరుతల కట్టడి కష్టమే మరి..! జాగ్రత్తలు తప్పనిసరి తిరుపతి, తమిళనాడు, కర్ణాటక అడవుల నుంచి చిరుతలు వచ్చినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఎండకాలం కావడంతో అడవిలో మరింత వేడిగా ఉండడం, నీరు దొరకకపోవడంతో అటవి నుంచి బయటకు వస్తున్నట్లు భావిస్తున్నారు. కొందరు ఆకతాయిలు అడవుల్లో నిప్పు పెట్టడంతో భయాందోళనకు గురై బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా అడవి పక్కన ఉండే ప్రాంతాలు, గ్రామాలకు ఇవి వస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే పొలాలు, స్థలాలు, ఇళ్ల వద్ద ఉండే వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిస్సహాయ స్థితి పులులు వస్తున్నా అటవీశాఖ వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉందని, అవి ఏ పక్క నుంచి వస్తాయో తెలుసుకోవడం కష్టమంటున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ట్రాప్కెమెరాలు పెడుతున్నా.. అందులో వాటి జాడ తెలియడం లేదని చెబుతున్నారు. పులి వచ్చినప్పుడు వాటికి గన్ద్వారా మత్తు మందు ఇవ్వాలన్నా తిరుపతి జూపార్కు నుంచి వైద్యబృందం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. రాయలసీమ మొత్తానికి ఈ వైద్య బృందం మాత్రమే ఉంది. జిల్లాకు రెస్క్యూ వాహనం అయిన హనుమాన్ను ప్రభుత్వం కేటాయించింది. కానీ అవి పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో లేవు. ఇక్కడ ఉన్న సిబ్బంది వద్ద తగిన పరికరాలు లేవు. దొడ్డిపల్లెలో పులి కొన ఊపిరితో ఉన్నా రెస్క్యూటీం వచ్చే వరకు ప్రాణభయంతో సిబ్బంది నీరుకూడా పోయ లేని పరిస్థితి. పలమనేరు నుంచి వాహనం చిత్తూరుకు చేరుకున్న క్షణాల్లో చిరుత తుదిశ్వాస విడిచింది. జిల్లా కేంద్రమలో రెస్క్యూవాహనాలు, డాక్టర్ లేకపోవడం నిస్సయంగా మారింది. -
దూసుకొచ్చిన కారు!
– ఐదుగురికి గాయాలు కుప్పంరూరల్: ఇరుకు రోడ్డులో వేగంగా కారు నడిపి మూడు ద్విచక్ర వాహనదారులను ఢీ కొన్న ఘటన కుప్పం మండలం, మల్లానూరు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. కుప్పం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో తమిళనాడు నుంచి కుప్పం వైపు వస్తున్నాడు. మల్లానూరు వద్దకు రాగానే చెరువు కట్టపై ఇరుకు రోడ్డులో వేగంగా వచ్చి మల్లానూరు వైపు వచ్చిన మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ప్రమాదంలో చీగలపల్లికి చెందిన వెంకటేష్, తిమ్మోజీ, కేజీఎఫ్కి చెందిన ప్రభు, విజయ్బాబు, సింగారపురానికి చెందిన చెన్నకేశవన్లు గాయపడ్డారు. స్థానికులు వీరిని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో ప్రభు, వెంకటేష్కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీనిపై కుప్పం ఎస్ఐ బాబును వివరణ కోరగా, తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా, కారు కుప్పం టౌన్ బ్యాంకు మేనేజర్ శివకు చెందినదిగా సమాచారం. అతి వేగమే కారణం తమిళనాడు వైపు నుంచి వచ్చిన కారు మలుపు వద్ద వేగంగా వారవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒకరి తరువాత ఒకరిని ఢీ కొన్నా కారు వేగం ఆగలేదని చెప్పారు. క్షతగాత్రులు రోడ్డుపై పడినా కారులోని వ్యక్తులు దురుసుగానే ప్రవర్తించినట్లు సమాచారం. -
సారా స్థావరాలపై దాడులు
– ముగ్గురి అరెస్ట్ కుప్పం రూరల్: మండలంలో సారా తయారు చేస్తున్న స్థావరాలపై దాడిచేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి కుప్పం మండలంలోని బలమద్దకొట్టం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద దాడి చేసినట్టు తెలిపారు. సారా తయారు చేస్తున్న బలమందకొట్టాలు గ్రామానికి చెందిన లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్పను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి 7 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. రైలు కిందపడి వ్యక్తి మృతి కుప్పంరూరల్: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం – మల్లానూరు రైల్వే మార్గంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివశంకరప్ప తెలిపారు. సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగి, గడ్డం మొత్తం తెల్ల రంగులో ఉందన్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఏదో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి, గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు అడ్మిషన్ల ఫ్లెక్సీలు తొలగించాలి చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లంటూ ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్పుడే అడ్మిషన్లు ప్రారంభమంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు చిత్తూరు ప్రధాన కూడళ్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడే అడ్మిషన్లు చేపట్టాలన్నారు. కానీ, విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముందస్తు ప్రకటనలు ఇవ్వడం అన్యాయమని తెలిపారు. నగరంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వెలుస్తున్నా విద్యాశాఖ, మున్సిపల్ అధికారులకు కనపడకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు లోహిత్, గౌరవ్, లిఖిత్ పాల్గొన్నారు. గడువు ముగిసింది! చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని అనంతాపురం శెట్టిన్తంగాల్ నుంచి ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నా యి. దీనిపై సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు వెళ్లడం... తహసీల్దార్ కల్యాణికి ఫోన్ రావడంతో స్పందిచారు. బుధవారం ఇసుక తవ్వకాలు జరుగుతున్న చోట పరిశీలించారు. అలాగే డంప్ను కూడా తనిఖీ చేశారు. డంప్నకు తోలేందుకు అనుమతులు ఉన్న ఉత్తర్వులను క్షుణంగా పరిశీలించారు. ఆ ఉత్తర్వుల్లో ఈ ఏడాది మార్చి 11వ తేదీతో గడువు ముగిసినట్లు గుర్తించారు. ఈ మేరకు దీనిపై సీఎంఓ ఆఫీసుకు నివేదికలు సమర్పించనున్నారు. కాగా ప్రస్తుతం డంప్కు తరలిస్తున్న ఇసుక అనధికారికమేనని తెలుస్తోంది. ధరిత్రి రక్షణ అందరి బాధ్యత చిత్తూరు కలెక్టరేట్ : ధరిత్రి రక్షణ అందరి బాధ్యత అని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా సైన్స్ సెంటర్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ మానవ మనుగడ భూమి పరిరక్షణతోనే ముడిపడి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో మానవ తప్పిదాల వల్ల భూమి అనేక విపత్తులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల ని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మొక్క లు నాటారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ థామ స్, సైన్స్ సెంటర్ క్యూరేటర్ జయంతి, జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం జిల్లా కన్వీనర్ సుధాకర్, అగస్త్య ఫౌండేషన్ ఇన్స్ట్రక్టర్ మోహన్ పాల్గొన్నారు. -
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనం నడిపేవాళ్లు హెల్మెట్లు పెట్టుకోవడాన్ని ప్రోత్సాహించడానికి చిత్తూరు పోలీసు శాఖ చేపట్టిన హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు లక్కీడిప్ను బుధవారం నిర్వహించారు. స్థానిక పోలీసు అతిథిగృహంలో ఎస్పీ తుషార్ డూడీ లక్కీడిప్ ద్వారా విజేతల పేర్లు ప్రకటించారు. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హెల్మెట్టు పెట్టుకున్న వాళ్లు ఓ చీటీ రాసి బాక్సులో వేయడం.. లక్కీడిప్ ద్వారా విజేతలకు నగదు బహుమతులను అందచేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో విడత లక్కీడిప్లో విజేతల పేర్ల ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. 25 నుంచి వేసవి శిక్షణ శిబిరం చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికితీసేందుకు ఈ నెల 25 నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించనున్నట్లు జిల్లా బాలభవన్ ఇంచార్జ్, డీవైఈవో ఇందిర తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో శిబిరం ఉంటుందన్నారు. శిబిరంలో చిత్రలేఖనం, కలరింగ్, పేపర్ కటింగ్, థర్మాకోల్ కట్టింగ్, డిజైన్ వర్క్, ఇతర సృజనాత్మకత కళలు నేర్పించనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆరు ఏళ్ల నుంచి 16 సంవత్సరాల లోపు వయ స్సు ఉన్న విద్యార్థులు అర్హులన్నారు. శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఈవో కోరారు. లక్కీడిప్ తీస్తున్న ఎస్పీ డూడీ -
501 మొబైల్ ఫోన్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: సెల్ఫోన్లు పోగొట్టుకోవడం, కొన్నిసార్లు ఫోన్లు చోరీకి గురవడం లాంటి ఘటనలను ఛేదించిన చిత్తూరు పోలీసులు దాదాపు రూ.1.2 కోట్ల విలువ చేసే 501 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుషార్ డూడీ వివరాలను వెల్లడించారు. ఫోన్లను పోగొట్టుకున్న వాళ్లు, చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు వాటి వివరాలను పోలీసుశాఖకు వాట్సాప్లో ఫోన్–9440900004 అనే నంబరుకు హాయ్ అని పెట్టడం, సీఈఐఆర్ అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఫోన్లను కనిపెట్టి.. అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తుచేసి బాధితుల వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఫోన్లను దేశంలోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల నుంచి తెప్పించామన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం పనిచేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 14 దఫాల్లో 4,607 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. వీటి విలువ రూ.9.55 కోట్లు ఉంటుందన్నారు. సెల్ఫోన్లను రికవరీ చేసిన సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది బాపూజీ, రఘురామ్, ఇతర సిబ్బందికి సర్టిఫికెట్లను అందచేసి, వారిని అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీఎస్పీ వెంకట నారాయణ, ట్రైనీ ఐపీఎస్ అధికారి తరుణ్ పహ్వా పాల్గొన్నారు. -
చోరీ కేసులో నలుగురికి జైలు
చిత్తూరు అర్బన్: చోరీ కేసులో నిందితులుగా ఉన్న ఎన్.నేతాజీ(23), వి.కుమార్ (21), ఎం.ప్రకాష్ (24), కె.వేణుగోపాల్ (19) అనే నలుగు రు నిందితులకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ ఉమాదేవి కథనం మేరకు.. బంగారుపాళ్యం సమీపంలో ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన జరుగుతున్న పనుల వద్ద ఇనుప ప్లేట్లు చోరీకి గురైనట్లు నిర్వాహకులు గతేడాది ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.3 లక్షల విలువైన 30 ప్లేట్లు చోరీకి గురవడంతో బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న బైరెడ్డిపల్లెకు చెందిన నేతాజీ, చిత్తూరు చెర్లోపల్లెకు చెందిన కుమార్, ప్రకాష్, వేణుగోపాల్ చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి.. సీఐ శ్రీనివాసులు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. నేరం రుజువుకావడంతో నిందితులకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం గంగాధర నెల్లూరు: మండలంలో గుర్తుతెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం.. జీడీనెల్లూరు మండలం, వీరకనెల్లూరు గ్రామ పంచాయతీ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటుదని సీఐ ప్రసాద్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు జీడీనెల్లూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ విజయపురం (నగరి) : విజయపురం మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఐ వెంకటసుబ్బయ్య అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. మంగళంకండ్రిగ పంచాయతీ, గాండ్లకండ్రిగ చెక్ పోస్టు వద్ద బుధవారం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తిరుత్తణి తాలుకా, పట్టాభిరామపురం గ్రామానికి చెందిన కాశీనాథన్ (42), ఆర్ పయణి (49) అనే వ్యక్తులు అక్రమంగా ఆంధ్ర మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెచ్సీ దేవరాజులు, సిబ్బంది జయచంద్ర, శివకుమార్ పాల్గొన్నారు. -
ఆ టీడీపీ నేతలు ఎవరో..?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలపై కొందరు టీడీపీ నేతలు సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు చేశారనే విషయం కలకలం రేపుతోంది. మంగళవారం ప్రచురితమైన వార్తా కథనంతో మండలంలో ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేసిన ఆ నేతలు ఎవరంటూ..సొంత పార్టీలోనే చర్చలు మొదలయ్యాయి. ఫిర్యాదు చేసిన నేతలను తెలుసుకునేందుకు టీడీపీలోని ఓ వర్గ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత మందిపై అనుమానం ఉన్నా కక్కలేక..మింగలేక లోలోపాల తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఫిర్యాదు విషయంలో కప్పి పుచ్చే ప్రయత్నాలు జరిగితే...రోడ్డుపైకి రావడం ఖాయమని..అందరి చిట్టా విప్పుతామని మరో వర్గ నేతలు బహిరంగంగా చెబుతుండడంతో ఈ యవ్వారం రసకందాయంలో పడింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
బైరెడ్డిపల్లె: భార్య, కూతురితో కలిసి బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తతో పాటు వారి కుమార్తె మృతి చెందారు. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలంలోని మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన హేమచంద్ర (38) ఆదివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని భార్య సరస్వతి (32), కుమార్తె లలిత (12)తో ద్విచక్రవాహనంపై వికోట మండలంలోని యడుగూరులోని అత్తవాళ్ల ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలోని పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలో కొమ్మరిమడుగు క్రాస్ వద్ద అతివేగంగా ఎదురుగా వచ్చిన ఓ లారీ హేమచంద్ర బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమచంద్ర, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె లలితకు తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరుకు తరలించగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మేకలనాగిరెడ్డిపల్లికి మృతదేహాలు చేరుకున్నాయి. బంధువులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉపాధి కూలీకి ఎండదెబ్బ
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన ఉపాధి కూలీ సత్య సోమవారం పని చేస్తూ ఎండకు తట్టుకోలేక కళ్లు తిరిగి పక్కనున్న బండపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. ఉద యం 10 గంటలకు సత్య ఉపాధి పనికని గుట్టలో కందకాలు తీస్తున్నాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక కళ్లు తిరిగి బండపై పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే పాలసముద్రం పీహెచ్సీకి తరలించారు. తలకు పది కుట్లు పడినట్టు డాక్టర్ మోహన్కృష్ణ తెలిపారు. పరిస్థి తి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ సతీష్కుమార్, ఏపీఓ మార్గేట్ పీహెచ్సీకి వచ్చి సత్యను పరిశీలించారు. అందుబాటులో లేని 108 సత్య పరిస్థితి విషమంగా ఉండడంతో అధికారులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే స్థానిక పీహెచ్లో ఉండాల్సిన 108 అందుబాటులో లేకపోవడంతో ఒకటిన్నర గంటకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులు గా 108 వాహనం జీడీనెల్లూరులోనే ఆపి ఉంచినట్టు సమాచారం. ఆపై సత్యను చిత్తూరుకు తరలించారు. -
అత్యున్నత ప్రమాణాలతో విద్య
– ఒకేసారి రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రారంభించిన కేంద్రీయ విద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాల తో విద్యను అందించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇరువారం వద్ద కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఒకే సారి ఏర్పాటు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఒకేసారి చిత్తూరు, కుప్పంలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో విద్యాలయంలో 320 సీట్ల సామర్థ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనున్నట్టు తెలిపా రు. తాత్కాలిక భవనాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ అముద, ప్రిన్సిపల్ లూథర్, డీఈవో రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ పాల్గొన్నారు. ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, అనంతాపురం పంచాయతీ శెట్టిన్తంగాల్ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీలోని ఓ వర్గం నేతలు సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నారని ఆ వర్గ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై నిఘా వర్గాలు విచారణలో పడ్డాయి. -
ఇది పెద్ద స్కామ్
గతేడాది సీజన్ సమయానికి తోతాపురి కేజీకి రూ.8 గిట్టుబాటు ధరను ప్రకటించారు. ఆ ధరను పక్కాగా అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మామిడి రైతులను నట్టేట ముంచేసింది. ఫ్యాక్టరీలు రూ.4 ఇస్తే చోద్యం చూసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర ప్రకారం జిల్లాలో 3.75 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.300 కోట్ల వరకు చెల్లించాలి. వాళ్లు అందులో 50 శాతం ఎగ్గొట్టారు. ఇదిపోను ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు ఇంత వరకు చెల్లింపులే చేయలేదు. వారిపై ఎలాంటి చర్యలు లేవు. – మునీశ్వర్రెడ్డి, రైతునాయకులు, చిత్తూరు -
పచ్చని విప్లవం
పంచగవ్యతో.. పంచగవ్య నగరి : తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, నేల ఆరోగ్య పరిరక్షణ, పంటల దిగుబడి పెరుగుదల, ఈ మూడు లక్ష్యాలను చేరుకోవడంలో పంచగవ్య కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో రైతులు సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,78,443 మంది సన్నకారు రైతులు, 1,11,676 మంది చిన్న రైతులు, 86,738 మంది ఇతర రైతులు ఉన్నారు. నగరి నియోజకవర్గంలో 7,704 మంది రైతులు ఉండగా 15,723 ఎకరాల పంటను సాగుచేస్తున్నారు. పంచగవ్య ప్రయోజనాలు తెలుసుకున్న రైతులు దానివైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందకు పైగా రైతులు సుమారు 700 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేస్తున్నారు. పంచగవ్య వినియోగం పెరిగితే, రైతులకు ఆర్థిక లాభం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం కూడా అందుతుంది. సహజ వ్యవసాయానికి ఇది ఒక కొత్త దిశగా నిలుస్తుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. గుండ్రాజుకుప్పంలో పంచగవ్య వాడి సాగుచేసిన మామిడి తోట పంచగవ్యను కలుపుతున్న రైతు సుబ్బరాజు ఇంటి వద్దే పంచగవ్య తయారుచేసుకుంటున్న రైతుతయారీ విధానం దేశవాలి గోవులైన గిరిజాతి ఆవుల గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి వంటి ప్రధాన పదార్థాలతో పాటు బెల్లం, తేనె, అరటి పండ్లు, గుమ్మడి గుజ్జు, అతిమధురం, వాయువిడంగాలు, ఖర్జూరం, కొబ్బరినీళ్లు, కొబ్బరి కల్లు వంటి పదార్థాలను నిర్దిష్ట పద్ధతిలో కలిపి పులియబెట్టి పంచగవ్య తయారు చేస్తారు. ఎలా ఉపయోగించాలి? ఎకరాకు 100 లీటర్ల నీటిలో 2–3 లీటర్ల పంచగవ్య కలిపి డ్రిప్ లేదా కాలువల ద్వారా అందించవచ్చు. లీటరు నీటికి 5 మి.లీ కలిపి పూత, కోత దశల్లో పిచికారీ చేయవచ్చు. విత్తన శుద్ధి కోసం పంచగవ్యలో విత్తనాలను 30 నిమిషాలు నానబెట్టడం ప్రయోజనకరం. -
నిధుల జాతర..నాణ్యతకు పాతర!
సాక్షి టాస్క్ఫోర్స్ : పైన పటారం..లోన లొటారంగా మారింది చిత్తూరులోని కేంద్రీయ విద్యాలయ భవన పరిస్థితి. ఇరువారం వద్ద సిల్క్బోర్డ్ కార్యా లయ భవనానికి మరమ్మతులు చేసి తాత్కాలిక కేంద్రీయ విద్యాలయ భవనంగా ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఈ భవనానికి రూ.60 లక్షలతో మెరుగులద్దారు. కానీ నాణ్యతను గాలికొదిలేసి ౖపైపెనే రంగులద్ది వదిలేశారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ భవనాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా.. లోపల నాణ్యత ప్రమాణాలపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అత్యుత్సాహం సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ భవనాన్ని ఆరంభించాలని పాలకులు ఉవ్విళ్లూరినట్టు స్పష్టమవుతోంది. చీలికలు ఉన్న భవనాన్ని హడావిడిగా విద్యార్థులకు అప్పగించేశారు. కనీసం గోడల పగుళ్లను పూడ్చకుండానే ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. అంతా మాయాజాలమేనా? ఈ భవన మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.60 లక్షల వరకు కేటాయించారు. క్షేత్ర స్థాయి లో పరిస్థితి చూస్తుంటే ఈ నిధులు ఎటు వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా వేసిన రంగులు గోడల మీద మెరుస్తున్నా, లోపల ఉన్న అసలు సమస్యలు అలాగే ఉన్నాయి. జాడలేని అగ్నిమాపక పరికరాలు వందలాది మంది విద్యార్థులు చదువుకునే భవనంలో దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఒక ఫైర్ ఎక్స్టింగ్యూషర్ కూడా అందుబాటులో లేదు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు రావడానికి సరైన మార్గాలు సైతం లేవు. నెర్రెలు బారిన కేంద్రీయ విద్యాలయ భవన గోడలుఇరువారం వద్ద ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంప్రశ్నార్థకం అధికారులు.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భవన భద్రత సర్టిఫికెట్ ఉందో లేదో అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. ఈ విషయం కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరపకపోతే భవిష్యత్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే భవనంలో చీలికల మరమ్మతులు చేయించి, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
సత్ఫలితాలిస్తోంది
పంచగవ్య వాడకం పంటలకు సత్ఫలితాలను ఇస్తోంది. నేలలో సారం పెరుగుతోంది. ఇంటివద్దే పంచగవ్యను తయారుచేసుకుంటాం. అలా తయారుచేసిన పంచగవ్యతోనే వరిపైరు సాగాచేశా. ప్రస్తుతం మామిడి తోటలకు కూడా పిచికారీ చేస్తున్నా. రసాయనాలను వదలిపెట్టి సేంద్రీయ పద్ధతిలో సాగుచేయాలనుకునే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తోంది. – సుబ్బరాజు, రైతు, గుండ్రాజుకుప్పం గ్రామం అవగాహన కల్పిస్తున్నాం రైతులకు పంచగవ్య ఉపయోగాలపై అవగాహన కల్పిస్తున్నాం. పంచగవ్యలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి స్థూల పోషకాలతో పాటు జింక్, మెగ్నీషియం, కాల్షియం, రాగి, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండడంతో మొక్కల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోంది. మొక్కలు వేగంగా ఎదగడమే కాకుండా, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. – రాఘవేంద్రయాదవ్, వ్యవసాయ అధికారి, నగరి మండలం -
డ్రంక్ అండ్ డ్రైవ్లో 23 మందికి జరిమానా
– రోజంతా కోర్టులో నిల్చోబెట్టిన న్యాయాధికారి చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన వేర్వేరు కేసుల్లో మొత్తం 23 మంది జరిమానాలు విధిస్తూ చిత్తూరులోని న్యాయస్థానాలు సోమవారం ఆదేశాలు జారీచేశాయి. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. 13 మందిపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 13 మందికి రూ.1.3 లక్షల జరిమానా విధిస్తూ.. ఒకరిని రోజంతా కోర్టులో నిలబెడుతూ చిత్తూరులోని స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.పరిమళాదేవి తీర్పునిచ్చారు. అలాగే గుడిపాలలో మద్యం సేవించి వాహనం నడిపినవాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వాళ్లపై ఎస్ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. వీరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రూ.20 వేల జరిమానా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 8 మందికీ ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున.. రూ.8 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని ఎకై ్సజ్ కోర్టు మేజిస్ట్రేట్ కల్పన తీర్పునిచ్చారు. ఘాటెక్కిన మిరప – అమాంతం పెరిగిన ధర పలమనేరు: ఈ దఫా మిరప ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో క్వింటాళ్ మిరప ధర రూ.22 వేలు పలుకుతోంది. స్థానికంగా నెలకొన్న డిమాండ్తో పాటు చైనా నుంచి ఎగుమతులుండడంతోనే ఇలా ధరలు ఆకాశాన్నంటాయనే మాట వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. కాగా హైబ్రిట్ రకాలైన టమాటమిర్చి, ఎల్లోమిర్చీ ధరలు రూ.40 వేల దాకా పలికిన విషయం తెలిసిందే. తగ్గిన మిరప సాగు పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో ఏటా మూడువేల హెక్టార్లలో మిరప సాగయ్యేది. గత నాలుగేళ్లుగా ఈ సీజన్లో మిరప ధరలు ఢీలా పడ్డాయి. అదే విధంగా ఈదఫా ధరలు తగ్గుముఖం పడతాయని రైతులు మిరప సాగుపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇక్కడ 450 ఎకరాలు మాత్రమే మిరప సాగైంది. దీంతోపాటు ధరలున్నప్పుడు విక్రయించుకోవాల ని భద్రపరిచిన మిరపను సైతం రైతులు విక్రయించేశారు. మిరపను కొన్న వ్యాపారులు మాత్రం బాగా సంపాదించుకున్నారు. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. పులి కోసం గాలింపు చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని దొడ్డిపల్లె హౌసింగ్ కాలనీలో పులి సంచరిస్తున్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఆర్వో థామ స్ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతమంతా గాలించారు. ఆనవాళ్ల కోసం డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. పులి తిరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఇదిలావుండగా జనారణ్యంలో గాయపడిన రెండేళ్ల చిరుత ఆదివారం చనిపోయిన విషయం తెల్సిందే. పోలీసు గ్రీవెన్స్కు 46 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 46 అర్జీలు వచ్చినట్టు ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. ఈ మేరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగా దాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మా కేంటి సంబంధం! కుప్పం: తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కుప్పం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లలితమురేగష్ పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శాంతిపురం మండలం, నంజంపేట గ్రామంలో జరిగిన దీపోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారని చెప్పారు. ఆ సందర్భంగా గోడవలు జరిగాయని, అవి పార్టీల రంగులద్దుకుని సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేసే స్థాయికి వెళ్లాయన్నారు. కబడ్డీ పోటీల్లో మునెప్ప కుమారుడు కిరణ్రాజేష్కు అదే గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు ప్రవీణ్కు గొడవలు జరిగాయని తెలిపారు. ఆపై రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణపడ్డారని తెలిపారు. ఈ గొడవల్లో ఎలాంటి సంబంధం లేని తన భర్త మురుగేష్పై కేసులు పెట్టారని వెల్లడించారు. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లి గ్రామంలో ఉన్న తమకు నంజంపేట గ్రామంలోని గోడవలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. తన భర్త తప్పు చేయలేదని తెలిపారు. ఆమె వెంట దళిత సంఘ నాయకులు మెహన్నాయక్, భాస్కర్నాయక్, చెంగప్ప తదితరులు ఉన్నారు. -
ప్రజలు సంతృప్తి చెందాలి
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ సేవలను ప్రజలు సంతృప్తి చెందేలా అందించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. యాదమరి, శాంతిపురం, జీడీనెల్లూరు, గుడుపల్లె మండలాల నుంచి అధిక సమస్యలు వస్తున్నాయన్నారు. పెండింగ్ అర్జీలను పరిష్కరించాలని చెప్పారు. ఆర్టీసీ బస్టాండుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు. వినతుల పరిష్కారంపై చర్యలు సీఎం కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో వచ్చి న వినతుల పరిష్కారంపై చర్యలు చేపట్టినట్లు కలె క్టర్ తెలిపారు. వి.కోట మండలం, కృష్ణ్ణాపురంలో దారి సమస్య, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో రైతు వెబ్ల్యాండ్ రికార్డు సమస్య, పులి చెర్ల మండలంలో ఓ వ్యక్తికి సీఎం సహాయ నిధి మంజూరు, రామకుప్పం మండలం నారాయణపురంలో రైతుకు పట్టాదారు పుస్తకం జారీ తదితర సమస్యపై తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. -
దివ్యాంగుల గుండెకోత
సీఎం చంద్రబాబు పుట్టినరోజున దివ్యాంగులకు మేలు చేయాల్సింది పోయి, పథకాలకు కోతలు విధించి గుండెకోత మిగిల్చారని ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్ మండిపడ్డారు. సోమవారం తమ సమస్యలను పరిష్కరించాలంటూ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 10 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఉచితంగా అందించే మూడు చక్రాల వాహనాల పంపిణీ ప్రక్రియలో అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. నియోజకవర్గానికి పది వాహనాల చొప్పున పంపిణీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించి, ఆఖరి దశ ఎంపిక సమయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు ఉండాలనే నిబంధన పెట్టడం అన్యాయమన్నారు. పాత సదరం సర్టిఫికెట్లనే ప్రామాణికంగా తీసుకుని, మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని, అర్హులైన వారి పింఛన్ తొలగించకూడదని డిమాండ్ చేశారు. మహిళా నేత అరగొండ సుమతి, మునిరెడ్డి, బాధిత దివ్యాంగులు అరుణ, జ్యోతిప్రసాద్, నరేష్, భూపాల్ పాల్గొన్నారు. -
కరువు తప్పదా?
కార్వేటినగరం: కరువు మేఘాలు మరో మారు ఆవహించనున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవకపోతే పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. తద్వారా ప్రజల ఉపాధికి విఘాతం కలగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రజలు 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందులోనూ ఖరీప్ సీజన్ అత్యంత కీలకం. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారు. ఏటా మే ఆఖరున కేరాళను తాకే నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో జిల్లాలోకి ప్రవేశిస్తాయి. రుతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురవడం.. కీలకమైన ఖరీప్ పంటల సాగుకు రైతులు శ్రీకారం చుట్టడం పరిపాటిగా మారుతోంది. అయితే ఈ సారి రుతుపవనాలకు ఎల్నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేతలు చెబుతున్నారు. ఎల్నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడి సకాలంలో మంచి వర్షాలు కురవకపోవచ్చని చెబుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తక్కువేనా? చిత్తూరు జిల్లాపై ఎల్నినో ప్రభావం చూపిస్తే కరువు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తున్నారు. ఎల్నినో ఎంతకాలం ఉంటుందనే దానిపై ఇక్కడి వ్యవసాయం ఆధారపడి ఉంది. సీజన్ మొత్తం కొనసాగితే మరోసారి కరువు కబళించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా గత కొన్నేళ్లుగా పంట కాలం, వర్షాలు గతి తప్పుతున్నట్లు శాస్త్రవేతలు చెబుతున్నారు. ఈ సారి అదే పరిస్థితి పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అనుకూల వర్షాలు, అకాల వర్షాలు, ఈదురుగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, చలితీవ్రత అధికంగా ఉండడం, పంట కాలాల్లో మార్పులు జరుగుతున్నట్లు గుర్తుచేస్తున్నారు. ఎల్నినో... లా నినా అంటే! ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు ఎలా ఉంటాయనే దానిపై పసిఫిక్ మహా సముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులపై అధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎల్–నినో అలాగే లా నినా అనే పదాలు తరుచూ వింటుంటాం. ఎల్నినో అంటే వర్షాలు తక్కువ కురుస్తాయని, లా నినా అంటే మంచి వర్షాలు కురుస్తాయని చెబుతుంటారు. వాటి ఆధారంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు, పంట దిగుబడులు అంచనా వేస్తుంటారు. ఈ క్రమంలో ఈ సారి ఎల్నినో ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇటీవల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సాధారణం కన్నా వర్షాలు తక్కువగానే నమోదయ్యే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది. పెరూ, ఈక్వెడార్లె ఏర్పడే వేసవి గాలుల వల్ల సంభవించే వాతావరణ మార్పులను ఎల్–నినోగా నామకరణం చేశారు. కొన్ని సంవత్సరాలకోసారి ఈ రెండింటిలో ఒకటి సంభవించడం జరుగుతోందని శాస్త్రవేతలు చెబుతున్నారు. అందులో ఎల్నినో ఏర్పడితే ప్రపంచంలో అనేక దేశాల్లో వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినో ఏర్పడితే తుపాన్లు, అల్పపీడనాలు, వరదలు, సంభవిస్తాయని పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడడంతో భారత్, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాల్లో తక్కువ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. -
ఎగ్గొట్టి.. రైతు పొట్టగొట్టి!
జిల్లాలో మామిడి పంట చెల్లింపులో భారీ దోపిడీ కాణిపాకం: చంద్రబాబు ప్రభుత్వం గతేడాది తోతాపురి రకం మామిడి కేజీకి రూ.8 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా రూ.4 చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రోత్సాహక నిధిని మాత్రం చెల్లించి చేతులెత్తేసింది. గిట్టుబాటు ధరను గాలికొదిలేసింది. దీంతో ఫ్యాక్టరీ యజమానులు ఇష్టానుసారంగా బకాయిలు చెల్లించాయి. ఒకటి రెండు ఫ్యాక్టరీలు తప్ప మిగిలిన ఫ్యాక్టరీలన్నీ కూడా కేజీకి రూ.4 చొప్పున చెల్లించాయి. గిట్టుబాటు ధర రూ.8 ఇవ్వాల్సిన చోట రూ.4 మాత్రమే చెల్లించాయి. దీంతో ఒక్క కిలోపైనే రూ.4 వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఈ లెక్కన రైతులకు మొత్తం మీద రూ.150 కోట్ల మేర ఫ్యాక్టరీలు ఎగ్గొట్టినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తప్పని అవస్థలు దిగుబడి ఎక్కువగా రావడాన్ని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీలు మూకుమ్మడిగా ఒకే నిర్ణయం తీసుకుని ధరలను తగ్గించాయి. మార్కెట్లో పోటీ లేకుండా, రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా ఈ నిర్ణయం అమలు చేశా యి. రైతులెవరూ ఎదు రు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ధర తక్కువగా ఉండడమే కాకుండా, చాలా చోట్ల చెల్లింపులు కూడా పూర్తిగా జరగలేదు. కొన్ని ఫ్యాక్టరీలు ఏడాది గడిచినా బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆయా ఫ్యాక్టరీల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఈ సారీ అంతేనా? గత ఏడాది అనుభవంతో ఈసారి మామిడి సాగుపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన ధర దక్కకపోతే, చెల్లింపులు సమయానికి రాకపోతే సాగును తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ఇది భవిష్యత్తులో మామిడి ఉత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది అధిక దిగుబడిని సాకుగా చూపి జూస్ ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. ప్రభుత్వం తోతాపురి కిలోకి రూ.8 మద్దతు ధర ప్రకటించినా పట్టించుకోకుండా ముంచేశాయి. నామమాత్రంగా కిలోకి రూ.4 చెల్లించి చేతులు దులుపుకున్నాయి. జిల్లా మొత్తం మీద 3.75 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. అందులో రూ.150 కోట్లు మాత్రమే చెల్లించాయి. మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచేశాయి. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు ఆ మొత్తాన్ని కూడా చెల్లించకుండా రైతులను వేధించుకు తింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనని రైతులు ఆందోళనలో మునిగిపోయారు. -
అమ్మా.. లలితా, సరస్వతీ!
బైరెడ్డిపల్లె/వి.కోట: ‘రే..హేమచంద్రా ఎక్కడున్నావురా!. లలితా.. సరస్వతీ ఏం చేస్తున్నారమ్మా..! ఉలుకూ పలుకూ లేకుండా ఇంట్లోనో ఉన్నారా..?.. ఇంటికొచ్చి కూర్చు న్నా పలకరించడానికి రాలేదేమమ్మా?. లలితా.. మీ తమ్ముడ్ని ఎక్కడొదిలి వెళ్లావే..?’ అంటూ అటుగా వచ్చివెళ్లేవారు ఆ ఇంట్లోని పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చూపరులను కలచివేసింది. బైరెడ్డిపల్లె మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమార్తె మృతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలాడు. అత్తగారింటికెళ్తూ.. అనంతలోకాలకు బైరెడ్డిపల్లె మండలం, మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన హేమచంద్ర (38)కు 15 ఏళ్ల క్రితం వికోట మండలం, యడుగూరుకు చెందిన సరస్వతి(32)తో వివాహమైంది. వీరికి కుమార్తె లలిత (12), కుమారుడు సాయికుమార్(5) ఉన్నారు. హేమచంద్ర గత నాలుగేళ్లుగా బెంగళూరులో కార్పెంటర్గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ సొంతూరుకొచ్చి వెళ్తుంటాడు. సరస్వతి పుట్టింట్లోనే ఉంటూ ఇద్దరు బిడ్డలను పెట్టుకుని చదివిస్తోంది. ఇదిలావుండగా రెండు రోజుల క్రితమే భర్త హేమచంద్ర బెంగళూరు నుంచి మేకలనాగిరెడ్డిపల్లెకి వచ్చాడు. సరస్వతి అమ్మగారింటి నుంచి కుమార్తెను తీసుకుని భర్తవద్దకు వెళ్లింది. ఆపై ఆదివారం సరస్వతిని అత్తగారింట్లో వదిలేసి బెంగళూరుకు వెళ్లేందుకు హేమచంద్ర సిద్ధమయ్యాడు. ద్విచక్ర వాహనంపై యడుగూరుకు వెళ్తుండగా పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని కొమ్మరిమడుగు క్రాస్ వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమచంద్ర, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందగా.. లలితకుమారి బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం తనువు చాలించింది. మాటలకందని విషాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో పలమనేరు మేకలనాగిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలకు సోమ వారం మధ్యాహ్నం దహనక్రియలు నిర్వహించారు. అమ్మా, నాన్నతోపాటు అక్కను చూస్తూ సాయికుమార్ ఎక్కిళ్లు పెట్టడం అందరినీ కలచివేసింది. ఆ బాలుడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అమ్మా..!.. నాన్నా.. అంటూ గుక్కపెట్టి ఏడ్చుతున్న బాలుడ్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. మృతులు లలితసరస్వతిహేమచంద్రఆప్యాయతానురాగాలతో అలరారిన ఆ పొదరిల్లు దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క గారాల పట్టీ నడయాడిన ఆ నివాసం శోకసంద్రంతో తడిసి ముద్దవుతోంది. దంపతుల అన్యోన్యానికి ఆలవాలమైన ఆ ఇల్లు మౌనముద్రతో రోదిస్తోంది. బైరెడ్డిపల్లె మండలం, మేకలనాగిరెడ్డిపల్లెలో ఎవరిని కదిలించినా ఆ ముగ్గురి మరణం గురించే చర్చ సాగుతోంది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృత్యుఒడికి చేరగా.. ఒక్కగానొక్క కుమార్తె బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. చిట్టిపొట్టి మాటలతో ఆకట్టుకునే ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలాడు. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన పలమనేరు నియోజకవర్గంలో విషాదాన్ని మిగిల్చింది. -
న్యాయం చేయండి మహాప్రభో!
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీదారులు పోటెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయం పై బాధితులు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, జేసీ ఆదర్శ్రాజేంద్రన్ వద్ద మొరపెట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, ఏవో వాసుదేవన్ పాల్గొన్నారు. భూ ఆక్రమణలను అడ్డుకోండి భూ ఆక్రమణలను అడ్డుకోవాలని పులిచెర్ల మండలం, ఎల్లంకవారిపల్లి గ్రామానికి చెందిన బాధితుడు యోగానందరెడ్డి కోరారు. విచారణ చేసి న్యాయం చేయాలంటూ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా తమ గ్రామంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా తమ గ్రామంలోని భూములను ఆక్రమించుకుంటున్నట్లు చెప్పారు. తన సొంత భూమిలోకి ప్రవేశించి దారి ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించినందుకు రౌడీలా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. 40 ఏళ్ల నిరీక్షణ చిత్తూరు నగరంలోని కామేశ్వర్నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడి 40 ఏళ్లు పూర్తయినా, నేటికీ కనీస సదుపాయాలు లేవన్నారు. రహదారులు, డైనేజీ సౌకర్యాలు లేకపోవడంపై అధికారులను నిలదీశారు. గతంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ఇప్పటికై నా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న కామేశ్వర్నగర్ కాలనీ వాసులు అర్జీలు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు -
రోజా కూతురు అన్షుమాలిక అరుదైన ఘనత
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అరుదైన ఘనత సాధించారు. తన ప్రతిభతో అమెరికాలో కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలోని ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించారు. బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇందు లో ఐదేళ్లకొకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవా ర్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బివెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిని అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఆమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది. అవార్డులు.. పురస్కారాలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్స్టాండింగ్ లీడర్ష్ప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవల ను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డు, ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
అక్రమ క్వారీలకు కేరాఫ్ కుప్పం
కీర్తి పతాక.. అన్షుమాలిక నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో కీర్తిపతాకాన్ని ఎగురవేసింది. తన ప్రతిభ తో అరుదైన గుర్తింపు పొందింది. అమెరికాలో ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఖ్యాతి గడించింది. బ్లూమింగ్ టన్ ఇండియానా యూనివర్సిటీలో అన్షుమాలిక కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఇందు లో ఐదేళ్లకొకసారి ప్రెసిడెంట్ హెర్మన్ బివెల్స్ గౌరవా ర్థం ప్రతిష్టాత్మకమైన ‘హెర్మన్ బివెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్’ అవార్డు అందిస్తుంది. అలాంటి అత్యున్నత పురస్కారాన్ని శనివారం తల్లిదండ్రులు ఆర్కే రోజా, ఆరేకే సెల్వమణి సమక్షంలో అన్షుమాలిక అందుకుంది. అమెరికాలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిని అన్షుమాలిక కావడం విశేషం. యూనివర్సిటీలో గౌరవ ప్రదర్శనగా ఉంచే బోర్డులో ఉత్తమ విద్యార్థినిగా ఆమె పేరు లిఖించిన బంగారు ఫలకం జీవితకాలం ఉండిపోతుంది. అవార్డులు.. పురస్కారాలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన అవార్డులు అందుకుంటూ అన్షుమాలిక తన ప్రతిభను చాటుతోంది. ఇప్పటికే ‘యూనివర్సిటీ అవుట్స్టాండింగ్ లీడర్షిప్ అవార్డు’ అందుకుంది. ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ నవల ను రచించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ రచయిత్రిగా గుర్తింపు పొందింది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ‘గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డు, ‘మౌరిన్ బిగ్గర్స్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం అందుకున్న అవార్డుతో మరో మైలురాయిని చేరుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం అక్రమ క్వారీలకు కేరాఫ్గా మారింది. రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు క్వారీలను ఆదాయ వనురులుగా మార్చుకుని ఇస్టానుసారంగా మైనింగ్ పనులు చేపడుతున్నారు. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో టీడీపీ నేతల సహకారంతో అక్రమ క్వారీలు వెలిశాయి. పలగంతా పనులు చేయడం రాత్రులు దర్జాగా లారీల్లో తమిళనాడు రాష్ట్రానికి గ్రానైట్ను తరలించడం నిత్యకృత్యంగా మారింది. లీజు లేకుండా సాగుతున్న క్వారీల గురించి అడిగే నాథుడేలేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో కుప్పం నియోజకవర్గంలో అక్రమ క్వారీలు దర్జాగా సాగిస్తున్నారు. ఇక్కడ లభించే గ్రానైట్కు తమిళనాడులో మంచి డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా తవ్వుకునేందుకు అతనుమతులిచ్చి వారి నుంచి పెద్ద మొత్తంలో వసూ లు చేసుకుంటున్నారు. ప్రధానంగా గుడుపల్లె మండలంలోని యామనూరు, ద్రవిడ వర్సిటీ, కనమనపల్లి, కమ్మగుట్టపల్లి, శాంతిపురం మండలంలోని సి.బండపల్లి, రాళ్లబూదుగూరు, సోమాపురం గ్రామాల పరిధిలోని క్వారీ గుట్టల్లో మైనింగ్ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. పగలంతా గుట్టు చప్పుడు కాకుండా క్వారీల్లో గ్రానైట్ తవ్వకాలు చేపట్టి రాత్రిళ్లు లారీల్లో తమిళనాడు రాష్ట్రంలోని జగదేవి, హోసూర్, చైన్నె, క్రిష్ణగిరి పట్టణాలకు తరలిస్తున్నారు. అక్రమ క్వారీల పై ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి ఒకటి, రెండు గ్రానైట్ వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ క్వారీ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చేతులు తడిపితే చాలు అనుమతులు టీడీపీ బడా నేతలకు చేతులు తడిపితే చాలు అక్రమ క్వారీలకు అనుమతులు లభిస్తున్నాయి. క్వారీల్లో హిటాచీ, ప్రొక్లెయినర్ వంటి వాహనాలతో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. నాయకులకు కొంత, జేసీబీలు వంటి భారీ వాహనాలు పెట్టే వారికి కొంత మొత్తం చెల్లించేలా టీడీపీ నాయకులు ధర నిర్ణయించారు. దీని ప్రకారం రాత్రి క్వారీల్లో తవ్వకాలు చేపట్టేవారు సంబంధిత నాయకులు మనుషుల వద్ద నిర్ణయించిన ధర చెల్లించి తరలించుకుంటున్నారు. ఇలా టీడీపీ నియోజకవర్గ బడా నేత ఖాతాలో నగదు జమచేస్తే క్వారీలకు అడ్డు అదపు ఉండదు. అంతేకాకుండా క్వారీ నిర్వహించే ప్రాంతంలో బూత్ కన్వీనర్ నుంచి మండలం స్థాయి నాయకుడి వరకు ప్రతినెలా మామూళ్లు కూడా చెల్లించాల్సిందే. రాత్రికి రాత్రే సరిహద్దు దాటుతున్న గ్రానైట్ కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీల నుంచి రాత్రికి రాత్రే గ్రానైట్ రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. రాతి దిమ్మెలు తరలించేందుకు పర్మిట్లు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ టీడీపీ నాయకులు దర్జాగా సంపాదిస్తున్నారు. సరిహద్దుల్లోని చెక్ పోస్టు నుంచి క్వారీల వరకు అందరికీ మామూళ్లు అందడంతో అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వదిలేస్తోంది. వరుస దాడులు కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై ఇటీవల పోలీసులు వరుస దాడులు చేశారు. కుప్పం మండలం వసనాడు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తమిళనాడుకు గ్రానైట్ను తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా శాంతిపురం మండలం సోలిశెట్టి గ్రామం వద్ద హిటాచీ వాహనంతో అక్రమ క్వారీ నడుపుతున్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి క్వారీని సీజ్ చేశారు. కాగా గత రెండేళ్లుగా అక్రమ క్వారీలను పట్టించుకోని పోలీసులు అకస్మాత్తుగా క్వారీలపై దాడి చేయడం హాట్ టాఫిక్గా మారింది. పోలీసుల దాడుల్లో టీడీపీ నాయకులకు చెందిన రెండు క్వారీలు బయటపడ్డాయి. ఇంకా దాడులు చేస్తే ఇంకా మరెన్నో అక్రమ క్వారీలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. యూనివర్సిటీ గౌరవ ప్రదర్శన బోర్డులో ఉన్న తన బంగారు ఫలకం పక్కన అన్షుమాలిక తల్లిదండ్రులతో కలిసి హెర్మెన్ బివెల్స్ అవార్డును చూపుతున్న అన్షుమాలిక -
కల్వర్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం
● యువకుడి మృతి ● మరొక యువకుడికి తీవ్ర గాయాలు శ్రీరంగరాజపురం: మండలంలోని ముద్దికుప్పం సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ సుమన్ కథనం మేరకు.. ముద్దికుప్పం గ్రామానికి చెందిన శరవణ, పాతపాళ్యం దళితవాడకు చెందిన చంద్రన్ ద్విచక్ర వాహనంలో పళ్లిపట్టు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి బయలుదేరారు. ముద్దికుప్పం మధ్యలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు 108లో ఆస్పత్రికి తలించారు. శరవణ మార్గమధ్యంలో మృతి చెందాడు. చంద్రన్ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఉచిత శిక్షణ.. ఉజ్వల భవిష్యత్తు
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సాహం లేక మరుగున పడుతున్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) కార్యాచరణను ప్రకటించింది. విశాఖ, కాకినాడ, తిరు పతి నగరాల్లో ఉన్న శాప్ అకాడమీల్లో ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. ఈ అకాడమీల్లో 12 రకాల క్రీడల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడలో రాణించేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. తిరుపతి కేంద్రంలో బ్యాడ్మింటన్, జూడో, రైఫిల్ షూటింగ్, లాన్టెన్నిస్ (బాల, బాలికలకు), బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్లో (బాలికలకు) శిక్షణ ఇస్తారు. అలాగే కాకినాడ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో (బాలికలకు ప్రత్యేకం) శిక్షణ ఇస్తారు. విశాఖ కేంద్రంలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్ విభాగాల్లో (బాలురకు) శిక్షణ ఉంటుంది. 15 నుంచి 19 ఏళ్లలోపు వారు అర్హులు. 2008 జనవరి 1 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్పీవోఆర్టీస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఎంపిక సమయంలో ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 10 పాస్పోర్ట్ సైజు ఫొటోలతో పాటు తమ క్రీడా కిట్ను వెంట తీసుకు వెళ్లాలి. ఎంపిక తేదీలు తిరుపతిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 26న జూడో, బ్యాడ్మింటన్, 27న బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, 28న రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్, కాకినాడ డీఎస్ఏ మైదానంలో 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, 30న హాకీ, ఖోఖో, విశాఖపట్టణం కొమ్మాది మైదానంలో మే 4న అథ్లెటిక్స్, 5న సైక్లింగ్, 6న వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో విద్యార్థుల ఎంపికలు జరుగుతాయి. తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయం -
మహేశ్వర లీలలు
వెలుగులోకిచిత్తూరు అర్బన్ : తప్పుచేసిన వారు ఎప్పటికై నా పట్టుబడక తప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇటీవల వార్తల్లోకెక్కిన చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర చేసిన మాయల గురించి సిబ్బంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కిన వారితో రూ.లక్షల్లో బేరసారాలు చేస్తారని, తోటి సిబ్బంది విషయంలోనూ చేతివాటం చూపారని పేర్కొంటున్నారు. ఇలా ఒకటీ, రెండూ కాదు.. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరకు పాపం పండడంతో వేటు పడింది. పోలీసు కానిస్టేబుల్ కేసులోనూ అవినీతి ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఐటీ కోర్లో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ కుమార్తెను అల్లుడు హత్య చేయడానికి ప్రయత్నిస్తే వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ కేసులో నిందితుడు కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి సీఐ సహకరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. మనోవేదనకు గురైన బాధితురాలి తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ కల్పించుకుని కేసును మహిళా స్టేషన్కు బదిలీ చేయించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విచ్ఛలవిడితనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులో హాజరుపరిస్తే ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఐ తనకు నమ్మినబంట్లుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లతో నిందితుల నుంచి నగదు వసూలు చేయించి వదిలేసినట్టు సమాచారం. ఈ కేసుల్లో సుమారు రూ.60 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. భద్ర, రక్షక్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పలేక సతమతమవుతున్నారు. కేసు నుంచి నిందితులను తప్పించిన వైనం గత శనివారం శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణను కలిశారు. తన కుమార్తె ఇటీవల మృతి చెందిందని, దీనికి కారణమైన నిందితుల పేర్లను పోలీసు అధికారికి చెబితే, వాళ్లను కేసు నుంచి తప్పించడానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని వాపోయాడు. నిందితుల నుంచి రూ.6 లక్షల తీసుకుని తప్పించేశారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. చిత్తూరులోని మిట్టూరులో పోలీసుల కోసం సంక్షేమ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. అక్కడ పనిచేసే డాక్టర్ లావణ్యను సైబర్ నేరగాళ్లు మోసం చేసి దాదాపు రూ.కోటి వరకు నగదు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్టౌన్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కింగ్పిన్గా ఉన్న రాజు బాసప్ప అలియాస్ రాజు చల్లప్ప అనే వ్యక్తిని అప్పటికే తమిళనాడులోని బ్యాంక్ ఫ్రాడ్ సెల్ విభాగం అధికారులు అరెస్టు చేసి మదురై జైలులో ఉంచారు. సీఐ నేరుగా జైలుకు వెళ్లి అతనితో బేరం కుదుర్చున్నాడు. నిందితుడు జైలు నుంచి విడుదలయ్యాక చిత్తూరు కోర్టులో పీటీ వారెంటు తీసుకున్నాడు. ప్రధాన నిందితుడిని తప్పించి కేరళకు చెందిన ఇద్దరు సహ నిందితులపై కేసు నమోదు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విద్యుత్ స్తంభం నుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలు
బైరెడ్డిపల్లె: విద్యుత్ స్తంభం నుంచి కింద పడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మూలతిమ్మేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మూలతిమ్మేపల్లె విద్యుత్ సబ్ స్టేషన కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న రమణ ఆదివారం విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడటంతో ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ట్రాన్స్కో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గ్రానైట్ లారీ స్వాధీనం పెనుమూరు(కార్వేటినగరం): అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మండలంలోని శాతంబాకం వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. పెద్ద గ్రానైట్ దిమ్మెను తీసుకుని వస్తున్న లారీని ఆపి తనిఖీ చేసినట్టు తెలిపారు. గ్రానైట్ను వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం నుంచి యాదమరి మండలంలోకి తీసుకెళుతున్నట్టు డ్రైవర్ తెలిపాడన్నారు. మైన్స్ అండ్ జియాలజీ అధికారుల అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం లారీని మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
వి.కోట: మండలంలోని ఓగు గ్రామం వద్ద ఆదివారం బైక్ను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. రామకుప్పం మండలం బల్దారు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (47) ద్విచక్ర వాహనంలో వి.కోట మండలంలోని ఓగు గ్రామం నుంచి వి.కోట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని కారు వేగంగా వస్తూ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): వేతనాలందక ఆశా కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. మార్చి నెల జీతం ఇంతవరకు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 3 వేల మందికి పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి మార్చి నెల వేతనాలు ఇంకా జమ కాలేదు. రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నదని ఆశావర్కర్లు వాపోతున్నారు. బడ్జెట్ సమస్య సాకు.? జీతాల ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే ‘బడ్జెట్ సమస్య’ అని సమాధానం ఇస్తున్నారని ఆశావర్కర్లు చెబుతున్నారు. నెల గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వేతనాల విడుదలలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్యానర్ల రగడ – కొట్టుకున్న టీడీపీ నేతలు సాక్షి టాస్క్ఫోర్స్ : చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కట్టే విషయంలో గుడిపాల మండలం బసవాపల్లి, రెట్టగుంట గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. గతంలో టీడీపీకి చెందిన యువ నాయకుడు బ్యానర్లు కట్టాడు. ఇప్పుడు మరో యువ నాయకుడు ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలోనే చంద్రబాబునాయుడు పుట్టిన రోజుకు సందర్భంగా బ్యానర్లు కట్టాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ పార్టీ పెద్ద నాయకులు రంగంలోకి దిగి పంచాయితీ చేసి ఇద్దరికీ సర్దిచెప్పారు. వారు నాయకుల మాట వినలేదు. అసంతృప్తిగా రాజీ చేసుకుని బయటికి వచ్చారు. ఇకపై తమ ప్రతాపం ఏమిటనేది చూపిస్తామని ఒక వర్గం వారు మరో వర్గం వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఎంత వరకు దారి తీస్తుందనేది వేచి చూడాల్సిందే. కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి – రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య చిత్తూరు అర్బన్: కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడంలో న్యాయమూర్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో తిరుపతి, మదనపల్లి, చిత్తూరు ప్రాంతాల్లోని న్యాయ మూర్తులకు రెండో రోజైన ఆదివారం కూడా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన ఎలా పెంచుకోవాలి, తీర్పులను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
పశుసంవర్థక సహాయకుల్లో గుబులు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో పశుసంవర్థక శాఖ నియామకాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపాలమిత్రలుగా పనిచేసిన పలువురు తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకుంది. మరికొంత మందిపైనా వేటు వేసేందుకు సిద్ధమవుతోందన్న సమాచారం కలకలం రేపుతోంది. దీంతో సహాయకుల్లో టెన్షన్ పట్టుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 449 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 565 మంది పశుసంవర్థక సహాయకులు పని చేస్తున్నారు. వీరిలో కొందరి నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గోపాలమిత్రగా పనిచేస్తూనే ఇంటర్ పూర్తి చేసి, ఆ తర్వాత సచివాలయ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగంలో ఉండగానే చదువు పూర్తి చేయడం, అదే సమయంలో ఇన్–సర్వీస్ కోటాలో వెయిటేజ్ మార్కులు పొందడం అనేక సందేహాలకు దారితీస్తోంది. గోపాలమిత్రలకు నెలకు సుమారు రూ.7,500 గౌరవ వేతనం, సూపర్వైజర్లకు రూ.30 వేల వేతనం లభిస్తోంది. రెగ్యులర్గా ఎలా చదివారో మరి.. గోపాలమిత్రలు పశువుల సంరక్షణ, టీకాలు వేయడం, రైతులకు అవగాహన కల్పించడం తదతర పనులు చేస్తుంటారు. అదే సమయంలో రెగ్యులర్గా చదివి ఇంటర్ పూర్తి చేయడం సాధ్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ స్కూల్ ద్వారా చదివే అవకాశం ఉన్నా, పూర్తి స్థాయిలో పనిచేస్తూ చదువుకోవడం ఎంతవరకు న్యాయసమ్మతమన్నది విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించారు. అనుమానితులుగా ఉన్న అభ్యర్థుల విద్యార్హత పత్రాలు, వెయిటేజ్ మార్కుల కేటాయింపుపై పూర్తి స్థాయిలో పరిశీలన ప్రారంభించారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి ధృవీకరణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యాక సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. యూనియన్ల తిరుగుబాటు ఈ చర్యలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. అనుమానాలెన్నో.. గ్రామ/వార్డు సచివాలయ నియామకాల్లో గోపాలమిత్రలుగా పనిచేసిన వారికి గరిష్టంగా 15 మార్కుల వరకు వెయిటేజ్ ఇచ్చారు. విద్యార్హతలు పూర్తిచేసిన కాలం, సేవా కాలం మధ్య పోలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకుంటున్న సమయంలోనే పని చేసినట్లు చూపించి, వెయిటేజ్ పొందడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లయితే, అది క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. -
ప్రకృతి రక్షణలో పాలకులదే కీలకపాత్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రకృతి పరిరక్షణలో పాలకులదే కీలక పాత్ర అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు, కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.వి.శ్రీధర్రెడ్డి తెలిపారు. చిత్తూరులోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో ఆదివారం రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకృతిపై కవి సమ్మేళనం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల జీవజాతులు 114 రెట్లు వేగంగా అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితల సమాఖ్య అధ్యక్షుడు సి.నారాయణస్వామి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ తక్షణమే స్పందించి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు చూపాలన్నారు. ప్రముఖ రచయితలు నందిపాటి చక్రపాణి, తోటి గోవిందన్ మాట్లాడుతూ 2019 నాటికి వాయుకాలుష్యంతో ఆంధ్రప్రదేశ్లో 62,808 మంది, తెలంగాణాలో 35, 364 మంది మరణించారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతిని పరిరక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 40 మంది కవులు, కవయిత్రులు, తెలుగు భాషాభిమానులను మర్రిపూడి దేవేంద్రరావు సన్మానించారు. కార్యక్రమంలో రచయితలు కొఠారి వెంకటరత్నం, ఎం.కన్నయ్య నాయుడు, జి.శాంతకుమారి, మిట్టా లక్ష్మి, వి.ఉషాకిరణ్, కీర్తిప్రియ, ఆర్.ఎన్.రాజన్, ఎస్.మునీంద్ర, ఎం.శ్రీరాజు, పాలకూరు కన్నయ్య, జగదీష్ కుమార్, రెడ్డిపల్లి షాజహాన్, అనంత పద్మనాభన్, దామోదరాచారి, తెలుగు భాషాభిమానులు కోటీశ్వర మొదలియార్, డి.రోహిత్, కె. హరిప్రసాద్ రెడ్డి, ఆనంద నాయుడు, భాస్కర్ రెడ్డి, కె.యర్రయ్య, రాజేంద్ర, మురళి, రమ్య, యమున, బ్రెయిన్ బాక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్.యువన్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్య ప్రయాణం
ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని పోలీసులు నిత్యం చెబుతున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తున్నారు. వి.కోట పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఆదివారం ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నలుగురిని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా దర్జాగా వెళుతూ కనిపించాడు. వి.కోట పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇలా నిర్లక్ష్యంగా ప్రయాణం మంచిది కాదని స్థానికులు వాపోతున్నారు. – వి.కోట -
పాఠశాలల్లో మూలనపడ్డ ఆర్వో ప్లాంట్లు
ఉచిత శిక్షణ.. ఉజ్వల భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేయని ఆర్వో వాటర్ ప్లాంట్ గుడిపాల: చిత్తపార స్కూల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్ టీచర్ల డిక్లరేషన్లు అందజేయండి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల కేడర్ స్ట్రెంత్ జాబితాలను అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఎంఈవోలను ఆదేశించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లా డుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియకు సంబంధించి సేకరించిన టిస్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డిక్లరేషన్ కాపీలను చిత్తూరు డీఈవో కార్యాలయానికి చేరవేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుని నుంచి ఇది వరకే సేకరించిన సంతకం చేసిన టిస్ డిక్లరేషన్ కాపీలను ఒక పూర్తి సెట్టు సిద్ధం చేయాలన్నారు. అన్ని డిక్లరేషన్ పత్రాలను కలిపి కాకుండా, హోదా వారిగా ప్రత్యేకంగా విభజించాలని సూచించారు. కేడర్ స్ట్రెంత్ వివరాలు అందజేసే సమయంలోనే డిక్లరేషన్ పత్రాలను సైతం ఇవ్వాలన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేడు గ్రీవెన్స్ డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తనను నేరుగా కలిసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేడు రాష్ట్ర ప్రచార విభాగ విస్తృత స్థాయి సమావేశం విజయపురం (నగరి) : రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం జోన్–4లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రచార కార్యదర్శి శేఖర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు, రామ్నగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జోన్ 4 విభాగంలోని జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రచార విభాగం కమిటీ సభ్యులు, నియోజకవర్గ, మండల ప్రచార విభాగం అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొనాని ఆయన సూచించారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు... ఇది ఒక్క చిత్తూరు, గుడిపాలలోనే కాదు.. జిల్లాల్లోని 90 శాతం పాఠశాలల్లో ఇదే దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం వాటి మరమ్మతులకు కూడా నిధులు విదల్చనంటోంది. ఫలితంగా విద్యార్థులు గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. దప్పికతోనే ఇంటికి కెళ్లి గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాగే ఉంటే పిల్లలు అనేక రకాల రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లో ఆర్వో వాటర్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు చిత్తశుద్ధి లేదుచిత్తూరు కలెక్టరేట్ : ‘పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నాణ్యమైన బోధన అందించాలి. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి..’ అన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నాడు–నేడులో భాగంగా సకల వసతులు కల్పించింది. సురక్షితమైన తాగునీరు అందించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. నిర్వహణను గాలికొదిలేసి మూలన పడేసింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లలో తెచ్చుకున్న నీటితో అప్పుడప్పుడూ గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. అసలే ఎండలు.. పిల్లలు సరిప డా నీరు తాగకపోతే అనేక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరించడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. నాడు స్వచ్ఛజలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో 1,953 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధునాతన ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు స్వచ్ఛజలం అందించారు. ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి నిర్వహణకు ప్రత్యేకంగా యాప్లను రూపొందించారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే బాగు చేసేలా వ్యవస్థను తీసుకువచ్చారు. నేడు ఆ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నేడు మరమ్మతులు శూన్యం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఒక్క కొత్త ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. పోనీ ఉన్నవాటిని కాపాడుకోవడంలోనూ విఫలమయ్యారు. ఫిల్టర్లు పాడైపోయి, పైపులు పగిలిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నిర్వహణకు నిధులు లేకపోవడంతో హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు చేతులెత్తేశారు. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో ఆర్వో యంత్రాలు మూలకు చేరి తుప్పుపడుతున్నాయి. అభివృద్ధి అంటే ఇదేనా? చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగంపై విషం కక్కుతోంది. విద్యార్థులు నీటి సమస్యతో అలమటిస్తుంటే పట్టించుకోవాల్సిన సమగ్రశిక్ష శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో పిల్లలకు స్కూల్లోనే మంచి నీళ్లు వచ్చేవి, ఇప్పుడు మళ్లీ పాతరోజులు వచ్చాయి అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు : పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మూలకు చేరిన ఆర్వో వాటర్ ప్లాంట్గుడిపాల: పానాటూరు పాఠశాలలో మరమ్మతులకు గురైన ఆర్వో వాటర్ ప్లాంట్చిత్తూరు : పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేయని ఆర్వో వాటర్ ప్లాంట్ప్రభుత్వ పాఠశాలల సమాచారం నియోజకవర్గం పాఠశాలలు విద్యార్థుల సంఖ్య చిత్తూరు 183 11,413 గంగాధరనెల్లూరు 399 15,139 కుప్పం 433 31,955 నగరి 177 10,334 పలమనేరు 463 33,327 పుంగనూరు 404 22,856 పూతలపట్టు 355 15,642 మొత్తం 2,414 1,40,666 దాహం తీరేదెప్పుడు ? గతంలో మా పాఠశాలలోనే చల్లటి మినరల్ వాటర్ తాగేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ పనిచేయకుండా మూలకు చేరింది. మా పరిస్థితిని చూసి టీచర్లు సొంత డబ్బుతో బయట నుంచి తాగునీటి క్యాన్లు తెప్పిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో దాహం ఎక్కువగా వేస్తోంది. మా స్కూల్లో ఆర్వో ప్లాంట్ను వెంటనే రిపేర్ చేయించాలి. – ఫనీష్, విద్యార్థి, గుడిపాల మండలం బయట నుంచి తెప్పిస్తున్నారు మా స్కూల్లో ఉండే ఆర్వో ప్లాంట్ మూలకు చేరింది. టీచర్లు బయట నుంచి రోజూ వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నారు. గతంలో లాగా మాకు స్కూల్లోనే మంచి నీళ్లు వచ్చేలా చూడాలి. చాలా నెలలుగా ఆర్వో ప్లాంట్ చెడిపోయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఆర్వో ప్లాంట్ను రిపేరు చేయించాలి. – ప్రసన్నకుమార్, విద్యార్థి, గుడిపాల మండలం బాటిల్ నీరే దిక్కు పేద విద్యార్థులు ఇంటి నుంచి నీటి సీసాలను తెచ్చుకుంటున్నారు. అవి అయిపోతే మధ్యాహ్నం తర్వాత ఇంటికెళ్లి నీరు తాగుతున్నారు. అంతవరకు దప్పికతోనే అలమటిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలు చూడలేక టీచర్లు తమ సొంత జేబుల్లోంచి డబ్బులు వేసు కుని వాటర్ క్యాన్లును తెప్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు మూలనపడ్డాయి. వీటి మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదని హెచ్ ఎంలు చెబుతున్నారు. సరిపడా నీరు అందకపోవడంతో విద్యార్థులు డయేరియా, కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు పాఠశాలలో శుద్ధ జలం యంత్రం మరమ్మతులకు గురికావడంతో మా కుమార్తె ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తీసుకెళ్తుంది. వేసవిలో సరిపడా నీరు తాగకుంటే వడదెబ్బ బారినపడే అవకాశం ఉంది. కనీసం పాఠశాలలో చేతి బోరు కూడా లేదు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని తాగించేందుకు, రోగాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. – పద్మ, విద్యార్థినితల్లి, ఎగువ చవటపల్లె, తవణంపల్లె మండలం -
విచ్చల విడిగా జల్లికట్టు.. పోటీలలో ఎద్దు మృతి
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జల్లికట్టు పోటీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఊర్ల ఓబనపల్లిలో టీడీపీ నేతల కనుసన్నల్లో పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోటీల పేరుతో మూగజీవాలను చిత్రవదకు గురిచేస్తున్నారు. ఈ సందర్బంగా పోటీలలో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీలలో పాల్గొన్న ఎద్దు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. అనంతరం క్రీడలో పాల్గొన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. -
ముళ్లపొదల్లో చిక్కుకొని చిరుత మృతి?
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో చిరుత పులి మృతి కలకలం రేపుతుంది. ముళ్లపొదల్లో ఇరుక్కొని చిరుతపులి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దాని కాలికి గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ముళ్లపొదల్లేనే ఇరుక్కొని చిరుత మృతిచెందిందా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. -
ఏపీఐఐసీకి 10.33 ఎకరాల భూమి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని తేనేబండ రెవెన్యూలో ఇరువారం–చెర్లోపల్లి బైపాస్ మధ్య 10.33 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలాన్ని ఎస్టీల హబ్గా తీర్చిదిద్దాలని జిల్లా అధికారు లు భావించారు. చదును చేసే పనులు ప్రారంభించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఎకరా భూమి రూ.కోటి వరకు పలుకుతోంది. దీంతో కొందరు ఎస్టీల పేరుతో కొట్టేయాలని చూశారు. బినా మీలను ముందస్తు బుకింగ్ చేయించుకున్నారు. రూ.3 లక్షలు ఉంటే భూమి తీసిస్తామని ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ విషయం ఆనోటాఈ నోటా పడి కలెక్టర్కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మారిన ప్లానింగ్ దళారుల దందాను పసిగట్టిన అధికారులు ప్లాన్ను మార్చేశారు. ఈ భూమిని కమర్షియల్గా మార్పు చేస్తూ ఏపీఐఐసీకి అప్పగించారు. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమిని రూ.కోటిగా ధర ప్రకటించారు. ఈ భూమిని విలువను, రోడ్డు వసతిని ఒక కంపెనీ గుర్తించింది. రెవెన్యూ అధికారులు ప్రణాళికలను వేగవంతం చేసి ఏపీఐఐసీకి ద్వారా ఆ కంపెనీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలో ఈ భూమి మొత్తం ఈస్ట్ మెన్ కంపెనీ చేతికి వెళ్లనుందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే 2,500 మందికి ఉపాధి దొరుకుతుందని రూరల్ తహసీల్దార్ కల్యాణి పేర్కొన్నారు. చిత్తూరు తేనెబండ రెవెన్యూలో ఎస్టీల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎస్టీలను కొంత మందిని ఓ చోటకు తీసుకొచ్చి వారి అభివృద్ధికి బాట లు వేయాలనుకుంది. వారికి స్థలం కేటాయించి వసతులు కల్పించాలని భావించింది. ఈ మేరకు 10.33 ఎకరాల భూమిని చదును చేసింది. స్థలం విలువ తెలుసుకున్న కొంతమంది దళారులు దాన్ని స్వాహా చేయాలని చూశారు. ఈ విషయం కల్టెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్లాన్ మారింది. ఆ భూమిని ఏపీపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. -
సెకండియర్లోనూ ఇంప్రూవ్మెంట్
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ సెకండియర్లోనూ ఇంప్రూవ్మెంట్కు అవకాశం కల్పించినట్టు ఇంటర్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2026 మార్చి పరీక్షల్లో రెండో ఏడాది పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ప్రథమ సంవత్సరం తరహాలో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చన్నారు. విద్యార్థులు రాసిన పేపర్లలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితాల్లో పరిగణలోకి తీసుకుంటారన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణులైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అర్హులన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం లేదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తాము పాస్ అయ్యే వరకు ఎన్ని సబ్జెక్టులకై నా పరిమితి లేకుండా హాజరుకావచ్చన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి రూ.600, రెండు సంవత్సరాలకు కలిపి హాజరయ్యేవారు రూ.1200 చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజుతో పాటు ఇంప్రూవ్మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకూ అదనంగా రూ.160 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు ఉపయోగించిన పాత రిజిస్ట్రేషన్ నంబర్తోనే దరఖాస్తు చేసుకోవాలని డీఐఈవో తెలిపారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
వెదురుకుప్పం: ప్రతిపక్షాలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా చరిత్ర హీనులుగా మిగిలిపోయినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు 50 శాతం రిజిర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళలను ఘోరంగా అవమానించారని చెప్పారు. మహిళల ఓట్లు కావాలని, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకూడదా అని ప్రశ్నించారు. 2023లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో పదవులు, నామినేటెడ్ పదవులు, సంక్షేమ పథకాల అమలులోనూ మహిళలకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు భారీ గా నష్టపోయే ప్రమాదముందని నారాయణస్వామి తెలిపారు. 2011 జనాబా ప్రాతిపదికన తీసుకుంటే మరింత నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నది అందరి అభిమతమన్నారు. డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయనే ఆశాభావం ఉన్నప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ప్రతిపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయని, కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను అజెండాలో పెట్టి ఉంటే భాగుండేదన్నారు. మహిళలకు చంద్రబాబు దగా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపడం లేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని మహిళలు గమనించాలన్నారు. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని మహిళా పక్షపాతి అంటున్నాడని, తెలంగాణలో మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్తో చీకటి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. ఆలాగే రెండేళ్లు కావస్తున్నా ఒక్క మహిళకు కూడా సెంటు ఇంటి స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా మహిళలపై ఉన్న ప్రేమ అని ఎద్దేవా చేశారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీలు భవిష్యత్లో మనుగడ అసాధ్యమన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లోనూ చైతన్యవంతులు అయితేనే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. -
సంజీవనిపై వైద్య సిబ్బందికి శిక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సంజీవని ప్రాజెక్ట్పై రీఓరియంటేషన్ శిక్షణతో పాటు మాతా–శిశు ఆరోగ్యంపై శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, సీఎంసీ సంజీవని ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ తపన్ పాల్గొని వైద్యాధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలను వివరించారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సేవలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే సంజీవని ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. పేషెంట్ కేర్ సెంటర్ వద్ద ఆధార్ ఐడీ, మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ నుంచి అన్ని వైద్య సేవల వివరాలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా అపాయింట్మెంట్లు, స్పెషలిస్ట్ సేవలు, ఇంటి వద్ద అత్యవసర చికిత్స, రిమైండర్ సేవలు అందజేస్తామన్నారు. సంజీవని ప్రాజెక్టుపై ఈ నెల 21న కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్వోలకు విస్తృత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మాతా శిశు ఆరోగ్యంపై సమీక్ష చేపట్టారు. గర్భిణుల తక్షణ నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, అవసరమైన పరీక్షలు, టీనేజ్ గర్భిణుల పర్యవేక్షణపై పలు సూచనలు చేశారు. అన్ని ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరగాలని, సమయానికి టీకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తి చేసి యూవిన్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. -
చట్టాలపై అవగాహనతోనే న్యాయం
చిత్తూరు అర్బన్: దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చి న బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలపై జడ్జీలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే కక్షిదారులకు న్యాయం అందుతుందని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ నినాల జయసూర్య తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చిత్తూరు, మదనపల్లె, తిరుపతి లోని జడ్జీలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన న్యాయాధికారులు కేసుల విచారణ, సాక్ష్యాల నమోదు, కక్షిదారులకు న్యాయం జరగాలంటే కొత్త చట్టాలపై పట్టు ఉండాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడు తూ ఐపీసీ–బీఎన్ఎస్ మధ్య సంబంధం, కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్లు, రద్దు చేసిన అంశాలు, పోక్సో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితర అంశాలపై చర్చించారు. రిసోర్స్ పర్సన్లు రిటైర్డు జిల్లా జడ్జీలు విరూపాక్ష దత్తాత్రేయ గౌడ, కృష్ణయ్య పలు అంశాలను వివరించారు. జడ్జీలు రమేష్, శ్రీదేవి, భారతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలదే కీలకపాత్ర చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలదే కీలకపాత్ర అని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన రెండు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. డీఈవో మాట్లాడుతూ పాఠశాల అంటే వందలాది మంది పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దే దేవాలయమన్నారు. అనంతరం హెచ్ఎంల సంఘం రూపొందించిన ప్రత్యేక హ్యాండ్ బుక్ను హెచ్ఎంలకు అందజేశారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, రిసోర్స్పర్సన్లు చెంగల్రాజు, గిరిరాజా, హేమాద్రి, రమేష్ పాల్గొన్నారు. -
ఆమెదే నిర్ణయాధికారం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. జాబితాలను పంచాయతీ కేంద్రాలు, సచివాలయాల్లో పెట్టారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించారు. ఈ ఓటర్ల జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. నిర్ణేతలు మహిళలే! జిల్లాలో 27 మండలాలు, 623 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 5,914 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్లు 10,26,821 మంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది. 11,388 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. వాటిలో జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పురుషులు 18,368 మంది, మహిళలు 18,232 మంది, కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లెలో పురుషులు 17,824 మంది, మహిళలు 17,719 మంది, కుప్పంలో పురుషులు 29,355 మంది, మహిళలు 29,000 మంది, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో పురుషులు 21,990 మంది, మహిళలు 21,964 మంది ఉన్నారు. మిగిలిన 23 మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో ట్రాన్స్జెండర్ల సంఖ్య 27గా గుర్తించగా అందులో కుప్పంలో 8 మంది ఉన్నారు. బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఎస్ఆర్పురం, తవణంపల్లె, వెదురుకుప్పం, యాదమరి, గుడు పల్లె, రామకుప్పం, కార్వేటినగరంలో ఒకరు, ఇద్దరు ఉన్నారు. జాబితా విడుదలకు ముందు అధికారులు ఓటర్ల మ్యాపింగ్ కూడా చేపట్టారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ వారిదే పైచేయి. ఈ ఓటరు జాబితాను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.స్థానికంలో మహిళా ఓటర్లే అధికం -
4 టన్నుల గంజాయి కాల్చివేత
ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం .. జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేశారని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య సవరయ్య తెలిపారు. మహిళా పక్షపాతి జగనన్న మహిళా పక్షపాతి జగనన్న అని చిత్తూరు వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026దొరికితేనే దొంగ..లేకపోతే దొర అన్న చందంగా తిరుపతి, చిత్తూరు జిలాల్లో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మన్యంలో పండిస్తున్న గంజాయి ఘాటు జిల్లాను కుదిపేస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న గంజాయి విశాఖ నుంచి రేణిగుంటకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనికితోడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి గుట్టు. రేణిగుంట: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కిలోల గంజాయిని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం వద్ద ఉన్న సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా కరెంట్ యంత్రం ద్వారా కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, ఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి, ఇతర డ్రగ్స్పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో గత రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సీజ్ అయిన గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చైన్నెకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి రైళ్లు, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభయహస్తం శక్తి యాప్ చిత్తూరు కలెక్టరేట్ : శక్తి యాప్ ఆపదలో అభయహస్తం అని మహిళా స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో మహిళల భద్రత, చట్టా లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పిల్ల ల భద్రతే పరమావధిగా పోలీసు శాఖ అడుగులు వేస్తోందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ ద్వారా పోలీసులకు తక్షణమే సమాచారం ఎలా పంపాలి అనే అంశం పై ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని అధిగమించాం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా మైనింగ్ శాఖ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన ఆదా య లక్ష్యాన్ని అధిగమించిందని ఆ శాఖ డీడీ సత్యనారాయణ పేర్కొన్నారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాకు మొత్తం రూ. 196.05 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.195.67 కోట్ల మేర వసూళ్లు సాధించి 99.81 శాతం ప్రగతి నమోదు చేసినట్లు తెలిపారు. డివిజన్లన్వారీగా చూస్తే, చిత్తూరు డివిజన్న్లో రూ.145.52 కోట్ల లక్ష్యానికి గాను రూ.150.33 కోట్లు వసూలు చేసి 103.31 శాతం సాధించినట్టు తెలిపారు. అదే సమయంలో పలమనేరు డివిజన్లో రూ.50.53 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.45.34 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలిపారు. భవిష్యత్లో మిగిలిన లోటు ను భర్తీ చేసేందుకు చర్యలు చేపడ తామని తెలిపారు. వివరాల నమోదు తప్పనిసరి చిత్తూరు కార్పొరేషన్: కార్మిక బీమా పథకంలో నమోదైన అర్హులైన భవననిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మికశా ఖ కమిషనర్ ఆలోచన తెలిపారు. ఇదివరకే నమోదైన వారు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న నాలుగు పథకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నమన్నారు. వివాహ బహుమతి, ప్రసూతి ప్రయోజన పథకం తదితర పథకాలను 2026 మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు చిత్తూరు ఎఎల్ఓ–1 రాజయ్య 9492555223, చిత్తూరు ఎఎల్ఓ–2 ఆనందబాబు 9492555224, పుత్తూరు, పుంగనూరు ఎఎల్ఓ మధుబాబు 9492555225 నంబర్లను సంప్రదించాలని కోరారు. సాక్షి, టాస్క్ఫోర్స్: ‘‘తిరుపతి జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న 35 పోలీస్ స్టేషన్లలో 208 కేసుల్లో గడచిన రెండు, మూడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు అక్షరాలా 4,098 కిలోలు. విస్తుగొలిపే ఈ అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే తిరుపతి జిల్లాలో యువత భవితను చిత్తు చేస్తున్న మత్తుపదార్థం గంజాయికి ఇది తార్కాణం. ఓ వైపు రాష్ట్ర పాలకులు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని గుక్కతిప్పుకోకుండా శపథాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.’’ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం తిరుపతి, రేణిగుంటలకు వచ్చే గంజాయిలో సింహభాగం పక్క రాష్ట్రాలకు తరలించి, జిల్లాకు అవసరమైన సరుకును వేరు చేసి, ఇక్కడ నియమించుకున్న టీములు ద్వారా పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాలలతోపాటు హాస్టళ్లు, పీజీల వద్దకు చేరుకుని చిన్నపాటి కవర్లలో నింపిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. అలాగే హోటళ్లలో బస చేసే యాత్రికులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లెక్కకు మించి ఎల్లలు దాటుతున్న గంజాయి తిరుపతికి చేరే గంజాయిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటేనే కేవలం నాలుగు డివిజన్లలోనే నాలు గు టన్నుల గంజాయి పట్టుబడి కోర్టు అనుమతితో గంజాయిని కాల్చివేశారు. అయితే పోలీసులకు, ఇతర నిఘా వ్యవస్థకు చిక్కకుండా ఎల్లలు దాటుతున్న గంజాయి ఏ మేరకు అక్రమ రవాణా జరుగుతుందో ఊహాతీతం. పుణ్యక్షేత్ర జిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాను దాటాకే దక్షిణాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా అయ్యేది. గంజాయి మత్తులో పెరుగుతున్న అకృత్యాలు, దాడులు గంజాయి మత్తుకు అలవాటుపడిన ఆకతాయిల అకృత్యాలు జిల్లాలో నిత్యకృతమయ్యాయి. ఇటీవల రేణిగుంటలో ఓ యువకుడు గంజాయి మత్తులో మటన్ కత్తితో పట్టపగలు నడిబజార్లో తన గొంతు తానే కోసుకుంటూ భయాందోళన రేకెత్తించాడు. రేణిగుంట పట్టణంలో స్థానిక యువకులు కూడా కొందరు గంజాయి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా చేసే ప్రధాన ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చటం కష్టసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జికి పచ్చజెండా డీఎల్డీవో ఆకస్మిక తనిఖీ పెద్దపంజాణి: పలమనేరు డివిజినల్ పంచాయతీ అధికారి రామచంద్రయ్య శుక్రవారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా లింగాపురం, రాజుపల్లి పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. చెత్త సేకరణ, ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి గ్రామస్తులకు వివరించారు. లింగాపురం సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తదుపరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జన గణనలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీడీవో బాలాజీ, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి, ఏఎస్వో ఆయేషా, ఫీల్డ్ ట్రైనర్స్ గురుప్రసాద్, బాలాజి, పీఎస్ రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు పాల్గొన్నారు. 21 విద్యుత్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 59, సర్వీసు లైన్ 3 కలిపి మొత్తం 96 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. అందులో 21 సమస్యలను పరిష్కారించామని, మిగిలిన వాటి పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు వెల్లడించారు. కొను గోల్మాల్! సాధారణంగా ఏదైనా ప్రభుత్వశాఖలో ఫర్నిచర్ కొనుగోలు ప్రక్రియలో రూ.5 లక్షలు దాటితే కచ్చితంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలి. జిల్లాలోని 39 పాల్ ల్యాబ్స్కు ఫర్నిచర్ కొనుగోలుకు రూ.20 లక్షల బడ్జెట్ కేటాయించారు. జిల్లా సమగ్రశిక్షశాఖ అధికారులు కలెక్టర్కు ఫైల్ పంపి అనుమతి తీసుకోవాలన్న కనీస నిబంధన కూడా తుంగలో తొక్కారు. నిబంధనలను బ్రేక్ చేసి నేరుగా కాంట్రాక్టర్ ఖాతాలోకి ఫర్నిచర్ రాకముందే నిధులు జమచేసేశారు. ప్రజల కోసం రోజమ్మ పోరాటంతిరుపతి కేంద్రంగా గంజాయి సరఫరా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగవుతున్న గంజాయిని రైళ్లు, బస్సులు, లారీలు, వస్తు రవాణా మార్గాల మీదుగా తిరుపతికి నిత్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఓ పక్క నిఘా వ్యవస్థను పెంచి, గంజాయి అక్రమ రవాణా ఆనవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రైళ్లలో గంజాయి రేణిగుంటకు సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి చైన్నె, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. పుత్తూరులో ప్రతిపాదిత పనుల్లో చేర్చిన రైల్వే శాఖ -
లంచాల్లో నం.1!
చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారితో పాటు కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారికి స్థానచలనం కల్పించి చేతులు దులుపుకున్నా పరిస్థితి మారలేదు. ఇప్పుడు ఏకంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అవినీతి ఆరోపణలపై సస్పెండ్కు గురవడం జిల్లా పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. తీరు మారదా? చిత్తూరు నగరంలోని కట్టమంచిలో గత ఏడాది ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి రూ.లక్షల్లో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకున్నారు. కానీ విచారణలో ఏం తేలిందనే విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. కేవలం ఓ అధికారిని మాత్రం వీఆర్కు పంపించారు. ఆర్నెళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల స్టేషన్లో పనిచేస్తున్న ఓ హోంగార్డును సొంత పనులకు పంపించారనే ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ను వీఆర్కు తీసుకున్నారు. ఈ వ్యహారంలో ఇన్స్పెక్టర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి హెడ్ కానిస్టేబుల్ను బలిపశువును చేశాడనేది స్టేషన్ సిబ్బంది ఆవేదన. ఫలితమివ్వని వాస్తు మార్పులు వన్టౌన్ స్టేషన్లో పనిచేసే ఒకరిద్దరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సిబ్బందిని వాడుకున్నారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ పనిచేసే మిగిలిన వాళ్లు నలిగిపోతున్నారు. అధికారులు చెప్పిన పనులు చేస్తూ.., వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇతర సిబ్బందిపై తప్పుడు మాటలు చెప్పడం, స్టేషన్లో జరిగే విషయాలను నేతలకు ఉప్పందించడం లాంటి విమర్శలు ఎదుర్కొనేవాళ్లు బాగానే ఉన్నారని.. ఏమీ తెలియని తమపై ఒత్తిడి పెరుగుతోందని పలువురు వాపోతున్నారు. అయితే గతంలో జరిగిన ఘటనలకు దృష్టిలో పెట్టుకున్న ఇన్స్పెక్టర్ ఈశాన్యంలో బరువు ఉండటమే దీనికి కారణమని భావించి, పలు తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను ఈశాన్యం నుంచి తీయించి, మరోవైపుకు మార్చారు. తన సీటును ఉత్తరంవైపు కాకుండా తూర్పువైపు పెట్టుకున్నారు. కానీ మారాల్సింది తప్పుచేసే వాళ్ల బుద్ధి అని గుర్తించలేకపోయారు. వివాదాలకు కేంద్రంగా చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటా.. రెండా..? -
అక్కడ పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం
– ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’తో పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు చిత్తూరు అర్బన్: జిల్లాలో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా స్థానిక పోలీసులు, ఈగల్, ఎస్బీ సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 612 కేసులు నమోదు చేసి రూ.69,500 జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. గత ఏడాది 1901 కేసులు నమోదు చేసి రూ.2.77 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ముఖ్యంగా విద్యార్థులు అలవాటు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోట్పా చట్టం–2003 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పొగాకు విక్రయాలను నిలిపివేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ – పలమనేరు ఇరిగేషన్శాఖలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం పలమనేరు: పట్టణంలోని ఇరిగేషన్శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని పనులకు సంబంధించి మామూళ్లు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ను తిరుపతి ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కార్యాలయంలో సిబ్బంది మొదలు డీఈ దాకా ఇరిగేషన్ సంబంధిత పనులను అక్రమంగా నిర్వహిస్తూ దోపిడీ చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బాధితుడు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కాగా సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. నాణ్యత పాటించాలి చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన వసతి గృహ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో పురోగతి చూపాలన్నారు. నాణ్యతలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేయాలన్నారు. గదుల్లో వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా ఉండడంతో పాటు ఇతర మౌలిక వసతులు సమృద్ధిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
పది నిమిషాల సమయం.. పదేళ్ల అభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : స్వీయ జనగణన ప్రక్రియలో పది నిమిషాల సమయం కేటాయిస్తే పదేళ్ల అభివృద్ధికి సహకరించినట్లేనని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టినట్టు వెల్లడించారు. పాత పద్ధతులకు భిన్నంగా సాంకేతికతను జోడించి పౌరులే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభించారన్నారు. స్వీయ జగనణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాను మొత్తం 3,036 బ్లాకులుగా విభిజించామన్నారు. ప్రతి బ్లాక్లో 150 నుంచి 200 గృహాలు ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు 28,885 మంది ఎన్యుమరేటర్లు, 493 మంది సూపర్వైజర్లు విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని 27 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 నగరపాలక సంస్థ పరిధిలో 31 మంది అధికారులు నిరంతరం ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. ఈ నెల 30లోపు ఆన్లైన్ పోర్టల్లో ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి స్వీయ జనగణను ధృవీకరించడంతో పాటు, నమోదు చేసుకోని వారి వివరాలు సేకరిస్తారన్నారు. వచ్చే ఏదాది రెండవ దశ జనాభా లెక్కల సేకరణ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. -
మహిళా పక్షపాతి జగనన్న
చిత్తూరు కార్పొరేషన్: మహిళా పక్షపాతి జగనన్న అని స్థానిక వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి సతీమణి ఇందుమతి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. రాష్ట్రంలో మహిళను తొలిసారిగా ఉపముఖ్యమంత్రి, హోంమంత్రిని చేసిన ఘనత వైఎస్ జగనన్నదేనన్నారు. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ముద్రించారన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిణిరెడ్డి, లీనారెడ్డి, అంజలిరెడ్డి, సరళమేరీ, భాగ్యలక్ష్మి, రేఖ, ప్రతిమ, కౌసర్, సల్మా, బింధు, పూంగొడి, పద్మరెడ్డి, ముబీనా పాల్గొన్నారు. -
వద్దే వద్దు!
చిత్తూరా.. చిత్తూరు కార్పొరేషన్: ‘చిత్తూరా.. వద్దే వద్దు’ అంటూ ట్రాన్స్కో ఉద్యోగులు మొండికేస్తున్నారు. 25 మంది ఉద్యోగులు ఇక్కడ సర్దుబాటుకు ఆమోదం తెలిపినా అందులో 16 మంది ఇంతవరకు చిత్తూరు ముఖం చూడడానికే ఇష్టపడడం లేదు. పోస్టు చిత్తూరుకు మంజూరైనా పని మాత్రం తిరుపతిలోనే చేస్తూ జీతం తీసుకుంటున్నారు. దీంత ఎస్ఈ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లాల విభజన నేపథ్యంలో తిరిగి జిల్లా ట్రాన్స్కో స్వరూపం మారనుంది. గతంలో తిరు పతి కేంద్రంగా ఉమ్మడి జిల్లా పాలన జరిగేది. నవంబర్ 2024లో ట్రాన్స్కో జిల్లా పాలనను వేరుచేసి చిత్తూరులో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు. డివిజన్లు, సబ్డివిజన్లు, సెక్షన్లలో మార్పు చేపట్టారు. అందులో భాగంగా ఇక ఉద్యోగుల బదిలీలు సాగనున్నాయి. మొదట ఎస్ఈ కార్యాలయం, తదుపరి ఈఈ కార్యాలయాల పరిధిలోని ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఈ నెలఖారులోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు బదిలీల ఆప్షన్ కోరారు. ఇందులో సీనియార్టీ ప్రతిపాదికన బదిలీలు నిబంధనల ప్రకారం నిష్పత్తి విధానంలో చేయనున్నారు. స్టోర్స్ కంట్రోల్ మారేనా? ఉమ్మడి జిల్లాకు చిత్తూరులోని స్టోర్స్ నుంచే విద్యుత్ పరికరాలు వెళ్తున్నాయి. ఒక సబ్డివిజన్కు పరికరాలు కావాలంటే ఆరోజు కోసం తిరిగి వేచి చూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా అత్యవసరమైతే అనుమతితో సబ్డివిజన్లకు పరికరాలు ఇచ్చే విధంగా సరళతరం చేయాలి. స్టోర్స్ కంట్రోల్ తిరుపతి జిల్లా టెక్నికల్ ఈఈ పరిధిలో ఉంది. పరికరాలు పంపిణీ చేయాలంటే ఈఈ వచ్చి పరిశీలించి ఆమోదం తెలిపితే తదుపరి అందజేస్తున్నారు. ప్రతిసారీ అధికారి రావాలంటే ఆలస్యమవుతోంది. స్టోర్స్ ఎదురుగానే చిత్తూరు ఎస్ఈ కార్యాలయం ఉంది. ఇక్కడ ఉన్న టెక్నికల్ ఈఈకి పరిశీలన పవర్స్ ఇస్తే పంపిణీ వేగవంతమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రాన్స్కో ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్ గందరగోళం ప్రస్తుతం ట్రాన్స్కో జిల్లా స్వరూపం మారునుంది. అస్తవ్యస్తంగా జిల్లాను మార్పు చేశారు. గతంలో 40 సెక్షన్లు, 10 సబ్ డివిజన్లు, 3 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు 34 సెక్షన్లు, 8 సబ్డివిజన్లు, 2 డివిజన్లుగా విభజించారు. చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలు వస్తాయి. ఇప్పుడు అధనంగా కల్లూరు, రొంపిచెర్లను చేర్చారు. అదేవిధంగా చిత్తూరు రూరల్ పరిధిలో జీడీనెల్లూరు నియోజకవర్గం, నగరి ఉండేవి. ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు చేరనున్నాయి. పుంగనూరు అన్నమయ్య జిల్లాకు వెళనుంది. ప్రస్తుతం చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పుంగనూరు డివిజన్లు జిల్లా పరిధిలో ఉన్నాయి. కొత్తగా చేసిన మార్పు వల్ల వినియోగదారులు అవస్థలు పడనున్నారు. -
పలమనేరులో బుల్లెట్ ట్రైన్ ఆగాల్సిందే!
పలమనేరు: పలమనేరు పట్టణంలో బుల్లెట్ ట్రైన్ ఆగేదాకా ఉద్యమం ఆపబోమని స్థానిక పలమనేరు పరిరక్షణ సమితి(పీపీఎస్) నిర్వాహకులు హెచ్చరించారు. వారు శుక్రవారం పలమనేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీఎస్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ పలమనేరు ప్రాంతానికి చెందిన వేలాదిమంది బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు ప్రతిరోజూ వివిధ వాహనాల్లో వ్యయప్రయాసలు పడుతూ బెంగళూరు వెళుతున్నారని తెలిపారు. పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పెడితే ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, చైన్నె–మైసూరు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పలమనేరులో పెట్టాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు, ప్రజాసంఘాలు, కులసంఘాల ప్రతినిధులు, ఏపీ ఎన్జీవోలు పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసిన జీఎస్టీ
పుత్తూరు: జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృతం చేసిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎస్వీయూ ఆచార్య జి.సవరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ సామాజిక శాస్త్రాల పరిశోధన సంస్థ (ఐసీఎస్ఎస్ఆర్) విభాగం వారి ఆర్థి క సహాయంతో గ్రామ, పట్టణ ప్రజల జీవితాలపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఎకనామిక్స్ విభాగం వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సుకు తొలిరోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య సవరయ్య మాట్లాడుతూ జీఎస్టీ 2.0లో చాలా వస్తువుల ధరలు తగ్గడం ద్వారా ప్రజల కొనుగోలు పెరిగిందన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగం అడిషనల్ కమిషనర్ జే.వీ.ఎం.శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయన్నారు. అనంతపురం సెంట్రల్ యూని వర్సీటీ అర్థశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్రట్ ఎండీ బావయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పన్ను శాతం తగ్గించడంతో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువుల ధరులు తగ్గా యని తెలిపారు. అనంతరం జాతీయ సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి సమర్పించిన 110 పరిశోధన పత్రా లు కలిగిన సంచికను అతిథులు ఆవిష్కరించారు. సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జీ.కోటేశ్వరయ్య, కన్వీనర్ టీ.నరసింహులు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల యూ నివర్సిటీలు, డిగ్రీ కళాశాలల పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మామిడి తోటలో దౌర్జన్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తవణంపల్లి మండలంలో భూ వివాదం దౌర్జన్యానికి దారితీసింది. సర్వే నంబర్ల సాక్షిగా ఉన్న అస్తులను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా కూల్చివేశారు. ఈ సమస్యను బాధితుడు కృష్ణమూర్తినాయుడు శుక్రవారం ఆర్డీవో శ్రీనివాసులుకు విన్నవించుకుని కన్నీరు మున్నీరయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి తహసీల్దార్ అండదండలతోనే అక్రమాలు జరిగాయన్నారు. తనకు తవణంపల్లి మండలం ఎం.కృష్ణాపురం గ్రామంలో సర్వే నం.78/2,77/2,60/2లో మామిడి తోపు ఉందన్నారు. ఈ తోపు చుట్టూ రక్షణగా రాతి కూసాలతో కంచెను, ప్రధాన గేటును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తోటలోనే ఒక ఇల్లు, కసువు పందిరి ఉందన్నారు. సతీష్నాయుడు, మధుసూదన్నాయుడు అనే వ్యక్తులు మరికొందరితో కలిసి కంచె, ఇళ్లును దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. సెటిల్మెంట్ స్థలంలో ఉన్న తమ ఆస్తులను కూల్చే హక్కు ఎవరికీ లేదన్నారు. కంచెతో పాటు ఏళ్లనాటి చింతమానులను సైతం నేలమట్టం చేశారన్నారు. దీని వెనుక తవణంపల్లి తహసీల్దార్ ప్రోద్భలం ఉందన్నారు. దౌర్జాన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు పగడ్బందీగా లెక్కించా రు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1.41కోట్ల ఆదా యం వచ్చింది. బంగారం 32 గ్రాములు, వెండి1.420 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.8,449, నిత్యాన్న దా నం హుండీ ద్వారా రూ.1,45,499లు వచ్చింది. యూఎస్ఏవి 169 డాలర్లు, కెనడా 5 డాల ర్లు, ఇంగ్లాడ్ 110 పౌండ్స్, ఆస్ట్రేలియావి 75 డాలర్స్, సౌదీ 1,110 రియాల్స్ వచ్చాయి. చైర్మన్ మణినాయుడు, డీఈవో సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గణనాథుని సేవలో కరణం మల్లేశ్వరి
కాణిపాకం: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆమెకు అందజేశారు. దేవస్థానం ఈవో పెంచలకిషోర్, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు పాల్గొన్నారు. మేమింతే..మారం అంతే! -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
– రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాయనిచెరువు వెళ్లే మార్గంలో దిగవూరు క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిసిన వివరాల మేరకుం.. చిత్తూరు మండలంలోని తుమ్మింద గ్రామానికి చెందిన రవి తేజ(19), అదే గ్రామానికి చెందిన ఆకాష్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నాయనిచెరువు గ్రామంలో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆటో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న రవితేజ గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా తాకి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న ఆకాష్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గుర్తించిన స్థానికులు ఇద్దరినీ గుడిపాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవితేజ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆకాష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగండన్గా గుర్తించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించండి
దళితులపై దాడులు అరికట్టండి చిత్తూరు : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో తిష్టవేసి న సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యా యం చే యాలంటూ మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఎస్పీ తుషార్డూడీకి విన్నవించారు. ఈ మేరకు ఆయ న గురువారం ఎస్పీ కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభు త్వం వచ్చిన నాటి నుంచి దళితులపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని వాపోయా రు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడూ జీడీ నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో జరగలేదని ఎస్పీకి వివరించారు. బాబు మృతిపై విచారణ జరిపించండి మండలంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు రామానాయుడుపల్లి బాబు కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో భూ వివాదంపై పొన్నస్వామికి గ్రామస్తులకు మధ్య వివాదం ఉండగా.. టీడీ పీ సానుభూతిపరుడైన పొన్నుస్వామికి అప్పటి తహసీల్దార్ పట్టా ఇవ్వడంతో వివా దం పెరిగిందన్నారు. పలుమార్లు బ్యానర్ చించివేత కేసులో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బాబు మృతి చెందాడన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పై విచారం వ్యక్తం చేశారు. కార్వేటి నగరంలోని సమస్యలు కార్వేటినగరం మండలం, ముక్కరవారిపల్లి పంచాయతీలో వైఎస్సీర్సీపీ నాయకులు మురళీకృష్ణారెడ్డిపై టీడీపీకి చెందిన తిరుమలరెడ్డి భూ వివాదంలో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులను పిలిపించి దాడి చేసినట్టు నారాయణస్వామి గుర్తుచేశారు. రాతి కుసా లు విరిచి వేయగా కార్వేటినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్టు చెప్పారు. అయితే దీనిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపా రు. గోపిశెట్టిపల్లి పంచాయతీలో భూ తగాదా విషయంలో వైఎస్సార్సీపీ సాను భూతిపరులపై దాడి చేయగా ఇరువర్గాలు ఇచ్చిన కేసులో టీడీపీ సానుభూతిపరులకు సానుకూలంగా కేసు నమోదు చేసి కౌంటర్ కేసు నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వ్యక్తిగత విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తానని మాజీ డెప్యూటీకి హామీ ఇచ్చారు. -
ఈత కొడుతూ..!
– బావిలో మునిగి యువకుడి మృతి గంగవరం: ఈత కొడుతూ బావిలో మునిగిపోయి యువకుడు మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన హైకాంత్ కుటుంబంతో సహా మండలంలోని కీలపల్లి సమీపంలోని ఓ డెయిరీలో పని చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. కీలపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కోసం తండ్రి హైకాంత్ తన కుమారుడు దేవ్ త్యాగి(22)ని వెంటపెట్టుకుని వెళ్లాడు. బావిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు దేవ్త్యాగి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ప్రశ్నించే గొంతుకను నిర్బంధించలేరు
కార్వేటినగరం: కూట మి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలి కి వదిలేసి వైఫల్యాలను ఎత్తి చూపే ప్రజాగొంతుకను నిర్బంధించలేర ని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి ముందస్తు సమాచారం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి అమరావతిలో అరెస్టు చేయడాన్ని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసి అరాచకాలు సృష్టించి వైఎస్సార్సీపీ నాయకులను అణగదొక్కాలని యత్నిస్తున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను పావుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పోలీసులు అత్యుత్సాహంతో శ్రీహరిని అరె స్టు చేశారని, అయితే కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ఎప్పటికై నా ధర్మం, న్యాయం గెలుస్తుందని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వానికి గుణపాఠం అన్నారు. జనగణన శిక్షణ పరిశీలన చిత్తూరు అర్బన్: జనగణన –2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్సీ.మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇదే సమయంలో పోర్ట ల్లో అందుబాటులో ఉన్న ‘స్వీయ గణన’ పైన అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు నాగేంద్ర, సుభప్రభ, మాస్టర్ ట్రైనర్ సౌందర్రాజన్, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. నేడు కరెంటోళ్ల జనబాట చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. జిల్లా లోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. -
పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు
పూడి శ్రీహరిని బుధవారం అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను జైలులో ఉంచాలనుకున్న పాచికలు పారలేదు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచీకత్తుపై గురువారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో 33 గంటల నిర్బంధం తరువాత గురువారం శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసుల పైశాచికత్వం, చినబాబు రెడ్బుక్ రాజ్యాంగం న్యాయస్థానాల ఎదుట పనిచేయవని మరోమారు రుజువైంది. కుప్పం/కుప్పం రూరల్ : సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెబుతున్నా పోలీసులు తమ పద్ధతి మార్చుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రాప్తాడుకు చెందిన గిరీష్ను అరెస్టు చేసిన పోలీసులు, ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరిట శ్రీహరిపై కేసు నమోదు చేశారు. దీనికితోడు శ్రీహరిపై బీఎన్ఎస్–111 సెక్షన్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. 33 గంటల నిర్బంధం తరువాత శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టారు.సెక్షన్–111 ప్రకారం శ్రీహరి ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డాడని, అతనికి రిమాండ్ విధిస్తే కస్టడీకు తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే సెక్షన్–111 ఈ కేసులో వర్తించదని, కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసు పెట్టారని, రిమాండ్ ఇవ్వకూడదని శ్రీహరి తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్–111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనల్లో నోటీసులిచ్చి విచారించకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. రూ.25 వేల రెండు బాండ్లతో సొంత పూచీకత్తుపై శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వరుణ్తేజ్ ఉత్తర్వులు జారీ చేశారు.జర్నలిస్టులపై కేసులు దారుణంసీనియర్ జర్నలిస్టులపై కేసులు దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం), సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 25 ఏళ్లుగా విలువలతో కూడిన జర్నలిజమే చేశానని చెప్పారు. ఏనాడూ తప్పు చేయలేదని, ఇప్పటికీ తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. సీఎం చంద్రబాబుపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినట్టుగా కుప్పం పోలీసులు తనపై అభియోగాలు మోపుతూ కేసులు బనాయించారన్నారు. తనకు, ఆ పోస్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అది ఎక్కడ తయారైందో, ఎవరో షేర్ చేశారో తనకు తెలియదన్నారు. సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు మఫ్టీలో వెళ్లి పూడి శ్రీహరి కారుకు వాహనాలు అడ్డంపెట్టి తీవ్రవాది తరహాలో ఆయనను కుప్పానికి తీసుకురావడం దుర్మార్గమన్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. పూడి శ్రీహరికి బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు
కుప్పం: అక్రమ కేసును బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది, 33 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది కుప్పం కోర్టు. నిన్న(బుధవారం, ఏప్రిల్ 15వ తేదీ) పూడి శ్రీహరిని ఉదయం 8 గంటలకు అరెస్టు చేయగా, ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) ఉదయమే వైద్య పరీక్షలు చేశారు. అయితే అరెస్టు చేసిన తర్వాత 33 గంటల పాటు శ్రీహరిని కోర్టు హాజరుపరచలేదు పోలీసులు. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీహరిని ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. -
కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. -
పదవుల రాజకీయం
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంఅండ్ హెచ్వో నాగశశిభూషణ్రెడ్డి హెచ్చరించారు. భలే మంచి వడ్డీ బేరమూ! పలమనేరు టమాటా మార్కెట్లో కొంతమంది రోజువారి వడ్డీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు.. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఒట్టి చేతులు చూపారని పచ్చనేతలు మండిపడుతున్నారు. తమను కరివేపాకు చందంగా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పదవుల పందేరంలో చంద్రబాబు కుటిల రాజకీయం ప్రదర్శించారని వాపోతున్నారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన వారికి వైఎస్సార్ సీపీలో పలు విభాగాల్లో పదవులు దక్కాయి. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన పురంధర్, జిల్లా కార్యదర్శులుగా జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన యుగంధర్రెడ్డి, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నరసింహరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సాయి అవినాష్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రమేష్, శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ థౌహీడ్, జిల్లా బీసీ కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుబ్బరాజు, సురేష్, గంగిరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మల్లికార్జుననాయుడు, మునికృష్ణమనాయుడు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యశోద, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పూతలపట్టు నియోజవర్గానికి చెందిన రమేష్, జిల్లా యువత విభాగం కార్యదర్శులుగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వినోద్రెడ్డి, లోకవినాయకరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రవీన్కుమార్ నియమితులయ్యారు. పుంగనూరు నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్సన్షర్ల విభాగం అధ్యక్షుడిగా వరదారెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శిగా యువరాజ్, జీడీనెల్లూరు మండల ఐటీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కిరణ్కుమార్ను నియమించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధిష్టానం ప్రకటించిన పదవుల పందేరంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండేళ్ల తర్వాత టీడీపీ అధిష్టానం బుధవారం పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించింది. ఈ జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.విజయకుమార్ (తిరుపతి), ఎన్.అమర్నాథ్రెడ్డి (పలమనేరు), జి.నరసింహయాదవ్ (తిరుపతి), చిట్టిబాబు (జీడీ నెల్లూరు), రవినాయుడు (తిరుపతి), అన్నా అనిత (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), జి.దశరథాచారి (శ్రీకాళహస్తి), ఎం.సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి.చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న (నగరి), ఆర్.మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (జీడీ నెల్లూరు) పదవులు లభించాయి. ఇందులో నలుగురు, ఐదుగురు మాత్రమే సీనియర్ నాయకులు ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారు. దీంతో మొదటి నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవులు ఉన్న వారికి ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి అనేక మందిలో నెలకొంది. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి గుర్తింపు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్నత పదవులు లభించని అనేక మంది నాయకులను అధిష్టానం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకుని వదిలేస్తుందనే ప్రచారం ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ప్రస్తుతం పదవుల పందేరంలో తమకు చోటు దక్కకపోవడంతో తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్య నేతలు వచ్చి భుజాన చేయివేసి క్షేమ సమాచారాలు అడగడంతో గాల్లో తేలిపోయి పనిచేశామని చర్చించుకుంటున్నారు. ఓట్ల రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని సీనియర్ నాయకులు కొందరు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉపాధి హామీ పనులు వేగవంతం పూడి శ్రీహరి అరెస్టు అక్రమం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో డ్వామా, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పురోగతిపై సమీక్షలు చేయాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించినా, విధులకు గైర్హాజరైనా ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూలీల సమీకరణ కార్యక్రమంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కార్మికులను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు, వేతన హక్కులపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు అక్రమమని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మఫ్టీలో వచ్చిన పోలీసులు నోటీసు కూడా ఇవ్వకుండా తాడేపల్లిలోని తన నివాసానికి సమీపంలో శ్రీహరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వెళ్లారని తెలిపారు. ఇంటికి వెళ్లి వస్తానని శ్రీహరి కోరినా పట్టించుకోకపోవడం చట్ట విరుద్ధమన్నారు. మాజీ సీఎం జగనన్నను కలిసి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న ఫోన్, ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు పలుమార్లు తప్పు పట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓట్ల కోసమే.. పదవుల కోసం కాదు అందరికీ అన్యాయమే.. తిరుపతి బీసీ సామాజిక వర్గంలో యాదవులకు తప్ప మరొకరికి పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. అది కూడా ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారని, మిగిలిన మెజారిటీ సబ్ క్యాస్ట్లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, బుల్లెట్ రమణ, కోడూరు బాలసుబ్రమణ్యం కమిటీల్లో పదవులు కోల్పోయారు. వీరంతా సీనియర్లు. అలాగే రాష్ట్ర పదవులు వస్తాయని ఆశించిన దంపూరి భాస్కర్ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పులుగోరు మురళి, పుష్పలతను కరివేపాకులా వాడుకుంటున్నారని వారి అనుచరులు మండిపడుతున్నారు. సూళ్లూరుపేటకు చెందిన తిరుమూరు సుధాకర్రెడ్డి, వేనాటి సతీష్రెడ్డి, శంకరయ్యయాదవ్ సీనియర్లు అయినా పార్టీలో గుర్తింపు లభించలేదు. చంద్రగిరి పరిధిలో సీఎం చంద్రబాబు పేరు పెట్టి పిలిచే నాయకులు అనేక మంది ఉన్నా.. ఒక్కరికి కూడా చోటు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో కూడా సీనియర్ నాయకులున్నా వారెవరికీ చోటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, దొరబాబు, చంద్రప్రకాష్, సుభాష్ చంద్రబోస్, చిట్టిబాబు నాయుడు, విజయబాబు, జయప్రకాష్ నాయుడు, గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పానికి చెందిన ఆంజనేయరెడ్డి, దేయరాజులు నాయుడు జెండా మోయడానికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. -
ఘొల్లుమంటున్న పల్లెలు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. సమస్యలు పేరుకుపోయాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. ప్రకృతి వనరులను స్వాహా చేస్తున్నారు. రాజకీయ దాడులు పెరిగాయి. విచ్ఛలవిడిగా బెల్టుషాపుల నిర్వహణలో మద్యం ఏరులై పారుతోంది. ఇన్ని తెలిసినా పాలకులు, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్వేటినగరం: ఐదేళ్ల కిందట పల్లెల్లో విప్లవం మొదలైంది. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందాయి. ఊరు అంటే గుడి, బడి, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ అన్న నానుడి వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందాయి. ముఖ్యంగా కరోనా కాలంలో వలంటీర్లు చేసిన సేవలు ఘనమైనవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు. రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పి గ్రామ వలంటీర్లను నిలువునా మోసం చేశారు. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పాఠఽశాలల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. పింఛన్లు తప్ప మరే లబ్ధి లేకుండా జనం అవస్థలు పడుతున్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించాల్సి ఉండగా తమ అనుచరులకు మాత్రమే అందుతున్నాయి. గత ఐదేళ్లలో కనిపించని బెల్టు షాపులు ఊరు ఉసురు తీస్తున్నాయి. రాజకీయ కుట్రలు పేట్రేగిపోయి హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెలు నువురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. ఈ రెండేళ్లలో 90 శాతం దాడులు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అనంతరం వివిధ కారణాలతో వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల సభ్యులపై భౌతిక దాడులు చేశారు. కళ తప్పిన సచివాలయాలు రూరల్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ధ్యేయంతో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం పంచాయతీలు 697 ఉండగా 822 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 612 గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేశారు. 4477 మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. సుమారు 516 సేవలు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిచివాలయాలు కళ తప్పాయి. వైఎస్ జగన్పై ఉన్న కక్షతో సచివాలయాల్లో ఉచిత సేవలకు మంగళం పాడారు. ప్రజలు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరిట బయటకు పంపేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలదీ అదే పరిస్థితి. రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు అందడంలేదు. ఇక వైద్యం సంగతి సరేసరి. -
ముగిసిన టెన్త్ మూల్యాంకనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఈ నెల 6న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారం ముగిసింది. ఈ ప్రక్రియను అబ్జర్వర్ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్ పకడ్బందీగా పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆయా సబ్జెక్టులకు సంబంధించి 1,73,984 జవాబుపత్రాలను టీచర్లు దిద్ది మార్కులను నమోదు చేశారు. ఈ విధుల్లో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 749 మంది వివిధ కేడర్ టీచర్లు పాల్గొన్నారు. మార్కుల నమోదుకోసం కేటాయించిన పాత ట్యాబ్లు మొరాయించడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వర్ నెమ్మదించడం, ట్యాబ్లు తరచూ అప్లోడింగ్లో హ్యాంగ్ కావడం, మార్కుల అప్లోడింగ్లో జాప్యం తదితర సమస్యల వల్ల విధుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ టీచర్లు అదనపు సమయం కేటాయించి ప్రక్రియను పూర్తి చేశారు. ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. జవాబుపత్రాల స్కానింగ్, మార్కుల క్రోడీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా డేటా ఎంట్రీని డబుల్ చెక్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
లారీని ఢీకొన్న కారు
● వ్యక్తి దుర్మరణం ● నుజ్జునుజ్జు అయిన కారు తవణంపల్లె: మండలంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహరాదిలో ఉన్న పట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కారును నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏఎస్ఐ మురళి కథనం మేరకు... చిత్తూరు నగరం గిరింపేట గొడుగుమూరుకు చెందిన పి.శ్రీనివాసులు కుమారుడు పి.వెంకటసాయి బుధవారం మారుతి సుజికి కారులో బెంగళూరు వైపు వెళుతున్నాడు. పట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని వెనుక వైపున ఢీకొని ఎడమ వైపు ఉన్న డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. వెంకటసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. భార్య టి.నందినిప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఎర్రావారిపాళెం మండలం కే తిప్పిరెడ్డి గారిపల్లికి చెందిన వి.హరినాథరెడ్డికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, ఎర్రావారిపాళెం సీఐ లోకేష్, కోర్టు కానిస్టేబుల్ శివ కథనం మేరకు.. 2016 సెప్టెంబర్ 30వ తేదీన ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎర్రావారిపాళెం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఎర్రావారిపాళెం మండలం, మర్రిపాటివారిపల్లి, గానుగచింత రోడ్డు, గాజులేరు వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితుడు హరినాథరెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి వాహనంలో 63 కిలోల బరువున్న 5 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. హరినాథరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
మూడేళ్ల ఫలితాలు ఇలా..
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనం అవుతోంది. పాలకులు, అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మరీ అధ్వానంగా పరిస్థితి తయారైంది. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రాష్ట్రంలో 22, 24 స్థానాలకు పడిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుండడంతో విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడం, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతోనే ఉత్తీర్ణత శాతం పడిపోతోందని వాపోతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఫలితాలువిద్యా మొదటి ఏడాది మొదటి ఏడాది రెండో ఏడాది రెండో ఏడాది సంవత్సరం స్థానం శాతం స్థానం శాతం 2023–24 25 50 26 63 2024–25 26 54 24 74 2025–26 22 69 24 71సంవత్సరం హాజరైన ఉత్తీర్ణులైన విద్యార్థులు వారు మొదటి 12,567 8,691 రెండవ 11,651 8,280చిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇంటర్మీడియట్ ఫలితాలు ఘోరంగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది. చిత్తూరు జిల్లా అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉండగా, ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 22, ద్వితీయ సంవత్సరంలో 24వ స్థానానికి పడిపోయి లాస్ట్బెంచ్ ముద్ర వేయించుకుంది. పాతాళానికి ఫలితాల గ్రాఫ్ గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. విద్యాశాఖ పర్యవేక్షణ లోపమో లేక ప్రణాళికా రాహిత్యమో గాని ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. గత ఏడాది మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో ఉండగా, ఈ సారి 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో గత ఏడాది 74 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఆ ఉత్సాహం నీరుగారింది. ప్రస్తుతం రెండో సంవత్సరంలో 71 శాతం ఉత్తీర్ణత సాధించి 24వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మెరిసిన బాలికలు ఇంటర్ ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రతి ఏటా ఇంటర్లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్తీర్ణులు కావడంలోనూ, అత్యధిక మార్కులు సాధించడంలోనూ వారు ముందంజలో నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల నుంచి మొదటి సంవత్సరం ఇంటర్లో బాలురు 5,861 మంది హాజరుకాగా 3671 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.63 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6,706 మందికి గాను 5,020 మంది ఉత్తీర్ణులై 85.65 శాతం సాధించారు. రెండో సంవత్సరంలో బాలురు 5,546 మందికి గాను 3521 మంది ఉత్తీర్ణులై 63.48 శాతం సాధించగా, బాలికలు 6,105 మందికి గాను 4,759 మంది ఉత్తీర్ణులై 77.95 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా కళ్లు తెరుస్తారా? ఫలితాల విడుదల అనంతరం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లోతీవ్ర నిరాశ నెలకొంది. గత ఏడాదికంటే ఫలితాలు మెరుగుపడతాయని ఆశించినప్పటికీ ఫలితాలు మరింత దిగజారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల తర్వాత కంటితుడుపు చర్యగా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దాలని సూచిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే అక్షర క్రమంలో మాత్రమే కాదు, అధమ ఫలితాల్లోనూ జిల్లా నంబర్ వన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. వైఫల్యానికి కారణాలు ఇవేనా? పర్యవేక్షణ శూన్యం : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కళాశాలలను సందర్శించి, బోధనా నాణ్యతను తనిఖీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అధ్యాపకుల కొరత : జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కీలకమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ మాఫియా : కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల వేటలో పడి సగటు విద్యార్థిని నిర్లక్ష్యం చేయడం, వారిపై మానసిక ఒత్తిడి పెంచడం వల్ల ఫలితాలు తారుమారయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీక్షల ప్రహసనం : విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులు నిర్వహించే సమీక్షలు ఫోటోలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన దాఖలాలు లేవు. విద్యార్థులు ఆందోళన చెందొద్దు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఆందోళన చెందొద్దు. మరింత మెరుగ్గా చదివి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి. తల్లిదండ్రులు సైతం సంయమనంతో వ్యవహరించాలి. ఫెయిల్ అయితే ఇంతటితో అంతా ముగిసిపోయినట్టు కాదని పిల్లలకు ధైర్ఘ్యం చెప్పాలి. ఆందోళన, భయం చెందాల్సిన అవసరం లేదు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. – రఘుపతి, ఇంటర్మీడియట్ డీఐఈవోసీఎం జిల్లాలో ఈ దుస్థితి ఎందుకో..? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలు ఇంత నిరాశాజనకంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు కుప్పం నుంచి చిత్తూరు వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా అధికారుల సమీక్షలు, పర్యవేక్షణ కాగితాలకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. -
భలే మంచి వడ్డీ బేరమూ!
వడ్డీ వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. కొంతమంది నగదును నెలవారీ వడ్డీకి ఇస్తుండగా, మరికొందరు సంవత్సరం వడ్డీకి ఇస్తున్నారు. ఇంకొందరు రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా దినసరి మార్కెట్లు, టమాటా మార్కెట్లు, మండీల్లో రోజువారి వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారులు ఉదయాన్ని నగదు ఇచ్చి సాయంత్రం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసుకుంటారు. పలమనేరు టమాటా మార్కెట్లో స్థానికులతోపాటు చైన్నెకి చెందిన వారు వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.పలమనేరు : పలమనేరు టమాటా మార్కెట్లో 50 వరకు మండీలు ఉన్నాయి. ఇక్కడికి ప్రతి రోజూ 70 లోడ్ల వరకు టమాటాలు వస్తుంటాయి. పలమనేరు నియోజకవర్గంలోనూ టమాటా సాగు ఎక్కువగానే ఉంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి అప్పుడప్పుడూ సరుకు భారీగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో మండీ వ్యాపారులు సొంతంగా పెట్టుబడి పెట్టుకోలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రోజుకు రూ.2 కోట్ల వరకు రోజువారీ ఫైనాన్స్గా తీసుకుంటున్నారు. ఇక మీటర్ ఫైనాన్స్గా మరో రూ.2 లక్షలు పొందుతున్నారు. మీటర్ ఫైనాన్స్ అంటే ఉదయం 11 గంటలకు రూ.10 లక్షలు ఇస్తే సాయంత్రానికి రూ.10 వేలు కలిపి కట్టాలి. నిత్యం 30 మంది ఫైనాన్స్దారులు ఇక్కడ రూ.కోట్ల అప్పులు ఇస్తున్నారు. కొందరు చైన్నె నుంచి ఇక్కడికి వచ్చి డైలీ ఫైనాన్స్ ఇస్తున్నారు. ఇలా అధిక వడ్డీలతో ఫైనాన్స్ పొంది వ్యాపారులకు సరుకును అప్పుగా వేసి రైతులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కటింగ్ క్రేట్లతోనే అసలు సమస్య పొరుగు మార్కెట్లలో పుల్ క్రేట్లతో టమాటాలను విక్రయిస్తున్నారు. అంటే బాక్సుకు 18 కేజీలు కాయలు ఉంటాయి. ఇక్కడ మాత్రం బాక్సుకు 14 కేజీలు ఉంటాయి. చైన్నె మార్కెట్లో అమ్మేది కటింగ్ క్రేట్లే. బయటి వ్యాపారులు వంద పుల్ క్రేట్లను కొంటే వారికి కటింగ్ క్రేట్లు 120గా చేస్తారు. అదే పలమనేరులో వంద కటింగ్ క్రేట్లను కొంటే 95 క్రేట్లే వస్తాయి. దీంతో ఇక్కడికి వ్యాపారులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పుల్ క్రేట్ల ధర భాక్సుకు రూ.20 ఎక్కువగా ఉన్నా సరుకు సర్దుబాటు అవుతుందని వ్యాపారులు అక్కడికే వెళుతున్నారు. ఇక్కడ కూడా పుల్క్రేట్లు పెడదామంటే కటింగ్ క్రేట్లను వేలల్లో కొనుగోలు చేశామని, వాటిని ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదని మండీ యజమానులు చెబుతున్నారు. వ్యాపారుల తప్పిదానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరలపైనా ప్రభావం వ్యాపారులు క్రేట్ల సమస్యతో ఇక్కడికి రావడం లేదు. అంతేగాక అన్ని మార్కెట్ల వేలం పాట నిర్వహించిన తర్వాతే పలమనేరులో వేలం పాటలు నిర్వహించి ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా టమాటా ధరలు తరచూ తక్కువగా పలుకుతున్నాయి. చాలా మంది రైతులు మండీ యజమానుల వద్ద ముందుగానే అప్పు తీసుకోవడం వల్ల ధరల గురించి ప్రశ్నించలేకపోతున్నారు. వారు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పక్కనే ఉన్న వడ్డిపల్లెలో బాక్సు రూ.330గా ఉంటే ఇక్కడ మాత్రం రూ.230గానే ఉంది. నష్టపోకుండా జాగ్రత్త పడుతున్న మండీల వారు కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లి, మదనపల్లెలో టమాటాలకు వేలం పాట ఉదయం 8 గంటలకు జరుగుతుంది. ఆపై వడ్డిపల్లెలో 10 గంటలకు, పుంగనూరులో 11 గంటలకు పాటలు నిర్వహిస్తారు. వీటి ధరలను అనుసరించి ఇక్కడి వ్యాపారులు వేలం పాట మొదలు పెడతారు. తద్వారా తమకు నష్టం రాకుండా మండీ యజమానులకు జాగ్రత్త పడుతున్నారు. వ్యాపారులకు మండీ యజమానుల షేర్ ఇక్కడ టమాటాలను కొనుగోలు చేసేందుకు బయటి వ్యాపారులను మండీ యజమానులు బతిమలాడి పిలిపించుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు తమకొచ్చే కమీషన్లో కొంత వాటా కూడా ఇస్తున్నారు. వారికి సరుకు అప్పుగా ఇవ్వకపోతే కొనేవారే ఉండరు. రైతుల నుంచి మండీ వ్యాపారులు పది శాతం కమీషన్ తీసుకుంటే అందులో కొంత వ్యాపారులకు ఇవ్వాల్సి వస్తోంది. ఇక క్రేట్ల మిస్సింగ్కు 1 శాతం, కూలీల ఖర్చులు, ఫైనాన్స్కు వడ్డీ ఇలా 2 శాతం, నగదు లావాదేవీల్లో నష్టాలకు ఒక శాతం కలిపి మొత్తం 8 శాతం ఆదాయం ఖర్చు అవుతోందని మండీ యజమానులు చెబుతున్నారు. -
కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట చెవిరెడ్డి మోహిత్రెడ్డి నిరసన
సాక్షి, టాస్క్ఫోర్స్: సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి బుధవారం రాత్రి అక్కడకు వెళ్లి శ్రీహరిని చూపించాలని పోలీసులను అడిగారు. వారు వీలు లేదని, కోర్టులో చూపిస్తామని చెప్పడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు చూపించరని డీఎస్పీ పార్థసారథిని నిలదీశారు. ఇలాగే పోలీసులు అక్రమ కేసులు, అడ్డగోలుగా వ్యవహరిస్తే కోర్టులోనే తేల్చుకుంటామని, రెండు రోజుల క్రితం తిరుచానూరు ఘటనలో తిరుపతి కోర్టులో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎస్ఐని సస్పెండ్ చేయాలని, సీఐకి మెమో జారీ చేయాలని ఆదేశాలు ఇస్తామని చెప్పడాన్ని గుర్తు చేశారు. కోర్టుల్లో పోలీసులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు శ్రీహరిని సోషల్ మీడియా కేసులో అక్రమంగా అరెస్టు చేసి, రహస్యంగా దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఆయన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఉండేదికాదని, తప్పుడు కేసులు పెట్టినట్టు వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారని పేర్కొన్నారు. పోలీసుల్లో నిజాయితీ కనిపించడం లేదని, కుప్పం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మానవ హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు కుప్పం పోలీసులకు ఆ హక్కుల గురించి ఎందుకు నేర్పలేదో ప్రజల ముందు చెప్పాలన్నారు. పోలీసులు అక్రమంగా ఎంత మందిని అరెస్టులు చేసినా జైలుకు వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరు జగనన్నకు సైనికులుగా మారుతారే తప్ప పారిపోయే పరిస్థితి లేదన్నారు. -
పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు.తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో పూడి శ్రీహరిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి కుప్పం తీసుకువచ్చారు. ఇక, కుప్పం పీఎస్ నుంచి వైద్య పరీక్షల కోసం గురువారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం, తిరిగి పోలీసు స్టేషన్కు తరలించారు. మరికాసేపట్లో కుప్పం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు శ్రీహరిని హాజరుపర్చనున్నారు పోలీసులు. -
కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుప్పం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కుప్పం డీఎస్పీ పార్ధసారధి అనుమతి ఇవ్వకపోవడంతో మోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడి శ్రీహరి గారు ఎలా ఉన్నారో చూడాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ ఇలా మాట్లాడటం బాధాకరం. తిరుచానూరు ఘటనపై కోర్టు ఇప్పటికే పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మానవ హక్కుల గురించి మాట్లాడుతారు. కానీ కుప్పం మీ ఇలాకాలో జరుగుతున్నది ఏంటి? వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. లేని పక్షంలో కుప్పం నుంచే ఆందోళన చేస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. -
పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు: పొన్నవోలు
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ పెడితే, పూడి శ్రీహరి, గిరీష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. యూనిఫాం లేకుండా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు. సెక్షన్ 24,25 కింద న్యాయ పోరాటం చేస్తాం’’ అని పొన్నవోలు తెలిపారు.‘‘తప్పు అని ఎత్తి చూపిస్తే.. అరెస్ట్ చేస్తున్నారు. గిరీష్రెడ్డికి సెల్ఫ్ బాండ్పై బెయిల్ మంజూరు చేశారు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. హైకోర్టు పదే పదే చెప్పినా కూడా 111 సెక్షన్లు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు దాని కింద పనిచేస్తున్నారు’’ అంటూ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. -
కూటమితోనే దళితులపై దాడులు
గంగాధర నెల్లూరు : రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం వస్తేనే దళితులపై దాడులు, కేసులు పెరిగిపోతాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక జీడీ నెల్లూరు మండలం, రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బాబు పురుగుల మందు తాగి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ మేర కు ఆయన మంగళవారం గ్రామానికి చేరుకు ని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి నివాళి మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామానికి చేరుకుని బాబు మృతదేహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కు టుంబ సభ్యులను ఓదార్చారు. నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి కూడా స్పందించారు. మృతుడు బాబు కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. బాబు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కూట మి ప్రభుత్వ వేధింపుల వల్లే బాబు మరణించాడని మృతుని బంధువులు బోరున విలపించారు. చిచ్చురేపిన రెవెన్యూ నారాయణస్వామి మాట్లాడుతూ గ్రామంలో భూ తగాదా వల్ల బాబు నలిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రామంలోని కూటమి నాయకుడు పొన్నుస్వామికి అనుకూలంగా గత తహసీల్దార్ చంద్రశేఖర్ గ్రామ కంట భూమిలో పట్టా ఇచ్చాడని పేర్కొన్నారు. దీంతో అలజడి రేగిందన్నా రు. పొన్నుస్వామి అధికార అండతో బాబు, గ్రామస్తులపై పలు కేసులు నమోదు చేయించాడని తెలిపారు. పోలీసులు బైండోవర్ పేరుతో వేధించడం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపించారు. బాబు మృతికి కూట మి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా జీడీ నెల్లూరు సీఐ తాము ఎప్పుడు బైండోవర్ పేరుతో బాబు, గ్రామస్తులను పిలిపించలేదని వీడియో రిలీ జ్ చేయడం దారుణమన్నారు. బాబు మరణానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయ న వెంట మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్ నేత గుణశేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఏకాంబరం, యువనేత కిషోర్రెడ్డి, పెద్దిరెడ్డి, మదన్, నాయకులు పాల్గొన్నారు. -
గర్భం..గండం!
గర్భవతులు (ఫైల్) గర్భవతులకు చికిత్స అందిస్తున్న వైద్యులు (ఫైల్) ఇటీవల చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాణిపాకం: జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు -
అప్రమత్తతే రక్షణ కవచం
చిత్తూరు కలెక్టరేట్ : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తతే రక్షణ కవచం అని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిప్రమాదాల పట్ల చేపట్టాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు నివారించడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. గృహాలలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటనలు పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశముంటుందన్నారు. ప్రజాచైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కరుణాకర్ మా ట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ పరికరాల స్టాల్ను జిల్లా జడ్జి పరిశీలించారు. వారోత్సవాల కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏసుపాదం, నరేష్, విజయ్, రాజు, జయ, సతీష్, గిరిబాబు పాల్గొన్నారు. -
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
గంగవరం: రైస్ పుల్లింగ్ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్ కాయిన్స్ తదితర వాటితో రైస్ పుల్లింగ్ చేస్తూ ప్రజలను మోసగించే ఘరానా ముఠాను గంగవరం సర్కిల్ స్టేషన్లో పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు ఆధ్వర్యంలో మంగళవారం అరెస్ట్ చూపించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఇద్దురు పరారీలో ఉండగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. వికోట మండలం, కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్ ఇలియాజ్, కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన మునీష్, చౌడేపల్లి మండలం, మేకలచిన్నేపల్లికి చెందిన విజయ్కుమార్, రాజులూరు గ్రామానికి చెందిన శంకర్, పెద్దపంజాణి మండలం, గౌనివారిపల్లికి చెందిన నాగరాజు మొత్తం ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తూ వస్తున్నారు. వారి వద్ద రైస్ పుల్లింగ్కు అవసరమైన పాత వస్తువులు, నాణేలు, బ్యాటరీలు తదితర వస్తువులను ఉన్నట్టు వెల్లడించారు. గుట్టు ఎలా రట్టయ్యిందంటే! తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు సూరంకుటై గ్రామానికి చెందిన శేఖర్తో రైస్ పుల్లింగ్ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేట దగ్గర ఆంజనేయస్వామి గుడి వద్దకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే కోటీశ్వరుడవుతావని, లేకపోయినా బాగా డబ్బులు సంపాదిస్తావని చెప్పారు. దీంతో శేఖర్ తమిళనాడు నుంచి రాయలపేట వద్దకు రాగా.. రైస్పులింగ్ ముఠా మహిమ గల చెంబు పేరుతో రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మిన బాధితుడు ముందుగా రూ.లక్ష చెల్లించి చెంబు దక్కించుకున్నాడు. ఆ తర్వాత చెంబుని పరిశీలించగా అది పనికిరాని చెంబని తెలుసుకుని బోరుమన్నాడు. తనకు డబ్బు ఇచ్చేయాలని గట్టిగా ఆ ముఠాని నిలదీయడంతో అందురూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై బాధితుడు పెద్దపంజాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారెప్ప, పోలీసులు గాలించగా ఆఖరుకి పంజాణి మండలం, కోగిలేరు క్రాస్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ నలుగురిలో క్రిష్ణప్ప, విజయ్కుమార్, మునీష్, ఇలియాజ్ ఉన్నారు. శంకర్, నాగరాజు పరార్లో ఉన్నారు. మాయమాటలు నమ్మకండి మోసపూరిత మాటలు ఎవరూ కూడా నమ్మవద్దని సీఐ తెలిపారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లోగానీ లేదా డయల్ 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం
చిత్తూరు కలెక్టరేట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పలు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మురళి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, డీఈవో కార్యాలయ సిబ్బంది రవిశేఖర్, స్వర్ణ, సాయి, గోపాల్, చైతన్య, శంకరప్ప, బాలాజీ, షణ్ముగం పాల్గొన్నారు. 100 మంది ఉద్యోగులకు సత్కారం అంబేడ్కర్ ఆశయ సాధనలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సులోచన, జిల్లా ఆర్థిక కార్యదర్శి షణ్ముగం, నాయకులు శేషాద్రి, రెడ్డెప్ప, కృష్ణయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ కార్యాలయంలో.. జిల్లా కేంద్రంలో ఎస్టీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోఅంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు పురుషోత్తం, దేవరాజులురెడ్డి, బాలచంద్రారెడ్డి, గుణశేఖరన్, చంద్రన్, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయసాధనే లక్ష్యం
చిత్తూరు కలె క్టరేట్ : అంబేడ్కర్ ఆశయసాధనే యువతకు మార్గదర్శకమని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దర్గా సర్కిల్ నుంచి అంబేడ్కర్ భవనం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యతో ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ప్రతి విద్యార్థి అంబేడ్కర్ రచించిన పుస్తకాలను చదివి ప్రేరణ పొందాలని సూచించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేడ్కర్కే దక్కుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన అంబేడ్కర్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను 47 స్వయం సహాయక సంఘాలకు రూ.47 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంజయ్గాంధీనగర్లోని ఏపీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, ధనశేఖర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఎస్పీ ఘన నివాళి చిత్తూరు అర్బన్: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ చిత్రపటం వద్ద చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఘన నివాళులర్పించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో.. చిత్రపటానికి నివాళులర్పించారు. భారతదేశ స్థితి–గతిని మార్చిన దార్శినికుడు అండ్కేర్ అని గుర్తుచేశారు. ఎస్పీ వెంట ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీ మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఆర్ఐలు సుధాకర్, చంద్రశేఖర్ ఉన్నారు. అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలె క్టర్ సుమిత్ కుమార్ గాంధీ -
గురుకుల పాఠశాల దత్తత హర్షణీయం
కుప్పం: రామకుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజినీరింగ్ ఆన్ ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థ దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా రామకుప్పం గురుకుల పాఠశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాల అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీవీకే.భాను మాట్లాడారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, వారి ఆలోచనల దృక్ఫదాన్ని మార్చి క్రమశిక్షణతో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ సంస్థ పనిచేస్తుందన్నారు. విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దుర్గమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, కడా పీడీ వికాస్ మర్మత్ తదితరులు పాల్గొన్నారు. -
కొండచుట్టుకు రక్షణ కవచం!
నగరి : నగరి నియోజకవర్గంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండచుట్టు మండపం రక్షణకు మరో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి 716 విస్తరణ పనుల్లో భాగంగా ఏళ్ల నాటి ప్రాచీన మండపం కూల్చివేతకు గురికాకుండా చూడా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ముందు కు వచ్చి పోరాటం సాగిస్తున్న విషయం విధితమే. ఇదివరకు ఆమె కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీలు గురుమూర్తి, మిథున్రెడ్డితో వెళ్లి వినతి పత్రం సమర్పించగా, ఆ అంశంపై స్పందన లభించింది. 10 నుంచి 16వ శతాబ్ద కాలంలో నిర్మించిన కొండచుట్టు మండపం వద్ద రోడ్డు రీ–అలైన్మెంట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామని గడ్కరీ నుంచి ఎంపీకి లేఖ రావడం గమనార్హం. దీంతో మండపం రక్షణపై ఆశలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామం నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజ ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నాయకులు, స్థానికులు ఆమె కృషిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండచుట్టు మండపం నగరి ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అక్కడ 21 మంది దేవతలు కొలువుదీరిన పవిత్ర స్థలమని, అందుకే ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడాలని తాను పోరాటం చేస్తున్నానన్నారు. దేవదేవతల ఆశీస్సులతో ఈ ప్రయత్నం విజయవంతమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా, కొండచుట్టు మండపం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమం మరో దశకు చేరుకోగా, రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి అటవీ ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడు తున్న వారిపై పలమనేరు పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఆ మేరకు ఐదుగురిని పట్టుకోగా వారి నుంచి రూ.50 వేలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ లోకే ష్రెడ్డి తెలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురు దొరికారని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెరలిపారు. టీటీడీకి రూ.27 లక్షల విరాళం తిరుమల: కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన ప్రవీణ్ సోన్వాల్కర్ మంగళవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా సుభాష్ సోన్వాల్కర్ అనే భక్తుడు కూడా శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. గ్రామ సమస్యలకు ప్రాధాన్యత చిత్తూరు కార్పొరేషన్: గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ప్రత్యేకాధికారులు తెలిపారు. జిల్లాలోని పంచాయతీల్లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా గ్రామసభలను నిర్వహించారు. మొత్తం 621 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. బుధవారం జిల్లాలో పంచాయతీలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను పంచాయతీ అధికారులు ప్రకటించనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వివరాలను నోటీసుబోర్డులో పెట్టనున్నట్లు డీపీఓ సుధాకర్రావు వివరించారు. సీఐ ఆకస్మిక దాడులు పూతలపట్టు(యాదమరి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పూతలపట్టు సీఐ గోపి దాడులకు ఉపక్రమించారు. ప్రజల శాంతి భద్రతలే తన ప్రథమ కర్తవ్యమని మరోసారి నిరూపించారు. మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో సీఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ నిషాతో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారందరికీ బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారి వివరాలు నమోదు చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ను ఢీకొన్న కారు నాగలాపురం: ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన మండలంలోని అక్షర జూనియర్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాగలాపురం మండలం రజానగరం గ్రామానికి చెందిన జయరత్నం(58), శరవణ(45) అనే ఇదరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో సొంత పనుల నిమిత్తం ఊత్తుకోటై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అక్షర జూనియర్ కళాశాల సమీపంలో తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో ప్రథమ చికిత్స నిమిత్తం నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓటేరు గ్రామ పంచాయతీ వద్ద దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటేరు చెరువుకు పడమర వైపున ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ వారం నుంచి పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. స్థానిక వీఆర్ఓ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీకటి సంత
పుత్తూరు మార్కెట్ యార్డులో గత మంగళవారం ప్రారంభించిన వారపు సంత ఎందుకు వచ్చిన తంటా అన్న చందాన తయారైంది. ఇటు రైతులు, అటు కొనుగోలుదారులు తంటాలు పడ్డారు. ముగ్గుపిండితో గీతలు గీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే మీ అంగళ్లకు హద్దులు అంటూ రైతులకు చూపి చేతులు దులుపేసుకున్నారు. సంత ప్రాంగణంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం లైట్లు వేసుకొనే మౌలిక వసతి కల్పించకపోవడంతో రైతులతో పాటు వినియోగదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండలు మండుతున్న వేళ కేవలం సాయంత్రం వేళ వ్యాపారులు అమ్మకాలకు ఉపక్రమిస్తుండగా సంత ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో టార్చిలైట్ల వెలుతురులో వ్యాపారాలు సాగించారు. ఇకనైనా సంతలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని రైతులతోపాటు వినియోగదారులు కోరుతున్నారు. – పుత్తూరు -
ఘనంగా తమిళ సంవత్సరాది వేడుకలు
నిండ్ర (నగరి): మండలకేంద్రమైన నిండ్ర ఓంశక్తి ఆలయంలో మంగళవారం తమిళ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నేడు ప్రదోషకాల పూజలు వెదురుకుప్పం: డీఆర్ఎన్కండ్రిగ సమీపంలో ఉన్న అరుణగిరిపై కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోష కాల పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రమేష్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఏకకాలంలో నందీశ్వరునికి, శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమ వారం అర్ధరాత్రి వరకు 72,724 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,786 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేటి నుంచి సముద్రంలో వేటకు విరామం తిరుపతి అర్బన్ : సముద్రంలో చేపల వేటకు బుధవారం నుంచి విరామం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గంగపుత్రులు రెండు నెలలుపాటు తమ వలలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ క్రమంలో చేపల వేట సాగించే మత్స్యకారులు ఇంటికే పరిమితం కానున్నారు. ఈ సమయంలో దెబ్బతిన్న వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకునే పనుల్లో నిమగ్నం కానున్నారు. -
ఎక్టోిపిక్ ప్రెగ్నెన్సీ అంటే!
గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోిపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. -
కూటమి నేతల వేధింపులతోనే రైతు ఆత్మహత్య
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో పేద రైతు బాబు (50) కూటమి నేతల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. కూటమి నేతల వేధింపులవల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, దళిత రైతు బాబు సూసైడ్ నోట్ రాసి సోమవారం పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే.మంగళవారం నారాయణస్వామి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి రామానాయుడుపల్లిలో బాబు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు నారాయణస్వామితో మాట్లాడారు. కూటమి నేతలు బాబుపై పలు కేసులు నమోదు చేయించి వేధించారని చెప్పారు. గ్రామానికి చెందిన టీడీపీ దళిత నాయకుడు పొన్నుస్వామికి, కొందరు అగ్రవర్ణాల నేతలకు భూతగాదా ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన బాబుపైన, కొందరు యువకులపైన కేసులు నమోదు చేయించారని తెలిపారు.గ్రామంలో ఏ సమస్య తలెత్తినా బైండోవర్ పేరుతో బాబును, మరికొందరిని పోలీస్స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచేవారని చెప్పారు. ఈ వేధింపులు తట్టుకోలేకే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు. కూటమి నేతలకు భయపడి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం ఫిర్యాదులో పేర్కొన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నారాయణస్వామి, కృపాలక్ష్మి మాట్లాడుతూ బాబు కుటుంబానికి తమతోపాటు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. -
క్వారీతో ప్రాణాలు పోతున్నాయి!
వెదురుకుప్పం: ‘క్వారీ పేలుళ్లతో మా ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ప్రాణాలు పోతాయేమోనని భయమేస్తోంది’ అంటూ బందార్లపల్లె వాసులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. పేదలకు సీజేఎఫ్ఎస్ భూము ల్లో పట్టాలి ఇప్పించాలంటూ దేవరగుడిపల్లె దళితులు.. మురుగుతో మగ్గిపోతున్నామంటూ దాసరి కాలనీకి చెందిన యువకులు.. గ్రామానికి శ్మశాన వాటిక లేక మృతదేహాలను తీసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నామంటూ మాంబేడు గ్రామస్తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వందల సంఖ్యలో వివిధ సమస్యలతో వచ్చి జిల్లా కలెక్టర్ సుమీత్కుమార్ వద్ద తమ కన్నీటి పర్యంతమయ్యారు. సోమ వారం వెదురుకుప్పంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే థామస్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వెదురుకుప్పం మండలం నుంచే కాకుండా పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల వెల్లువ పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 158 అర్జీలు రాగా ఇందులో రెవె న్యూ సమస్యలే అధికంగా వచ్చాయి. రెవెన్యూ శాఖ కు సంబంధించి 35, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్రికార్డ్స్ 77, పంచాయతీ రాజ్ 9, విద్యుత్శాఖ 7, పింఛన్ 6, ఏపీఎస్ఆర్టీసీ 3, పశుసంవర్థక శాఖ 3, గృహనిర్మాణశాఖ 3, వాటర్ రిసోర్సు 2, రూరల్ వాటర్ సఫ్లై ఇంజినీరింగ్ 2, పోలీస్ శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు, విద్యాశాఖ, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, అటవీశాఖ, షెడ్యూల్డ్ ట్రైబల్ కో–ఆపరేటీవ్ కార్పొరేషన్, మున్సిపల్ అడ్మిన్స్ట్రేషన్ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. నివాసముండలేకపోతున్నాం ‘మా గ్రామానికి పక్కనే పొలాల వద్ద ఉన్న బండపై క్వారీ నిర్వహణకు అధికారులు అనుమతులిచ్చారు. ఈ క్వారీలోంచి పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నారు. అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’ అంటూ కొమరగుంట పంచాయతీ, బందార్లపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. బండపై బోరు డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్ చేయడంతో ఇళ్లు బీటలు వారుతున్నాయన్నారు. స్లాబ్ పెచ్చులూడి పోతోందని విచారం వ్యక్తం చేశారు. క్వారీలోంచి వచ్చే దుమ్ముధూళి, వ్యర్థాల వల్ల పశుపోషణ భారంగా మారుతోందన్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవస్థలను గుర్తించి క్వారీని అపకుంటే గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ● ‘మాంబేడు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నం.31,37, 43, 45లోని కాలువ (ప్రభుత్వ) భూమిని కొందరు అగ్రకులస్తులు కబ్జాచేశారు. కాలువ గుండా రాకపోకలు లేకుండా అడ్డుకుంటు న్నారు. ఈ ఆక్రమణలను తొలగిస్తే వంద మంది రైతులకు సంబంధించి సుమారు 350 ఎకరాల మేరకు సులభంగా దారి వేసుకోవచ్చు. గ్రామానికి శ్మశాన వాటిక లేనందున మృత దేహాలను తీసెకెళ్లేందుకు దారి లేక నానాఅవస్థలు పడుతున్నాం’ అంటూ మాంబేడు గ్రామానికి చెందిన పేదలు ఫిర్యాదు చేశారు. పేదలకు పట్టాలు ఇవ్వాలి మండలంలోని దేవరగుడిపల్లె సమీపంలో ఉన్న సీజేఎఫ్ఎస్ భూములను పేదలకు ఇవ్వాలని దళితులు అర్జీలు ఇచ్చారు. గతంలో కొంత మందికి పట్టాలిచ్చినా మరికొంతమంది పేదలకు ఇవ్వకపోవడంతో గుర్తించి అందరికీ పట్టాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన మహేష్, రాజాజి తదితరులు వినతి పత్రం ఇచ్చారు. సమస్యలన్నీ పరిష్కరించండి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి వహించడకూడదని కలెక్టర్ సుమీత్ కుమార్గాంధీ స్పష్టం చేశారు. తహసీల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కిరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ మోహన్మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న బందార్లపల్లె గ్రామస్తులు తమ సమస్యలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్న అర్జీదారులుపింఛన్ కోసం పడిగాపులు కాస్తున్న రవిబాబు -
సౌత్జోన్ క్రీడల్లో ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో ప్రతిభ చాటారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ తరఫున సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో 8 మంది పీవీకేఎన్ విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. సాఫ్ట్బాల్లో 4, ఖోఖోలో 3, హాకీలో ఒక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈ క్రీడా పోటీలు మహారాష్ట్రలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో, కర్ణాటకలోని దావణగెరే విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి అభినందించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, విద్యార్థుల భవిష్యత్కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి రమేష్, అధ్యాపకులు భానుప్రకాష్, శరవణ, తదితరులు పాల్గొన్నారు. పర్యాటకులపై చెక్పోస్టు సిబ్బంది దాడి పుత్తూరు: నేసనూరు పంచాయతీ పరిధిలోని మూలకోన సందర్శనార్థం వచ్చిన పర్యాటకులపై అటవీశాఖ చెక్సోస్టు సిబ్బంది దాడి చేసిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణం, ఎంబీ రోడ్డుకు చెందిన వి.మునిలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆటోలో మూలకోనకు వెళ్లారు. చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ మరో వ్యక్తి ఆటో రుసుం రూ.100, ఒక్కో వ్యక్తికి రూ.10 వంతున చెల్లించాలని కోరగా వారు నగదు చెల్లించారు. ఆటోను చెక్చేసి మాంసం ఆలయం వద్దకు అనుమతి లేదని శ్రీకాంత్ తేల్చి చెప్పాడు. తాము ఆలయం వద్దకు తీసుకెళ్లమని, దూరంగా వెళ్లి తీసుకొంటామని పర్యాటకులు తెలిపారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోనలోకి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణ సమయంలో చెక్పోస్టు సిబ్బంది అప్పటికే పక్క గ్రామం నుంచి పిలిపించుకొన్న నలుగురు వ్యక్తులతో కలసి మునిలక్ష్మి(49), రమ్య (27), సుమతి(32), శాంతి(46), జానకీరామ్(28), రాకేష్(22)పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరుగుతోంది. -
ఇంత వరకు నగదు చెల్లించలేదు
గత సీజన్లో మామిడి సరఫరా చేసిన తమకు ఇంతవరకు పరిశ్రమ నిర్వాహకులు నగదు చెల్లించలేదని బాధిత రైతులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో రైతులు నిరసన చేపట్టారు. రైతు నాయకులు హరిబాబుచౌదరి మాట్లాడుతూ చిత్తూరు, తవణంపల్లి మండలాల్లోని నలిశెట్టిపల్లి, నారసింహనపల్లి, కె.గొల్లపల్లి, కరణంవాండ్లఊరు, ఏనుగుండ్లపల్లె పరిసర గ్రామాల రైతులు చిత్తూరు రూరల్ మండలంలోని పరిశ్రమకు మామిడి సరఫరా చేశారన్నారు. కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నగదు చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అలసత్వం వొద్దు
ప్రజలను ఏమార్చలేరు! నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపకశాఖాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని కట్టమంచి, తేనెబండ, గిరింపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ముందస్తుగా దీని సమాచారంతో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో వన్ టౌన్ టూ టౌన్ పరిధిలోని ఐదుగురు బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్ ఆన్లైన్లో తనిఖీ చేయగా దాదాపు రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.50 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి వెనుక ఉన్న పలువురిపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూతలపట్టులో విజిలెన్సె దాడులు – నాలుగు సిలిండర్లు స్వాధీనం పూతలపట్టు(యాదమరి): పూతలపట్టులోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు సోమ వారం మెరుపు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న వారిపై నిఘా ఉంచి నాలుగు సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ నిఘా అధికారి కరిముల్లా ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎస్ఐ వెంకటరమణ, పౌరసరఫరాల డీటీ మోహన్రాజు సమక్షంలో మండల కేంద్రంలోని పలు దుకాణాలను తని ఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న నాలుగు సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ మాట్లాడుతూ.. వాణిజ్య అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించినా లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఈ దాడుల్లో వీఆర్వో నాగేంద్ర పాల్గొన్నారు. ముగ్గురికి జైలు తిరుపతి లీగల్: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రెండేళ్లు వంతున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2011 ఏప్రిల్ 22వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఓ టిప్పర్లో 78 ఎరచ్రందనం దుంగలు తరలిస్తుండగా గుర్తించారు. పిచ్చాటూరు మండలం, కీలపూడికి చెందిన బి వెంకటాచలం, అదే మండలం రామగిరికి చెందిన గోపాల్ రెడ్డి శంకర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, ఖాజానగర్కు చెందిన షేక్ షాకీర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్, సంగం సెక్షన్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆశపడ్డాం మాది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. నేను పండ్ల వ్యాపారం చేస్తుంటాను. ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదువించుకుంటున్నా. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆర్థిక పరిస్థితి సరి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడబిడ్డ నిధి రూ.1,500 వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏం లాభం.. ఇంతవరకు ఆ ఊసే లేదు. – లత. ఆముదాల దళితవాడ, పాలసముద్రం మండలం ఇంటి జాగా, పెన్షన్ లేదు మాకు సొంత ఇల్లు కూడా లేదు. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేశాను. రాలేదు. కనీసం ఇంటి స్థలమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 వస్తే మాకు ఒకింత వెసులుబాటు ఉంటుంది. – బుజ్జమ్మ, బలిజకండ్రిగ దాసరి కాలనీ, పాలసముద్రం మండలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది. పాలనలో సవాలక్ష మార్పులు చేసింది. ఇందులో భాగంగా రేషన్ సరుకులు వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ నామరూపాలు లేకుండా చేస్తోంది. బియ్యం బండి వాహనానికి రంగులు మార్చి స్వచ్ఛరథం అంటూ రోడ్లపై తిప్పుతోంది. వీటిని చూసిన జనాలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – పాలసముద్రం మే1 నుంచి వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి అన్నమయ్యసర్కిల్: నాగలాపురంలోని వేదవల్లీ సమేత వేదనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈనెల 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. మే ఒకటో తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం, 2న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవలు జరుగుతాయి. అలాగే 3వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం, 5న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 6న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహన సేవలు నిర్వహించనున్నారు. మే నెల 7వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు రథోత్సవం, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహనసేవలు జరగనున్నాయి. మే 9వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం వాహన సేవలు ఉంటాయి. మే 8వ తేదీన సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన దలిచిన గృహస్తులు (ఇద్దరు) రూ.750 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేత –ఇక్కట్లు పడుతున్న వాహనదారులు రేణిగుంట: పట్టణంలోని శ్రీనివాస కాలేజీ సమీపంలో ఉన్న బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం మూసివేశారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జి మూసివేయడంతో వాహనచోదలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కేటాయించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న సంత వద్ద రైల్వేగేట్ తరచూ మూసివేస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. రైల్వేగేట్ మూసివేసినప్పుడల్లా రెండు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గేటుకు రెండు వైపులా వాహనాలు నిలవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఈ ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలోని పోలీసులు రైల్వేగేట్కు రెండు వైపులా ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. అయినా రద్దీ తగ్గడం లేదు. ఈనెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ మరమ్మతుల కారణంగా బ్రిడ్జి మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 08 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,743 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,376 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం చూపొద్దని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 100 శాతం సంతృప్తి కలిగించేలా అధికారులు పనిచేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నారని చెప్పారు. ఆ సమయంలో క్షేత్రస్థాయి అధికారులతో సీఎం ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రజల సంతృప్తి ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా సమీక్ష ఉంటుందన్నారు. ఎండలతో జాగ్రత్త జిల్లాలో రాబోయే 5 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల్లోపే పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కమిషనర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదన్నారు. జెడ్పీ నిధుల నుంచి మంజూరు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు అందించాలన్నారు. ప్రతి పీహెచ్సీకి ఇంటర్నెట్ సౌకర్యం జిల్లాలోని ప్రతి పీహెచ్సీకి రూ.25 వేలతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు కలెక్టర్ నిధుల నుంచి ఒక్కో కేంద్రానికి రూ.25,000 కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ సౌకర్యం వల్ల అబా ఐడీల క్రియేషన్, రోగుల రిజిస్ట్రేషన్, రిపోర్టుల అప్డేట్ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. ఓపీకి వచ్చే ప్రతి రోగి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్లు అందరూ 100 శాతం డిజిటల్ డేటా ఎంట్రీ చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్కుమార్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ నాగశశిభూషన్రెడ్డి, డీఎస్వో గిరి తదితరులు పాల్గొన్నారు.న్యాయం చేయండి సారూ! చిత్తూరు కలెక్టరేట్ : ‘న్యాయం చేయండి సారూ..’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు అయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. అధికారులు లేకపోయేసరికి చేసేదేమీలేక వెనుదిరిగారు. -
ఇంతన్నాడంతన్నాడే..!
బాబు ఆర్భాటపు హామీలు బాబు మాటల గారడీకి మహిళలు పడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఆడ బిడ్డ నిధి అంటూ ఊదరగొట్టేసరికి మురిసిపోయారు. త్రీబెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పేసరికి సంతోషసాగరంలో మునిగిపోయారు. తీరా గెలిచాక బాబు విశ్వరూపాన్ని చూసి గాబరాపడుతున్నారు. ఆడ బిడ్డ నిధి ఎక్కడ బాబూ అంటూ నిలదీస్తున్నారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలో మహిళల ఆవేదన.. ఆక్రోశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట చంద్రబాబుది అంతా డైవర్షన్ రాజకీయం. తిరుపతి లడ్డూ నుంచి అన్ని అంశాలలో అతనిది అదే పంథా. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట. గత ప్రభుత్వ వైఫల్యమని నిందలు వేస్తూ, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. హామీల బాబు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కార్వేటినగరం: గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఆ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తామన్నది ప్రధానమైంది. ఆ హామీ తో మహిళలు కొంత మేర టీడీపీ వైపు మొగ్గు చూపారు. తీరా ఓట్లు దండుకుని గెలిచాక ఆ హామీని పక్కనబెట్టేశారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఇంటి జాగా లేదు గానీ! చమద్రబాబు సర్కార్ వచ్చి రెండేళ్లు పూర్తికావస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. ఇప్పుడు పెద్ద కుటుంబానికి త్రీ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదలేసి సమస్యలకు సంబంధించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి మాయ మాట లు చెప్పడం బాబుకు అలవాటయ్యిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇదేనా బాబు విజనరీ అని ఎద్దేవా చేస్తున్నారు. -
యువతకు ఉపాధి కార్యాలయ రిజిస్ట్రేషన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారని జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్లైన్ పోర్టల్లో నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కొత్తగా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఎంప్లాయ్మెంట్.ఏపీ.జీవోవీ.ఇన్ (www.-employment.ap.gov.in)సందర్శించాలన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు నిర్ణీత గడువు లోపు సీనియారిటీని పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు తమ విద్యార్హతలలో వచ్చిన మార్పులను, అదనపు అర్హతలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఇతర వివరాలకు 9440044346 నెంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. మేమున్నామని.. మీకేం కాదని! – ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను రక్షించిన పోలీసులు కార్వేటినగరం: ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను పోలీసులు రక్షించిన ఘటన మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కార్వేటినగరం మండలానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్డూడి నాయకత్వంతో పనిచేస్తున్న సోషల్ మీడియా సిబ్బంది ఆ పోస్టును గమనించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తమ సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలిక ఆచూకీని గుర్తించారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే బాలిక వద్దకు చేరుకుని సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కౌనెల్సింగ్ ఇచ్చి.. భవిష్యత్లో చదువుపై దృష్టి పెట్టాలని, చదువు లేదా ఉపాధి విషయంలో అవసరమైన సహాయం పోలీసుల ద్వారా అందిస్తామని భరోసా కల్పించారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. టమాట బాక్స్ రూ.400 పలమనేరు: పలమనేరు మార్కెట్లో సోమవారం టమాట బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. గత నాలుగు రోజుల క్రితం బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున పెరుగుతూ సోమవారం నాటికి టాప్రేట్కు చేరింది. దీంతో రైతులు ఆనందంతో చిందులేస్తున్నారు. టమాట సాగయ్యే రాష్ట్రాల్లో సరుకు తగ్గడం, అనంతపూర్ జిల్లాలో ఎండల కారణంగా దిగుబడి తగ్గడంతో సరుకు ఇక్కడి మార్కెట్లకు రావడం లేదు. అందుకే బయటి వ్యాపారులు సైతం స్థానిక మార్కెట్లకు వస్తున్నారు. వచ్చే నెలలో ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పోలీసు గ్రీవెన్స్కు 44 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. వీటిలో కుటుంబ తగాదా లు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూతగా దాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నట్టు వెల్లడించారు. ప్రతీ ఫిర్యాదును నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్హౌస్ అధికారులతో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ఫిర్యాదులను తీసుకున్నారు. -
మాట వింటేనే అందలం!
ప్రజాసేవ ప్రామాణికం కాదు.. నిజాయితీ ప్రాతిపదిక కాదు.. విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం లేదు.. సమస్యల పరిష్కారంలో సమర్థతను ఖాతరు చేయడం లేదు. తమ మాట వింటే చాలు.. చెప్పిన పని చేస్తే చాలు.. కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేస్తారు. అర్హత లేకపోయినా అదనపు బాధ్యతలు అప్పగించేస్తారు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా డిప్యుటేషన్ కింద కాసులు మూటగట్టుకునే అవకాశం కల్పించేస్తారు. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధుల వ్యవహారం. పరిపాలనలో కీలకమైన రెవెన్యూశాఖను తమ జేబులో పెట్టేసుకుంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్ల నియామకాల్లో చక్రం తిప్పుతున్నారు. అనుకూలంగా లేని గ్రూప్–2 అధికారులను ప్రాధాన్యత లేని చోటుకు బదిలీ చేయించేస్తున్నారు. అడుగులకు మడుగులొత్తే వారిని అందలం ఎక్కిస్తున్నారు.అంతులేని అక్రమాలు తిరుపతి జిల్లాలో విలువైన ప్రభుత్వ, పోరంబోకు, మఠం భూములు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు అధికారుల సహకారంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, తిరుపతి అర్బన్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, నాయుడుపేట, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల పరిధిలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు రికార్డులను తారుమారు చేసి నిజమైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా అనేక మంది బాధితులు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కి వచ్చే ఫిర్యాదు దారుల్లో ఎక్కువ మంది భూ సమస్యల పరిష్కారం కోసం తిరిగేవారు ఉండడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన రెవెన్యూని అధికార పార్టీ నేతలు తమ జేబు శాఖగా మార్చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పింది చేసేవారు, చెప్పింది వినేవారిని మాత్రమే కీలకమైన తహసీల్దార్లుగా నియమించుకుంటున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎక్కువ మండలాల్లో గ్రూప్– 2 కేడర్ అధికారులు కాకుండా డీటీలు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు తహసీల్దార్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా జిల్లాలో తహసీల్దార్ల నియామకాల్లో ఎక్కువ మంది డీటీలకే బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లాలో శనివారం 13 మండలాల తహసీల్దార్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఆ 13 మందిలో గ్రూప్ 2 అర్హత ఉన్న వారిని స్థానిక ప్రజా ప్రతినిధులు తమ మాట వినడం లేదని కలెక్టరేట్కి బదిలీ చేయించారు. 13 మందిలో ఐదుగురు మాత్రమే గ్రూప్–2 కేడర్ అధికారులు. మిగిలిన వారంతా డీటీ, సీఎస్డీటీ, కారుణ్య నియమకాల ద్వారా వచ్చిన వారే. వారందరిని ఎఫ్ఏసీగా నియమించారు. ఇలా జిల్లాలో 36 మండలాల ఉంటే.. ఏడు మండలాల్లో మాత్రమే గ్రూప్ 2 అధికారులు తహసీల్దార్లుగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారంతా డీటీ, సీనియర్ అసిస్టెంట్లను తహసీల్దార్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు నియమించుకున్నట్లు రెవెన్యూలో ప్రచారం జరుగుతోంది. ఇక పోతే కలెక్టరేట్లో ఏ నుంచి హెచ్ సెక్షన్లో పనిచేస్తున్న తహసీల్దార్లలో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. 28 మండలాలు ఉన్నాయి. ఈ 28 మండలాల్లో గ్రూప్ 2 వారు 10 మంది ఉన్నారు. ఇందులో ఒకరు కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మిగిలిన మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెచ్డీటీలు, 11 మంది ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే నచ్చదు గ్రూప్ 2 ఆఫీసర్లు నిబంధనల మేరకు నడుచుకుంటారు. ఒకటీ అరా అతిక్రమించినా.. భవిష్యత్తులో ఎవ్వరికీ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది అక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారిని కొందరు ప్రజా ప్రతినిధులు పక్కన ఉంచుకోరనే ప్రచారం జరుగుతోంది. అక్రమ లే అవుట్లు, కాలువ, చెరువు పోరంబోకు భూములను రెగ్యులరైజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీటీ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యుటేషన్పై తహసీల్దార్లు (ఎఫ్ఏసీ) అయిన కొందరు నిబంధనలన్నీ పక్కన పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకం ద్వారా తహసీల్దార్ అయిన ఒకరు, డీటీగా పనిచేస్తూ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించిన మరొకరు జిల్లాలో అనేక కాలువ, చెరువు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. మరి కొందరు ఏసీబీ అధికారులకు పట్టుబడి మళ్లీ అడ్డదారిలో పోస్టింగ్ తెచ్చుకున్న వారు లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా.. ప్రజా ప్రతినిధి చెప్పింది కళ్లుమూసుకుని గుడ్డిగా పనిచేసిన కొందరు తహసీల్దార్ల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూశాఖపై ఎమ్మెల్యేల పెత్తనం -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: హెయిర్ కటింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ రిజిస్ట్రేషన్లు స్వీకరించు తేదీలు: ఈనెల 8 నుంచి 13 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫీజు : రూ.2,500 వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈనెల 14 నుంచి వచ్చే నెల 12 వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు -
మావిగన్పై విమర్శలు సరికాదు
కార్వేటినగరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్పై జయప్రకాష్ నారాయణ విమర్శలు సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూ రు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆది వారం పుత్తూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా లేని చోట చంద్రబాబు తమ సామాజికవర్గం అభివృద్ధి కోసం రూ.లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మాణం చేస్తున్నాడని విమర్శించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ (మావిగన్)ను రాజధానిగా చేస్తే అంత ఖర్చు అవసరం లేదని తెలిపారు. వేల సంఖ్యలో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. తద్వారా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఓర్వలేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మేధా వుల ముసుగులో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. వారికి పేదల ప్రజల గురించి పట్టదన్నారు. ప్రజలకు మంచి జరిగే ఏ విషయమైనా వారికి కంటగింపుగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే జగనన్న తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదనపై జయప్రకాష్ నారాయణ ప్రేలాపణలు ఉన్నా యని తెలిపారు. అందులో భాగంగానే జగనన్నను పిచ్చితుగ్లక్ అని సంభోదించాడన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పిచ్చితుగ్లక్ కాదని, కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం తపించే మానవతావాది అని వివరించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కులపిచ్చితో రగిలిపోతున్నారని తెలిపారు. వారు ఈ రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టమన్నారు. జగనన్న అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించిన మావిగన్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పరిశ్రమలు రావడంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని అనేది ఒక్క చంద్రబాబు సామాజిక వర్గం వారి కల మాత్రమేనన్నారు. ఇది రాష్ట్ర ప్రజల కల కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబును ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. -
అలంకారప్రాయం
అధికారుల నిర్లక్ష్యం? ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పీహెచ్సీలతోపాటు ఉపాధి హామీ పనుల వద్ద ప్రాథమిక వసతులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఎండల ప్రభావంతో బాధపడే పేదల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 50 పీహెచ్సీలు ఉన్నా యి. ప్రతి పీహెచ్సీలోనూ రోజుకు 100 నుంచి 150 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఓపీల సంఖ్య పెరిగింది. వడదెబ్బ, జ్వరం కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. 12 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆస్పత్రికి వచ్చిన కేసులు 1191 ఉంటే క్షేత్రస్థాయిలో 6181 కేసులను గుర్తించారు. పీహెచ్సీల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రైవేటు డాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎండను తట్టుకునేందుకు ఓఆర్ఎస్ కార్నర్స్ను ఏర్పాటు చేసింది. బాటిళ్లలో ఓఆర్ఎస్ ద్రావణం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్లు పూర్తిగా కనిపించకపోవడం గమనార్హం. మరికొన్ని చోట్ల పేరుకు ఏర్పాటుచేశారు. అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. కొన్ని కేంద్రాల్లో వాటర్ బాటిళ్లలో ఓఆర్ఎస్ ద్రావణం ఉంచి కార్నర్గా చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా ఏర్పాటు చేసిన కార్నర్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు ఓఆర్ఎస్ కార్నర్ల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి ఉపయోగంలోకి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదుపాయం లక్ష్యానికి విరుద్ధంగా మరుగునపడుతోంది. కూలీలకు తప్పని అవస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. 40 డిగ్రీల ఎండలో పనిచేస్తున్న కూలీలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ పని చేసే ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో లేవు. దీంతో కూలీలు ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తాగునీరు కూడా దూరంగా ఉండడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు, పూతలపట్టులో.. చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్పేట పీహెచ్సీలో ఓఆర్ఎస్ కార్నర్ అలంకారప్రాయంగా ఉంది. గుడిపాలలోని పీహెచ్సీ, బొమ్మసముద్రంలోని పీహెచ్సీలో కూడా కార్నర్స్ ఏర్పాటు చేసి గాలికొదిలేశారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కొరవడుతోంది. బంగారుపాళ్యం మండలంలో ఓఆర్ఎస్ కార్నర్ను పక్కన పడేశారు. యాదమరి, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాల్లో షో చూపిస్తున్నారు. ఈ కార్నర్స్ రోగులు ఏమాత్రం ఉపయోగం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తూతూమంత్రంగా.. కుప్పం: ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఓఆర్ఎస్ కార్నర్లు అలంకారప్రాయంగా మారాయి. కుప్పం నియోజకవర్గంలోని 12 పీహెచ్సీల్లో ఒక మూలన అట్ట బాక్సుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎండల తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులను వివరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. ఎండదెబ్బకు గురైన వారికి మాత్రమే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక మూలన ఏర్పాటు పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు ఏరియా ఆస్పత్రితోపాటు కొలమాసనపల్లి, గంగవరం మండలంలోని గంగవరం, పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి, తీర్థం, వి.కోట మండలంలో వి.కోట, ఓగు, పెద్దపంజాణి మండలంలో రాయలపేట, పెద్దపంజాణిలోని ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఒక మూలన ఏర్పాటుచేశారు. పీహెచ్సీల్లో రెడీమేడ్గా ఓఆర్ఎస్ బాటిళ్లు ఉంచారు. ఎండదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చిన వారితో ఆ నీటిని తాగిస్తున్నారు. వైద్యశాఖ మార్గదర్శకాలు పాటించని సిబ్బంది వైద్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎండల తీవ్రత పెరిగే కాలంలో ప్రతి పీహెచ్సీలోనూ తప్పనిసరిగా ఓఆర్ఎస్ కార్నర్ ఉండాలి. అంతేగాక తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచి ప్రజలకు తక్షణ సేవలు అందించాలి. జిల్లాలో అనేక పీహెచ్సీల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. చాలా వాటిల్లో కార్నర్లు ఉన్నా వినియోగంలో లేవు. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడి పోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల ఆ ఊసే లేదు. శ్రీరంగరాజుపురం పీహెచ్సీ, అదే మండలంలోని అరిమాకులపల్లి పీహెచ్సీ, కార్వేటినగరంలోని కత్తెరపల్లి పీహెచ్సీ, బంగారుపాళ్యం పీహెచ్సీ, పెనుమూరు మండలాల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ కనుమరుగయ్యాయి. అలాగే చిత్తూరు, నగరి, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. -
బొప్పాయి.. వింతేనోయి!
బంగారుపాళెం మండలంలోని వంకరవారిపల్లెకు చెందిన రైతు, మాజీ రైతు సంఘ నాయకుడు సుధాకర్రెడ్డి తన పొలంలో పండిన బొప్పాయిని ఇంటికి తీసుకొచ్చాడు. కాయను తినేందుకు కోయగా అందులో గింజలకు బదులుగా మరో తెల్లని బొప్పాయి దర్శనం ఇచ్చింది. అందులోని బొప్పాయిని కోయగా మరో బొప్పాయి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. బొప్పాయి పండులో నల్లని గింజలు ఉండడం సాధారణం. అలాంటిది ఒకే బొప్పాయిలో మరో రెండు బొప్పాయిలు ఉండడం వింతగా అనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆ బొప్పాయిని చూసి ఆశ్యర్యానికి లోనయ్యారు. ఇది జన్యుపరమైన ప్రక్రియ అని వ్యవసా యాధికారులు అంటున్నారు. – బంగారుపాళెం బొప్పాయి లోపల తెల్లటి బొప్పాయి రెండో బొప్పాయిలో మరో బొప్పాయి


