breaking news
Chittoor
-
రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలి
పలమనేరు: జిల్లాలో రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పలమనేరు నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎండీఆర్, ఎస్హెచ్, నాబార్డ్ నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆరు నెలల్లో వీటిని పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని మూడు అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రిని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలి
వెదురుకుప్పం: అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన శుక్రవారం వెదురుకుప్పం పోలీస్స్టేషన్ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నేర ప్రవృత్తికి సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా మెలిగి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల్లో దర్యాప్తులను ముమ్మరం చేసి వెంటనే అరెస్టులు చేయాలన్నారు. కీలక హత్య కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చార్జిషీట్లను కోర్టులకు సమర్పించాలని చెప్పారు. చివరిగా సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఉన్నారు. -
అబార్షన్ కేసులకు కారణాలు తెలపండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అబార్షన్ కేసులకు గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ అబార్షన్ కేసులన్నింటినీ పరిశీలించాలన్నారు. అందుకు గల కారణాలను నివేదికల రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువ శాతం కాన్పులు జరగాలన్నారు. శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో నెలకు 50 సుఖ ప్రసవాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పీసీ పీఎన్డీటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమీక్షలో డీఎంఅండ్హెచ్వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు. వాటిని ఎందుకు తనిఖీ చేయడం లేదు? జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు ఎందుకు తనిఖీ చేయడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక వసతులు మెరుపరచాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి జిల్లాలో 2.05 లక్షల మంది అర్హులున్నట్టు తేలిందన్నారు. వీరి ఖాతాల్లో రూ.138 కోట్లను ప్రభుత్వం జమచేయనున్నట్లు వెల్లడించారు. డ్వామా శాఖ సమీక్షలో మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న గోకులం షెడ్ల బిల్లుల మంజూరులో జాప్యం చేయకూడదని ఆదేశించారు. జిల్లాలో 2,795 మినీ గోకులం షెడ్లు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. ఒక్కొక్క షెడ్ నిర్మాణానికి రూ.2.30 లక్షలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇందుకు జిల్లాలో చేపట్టే పనులకు రూ.62.93 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో డ్వామా శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసపు రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగురంగు పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు అందజేశారు. -
అన్నదాత సుఖీభవకు 25,391 వేల మంది దూరం
● వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ● 2,05,753 మంది రైతులు ఎంపిక ● నేడు రైతు ఖాతాల్లోకి నిధులు జమ చిత్తూరు రూరల్ (కాణిపాకం): అన్నదాత ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. వివిధ కారణాలతో అన్నదాత సుఖీభవ పథకానికి చాలా మందిని దూరం చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ టీడీపీ అధినేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే హామీని తుంగలో తొక్కేశారు. తాజాగా పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14వేలు మూడు విడతల్లో అందజేస్తామని ఆయన ఇటీవల సెలవివ్వడం గమనార్హం. 2,05,753 మంది అర్హులు జిల్లాలో మూడు లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 2.5 హెక్టార్ల దాకా వివిధ రకాల పంటలు సాగుచేస్తుంటారు. దీనిపై మూడు లక్షల మంది దాకా రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది పేద రైతులే. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యాప్తంగా 2,05,753 మందిని గుర్తించారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.102.88 కోట్లు, పీఎం కిసాన్లో 1.76 లక్ష మందికి గాను రూ.35.2 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులు శనివారం నుంచి అన్నదాత ఖాతాల్లో జమకానున్నాయి. మోసపూరితమైన మాటలు 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు జబ్బలు చరిచారు. అధికారంలోకి వచ్చాక రైతులందరికీ పంగనామాలు పెట్టారు. రుణం మొత్తాన్ని ఐదు విడతల్లో ఇస్తామని ఒకటి, రెండు విడతలు ఇచ్చి మిగతావి ఎగనామం పెట్టారు. 25,391 వేల మంది దూరం ఈకేవైసీ, ఆధార్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదని..ఇతరత్రా కారణాలతో జిల్లా వ్యాప్తంగా 25,391 వేల మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 2,05,753 మందేనని జిల్లా వ్యవసాయ అధికారులు లెక్కలు గట్టారు. పలువురు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంది. ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలిముద్ర వేయలేదు. వారికి అవగాహన కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా ఇలా.. సంవత్సరం రైతుల సంఖ్య రూ.కోట్లల్లో 2019–20 220256 165.19 2020–21 231038 173.52 2021–22 216594 162.45 2022–23 223165 211.12 2023–24 231144 174.03అందరికీ అందాలి అర్హత కలిగిన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలి. ఈ కేవైసీ చేయలేదని, ఇతర సాంకేతిక కారణాలు చూపుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పథకం అందకుండా అన్యాయం చేయాలని చూస్తోంది. అలా కాకుండా అర్హులైన ప్రతి రైతుకూ పథకాన్ని వర్తింప చేయాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం అందక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు లేకుండా అందించాలి. – పాలాక్షిరెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు, బంగారుపాళ్యం -
ప్రభుత్వ మార్గదర్శకాలతోనే ఆటోమ్యుటేషన్
చిత్తూరు : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆటోమ్యుటేషన్ విధానం పెట్టారని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభించిన ఆటో మ్యుటేషన్ విధానంపై శుక్రవారం చిత్తూరు అర్బన్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆటో మ్యుటేషన్ను పూర్తిచేయాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. నూతన విధానంపై అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్వో గోపాలకృష్ణవర్మ, సబ్ రిజిస్ట్రార్ హేమంత్, విజయ్కుమార్ పాల్గొన్నారు. తగ్గిన రిజిస్ట్రేషన్లు నూతన విధానంతో మొదలైన రిజిస్ట్రేషన్స్ సంఖ్య మొదటి రోజు పలు కారణాలతో తగ్గాయి. నెట్వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, డ్యాకుమెంటేషన్ సమయంలో ఎర్రర్ రావడం, పన్నులు అప్డేట్ సక్రమంగా చూపకపోవడం వంటి సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం 40 వరకు రిజిస్ట్రేషన్స్ జరగ్గ, శుక్రవారం 20 రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరిగాయి. ఆగస్టు 15 తర్వాత పరీక్షలు నిర్వహించండి చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 తర్వాత పరీక్షలు నిర్వహించాలని వైఎస్సార్ టీఏ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించనున్న ఎఫ్ఏ–1 పరీక్షలు ఈ నెల 15 తర్వా త నిర్వహించాలన్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన గూగుల్ మీట్లో ఈ నెల 4వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను ఈ నెల 11 నుంచి 14 వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారన్నారు. -
ఇంటింటికీ మంగళం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పింఛన్ల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. ఐదేళ్ల క్రితం టీడీపీ పాలనలో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం పడ్డ కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎన్నికల ముందు వలంటీర్లు లేకపోయినా ఇంటి వద్దకే పింఛన్ల ఇస్తామన్న కూటమి పెద్దలు సోమవారం సచివాలయాలు, నడివీధుల్లో గంటలు తరబడి నిల్చోబెట్టి పంపిణీ చేశారు. ఈ పరిస్థితిని చూసి లబ్ధిదారులు ఇందుకేనా మేము ఓట్లేసింది’ అంటూ నిట్టూర్చడం కనిపించింది. ఈ దృశ్యాలను శుక్రవారం తిరుపతి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో కనిపించిన చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని పూజలు
రొంపిచెర్ల: మద్యం కేసులో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మోటుమల్లెల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ఎదుగుదల చూడలేక చంద్రబాబు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మిథున్రెడ్డి ఎలాంటి వాడో ప్రజలకు తెలుసన్నారు. మద్యం కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. కూటమి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, విజయశేఖర్, శ్రీనాథనాయుడు, పెద్దిరెడ్డి దేవేంద్ర రెడ్డి, మునికృష్ణారెడ్డి, గురు, మహబూబ్బాషా, బావాజీ, రవీంద్ర, నీరజాక్షుల నాయుడు, ఐడియా కాలేషా, రాజాసాహెబ్, వెంకటరత్నం, బాబు, ఖలీల్, నరేంద్ర, సహదేవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్, శ్రీకాంత్, రియాజ్, రవీంద్రనాథరెడ్డి, కుమార్ నాయుడు పాల్గొన్నారు. పులిచెర్ల మండలంలో.. పులిచెర్ల(కల్లూరు): రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును నిరిసించడంతోపాటు ఆయనకు బెయిల్ రావాలని కోరుతూ జిల్లా ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ గోటూరి మురళీమోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం పులిచెర్ల సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం బయట వెయ్యి కొబ్బరి కాయలు కొట్టారు. వారు మాట్లాడుతూ ఏ తప్పు చేయని మిథున్రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని, త్వరలో బెయిల్పై కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా, రెడ్డీశ్వరరెడ్డి, ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్, మువ్వల నరసింహులు శెట్టి, రాయల్ మోహన్, రెడ్డి అహమ్మద్, మునీర్ఖాన్, ప్రతాప్రెడ్డి, జాఫర్హుస్సేన్, ఆనంద, ఎస్వీ రమణ, మునస్వామి, గంగయ్య, రాజమూర్తి, కిష్ణమూర్తి, జేడీ నారాయణ, మునిరత్నం, నాగరాజ, మధు, శ్యామ్రెడ్డి, శివారెడ్డి, నటరాజ, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మీడియాను అరికట్టేందుకే స్టిక్కర్ల పంపిణీ
తిరుపతి క్రైమ్: జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్లు కూడా మీడియా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా చాలామంది వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని తెలిపారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొన్ని వందల వాహనాలకు స్టిక్కర్లు తొలగించామన్నారు. నిజాయితీగా వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్న వారందరికీ గుర్తింపు ఇచ్చేందుకు పోలీస్ విభాగం తరఫున ద్విచక్ర వాహనాలు, కార్లకు స్టిక్కర్లను పంపిణీ చేశామన్నారు. ఈ స్టిక్కర్ తగిలించుకున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి ప్రోగ్రాములకై నా పోలీసుల ద్వారా ఇబ్బంది లేకుండా అనుమతి ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈ స్టిక్కర్ స్కాన్ చేస్తే ఆ మీడియా ప్రతినిధి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎడిషన్లో పనిచేసే పాత్రికేయుల వాహనాలకు వున్న ఈ స్టిక్కర్లను చూసి పోలీసులు అనుమతి ఇస్తారని వెల్లడించారు. ఈ స్టిక్కర్లను కాపీ చేయకుండా పకడ్బందీగా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
శ్రీసిటీలో ‘అక్షరధామ్’ గురువులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఢిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ స్వామి నారాయణ్ ఆలయానికి చెందిన ఆధ్యాత్మిక గురువులు అక్షర్ ప్రేమ్, వినమ్రవదన్ శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. వీరికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను వారికి వివరించారు. పర్యటనలో భాగంగా పారిశ్రామికవాడ పరిసరాలతో పాటు స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన శ్రీసిటీ ఉద్యానవనాన్ని స్వామీజీలు సందర్శించారు. అక్కడ నుంచి డైకిన్ ఏసీ పరిశ్రమకు వెళ్లి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పచ్చదనం, పర్యావరణం, ఆధ్యాత్మికతకు పెద్దవేట వేస్తూ ముందుకు సాగుతున్న శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని ప్రశంసించిన స్వామీజీలు, శ్రీసిటీ ఎండీని అభినందిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. దక్షిణ భారతదేశంలో శ్రీ సిటీ కేంద్రంగా స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా వారికి ఎండీ విజ్ఞప్తి చేశారు. -
మలేషియా వర్సిటీతో ఎస్పీడబ్ల్యూ కళాశాల ఒప్పందం
తిరుపతి సిటీ : యూనివర్సిటీ ఆఫ్ మలేషియా తెరెంగ్గాన్తో పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల మధ్య విద్యాభివృద్ధిపై ప్రతిష్టాత్మక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శుక్రవారం పద్మావతి డిగ్రీ కళాశాల బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ, మలేషియా వర్సిటీ ఫిషరీస్ అండ్ ఫుడ్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్ ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్య, పరిశోధన, సాంస్కృతిక అంశాలతో పాటు విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ సి భువనేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డీఐసీ ఆశయానికి తూట్లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పుట్టుకతోనే వివిధ అనారోగ్య సమస్యల బారిన పడిన పిల్లలను డీఐసీ కేంద్రానికి తరలించేందుకు ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఓ వాహనాన్ని కేటాయించింది. అయితే ఆ వాహన ఆశయానికి డీఐసీ కేంద్ర నిర్వాహకులు తూట్లు పొడుస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చేందుకు బదులుగా..మందులు, మాత్రలు సరఫరాకు వాడుకుంటున్నారు. కలెక్టరేట్లోని మందులు, మాత్రల గోడౌన్ వయా డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం, డీఐసీకి మందులు, మాత్రలు సరఫరా చేసుకుంటున్నారు. ఇలా సరఫరా చేస్తూ... ఆ వాహనం డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం వద్ద సాక్షి కంట పడింది. ఇదేమని కేంద్ర నిర్వాహకులను ప్రశ్నిస్తే...షరా మాముళ్లే అని కొట్టేపడేశారు. కాగా ఈ వాహనం కార్యాలయానికి వచ్చేంత వరకు ప్రత్యేక ప్రతిభావంతుడైన ఓ బాలుడు కార్యాలయంలోనే గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. -
రెండు దుకాణాల్లో చోరీ
పుత్తూరు: డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రెండు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని శ్రీమారుతీ ఎంటర్ప్రైజెస్ దుకాణం పైకప్పులోని రేకును కత్తిరించి దుండగుడు లోనికి ప్రవేశించాడు. దుకాణం లోపల అమర్చిన సీసీ కెమెరాను ఆఫ్ చేసి అనంతరం గల్లాలోని రూ.25 వేల నగదును దోచుకెళ్లాడు. సమీపంలోనే ఉన్న ఇలియాస్ కూల్డ్రింక్స్ షాపు పైభాగం నుంచి లోనికి ప్రవేశించిన దుండగుడు గల్లాలోని రూ.5 వేలు అపహరించాడు. రెండు దుకాణాల్లోనూ ఒకే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించగా దుండగుడు మాస్క్ వేసుకొని లోపలికి ప్రవేశించినట్లు తెసుస్తోంది. సదరు దుండగుడు తమ షాపులో పనిచేసి నిలిచి పోయిన వ్యక్తిగా ఎంటర్ప్రైజెస్ యజమాని కళ్యాణి తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనూ ఇలాగే దొంగతనం జరిగిందని, అప్పుడు కూడా రూ.లక్ష దోచుకెళ్లారని ఆమె వాపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయుష్ సేవలు మరింత బలోపేతం
– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి మంగళం : జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలపై వివరాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదేళ్లలో రూ.28.82 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపినట్లు వివరించారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటు చేయాలని, మరో నాలుగు ఆయుష్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చిందని చెప్పారు. తిరుపతి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి కోరారు. -
స్వతంత్ర్య అభ్యర్ధి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు!
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు. -
జరుగుతున్న పనులకు టెండర్లు!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్త ఆలస్యంగా మేల్కొన్నారు. నగరంలో పలుచోట్ల రోడ్లు, ఇతర సివిల్ పనులకు టెండర్లు పిలవకుండానే పనులు అప్పగించడంపై ‘సాక్షి’లో రెండు రోజుల క్రితం ‘టెండర్ లేకుండా పనులా..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. చేయికాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కలెక్టర్ బంగ్లాలో ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిన ప్రహరీ గోడ నిర్మాణానికి గురువారం రూ.39 లక్షల అంచనాలతో టెండర్లు పిలిచారు. కార్పొరేషన్ సాధారణ పద్దుల నుంచి పనులు చేయడానికి పిలిచిన టెండర్కు ఆగస్టు 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ప్రహరీ గోడ పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులు చేస్తున్న పనులు చూసి జనం నవ్వుకునే పరిస్థితి నెలకొంది. ఇక ఆర్టీసీ బస్టాండులో టెండరు పిలవకుండానే ఫుట్పాత్ పనులు చేయడంపై.. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులను మందలించినట్లు తెలిసింది. దీంతో ఫుట్పాత్ నిర్మాణం కోసం ఉంచిన ఇనుప కమ్మీలను పక్కకు తీసేసిన అధికారులు, అక్కడ ఎవరూ పనులు చేయకుండా రిబ్బన్ ఏర్పాటు చేశారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కాళ్ల నొప్పులు భరించలేక ఓ వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చిత్తూరు నగరంలోని నరిగపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. నరిగపల్లి యానాది కాలనీకి చెందిన రాజు (44) కొన్నాళ్లుగా తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పులు భరించలేక గత నెల 27వ తేదీన పురుగుల మందు తా గి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆ వ్యక్తిని చికి త్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి శ్రీరంగరాజపురం : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండంలోని అంకనపల్లి చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, సింగంపల్లి గ్రామానికి చెందిన జగ్గయ్య కుమారుడు కోండల్గౌడ్ (35) పాలసముద్రం మండలంలోని ఓ పాల డెయిరీలో రీజనల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా మండలంలో పాల సేకరణ కోసం వచ్చాడు. ఏమైందో ఏమోగానీ బుధువారం రాత్రి అంకనపల్లి చెరువు వద్ద ఉన్న బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతుడు కోండల్గౌడ్గా గుర్తించారు. చిత్తూరు ఫైర్ సిబ్బంది సహకరంతో బావిలో ఉన్న మృతదేహన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట చెరువులో మహిళ మృతదేహం కార్వేటినగరం: కోట చెరువులో మహిళా మృతదేహం కలకలం రేపింది. సీఐ హనుమంతప్ప ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయం, నగర వీధుల్లో మతిస్థిమిత్తం లేకుండా తిరుగాడుతున్న మహిళగా గుర్తించామన్నారు. మల విసర్జన కోసం చెరువు వద్దకు వచ్చి కాలుజారి పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారికి అప్పగిస్తామని, లేనిపక్షంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్మికుల చేత దహన క్రియలు నిర్వహిస్తామన్నారు. సీఐ వెంట ఏఎస్ఐలు మునికృష్ణ, ఏలుమలైరెడ్డి, సిబ్బంది రాజ, మురళీకృష్ణరాజు ఉన్నారు. -
మేమింతే!
నగరి : మీరేమైనా చేసుకోండి..! అధికారులుగా మీ పని మీది.. మా పని మాది.. మేమింతే మారం అంతే..! అంటున్నారు కొందరు డైయింగ్ యూనిట్లు నడుపుతున్న యజమానులు. రసాయనాలను యథేచ్ఛగా రోడ్డుపైనే వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.ఏళ్ల తరబడి ఇవే సమస్యలుగురువారం కొత్తపేట భజన గుడి వీధిలోని రోడ్డుపైనే రసాయన నీరు ప్రవహించింది. నిబంధనలు పాటించని డైయింగ్ యూనిట్ల నియంతృత్వ పోకడకు నిదర్శనంగా నిలిచింది. వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేని అధికారుల అసమర్థతకు అద్దంపట్టింది. ఏళ్ల తరబడి బరిస్తూ వస్తున్నాం ఇంకా ఎన్నాళ్లు భరించాలంటూ స్థానికులు ప్రశ్నించడం కనిపించింది. డైయింగ్ యూనిట్లను ఊరికి దూరంగా పంపేస్తాం.. అందుకు అనువైన భూమిని సేకరిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు చెప్పే మాటలు కాగితాలకే పరిమితమవడం విమర్శలకు తావిస్తోంది.రంగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి‘నగరిలో రంగునీటి సమస్యకు మోక్షం ఎప్పుడు?.. స్వచ్ఛనగరి కావాలన్న ప్రజల ఆకాంక్ష తీరేదెప్పుడు?’.. అని సీపీఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ పార్టీ కార్యదర్శి వేలన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివీధిలో పారతున్న రసాయనాలను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ అధికారులు ఎవ్వరూ దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. సయానికి తగినట్లు నామమాత్రపు పరిష్కారం చూపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, డైయింగ్ యూనిట్లపై ఆధారపడి జీవిస్తున్న కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని జనావాసానికి దూరంగా తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వారి వెంట పార్టీ నాయకులు బాషా, విజయకుమార్ ఉన్నారు. -
బకాయిలు చెల్లించాలి
● ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి ● ఆగస్టు 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా ● పిలుపునిచ్చిన ఫ్యాప్టో నాయకులు చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మణిగండన్, సెక్రటరీ జనరల్ మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం జిల్లా ఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లకు బోధనేతర పనుల నుంచి మినహాయించాలన్నారు. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. బోధనను హరించే యాప్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీచర్లు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలోని సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పీ–4 కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులను నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్ మాట్లాడుతూ నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డిమాండ్ చేశారు. 72, 73, 74 జీవోలను వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ టీచర్లను బోధనకు తప్ప ఏ ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదన్నారు. హైస్కూల్ ప్లస్లలో వెంటనే టీచర్ల నియామకాలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పూల్తో వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ విధానంలోనే భర్తీ చేయాలన్నారు. ఏపీటీఎఫ్, సీపీఎస్ అసోషియేషన్ నాయకులు సమీర్ మాట్లాడుతూ 12 వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్ల పై ఆ సంఘ నాయకులు చర్చించి నిరసన చేపట్టారు. ఫ్యాప్టో సంఘ నాయకులు అరుణ్కుమార్, ముక్తార్ అహ్మద్, రామచంద్రయ్య, శేఖర్, రంగనాథం, గణపతి పాల్గొన్నారు. -
మేం ఇక్కడే ఉంటాం!
● మంత్రి సమీక్షలో బట్టబయలైన అధికారుల తీరు ● 2018లో కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 కేటాయింపు ● మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలోనే డివిజన్ నిర్వహణ ● సీఎం చంద్రబాబుకే మస్కా ● రూ.169 కోట్ల పనులున్నా మదనపల్లె నుంచే పర్యవేక్షణ ● అధికారులు హెడ్క్వార్టర్ కుప్పంలో నివాసం లేరని మంత్రే నిర్ధారణ మదనపల్లె: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పనిచేయాల్సిన హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు కుప్పానికి వెళ్లకుండా మదనపల్లెను వదలకుండా ఉండిపోతున్నారు. కుప్పంలో రూ.కోట్ల పనులు జరుగుతున్నా మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడి నుంచే పర్యవేక్షి స్తామన్నట్లుగా అధికారుల ధోరణి వ్యక్త మవుతోంది. సాధారణంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే సాహసం ఏ అధికారీ చేయడు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులకు మాత్రం ఆ సాహసం ఉందని చెప్పాలి. 2018లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా కుప్పానికి తరలి పోయి అక్కడి నుంచే పాలన సాగించాలి. అయితే ఈ ఉత్తర్వు కేవలం కాగితానికే పరిమితమయ్యాయి. ఈ ఉత్తర్వు సమయంలో కుప్పం ఉపకాలువ పనులు సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణ సులువుగా, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం నియోజకవర్గమైతే మాకేంటి అనుకున్నారేమో కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకుండా, మదనపల్లె నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అంతా మదనపల్లె నుంచే మదనపల్లెలో ప్రాజెక్టు సర్కిల్–3 కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి కుప్పంకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం రూ.169 కోట్లతో రెండు రీచ్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేసుంటే ఇక్కడి నుంచి పర్యవేక్షణ పక్కగా జరిగేది. ప్రస్తుతం మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న కుప్పం డివిజన్ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండడంతో రోజూ కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ సాగించాల్సి వస్తోంది. బుధవారం ఈఈ వెంకటేశ్వర్లు కార్యాలయం ఉండి ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు. ఇంతవరకు కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం, కనీసం అక్కడి నుంచైనా విధులు నిర్వహించకపోవడంతో కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈఈకి మూడు చార్జ్ మెమోలు కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లుకు ఏకంగా మూడు చార్జ్ మెమోలను జారీ చేయాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించడం హంద్రీ–నీవా ప్రాజెక్టు వర్గాల్లో కలకలం రేగాలి. అయితే దీనిపై అధికారులు టేకిట్ఈజీ అన్న ధోరణిలో కనిపిస్తున్నారు. సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీస స్పందనం లేదు. మంగళవారం మంత్రి ప్రాజెక్టు ఉపకాలువల పనులపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. కుప్పం కాలువ పనులకు సంబంధించి ఈఈ మీటింగ్కు హజరుకాలేదు. దీనికితోడు హెడ్క్వార్టర్ కుప్పం లేరని నిర్ధారించి చర్యలకు ఉపక్రమించారు. ఈ చార్జ్మెమోలను తిరుపతి చీఫ్ ఇంజినీర్ జారీ చేస్తారని ఎస్ఈ విఠల్ప్రసాద్ బుధవారం సాక్షికి చెప్పారు. తదుపరి చర్యలేమిటి? మంత్రి మదనపల్లెలో జరుగుతున్న కుప్పం డివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెడతారా లేదా అన్నది తేలాలి. ఈఈ హెడ్క్వార్టర్లో నివాసం లేరని తేల్చగా ఇప్పుడు అక్కడ డివిజన్ కార్యాలయమే ఏర్పాటు చేయని అంశంపై ఎలా స్పందించాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి. ఏడేళ్లకుపైగా కార్యాలయం ఏర్పాటు చేయకుండా అధికారులు ఎలా విధులు నిర్వహించారో తేల్చాలి. ఈఈపై చర్యలకు ఉపక్రమించిన మంత్రి ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ధిక్కరించి మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో డివిజన్ కార్యాలయం నిర్వహణపై ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాలి. -
చిత్తూరు అభివృద్ధికి కృషి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ఆ సొసైటీ సభ్యులు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీని కలిసి ప్రణాళిక అందజేశారు. ఆయన మాట్లా డుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాకు ఏళ్ల సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. చిత్తూరును టూరిజం కారిడార్గా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జలాశయం వద్ద త్రివేణి సంగమం, పుష్కర ఘాట్, అష్టదేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కలవగుంట వద్ద 108 అడుగుల శివుని విగ్రహం, త్రివేణి సంగమం, పుష్కర ఘాట్లను నిర్మిస్తామన్నారు. చిత్తూరులోని నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద నెమలి, గరుడ, నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సొసైటీ సభ్యులు చంద్రబాబు, శివకుమార్, అశోక్ పాల్గొన్నారు. -
104 డీఎంపై కక్ష సాధింపులా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): బీఎన్ఆర్పేట ప్రాంతంలో ఉన్న హోటల్కు, 104 డీఎం ప్రతాప్కు ఎలాంటి సంబంధం లేదని 102 (తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్) డ్రైవర్ హేమంత్ పేర్కొన్నారు. చిత్తూరులోని ప్రెస్క్లబ్లో గురువారం 102 డ్రైవర్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను 102లో డ్రైవర్గా పనిచేస్తూ..చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట ప్రాంతంలో చిన్న హోటల్ నడిపిస్తున్నానన్నారు. చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన ప్రేమ అనే మహిళ నుంచి ఈ హోటల్ను వంట సామాన్లతో సహా కొనుగోలు చేశానన్నారు. ఈ షాపు కొనుగోలు చేసి కేవలం ఐదు నెలలు అయ్యిందని, చేతిలో ఉన్న డబ్బులు మొత్తం హోటల్ కొనుగోలు, నిర్వహణకు పెట్టేశానన్నారు. దీని కారణంగా హోటల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేకపోయనన్నారు. గతవారం తనపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి అధికారులు విధుల నుంచి తొలగించారన్నారు. ఈ హోటల్ నిర్వహణలో 104 డీఎంకు కూడా సంబంధాలున్నాయని పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. డీఎంకు.. ఈ హోటల్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ హోటల్కు వేసిన రంగులు, ఫోన్ నెంబరు మారలేదని కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు. -
పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో పలు శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో వారాంతపు లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలన్నారు. హౌసింగ్ కాలనీల్లో అన్ని మెరుగైన వసతులు కల్పించాలన్నారు. గృహ నిర్మాణాల్లో ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు సాయం పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 2,11,628 మంది రైతులు అర్హులుండగా, ఇప్పటి వరకు 2,04,971 మందికి ఈకేవైసీ పూర్తి చేశారన్నారు. 6,644 మందిని తిరస్కరించడం జరిగిందన్నారు. అర్హత పొందిన ప్రతి రైతుకూ సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం ఇస్తారన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో రూ.14 వేలు ఉంటుందన్నారు. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు చొప్పున ఈ నెల 2వ తేదీన మంజూరు చేస్తారన్నారు. అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయకపోతే ఉద్యమమే
చిత్తూరు కలెక్టరేట్ : ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఒకే డీఎస్సీ, ఒకే విధమైన ఉద్యోగం, ఒకే రకమైన జీతం అన్నింటా ఒకటే కానీ ఉద్యోగోన్నతుల్లో ఎందుకు వ్యతాసమని ప్రశ్నించారు. ఎప్పుడో బ్రిటీష్ల కాలంలో రూపొందించిన ప్రభుత్వ జీవోలను నేడు అమలు చేయడం హాస్యాస్పదమన్నారు. మొట్టమొదట ఏర్పాటు చేసిన పాఠశాలలు అన్ని ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఏర్పాటు చేయలేదన్నారు. లోకల్ బాడీల పేరుతో ప్రపంచ బ్యాంకు షరతులతో ఒప్పందాలకు అనుకూలంగా జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్, మోడల్ పాఠశాలల పేరుతో అనేక రకాలుగా పాఠశాలలు నెలకొల్పారని తెలిపారు. 1994 నుంచి ఒకే రకమైన డీఎస్సీ నిర్వహిస్తున్నారన్నారు. ఆ డీఎస్సీలలో ఎంపికయ్యే వారిని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను నియమిస్తున్నారన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెచ్చే వరకు తీసుకెళ్లి, పార్లమెంట్లో చట్టం చేయకుండా వదలడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఇప్పుడు ఒకే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల ఏకీకృత సర్వీస్ నిబంధనలను పార్లమెంట్లో చట్టం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ల ఓట్లతో గెలుపొందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఈ విషయంలో చొరవ చూపాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ల ఏకీకృత సర్వీస్ నిబంధనలతో హెచ్ఎంలు, డైట్, ఎంఈవోలు, హైస్కూల్ ప్లస్, జూనియర్ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధపడుతామని ఆయన హెచ్చరించారు. -
గ్యాస్తోనే మధ్యాహ్న భోజనం
తవణంపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరిగా గ్యాస్తోనే వంటలు చేసి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి మధ్యాహ్న భోజన నిర్వాహకులను, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని తొడతర హైస్కూల్, తొడతర మోడల్ స్కూల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొడతర హైస్కూల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికర భోజనాలు పెట్టాలన్నారు. కట్టెలతో వంటలు చేయరాదన్నారు. అనంతరం తొడతర ప్రాథమిక మోడల్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని సూచించారు. డీఈఓతో పాటు ఎంఈఓలు హేమలత, మోహన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ ఉప ఎన్నికకు మూడు నామినేషన్లు
రామకుప్పం(కుప్పం): రామకుప్పం మండలం, మణీద్రం ఎంపీటీసీ స్థానానికి జరనున్న ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం మూడు నామినేషన్లు దాఖలైనట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గతంలో వైఎస్సాసీపీ మద్దతుదారురాలు శాంతకుమారి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆమె అనార్యోగంతో మృతి చెండటంతో మణీంద్ర ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు గుర, శుక్రవారాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందులో భా గంగా గురువారం వైఎస్సార్ సీపీ మద్దతుదా రు, మండల వైఎస్సార్ సీపీ కో కన్వీనర్ కుమా ర్తె హర్పిత నామినేషన్ వేశారు. టీడీపీ మద్దతుదారు అరుణా, విశాలాక్షి నామినేషన్ వేసినట్టు ఎన్నికల అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సమగ్రశిక్షశాఖ ఏపీసీ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గిరింపేట వద్ద ఉన్న సీఎంఎస్ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న లీడర్ షిప్ ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు లీడర్షిప్ శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పాఠశాలల నిర్వహణలో నైపుణ్యాలు ముఖ్యమన్నారు. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న టీచర్లకు గుర్తింపు పత్రాలను అందజేశారు. గుడిపాల ఎంఈవో 2 గణపతి, అసిస్టెంట్ ఏఎంఓ సుభాషిణి పాల్గొన్నారు. సిజేరియన్లు తగ్గించాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆమె వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భవతులపై దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు గర్భవతులను నమోదు చేయించాలన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను గుర్తించాలన్నారు. సిజేరియన్లను తగ్గించాలన్నారు. టీనేజీ గర్భవతుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. అబార్షన్లపై నిఘా పెట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమీక్షలో అధికారులు వెంకటప్రసాద్, అనిల్కుమార్, సుదర్శన్, ప్రవీణ, అనూషా, జార్జి, వేణుగోపాల్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విక్రమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకంలో నిరుద్యోగ యువతికి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఫ్రంట్ ఆఫీస్ అసొసియేట్, బ్రాడ్బాండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ హెయిర్ స్టైలిస్ట్, డొమెస్టిక్ ఐటీ హెల్ప్డెస్క్ అటెండెంట్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఎన్సీవీఈటీ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు సమీపంలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9959015657, 8686149492, 9866241270 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
అవయవదానంపై అవగాహన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : అవయవదానం పట్ల విద్యార్థులకు అవగాహన అవసరమని అపోలో యూనివర్సిటీ ఫిజియోథెరపీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రమ్యకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం పీసీఆర్, పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలల్లో అంగ్దాన్–జీవదాన్ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ అవయవదానం అంటే కేవలం శరీర భాగాలను మాత్రమే ఇవ్వడం కాదన్నారు. ఒక మనిషి మృతి చెందిన తర్వాత కూడా, అతని అవయవాలు మరొకరికి జీవితం ఇస్తాయన్నారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం అధ్యాపకులు అశోక్రెడ్డి మాట్లాడుతూ హృదయ స్పందన అర్ధంతరంగా ఆగిపోవచ్చు కానీ కాసింత ఆలోచన చేస్తే మరో మనిషి పంచన చేరి ఆ గుండే చేసే చప్పుడు వినవచ్చన్నారు. ప్రయాణం సగంలోనే ఆగిపోవచ్చు కానీ మిగిలిపోయిన ఆ ప్రయాణాన్ని అవయవదానంతో మరొకరి సాయంతో పూర్తిచేయొచ్చని పేర్కొన్నారు. ఒక మనిషి మృతి చెందినా మళ్లీ బతకవచ్చంటే అది కచ్చితంగా అవయవదానం వల్లే సాధ్యమవుతుందన్నారు. మృతి చెందిన అనంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, జీర్ణవ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చని తెలిపారు. బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి అవయవాలు సేకరిస్తారన్నారు. అవయవదానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమకు తెలిసిన వారందరికీ సమాచారం అందివ్వాలని తెలిపారు. అవయవదానం పై ఇప్పటికీ పలువురిలో అపోహలున్నాయన్నారు. ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదన్నారు. అవగాహన పెంచేందుకు అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం అవయవదానం ఎలా చేయాలి ? ఎవరెవరికి సాధ్యం ? నిబంధనలు ఏమిటి ? అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ డా.హసీనా, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ఎన్సీడీ సర్వే
బంగారుపాళెం: నాల్గవ విడత ఎన్సీడీ 4.ఓ సర్వే(నాన్కమ్యూనికబుల్ డిసీజస్)ని మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకేష్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ పద్మాంజలిదేవి ఆదేశించారు. గురువారం బంగారుపాళెంలోని ప్రభుత్వాస్పత్రిని వారు సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని ప్రసూతివార్డు, ల్యాబ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఎయిడ్స్ పరీక్ష, చికిత్స కేంద్రం, క్షయ నివారణ కేంద్రాలను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఎన్సీడీ వ్యాధులంటే ఒకరి నుంచి మరొక్కరికి సంక్రమించని జబ్చులని తెలిపారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్, లివర్, నరాల బలహీనత, కీళ్ల జబ్బులు, మానశిక వ్యాధులు వంటివి ఎన్సీడీ కిందకు వస్తాయన్నారు. ఇప్పటి వరకు మూడు వితలు సర్వే చేశారని, ప్రభుత్వం మరింత నిర్మాణాత్మకంగా 4.ఓ తీసుకొచ్చిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పటిష్టంగా సర్వే చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీషా, డాక్టర్లు శాలిని, విజయకుమారి, స్వరూప్నాయక్, చంద్రమోహన్, జశ్వంత్రాయల్ పాల్గొన్నారు. -
అలసత్వం వహిస్తే చర్యలు
జిల్లాలోని గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం): డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. సేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 1,500 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులున్నాయి. అలాగే చాలామంది క్లినిక్లోనే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5 వేల నుంచి రూ.లక్ష దాకా వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తారుమారు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు– 1940, ఫార్మసీ యాక్టు– 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదోరకమైన దందా.. జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటీబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్తో కొత్తరోగాల బారిన పడుతున్నారు. ఇక బెంగళూరు నుంచి పలు రకాల బ్రాండ్ల పేరుతో అనధికారికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇవీ తక్కువ రేటుకు ఇస్తుండడంతో మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. – 8లో– 8లోన్యూస్రీల్మీకు తల నొప్పి వస్తుందా?.. తరచూ జ్వరం బారినపడుతున్నారా?.. కడుపు, ఒళ్లు నొప్పులతో భరించ లేకపోతున్నారా?.. నిద్ర పట్టడం లేదా?.. మీకు భయమేమీ లేదు.. అనారోగ్య సమస్య గురించి చెబితే చాలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులు ఇచ్చేస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదో ఓ సారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం విమర్శలకు తావిస్తోంది.నిబంధనలు పాటించని మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు ఫిజీషియన్ శాంపిళ్లు, కాలం చెల్లిన మందుల అమ్మకాలు షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్టు తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న అమాయకులు కలెక్టర్ ఆదేశాలతో రెండు నెలలకు క్రితం చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధిలోని రెండు మెడికల్ షాపులపై డ్రగ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో విక్రయానికి అనుమతి లేని మందులను గుర్తించారు. మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని తెలుసుకున్నారు. దీంతో ఆ షాపును సీజ్ చేయగా..మరో షాపునకు నోటీసులు ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు.. ఇలా వందల సంఖ్యలో మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. -
యంత్రాలతో వ్యవసాయం సులభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): యంత్ర పరికరాలతోనే వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. చిత్తూరు మండలం, తుమ్మింద గ్రామంలో గురువారం దక్షిత క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరిరక్షణ సంస్థ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పరికరాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి యంత్రాల ఎంపిక, మరమ్మతులు, వాటి ఉపయోగాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వివిధ యాంత్రీకరణ పనిముట్ల మన్నికను పరీక్షించి వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు అందేటట్లు చూస్తామన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలెప్మెంట్ అధికారి గుణశేఖర్రెడ్డి, భాస్కర్, మండల వ్యవసాయశాఖ అధికారి వేణు పాల్గొన్నారు. -
మేమింతే!
నగరిలో డైయింగ్ యూనిట్ల యజమానులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రంగు నీళ్లను రోడ్లపై వదిలేస్తున్నారు. ఆర్థిక బకాయిలు చెల్లించండి చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఆర్థిక బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన చిత్తూరులో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలతో పాటు వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. మూడు నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు దాదాపు రూ.25 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. 12 రకాల ఉద్యోగుల సమస్యలను మూడు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేష్బాబు, కోశాధికారి దేవకుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బాలాజీరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపతిరెడ్డి, నాయకులు హరిప్రసాద్, మనోజ్, గౌరీశంకర్, మోహన్, దిలీప్ పాల్గొన్నారు. – 8లో -
ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం
షార్ కేంద్రం నుంచి ‘నిసార్’.. జీఎస్ఎల్వీ ఎఫ్–16 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ గగన తలంలోకి విజయవంతంగా దూసుకెళ్లడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశంలో మొట్టమొదటిసారి ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్ 102 ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లడంతో జయహో భారత్ అంటూ షార్లోని గ్యాలరీ వీక్షకుల కరతాళధ్వనులతో హోరెత్తింది. శాస్త్రవేత్తలకు దేశం నలుమూలల నుంచి అభినందనలు మిన్నంటాయి.● భూమి ఉపరితల పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం ● విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు ● భారత్–అమెరికా దేశాల సహకారంలో ఇదో మైలురాయి ● గ్యాలరీలో వీక్షకుల కేరింతలతో సందడి వీక్షకుల గ్యాలరీలో సందడి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్సెంటర్ షార్లో రెండో ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎప్16 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంద్ర, తమిళనాడు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు పది వేలమంది దాకా విచ్చేశారు. రాకెట్ ఎగురుతున్నంత సేపు జయహో భారత్,.. జయహో ఇస్రో... జయయో ఇస్రో అని నినాదాలు చేస్తూ జాతీయ జెండాను సగర్వంగా చూపించి సందడి చేశారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట రోడ్డులో కార్లు, స్కూల్ వ్యాన్లు, బస్సులు బారులు తీరి కనిపించాయి. అయితే షార్ కేంద్రం వారు ప్రతి రాకెట్ ఫ్రయోగాన్ని వీక్షించేందుకు అనువుగా శ్రీహరికోటలోనే ఒక ప్రత్యేక గాలరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాకెట్ నింగికేగుతున్న సమయంలో వీక్షకులు కొట్టిన చప్పట్లు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం విజయవంతం కావడంతో ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో–నాసా కలిసి చేసి మొదటి ప్రయోగాన్ని విజయవంతం చేయడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్కు ఇతర శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రపంచమే గర్వించదగిన రాకెట్ కేంద్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉండడం దేశానికి గర్వకారణమన్నారు. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్సూళ్లూరుపేట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయో గాన్ని 18.40 నిమిషాల్లోనే ముగించి 2,392 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి వాటికి వినియోగించుకునేందుకు ఈ డ్యూయెల్ సింథటిక్ అపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించా రు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) మొదటిసారిగా కలిసిన చేసిన ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రం నుంచి బుధవారం నిర్వహించిన జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగంతో జీఎస్ఎల్వీ సిరీస్లో 18 ప్రయోగాలను పూర్తి చేశారు. ఇస్రో ప్రయోగాల పరంపరలో ఎన్నో మైలురాళ్లు దాటినప్పటికీ వంద ప్రయోగాల మైలురాయిని దాటి 102 ప్రయోగాలను పూర్తి చేశారు. జీఎస్ఎల్వీ ఎఫ్–16 ప్రయోగ తీరును పరిశీలిస్తే.. జీఎస్ఎల్వీ ఎప్–16 రాకెట్కు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. 27.30 గంటల కౌంట్డౌన్ సమయంలో రాకెట్లోని లిక్విడ్ స్ట్రాపాన్ బూస్టర్లు, రెండోదశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను చేపట్టారు. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగాన్ని ప్రారంభించి 18.40 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే 0.00 నిమిషాలకు కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, రాకెట్కు చుట్టూరా ఉన్న నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి మొదటిదశను 152 సెకెండ్లకు పూర్తి చేశారు. మొదటి దశకు రెండో దశకు మధ్యలో రాకెట్ శిఖరభాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన హీట్షీల్డ్స్ 171.8 సెకెండ్లకు విడిపోయాయి. రాకెట్లోని రెండోదశను 149.6 సెకెండ్లకు మండించి 284.1 సెకెండ్లకు పూర్తి చేశారు. రాకెట్లోని మూడోదశ అంటే క్రయోజనిక్ దశను 294.06 సెకెండ్లకు మండించి 1100 సెకెండ్లకు కటాఫ్ చేశారు. ఆ తరువాత 1120 సెకెండ్లకు (18.40 నిమిషాలు) 2,292 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. -
అక్రమ కేసుల నుంచి బయట పడాలని పూజలు
కార్వేటినగరం : పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అణచివేత దిశగా రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల నుంచి త్వరగా బయటకు రావాలని బోయకొండ గంగమ్మకు కార్వేటినగరం మండల నాయకులు బుధవారం పూజలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాగుంట ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక సీఎం చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారని, ఇలాంటి అక్రమ కేసులకు ఎవరూ బయపడబోరని, కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం నేర్పుతారన్నారు. అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఎన్నికలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవాలని, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామిని కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను తొలగించడానికి బోయకొండ గంగమ్మ అండగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మునికృష్ణ, మండల కార్యదర్శి నందగోపాల్ శెట్టి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాపూజీరెడ్డి, పంచాయతీ రాజ్ మండల విభాగం ఉపాధ్యక్షుడు జేజేలురెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
డిప్యూటీ కమిషనర్ తనిఖీ
శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయి వద్ద నున్న ఎస్ఎన్జే డిస్లరీ ఫ్యాక్టరీని జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయకుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్లరీ ఫ్యాక్టరీ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు , సలహాలు అందించారు. ఆయన వెంట ఎకై ్సజ్ అధికారులు, ఫ్యాక్టరీ ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ, ఏజీఎం రవికుమార్, హెచ్ఆర్ గిరి పాల్గొన్నారు. ఇద్దరు సీఐలకు స్థాన చలనం చిత్తూరు అర్బన్ : జిల్లాలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను (సీఐ) అటాచ్మెంట్ ద్వారా బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వేకెంట్ రిజర్వులో ఉన్న జయరామయ్యను కల్లూరు, అక్కడ పనిచేస్తున్న సూర్యనారాయణను చిత్తూరు స్పెషల్ బ్రాంచ్కు బదిలీ చేశారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసేందుకు సీఎం ప్రత్యేక చొరవ చేపట్టాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2003 డీఎస్సీ టీచర్లకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. 2003 డీఎస్సీ టీచర్లు పాతపెన్షన్కు అన్ని విధాల అర్హులైనప్పటికీ నష్టపోతున్నారన్నారు. 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పాతపెన్షన్ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే తెలంగాణాలో ఇదే కేటగిరీకి చెందిన టీచర్లు, ఉద్యోగులకు పాతపెన్షన్ అమలు చేయాలని అక్కడి హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో సైతం సీపీఎస్ అమలు తేదీ సెప్టెంబర్ ఒకటి 2004 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ పాలనాపరమైన కారణాలతో సీపీఎస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు. సీఎం స్పందించి ఈ సమస్యను పరిష్కరించి 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
పరిహారం కోసం రైతుల ఆందోళన
● హంద్రీ–నీవా కాలువ కోసం భూములిచ్చిన రైతులు ● పది మంది రైతులకు అందని పరిహారం ● 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు ● పట్టించుకోని సీఎం చంద్రబాబునాయుడు గుడుపల్లె : చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా నీరు తీసుకువచ్చేందుకు కాలువ తవ్వారు. ఇందులో భాగంగా కుప్పం, గుడుపల్లె తదితర మండలాలకు చెందిన పలువురు రైతుల నుంచి భూమి సేకరించారు. గుడుపల్లె మండలం కాడేపల్లె, ఒంటిపల్లె గ్రామాలకు చెందిన 10 మంది రైతులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. పరిహారం కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం పనులను అడ్డుకున్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని భీష్మించారు. భూములకు పరిహారం అందని రైతులు హంద్రీ–నీవా కాలువకు భూములు కోల్పోయి పరిహారం అందని వారిలో పది మంది రైతులు వున్నారు. గోవిందమ్మకు సంబంధించి సర్వే నంబరు 60–1లలో 0.19 సెంట్ల భూమి, ఒక చింతచెట్టు, అలాగే 60–2లో 0.14 సెంట్లు, 60–3లో 0.17 సెంట్లు, 60–1లో 0.30 సెంట్ల భూమి తీసుకున్నారు. అలాగే సుందరప్పకు చెందిన భూమిలో సర్వేనంబర్ 60–2బిలో 0.17 సెంట్ల భూమి, బావి ఒకటి, 60–4బిలో 0.53 సెంట్లు, మునిరత్నంకు సంబంధించి సర్వే నంబర్ 61–3బిలో 0.07 సెంట్లు, లక్ష్మమ్మకు చెందిన 60–2బిలో 0.16 సెంట్లు, బోరు, టేకు చెట్లు 4, చింత చెట్లు 2, నీలగిరి చెట్లు 16, సాకమ్మకు సంబంధించిన సర్వేనంబర్ 60–2బిలో 0.12 సెంట్లు, చింతచెట్టు 1, చిగరచెట్లు 10, నాగప్పకు సంబంధించి సర్వే నంబర్ 61–6బిలో 0.21 సెంట్లు, 60–1లో 0.19 సెంట్లు, దేవేంద్రకు సంబంధించి సర్వే నంబర్ 26–1బిలో ఎకరా, 4 కొబ్బరి చెట్లు, చామంతి తోట 0.50 సెంట్లు, వెంకటప్పకు సంబంధించి సర్వేనంబర్ 22–సిలో 1.28 ఎకరాలు, సుందరప్ప సంబంధించి 63–1లో బావి ఉన్నాయి. వారికి ఎనిమిదేళ్లయినా పరిహారం ఇవ్వలేదు. భూములు కోల్పోయి పరిహారం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు, విజయవాడకు వెళ్లి మరీ అర్జీలు ఇచ్చినా పరిహారం అందలేదని బాధిత రైతులు వాపోతున్నారు.పట్టాదారు పుస్తకాలు లాక్కున్నారు హంద్రీ–నీవా కాలువకు భూములు సేకరించిన రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా లాక్కున్నారు. దీనివల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదు. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా వీలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం ఇవ్వకపోగా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తీసుకోవడంతో తాము అన్ని విధాలా నష్టపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి తమకు పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు -
కాపర్ తీగల దొంగల అరెస్టు
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం గంగమ్మ గుడిలో విగ్రహం, ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ తీగలను చోరీ చేసిన నిందితులను బుధవారం ఆరెస్టు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. గంగమ్మ గుడిలోని పంచలోహ విగ్రహాన్ని చోరీ చేసి పరారీలో ఉన్న దినేష్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిరంజీవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరే మండలంలో రైతుల పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలను దొంగతనం చేశారని నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేసి చిత్తూరు కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రైవేట్ బస్సు ఢీకొని యువకుడి మృతి
శ్రీరంగరాజపురం : మండలంలోని శ్రీరంగరాజపురం సచివాలయం వద్ద బుధవారం రాత్రి ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీ.ఎం.ఆర్.పురం ఎస్టీ కాలనీకి చెందిన లోకేష్ (24) ద్విచక్ర వాహనంలో శ్రీరంగరాజపురంలో ఉన్న దౌపదీ ధర్మరాజుల గుడి వద్దకు బయలుదేరాడు. చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారిలోని శ్రీరంగరాజపురం గ్రామ సచివాలయం వద్ద ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించినట్లు తెళిపారు. -
పీఠంపై వేట !
● చైర్మన్ గిరికి పోటాపోటీ ● కాణిపాకం చైర్మన్ పదవిపై పలువురి ఆసక్తి ● మాజీ చైర్మన్కే మళ్లీ పగ్గాలంటూ ప్రచారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం కాణిపాకం : కాణిపాక క్షేత్ర చైర్మన్ కుర్చీపై టెన్షన్ మొ దలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్ కుర్చీపై పలువురు ఎక్కుపెట్టారు. ఆశావహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. కొత్త ముఖాలు పుట్టుకొస్తున్నాయి.(టీడీపీకి చెందిన) మాజీ చైర్మన్కే మళ్లీ పద వి అంటూ మరోవైపు ప్రచారం జోరందుకుంది. మరో వైపు పలుకుబడి ఉన్నవాళ్లకు ఇస్తే మేలంటూ పలువు రు కూటమి నేతలు, ఉభయదారులు యోచిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఖరారు కావడంతో చైర్మన్ ప్రకటన వచ్చే నెల ఉంటుందనే విషయం ఆశావహులతో పాటు కాణిపాక భక్తుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. జిల్లాలో కాణిపాకంలో స్వయంభుగా వెలసిన శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. నిత్యం వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు ఆలయానికి కానుక రూపంలో వస్తుంటాయి. అయితే ఐదేళ్ల కాలంలో ఆలయం అడుగడుగునా అభివృద్ధి పరుచుకుంది. ఈ అభివృద్ధితో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, కానుకలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం భక్తుల సంఖ్య 10 వేల నుంచి 30 వేలు దాటుతోంది. ఈ స్థాయిలో ఉండే ఆలయానికి...చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. చైర్మన్ రాజీనామాతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ఉన్న చైర్మన్గా ఉన్న మోహన్రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసి ఏడాది కాలం దాటినా ఇంత వరకు కూటమి ప్రభుత్వం ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతోంది. కొత్త పాలకవర్గంతో పాటు చైర్మన్ను ప్రకటించలేకపోతోంది. ఈ విషయాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ...జాప్యం చేస్తూ వస్తోంది. ఈజాప్యంతో చైర్మన్ పదవికి పోటీపడేవారి సంఖ్య పెరిగింది. కూటమిలోని కొందరు నేతలు నీకా..నాకా అంటూ పోటీ పడుతున్నారు. ఇన్నాళ్లు నలుగురు మాత్రమే అనుకుంటే...ఇప్పుడు మరి కొంత మంది పోటీపడుతున్నట్లు కాణిపాక వాసులు చెబుతున్నారు. స్థానికులకే అవకాశం ఇవ్వాలని.. చైర్మన్ పదవిని స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అందుకు కట్టుబడి చైర్మన్ పదవిని ఇవ్వాలని పలువురు కూటమి నేతలు, ఉభయదారులు, కాణిపాక వాసులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ చైర్మన్కే..చైర్మన్ పదవి అంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు బడా నేతలు కూడా మాజీకే కుర్చీ అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే కూటమిలోని ఓ వర్గం మాత్రం మాజీకి రాకూడదని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు నేతలు మాజీ చైర్మన్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ నలుగురు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తెలిసిన మంత్రులు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ వద్ద సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖాలు తెరపైకి.. ఇన్నాళ్లు ఆ నలుగురే పోటీ అనుకున్నారు. ఇప్పుడు మరో కొంత మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ఐరాల మండలానికి చెందిన ఓ కూటమి నేత పేరు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ నేత తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారని, దీంతో ఆ నేత భార్యకు చైర్మన్ సీటు అడుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే బెంగుళూరులో స్థిరపడి, ఆర్థికంగా బలపడిన ఓ బడా నేత కూడా తెరపైకి వచ్చారు. ఆ నేత ఇటీవలే అధిష్టానంను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు వారికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైర్మన్ కుర్చీ ఎవరికి ఇస్తారో అని పలువురు ఎదురుచూస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందే..? కూటమి అధికారంలోకి వచ్చాక ఒక బ్రహ్మోత్సవం ముగిసింది. మరో బ్రహ్మోత్సవానికి ముహూర్తం ఖ రారైంది. కాణిపాకంలో ఆగస్టు 27వతేదీ నుంచి బ్ర హ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లు ఇదిగో..అదిగో అంటూ పాల క వర్గంపై ఆశలు నిరాశలయ్యాయి. పాలకవర్గం ప్ర కటింపు విషయంలో ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటోంది. బ్రహ్మోత్సవ ప్రారంభం వారానికి ముందు పాలకవర్గ ప్రకటన ఉండబోతుందనే ప్రచారం జ రుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు తెగ టెన్ష న్ పడిపోతున్నారు. చాలా మంది మాజీ చైర్మన్కే కు ర్చీ ఇస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే పలువురు కూటమి నేతలు, ఉభయదారులు, అధికారులు ఆర్థికంగా బలమైన నాయకులకు ఇస్తే..ఆలయ అభివృద్ధికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ రకంగానే వారి అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందని వారు ఎదురుచూస్తున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
యాదమరి : ప్రతి బాంబు బెదిరింపు కాల్స్ను నిజమైందిగా భావించి వెంటనే స్పందించాలని ఎట్టి పరిస్థితిల్లోనూ అశ్రద్ధ వహించరాదని అడిషనల్ ఎస్పీ శివానందకిషోర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐఓసీఎల్లో బాంబు స్క్వాడ్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు ముప్పు ఎదురైనప్పుడు సమర్థవంతంగా, శాసీ్త్రయంగా స్పందించే విధంగా అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఐఓసీఎల్ వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండటమే లక్ష్యంగా మాక్డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా డ్రిల్లుతో పోలీసు సిబ్బంది స్పందన వేగాన్ని పరీక్షించడం, పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమన్నారు. అలాగే ఐఓసీఎల్ వంటి కీలక స్థలాల్లో ఎప్పటికప్పుడు భద్రతా వ్యవస్థను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ భాష, ఎస్సై ఈశ్వర్, తహసీల్దార్ పార్థసారథి, ఐఓసీఎల్ సీటీఎం ప్రసాదరావు పాల్గొన్నారు. -
సఖ్యత లేకనే వివాదాలు
చిత్తూరు కలెక్టరేట్ : పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేకనే వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని డీఆర్వో మోహన్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా విభిన్న ప్రతిభావంతులశాఖ ఆధ్వర్యంలో ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007, ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం 2019పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన, సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్డీవో అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సీనియర్ సిటిజన్, తల్లిదండ్రులకు ఆహారం, వైద్యం, వసతి తదితర ప్రాథమిక అవసరాలను తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. ఎవరైనా విస్మరిస్తే చట్టం ప్రకారం మూడు నెలల జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తారన్నారు. తల్లిదండ్రుల సంక్షేమం వారసులదే తల్లిదండ్రుల సంక్షేమం వారసులదేనని సీనియర్ న్యాయవాది హిమబిందు అన్నారు. వృద్ధులు, తల్లిదండ్రులు తాము పొందాల్సిన హక్కులకు భంగం కలిగితే ఆర్డీవో పరిధిలోని ట్రిబ్యునల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓరియెంటేషన్ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డీఈవో వరలక్ష్మి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ ఉమాదేవి పాల్గొన్నారు. -
పీ–4పై వేధింపులు దారుణం
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వి.కోట : సూపర్ ీసిక్స్ హామీల అమలు లో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజ ల దృష్టిని మరల్చేందుకే ‘‘పూర్టూ రిచ్’’అనే పేరుతో పేదలను ధనికులు దత్తత తీసుకోవాలంటూ పీ–4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం మండలంలోని పి.కొత్తూరు క్యాంపు కార్యాల యంలో జెడ్పీ చైర్మన్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జీరో పావర్టీ పీ–4 కార్యక్రమం అధికారు లు, ప్రభుత్వ ఉద్యోగులకు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం 24 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ సిబ్బందికి పేద కు టుంబాల దత్తత కోసం కాల పరిమితిని విధించి టారెగ్ట్లు విధించడం ఏమిటని ప్రశ్నించారు. జీరో పావర్టీ (పీ–4) కార్యక్రమం పేరుతో ప్రతి హెచ్ఎం, టీచర్లు బంగారు కు టుంబాలను దత్తత తీసుకుని ఆన్లైన్ లో రిజిష్టర్ చేయాలని ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు. చిరుద్యోగులు, ఉ పాధ్యాయులకు జీతాలే సక్రమంగా ఇ వ్వని నేపథ్యంలో వారిని నిర్బంధం చే యడం అన్యాయమన్నారు. ఈనెల 31వ తేదీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఖరారై న నేపథ్యంలో ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం దారుణమన్నారు. హెలీప్యాడ్ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, అభిమానులు తరలిరావడానికి అవకాశం లేదని, ర్యాలీగా వెళ్లొద్దని వివిధ ఆంక్షలతో వైఎస్సార్సీపీ నేతలకు నోటిసులు ఇవ్వడంపై జెడ్పీ చైర్మన్ మండిపడ్డారు. -
ఇదీ ఎన్నికల హామీ
కాణిపాకం : మహిళలకు ఉచిత బస్సు హామీ మాటల గారడీలా కనిపిస్తోంది. ఉచితం కేవలం పల్లె వెలుగును మాత్రమే పరిమితం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్త ప్రయాణంతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల ప్రయాణం ఉండదనే అనుమానాలు మహిళల్లో వ్యక్తం అవుతోంది. దీనికి తోడు డ్రైవర్, కండక్టర్, బస్సులు కొరత వేధిస్తోంది. పల్లెకు అరకొర సేవలతో నెట్టుకొస్తున్నారు. పల్లె వెలుగులో డొక్కు బస్సులు, కాలం చెల్లినవే ఉన్నాయని, ఆంక్షలు లేని ఉచిత బస్సును ప్రవేశ పెట్టాలని మహిళలు కోరుతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా.. ప్రస్తుతం జిల్లాలో 1.20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మరో 10 నుంచి 20 శాతం మంది అధికంగా ప్రయాణించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి నివేదికలను పంపారు. అయితే ఆ దిశగా బస్సుల సంఖ్య పెంచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉన్న బస్సులు సైతం ఉచితానికి మొరాయిస్తున్నాయి. అల్ట్రా బస్సులు ఉచితంలో చేర్చిన జిల్లాలో ఆ బస్సులు లేవు. అలాగే ఒక్క సిటీ బస్సు కూడా తిరగడం లేదు. ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా ఉచితానికి ఇవ్వరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అరకొర అని చెప్పవచ్చు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్త ఉచిత ప్రయాణానికి ఎసరు పెడుతున్నారని పలువురు మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. బస్సు కండీషన్ అంతంతే.... గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న బస్సుల్లో చాలా వరకు కండీషన్లో లేవు. కాలం చెల్లాయి. కుప్పం, పలమనేరు, చిత్తూరు వన్ వంటి డిపోల్లో బస్సులు డొక్కు బడ్డాయి. ఎక్కడిక్కడికి నిలిచిపోతున్నాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటనలు చూస్తున్నాం. మరోవైపు డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెకు బస్సులు కరువు జిల్లా వ్యాప్తంగా 697 పంచాయతీలుంటే వీటి కింద సుమారు 6 వేల గ్రామాలున్నాయి. ఆర్టీసీ నష్టాలను సాకుచూపి కేవలం 164 రూట్లల్లో మాత్రమే బస్సులను తిప్పుతున్నాయి. ఈ మార్గాల్లోని 708 గ్రామాలకు మాత్రమే పల్లె వెలుగు సేవలు అందుతున్నాయి. మిగిలిన గ్రామాలకు పల్లె వెలుగు సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాల ప్రజలు ఆటోలపై ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు బడులు, కళాశాలకు వెళ్లడానికి కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలలో ప్రమాదకరంగా ప్రయణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే ఈ పథకం అమలు పరిమితం కానుంది. సరిపడా బస్సులు ఏవీ? జిల్లావ్యాప్తంగా 5 ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో మొత్తం 463 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 392, అద్దె బస్సులు 71 దాకా నడుస్తున్నాయి. వీటిలోఆర్టీసీకి సంబంధించిన పల్లె వెలుగు బస్సులు 232, అద్దె బస్సుల కింద 35 పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయి. ఇవే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం, రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్టీసీ సర్వీసులపై గతేడాదిగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణమంటే కొంత ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం మహిళలు 11,49,661 మంది ఉన్నారు. ఇంత మంది మహిళలున్నా కేవలం 232 పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఉచిత సదుపాయం ఇవ్వడమేంటని మహిళామణులు ప్రశ్నిస్తున్నారు.ఉచిత బస్సుకు కండీషన్లు పెట్టొద్దు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామంది. ఈ మేరకు ఉచిత బస్సును అమలు చేయాలి. మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుల సౌకర్యం కల్పించాలి. పల్లె వెలుగు మాత్రమే పరిమితం చేయకుండా..అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. – కోకిల, కుప్పం ఉచితంపై వెనుకడుగు వేయొద్దు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది నెరవేర్చాలి. ఉచిత బస్సు విషయంలో వెనకడుగు వద్దు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా బస్సు సౌకర్యం కల్పించాలి. కొన్ని బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని సర్దుబాటు చేయొద్దు. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. ఆటోల ప్రయాణంతో అవస్థలు పడుతున్నాం. – సరిత, యాదమరి ● వేధిస్తున్న బస్సుల కొరత ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామంటున్న ప్రభుత్వం కేవలం పల్లె వెలుగు బస్సులకే పరిమితమా? జిల్లా వరకే పరిమితం చేయనున్న వైనం ఉచితం ఉమ్మడి జిల్లాకు కూడా అనుమానమే! అరకొరగానే సిబ్బంది మాట తప్పొద్దంటున్న మహిళలు ఏడాదిగా ఊరిస్తూ.. సూపర్–6లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమన్న హామీని ఏదాది దాటినా అమలు చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. గత కొంత కాలంగా ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభిస్తామని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు అమలుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలు పెట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి తిరిగి రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే సదుపాయం ఉంటుందని అక్కడక్కడా చెబుతుండడంపై మహిళలు అసహనం వ్యక్తం చేసున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు హామీలపై ఆంక్షలు పెట్టారని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరువ్యాపారాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న ఒకటి అర పల్లె వెలుగు బస్సులో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు.. -
నూతన రోడ్డు ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్ : రూ.5 కోట్ల వ్యయంతో నగరంలోని అంబేడ్కర్ భవన్ నుంచి జ్యోతిరావ్ పూలే భవనం వరకు 3.01 కిలోమీటర్ రోడ్డును మంగళవారం కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం కావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. కట్టమంచి బైపాస్ రోడ్డు పనులకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభించనున్నామన్నారు. వీటితో పాటు కొంగారెడ్డిపల్లె, కట్టమంచి, హైరోడ్డు, ఇరువారం రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రమాదాల జోన్లో ఉంది : దేశంలో ప్రమాదాలు జరుగుతున్న టాప్ 100 జిల్లాలో చిత్తూరు జిల్లా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రయాణాల్లో హెల్మెట్ వాడాలని ఎంత చెబుతున్నా ఎవరూ పాటించడం లేదన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 300 మందికి పైగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. -
ఆలయ పనులపై పెత్తనం
● ఆలయ పునఃనిర్మాణ పనులను అడ్డుకున్న టీడీపీ నేత ● ఎమ్మెల్యే అనుమతి లేకుండా పనులొద్దంటూ హెచ్చరికలు ● మాజీ ఎమ్మెల్యే సొంత నిధులతో ఆలయ నిర్మాణం ● జనంలో పేరొస్తుందని అడ్డగింత ● ఆగిన చౌడేశ్వరమ్మ ఆలయ పునఃనిర్మాణ పనులు పలమనేరు/వీకోట : ఆ గ్రామంలో పురాతన ఆలయం. గతంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు దూప దీప నైవేద్యాలకు దూరమైంది. ఆ ఆలయాన్ని పునఃనిర్మించాలని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పూనుకున్నారు. గ్రామపెద్దల ఆదేశాల మేరకు కోటి రూపాయలతో సొంతంగా ఆలయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద పనులు చేస్తుండగా మాజీ ఎమ్మెల్యేకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన ఆ మండల టీడీపీ నేతలు గుడి నిర్మాణ పనులను చేయొద్దంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఈ సంఘటన పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలం తోటకనుమ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. పురాతన చౌడేశ్వరి ఆలయం తోటకనుమ గ్రామంలో 50 ఏళ్ల కిందట చౌడేశ్వరీదేవి, పటాలమ్మ దేవతగా పిలువబడే ఆలయం ఉంది. ఇక్కడ తరచూ పూజలు విజయ దశమికి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయానికి వంశపారంపర్య అర్చక కుటుంబం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటేగౌడ గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆ ప్రాంత వాసులు ఆలయాన్ని పునఃనిర్మించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే విల్లింగ్ లెటర్ లేదని.. ఆలయాన్ని నిర్మించాలంటే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి విల్లింగ్ లెటర్ లేదనే సాకుతో ఈ పనులకు కుటమి పాలనలో అక్కడి నేతల ద్వారా బ్రేక్ పడింది. దీనిపై గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేను సంప్రదించడంతో ఆయన రూ.కోటి నిధులతో తాను, దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఈ ఏడాది మే నెల 26న తాను చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బును వెనక్కివ్వాలని తామే సొంతంగా ఆలయాన్ని నిర్మించుకుంటామని ఎండోమెంట్ అధికారులకు లేఖ రాశారు. దీనిపై 11.06.25 చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు ఆ శాఖ కమిషనర్కు లెటర్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రొసెస్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎండోమెంట్ నుంచి ఆలయ నిర్మాణానికి చర్యలు గ్రామస్తుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే 08.01.24లో ఎండోమెంట్ వారికి ఆలయ నిర్మాణం కోసం అనుమతి కోరారు. దీనిపై ప్రొసెస్ జరిగింది. గుడి నిర్మాణానికి రూ.కోటి అవసరం అవుతుందని ఇందు కోసం సీజీఎఫ్ (కామన్గుడ్ఫండ్) ద్వారా కాంట్రిబ్యూషన్గా రూ.15 లక్షలు జాయింట్ ఖాతాగా చెల్లించాలని ఎండోమెంట్ నుంచి ఆదేశాలందాయి. ఆ మేరకు ఆలయ చెర్మన్గా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆ డబ్బును యూబీఐ బ్యాంకులో జమ చేసి ఇందుకు సంబంధించిన ఫైల్ను పంపారు. ఈ తరుణంలోనే ఎన్నికలు రావడంతో నోటిఫికేషన్ దశలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆలయ నిర్మాణంలో రాజకీయ జోక్యం తమ సొంత గ్రామంలో అమ్మవారి గుడి పునర్ నిర్మాణం కోసం గతంలో ఎండోమెంట్ ద్వారా ప్రయత్నించాం. కుదరకపోవడంతో తాను దాతల సాయంతో ఆలయాన్ని నిర్మించేందుకు ఎండోమెంట్తోనూ పనిలేదు. కానీ ఎక్కడ మాకు మంచి పేరొస్తుందోనని వీ కోటకు చెందిన టీడీపీ నేత రంగనాథ్ ఆలయ పనులు నిలిపేయాలని, ఏ పని కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలని చెప్పడం బాధాకరం. దీన్నంతా జనం చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఆ చౌడేశ్వరమ్మే చూసుకుంటుంది. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు సొంత నిధులతో నిర్మిస్తే పేరొస్తుందని.. ఎండోమెంట్ ద్వారా కాకుండా ఆలయ నిర్మాణాన్ని సొంతంగా చేపట్టాలని రెండురోజుల కిందట మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పనులను మొదలు పెట్టారు. దీన్ని తెలుసుకున్న ఆ మండల టీడీపీ నేత రంగనాథ్ అక్కడ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్, పనులు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్ను బెదిరించారు. స్థానిక ఎమ్మెల్యే అమరన్న మాట లేంది ఎలా పనులు చేస్తారంటూ బెదిరించి పనులు ఆపివేశారు. ఇది ఆ గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆలయ నిర్మాణ విషయంలోనూ కూటమి నేతల రాజకీయాన్ని జనం సహించలేకపోతున్నారు. ఈ విషయమై మదనపల్లి టెంపుల్ ఇన్స్పెక్టర్ శశికుమార్ను వివరణ కోరగా గతంలో చౌడేశ్వరి ఆలయానికి సంబంధించిన ప్రొసెస్ జరిగిన మాట నిజమేనన్నారు. అయితే నోటిఫికేన్ దశలో ఆగిందన్నారు. ఇప్పుడు ఆలయ చైర్మన్ తమశాఖ ద్వారా వద్దని సొంతంగా ఆలయాన్ని నిర్మించుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే విల్లింగ్ అవసరంలేదన్నారు. వారు బ్యాంకులో చెల్లించిన డబ్బు సైతం వెనక్కిరావడం జరుగుతుందని తెలిపారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
– 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం గుడుపల్లె : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. మంగళవారం గుడుపల్లె పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంగళవారం పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నంబరు ప్లేట్లు లేని వాహనాలు వేగంగా వస్తుండడంతో పట్టుకుని విచారించామన్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన అరుణ్కుమార్, హరి, మోహన్, మణిగండన్, ముకేష్, దినేష్ అనే ఆరుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారన్నారు. వీరిని విచారించగా వివిధ ప్రదేశాలలో 18 ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందికి ప్రోత్సాకాలు అందించారు. వాహనాల యాజమానులను గుర్తించి వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు మల్లేష్యాదవ్, శంకరయ్య, ఎస్ఐలు శ్రీనివాసులు, నరేష్, వెంకట మోహన్ పాల్గొన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లెలో ఇటీవల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ పరశురాముడు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లెకు చెందిన మహేష్ అలియాస్ మాలిక్ పుంగనూరు రహదారిలో దుస్తుల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడన్నారు. సమీపంలోని దుకాణాల్లో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతుండటంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు. ఈనెల 23, 26 తేదీల్లో ఏఎన్ ప్యాన్సీ స్టోర్లో రూ.10 వేలు, గాయిత్రీ టీ దుకాణంలో వెండి, బంగారం చోరీ చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివరాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద చోరీ చేసిన వస్తువులను రికవరీ చేసినట్లు చెప్పారు. -
బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పలమనేరు : బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక కొత్తపేట ముత్తాచారి పాళ్యానికి చెందిన జయరాముని కుమారుడు రారాజు(19) చదువు పూర్తి చేసి మండలంలోని ఓ పాల డెయిరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు బైక్ కావాలని ఇంట్లో వారిని అడిగినట్టు తెలిసింది. అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చాక తీసుకోవచ్చులేనని వారు చెప్పారు. దీనిపై కలత చెంది మంగళవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొద్దున గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్చార్జి ఎస్ఏఓగా శ్రీనివాసులు చిత్తూరు కార్పొరేషన్ : ట్రాన్స్కో చిత్తూరు జిల్లా ఏఓ ప్రసన్న ఆంజనేయులు పదోన్నతిపై కడప జిల్లా ఎస్ఏఓగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో తిరుపతి జిల్లా ఎస్ఏఓ శ్రీనివాసులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం మత్తులో మహిళపై దాడి గంగాధర నెల్లూరు : మండలానికి చెందిన ఓ మాజీ సైనికుడు మద్యం మత్తులో కట్టకిందపల్లి గ్రామంలోని మహిళపై తీవ్రంగా దుర్భాషలాడి చేయిచేసుకుని అడ్డొచ్చిన బంధువులపై దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. కట్టకింద పల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రజిని మద్యం తాగి గ్రామంలోని చిన్నమ్మ అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడాడి ప్రశ్నించిన మహిళపై చేయి చేసుకోగా అడ్డొచ్చిన గ్రామస్తులపై దాడి చేశారని తెలిపారు. చిన్నమ్మకు సహాయంగా వచ్చిన గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, చిరంజీవి, రాజా, వెంకటేష్పై రజిని,అతని సహాయకులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. చిన్నమ్మ కుమార్తె మాధవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన మాజీ సైనికుడు రజినితో పాటు సహచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసంతి తెలిపారు. -
కిలో మామిడికి రూ.12 చెల్లించాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు కిలోకు రూ.12 కచ్చితంగా చెల్లించాల్సిందేనని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు మంగళవారం కలెక్టర్ను కలిసి పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ ప్రభుత్వ నిర్ణయం ఉల్లంఘించి రూ.12 అమలు చేయని ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపు నిర్వాహకులపై కఠిన చర్యలుంటాయని వెల్లడించారన్నారు. వారి నిర్ణయం మేరకు ప్రభుత్వం వెంటనే తోతాపురి కి ప్రకటించిన మద్ధతు ధర రూ.12 సత్వరం రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆనందనాయుడు, ప్రధాన కార్యదర్శి హరిబాబుచౌదరి, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు మునీశ్వరరెడ్డి, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టెండర్ లేకుండానే పనులా?
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండుకు సంబంధించిన స్థలం. గతంలో ఇక్కడ వేసిన రోడ్డుకు ఆర్టీసీ సంస్థ నుంచే నిధులు కేటాయించారు. పిలవని పేరంటానికి తామున్నామంటూ ప్రస్తుతం దాదాపు రూ.45 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఫుట్పాత్ నిర్మిస్తోంది. రూ.45 లక్షలు ఏ మురికివాడ అభివృద్ధి, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులకో వెచ్చిస్తే పన్నులు చెల్లించే ప్రజలు హర్షిస్తారు. ఇక ఈ పనులు చేయడానికి కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్లు పిలవగా, మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది. ఆపై ఎవరెవరు టెండర్లు వేసారో చూసి, తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనులు అప్పగించాలి. నెల్లూరులోని పబ్లిక్ హెల్త్ ఎస్ఈ నుంచి అనుమతి పొందాలి. వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. ఇవన్నీ జరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. అసలు ఆన్లైన్ టెండర్లు తెరవకుండానే, టెండరు ఎవరికి వచ్చాయో తెలియకుండా పనులు చేసేస్తున్నారు. కార్పొరేషన్ ఏఈఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం విశేషం. చిత్తూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ నిధుల్లోని దాదాపు రూ.43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రహరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హై రోడ్డు విస్తరణపై ప్రభుత్వం నుంచి పరిహారంపై ఎలాంటి ప్రకటన రాకమునుపే.. కొంగారెడ్డిపల్లె రోడ్డు విస్తరణ తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా అత్యవసరంగా రూ.43 లక్షలతో నిర్మిస్తున్న ఈ పనులకు కార్పొరేషన్లోని ఏ నిధులు వెచ్చించాలి..? అంచనాలు ఎంత..? ఆన్లైన్ టెండరు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలి..? ఇలాంటి ఏ ఒక్క నిబంధన పట్టించుకోకుండా ప్రజాధనం నిబంధనలకు విరుద్ధంగా వెచ్చిస్తున్నారు. లెటర్ ఇస్తే సరిపోతుందా..? అభివృద్ధి పనుల విషయంలో ఆన్లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది పోటీపడితే.. స్వయాన ఇంజినీరింగ్ అధికారులు దళారులుగా అవతారం ఎత్తుతున్నారు. టెండరు వచ్చిన వ్యక్తి నుంచి పలు కారణాలతో తాను ఈ పని చేయలేకపోతున్నానంటూ లెటర్లు తీసుకుంటున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్దం. కానీ అధికారులు ఏమాత్రం వీటిని పట్టించుకోవడంలేదు. కార్పొరేషన్లో టెండర్ల వ్యవహారంలో దాదాపు అధికార పార్టీ నాయకులే పాల్గొంటున్నారు. ఎవరికి టెండరు వస్తే వాళ్లు పనులు చేసుకోవచ్చు. కానీ ఇలా టెండర్లు పూర్తవకుండానే పనులు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పొరపాట్లను సరిదిద్దుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. రూ.కోట్ల పనులు నామినేట్గా తమ్ముళ్లకే నిబంధనలు గాలికి.. ఇష్టానుసారంగా పనులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టారాజ్యం టెండర్ లేకుండానే తమ్ముళ్లకు పనుల పంపకాలు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సివిల్ పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. తమ అనుచరులకు పనులు కట్టబెట్టడానికి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేయడం, వీటిని అమలు చేయడంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రూ.లక్ష దాటిన ప్రతి ఒక్క పనికి ఆన్లైన్ టెండరు పిలవాల్సి ఉంది. కానీ ఎలాంటి టెండర్లు లేకుండానే నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.కోట్ల వ్యయంతో పనులు చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో..? రేపు టెండర్లలో పోటీ వస్తే ఏం చేయాలి..? సరైన పత్రాలు లేకుండా టెండరు తిరస్కరణకు గురైతే పరిస్థితి ఏంటి..? అనే విషయలపై అధికారులు ఏమాత్రం ఆలోచించడంలేదు. తప్పని తేలితే చర్యలు అభివృద్ధి పనుల్లో నిబంధనలు పాటించకుండా ఉండటం అంటూ ఏమీ లేదు. కొన్ని పనులు కౌన్సిల్ ముందస్తు అనుమతితో అత్యవసర దృష్ట్యా చేయిస్తున్నాం. వాటర్ వర్క్స్, లైట్స్, టాయ్లెట్స్ అనేవి అత్యవసరం. నామినేటెడ్ పనులు ప్రత్యేకించి ఒకరికి ఇవ్వడంలేదు. టెండర్ల దశలో ఉన్న అంశాలకు ముందస్తుగానే పనులు ప్రారంభించడం నా దృష్టికి రాలేదు. దీనిపై ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంజాయిషీ తీసుకుంటా. తప్పని తేలితే చర్యలు తీసుకుంటాం. – నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తాం కార్పొరేషన్ అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. టెండర్లు పూర్తవకుండానే పనులు చేయడం చట్ట విరుద్దం. అలాంటప్పుడు మీకు నచ్చినవాళ్లకు పనులు అప్పగించుకోండి. టెండర్లు ఎందుకు పిలవడం. నగర అభివృద్ధిని మా పార్టీ ఎప్పుడూ స్వాగతిస్తుంది. కానీ అదే సమయంలో నిబంధనలు పాటించకుండా అంతా మా ఇష్టం అంటే కుదరదు. నాయకులు చెప్పారని అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తే, రేపు దోషులుగా నిలబడేది అధికారులే. విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తాం. – ఎంసీ.విజయానందరెడ్డి, చిత్తూరు సమన్వయకర్త, వైఎస్సార్సీపీ -
జగనన్నను కలిసిన మాజీ మంత్రి రోజా
నగరి : మాజీ సీఎం వైఎస్ జగన్ను మాజీ మంత్రి ఆర్కేరోజా మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. పలువురు సీఐలకు స్థాన చలనం చిత్తూరు అర్బన్ : జిల్లాలో పలువురు ఇన్స్పెక్టర్లను (సీఐ) అటాచ్మెంట్పై బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ చందోలు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు ట్రాఫిక్లో పనిచేస్తున్న జి.నిత్యబాబును చిత్తూరు తూర్పు (తాలూక), తాలూకలో పనిచేస్తున్న బి.శ్రీనివాసరావును చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్, వేకెంట్ రిజర్వు (వీఆర్)లో ఉన్న కె.లక్ష్మీనారాయణను చిత్తూరు ట్రాఫిక్, మహిళా స్టేషన్లో పనిచేస్తూ, వన్టౌన్లో అదనపు విధులు నిర్వర్తిస్తున్న సీఐ ఎం.మహేశ్వరను వన్టౌన్కే పరి మితం చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీటీసీ ఎన్నిక షెడ్యూల్ జారీ చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని రామకుప్పం మండలం మనేంద్రం ప్రాంతం ఎంపీటీసీ ఎన్నిక షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల అధికారి నీలంసాహ్ని జారీ చేశారని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవార జెడ్పీ కార్యాలయంలో వివరాలను తెలియజేశారు. గతంలో ఆ ప్రాంతం ఎంపీటీసీగా ఉన్న శాంతికుమారి చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడిందని గుర్తు చేశారు. 30న నామినేషన్ దాఖలు, ఆగస్టు 1న స్వీకరణకు చివరి రోజు, 2న పరిశీలన, 3 అప్పిల్, 4న అప్పిళ్ల పరిష్కారం, 5న నామినేషన్ ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన, 12న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు తదుపరి విజేతల ప్రకటన ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ పనులు చేపట్టామని వివరించారు. పది రోజుల్లో మార్పు చూపాలి చౌడేపల్లె : స్కూల్కు పది రోజుల తరువాత మళ్లీ వస్తా.. వంట గది మార్చాలి... కట్టెల పొయ్యిపై బదులు గ్యాస్పై మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతగా చేయాలని డీఈఓ వరలక్ష్మి వంట నిర్వాహకులు, హెచ్ఎంను హెచ్చరించారు. మంగళవారం చౌడేపల్లె ఉన్నత పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తిని రుచి చూశారు. గ్యాస్ పొయ్యిపై వంట చేయకుండా కట్టెల పొయ్యిపై ఎందుకు చేస్తున్నారు.? కచ్చితంగా గ్యాస్ పొయ్యిపై వంట చేయాలని వంట నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం కూరగాయలు, పప్పు వినియోగించాలని నాణ్యత పాటించాలని ఆదేశించారు. వంట గది పరిశుభ్రత పాటించలేదని, వంట నిర్వహణ ప్రదేశాన్ని మార్పుచేయాలని హెచ్ఎం నాగరాజరెడ్డికి సూచించారు. ఉన్నత పాఠశాల ఆవరణంలో నాడు–నేడు ద్వారా గత ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా మిగిలిన తరగతి గదుల నిర్మాణ పనులకు నిధులు మంజూరునకు కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న ‘పది’పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని డీఈఓ సూచించారు. ఆమె వెంట ఎంఈఓ–2 తిరుమలమ్మ, సీఆర్పీలు ఉన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కార్వేటినగరం : మండల కేంద్రంలోని ఆర్కేఎస్సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్వరూప పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యలో ఖాళీగా ఉన్న ఎంఎల్టీ కోర్సు బోధించడానికి అతిథి అధ్యాపకులు అవసరమన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మెడికల్ గ్రాడ్యుయేట్స్ లేదా ఎంఎస్సీ మైక్రో బయాలజీలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆగష్టు 1వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. -
బెయిల్ రావాలంటూ పూజలు
చౌడేపల్లె : అక్రమ కేసులో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ స్థానిక క మలాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ బోయకొండ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, పార్టీ నేతలు కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పే రిట ప్రత్యేక అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అక్ర మ కేసుల నుంచి ఎంపీ మిథున్రెడ్డి త్వరగా కడిగిన ముత్యంలా బయటకు రావాలంటూ పూజలు చేశా రు. కార్యక్రమంలో సర్పంచులు షంషీర్ం, వరుణ్ నా యకులు ఠాణాధార్ నాగరాజ, వెంకట రమణ, అమరనాథ్, పవన్, భాస్కర్, హరీష్, విజయ్, కృష్ణారెడ్డి, బాబు, చంద్రశేఖర్, మంజునాథ్, తదితరులున్నారు. -
మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడాలి
చిత్తూరు లీగల్ : మానవ అక్రమ రవాణా నివారణకు పోలీస్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. మంగళవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని న్యాయసేవా సదన్ భవనంలో పోలీసులు, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇతర మాయ మాటలు చెప్పి పలుచోట్ల అపహరించి.. ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. కొన్ని ఘటనల్లో అక్రమ రవాణా చేసిన వ్యక్తుల నుంచి అవయవాలు బలవంతంగా సేకరించి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం జరగముందే ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావాలన్నారు. అప్పుడే మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అక్రిడియేషన్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50 శాతం రాయితీ కల్పించాలని చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమేష్బాబు, కార్యదర్శి కాళేశ్వర్రెడ్డి కోరారు. మంగళవారం ప్రెస్క్లబ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 50 శాతం ఫీజు రాయితీ ఉత్తర్వులను జారీ చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్వో, డీఈవోలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు, ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ప్రెస్క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ పోటీల్లో మెరిసిన రొంపిచెర్ల బాలిక
రొంపిచెర్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2024–25 ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ పోటీలలో రొంపిచెర్ల మండలానికి చెందిన చిన్నారి మన్విత మాన్య మొదటి స్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బండకిందపల్లె గ్రామ సచివాలయ సర్వేయర్ మానస కుమారై మన్విత మాన్య తిరుపతిలోని ఓ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతోంది. ఈ నెల 27న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ పోటీలలో పాల్గొని ప్రతిభ చాటింది. టైటిల్ విన్నర్కు బహుమతిలోపాటు వెబ్ సిరీస్ సినిమా చాన్స్ , యాడ్ షూట్ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
ఎంపీపీ ద్విచక్ర వాహనం చోరీ
శ్రీరంగరాజపురం : స్థానిక ఎంపీపీ ద్విచక్ర వాహనం చోరీకి గురైన ఘటన చిన్నతయ్యూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఎంపీపీ కథనం.. సోమవారం ఉదయం చిత్తూరు– పుత్తూరు జాతీయ రహదారి చిన్నతయ్యూరు గ్రామంలోని తన పొలం వద్ద ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆపై వ్యవసాయ మోటారు ఆన్చేసి వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కనిపించలేదు. అనంతరం బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుమన్ పేర్కొన్నారు. ప్రతి ఫైలూ పూర్తి చేస్తున్నాం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రతిఫైల్నూ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని, ఒక్క ఫైల్ను కూడా పెండింగ్లో పెట్టడం లేదని మైనింగ్శాఖ ఉపసంచాలకులు పేర్కొన్నారు. ఇటీవల సాక్షి దినపత్రిలో ‘అక్రమాల గనుడు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్లను ఎప్పటికప్పడు పూర్తి చేస్తున్నామన్నారు. గ్రానైట్ బండలు తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బిల్లులు లేకుండా తరిలించే వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. స్కిట్ కళాశాలలో అడ్మిషన్లు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను మూడు సంవత్సరాల కిందట ఆలయ ఆర్థిక భారంతో మూత వేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్కిట్ కళాశాల జేఎన్టీయూ, స్కిట్ అనుసంధానంతో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఇంజినీరింగ్కు సంబంధించిన విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్లో అనుమతించారు. ఇందులో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్, సీఎస్టీ(డేటా సైన్స్), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ సంబంధించి 66 సీట్లు చొప్పున మొత్తం 330 సీట్లు అలాట్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒకో పోస్టుకు రూ.70 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహకారంతో కళాశాల ప్రారంభం చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్కిట్ కళాశాల వద్ద మంగళవారం సంబరాలు చేసుకోనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు కేసులు, నాన్టీచింగ్, టీచింగ్కు సంబంధించి 90 మంది గతంలో పనిచేసే వారుండగా వారిలో కొంతమంది కోర్టు స్టే తెచ్చుకోనున్నారు. అలాగే నాన్ టీచింగ్ కింద 36 మంది, 24 మంది కాంట్రాక్టు పద్ధితిలో పనిచేశారు. వారి పరిస్థితి ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది. జేఎన్టీయూ ఏ ప్రాతిపదికన స్కిట్ కళాశాలతో అనుసంధానం అయిందో అనే విషయంపై త్వరలోనే వెల్లడి కావాల్సి ఉంది. -
ఎస్వీయూలో ఉద్యోగుల ముష్టియుద్ధం
● తీవ్రగాయాలతో రుయాలో చికిత్స ● ఆర్థిక లావాదేవీతోనే ఒకరిపై ఒకరు దాడి తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఉద్యోగుల గొడవ రణరంగాన్ని తలపించింది. వర్సిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సోమవారం పరిపాలనా భవనం ఎదుట ముష్టి యుద్ధాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తీవ్ర గాయాలపాలైన ఉద్యోగులు రక్త స్రావంతో రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే.. ఎస్వీయూ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, శ్రీనివాసరావు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవులు జరుగుతుండేవని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సుబ్రమణ్యం అనే ఉద్యోగికి తోటి ఉద్యోగి శ్రీనివాసరావు రూ.2 లక్షలు వరకు అప్పు ఉన్నాడని, గత రెండేళ్లుగా చెల్లించకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడని తెలిసింది. దీంతో పలుసార్లు సదరు ఉద్యోగి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రమోషన్ విషయంలో తనకే రావాలి..అడ్డు తగలవద్దు..అంటూ ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం నెలకొనేదని తెలిసింది. దీంతో సోమవారం వర్సిటీ ఆవరణలో ఇద్దరూ తారస పడిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంతో పాటు ప్రమోషన్కు అడ్డువస్తున్నారనే కోపంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. తోటి ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతో రుయాలో చేరిక ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఉద్యోగులు తీవ్రగాయాలతో స్థానిక రుయాస్పత్రిలో చేరారు. శ్రీనివాసరావుకు తలపై గాయం కావడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే మరో ఉద్యోగి సుబ్రమణ్యంకు సైతం బలమైన లో గాయాలు తగలడంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇరువురు ఎస్వీయూ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.1000 చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని వెల్లడించారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులను ఆదేశించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలకంరించాలని సూచించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసరాలు, రోడ్లు, సమీప ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం వరలక్ష్మి వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాల్లో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబు స్వామి, మణికంఠ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈవో సెల్వం, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు. -
పీ–4 పేరుతో నిర్బంధం సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : పీ–4 కార్యక్రమం పేరుతో టీచర్లను నిర్బంధం చేయడం సరికాదని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జీరో పావర్టీ (పీ–4) కార్యక్రమంలో టీచర్లు విద్యార్థి కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు నిర్బంధం చేయడం సబబు కాదన్నారు. పీ–4 విధానంలో ప్రతి హెచ్ఎం కనీసం ఐదు కుటుంబాలను, టీచర్లు 2 కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని పట్రాంపల్లెలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల ఘర్షణలో కలత చెందిన ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పట్రాంపల్లెకు చెందిన రామ్మూర్తి, సతీష్ కుటుంబానికి ఆర్థికపరమైన గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామ్మూర్తి భార్య తారక అనే మహిళపై సతీష్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు గొడవ పడడంతో.. కలత చెందిన తారక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టూటౌన్ పోలీసులు విచారిస్తున్నారు. బకాయిలు వసూలు చేయండి చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ బకాయిల మీద దృష్టి పెట్టాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం అర్బన్ డివిజన్ కార్యాలయంలో ఈఈ మునిచంద్ర, ఈఆర్ఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సర్వీస్ ధరలకు ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తోందన్నారు. 200 యూనిట్లు దాటినవారు బిల్లు చెల్లించాలన్నారు. కానీ పలువురు బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఎక్కువగా చిత్తూరు రూరల్, జీడీనెల్లూరు ప్రాంతాల్లో ఈ సమస్య ఉందన్నారు. ఆ సర్వీసుల పెండింగ్ అమౌంట్ వసూలు చేయాలన్నారు. డివిజన్ పరిధిలో డిస్ కనెక్ట్ అయిన 163 సర్వీస్ల నుంచి పెండింగ్ మొత్తం రాబట్టాలన్నారు. లేనిపక్షంలో ఆ సర్వీసులను రద్దు చేయాలన్నారు. ఒకరికి పదేళ్ల జైలు పుంగనూరు: పాత కక్షలు పెంచుకొని యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ మదనపల్లె 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీలత తీర్పునిచ్చారు. సోమవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణం, నక్కబండలో 2022 జూన్ 25న అదే ప్రాంతానికి చెందిన టీ.రెడ్డెప్ప కుమారుడు రాజా అలియాస్ తోటి రాజేష్ స్థానిక ఇస్లాం నగర్కు చెందిన ఫారుక్తో ఓ అమ్మాయి విషయమై గొడవ పడ్డాడు. ఆపై నక్కబండ వద్ద జరిగిన పంచాయితీలో ఫారుక్ ను చంపాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అదేరోజు అప్పటి ఎస్ఐ మోహన్కుమార్ కేసు నమోదుచేసి రాజా అలియాస్ తోటి రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 28న మదనపల్లె 7వ అడిషనల్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి శ్రీలత తీర్పు ప్రకటించారు. రాజా అలియాస్ రాజేష్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు. -
అయ్యా.. న్యాయం చేయండి
● కలెక్టరేట్కు క్యూ కట్టిన ఫిర్యాదుదారులు ● వివిధ సమస్యలపై 289 వినతుల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయి అధికారుల వద్దకు ఎన్ని సార్లు వెళ్తున్నా తమకు న్యాయం జరగడం లేదని.. తమరైనా కల్పించుకుని న్యాయం చేయండంటూ పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డీఆర్వో మోహన్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన ప్రతి వినతినీ పరిష్కరించాలని చెప్పారు. 1.40 ఎకరాలను తగ్గించేశారు ‘నా కుమారుడు పేరుతో ఆన్లైన్లో నమోదై ఉన్న 3.06 ఎకరాలను 1.4 ఎకరాలను తగ్గించి మరొకరి పేరు పై మా భూమిని రెవెన్యూ అధికారులు మార్చేశారు’ అని జీడీ నెల్లూరు మండలానికి చెందిన బాధితుడు చంద్రశేఖర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు పలువురు బాధితులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ గంగాధరనెల్లూరు మండలం, వరత్తూరు రెవెన్యూ గ్రామం దళవాయిపల్లిలో తాము నివసిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యవస్థ రాకముందు చిత్తూరు తాలూకా కార్యాలయం నుంచి రైతు పాసుపు స్తకం సర్వే నం.359–1 లో 3.06 ఎకరాలను మంజూరు చేసి ఉన్నారన్నారు. అనంతరం వంశపారంపర్యంగా కుమారుడైన తన పేరుతో పట్టా నం.585తో పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. అనంతరం అనువంశికము విధానంలో తన పేరు మీద ఉన్న భూమిని కుమారుడైన ప్రవీణ్రెడ్డికి రాసివ్వగా 1592 పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. ఇటీవల మీభూమి వెబ్సైట్లో పరిశీలించగా 1.40 ఎకరాలే తగ్గించినట్టు గుర్తించామన్నారు. ఈ విషయం జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గోవిందరెడ్డికి చెందిన సర్వే నం.363/4 ఏలో 0.07 సెంట్లు, కమలమ్మకు చెందిన సర్వే నం.363/1 ఏలో 1.45 ఎకరాలు, సర్వే నం.363/2 ఏలో 0.1750 సెంట్లు, చంద్రారెడ్డికి చెందిన సర్వే నం.65/2 ఏలో 1.15 ఎకరాలు, ప్రవీణ్రెడ్డికి చెందిన సర్వే నం.359/1 ఏలో 1.41 ఎకరాలు మొత్తం 4.55 1/2 ఎకరాల భూమిని జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఎటువంటి భూమీలేని భానుప్రకాష్ అనే అతని పేరుపైకి మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీ నెల్లూరు కార్యాలయంలో పనిచేసే వరత్తూరు వీఆర్వో సుబ్రహ్మణ్యం, ఆర్ఐ ఏకాంబరం, డీటీ తులసీరామ్, రిటైర్డ్ తహసీల్దార్ చంద్రశేఖర్ సదరు వ్యక్తి వద్ద రూ.15 లక్షలు లంచం తీసుకుని తమ భూమిని ఆయన పేరుపై మార్చేశారన్నారు. న్యాయం చేయాలని వారు కలెక్టర్ను వేడుకున్నారు. రోడ్డు వేయించండి సారూ.. తమ గ్రామానికి రోడ్డు వేయించండి సారూ అంటూ ఐరాల మండలం, అబ్బగుండు గ్రామానికి చెందిన ప్రజలు వాపోయారు. ఈ మేరకు వారు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ అబ్బగుండు గ్రామానికి రహదారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల కాలం నుంచి తమ గ్రామానికి రహదారి లేదన్నారు. తమ గ్రామం నుంచి ఐరాల, చిత్తూరుకు నిత్యం పలువురు బతుకుదెరువుకు వెళ్తుంటారని.. ఉన్న రహదారి మొత్తం గుంతల మయం కావడంతో ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని స్థితి ఉందన్నారు. తమ సమస్యను పలుమార్లు ఎమ్మెల్యే, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. -
‘హిమ’విజయం!
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలానికి చెందిన హిమసాగర్ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. పోలీసు గ్రీవెన్స్కు 36 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయి. సోమవారం ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, డబ్బు తగాదాలు, భూ తగాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించినవి ఉన్నాయి. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి వాటిని పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలాగే పలువురు పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి, బాధితుల సమస్యలపై చర్చించారు. ఇక డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. 3న బాల్బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక శ్రీకాళహస్తి: పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో ఆగస్టు 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు జనవరి 2, 2010 తరువాత జన్మించి ఉండాలన్నారు. సెలెక్షన్కు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్, బ్లడ్ గ్రూప్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. డ్రెస్కోడ్ పాటించాలని తెలిపారు. ఎంపికలో చిత్తూరు జిల్లా బాల్బ్మాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటస్వామి, చైర్మన్ జగన్నాథంనాయుడు, అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. మరిన్ని వివరాలకు 7013754776, 9848295471 నంబర్లలో సంప్రదించాలన్నారు. – 8లో -
భావి ఇంజినీర్లుగా ఎదగాలి
ఏర్పేడు : తిరుపతి ఐఐటీలో నూతనంగా బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు బాగా చదువుకుని భావి ఇంజినీర్లుగా ఎదగాలని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో యువంతర్– 2025 ఓరియంటేషన్ నిర్వహించారు. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త విద్యార్థులకు సంస్థ సంస్కృతి, విద్యా చట్టం, సౌకర్యాలను వివరించారు. ఈ ఏడాది మొత్తం 254 మంది విద్యార్థులు బీటెక్ ప్రవేశం పొందినట్లు వెల్లడించారు. విద్యా వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రామకష్ణ గోర్తి మాట్లాడుతూ విద్యాసంస్థ నిబంధనలను వివరించారు. విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్ ఎన్ మూర్తి మాట్లాడుతూ కళాశాల జీవితం, విద్యార్థుల సౌకర్యాలు, అందుబాటులో ఉన్న పాఠ్యేతర అవకాశాలను తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,486 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారికి 12 గంటలు పడుతోంది. -
పోటీతత్వంతో ముందుకు సాగాలి
● రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 28 మంది ఎంపిక చిత్తూరు కలెక్టరేట్ : పోటీల్లో పాల్గొనే విద్యార్థులు, క్రీడాకారులు పోటీతత్వంతో ముందుకు సాగాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు సెక్రటరీ యుక్తాచౌదరి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానం ఇండోర్ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 236 మంది విద్యార్థులు, యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. పాల్గొన్న వివిధ వయస్సుల క్రీడాకారులు యోగా పోటీల్లో వివిధ ఆసనాలను వేశారు. జిల్లా స్థాయిలో 28 మంది గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు యుక్తాచౌదరి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న యోగాను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలకు బాపట్ల జిల్లా నుంచి విచ్చేసిన సంతోష్కుమార్ అబ్జర్వర్గా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన యోగా క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ పోటీల్లో అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షులు మురళీమోహన్ పాల్గొన్నారు. -
మామిడి కొను‘గోల్మాల్’!
● పక్కదారి పడుతున్న ప్రభుత్వ ప్రోత్సాహ నిధి ● వే బిల్లులు సృష్టించి యథేచ్ఛగా దందా! ● పట్టించుకోని ఉద్యానశాఖ అధికారులు మామిడి రైతుల అవస్థలను కొందరు కూటమి నేతలు తమకు అనుకూలంగా మాలుచు కుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిని పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాయలను తెచ్చి జిల్లాలో అమ్మకానికి పెట్టారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వే బిల్లుల పేరుతో మోసాలకు తెరలేపారు. ఫ్యాక్టరీలో కాయలు దింపకనే వే బిల్లులు సృష్టించి ప్రభుత్వ ప్రోత్సాహక నిధికి తూట్లు పొడుస్తున్నారు. దీనికితోడు నీలం కాయలను సైతం తోతాపురి లెక్కల్లోకి తీసుకుంటున్నారు. దీనిపై ఉద్యానశాఖ అధికారులు నోరెత్తకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా మామిడిలో తోతాపురి రకం 39,895 హెక్టార్లలో సాగులో ఉంది. మొత్తం ఈ సారి 4.99 లక్షల టన్నుల దాకా దిగుబడి వచ్చినట్టు అధికారుల అంచనా. ఈ పంట అధిక దిగుబడి కారణంగా కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలోకి రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరలో ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 ఇస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద కేజీకి రూ.4 చొప్పున్న చెల్లిస్తామని వెల్లడించింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యక్తులు, కూటమికి చెందిన పలువురు నేతలు ఆ ప్రోత్సాహక నిధిని దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఆ కాయలు ఏమయ్యాయి? ప్రతి ఏటా మామిడి పంట ఆరంభంలోనే వ్యాపారులు తోటపై వాలిపోతుంటారు. రైతులకు అడ్వాన్స్లు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుని వెళ్లిపోతుంటారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులే అధిక శాతం మంది ఈ వ్యాపారం చేస్తుంటారు. వీరు ఈ సారి తీవ్రంగా నష్టపోయారు. తోటపై కొనుగోలు చేసిన కాయలను అమ్ముకోలేక తలలు పట్టుకున్నారు. వీరికి కొందరు కూటమి నేతలు వల వేశారు. కాయలను అమ్మిచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఆ కాయలను ఫ్యాక్టరీలకు దగ్గరుండి తరలించి.. ప్రోత్సాహక నిధిని వీళ్ల ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు కుట్రలు పన్నారు. ఒకే ట్రాక్టర్ పేరుతో పలు బిల్లులు ఒకే ట్రాక్టర్..ఒకే రోజు పలు లోడ్లు తరలించి ప్రోత్సాహక నిధికి బిల్లులు సమర్పించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు పలు ర్యాంపులు కేంద్ర బిందువుగా మారినట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒకే ట్రాక్టర్ పలు ర్యాంపుల వద్దకు వెళ్లి కాయలను తూకం మేసి.. దింపకుండా.. బిల్లులు సృష్టించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వం అందించే రూ.4 ప్రోత్సాహక నిధి కోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ర్యాంపుల వద్ద వచ్చిన ఆధార్, బ్యాంకు ఖాతా, వే బిల్లులను తీసుకొచ్చి సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారనే విషయం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటివి కుప్పం, వి.కోట, పలమ నేరు, సోమల ప్రాంతాల్లో జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నీలంతో ఏంపని? దందా ఇలా మామిడి అవస్థలను కొందరు కూటమి నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకొని టోకన్లను సైతం అమ్ముకున్నట్టు తెలుస్తోంది. అధికారుల రంగ ప్రవేశంతో దీనిని కట్టడి చేశారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం నుంచి తోతాపురి మామిడిని జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మామిడి పంటే లేని వ్యక్తులు అక్కడి కాయలను తీసుకొచ్చి జిల్లాలోని ఫ్యాక్టరీలో విక్రయానికి పెట్టారు. ఇలా సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల నుంచి 90 వేల మెట్రిక్ టన్నుల కాయలు ఫ్యాక్టరీల్లోకి దింపినట్టు రైతులు చెబుతున్నారు. ఈ దందాలో కూటమికి చెందిన పలువురు కార్యకర్తలు ముందు వరుసలో నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. మూడు రోజుల క్రితం వరకు 26,221 మంది రైతులు 2,26,660 మెట్రిక్ టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు విక్రయించారు. ర్యాంపుల ద్వారా 14,637 మంది రైతులు 1,01,175 టన్నుల కాయలను విక్రయించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే తోతాపురి పంట దాదాపు పూర్తికావొచ్చింది. ఇప్పుడు నీలం రకం కాయలు మాత్రమే కోతలు, అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిని కొన్ని ర్యాంపుల్లో తోతాపురి లెక్కల్లోకి నెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా పలువురు ర్యాంపు నిర్వాహకులు నేర్పుతున్న పాఠమని రైతులు అంటున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ రకమైన దందా నడుస్తోందని, ప్రభుత్వం అందించే రూ.260 కోట్లలో.. రూ.50 కోట్లు మామిడిలో జరిగిన దందాకు సరిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మామిడి దందా బట్టబయలవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● చికిత్స కంటే నివారణే మేలు ● ప్రతి శుక్రవారం కచ్చితంగా డ్రై డేని పాటించాలి ● మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీ ● సమావేశాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని డెంగ్యూ కేసులు నమోదైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలన్నారు. అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ మాసాన్ని పురస్కరించుకుని అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సుధారాణి, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు పాల్గొన్నారు. పకడ్బందీగా మామిడి సబ్సిడీ పంపిణీ జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీని అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మామిడి సబ్సిడీ అందజేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన మామిడికి కిలో రూ.4 చొప్పున సబ్సిడీ అందజేయనున్నట్లు తెలిపారు. ఆగస్టులో సంబంధిత రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ నగదు జమచేస్తామన్నారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి సంబంధించి 28,370 మంది రైతుల డేటాను పరిశీలన నిమిత్తం మండల స్థాయి బృందాలకు పంపినట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్ పాల్గొన్నారు. -
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి!
● ఊరుగాని ఊరులో అనాథగా మట్టిలో కలిసిన కన్నడ వాసి ● కన్నీరుమున్నీరైన కుటుంబీకులు పలమనేరు: ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఏ మట్టిలో కలిసిపోతామో తెలియని మానవ జన్మ ఇది. ఇలాంటిదే పలమనేరులో చోటు చేసుకుంది. కర్ణాటక వాసి ఇక్కడ అనాథలా మృతిచెందడం.. ఆపై మట్టిలో కలిసిపోవడం చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన పలమనేరు సమీపంలోని పత్తికొండ వద్ద హైవేకి సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గంగవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆపై బంధువుల రాక కోసం మూడు రోజుల దాకా వేచి చూశారు. కానీ ఎవ్వరూ రాకపోవడంతో స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ వారిద్వారా అంతిమ సంస్కారాలకు అప్పగించారు. వారు పట్టణంలోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అయ్యో..అనాథలా వెళ్లిపోయావా నాయనా? ఇలా ఉండగా మృతుని బంధువులు సోమవారం పోలీసుల వద్దకు వచ్చారు. తాము కోలారు జిల్లా, ఈకాంబలి గ్రామానికి చెందిన వారమని, మృతుని పేరు బత్తెప్ప(55) అని తెలిపారు. ఈనెల 23 నుంచి కనిపించకపోవడంతో కోలారు పీఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆయనకు కాలు దెబ్బతగిలి బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని, దీనిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఆయన అనాథ కాదని, కుటుంబీకులున్నారంటూ బంధువులు బోరున విలపించారు. ఇక్కడే పెద్ద ఖర్మ చేస్తాం అనంతరం హెల్పింగ్హ్యాండ్స్ నిర్వాహకులు శివ మిత్ర బృందంతో మాట్లాడారు. వారు మృతదేహానికి ఎలా అంత్యక్రియలు నిర్వహించారో విడియో చూపెట్టారు. దినిపై సంతృప్తి చెందిన కుటుంబీకులు ఆయన ఇక్కడి మట్టిలో కలవాలని దేవుడు రాశాడని.. పెద్దఖర్మ కూడా ఇక్కడే చేస్తామని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులకు చేతులు జోడింది కృతజ్ఙతలను తెలియజేశారు. ఈ ఘటన స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. -
పోష్ చట్టంపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి అమలు చేస్తున్న పోష్ చట్టంపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి ఆధ్వర్యంలో పోష్ చట్టానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోష్ చట్టం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. రెగ్యులర్, పార్ట్టైమ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ చట్టాన్ని వివరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. బోయకొండ హుండీ ఆదాయం రూ.77.83 లక్షలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.77.83 లక్షలు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ మేరకు సోమవారం హుండీ లెక్కింపు చేపట్టగా నగదు రూ.77,83,633, బంగారం 21 గ్రాములు, వెండిి 394 గ్రాములు వచ్చినట్టు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్ల తోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.57,057 నగదు లభించినట్లు వెల్లడించారు. ఈ ఆదాయం 35 రోజులకు సమకూరిందన్నారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉపేక్షించొద్దు చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా సరిహద్దు రాష్ట్రాలకు దగ్గరగా ఉండడంతో ఇటువైపు ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు రావడానికి వీల్లేదని చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు–వేలూరు రోడ్డులోని నరహరిపేట వద్ద ఉన్న ఎకై ్సజ్ శాఖ చెక్పోస్టును ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. నాటుసారా, గంజాయి, కల్తీ మద్యం లాంటివి ఏవీ కూడా జిల్లాలోపలకు రావడానికి వీల్లేదన్నారు. నిత్యం అధికారులు తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారానే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. డీసీ వెంట సీఐ రవికుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు. జీవన ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు బంగారుపాళెం: ఆరోగ్య కరమైన పంట దిగుబడికి రైతులు జీవన ఎరువులు వినియోగించాలని జిల్లా వనరుల కేంద్రం ఏఓ లక్ష్మీప్రసన్న సూచించారు. సోమవారం మండలంలోని చీకూరుపల్లెలో పంటల సాగులో తీసుకోవాల్సి జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడి కోసం సేంద్రియ పద్ధతులను అనుసరించాలని చెప్పారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. బంగారుపాళెం ఏఓ భారతి, సిబ్బంది సాయిజ, కుమార్ పాల్గొన్నారు. 3 నుంచి జిల్లా స్థాయి చెస్ పోటీలు నగరి : జిల్లా స్థాయి చెస్ పోటీలు ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్నట్టు లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ ప్రభాకర్రాజు తెలిపారు. మండలంలోని వీకేఆర్పురం సమీపంలో గల హైవే గ్రాండ్ వోల్డ్ నందు ఈ పోటీలు జరుగుతాయన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం, 28వ చెస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అండర్ 9, అండర్ 16, అబౌవ్ 16 కేటగిరిలలో పోటీలు జరుగుతాయని, వివరాలకు 9440821444లో సంప్రదించాలని సూచించారు. -
ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ శిక్షణ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ శిక్షణ కార్యక్రమం పట్ల క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 7వ తేదీ ఆఖరు అని చెప్పారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్వో మోహన్కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ విక్రమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1.81,84,138కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.21,032, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.53,031లు వచ్చింది. యూఎస్ఏవి 2488 డాలర్లు, ఇంగ్లండ్వి 5 పౌండ్స్, యూఏఈ 230 దిర్హామ్స్, యూరోవి 20 యూరోలు, కెనడావి 55 డాలర్స్ వచ్చాయి. బంగారం 40 గ్రాములు, వెండి 790 గ్రాములు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారు. ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్బాబు పాల్గొన్నారు. -
హత్య కేసులో వినుత కోట.. లేటెస్ట్ అప్డేట్
రేణిగుంట: శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు 8 వరకు రిమాండ్ను పొడిగించారు. ఈ కేసులో చెన్నై జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వినుత కోటతో పాటు మిగిలిన నిందితులను చెన్నై సీ–3 పోలీసులు కస్టడీకి కోరడంతో ఎగ్మోర్ కోర్టు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు. కాగా, డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు నాయుడుతో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు ఈ నెల 12న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షేక్ దస్తా సాహెబ్, శివకుమార్, గోపి ఇతర నిందితులు. రాయుడిని దారుణంగా హత్య చేసి.. జూలై 8న ఉత్తర చెన్నైలోని కూవం నదిలో శవాన్ని పడేసినట్టు తమిళనాడు పోలీసులు గుర్తించారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి దీనంతటికీ కారణమని వినుత, చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని వారు అన్నారు. కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రాయుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు -
గంజాయి రవాణా చేస్తూ టీడీపీ కార్యకర్త అరెస్ట్
సాక్షి, చిత్తూరు జిల్లా : గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డాగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని మరోసారి నిరూపితమైంది. అధికార పార్టీ టీడీపీకి చెందిన కార్యకర్త ఒకరు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కనమాకుల పల్లె గ్రామానికి చెందిన బీసీ రెడ్డప్పను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపురంలో ఇటీవల స్థానిక పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెడ్డప్ప లారీ యూఎల్ 4509 పేరుతో నంబర్ ఉండగా పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. దేశంలో ఎక్కడ యూఎల్తో రాష్ట్ర రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా.. లారీలో 50 కిలోల గంజాయి లభించింది. దీంతో రెడ్డప్పను పోలీసులు అదుపులోకి తీసుకొని.. లారీతో సహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రెడ్డప్ప గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం పరిధిలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. -
నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు దాతలు నగదు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన దాతలు కృష్ణమోహన్, పార్థసారథినాయుడు నిత్యాన్నదానానికి రూ.2 లక్షల నగదు విరాళంగా అందించారు. అలాగే గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన పుష్పలత, శివప్రసాద్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చూశారు. రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి మృతి నగరి : పురపాలక పరిధిలోని ఏఎన్ కండ్రిగ కాలనీ మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.విజేంద్ర (62) అనే గీతకార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. ఏఎన్ కండ్రిగ నుంచి విజేంద్ర సైకిల్పై బుగ్గ దేవాలయానికి వెళుతుండగా ఎదురుగా ఇటుకల లోడ్డుతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో విజేంద్ర అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ విక్రమ్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విజేంద్ర వైఎస్సార్సీపీ కార్యకర్త కావడంతో పార్టీ శ్రేణులు హుటాహుటిన ఘటనా స్థలానికి, ఆస్పత్రికి చేరుకున్నాయి. దళితులపై దాడులకు నిరసనగా ‘యాత్ర’ చిత్తూరు రూరల్(కాణిపాకం): దళితులపై దాడులకు నిరసనగా ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అశోక్బాబు తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. రిజర్వేషన్లు కనుమరుగుతన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ పరమవుతున్నాయని మండిపడ్డారు. ఈనేపథ్యంలో ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయా లని కోరారు.‘రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. నేతలు దాసరి చెన్నకేశవ, మహాసముద్రం కృష్ణయ్య, పార్థసారథి వెంకటగిరి దాము, ఉదయ్ కుమార్, సీజీ దాసు పాల్గొన్నారు. -
పోలీసు శాఖపై ఆ వ్యాఖ్యలు సరికావు
చిత్తూరు అర్బన్: చిత్తూరు ఎస్పీ, పోలీసు శాఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికావని జిల్లా పోలీసు సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. అభ్యంతరకరమైన, వ్యక్తిగత ధూషణ లాంటికి కాకుండా హుందాగా వ్యవహరించాలన్నారు. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఉదయ్కుమార్, కోశాధికారి పరంధామనాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్బాషా, సభ్యుడు శరవణ పాల్గొని మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఈ ప్రశ్నలకు మౌనం! ఎస్పీపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్న పోలీసు యూనియన్ నాయకులను ‘సాక్షి’ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నములుతూ మౌనం వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్ఐ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు 200 మందికి పోస్టింగులు ఇవ్వకుంటే యూనియన్ ఎందుకు మౌనంగా ఉందని అడిగితే.. అది రాష్ట్ర యూనియన్ చూడాలన్నారు. పుంగనూరులో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఏకంగా కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎస్పీ మణికంఠ వల్లే ఈ హత్య జరిగింది...’ అంటూ హత్యారోపణ చేస్తే ఎందుకు యూనియన్ నోరు మెదపలేదని అడిగితే నీళ్లు నలిమిలారు. అందుకే 200 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారని దాటవేసే సమాధానం చెప్పారు. శ్రీవారిసేవలో సీఎస్ తిరుమల : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను ఈవో జె.శ్యామలరావు అందజేశారు. -
టమాటకు రెక్కలు!
● పలమనేరులో బాక్సు ధర రూ.650 పలమనేరు : టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. ఆదివారం పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో బాక్స్(14కేజీలు) టమాట ధర ఒక్కసారిగా రూ.500 నుంచి రూ.650కి చేరింది. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, తెలంగాణలో పంట తగ్గుముఖం పట్టడం, తమిళనాడులో సీజన్ ముగియడం, కర్ణాటలో తెగుళ్ల కారణంగా దెబ్బతినడంతో బయటి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు భారీగా వస్తున్నారు. దీంతో టమాట ధర పెరుగుతోందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం పంట కోతల్లో ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన లోడ్లు పలమనేరు, పుంగనూరు, వి.కోట, సోమల, సదుంలోని టమాట మారె్క్ట్లకు సాధారణంగా రోజూ వంద లోడ్ల సరుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 60 లోడ్ల టమాట మాత్రమే వస్తోంది. ఇదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండడంతో టమాట రేటు ఒక్కసారిగా పుంజుకుంది. మొదలైన ఎగుమతులు ప్రస్తుతం జిల్లా నుంచి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, సౌత్ ఆఫ్రికా దేశాలకు టమాటను ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యమైన టమాటకు డిమాండ్ అమాంతం పెరిగింది. మొన్నటి దాకా బాక్సు రూ.200 పలికిన టమాట, ఇప్పుడు బాక్సు రూ.650కి చేరుకుంది. ఇక ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయలైతే ధర రూ.700 పైగా చేరింది. మరో నెలపాటు టమాట ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. -
జంతువులకున్న విలువ మనుషులకు లేదా..?
సోమల(సదుం): జంతువులకు వున్న విలువ మనుషులకు లేదా అని సోమల మండలం కొత్తూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరులో శనివారం రాత్రి ఏనుగుల దాడిలో రామకృష్ణమరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మృతదేహంతో ఆదివారం ఉదయం వరకు రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5 గంటలకు ఏనుగుల దాడిలో మనిషి మృతిచెందాడని, రాత్రి 10 గంటల వరకు అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో జంతువులు చనిపోతే హుటాహుటిన వచ్చే అధికారులు మనుషులు చనిపోతే పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగులు ఎక్కడని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తమ గ్రామానికి రావాలని, అంతవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని భీష్మించారు. సంవత్సరాల తరబడి ఏనుగులు పంటలపై దాడులు చేసి నష్టం చేస్తున్నాయని వాపోయారు. సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పంటలు నష్ట పోతున్నా రూ.10 వేలు పరిహారం చెల్లిస్తున్నారని తెలిపారు. తాము వ్యవసాయం వదులుకోవాల్సిందేనా అంటూ వాపోయారు. పరిశీలించిన డీఎఫ్వో: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతిచెందిన ప్రాంతాన్ని ఆదివారం ఉందయం డీఎఫ్వో భరణి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు నెలల పాటు రైతులెవరూ సాయంత్రం 4 గంటల అనంతరం అటవీ సరిహద్దుల్లో ఉన్న పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. తేనె టీగలను పెంచుకుంటే ఏనుగుల దాడులను అరికట్టవచ్చని, రైతులకు ఆదాయం చేకూరుతుందని చెప్పారు. ఆమె హామీతో రామకృష్ణంరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పుంగనూరుకు తరలించారు. -
పంటలపై ఏనుగుల దాడి
పలమనేరు: కుంకీ ఏనుగులు వచ్చి ఏమి చేస్తాయోగాని కౌండిన్య అడవిలోని మదపుటేనుగులు రైతుల పొలాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఆమేరకు ఇప్పుడు అటవీశాఖ కుంకీ ఎలిఫెంట్ క్యాంపు ఏర్పాటు చేసిన గ్రామమైన ముసలిమొడుగులోనే ఏనుగులు పలువురు రైతుల మామిడితోటల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆపై తోటలోని కొమ్మలను విరిచి కాయలను ఆరగించి నష్టాన్ని కలిగించాయి. గ్రామానికి చెందిన చంద్రశేఖర్నాయుడికి వీటి కారణంగా నష్టం కలిగింది. దీంతో స్థానిక ఫారెస్ట్ సిబ్బంది పంట నష్టాన్ని అంచనా చేసి నష్టపరిహారంకోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. -
ఈనెల 30న జీఎస్ఎల్వీ ఎప్16 రాకెట్ నుంచి ప్రయోగం
సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ ఎ్ఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగ సమయానికి 25 గంటల ముందు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.మూడు దశల్లో జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగంపీఎస్ఎల్వీ రాకెట్ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్ఎల్వీ రాకెట్ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. 51.7 మీటర్లు పొడవు ఉన్న జీఎస్ఎల్వీ ఎప్16 రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలు దేరుతుంది. ఈ ప్రయోగంలో 2,392 కిలోలు బరువు గల నిసార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు రాకెట్ను వ్యాబ్ నుంచి ప్రయోగ వేదిక మీదకు నెమ్మదిగా తరలించే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్వీ ఎప్16 రాకెట్ను దశల వారీగా అనుసంధానించే దృశ్య మాలిక ఇది. జీఎస్ఎల్వీ మార్క్2 సిరీస్లో 18వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రం నుంచి 102వ ప్రయోగం కావడం విశేషం.మూడో దశ ఇలామూడో దశను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపోల్షన్ సెంటర్లో రూపొందించి, అందులో 14.5 టన్నుల క్రయోజనిక్ ఇంధ నాన్ని నింపి మూడోదశను పూర్తి చేస్తారు. ఈ దశకు పైభాగంలోనే ఉపగ్రహాన్ని అమర్చుతారు.రెండో దశ ప్రక్రియరెండో దశలో 42.1 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశలో ఇంధనాన్ని కౌంట్డౌన్ సమయంలోనే నింపే ప్రక్రియను చేపడతారు.మొదటి దశ ఇలాకోర్ అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. రాకెట్కు చుట్టూ నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లుకు కలిపి 170.7 టన్నుల ద్రవ ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. -
● తెలుగు తమ్ముళ్లలో భగ్గుమన్న విభేదాలు ● రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర ఆరోపణలు
సాక్షి టాస్క్ఫోర్స్ : గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ పార్టీలో ఇటీవల వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేకం పేరుతో రెండు వర్గాలు తయారయ్యాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే థామస్ పీఎ చంద్రశేఖర్ అవినీతిపరుడు అంటూ శుక్రవారం ఓ వర్గంవారు కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేత గుండయ్య, ఎమ్మెల్యే థామస్ సొంత తమ్ముడు నిధి, హరిబాబు నాయుడు మరికొందరు నాయకులు కలిసిఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లను పీఏ చంద్రశేఖర్ అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేను అవినీతి కూపంలోకి దింపుతున్నాడని, మన్నారుగుడి మాఫియాలా ఎమ్మెల్యే చుట్టూ అవినీతిపరులే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తమ్ముళ్ల కుమ్ములాట బయటపడింది. వ్యతిరేకులంతా చీడపురుగులన్న ఎమ్మెల్యే కలెక్టర్కు పలువురు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే థామస్ ఓ వీడియో విడుదల చేశారు. తన వద్ద 8 నెలలుగా పనిచేస్తున్న పీఏ చంద్రశేఖర్ చాలా మంచి వాడని, తన వ్యతిరేకులందరూ చీడపురుగులని ఆరోపించారు. ప్రధానంగా పీఏపై ఫిర్యాదు చేసిన వారు స్వార్థపరులను మండిపడ్డారు. అవినీతిపరులందరూ జట్టు కట్టి తనను రాజకీయంగా అణగదొక్కాలని యత్నిస్తున్నట్లు విమర్శించారు. వారు చెప్పిన పనులు చేయనందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. పీఏ చంద్రశేఖర్ గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేశాడని, ప్రస్తుతం మంత్రుల వద్ద ఓఎస్డీలుగా గత ప్రభుత్వంలో పని చేసిన వారు లేరా అని ప్రశ్నించారు. గుండయ్య అవినీతిపరుడు ఎమ్మెల్యే పీఏ పై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎస్సీ సెల్ నేత గుండయ్య అవినీతిపరుడని ఎమ్మెల్యే పేరు చెప్పుకుని రూ.లక్షలు వసూలు చేశాడని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకుల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణ పేద కుటుంబానికి చెందిన గుండయ్య తిరుపతిలో మూడంతస్తుల భవనం, వేలూరులో ఒక భవనం, ఎస్ఆర్ పురంలో మూడంతస్తుల భవనం ఎలా నిర్మించాడని వీడియోల్లో వెల్లడిస్తున్నారు. పెనుమూరుకు చెందిన ఓ నేత మాట్లాడుతూ గుండయ్య తన వద్ద రూ.లక్షలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు.ఎమ్మెల్యే థామస్ పీఏపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు (ఫైల్)క్రమశిక్షణ తప్పితే చర్యలు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రేగిన రాజకీయ రగడపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఎలాంటి ప్రెస్మీట్లు నిర్వహించకూడదని, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఆ సమావేశంలో చేసుకోవాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను తప్పితే ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరులోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ఉద్యోగులకు అండగా ఎన్జీఓ సంఘం చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వోద్యోగులకు అండగా ఎన్జీఓ సంఘం ఎల్లప్పుడూ ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు తెలిపారు. ఆదివారం ఈ మేరకు చిత్తూరులోని సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అబ్జర్వర్ వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా సంఘం అధ్యక్షుడు పెంచలయ్య ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పదవికి రమేష్ను, 14 తాలూకా అధ్యక్ష, కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి చిత్తూరు అర్బన్: ద్విచక్రవాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో స్లో మోటర్ సైకిల్ రైడింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ విచ్చేసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ , ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు మరింత అప్రమత్తంగా బండి నడపాలని కోరారు. కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత సూచనలు పాటించపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, సీఐ మహేశ్వర, నెట్టికంఠయ్య, ఆర్ఐ సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. భక్తులతో కిక్కిరిసిన బోయకొండ చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిక్కిరిసింది. వేకువజాము నుంచే మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.మహిళలు ిపిండి, నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రసాదాలను పంపిణీ చేశారు. నేడు హుండీ లెక్కింపు బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం ఉదయం 7 గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. -
అయ్యా.. బాబూ!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బదిలీల సమాచారం ● ఉమ్మడి చిత్తూరులో అయ్యోర్లకు జీతాల సమస్య ● పొజిషన్ ఐడీ లేక అయోమయం ● రెండు నెలలుగా అవస్థలు యాజమాన్యం ఖాళీలు ప్రభుత్వ 125 ఎంపీపీ/ జెడ్పీ 1,583 మున్సిపల్ కార్పొరేషన్ 135 మున్సిపల్ 75 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లు 3,000 మిగిలు పోస్టులు 500 రీ అపోర్షన్/షిప్టెడ్ 1,582 మొత్తం 7,000చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4,737 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 18,540 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన బదిలీల కసరత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది టీచర్లను బదిలీ చేశారు. అదేవిధంగా హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 800 వరకు ఉన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన పలు కేడర్ల టీచర్లు రెండు నెలలుగా జీతాలు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. జీతాల కోసం నిత్యం డీఈవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని విద్యాశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పొజిషన్ ఐడీ పేరుతో కక్ష పొజిషన్ ఐడీ పేరుతో టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం జీతాలు మంజూరు చేయకుండా కక్ష సాధింపులకు దిగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెరపైకి పొజిషన్ ఐడీ పేరును తీసుకొచ్చింది. ఏదో ఒక విధంగా టీచర్లను ఇబ్బందులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కేబినెట్ ఆమోదం అవసరమట పొజిషన్ ఐడీలకు కేబినెట్ ఆమోదం అవసరమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉపాధ్యాయ సంఘ నేతలు మండిపడుతున్నారు. కేబినెట్ ఆమోదం పేరుతో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించడం సబబు కాదని హెచ్చరిస్తున్నారు. అసలు పొజిషన్ ఐడీల ఫైల్ కేబినెట్లో ఆమోదం పొందిందో...లేదో అనే విషయం తెలియడం లేదని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది టీచర్లు జీతాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వాపోతున్నారు. పెండింగ్ జీతాల బిల్లులు పెట్టుకునేందుకు ఈ నెల 27 వరకు రాష్ట్ర ట్రెజరీ అధికారులు అవకాశం కల్పించారని, అయితే పొజిషన్ ఐడీలు లేకపోవడంతో టీచర్లు బిల్లులు నమోదు చేయలేక మిన్నకుంటున్నట్టు తెలిపారు. అయ్యోర్ల నిరసన జీతాల కోసం ఉపాధ్యాయులు శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనకు దిగారు. వేతనాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రోడ్డెక్కారు. బదిలీలు చేపట్టి రెండు నెలలు కావొస్తున్నా పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. తాజాగా కేబినెట్ భేటీ నిర్వహించినప్పటికీ అందులో పొజిషన్ ఐడీల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం పొజిషన్ ఐడీలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం అన్యాయం. నెలల తరబడి ఐడీల పేరుతో జీతాలు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. ఈ సమస్య రాష్ట్ర మొత్తం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు పొజిషన్ ఐడీ సమస్యతో రెండు నెలల జీతాలు పొందలేకపోయారు. పలు మార్లు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అలసత్వం వహించడం సబబు కాదు. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడుపొజిషన్ ఐడీలు మంజూరు చేయాలి పొజిషన్ ఐడీలు ఇచ్చేందుకు నెలల సమయం అవుతుందా..?. టీచర్ల పట్ల ఇంత చులకన భావన ఎందుకో. రెండు నెలల జీతాలు లేకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. కేడర్ స్టెన్త్ నివేదికలు సిద్ధం చేసి పొజిషన్ ఐడీలు ఇవ్వడం పట్ల అలసత్వం వహించడం దారుణం. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని అనిపిస్తోంది. – జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా
జిల్లాలో ట్రావెల్ నిర్వాహకులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఒకే నంబర్తో రెండు.. మూడు బస్సులను నడుపుతున్నారు. తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా సర్వీసులను తిప్పుతున్నారు. నకిలీ రశీదులతో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ప్రయాణికులను మాత్రమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా భారీ లగేజీలను తరలించేస్తున్నారు. అలాగే వాహనాలను ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ చెల్లించాల్సిన పన్నుకు పంగనామాలు పెట్టేస్తున్నారు. రవాణాశాఖ అధికారులను బురిడీ కొట్టించి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. కేసులకు సైతం వెరవకుండా బరితెగించి మరీ బస్సులను నడిపేస్తున్నారు.● రెండు రోజులకు క్రితం బెంగళూరు–విజయవాడ ట్రావెల్స్ బస్సును జిల్లా రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో బండికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పన్ను చెల్లించిన రిశీదు అడిగారు. డ్రైవర్ వెంటనే పన్ను కట్టినట్లు రశీదును చూపించారు. అయితే ఆ బిల్లు నకిలీది అని తేలింది. పన్ను కట్టిన పాత పత్రంలో తేదీ మార్చినట్లు చూపించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి.● ఇటీవల బెంగళూరు–తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ను చిత్తూరులో జిల్లా రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా బస్సు వివరాలను చూస్తే పట్టుబడిన బండిని విజయవాడలో సీజ్ చేసినట్లు తేలింది. దీంతో రవాణాశాఖ అధికారులు లోతుగా విచారించారు. విజయవాడలోని అధికారికి ఈవిషయంపై సమాచారం అందించారు. కేసు నమోదు చేయించారు. చిత్తూరు నగరంలో సీజ్ చేసిన బస్సు నంబరుతో విజయవాడలోనూ మరొకటి తిరుగుతూ పట్టుబడినట్లు తేలింది.పలమనేరు : కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఎలాంటి పర్మిట్ లేకుండానే జిల్లాలో తిరుగుతున్నాయి. ప్రధానంగా తిరుపతి, పలమనేరు, చిత్తూరు, పుత్తూరుకు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నాయి. బెంగళూరు, కోలారు, ముళబాగిళు, శ్రీనివాసపుర డిపోలనుంచి రిజర్వులో ఉన్న బస్సులను సైతం అంతర్రాష్ట్ర పర్మిట్లు లేనప్పటికీ తిరుపతి వెళ్లువారు అధికంగా ఉంటే స్పెషల్ ట్రిప్పులు వేస్తున్నాయి. ఫలితంగా మన ఖజానాకు గండిపడుతోంది.జిల్లా నుంచి 125 సర్వీసులుఉమ్మడి జిల్లాలోని తిరుపతి, మంగళం, తిరుమల, చిత్తూరు తదితర డిపోలనుంచి బెంగళూరుకు 125 దాకా అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి పక్కాగా పర్మిట్ తీసుకున్నారు. అయితే కర్ణాటక నుంచి దాదాపు 70 బస్సులు జిల్లాకు వస్తున్నాయి. వీటిలో చాలా సర్వీసులకు పర్మిట్లు లేవు. జిల్లా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.అడిగే దిక్కులేదు...పలమనేరు, చిత్తూరులకు పొరుగునే ఉన్న ముళబాగిలు, కోలార, చింతామణి, శ్రీనివాసపురం నుంచి రాత్రి సర్వీసులు పదికి పైగా బస్సులు పర్మిట్లు లేకుండానే బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులను గమనించి పలమనేరు, చిత్తూరు డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు అడ్డుకున్నారు. అయితే వాటిపై చర్యలు తీసుకోవాల్సింది రవాణాశాఖ కాబట్టి ఆర్టీసీ వారు వీటిని నిలువరించలేక వదిలేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన కర్ణాటక ఆర్టీసీ అధికారులు పర్మిట్ లేని బస్సులను రెట్టింపుచేసి జిల్లాలోకి పంపుతున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో ప్రైవేటు బస్సుల దొంగాట ముదిరింది. ట్రావెల్స్ నిర్వాహకులు పన్నులు ఎగొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తప్పుడు పత్రాలతో రయ్..రయ్మంటూ బస్సును నడుపుకుంటున్నారు. లగుజీలను సైతం తరలించేస్తున్నారు. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. రవాణాశాఖ అధికారుల కంట్లో కారం కొడుతున్నారు. అప్పుడప్పుడు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగుచూస్తోంది.పన్నుకు పంగనామాలుజిల్లాలో ఒకప్పుడు 90కి పైగా ప్రైవేటు బస్సులున్నాయి. ప్రస్తుతం 40 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన బస్సులు బెంగళూరు నుంచి తిరుపతికి 10 నుంచి 15 తిరుగుతున్నాయి. అలాగే కర్ణాటక నుంచి 70– 75 బస్సులు తిరుపతి, విజయవాడకు రాకపోకుల సాగిస్తున్నాయి. తమిళనాడు నుంచి 50– 60 సర్వీసులు తిరుపతికి చిత్తూరు మీదుగానే నడుస్తున్నాయి. వీటిలో పలు బస్సులు పన్నుకు పంగనామాలు పెడుతున్నాయి. పన్ను భారం నుంచి బయట పడేందుకు చాలా వరకు అరుణాచల్ప్రదేశ్, నాగలాండ్ రాష్ట్రాలకు క్యూక డుతున్నాయి. ఆరాష్ట్రాల్లో పన్ను తక్కువ కావడంతో అక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడ ఒక్కో బస్సుకు కనిష్టంగా రూ.90వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అక్కడ కేవలం రూ.20వేలు పన్ను చెల్లిస్తే నేషనల్ పర్మిట్తో బస్సు తిప్పుకునే అవకాశముంటుంది. దీంతో జిల్లాలో రిజిసే్ట్రషన్ చేసుకునే బస్సుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో తిరిగే బస్సులే జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి.ట్యాక్స్ కట్టకుండానే...చాలా వరకు ప్రైవేటు బస్సులు పన్ను కట్టకుండానే తిరిగేస్తున్నాయి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోతున్నాయి. నేషనల్ పర్మిట్, ఇతరత్ర పన్నులు లేకుండా జిల్లా మొత్తం తిరుగుతున్నాయి. పన్ను చెల్లింపు గడవు తీరినా.. మళ్లీ చెల్లించకుండా జాప్యం చేస్తున్నాయి. కొన్ని బస్సులు గడువు తీరిన పత్రాల్లో తేదీలు మార్చి పన్ను చెల్లింపునకు ఎగనామం పెడుతున్నాయి. నకిలీ రశీదులతోనే దేశవ్యాప్తంగా తిరిగేస్తున్నాయి. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. అధికారులు చేపట్టే తనిఖీలో లోతుగా పరిశీలిస్తేనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక కొంత మంది మోసగాళ్లు రాష్ట్ర సరిహద్దులో పాగా వేశారు. పన్ను చెల్లింపుదారులను అప్పన్నంగా దోచుకుంటున్నారు. పన్ను చెల్లించినట్లు తప్పుడు రశీదులిచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కారణాటతో ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 60 లక్ష నుంచి రూ. కోటి వరకు రాష్ట్రానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఎగవేతకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.నిబంధనల ఉల్లంఘనచిత్తూరు మీదుగా బెంగళూరు, తమిళనాడు వెళ్లే బస్సులు నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ప్రధానంగా లగేజీలను తరలిస్తున్నాయి. ఈ ట్రావెల్స్ బస్సులు లగేజీలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి కూడా ట్రావెల్స్కు అనుమతి లేదు. రిజర్వేషన్ లేకుండా బండి ఆపిన చోట ప్రయాణికులను ఎక్కించుకుని పోతున్నాయి. వీటిని కట్టడి చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.ఒకే బస్సు పేరుతో..అలాగే కొందరు బస్సు నిర్వాహకులు పన్ను విషయంలో కక్కుర్తి పడుతున్నారు. ఒకే బస్సు నంబరుతో మరొకటి కూడా నడుపుకుంటున్నారు. ఎక్కువగా ట్రావెల్స్ నిర్వాహకులే ఇలాంటి దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఏళ్ల తరబడి ఒకటి రెండు బస్సులకు పన్ను చెల్లింయెకుంటూ మిగిలిన వాటిని అదే నంబర్తోనే నడుపుతున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కొంత మంది పన్ను కట్టకుండా తిరుగుతూ...కేసులు పెట్టించుకుంటున్నారు. ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పన్ను చెల్లింపును తగ్గించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.ప్రత్యేక బృందాలతో తనిఖీప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశాం. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా బస్సులను తనిఖీలు చేసేలా ఆదేశాలిచ్చాం. ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాక్స్ ఎగవేతకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాటిని పసిగట్టి జరిమానా విధిస్తున్నాం. అతిక్రమిస్తే కేసులు పెడుతున్నాం.– నిరంజన్రెడ్డి, డీటీసీ, చిత్తూరు -
స్థానిక సమస్యలపై నిర్లక్ష్యం వీడండి
– జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు కార్పొరేషన్ : స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వీడాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్మన్ అధ్యక్షతన, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు ఎప్పటిలాగే శాఖలపరంగా మార్పులేని ప్రగతి నివేదికను తెలియజేశారు. పలు సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జెడ్పీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మాణానికి టెండర్లు పిలవాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఓవర్హెడ్ ట్యాంక్లను నిర్ణీత సమయంలో శుభ్రం చేయిస్తుండాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విషజర్వాలకు సరైన చికిత్స అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యం సక్రమంగా అందించాలన్నారు. ఈ వర్షాకాలంలో ఇరిగేషన్ అధికారులు నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీల్లో విద్యుత్ వృథాను అరికట్టాలన్నారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లో వేచి ఉన్నారని, సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఏనుగుల కట్టడికి సోలార్ పెన్సింగ్ ఏర్పాటుకు జెడ్పీ నిధుల విడుదల చేసినా పురోగతి ఎందుకు కనిపించడం లేదన్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు? డిసెంబర్ 2023 నుంచి కొత్త పింఛన్లు రావడం లేదని, ఎప్పుడిస్తారని పాలసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు అన్బలగన్ అధికారులను నిలదీశారు. కనీసం స్పౌజ్ పింఛన్లకు కూడ అవకాశం కల్పించకపోవడం బాధకరమన్నారు. తల్లికి వందనం పథకం అర్హులైన వారికి కూడా ఎందుకు పడడం లేదన్నారు. వనదుర్గాపురంలోని యూపీ పాఠశాలను 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎస్ఆర్ఎన్ కండ్రిగలో విలీనం చేశారన్నారు. విద్యార్థులు రోజు అంత దూరం ఎలా వెళ్లి చదువుకోవాలని నిలదీశారు. పంచాయతీరాజ్ పరిధిలో ఎన్ఆర్జీఎస్ ద్వారా చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులకు బిల్లులు ఎప్పుడిస్తారని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి ప్రశ్నించారు. రైతుల వద్ద డబ్బులు కట్టించుకుని వ్యవసాయ సర్వీసులు సకాలంలో ఇవ్వడం లేదని పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి తెలిపారు. పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదని ఎర్రవారిపాళెం జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్రెడ్డి తెలిపారు. దీంతో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. తిరుపతి ఐసీడీఎస్ పీడీ జెడ్పీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని సత్యవేడు జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి ప్రశ్నించారు. అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తయిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని శ్రీకాళహస్తి జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి తదితరులు పాల్గొన్నారు. ఆ అధికారులకు మెమోలు ఇవ్వండి కొందరు జిల్లా అధికారులకు జెడ్పీ సమావేశాలు అంటే నిర్లక్ష్యంగా మారిందని జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు సమావేశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అటవీశాఖ, ఐసీడీఎస్, డీపీఓ,డీఆర్డీఎ, ఎన్హెచ్ఎఐ, విద్యుత్శాఖ అధికారులకు మెమోలు ఇవ్వాలని డిప్యూటీ సీఈఓను ఆదేశించారు. -
ఆశా ఇంటర్వ్యూలకు 142 మంది హాజరు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆశా కార్యకర్తల ఇంటార్వ్యూలు నిర్వహించారు. మొత్తం 69 పోస్టులకు 174 మంది దరఖాస్తు చేసుకోగా 142 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరందరికి డీఎంహెచ్ఓ సుధారాణి సమక్షంలో ఇంటార్వ్యూ చేశారు. రెండు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలతో ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఆశ నోడల్ అధికారి హనుమంతరావు, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, అధికారులు ప్రవీణ, గిరి, రమేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వర్గపోరుతో వాస్తవాలు బట్టబయలు
– టీడీపీ నేత గుండయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు! సాక్షిటాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలలకే నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కొందరు నేతల బండారం బయట పెడతున్నారు. వాస్తవాలను వెల్లడిస్తూ ఒకరిపై ఒకరూ దుమ్మెత్తి పోసుకుంటూ, వారు చేస్తున్న అక్రమాలను బయట పెట్టుకుంటున్న సంఘటన గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కోడైకూస్తోంది. శ్రీరంగరాజపురం మండలంలోని టీడీపీ నాయకుడు గుండయ్య అవినీతి అక్రమాలను అదే పార్టీకి చెందిన పలువురు నాయకులు బయట పెట్టడం చూసి, ప్రజలు విస్తుపోస్తున్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన గుండయ్యకు రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని కూటమి నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శనివారం శ్రీరంగరాజపురం ప్రెస్క్లబ్లో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకుడు గుండయ్యకు రాణిపేట, తిరుపతి, శ్రీరంగరాజపురంలో జాతీయ రహదారికి ఆనుకుని మూడంతస్తుల భవనాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకుంటూ నియోజకవర్గం వ్యాప్తంగా ఫీల్డ్అసిస్టెంట్లు, సంఘమిత్రల వద్ధ భారీగా వసూళ్లకు పాల్పడ్డాని ఆరోపించారు. అలాగే పెనుమూరు మండలంలో అంగన్వాడీ ఉద్యోగాలను అమ్ముకున్నాడని, నియోజకవర్గం వ్యాప్తంగా గ్రావెల్ మాఫియాకు పాల్పడి, రూ.లక్షల దండుకున్నాడని ఆరోపించారు. ఇవి చాలవన్నట్లు సెటిల్ మెంట్లు చేస్తూ రూ.లక్షల అవినీతికి పాల్పడ్డాడని, అందుకు తగిన రుజువులు తమ వద్ద ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండయ్య చేసిని అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసి, పేదలకు న్యాయం చేయాలన్నారు. గుండయ్యను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని, ఆయన భార్యను కూడా ఏఎంసీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. -
త్యాగాలు మరువలేనివి
● ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ ● మాజీ సైనికులకు సత్కారం చిత్తూరు కలెక్టరేట్ : దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికా రి రాఘవులు అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, మాజీ సైనికులకు సత్కారం చేశారు. అనంతరం గాంధీబొమ్మ నుంచి అమర్ జవాన్ స్థూపం వరకు ర్యాలీ చేసి, అమరవీరులకు నివాళులర్పించారు. తరువాత కార్గిల్ యుద్ధంలో పా ల్గొన్న సైనికులు, మాజీ సైనికులను సత్కరించారు. మాజీ సైనికులు పళని, రాజన్, సూపరింటెండెంట్ రజాఖ్ ఖాన్, వెల్ఫేర్ ఆర్గనైజర్ వినా యకరెడ్డి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో.. నగరంలోని నెహ్రూ యవకేంద్రం ఆధ్వర్యంలో స పోర్ట్ కార్యాలయం ఆవరణలో కార్గిల్ విజయ్ ది వస్ నిర్వహించారు. జిల్లా యువజన అధికారి ప్ర దీప్ కుమార్, యువభారత్ ప్రాంతీయ గణాంక అ ధికారి బాబురెడ్డి మాట్లాడారు. అనంతరం మొక్క లు నాటారు. కెప్టెన్ మనోజ్కుమార్ పాండే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుమార్, జోషప్ రా జు, రాజకుమారి, వహీదా, హరీష్ పాల్గొన్నారు. -
పర్యావరణ అనుమతులు తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పనులు అటవీ మార్గాల వైపు వెళితే, తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాలని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాడింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి పనులు వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నిర్మించాలన్నారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనల మేరకు రహదారి నిర్మాణంలో అనుకూలించిన ప్రదేశాల్లో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు అండర్పాస్లు నిర్మించాలన్నారు. ప్రత్యేకంగా ఏనుగుల కోసం కర్ణాటక ఆర్టీసీ శాఖ బందిపూర్, నేషనల్ పార్కులో అమలు చేసిన యాంత్రిక రైల్వే అడ్డంకి రూపకల్పనను జిల్లాలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జీవ వైవిద్యాన్ని సంరక్షించుకునేందుకు ఎకో సెన్సిటీవ్ జోన్ పరిధిలో పది మీటర్ల మేరకు వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ స్పందన బృందా న్ని ఏర్పాటు చేసు కోవాలన్నారు. రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీధర్, అనంతపురం, తిరుపతి కన్జర్వేటర్ యశోదబాయ్, జిల్లా అటవీ శాఖ అధికారి భరణి, ఎన్హెచ్ఏఐ పీడీ కార్తీక్ పాల్గొన్నారు. ● కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ -
రైతు పొలంలో కొండచిలువ
వి.కోట: ఓ రైతు వ్యవసాయ పొలంలో కొండచిలువ హాల్చల్ చేయడంతో రైతులు భయంందోళనకు గురైన సంఘటన వి.కోట మండలం కొడగళ్లు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రైతుల కథనం మేరకు.. కొడగళ్లు గ్రామంలోని భార్గవ్ మల్బరి తోటలో రైతుకు కొండచిలువ కనిపించింది. దీంతో భయందోళనకు గురై ఆయన పరుగులు తీశాడు. పొరుగున ఉన్న రైతులకు ఈ విషయం తెలిపాడు. అనంతరం మండలంలోని పెద్ద్దరాంపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ రాజ్కూమార్కు సమాచారం అందించారు. ఆయన ఘటన స్థలానికి చేరుకుని దాదాపు 9 అడుగులు ఉన్న కొండచిలువను చాకచాక్యంగా పట్టుకుని కొమ్మరమడుగు అటవీ ప్రాంతంలో విడిచి పెట్టిన్నట్లు రైతులు తెలిపారు. నల్లమందు తిని ఆవుకు గాయాలు పులిచెర్ల(కల్లూరు) : అడవి పందుల కోసం ఏర్పా టు చేసిన నల్లమందు ఉండలను నమిలిన ఆవు తీ వ్రంగా గాయపడింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని 102 ఇ రామిరెడ్డిగారిపల్లె పంచాయ తీ చిగరమాకులపల్లెకు చెందిన రైతు మల్లికార్జున శనివారం తన ఆవును మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ వేటగాళ్లు ఉంచిన నల్లమందు ఉండలను ఆవు నమిలింది. దీంతో ఆవు నోరు ఛిద్రమైంది. బాధితుడు లబోదిబోమంటున్నాడు. -
మామిడి రైతులు వివరాలు సరి చూసుకోవాలి
– జిల్లా ఉద్యానశాఖాధికారి మధుసూదన్రెడ్డి బంగారుపాళెం: ఫ్యాక్టరీలకు మామిడికాయలను పంపిన రైతులు వివరాలను సరి చూసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి సూచించారు. శనివారం బంగారుపాళెంలో వీఆర్వోలు, వ్యవసాయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మామిడితోటల్లో పండించిన తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు పంపిన రైతుల వివరాలను ఆయా రైతు సేవా కేంద్రం సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు. మామిడి పంటను పంపిన రైతులు ఆయా రైతు సేవా కేంద్రం సిబ్బంది వద్ద తమ వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్, ఫ్యాక్టరీకి పంపిన కాయల తూకం, ఎన్నిలోడ్లు సరఫరా చేశారనే వివరాలు సరి చూసుకోవాలని తెలిపారు. ఆర్బీకే సిబ్బంది ప్రతి రైతుతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకుని కచ్చితమైన వివరాలను అందజేయాలని చెప్పారు. ర్యాంప్లకు సరఫరా చేసిన రైతుల జాబితా వివరాలను మరో వారం రోజుల్లో రైతు సేవా కేంద్రం సిబ్బందికి అందజేయనున్నట్లు చెప్పారు. తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యానశాఖ అధికారి సాగరిక, ఏఓ భారతి పాల్గొన్నారు. -
ముప్పుతిప్పలు పెట్టిన చిన్నారి పెళ్లి కూతురు!
చిత్తూరు: ఓ మహిళా పోలీసును చిన్నారి పెళ్లికూతురు ముప్పుతిప్పలు పెట్టించిన ఘటన చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కార్వేటినగరం మండలానికి చెందిన బాలిక (16)కు తల్లిదండ్రులు లేరు. తిరుపతి జిల్లాలోని సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అప్పుడప్పుడూడు చిత్తూరు మండలం బీఎన్ఆర్పేటలో ఉన్న అక్క దగ్గరకు వచ్చి వెళుతుంటోంది. ఈ క్రమంలో బీఎన్ఆర్పేట సర్కిల్లో షాపు నిర్వహిస్తున్న యాదమరి మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంరక్షణ కేంద్ర సిబ్బంది బీఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు ఆ మైనర్ బాలికను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మెడికల్ రిపోర్ట్, ఇతరాత్ర అవసరాల నిమిత్తం మహిళా పోలీసు వంగి సంతకం పెట్టే లోపు.. బాలిక మాయమైంది. దీంతో ఆ మహిళా పోలీసు తెగ టెన్షన్ పడిపోయింది. బస్టాండు మొత్తం గాలించారు. చివరకు బెంగళూరులో ఆ బాలికను గుర్తించి.. మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. -
వివాదాస్పదంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహార శైలి.. భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘రెండు నెలలు క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయికి ఫ్యాక్చర్ అయ్యింది. చేయి గాయం కారణంగా గన్ మెన్ కాలేశా ఔదార్యపూరితమైన పెద్దిరెడ్డికి సహాయం చేశాడు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించరు. అందుకే పెద్దిరెడ్డితో పాటుగా గన్మెన్.. మిథున్ రెడ్డి ఉన్న జైలుకు వెళ్లారు. మిథున్రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును పెద్దిరెడ్డి మోయలేకపోవడంతో.. దాన్ని గన్మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ మణికంఠ.. కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇలా చేయడం సరికాదు.ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో పనిచేయిస్తున్నారు. ఎస్పీ వెంటనే వారిని తొలగించి ఆదర్శంగా ఉండాలి. ఆత్మ న్యూనత భావంతో పనిచేయకండి. కాలేశా సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు.. మిగతా వారిని కూడా సస్పెండ్ చేస్తారా?.ఇదిలా ఉండగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహారశైలి మరోమారు వివాదస్పదమయ్యింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ రూట్ మ్యాప్ అప్పటికప్పుడు మారుస్తూ, ఆంక్షలు విధించిన ఎస్పీ.. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి గన్మేన్ కాలేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండగా, రెండు రోజుల క్రితం ఆయనను పరామర్శించడానికి రామచంద్రారెడ్డి వెళ్లారు.ఇటీవల పెద్దిరెడ్డి చేయి విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును ఆయన మోయలేకపోవడంతో.. దాన్ని గన్మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ, కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మానవతాదృక్పథంతో బ్యాగు తీసుకున్నందుకు తనను సస్పెండ్ చేయడం తగదని కాలేషా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇక గతేడాది జూలైలో ఎంపీ మిథున్రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంలో అక్కడ టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడి, కార్లకు నిప్పంటించారు. మిథున్రెడ్డిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటడంతో మిథున్రెడ్డి గన్మేన్ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ నాడు మిథున్రెడ్డి గన్మేన్ను సైతం సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా ఎస్పీ మణికంఠ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. -
యువతకు ఆదర్శం నీలం సంజీవరెడ్డి
తిరుపతి సిటీ : నైతికత, విలువలతో కూడిన నాయకత్వం, నిజాయతీ, ప్రజాసేవ నీలం సంజీవరెడ్డి సొంతమని ఆయన నేటి యువతకు ఆదర్శమని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి కొనియాడారు. ఎస్వీయూ రాజనీతి, పాలనాశాస్త్ర విభాగం సహకారంతో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్ హాల్లో శుక్రవారం నీలం సంజీవరెడ్డి 3వ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా వ్యవసాయ ఆవశ్యకతను తెలుసుకుని గ్రామీణ, వ్యవసాయ పురోగతికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి దూరదృష్టితో స్థాపించిన ఎస్వీయూ వేల మంది విద్యావేత్తలను, ప్రజా నాయకులను తయారు చేసిందన్నారు.అనంతరం రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి పేరిట రాష్ట్ర పురస్కారాలను ఏర్పాటు చేసి ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అగ్రశ్రీ సంస్థకు ఆర్థికంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహరించాలని సూచించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాలను అందజేశారు. విశిష్టరత్న పురస్కారాన్ని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డికి, న్యాయ శిరోమణిని మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషసైనారెడ్డికి, విద్యాశిరోమణిని గీతం వర్సిటీ మాజీ వీసీ దయానంద్కు, వైద్య శిరోమణి పురస్కారాన్ని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పూర్ణచంద్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కార గ్రహీతల గౌరవార్థం అగ్రశ్రీ సంస్థ ప్రచురించిన విశేష సంచికను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అగ్రశ్రీ సంస్థ సంచాలకులు డాక్టర్ డి సుందరరామ్, ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ప్రొఫెసర్ మురళీధర్, మళ్లీశ్వరరావు, పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. -
సన్నిహితులకు రక్ష.. చిరుద్యోగులకు శిక్ష
● వైకుంఠ ద్వార దర్శన భక్తుల తొక్కిసలాట ఘటన విచారణపై ఎన్నో అనుమానాలు ● సంబంధం లేని ఉద్యోగులపై వేటు ● ఉన్నతాధికారులు, పాలక మండలికి బాధ్యత లేదా? ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు సాక్షి టాస్క్ఫోర్స్ : వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 8న తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బలిపశువులను చేసి చేతులు దులుపుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులపై ఎటువంటి చర్యలు లేకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన అనంతరం తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు చెప్పినట్టే నేడు చర్యలు తీసుకోవడంపై శ్రీవారి భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సన్నిహితులను కాపాడే కుట్రలో భాగంగా చిరుద్యోగులను బలిపశువులను చేశారంటూ మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఐ చేత విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతి పద్మావతి పార్కువద్ద నున్న రామానాయుడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా.. 40 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై నాడు ఎస్పీ, జేఈఓని బదిలీ చేశారు. మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఆ ఘటనపై విచారణ చేపట్టింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తితో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా 54 మంది ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబీకులు, గాయపడ్డ వారు, వారి బంధువులు, పోలీసు, విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులను కమిషన్ విచారించినట్లు తెలిపారు. తొక్కిసలాటకు ఇద్దరు అధికారులదే ప్రధాన బాధ్యత అని కమిషన్ అభిప్రాయపడినట్లు వెల్లడించారు. అందులో భాగంగా డీఎస్పీ వి. రమణకుమార్, శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని బాధ్యులను చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులపై చర్యలేవీ? అంత పెద్ద ఘటన జరిగితే.. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో కీలక భూమిక పోషించే టీటీడీ ఈఓ, ఏవీఎస్ఓ, పాలకమండలి సభ్యుల్లో ఏ ఒక్కరిని బాధ్యులను చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు వైకుంఠ ద్వార దర్శనానికి పదిరోజులు పెంచి భక్తులందరికీ అవకాశం కల్పించినా ఏ ఒక్క చిన్న పొరబాటు జరగకపోయినా.. పది రోజులు దర్శనం పెట్టిందే తప్పు అన్నట్టు కూటమి పెద్దలు ఆరోపణలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. తొక్కిసలాట వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నా.. నివేదికలో ఏముందనే విషయం కూడా బహిర్గతం చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. ప్రభు త్వం తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దు లుపుకోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అవే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. సన్నిహితులను కాపాడేందుకేనా? తొక్కిసలాట అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆ రోజే వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు సీఎం చంద్రబాబు ఏదైతే చెప్పారో.. అదే విషయాలు నివేదికలో పొందుపరిచినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సన్నిహితులను కాపాడేందుకే ఇద్దరు అధికారులను బలిపశువులను చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తూతూ మంత్రంగా విచారణ జరిపినట్లు వెల్లడించారు. అప్పట్లో భక్తులు చెప్పిన బాధలు, సమస్యలను పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలురని ప్రచారం చేసి.. తొక్కిసలాటకు సంబంధమే లేని వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అతడిని బలిపశువును చేశారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
వారందరూ చీడ పురుగులే?
● కలెక్టరేట్లో ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదు ● మండిపడ్డ జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ సాక్షి టాస్క్ఫోర్సు: తన పీఏ చంద్రశేఖర్పై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన వారందరూ చీడపురుగులేనని జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా టీడీపీ గెలవని నియోజకవర్గంలో తాను గెలిచానని చెప్పారు. కొంతమంది పార్టిలో చీడపురుగులుగా చేరి తనపైన, తన పీఏపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ‘నా చేయి ఎక్కడ తాకినా బంగారమే.. నాకు కోట్ల రూపాయల సంపాదన ఉంది.. ఈ కొద్ది కాలంలో నా లెటర్ ప్యాడ్లు కూడా కొన్ని కనిపించ లేదు. ఫొటో షాప్లో కొందరు కలర్ జిరాక్స్ చెసి వాడుకున్నట్లు సమాచారం ఉంది. వాటన్నిటినీ కట్టడి చేస్తున్నా. ఈ క్రమంలో కొందరు పార్టీ పేరు చెప్పుకుని నా వెనుక చీడపురుగుల్లా చేరి పార్టీకి, నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెటినందుకే ఇలా ఫిర్యాదు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. తన పీఏ ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తే ఇప్పుడు తన వద్ద పనిచేయకూడదా..? అని ప్రశ్నించారు. -
ఎంపీ మిథున్ విడుదల కావాలని ప్రార్థన
బంగారుపాళెం: అక్రమ మద్యం కేసు నుంచి ఎంపీ మిథుర్రెడ్డి నిర్ధోషిగా బయటకు రావాలని కోరుతూ స్థానిక ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం బంగారుపాళెం ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కో–ఆప్సన్ సభ్యుడు ఫిరోజ్అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబంపై రాజకీయ కుట్రతో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదలి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలు చేపట్టడం తగదన్నారు. మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, ముస్లిం నాయకులు అహ్మద్బాషా, రియాజ్, చందులాల్ పాల్గొన్నారు. -
కేక్ కట్ చేస్తే తప్పేంటి?
టీడీపీ అల్లరిమూకలు దాడులు చేయడం తగదు ● వారికి అండగా పోలీసులు నిలవడమేంటి? ● గర్భిణిని కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయడం కనిపించలేదా? ● స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దాడులు ● ధ్వజమెత్తిన విజయానందరెడ్డి ● బాధితులకు ఆర్థిక సాయం చిత్తూరు కార్పొరేషన్: అభిమానంతో తన పుట్టినరోజు నాడు అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేస్తే తప్పేమిటని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం గంగనపల్లె, గంగకాలనీల్లో తన బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేయడం బాధాకరమన్నారు. గంగకాలనీకి చెందిన అరుణ్, రాజేష్ కేక్కట్ చేస్తే అది గిట్టని టీడీపీ డివిజన్ ఇన్చార్జ్ పచ్చయప్ప అల్లరిమూకలను రెచ్చగొట్టారని తెలిపారు. టీడీపీ నాయకులకు అండగా పోలీసు వ్యవస్థ ఉందని ఆరోపించారు. టు టౌన్ సీఐ నెట్టి కంఠయ్య సహకారంతో గుండాలు ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేసి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఐ ప్రరవర్తన మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కో–ఆప్షన్ సభ్యుడు ఆను నివాసం వద్ద పదుల సంఖ్యలో అల్లరిమూకలు చేరుకుని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్నారు. అద్దాలు పగులగొట్టారని తెలిపారు. అలాగే గంగకాలనీలో 9వ తరగతి చదువుతున్న అరుణ్ సోదరి స్వాతిని జుట్టుపట్టుకుని కొట్టారని, గర్భవతి అయిన రాజేష్ భార్య గోమతిని కొట్టారని తెలిపారు. ఆమె స్ఫృహ కోల్పోవడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. రాజేష్ తల్లి రాజేశ్వరి టీడీపీ కార్యకర్తల కాళ్లు పట్టుకొని బతిమాలాడినా జాలిచూపకుండా దౌర్జన్యం చేశారన్నారు. ఈ విధ్వంసానికి కారణం చిత్తూరు ఎమ్మెల్యే అని విమర్శించారు. ఆయన అనుచరుడి ఆదేశాల మేరకు పోలీసుల సహకారంతో గొడవ చేశారన్నారు. పథకం ప్రకారం విద్యుత్ సరఫరా ఆపివేయించి దాడులు చేశారని తెలిపారు. మీరు సంబరాలు చేసుకోలేదా? టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల పేరిట సంబరాలు చేసుకోలేదా..? అని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. గంగకాలనీలో అలజడి సృష్టించారన్నారు. పార్టీ, విజయానందరెడ్డి పై అభిమానంతో కేక్కట్ చేస్తే టీడీపీ నాయకులకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సాయం బాధితుల నివాసాలకు విజయానందరెడ్డి వెళ్లి పరామర్శించారు. ఘటనలో ధ్వంసమైన వస్తువులను చూసి వారితో మాట్లాడారు. ఒకొక్కరికీ రూ.50 వేలు చొప్పున మొత్తం లక్ష సాయం చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, చుడా మాజీ చైఛైర్మన్ పురుషోత్తంరెడ్డి, గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు శివారెడ్డి, హరిషారెడ్డి, మురళీరెడ్డి, మధురెడ్డి, రాజేష్రెడ్డి, చామంతి, జగ్గా, అప్పొజీ, శేఖర్ పాల్గొన్నారు. -
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ ఏర్పాటు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. వైద్యశాఖ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ ఏర్పాటుకు కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. వయస్సు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా జనాభాలోని అన్ని వర్గాల్లో అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడంతో వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏఎన్ఎం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇతర వైద్య సిబ్బందికి ఎన్సీడీ పై అవగాహన కల్పించాలని చెప్పారు. సీఎంసీ ఆధ్వర్యంలో హెచ్డబ్ల్యూసీ, పీహెచ్సీల్లో టెలీ కన్సల్టెన్సీ విషయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీఎంఅండ్హెచ్వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, సీఎంసీ ఆస్పత్రి ప్రతినిధి డాక్టర్ శిరీష పాల్గొన్నారు. పకడ్బందీగా బంగారు కుటుంబాల సర్వే జిల్లాలో బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించేందుకు చేపడుతున్న సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పీ–4 గ్రామ సభ వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలో ప్రతి సచివాలయంలో పది మంది మార్గదర్శకులను ఎంపిక చేసే ప్రక్రియ ఈ నెల 26 నుంచి చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 65,451 కుటుంబాలను గుర్తించగా 6,515 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు. మహిళలకు రాయితీ డ్రోన్లు చిత్తూరు కలెక్టరేట్ : రాయితీతో వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లను చదువుకుని సాంకేతికత ఉన్న మహిళలకు అందిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లాలో అలాంటి మహిళలను గుర్తించాలని ఏపీఎం సీసీలను ఆదేశించారు. డ్వాక్రా మహిళలు కొత్త తరహా జోవనోపాధులపై దృష్టి వహించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళల జీవనోపాధులు మెరుగుపడాలన్నారు. గ్రామాల్లో మెరుగైన జీవనోపాధులను గుర్తించాలన్నారు. కొత్త తరహా వ్యాపారాలపై సంఘ సభ్యులు మక్కువ పెడితే వారి ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయన్నారు. ప్రత్యేక వార్షిక ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు 2.0 తో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు 45 మంది లబ్ధిదారులకు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్తో రూ.50 వేలు విలువ చేసే ఎగ్ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో డీపీఎంలు రవికుమార్, సునీతాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..
కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆపదలో 'అమ్మ'!
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది.చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సర్వైకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్ క్యాన్సర్, 218 మందికి రొమ్ము క్యాన్సర్, 203 మందికి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తి ఇలా...సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సర్వైకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.వ్యాక్సినేషన్ మాటేమిటోఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్బారిన పడకుండా వ్యాక్సినేషన్ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సర్వైకల్ క్యాన్సర్పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు» రుతుక్రమంలో సమస్యలు» యోని నుంచి రక్తస్రావం » లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం» పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం » యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం » మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు » పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలువ్యాక్సిన్ ఉందిగంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు. – ఆశ్రీత, వైద్య నిపుణులుగ్రామాల్లోనే అధికంగ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరుముందే గుర్తిస్తే మేలుసర్వైకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – సుధారాణి, డీఎంఅండ్ హెచ్ఓ, చిత్తూరు -
టీడీపీ ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.థామస్ పీఏ చంద్రశేఖర్ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. -
పూల సాగు.. ఆదాయం బాగు
సంప్రదాయ పంటలతో నిత్యం నష్టపోతున్న రైతులు ఇప్పుడు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. కొత్తరకం పూలసాగులో అధిక లాభాలు వస్తుండడంతో వీటిపై రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఆడి నెలల్లో మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పూల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చెరుముందరకండ్రిగ గ్రామంలో విరివిగా పూలు సాగు చేస్తున్నారు. –పాలసముద్రంచెరుముందరకండ్రిగ గ్రామంలో 200 పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలు కష్టపడి పంటలు సాగు చేసి ముందుకు ఎదుగుతున్నారు. రైతులు వరి, చెరకు పంటలు సాగు చేసి అప్పుల పాలైపోయారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడి భూముల్లో వివిధ రకాల పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బంతి, నాటు చామంతి, మల్లిపూలు, కనకాబరం సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది హైబ్రీడ్ వెల్వెట్, హైబ్రీడ్ చామంతి, కొత్తగా పసుపు, తెలుపు రంగుల గులాబీ పూలను సాగు చేస్తున్నారు. ఉదయం తోటలోని పూలను కూలీలతో కోసుకుని తమిళనాడులోని తిర్తుతణి, వేలూరు, చైన్నై మార్కెట్లకు తీసుకెళ్లుతున్నారు. ఇలా చేయడంతో పూలకు మంచి గిరాకీ ఉన్నప్పుడు వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. ఇలా మండల పరిధిలో శుభ కార్యాలయాలకు కూడా ఇక్కడకు వచ్చి పూలను తీసుకెళ్తున్నారు. పూల సాగుతోనే చెరుముందరకండ్రిగ గ్రామ రైతులు లాభాల బాటలో నడుస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఇక్కడ సాగు చేసిన పూలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పండుగ సీజన్లో బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులే ఇక్కడికి వస్తున్నారు. తోటల వద్దనే కొనుగోలు చేసి తీసుకెళ్లుతారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో మరిన్ని కొత్తరకం పూలు సాగు చేయడానికి గ్రామంలో రైతులు ఆసక్తి చూపుతున్నారు.మార్కెట్లో మంచి గిరాకీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పూలనే ఎంచుకుని సాగు చేస్తున్నారు. హెబ్రీడ్ చామంతి, వెల్వెట్ సాగుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. మ్యారీగోల్డ్, మ్యారీ పింక్ సాగుకు ఎకరానికి రూ.90 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎకరా భూమికి 10 నుంచి 12 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేలు నుంచి రూ.29 వేలు, బాడుగతో సహా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఎరువులు, దుక్కులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు కలుపుకుంటే గరిష్టంగా రూ.50 వేల నుంచి రూ.90 వేలు వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల పూలు కాస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రీడ్ చామంతి, గులాబీ పూల ధరలు కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మల్లెలు, కాకడ పూలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది, కనకాంబరం కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీపావళి, ఆడి నెల, కార్తీక మాసాల్లో పూల ధరలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లో కిలో పూలు రూ.150 వరకు పలుకుతాయి. మల్లెల సాగుతో లాభాలు చెరుముందర కండ్రిగలో ఎకరా మల్లెపూల తోట సాగు చేశాను. ఖర్చు రూ.50 వేలు అవుతుంది. ఆదాయం లక్షన్నర వస్తుంది. ప్రతి రోజు పూల తోటలో పూలు కోసుకుకెళ్లి తిరుత్తణి, చెన్నై మార్కెట్కు ఎగుమతి చేస్తున్నాను. కిలో మల్లెమొగ్గలు రూ.65 నుంచి రూ.75 ధర పలుకుతాయి. రోజుకి సుమారు 25 కిలోల పూలు తీసుకెళ్లుతాను. రోజు కూలీకి పోను రూ. వెయ్యి వస్తుంది.–వడివేలురెడ్డి, చెరువుముందర కండ్రిగ మ్యారీగోల్డ్, గులాబీ సాగు చేస్తున్నాం మాకున్న భూముల్లో మ్యారీగోల్డ్, గులాబీ పూల తోట సాగు చేస్తున్నాను. రెండు బోర్లు వేశాను. నీరు రాకపోవడంతో వరి, చెరకు సాగు చేయకుండా ఉన్న తక్కువ నీటిలోనే ఎకరాకు పైగా పూలు సాగు చేస్తున్నా. ఆదాయం బాగానే వస్తుంది. కొత్తరకం పూలు సాగు చేస్తే తోట వద్దకే వ్యాపారులు వచ్చి పూలను తీసుకెళ్లుతారు. మాగ్రామంలో ప్రతి ఒక్కరు పూల సాగుపైగా ఆధారపడి ఉన్నాం. –మత్యాలురెడ్డి, చెరువుముందరకండ్రిగపూల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో పూల తోటల సాగుపై హారి్టకల్చర్, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. అయితే చెరుముందరకండ్రిగ గ్రామంలోని రైతులు పూలతోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా వివిధ రకాల పూలతోటలు సాగు చేసి, ఆదాయం పొందుతున్నారు. –ఢిల్లీప్రసాద్, మండల వ్యవసాయాధికారి -
Kuppam: ప్రియుడు ఇంటి ఎదుట మంటల్లో కాలిన యువతి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం మండలం మార్వాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు ఇంటి ఎదుట ఓ యువతి మంటల్లో కాలింది. బాధితురాలిది ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు.ఆర్టీసీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి మార్వాడకు చెందిన వాసుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే, ప్రశాంతితో ప్రేమకు ముందే వాసుకు వివాహం జరిగింది. ఈ క్రమంలో గురువారం ప్రశాంతి.. మార్వాడలో ఉన్న వాసును కలిసేందుకు అతని ఇంటికి వచ్చింది.ఈ క్రమంలో ప్రశాంతి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు యువతికి అంటుకుంటున్న మంటల్ని ఆర్పేశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా,బాధితురాలు ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు సమాచారం.వాసు ఇంటి ఎదుట మంటల్లో కాలిన యువతి ,ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంతిది ఆత్మహత్యా? లేక నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఆహార ఉత్పత్తుల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి
తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. వర్సిటీలోని సెనేట్ హాల్లో గురువారం ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, డైటిక్స్ –ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విభాగాలు సంయుక్తంగా అప్లికేషన్స్ ఆఫ్ టెక్చర్ అనాలిసిస్ ఇన్ ఫుడ్ సైన్స్ అన్న అంశంపై వర్క్షాపు నిర్వహించారు. ఇందులో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ విభాగాన్ని, ఆహార ఉత్పత్తి పరిశ్రమలను అనుసంధానం చేస్తామన్నారు. యూఎస్లోని పూర్వడా వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, రాగిణి శర్మ మాట్లాడుతూ మానవ శారీరక నిర్మాణానికి అవసరమైన ఆహారం, నీరు, పోషకాల ప్రాధాన్యతను వివరించారు. రిజిస్ట్రార్ భూపతినాయుడు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, ప్రొఫెసర్ మంజుల, కేవీ సుచరిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్కారు బడులు నిర్వీర్యం
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం సర్కారు బడులను నిర్వీర్యం చేస్తోందని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. తిరుమల ఆలయంలోనే కాదు భారతదేశంలో ఏ ఆలయాల్లోనైనా, ఎక్కడైనా అన్యమతస్తులు ఉండవచ్చని వా్య్ఖ్యానించారు. ఈ మేరకు గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుమలలో అన్యమతస్తులకు అనుమతి నిరాకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం తదితర అంశాలపై విమర్శలు గుప్పించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్తులను అనుమతించకపోవడం దారుణమన్నారు. అదేక్రమంలో ప్రస్తుతం తిరుమల దేవస్థానంలో దళితులెవ్వరూ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్యమతస్తులకు తిరుమలతో పాటు దేశంలోని అన్ని దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించే అంశానికి సంబంధించి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్య హాజరు తక్కువగా ఉందని సాకు చూపుతూ అనేక ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో కూటమి నాయకులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సంబంధిత అంశాలను రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనించాలని సూచించారు. టీడీపీ, బీజేపీ నాయకుల అవినీతి, అక్రమాలపై తాను పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
ఆకట్టుకున్న దుర్యోధన వధ
సదుం: మండలంలోని భట్టువారిపల్లెలో పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞంలో భాగంగా గురువారం నిర్వహించిన దుర్యోధనవధ ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. భాగవతారణి జ్యోత్స్న మధ్యాహ్నం దుర్యోధన వధ హరికథను గానం చేశారు. వెంటటేశ్వర కళానాట్య మండలి ఆధ్వర్యంలో భీమ, దుర్యోధన పాత్రధారులు యుద్ధ ఘట్టాలను ప్రదర్శించారు. దుర్యోధనుడు మడుగులో దాక్కొని ఉండగా భీముడు అతన్ని బయటకు రప్పించి, శ్రీకృష్ణుని సాయంతో అంతమొందించిన ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. వారు ఆలపించిన పద్యాలు ఆకట్టుకున్నాయి. దుర్యోధనుడి ప్రతిమ మట్టికోసం భక్తులు ఎగబడ్డారు. అంతకుమునుపు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 18 రోజుల పాటు నిర్వహించిన మహాభారత యజ్ఞం ముగిసింది. కార్యక్రమంలో పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కంకణధారులు బాబురెడ్డి, మల్రెడ్డి, బోయకొండ ఆలయ కమిటీ మాజీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, రామాంజులు తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ షాక్తో యువకుడి మృతి
● మృతదేహాన్ని చెరువు కట్టపై పడేసిన ముగ్గురు వ్యక్తులు ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతిచెందినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ డీఎస్పీ సాయినాథ్ కథనం.. చిత్తూరు మండలం, బీఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్లో గురువారం అనుమానాస్పద కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. యాదమరి మండలం, పట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (25) ఆదివారం బీఎన్ఆర్పేట చెరువు కట్టపై శవమై కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణలో గుడిపాల మండలంలోని మంచినీళ్లకుంట గ్రామానికి చెందిన మాధవి ఇంట్లో శనివారం రాత్రి కరెంట్ రాకపోవడంతో సరిచేసేందుకు వెంకటేష్ వెళ్లాడు. కరెంట్ తీగలు సరిచేసే క్రమంలో వెంకటేష్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని మాధవి తన తండ్రి రాజా, తమ్ముడు చందుకు చెప్పింది. వీరి సాయంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి బీఎన్ఆర్పేట చెరువు కట్టపై పడేసి వెళ్లిపోయారు. ఇది సీసీ టీడీ ఫుటేజీ ద్వారా వెలుగుచూసింది. దీని ఆధారంగా కేసు విచారణను పూర్తిచేశామని, నిందితులు నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. -
పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన
నా భర్తను కాపాడండి పలమనేరు: అంతుచిక్కని వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తను కాపాడాలని పలమనేరు నియోజకవర్గంలోని, పెద్దపంజాణి మండలం, బట్టందొడ్డి పంచాయతీ గడ్డూరుకు చెందిన రేణుక అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన భర్త వెంకటరమణ కూలినాలి చేసి కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. ఏమైందోగానీ ఇటీవల ఆయన కడుపుపై చారలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆపై కడుపు బెలూన్లా పెరిగిపోతోందన్నారు. పెద్దాస్పత్రుల్లో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక అల్లాడుతున్నట్టు వాపోయారు. ఇద్దరు పిల్లల పోషణ, భర్తను ఆస్పత్రిలో చూపించడం కష్టతరమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వం స్పందించి తన భర్తను కాపాడాలని కోరారు. నారాయణవనం : మండలంలోని తుంబూరు దళితవాడ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విరమించుకోవాలని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, ఏఎస్ఎఫ్ఐ నేతలు గురువారం తహసీల్దార్, మండల విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఊరి బడిలోనే పిల్లలు చదువుకునే వెసులుబాటును కల్పించాలని, పిల్లలను చదువుకు దూరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీటీ భాను ప్రకాష్, ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉదయ్ కుమార్, మహేష్, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విలీనం పేరుతో పాఠశాలలను మూసివేయడం, డీ గ్రేడ్ చేయడం దారుణమన్నారు. తుంబూరు డళితవాడ పాఠశాలలో చదువుతున్న 56 మంది విద్యార్థులను పది మంది విద్యార్థులే ఉన్న పాఠశాలలో విలీనం చేయడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యాసాగర్, ఇందుమతి, సారా, భాగ్యరాజ్, గోవిందయ్య, ప్రసాద్, మునివేలు, కుప్పలు, చంద్రయ్య, రవి, రాము, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దు
● ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు ● ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి ● బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి ● పలు శాఖల సమావేశాల్లో కలెక్టర్ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : రాజకీయ ఒత్తిళ్లకు జిల్లా అధికారులు తలొగ్గొద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సూచించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ, రక్షణ బాధ్యత ఆయా రెవెన్యూ అధికారులదేనన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజలను ఉద్దేశపూర్వకంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సేకరణలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు తన దృష్టికి వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగరాదన్నారు. ఎక్కడైనా రెవెన్యూ ఉద్యోగులపై దాడులు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్ఎస్లో పరిష్కరించే సమస్యలకు తప్పనిసరిగా ప్రజలకు ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడెల్, ఆర్డీవోలు, పలు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. బడిబయట 4,447 మంది పిల్లలు చిత్తూరు జిల్లాను బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆ సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 4,447 మంది బడిబయట పిల్లలున్నారని తెలిపారు. బడి మానేసిన ప్రతి విద్యార్థి ఇంటికి హెచ్ఎం వెళ్లి మాట్లాడాలన్నారు. విద్యార్థి పరిస్థితిని తెలుసుకుని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలోని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. సమావేశంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ, పలు మండలాల ఎంఈవోలు, క్లస్టర్ హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ఎవరికి చెప్పేది ‘భూ’బాధలు?
ఫ్రీహోల్డ్ భూములపై కూటమి కన్నెర్ర● నిబంధనల మేరకన్న భూములుపైనా ఆంక్షలే ● లేఅవుట్లలో సైట్లను కొని ఇబ్బందులు పెడుతున్న వైనం ● అవసరానికి భూములు విక్రయించాలన్నా కుదరదు ● ప్రభుత్వం నుంచి త్వరలో ఆదేశాలంటున్న అధికారులుపలమనేరు: ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడినట్టుంది భూముల రిజిస్ట్రేషన్లపై కూటమి ప్రభుత్వ తీరు. గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో ఎన్నో అక్రమాలున్నాయని, ఇందుకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఫ్రీహోల్డ్ భూములపై బ్యాన్ పెట్టింది. దీంతో నిషేధిత జాబితాలోని ఇంటి స్థలాలు, పొలాలు కూటమి రిజిస్ట్రేషన్లు లేకుండా పోయాయి. అయితే నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నా ఈ బ్యాన్ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని చాలామంది బాధితులు ఆవేదన చెందుతున్నారు. వీటి రిజిస్ట్రేషన్లపై అనుమతులు ఇస్తామన్న ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు సాకు చూపి మదనపల్లి సబ్కలెక్టర్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయని.. అందుకే ఫైళ్లను దగ్ధం చేశారనే సాకుతో కూటమి ప్రభుత్వం జిల్లాలో గతంలో ఫ్రీహోల్డ్ అయిన అన్ని భూములపై బ్యాన్ పెట్టింది. క్షేత్ర స్థాయిలో సర్వే నంబర్ల వారీగా విచారణ లేకుండానే ఎన్నో అక్రమాలు జరిగాయంటూ ప్రాథమిక విచారణతోనే 1,05,409 ఎకరాలపై నిషేధం విధించింది. లేఅవట్లలో సైతం భారీ అక్రమాలు జరిగాయని చెబుతున్నారేగానీ అవి ఎలా సాగాయి.. ఇందులో నిజమెంతో సంబంధిత అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. జిల్లా సమాచారం ఫ్రీహోల్డ్ చేసిన మొత్తం భూములు : 1,59,327 ఎకరాలు ఆక్రమణలు జరిగాయని ఆరోపణలున్న భూములు : 1,05,409 ఎకరాలు సక్రమంగా ఉన్నాయని చెబుతున్న భూములు : 53,917 ఎకరాలుమా పరిస్థితి ఏంటి? రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫలానా సర్వే నంబరు రిజిస్ట్రేషన్ అవుతుందని చెబితేనే స్థలాలను కొన్నాం. ఇప్పుడు అన్ని సర్వే నంబర్లను బ్యాన్ చేస్తే మా పరిస్థితేంటి. అప్పోసప్పో చేసి జాగాలు కొని ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విచారణల పేరిట ఇలా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. – హేమంత్కుమార్రెడ్డి, పలమనేరుమరో రెండు నెలల్లో.. ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై మరో రెండు నెలలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావచ్చని భావిస్తున్నాం. ఆ మేరకు సక్రమ జాబితాలో ఉన్న భూములు, స్థలాలు తప్పకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఫ్రీహోల్డ్ భూముల సర్వే నంబర్లతో సహా ఆన్లైన్ అయ్యాక వాటిని అప్లోడ్ చేస్తారు. – ఏ.వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్మళ్లీ మొదటికే..! కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు జిల్లాలో కేవలం 53,917 ఎకరాలను మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతులిస్తే మిగిలిన భూముల మాటేమిటో అర్థంకావడం లేదు. అసలు ఫ్రీహోల్డ్లో అక్రమాలు ఎలా జరిగాయో అధికారులు సైతం ఇంతవరకు చెప్పడం లేదు. ఎవరైనా సంబంధిత రిజిస్ట్రర్ కార్యాలయానికి వెళితే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పి పంపేస్తున్నారు. గతంలో సక్రమంగా ఉన్నాయనే వీటిపై క్రయ, విక్రయాలు జరిగాయి. కోట్లాది రూపాయలు పెట్టి చాలా మంది ఈ భూములును కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇవి రిజిస్ట్రర్ కాకపోతే వారి పరిస్థితేంటి. మొత్తం భూములపై విచారణ జరిపి సవ్యంగా ఉన్న భూముల జాబితా ఇస్తామన్న అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. -
అక్రమ అరెస్ట్లతో..
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే చింతల ధ్వజమెత్తారు.●వ్యాక్సిన్ ఉంది గంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు. – ఆశ్రీత, వైద్య నిపుణులు గ్రామాల్లోనే అధికం గ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు ముందే గుర్తిస్తే మేలు సర్వైకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – సుధారాణి, డీఎంఅండ్ హెచ్ఓ, చిత్తూరు – 8లో -
సారా రహిత జిల్లానే లక్ష్యం
కార్వేటినగరం: సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ స్పష్టం చేశారు. గురువారం కార్వేటినగరం ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషన్ మాట్లాడుతూ సారా తయారీ, విక్రయాలు, బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 14405 ద్వారా సమాచారం అందించాలన్నారు. సహకరించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సారా కేసుల్లో పట్టుబడి ఆ వృత్తిని విరమించుకుని జీవనం సాగించే వాళ్లకి పాడి ఆవులు, ఆటోలు లాంటివి అందించి ప్రత్యామ్నాయంగా సహాయం అందిస్తామన్నారు. వైన్షాప్ సమీపంలో పర్మిట్ రూములకు అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్రెడ్డి, చిత్తూరు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, ఎకై ్సజ్ సీఐ శిరీషాదేవి, ఎస్ఐ శ్రావణకుమార్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి
బ్రహ్మోత్సవ పనులు తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు టీటీడీ ప్రారంభించింది. విద్యుద్దీపాలంకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్య బలోపేతానికి కృషి శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025మహిళకు వైద్యపరీక్షలు (ఫైల్)గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. 27న ఫుట్బాల్ సెలెక్షన్స్ పలమనేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన జిల్లా స్థాయి మెన్ ఫుట్బాల్ సెలెక్షన్స్ నిర్వహించనున్నట్టు జిల్లా ఫుట్బాల్ సంఘ నేతలు హేమంత్రెడ్డి, కిశోర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ల కోసం 8712139311 నంబరుకు ఫోన్ చేయాలని వారు సూచించారు. స్లో మోటార్ సైకిల్ రైడింగ్ పోటీలు చిత్తూరు అర్బన్: చిత్తూరులోని సాయుధ దళం కార్యాలయ మైదానంలో 100 మీటర్ల స్లో మోటార్ సైకిల్ రైడింగ్ నిర్వహించనున్నట్టు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. ఆసక్తి గల వారు శనివారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులుంటాయన్నారు. 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్, పెండింగ్ చలానాలు ఉండని వ్యక్తులు అర్హులని ఆయన పేర్కొన్నారు. 27న జిల్లా స్థాయి యోగాసన పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో ఈనెల 27న జిల్లా స్థాయిలో నిర్వహించే యోగాసన పోటీలను అర్హులు, ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుక్తాచౌదరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పోటీల్లో గెలుపొందే మొదటి బహుమతి విజేత రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 6303899780, 9985407782 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇంజినీరింగ్ తొలి విడత అడ్మిషన్లు ప్రారంభం ● సోమవారం నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ తిరుపతి సిటీ : ఎట్టకేలకు ఇంజినీరింగ్ తొలి విడత అడ్మిషన్ల జాబితా బుధవారం విడుదల కావడంతో ఇంజినీరింగ్ కళాశాలలు కోలాహలం నెలకొంది. తొలి విడత సీట్లు సాధించిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో గురువారం రిపోర్ట్ చేసి అడ్మిషన్లు పొందారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్, అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడిగా మారాయి. తొలిరోజు 56 శాతం మేర విద్యార్థులకు అడ్మిషన్లు పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27వ తేదీ వరకు తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అలాగే రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సర్వైకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్ క్యాన్సర్, 218 మందికి రొమ్ము క్యాన్సర్, 203 మందికి సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తి ఇలా... సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సర్వైకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.వ్యాక్సినేషన్ మాటేమిటో? ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్బారిన పడకుండా వ్యాక్సినేషన్ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సర్వైకల్ క్యాన్సర్పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : ఎంఎస్ఎంఈలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఆయన పార్లమెంటులో తిరుపతి జిల్లా నుంచి ఏవైనా ఎంఎస్ఎంఈ యూనిట్లను గుర్తించారా? అలాగే ఎగుమతిదారులకు ఆర్థిక మద్దతు, క్రాస్–బోర్డర్ ఫ్యాక్టరింగ్, విదేశీ మార్కెట్లలో నాన్–టారిఫ్ అడ్డంకులను అధిగమించడంలో సహాయం పొందారా..? అంటూ ఎంపీ ప్రశ్నించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి గురువారం ఆయన పార్లమెంటులో కీలక ప్రశ్నను లేవనెత్తారు. కేంద్ర బడ్జెట్ 2025–26లో ప్రకటించిన ఎగుమతుల ప్రోత్సాహం మిషన్ అమలులో భాగంగా ఎగుమతుల ప్రోత్సాహ మిషన్ను వాణిజ్య, ఎంఎస్ఎంఈ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని, వాణిజ్య విభాగం ప్రధాన నోడల్ శాఖగా పనిచేస్తోందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రెండు ఆర్థిక సంవత్సరాలలో ఈ పథకం కింద 7 ఎంఎస్ఎంఈలకు రూ.16 లక్షల ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. తిరుపతి వంటి అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి పట్టణాలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ఎంఎస్ఎంఈలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ మద్దిల గురుమూర్తి సభలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండు ఆర్థిక సంవత్సరాలలో కేవలం 7 ఎంఎస్ఎంఈ సంస్థలకు రూ. 16 లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందించడం శోచనీయమని ఎంపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ లను ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నత విద్య బలోపేతానికి అధ్యాపకులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల సర్వీస్ కొనసాగింపునకు ఆమె కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్వీస్ కొనసాగింపునకు అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకుల సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్వీస్లో కొనసాగింపు అవుతున్న ఒప్పంద అధ్యాపకులు డిగ్రీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 50 మంది ఒప్పంద అధ్యాపకులను 2025–26 సంవత్సరానికి కొనసాగించే ప్రక్రియను చేపట్టారు. వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు మనోహర్, విజయేలురెడ్డి, వేణుగోపాల్, షణ్ముగం, చిదంబరం, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. – 8లోన్యూస్రీల్జిల్లాలో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) సర్వేలో వెలుగుచూస్తున్న కేసులు కొందరు క్యాన్సర్ను దాచిపెడుతున్న వైనం ఈ వ్యాధి నివారణకు అవగాహన కల్పిస్తే ఒట్టు ఉచిత వ్యాక్సిన్ ఊసెత్తని ప్రభుత్వాలు వ్యాధి లక్షణాలు రుతుక్రమంలో సమస్యలు యోని నుంచి రక్తస్రావం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు -
ఎంపీ అక్రమ అరెస్టు.. కూటమి కుట్ర
శ్రీకాళహస్తి : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం, గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణమని, కూటమి కక్ష పూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవన్నారు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గర్లో ఉందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు గుర్తు చేసుకోవాలని రానున్న రోజుల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి తన సినిమా రేట్లు పెంచుకొని దీని కోసమే రాజకీయాలకు వచ్చానని చెప్పడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాధరణను చూసి ఓర్వలేక అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాం వాసుదేవ నాయుడు, ఏర్పేడు మండల ఇంచార్జ్ గున్నేరీ కిషోర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, మున్నా రాయల్, జయ శ్యామ్ రాయల్,కంఠ ఉదయ్ కుమార్,మస్తాన్, యువజన విభాగం అధ్యక్షులు, నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు. -
కక్ష సాధింపుతోనే..
కేవీబీపురం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని వైఎస్సార్సీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కేవీబీపురం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి నూకతోటి రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయలేక వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు నీరుపోసి పెంచి పోషిస్తున్న కేసులే రేపటి రోజున వారిని చుట్టు ముట్టి ఊపిరాడనీయకుండా చేస్తాయని హెచ్చరించారు. టీడీపీ కవ్వింపు చర్యల పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని రాజేష్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గవర్ల కృష్ణయ్య, ధనుంజయరెడ్డి, బొర్రా మాధవీరెడ్డి, లాల్బాబుయాదవ్, దశరథరామిరెడ్డి, చందురెడ్డి, నంద కుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు అయ్యప్పరెడ్డి, సర్పంచ్ గిరిబాబు, మైనారిటీ సెల్ నేతలు, బీసీ సెల్ నేతలు పాల్గొన్నారు. -
సుదర్శన్ నాయుడు కుటుంబానికి ఆర్కే రోజా పరామర్శ
సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ సుదర్శన్ నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మేలపట్టు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా.. సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.సుదర్శన్ నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్ నాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని.. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. రోజా వెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం విభాగ అధ్యక్షులు ఉన్నారు. -
జిల్లా హౌసింగ్ పీడీగా సుబ్రహ్మణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇన్చార్జి హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ అవినీతి ఆరోపణల కారణంగా ఈనెల 14న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఈనెల 15వ తేదీ నుంచి పీడీ కేడర్లో కార్యాలయానికి వచ్చి పలు ఫైల్స్లో సంతకాలు చేశారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో ఈనెల 23వ తేదీన వదల బొమ్మాళీ....వదలా అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పందించారు. గోపాల్ నాయక్ సస్పెన్షన్ విషయం పై ఆరా తీశారు. వెంటనే ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లా హౌసింగ్ పీడీగా కుప్పం ఈఈగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నూతన హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని హౌసింగ్ శాఖ కార్యాలయంలో పీడీగా బాధ్యతలు స్వీకరించారు. -
జీవాలపై అడవి జంతువుల దాడి
శాంతిపురం: మండలంలోని చెంగుబళ్ల గ్రామంలో మంగళవారం రాత్రి గొర్రెల మందపై అటవీ జంతువులు దాడి చేశాయి. దీంతో 22 జీవాలు మృతి చెందగా, మరో 10 గాయపడినట్టు గొర్రెల యజమాని జంగం కృష్ణప్ప తెలిపాడు. బుధవారం వేకువజామున ఈ విషయం గుర్తించినట్లు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు సర్పంచ్ పూలకుంట భాస్కర్ వెల్లడించారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ శివయ్య, ఎస్ఐ నరేష్, పశువైద్యాధికారి ఆమని ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రేచుకుక్కలు లేదా తోడేళ్ల గుంపు గొర్రెలపై దాడి చేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ట్రాక్టర్ చోరీ గుడిపాల : మండలంలోని పశుమంద హరిజనవాడకు చెందిన వినాయకం అనే వ్యక్తికి సంబంఽధించిన ట్రాక్టర్ చోరీకి గురైనట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. పశుమంద దళితవాడకు చెందిన వినాయకం 2018లో సొంతంగా ట్రాక్టర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతడి ట్రాక్టర్ను నరహరిపేట–రామాపురం రోడ్డు సమీపంలోని పశుమందలోని పశువుల షెడ్డు వద్ద ట్రాక్టర్ను పెట్టేవాడు. కాగా 22వ తేదీ ఉదయం ట్రాక్టర్ను చూసుకోగా ఎక్కడా కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ట్రాక్టర్ కనపడకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అదానీ కంపెనీ మేలు
కోసమేనా ? గతంలో వైఎస్సార్సీపీలో స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై తీవ్రంగా విమర్శించి వాటిని పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు ఇప్పు డు ఎందుకు వీటిని అమర్చుతున్నారో జనానికి తె లుసు. కేవలం కేంద్రంలోని బీజేపీకి చెందిన అదా నీ కంపెనీ మేలు కలిగేలే జనంపై భారం మోపు తున్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల రద్దుపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. – రమాదేవి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు అన్ని క్యాటగిరిలకు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు స్మార్ట్ మీటర్లు పూర్తి చేస్తాం. ఆపై గృహాలు మళ్లీ రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తాం. దీంతో విద్యుత్ ఆదా, విద్యుత్ చౌర్యం తగ్గుతుంది. ముందుగానే డబ్బు చెల్లించడంతో పెండింగ్ బకాయిల సమస్య తగ్గుతుంది. దీంతో డిస్కంలకు ప్రయోజనం చేకూరుతుంది. – శ్రీనివాసమూర్తి, విద్యుత్ డీఈ, పుంగనూరు ● -
ఇక ‘స్మార్ట్’ బాదుడు !
● ఇప్పటికే కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు ● త్వరలో గృహాలు, ఆపై వ్యవసాయ మోటార్లకు బిగింపు ● రీచార్జి చేసుకుంటేనే కరెంట్.. లేదంటే కట్! ● స్మార్ట్ మీటర్లపై నాలుక మడతేసిన బాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్ వినియోగ సమాచారం జిల్లాలో మొత్తం ఇంటి సర్వీసులు 3,81,690 వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్లు 1.25 లక్షలు కుటీర పరిశ్రమల సర్వీసులు మొత్తం 4736 వాణిజ్య సర్వీసులు మొత్తం 4163 జిల్లాలోని జగనన్న లేఅవుట్లు 592 పలమనేరు : ఎన్నికల్లో తానిచ్చే మాట మీద నిలబడే నైజం తనది కాదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని రైతాంగం మండిపడుతోంది. స్మార్ట్ మీటర్లు వద్దంటూ వైఎస్సార్ సీపీ పాలనలో రాద్దాంతం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తనదైన స్టయిల్లో అన్ని వర్గాల ప్రజలకు బాదుడే బాదుడు మొదలెట్టారు. ఎన్నికల ముందు బాదుడే బాదుడు కార్యక్రమం పేరిట కుప్పం పర్యటనకు, ఆ తర్వాత పలమనేరుకు వచ్చిన ఆయన స్మార్ట్ మీటర్లతో రైతులకు ఉరితాడు తప్పదని, వైఎస్సార్సీపీ సర్కార్ జనాన్ని ముంచేస్తోందని స్మార్ట్ మీటర్లను అమర్చితే పగులగొట్టాలని జనాన్ని రెచ్చగొట్టారు. తాము అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి ప్లేటు ఫిరాయించారు. స్మార్ట్ మీటర్లను అమర్చుతోంది. మాట తప్పిన చంద్రబాబు, లోకేష్పై సామాన్య జనం మండిపడుతున్నారు. ఇప్పుడు రైతులకు ఉరి కాదా? అధికారంలోకి వచ్చే సరికి స్మార్ట్ మీటర్లతో ఎన్నో లాభాలుంటాయంటూ నాలుక మడతేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు కేటగిరి–1 గృహాలకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారు. త్వరలో రైతుల మోటార్లకు కూడా అమర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా రీచార్జి చేసుకోవాలి స్మార్ట్ మీటర్లను ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి దాకా ఉన్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారు. ఇప్పటి వరకు మీటరు రీడింగ్ చూసి కరెంట్ బిల్లు ఇచ్చేవారు. ఇకపై ఎవరితోనూ పని ఉండదు. స్మార్ట్ ఫోనుకు ముందుగా ఎలా రీచార్జి చేసుకుంటామో అదే విధంగా కరెంట్ బిల్లును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో గృహాలకు స్మార్ట్ మీటర్లను గృహాలకు ఆపై రైతుల వ్యవసాయ మోటార్లకు వీటిని అమర్చనున్నారు. దీంతో ఇళ్లకు సైతం వినియోగదారులు ముందుగానే ఆన్లైన్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే రీతిలో రైతులు వారి మోటార్ హెచ్పీని బట్టి ముందుగానే ఫ్రీపెయిడ్) డబ్బులు రీచార్జి చేసుకోవాలి. డబ్బులు చెల్లించకపోతే ఆటోమేటిక్గా కరెంట్ డిస్కనెక్ట్ అవుతుంది. మీటర్ రీడర్లకు మంగళం ఉమ్మడి జిల్లాలో వేల మంది మీటర్ రీడర్లున్నారు. వీరు ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి కరెంట్ రీడింగ్ను బుక్ చేసి తద్వారా కరెంట్ బిల్లులు అందించేవారు. ఇకపై స్మార్ట్ మీటర్ల రాకతో వీరి ఉద్యోగాలు పోయినట్టే. దీంతో వీరు సైతం స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సైతం దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దుకాణదారులకు ఇబ్బందే.. మొబైల్ ఫోన్కు లాగే ముందుగా ఎంత రీచార్జి చేసుకుంటే అంత వరకే కరెంట్ ఇవ్వడం ఆపై కట్ చేయడం చేస్తే ఎవరికై నా ఇబ్బందే కదా. ఒక్కో నెలలో దుకాణంలో వ్యాపారం తగ్గుముఖం పడితే డబ్బులున్నప్పుడు పెనాల్టి కట్టి అయినా కరెంట్ బిల్లు కట్టే వెసలుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ముందుగానే కట్టాలంటే కుదిరేపనేనా. ఉన్నట్టుండి కరెంట్ పోతే జరిగే పనులులెలా. – సుభాన్, హోటల్ యజమాని, పలమనేరు రైతులకు అవస్థలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతులకు ఇబ్బందులు తప్పవు. రైతు వరి పంట వేసి నీటి తడులు ఇవ్వాల్సిన తరుణంలో కరెంట్ చార్జీ కట్టలేదని కరెంట్ డిస్ కనెక్ట్ చేస్తే ఆ రైతు పంట ఏమి కావాలి. రైతు పంట కష్టం నేలపాలు కావాల్సిందేనా. గతంలో స్మార్ట్ మీటర్లు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ఎలా అమలు చేస్తు న్నారు. వేరే వాళ్లు చేస్తే తప్పు.. ఆయన చేస్తే మంచిదా. – గిరిధర్ గుప్తా, సీపీఎం నేత, పలమనేరు -
మైనింగ్శాఖ కార్యాలయంలో ఓ అధికారి ఇష్టారాజ్యం
సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు నగరంలోని ఎస్టేట్ ప్రాంతంలో జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కార్యాలయంలో ఓ అధికారి తీరు మాములుగా లేదు. ఇతను చెప్పిందే వేదంగా నడుస్తోంది. సెటిల్మెంట్ విషయంలో ఇతనిదే పైచేయి. అతని అక్రమాలకు ఎవరైనా అడ్డొస్తే...వారి తల మరుగు కావాల్సిందే. ఉన్నతాధికారి కూడా ఆయన ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ సంతకం పెట్టాల్సిందేనని శాఖలోని పలువురు ఆరోపిస్తున్నారు.మంత్రి బంధువునని చెప్పి..కూటమి అధికారంలోకి వచ్చాక ఆ అధికారి పావులు కదిపాడు. మంత్రి బంధువని చెప్పి..జిల్లా కార్యాలయంలోకి చొరబడ్డాడు. ఉన్నతాధికారిని గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతని కార్యకలాపాలకు ఎవరైనా అడ్డొస్తే కూటమి నేతల నుంచి వారికి క్లాస్ పీకిస్తాడు. ఇలా అందరి నోరు మూయించి... వసూళ్లకు అడ్డు తొలగించుకున్నాడు. ఇప్పుడు కార్యాలయంలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. ఏ పని కావాలన్నా ఆ అధికారి ద్వారానే జరిగేలా చేసుకున్నాడు. కార్యాలయంలో ఆయన పేరు వింటేనే ఉన్నతాధికారి నుంచి సిబ్బంది వరకు హడలిపోతున్నారు. ఆ భయాన్ని బలంగా చేసుకుని ఆ అధికారి ఆడిందే..ఆట.. పాడిందే పాటగా చెలరేగిపోతున్నాడు.రెచ్చిపోతున్న మాఫియాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. విచ్చలవిడిగా అక్రమ గ్రానైట్ తవ్వకాలు జోరందుకున్నాయి. బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం, యాదమరి తదితర మండలాల్లోని పలు ప్రాంతాల్లో అక్రమ క్వారీ తవ్వకాలు జోరందుకున్నాయి. లక్షల రూపాయలు విలువ చేసే సరుకు (గ్రానైట్ బండ) తమిళనాడుకు తరలుతోంది. ఇదీ తెలిసినా అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్నారు. గ్రానైట్ బండలు రాత్రి పూట రయ్..రయ్ మంటూ రోడ్ల మీద కళ్ల ఎదుటే కనిపించినా పట్టించుకోకుండా చూస్తూ.. ఉండిపోతున్నారు. అక్రమాలకు అండగా నిలబడుతున్నారు. దగ్గరుండి హద్దు దాటిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మాకు సంబంధం లేదు...అది రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ చూసుకోవాలని చేతులెత్తేస్తున్నారు.మామూళ్లు ముట్టజెప్పాల్సిందే..జిల్లాలో విలువైన క్వారీలు నడుస్తున్నాయి. ఇందు లో అక్రమ క్వారీలు, అనుమతి తీసుకున్న క్వారీలు కూడా ఉన్నాయి. అనుమతులతో నడుస్తున్న క్వారీల నుంచి ఆ అధికారికి నెలనెలా రూ.50 వేలు ముట్టాల్సిందే. లేకుంటే ఆ అధికారి ఒక్క బండ కూడా క్వా రీ నుంచి కదలకుండా చేస్తున్నారని క్వారీ నిర్వాహకులు చెబుతున్నారు. లేకుంటే అధికార పార్టీ నాయకుల నుంచి వారికి ఇబ్బందులు పెట్టిస్తున్నాడని వా పోతున్నారు. ఇక అక్రమ క్వారీల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాడని క్వారీ నిర్వాహకులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా ప్రతి నెల రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ శాఖను పట్టించుకునే వారు లేకపోవడం, ఉన్నతాధికారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ అధికారి వసూళ్లల్లో రైట్ రాయల్గా దూసుకెళుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయానికి అవినీతి చెద పట్టింది. ఓ అధికారి పెత్తనం కార్యాలయంలో పెచ్చుమీరింది. ఆ అధికారి గుప్పెట్లోనే కార్యాలయం నడుస్తోంది. అధికార పార్టీ అండ ఉందని ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాడు. అక్రమ కార్వీలకు ఆజ్యం పోస్తున్నాడు. అడ్డగోలుగా వసూళ్లకు తెరలేపాడు. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్నాడు. ఉన్నతాధికారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ అధికారి అందిన కాడికి దోచుకుంటున్నాడు. అక్రమ గ్రానైట్ తరలింపునకు దగ్గరుండి సరిహద్దులు దాటిస్తూ అక్రమాలకు ఆలంబనగా నిలుస్తున్నాడు. -
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్
గుడిపాల : రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. బుధవారం గుడిపాల మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని నంగమంగళం వద్ద ఉన్న రోడ్డు, బ్రిడ్జి, ఎంసీఆర్ క్రాస్ వద్ద, సీఎంసీ ఆస్పత్రి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు పనులను నిర్లక్ష్యంగా చేయడంతో ఇప్పటి వరకు 14 మంది చనిపోగా 46 మంది గాయపడ్డారని ఎస్పీ తెలియజేశారు. వీటన్నింటిని కలెక్టర్ పరిశీలించి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. మిగిలిన ముఖ్య కూడల్లో రేడియం స్టిక్కర్స్, లైటింగ్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత కన్స్ట్రక్షన్ వారికి, సీఎంసీ ఆస్పత్రి అధికారులకు ఆయన సూచించారు. సీఎంసీ ప్రతినిధి ప్రిన్స్, గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ పాల్గొన్నారు. -
ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు
ఇల్లు దగ్ధం గుడిపాల మండలంలోని కట్టకింద పల్లెలో విద్యుదాఘాతానికి ఇల్లు దగ్ధమైంది. రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.బోయకొండ ఇంటి దొంగలపై విచారణ మద్దతు ధరపై.. మామిడి మద్దతు ధరపై స్పష్టత లేక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : మహిళలకు బాబు నైజంపై అవగాహన ఉంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించాడు. అమలుకు నోచుకోని హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్నాడు. అంతే షరా మామూలే హామీలను గాలికొదిలేసి నమ్మి ఓటు వేసిన మహిళలకు శఠగోపం పెట్టేశాడు. మహిళలను మహాశక్తి మంతులను చేస్తానని నమ్మబలికి ఆడబిడ్డ నిధి పథకంతో 18 ఏళ్లు నిండిన కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. మోసపూరిత హామీలతో మహిళలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాడు. బాబు సర్కారు ఆడబిడ్డ నిధికి మంగళం పాడేస్తున్నట్లు మంత్రి ద్వారా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాను అమ్మాల్సిందే...! కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తామన్న హామీలను బాబు సర్కార్ గాలికి వదిలేసింది. సూపర్ సిక్స్ హామీలలో ఆడపడుచులకు సంబంధించి మహాశక్తిలో భాగంగా బాబు ప్రకటించిన ఆడబిడ్డ నిధిపై ఏడాది గడుస్తున్నా నోరు మెదపలేదు. దీంతో ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారులే అంటూ ఆశతో ఎదురు చూస్తున్న మహిళలకు ఒక్కసారిగా బాబు సర్కార్ జలక్ ఇచ్చింది. స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ సభలో ఆడబిడ్డ నిధి అమలుపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందని బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారని, తమను నమ్మించి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో దహనం కేసుపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు పుత్తూరు : మున్సిపాలిటీ పరిధిలోని వినాయకపురం ఎస్టీ కాలనీలో ఈనెల 18వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు రాజయ్య ఆటోను దుండగులు కాల్చివేసిన ఘటనపై బాధితుడు బుధవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావును కలిసి ఫిర్యాదు చేశారు. రేణిగుంటలోని గిరిజన గురుకుల పాఠశాల తనిఖీ నిమిత్తం వచ్చిన ఎస్టీ కమిషన్ను వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, బాధితుడు రాజయ్య కలిసి ఆటో దహనం కేసులో నిందితులను త్వరగా గుర్తించి తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనిపై కమిషన్ శంకర్రావు మాట్లాడుతూ.. పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తే ఎస్టీ కమిషన్ తగిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదని స్పష్టం చేశారు. గిరిజన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. ఆస్తి నష్టం చర్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదుకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. పరిసరాల పరిశుభ్రత ప్రజల బాధ్యత కార్వేటినగరం : పరిసరాల పరిశుభ్రత బాధ్యత ప్రజలదేనని జడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీడీ కండ్రిగలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయు డు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక ప్రజలే బాధత్య వహించాలని, అప్పుడే చెత్త రహిత గ్రామాలు ఏర్పాటు అవుతాయన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించిన బుట్టలలో తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశు ద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. జి ల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే టీకేఎం పేట గ్రామంలో పర్యటించి మురుగు నీరు నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి, కార్యదర్శులు, ఏకాంబరం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పుత్తూరు సీఐ వీఆర్కు! పుత్తూరు : స్థానిక సీఐ కే.బీ.సురేంద్రనాయుడు వీ ర్ (వేకన్సీ రిజర్వు)కు బదిలీ అయ్యారు. సోమ వారం ఎస్పీ కార్యాలయం నుంచి వీర్ ఆదేశాల ను అందుకున్న సీఐ అదేరోజు ఇక్కడి నుంచి రిలీ వ్ అయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీర్ బదిలీ కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అ యితే సీఐపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన ట్లు అందుకు తగిన ఫలితమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి మాటలు బాధపెట్టాయ్... సార్వత్రిక ఎన్నికలలో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఉచిత బస్సుతో పాటు ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి బహిరంగ సభలు పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలి అంటూ వెటకారంగా మాట్లాడటం ఎంతో మందిని బాధించింది. – జయంతి, చిత్తూరు నగరం న్యాయం చేస్తారని ఓటు వేశాం నేను దినసరి కూలిని. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సీఎం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. దీంతో నమ్మి ఆశతో ఓటు వేశాం. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. సంవత్సరం గడిచింది. న్యాయం చేస్తారని నమ్మి మోసపోయాం. – విజయ, కార్వేటినగరంమోసం చేయడం న్యాయమా..? ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకుండా మహిళలను వంచించడం దారుణం. ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. మహిళలు ఎంతో నమ్మకంగా ఇచ్చిన అధికారాన్ని అంతే నమ్మకంతో ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేయాలి. – ధనలక్ష్మి, చిత్తూరు నగరం నేడు పీవీకేఎన్లో కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24వ తేదీన ఒప్పంద అధ్యాపకులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 30–04–2025 వరకు పనిచేసి న ఒప్పంద అధ్యాపకుల కాలాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొనసాగించేందుకు కౌన్సెలింగ్ ని ర్వహిస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియకు జాయింట్ కలెక్టర్ హాజరవుతారని వెల్లడించారు. చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో టికెట్ల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం చూపారు. సాక్షిలో ఇంటిగుట్టు రట్టు కథనంపై స్పందించిన ఈఓ ఏకాంబరం, ఎస్ఐ నాగేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. బోయకొండ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పెద్ద భోగం మొక్కులు చెల్లించేందుకు భక్తులకు విక్రయించిన రూ.200 టికెట్ల కౌంటర్ ఫైళ్లను పరిశీలన చేపట్టారు. ఒక్కొక్క టికెట్ల పుస్తకంలో వంద టికెట్లు ఉన్నాయని వాటిలో అధికారుల సంతకాలు లేకుండానే భక్తులకు టికెట్లు ఎలా విక్రయిస్తారని పోలీసులు ప్రశ్నించారు. టికెట్లు విక్రయించగా కార్యాలయానికి కౌంటర్ ఫైల్ వచ్చినప్పుడు ఎందుకు పరిశీలించలేదనే అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు బాధ్యులైన ఆలయ సిబ్బందిని పోలీసులు విచారణ చేపట్టారు. ఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు బోధించాల్సిన టీచర్ల చేత బియ్యం మూటలు మోయిస్తున్నారనే సమస్యపై సాక్షి దినపత్రికలో ఈనెల 23న అయ్యోర్లకు బియ్యం మోత అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనం పై డీఈవో వరలక్ష్మి స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు బియ్యం మోసుకెళ్లాలని ఆదేశించలేదన్నారు. ఇందుకు సమగ్రశిక్ష శాఖ పరిధిలో పని చేసే సిబ్బందికి బాధ్యతలు ఉన్నాయన్నారు. అయితే పలు మండలాల్లో టీచర్లకు బియ్యం తీసుకెళ్లాలని ఎంఈవోలు ఆదేశించడం తగదన్నారు. ఈ విషయంపై ఆరా తీసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా స్పందించిన విద్యాశాఖ అధికారులు అలసత్వం వహించిన రెండు మండలాల ఎంఈవో–2కు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్మహాశక్తి ఆడబిడ్డ నిధికి కూటమి మంగళం ? ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనన్న మంత్రి మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్న కూటమి ఆడబిడ్డలను నమ్మించి మోసం చేసిన బాబు సర్కారు ప్రజలను నమ్మించి..గద్దెనెక్కాక నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. మహాశక్తిలో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధిపై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఉలుకూ పలుకులేదు. ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అని మహిళలకు ఏ మూలో ఆశ ఉండేది..కానీ ఆడ పడుచుల ఆశలపై మంత్రి అచ్చెన్నాయుడు నీళ్లు గుమ్మరించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించడంపై మహిళా లోకం భగ్గుమంటోంది. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక పథకం ఎగవేత కుట్ర దాగుందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.ఎన్నికల సమయంలో తెలియదా ? అధికార దాహంతో హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా అంటూ చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చేతులెత్తేసి మా వల్లకాదు అంటూ చెబుతున్నారు. సాక్షాత్తు మంత్రి అచ్చెన్ననాయుడు ఆంధ్రాను అమ్మితేగాని ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమంటూ తేల్చిచెప్పడం విడ్డూరంగా ఉంది. హామీలు గుప్పించిన నాడు ఈ విషయం తెలియదా. – దీప, పాల సముద్రం మండలం మహిళల ఆగ్రహం తెలుస్తుంది.. కూటమి సర్కార్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. నేడు అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. – సునీత, పాలసముద్రం మోసం చేయడం దారుణం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని సాక్షాత్తు మంత్రి ప్రకటించడం ఆశ్చర్యమేసింది. ఎన్నికల సమయంలో అమలు చేయలేమని తెలిసీ హామీ ఇచ్చారంటే మహిళలను వంచించి మోసం చేసి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాలనే లక్ష్యంతో హామీలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రతి ఇంటిలో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. – కవిత, నగరి రూ. 2,069.38 కోట్ల బకాయిలు చెల్లించాలి జిల్లా వ్యాప్తంగా 2025 జనవరి వరకు అధికారిక నివేదికల ప్రకారం 18 ఏళ్ల పైబడి 100 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు 11,49,661 మంది ఉన్నారు. బాబు సర్కారు ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.2069.38 కోట్లు బకాయి పడింది. అంటే సరాసరి ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా పథకాల అమలులో గోల్మాల్ చేస్తూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలుపై నోరు మెదపలేదు. ఇటీవల మంత్రి చాలా స్పష్టంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే పరిస్థితి లేదని బాహాటంగా చెప్పడంతో కూటమి సర్కారు నైజం బయటపడిందని, రానునున్న రోజులలో ప్రజా వ్యతిరేకతను బాబు సర్కారు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు ఇలా.. నియోజకవర్గం ఆడబిడ్డ నిధికి అర్హులు ఏడాదిగా అందాల్సిన మొత్తం (రూ.కోట్లల్లో) పుంగనూరు 1,71,089 రూ.307.96 నగరి 1,53,112 రూ.275.60 జీడీ నెల్లూరు 1,54,203 రూ.277.56 చిత్తూరు 1,48,682 రూ.267.62 పూతలపట్టు 1,59,027 రూ.286.24 పలమనేరు 1,97,841 రూ.356.11 కుప్పం 1,65,707 రూ.299.29 -
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
చిత్తూరు అర్బన్: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది. -
● ప్రతి నెలా బడి బియ్యంను కి.మీ. దూరం మోసుకెళ్తున్న టీచర్లు ● క్లస్టర్ పాఠశాలల వద్ద మధ్యాహ్న భోజన బియ్యం అన్లోడింగ్ ● గోడౌన్ డీటీ, ఎంఈవో–2 లపై ఆరోపణలు ● పాఠశాల వద్దకే బియ్యం చేర్చాలన్న నిబంధన అమలు కాని వైనం ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్లు.. బడి బియ్యం మూటలు మోయలేక అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి అందించే బియ్యం బస్తాలు క్లస్టర్ పాఠశాలల వద్ద అధికారులు దించేస్తున్నారు. అక్కడి నుంచి ఆయా పరిధిలోని పాఠశాలలకు టీచర్లు ప్రతి నెలా బియ్యం మూటలను మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనల మేరకు ప్రతి నెలా ఆయా పాఠశాలల వద్దకే మధ్యాహ్న భోజన బియ్యం తీసుకురావాల్సి ఉండగా కేవలం క్లస్టర్ కేంద్రాల వద్దే దింపేస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : టీచర్లతో కూటమి ప్రభుత్వం బియ్యం మూటలు మోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వింత ధోరణి కూటమి పాలనలో అమలవుతోంది. గత ఏడాదిగా జిల్లాలోని సీఆర్సీ (క్లస్టర్ రీసోర్స్ సెంటర్) నుంచి ఆ పరిధిలోని ఇతర పాఠశాలలకు బియ్యం మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలోని హెచ్ఎంలు, టీచర్లు ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితి. దీంతో ప్రతి నెలా హెచ్ఎంలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ల చేత కూటమి ప్రభుత్వం బియ్యం మూటలు మోయించడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. 148 సీఆర్సీల పరిధిలో సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,460 పాఠశాలల్లో 148 ఉన్నత పాఠశాలలను సీఆర్సీ (క్లస్టర్ రీసోర్స్ సెంటర్) గా ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన 148 సీఆర్సీ కేంద్రాల్లో ఒక్కో సీఆర్సీ పరిధిలో దాదాపు 17 నుంచి 25 పాఠశాలల వరకు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 148 సీఆర్సీల నుంచి ప్రతి నెలా టీచర్లు బియ్యం మూటలు మోసుకెళ్తున్నారు. ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పనిభారం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లను సమగ్రశిక్ష శాఖ పరిధిలో చిరు జీతాలకు పనిచేస్తున్న సీఆర్పీలను కూటమి ప్రభుత్వం శ్రామికులుగా మార్చేసింది. వింత నిర్ణయాలను అమలు చేస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గత ఐదేళ్ల పాటు అభివృద్ధి బాటలో ముందుకెళ్లిన విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వంలో వెనుకబడుతోంది. అసలే పాఠశాలల్లో యాప్లు, వివిధ కార్యక్రమాల పేరుతో టీచర్లను ఇబ్బందులు పెడుతున్న విషయం విధితమే. దీంతో పాటు ప్రతి నెలా టీచర్లను బియ్యం మూటలను మోసుకెళ్లే దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని టీచర్లు భగ్గుమంటున్నారు.విద్యావ్యవస్థ విచ్ఛిన్నం కూటమి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ విచ్ఛినం అయ్యింది. రాష్ట్ర స్థాయిలో అధికారులు చేపడుతున్న ప్రణాళికలు, విద్యాసంబంధ చర్యలు ప్రాథమిక విద్యను బలహీనపరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉండే టీచర్ల సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రతి నెలా టీచర్లు కి.మీ దూరంలో ఉండే పాఠశాలలకు సీఆర్సీ కేంద్రం నుంచి బియ్యం మూటలు ఎలా తీసుకెళ్తారు. అటీవి ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు బియ్యం మూటలు తీసుకెళ్లలేక టీచర్లు అవస్థలు పడుతున్నారు. అసలే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్లు, ఆన్లైన్ పనులకు, జూమ్ మీటింగ్లకు వ్యతిరేకంగా త్వరలోనే టీచర్లు రోడ్డు ఎక్కే పరిస్థితి కనపడుతోంది. బియ్యం మోసుకెళ్లే సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలి. – రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ సివిల్ సప్లైస్ డీటీ, ఎంఈవో–2లపై ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల వద్దకు మధ్యాహ్న భోజనం బియ్యం మూటలను దించాల్సిన బాధ్యత సివిల్ సప్లైస్ డీటీలపై ఉంటుంది. ప్రతి మండలంలో బియ్యం గోడౌన్ ఇంచార్జీలగా ఉండే సీఎస్డీటీలకు పాఠశాలల వద్దకు బియ్యం దింపేందుకు గాను ప్రభుత్వం కి.మీ చొప్పున ప్రత్యేక రవాణా చార్జీలను ఇస్తోంది. అదే విధంగా ప్రతి పాఠశాల వద్దకే బియ్యం సరఫరా చేయాలనే నిబంధన ఉంది. కాగా జిల్లాలో ఈ నిబంధన ఏ మండలంలోనూ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎంఈవో–2, గోడౌన్ ఇంచార్జిలుగా ఉండే సివిల్ సప్లైస్ డీటీలు కుమ్మకై ్క రవాణా చార్జీలను నొక్కేసేందుకు సీఆర్సీ కేంద్రాలను బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
ఇంటి దొంగల గుట్టురట్టు
● బోయకొండలో టికెట్ల విక్రయాల్లో దోపిడీ ● ఆరుగురు సిబ్బందిపై వేటుచౌడేపల్లె : జిల్లాలో రెండో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో ఇంటి దొంగలు చేతివాటం చూపారు. పెద్ద భోగం టికెట్లు విక్రయించే కౌంటర్లలో దోపిడీ చేసి అడ్డంగా దొరికిపోయిన సంఘటన బోయకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడుగా సాగుతున్న ఈ వ్యవహారం పంపకాల్లో వ్యత్యాసం రావడంతో బట్టబయలైంది. ఈ ఘటనతో బోయకొండ ఆలయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. టికెట్ల విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడింది. ఈ ఘటనకు కారకులైన ఆరుగురు సిబ్బందిపై వేటు వేశారు. అసలేం జరిగిందంటే... బోయకొండ గంగమ్మకు కోరిన కోర్కెలు తీరిన భక్తులు జంతు బలులు సమర్పించి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆలయం వద్ద పెద్ద భోగం ( పొట్టేళ్లు, మేక పోతులు, దున్నపోతులు) చిన్నభోగం కోళ్లు వీటిని అమ్మవారికి బలిస్తారు. పెద్దభోగానికి గాను ఒక్కొక్క దానికి రూ.200 చెల్లించి రశీదు తీసుకొని ఆలయం పై భాగంలో గల పెద్దభోగం, చిన్నభోగం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసి తంతు పూర్తి చేసి మొక్కు చెల్లించడం ఆనవాయితీ. చేతివాటం జరిగింది ఇలా... పెద్దభోగం టికెట్లు విక్రయించడానికి అధికారులు ఆలయం వద్ద కౌంటర్ఽను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ నాలుగు నెలల నుంచి అమలు చేస్తున్నారు. రూ. 200 చెల్లించి టికెట్లు తీసుకెళ్లిన భక్తులకు పూజ చేసి పంపాల్సి ఉంది. మ్యాన్యువల్గా టికెట్లు విక్రయిస్తారు. టికెట్టులో అర్ధ భాగం కౌంటర్ ఫైల్ను భద్రపరిచి మిగిలిన సగం టికెట్టు భక్తుడుకి ఇవ్వాల్సి ఉంది. ఆషాడ మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు ఈనెల 9 వతేదీ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యానువల్గా టికెట్లు విక్రయం చేపట్టారు. ఈ టికెట్లు విక్రయాల్లో సిబ్బంది చేతివాటం చూపి 213 కౌంటర్ ఫైల్ టికెట్లు చింపి భక్తులకు విక్రయించి రూ.42,600 సొమ్ము చేసుకున్నారని సమాచారం. పంపకాల్లో తేడాలతో బయటకు.. టికెట్లు చేతివాటం చూపిన సొమ్ములో మనస్పర్థలు రావడంతో విషయం బయటకు వచ్చింది. విషయాన్ని తన దృష్టికి రావడంతో ఏప్రిల్ నుంచి విక్రయించిన టికెట్ల విక్రయాల కౌంటర్ ఫైల్స్ పరిశీలించి అక్రమాలకు పాల్పడింది వాస్తమని తేల్చినట్లు ఈఓ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన రెగ్యులర్ సిబ్బంది నాగముని, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విజయ్కుమార్రెడ్డి, సోము శేఖర్రాజు, మునిశేఖర్, హరిప్రసాద్, ఏ. గంగరాజు అక్రమాలకు పాల్పడినట్లు ఈఓ గుర్తించారు. ఈఓ ఏమన్నారంటే..... పెద్దభోగం టికెట్ల విక్రయాల్లో చేతివాటం చూపిన విషయం వాస్తమని బోయకొండ ఈఓ ఏకాంబరం అంగీకరించారు. రెగ్యులర్ సిబ్బంది ఒకరిని సస్పెండ్ చేసి అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించామని చెప్పారు. టెంపుల్ ఇన్చార్జి ఇద్దరితో పాటు డీసీఆర్ విధులు నిర్వహించే సిబ్బందికి మెమోలు జారీ చే సినట్లు చెప్పారు. అలాగే ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ పేర్కొన్నారు.బోయకొండ ఆలయ ముఖచిత్రం -
వదలబొమ్మాళీ.. వదలా!
● సస్పెండ్ అయినా ఆఫీస్లోనే తిష్ట ● హౌసింగ్ శాఖలో ఇన్చార్జి పీడీ లీలలు ● కలెక్టర్ రమ్మన్నారంటూ ప్రచారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా హౌసింగ్ కార్యాలయంలో వింత ధోరణి నెలకొంది. ఆ శాఖ ఇన్చార్జి పీడీగా పనిచేస్తున్న గోపాల్నాయక్పై అవినీతి ఆరోపణలకు గాను సస్పెండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి పీడీగా పనిచేస్తున్న గోపాల్నాయక్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈఈగా పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినందుకు గాను ఏసీబీ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత ప్రస్తుతం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులు ఇన్చార్జి పీడీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ప్రభుత్వ జీఓ వెబ్సైట్లో ప్రచురించింది. సాధారణంగా సస్పెండ్ అయిన తర్వాత సంబంధిత అధికారి సస్పెన్షన్ రద్దు అయ్యే వరకు కార్యాలయానికి వచ్చేందుకు అవకాశం ఉండదు. అయితే కలెక్టరేట్లోని హౌసింగ్ కార్యాలయానికి సప్పెండ్ అయిన ఇన్చార్జి పీడీ గోపాల్నాయక్ నిత్యం కార్యాలయానికి రావడం విమర్శలకు తావిస్తోంది. కార్యాలయానికి వస్తూ.. రోజూ కార్యాలయానికి వచ్చి నీ పని నీవు చేసుకోమని కలెక్టర్ చెప్పారంటూ పీడీ గోపాల్నాయక్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం విన్న కలెక్టరేట్లోని పలు శాఖల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సస్పెండ్ అయిన తనకు ఇంకా రాష్ట్ర కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు రాలేదని బుకాయింపు చేయడం కొసమెరుపు. సస్పెన్షన్ ఉత్తర్వులు కొద్ది రోజుల ముందే పీడీ కార్యాలయం మెయిల్ కు వచ్చినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఆ మెయిల్ ను డిలిట్ చేయించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్ పేరుకు భంగం కలిగే విధంగా సస్పెండ్ అయిన పీడీ వ్యవహరించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సంతకాలు చేస్తూ.. సస్పెన్షన్ అయిన తర్వాత కార్యాలయానికి రావడమే తప్పు అయితే ఆ పీడీ ఏకంగా సంతకాలే చేయడం విమర్శలకు తావిస్తోంది. సస్పెన్షన్ అయిన అనంతరం కార్యాలయానికి వచ్చి పలు ఫైల్స్లో పీడీ సంతకాలు చేయడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ను మోసగించడమేనని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విచారణ పూర్తి అయ్యి ఉన్నతాధికారులు సస్పెన్షన్ ను తొలగిస్తే ఆయన తన విధులను తిరిగీ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విరుద్ధంగా వ్యవహరించడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగా సస్పెన్షన్ అయిన పీడీ పోస్టును జాయింట్ కలెక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. -
ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ:ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘ఆరా ఆఫ్ ఆర్ట్స్ మ్యాగజైన్’ను వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, ప్రిన్సిపాల్ ఆచార్య సుధారాణి మంగళవారం వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో గణనీయమైన చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆర్ట్స్ విభాగం కార్యాలయం ప్రకాశం భవనంలో ఉండడం, అలాగే ఆర్ట్స్ కళాశాల పేరు ప్రతిబింబించేలా ఆరా పేరుతో ఈ మ్యాగజైన్ తీసుకుని రావడం హర్షణీయమన్నారు. మ్యాగజైన్లో విద్యార్థుల కవితలు, వ్యాసాలు, వివిధ శాఖల పురోభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో సాధించిన విజయాలు వంటి వాటితో ప్రకాశిస్తుందని, ఇది దాదాపు 200 పైచిలుకు పుటలు కలిగిన డాక్యుమెంటరీ వంటి పుస్తకమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య భాస్కర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య సుమకిరణ్, వార్డెన్ ఆచార్య ప్రయాగ, ఆచార్య రాజేశ్వరమ్మ, ఆచార్య అమీనుల్లా, డాక్టర్ ఓబులేసు, రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులకు మ్యూటేషన్ చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అగ్రిగోల్డ్ ఆస్తులకు మ్యూటేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అగ్రిగోల్డ్ భూముల మ్యూటేషన్ ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని వి.కోట, ఐరాల, చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఆ ఆస్తులకు సంబంధించి భౌతిక ధ్రువీకరణ పూర్తి చేసి రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సబ్ రిజిస్టార్ విలువ, మార్కెట్ విలువ గుర్తింపు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల మ్యూటేషన్ అంశాలపై పకడ్బందీగా కసరత్తు చేయాలన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ భూముల పరిస్థితి ఏంటి, ఆక్రమణలు, కోర్టు కేసులు తదితర అంశాలను పరిశీలన చేయాలన్నారు. ఈనెల 24వ తేదీలోగా వ్యవసాయ భూముల మ్యూటేషన్ను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. త్వరలో జేసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ సమావేశంలో పకడ్బందీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. -
ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించండి
తిరుపతి సిటీ: ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని జీఎస్ఎన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడిని మంగళవారం ఆయన కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 2022లో 62వ కాన్వికేషన్ నిర్వహించారని, అప్పటి నుంచి కాన్వికేషన్ నిర్వహించకుండా జాప్యం చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి అయిన పేద విద్యార్థులు ఇన్ అడ్వాన్స్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ధ్రువపత్రాలను తీసుకోలేకపోతున్నారని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు కాన్వికేషన్ సర్టిఫికెట్ కోసం వర్సిటీ పరిపాలనా భవనం చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇన్ అడ్వానన్స్ సర్టిఫికెట్ ఫీజులు రూ.వేలల్లో కట్టలేక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వెంటనే అధికారులు చొరవ చూపి స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ నాయక్, సురేంద్ర, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేర నిరూపణలో శాఖల సహకారం
● అర్ధ వార్షిక నేర సమీక్షలో ఎస్పీ మణికంఠ ● జేసీ, డీఎఫ్వో, డీటీసీ, డీఈవోతో కలిసి సమీక్ష చిత్తూరు అర్బన్ : నేరం జరిగినప్పుడు దాన్ని చట్టం ముందు నిరూపించడానికి అన్ని ప్రభుత్వ శాఖల సహకారం అవసరమవుతుందని.. దర్యాప్తు అధికారి ఆలోచన చేసి సాక్ష్యాల సేకరణతో నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. ప్రధానంగా భూ ఆక్రమణల్లో రెవెన్యూ, రోడ్డు ప్రమాదాలపై ఆర్టీఏ, మెడికో లీగల్ కేసుల్లో వైద్య ఆరోగ్యశాఖ, రోడ్డు ప్రమాదాల్లో ఆర్ అండ్బీ, ఎర్ర చందనం లాంటి కేసుల్లో అటవీశాఖతో సమన్వయం అవసరమన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో పోలీసుశాఖ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, డీటీసీ నిరంజన్కుమార్ రెడ్డి, డీఎఫ్వో భరణి, డీఈవో వరలక్ష్మి ఇతర జిల్లా అధికారులు హాజరై కేసుల దర్యాప్తులో సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు సహకరిస్తే అంతిమంగా బాధితుడికి న్యాయం జరగడంతో పాటు దోషులకు కోర్టుల్లో శిక్ష పడుతుందన్నారు. ఇక పోలీసులు స్టేషన్కు వచ్చే బాధితులతో ప్రవర్తించే తీరు ఆదర్శనీయంగా ఉండాలన్నారు. సబ్–డివిజన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో మద్యం తయారీ, ర్యాలీల్లో అసాంఘిక శక్తులను అడ్డుకోవడం, పేకాట లాంటి స్థావరాలపై దాడులు చేయడానికి డ్రోన్లను ఉపయోగించుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీలు చెప్పొద్దని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. తగ్గిన రోడ్డు ప్రమాదాలు గత ఆర్నెళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించగలిగామని, పోలీసుల పనితీరుతోనే ఇది సాధ్యమయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించడం, న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్లను అమలు చేయడంపై కూడా చర్చించారు. సమావేశంలో ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాస్, రైల్వే డీఎస్పీ హర్షిత, పలువురు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
29న హుండీ లెక్కింపు
కాణిపాకం : ఈనెల 29వ తేదీన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ లెక్కిస్తున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం 7 గంటలకు హుండీ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని ఆయన కోరారు. డైట్ కౌన్సెలింగ్ పొడిగింపు కార్వేటినగరం : జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) కౌన్సెలింగ్ 24వ తేదీ వరకు పొడిగించినట్లు డైట్ ప్రిన్సిపల్ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి డైట్ కళాశాలలో నిర్వహించిన డీసెట్ కౌన్సెలింగ్ను అభ్యర్థుల సౌకర్యార్థం 24వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కార్వేటినగరంతో పాటు ప్రైవేటు డైట్ కళాశాలల కోసం 194 సీట్లకు గాను 98 మంది అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన సీట్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే తమ సర్టిఫికెట్లతో జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొని తమకు కేటాయించిన కళాశాలలో చేరాలని సూచించారు. అలాగే మంగళవారం నిర్వహించిన ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు తెలుగు మీడియానికి 10 మంది, ఇంగ్లీష్ మీడయానికి 9 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి దొణప్ప తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే బ్యూటిఫికేషన్, రిటైల్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో ఈనెల 23వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 83286 77983, 76710 66532 నంబర్లో సంప్రదించాలని కోరారు. శాస్త్రోక్తంగా ప్రదోషకాల పూజలు కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రదోషకాల పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈసందర్భంగా మూలవిరాట్, నందీశ్వరుడికి ఏక కాలంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంతరం అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ కేంద్రాల పరిశీలన శాంతిపురం : కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం మండలంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. మండల సచివాలయంలోని తహసీల్దారు కార్యాలయంలో ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ శివయ్య, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మండల కేంద్రం, రాళ్లబూదుగూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ సెంటర్ల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే వారి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం ద్వారా సత్వరం మెరుగైన వైద్యం అందించే వీలు కలుగుతుందని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ ఏటీ జీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 77,481 మంది స్వామివారిని దర్శించుకోగా 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
జిల్లాకు సీజనల్ దడ
● జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో చతికిలపడుతున్న ప్రజలు ● కొన్ని మండలాల్లో జ్వరం ప్రభావం అధికం ● ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు ● సమయపాలన పాటించని ప్రభుత్వ డాక్టర్లు ● ఆపసోపాలు పడుతున్న పేదలు ‘అమ్మో జ్వరం.. అయ్యో ఒళ్లు నొప్పులు.. జలుబు తగ్గడం లేదు స్వామీ.. దగ్గీ..దగ్గీ పక్కెటెముకులు కూడా నొప్పులురా నాయనా..!’ అంటూ పేద రోగులు అల్లాడిపోతున్నారు. ఒక పక్క వాతావరణంలో మార్పులు.. మరోపక్క అడపాదడపా వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యం పడకేయడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. జ్వరపీడుతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందక.. ప్రయివేటు ఆస్పత్రులకు క్యూ కట్టాల్సి వస్తోంది. జిల్లాలో సీజనల్ వ్యాధులు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. కాణిపాకం: జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీల పరిధిల్లో రోజూ 7వేల వరకు ఓపీలొస్తున్నాయి. జి ల్లా, ఏరియా, సీహెచ్సీ ఆస్పత్రుల్లో 3,500 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. అలాగే ఈ ఆస్పత్రుల్లో 700 వరకు ఇన్పేషెంట్లు చేరుతున్నారు. సరైన వై ద్యం అందక చాలా మంది ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సోమవారం జిల్లాలోని ప్రభు త్వ వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. అక్కడ వైద్యులు లేక.. రోగులను పట్టించుకోక చాలా మంది ఇబ్బందులు పడడం కనిపించింది. వాతావరణంలో మార్పులు గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కాసేపు పొడిగా.. ఆ తర్వాత వేడి, సాయంత్ర వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో పెద్దగా ఎండలు కనిపించడం లేదు. పలమనేరు, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లి, వీ.కోట, గంగవరం, పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో ఎండ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. చిత్తూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి, యాదమరి తదితర మండలాల పరిధిలో కూడా చల్లదన ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు కురిసిన వర్షాలకు దోమల ప్రభావం అధికమవుతోంది. జ్వరం, జలుబు, దగ్గు అధికం వీడని జలుబు, దగ్గు తీవ్రతతో రోగులు అల్లాడిపోతున్నారు. విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రి, ఆరోగ్య కేంద్రాల్లో సరైన చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా జ్వరం కేసుల సంఖ్య అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు వచ్చే కేసుల వివరాలే లెక్కల్లోకి ఎక్కుతున్నాయి. చాలామంది గ్రామాల్లో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ షాపుల్లో వద్ద మందులు, మాత్రలు తీసుకుని.. మంచానికి పరిమితమవుతున్నారు. జ్వరం తీవ్రత అధికమైతే తప్ప ఆస్పత్రికి వెళ్లడం లేదు. చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపతున్నారు. మరికొందరు జ్వరం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ వైద్యశాలల్లో ఇన్న్పేషెంట్లుగా చేరుతున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో చాలామందికి డెంగీ లక్షణాలు ఉంటున్నాయి. ‘ప్రైవేటు’గా నిలువుదోపిడీ! జ్వరాలు విజృంభిస్తుండడంతో ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రులు బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్లేట్లేట్స్ తగ్గాయని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కచ్చితంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని బాధేస్తున్నాయి. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా ఐసీయూలో ఉంచి టెస్ట్లు, చికిత్స పేరిట వేలల్లో బిల్లులు గుంజేస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం క్యూలో వేచిమున్న మహిళలు డాక్టర్లేరి? జిల్లాలోని పలు పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. కొన్ని పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని చోట్ల డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఆస్పత్రులకు తోచినప్పుడు వస్తున్నారు. ‘సాక్షి’ విజిట్లో బయటపడిన వాస్తవాలు.. ● పలమనేరు పరిధిలోని కొలమాసనపల్లి, గంగవరం తదితర మండలాల్లోని పీహెచ్సీలకు జ్వరం కేసులు అధికంగా వస్తున్నాయి. ఇక్కడ జ్వరానికి సరైన చికిత్స అందక పలమనేరులోని ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. ● చౌడేపల్లి పీహెచ్సీలో ఉదయం 10.30గంటల వరకు కూడా డాక్టరు రావడం లేదు. అప్పటి వరకు వచ్చిన కొందరు రోగులు డాక్టర్లు లేరని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం కనిపించింది. మరికొందరు సిబ్బంది డాక్టర్ల అవతారమెత్తి రోగులకు చికిత్స చేసి పంపించేశారు. ● నగరి నియోజకవర్గంలోని సీహెచ్సీ, పీహెచ్సీల్లో డ్యూటీ డాక్టర్లు డుమ్మా కొట్టడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు నీరసించిపోయారు. అక్కడి స్టాఫ్నర్సులు, అటెండర్లే ఆరోగ్య సమస్యలు అడిగి మందులు, మాత్రలు ఇచ్చి పంపించేశారు. ● గంగాధరనెల్లూరులోని పలు పీహెచ్సీ డాక్టర్లు విధుల్లో ఉండడం లేదు. ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోతున్నారు. పేద రోగులు పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ● జిల్లా కేంద్రం చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి కూడా జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. విషజ్వరాలకు కావాల్సిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేవని, బయట తీసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ● తవణంపల్లి మండలంలో విషజ్వరాలతో పాటు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు ఉండడం లేదు డాక్టరు ఎప్పుడు వస్తున్నారో..ఎప్పుడు వెళుతున్నారో తెలి యడం లేదు. నర్సులతో చికిత్స అందిస్తున్నారు. డాక్టరు లేకపోతే ఎలా. ఈ ఆస్పత్రికి ఒక డాక్టరును వేస్తే మేలు. మాలాంటి పేదలకు బాగుంటుంది. దగ్గు, జలుబు ఉందని వస్తే..చూసే వాళ్లు లేరు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలి. – ఏకాంబరం, నాయుడుపల్లి, శ్రీరంగరాజుపురం మండలం ఇప్పుడు కష్టంలే..! గతంలో ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఏ మందు లు అడిగినా ఇచ్చేవా రు. డయాలసిస్ పే షెంట్ కూడా 108 వె హికల్లోనే తీసుకెళ్లి డ యాలసిస్ అయిన త ర్వాత స్వగ్రామానికి చే రేవారు. ప్రస్తుతం అ లాంటి పరిస్థితి లేదు. మా లాంటివారు డయాలసిస్ చేసుకోపోవడానికి వీలుకావడం లేదు. మందులు కూడా అరకురాగానే ఇస్తున్నారు. జ్వరం వచ్చినా పలికేవారు లేరు. – తంగరాజ్, వెంగల్రాజు కుప్పం గ్రామం జిల్లా సమాచారం జిల్లా ఆస్పత్రి – 1 ఏరియా ఆస్పత్రి – 4 సీహెచ్సీలు – 8 పీహెచ్సీ – 50 యూపీహెచ్సీ – 15 ప్రైవేటు ఆస్పత్రులు – 1,300 ఆర్ఎంపీలు – 2 వేల వరకు పది రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో ఓపీలు దగ్గు, జలుబు – 1,200 0–12 వయస్సు పిల్లల జ్వరం కేసులు – 425 12–40 వయస్సు వారు – 647 40–60 వయస్సు వారు – 502 60 ఏళ్లు పైబడినవారు – 376 -
బెయిల్ రావాలంటూ పూజలు
చౌడేపల్లె : మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావాలంటూ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరాజు మంగళవారం బోయకొండలో గంగమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటిి నుంచి ఏదో ఒక రకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టి హింసించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. 2014–2019 దాకా ఊరూరా బెల్టుషాపులు తెచ్చి దోచుకున్నది చంద్రబాబేననంటూ ఆరోపించారు. బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో అక్రమంగా అరెస్ట్ అయిన మిథున్రెడ్డికు బెయిల్ రావాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు. ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దుర్మార్గం బైరెడ్డిపల్లె : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, జడ్పీటీసీ ఆర్.కేశవులు, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి మండిపడ్డారు. మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడంపై బైరెడ్డిపల్లెలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా వైఎస్సార్సీపీని అణచివేయలేరన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇతర కేసుల్లో చంద్రబాబు బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి దయానందగౌడు, మండల యూత్ ప్రెసిడెంట్ మహేష్, మండల కన్వీనర్ కార్తిక్, వైస్ ఎంపీపీలు రూపజయకుమార్రెడ్డి, నారాయణస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.● అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు : జెడ్పీ చైర్మన్ -
న్యాయం కోసమే ‘శక్తి వారియర్స్’
చిత్తూరు అర్బన్ : న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని పిల్లలు, యువతలో నింపడానికి ‘శక్తి వారియర్స్ూ పేరిట బృందాలను ఏర్పాటు చేయాలని అనంతపురం ఐజీ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో మాట్లాడారు. చిత్తూరు పోలీసు అతిథి గృహం నుంచి ఎస్పీ మణికంఠ, అధికారులు పాల్గొన్నారు. ఐజీ మాట్లాడుతూ.. మహిళలు–పిల్లల రక్షణపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. పోక్సో కేసులు కోర్టుల్లో చార్జ్షీట్లను త్వరగా వేయాలన్నారు. లైంగిక వేధింపుల నేరాల్లో 60 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అనంతరం ఐజీ ప్రస్తావించిన అంశాలపై ఎస్పీ జిల్లాలోని పోలీసులతో సమీక్షించారు. నిందితుని ఆచూకీ తెలిపితే రూ. 5లక్షలు నజరానా వరదయ్యపాళెం: తమిళనాడులో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షలు నజరానా ఇవ్వనున్నట్లు గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో భాగంగా వరదయ్యపాళెం మండలంలో పర్యటించిన డీఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా వివరాలను తెలిపారు. తమిళనాడు రాష్ట్రం ఆరంబాకంలో ఓ బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. నలుగురు ఎస్పీల పర్యవేక్షణలో నాలుగు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షలు నజరానా ఇస్తామని ఆమె వివరించారు. 9952060948 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సీట్ల కేటాయింపులోనూవైఫల్యమేనా? తిరుపతి సిటీ : ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జాబితా మంగళవారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అర్ధరాత్రి వరకు సీట్ల కేటాయింపుపై ఎటువంటి సమాచారం అందకపోవడంతో నిరాశతో ప్రభుత్వంపై విరుచకుపడుతున్నారు. సీట్ల కేటాయింపులోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, షెడ్యూల్ ప్రకారం జూన్ 22న ప్రకటించాల్సి ఉండగా ఇంతవరకు తమకు ఎటువంటి మెసేజ్లు రాలేదని వాపోతున్నారు. ఇటు అధికారులను వివరణ కోరగా మరో గంటలో తల్లిదండ్రుల మొబైల్ఫోన్లకు మెసేజ్ వస్తుందంటూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు చెబుతుండడం గమనార్హం. -
టీవీ-5 తప్పుడు ఛానల్: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఎల్లో మీడియాపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ-5 తప్పుడు ఛానల్ అని.. అందుకే వైఎస్సార్సీపీ నిషేధించిందన్నారు. టీడీపీ ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టని ఛానల్ అది అంటూ దుయ్యబట్టారు.ఇవాళ మా ఇంటికి టీవీ-5 రిపోర్టర్ వచ్చారు. ఇంటికి వచ్చాడు కదా అని గౌరవించి కూర్చోబెట్టాను. అక్రమ లిక్కర్ కేసు గురించి అడిగితే కొన్ని విషయాలు మాట్లాడాను. కాని, నేను చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆ ఛానల్ బ్రేకింగ్స్ వేసి నడిపించింది. నేను వెంటనే ఆ రిపోర్టర్కు ఫోన్ చేసి ఇది సరికాదని, అనని మాటలు అన్నట్టుగా చూపించడం భావ్యం కాదని వారిని హెచ్చరించాను. సరిచేయమని కోరాను...ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి మీద కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని నారాయణ స్వామి తెలిపారు. -
వీడియో: 2 కోట్ల మందిని ఎంత పబ్లిక్గా మోసం చేశారో చూడండి
రెండు కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందిస్తే.. ‘‘ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ హాజరైన మహిళలు ఒక్కసారిగా కంగుతిన్నారు.అయితే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తే రోజా ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో..బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారంటీ..!. 2 కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారు అంటూ వీడియోలతో పోస్టులు చేశారామె. View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) `సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025 -
పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లించాలి
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల పట్ల చిన్నచూపు చూడటం సరికాదన్నారు. పెన్షనర్లకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు, జీఐఎస్ తదితర బకాయిలను సత్వరం మంజూరు చేయాలన్నారు. సెప్టెంబర్ 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంత వరకు గ్రాట్యూటీ చెల్లించకపోవడం దారుణమన్నారు. కోళ్లఫారంలో చోరీ కార్వేటినగరం: పట్టపగలే కోళ్లఫారంలో చోరీ జరిగింది. ఈ ఘటన సోమవారం మేజర్ పంచాయతీ కార్వేటినగరం సమీపంలోని సుద్దగుంట వద్ద ఉన్న కోళ్లపారంలో చోటుచేసుకుంది. కోళ్లఫారం యజమాని సాయికుమార్ కథనం.. సుద్దగుంట సమీపంలో ఉన్న కోళ్లఫారంలో అదే గ్రామానికి చెందిన గురవయ్య, లక్ష్మీపతి, సుబ్రమణ్యం పట్టపగలే కోళ్లఫారం తలుపులు పగుల గొట్టి సీసీకెమెరాల వైయర్లను కట్ చేసి, అందులోని గ్యాస్ సిలిండర్, వంద కోళ్లు, ఇనుపరాడ్లు, ఫారంలో వాడే ఫీడర్లు దింకాలర్స్లను అపహరించినట్లు తెలిపారు. ఈ మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఆపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 38 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 38 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్ కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెట్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ, వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపక పోస్టుల నియామకంలో ప్రధాన అర్హతకు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఫలితాలు సోమవారం విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు ఎస్వీయూ పరిధిలో 4,578 మంది హాజరుకాగా 52 శాతం మంది అర్హత సాధించినట్లు సమాచారం. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ నారాయణగిరి చెట్ల వద్దకు చేరుకుంది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 14 గంటలు పడుతోంది. -
పట్ట పగలే రెండు ఇళ్లల్లో చోరీ
రొంపిచెర్ల: పట్టపగలే రెండు ఇళ్లల్లో దొంగలు పడి బంగారు నగలు, డబ్బును చోరీ చేసిన సంఘటన మండలంలోని చిచ్చిలివారిపల్లె పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, రావిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన మోడెం రమణయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి వరి నాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా చూసుకుని దుండగులు చోరీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న బీరువాలోని రూ.40 వేలు నగదు, 25 గ్రాముల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మోడెం చిన్నస్వామి కూడా ఇంటికి తాళం వేసుకుని, పొలం వద్దకు వెళ్లడంతో ఆ ఇంట్లో కూడా రూ. 5 వేల నగదును చోరీ చేశారని తెలిపారు. ఈ విషయాన్ని బాఽధితులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
అధిక వడ్డీ పేరుతో బురిడీ!
● పలమనేరులో రూ.2 కోట్ల కుంభకోణం ● మర్కజ్కాంప్లెక్స్లో గతంలో వెలిసిన ఆఫీస్ ● అధిక వడ్డీలిస్తామంటూ భారీగా వసూళ్లు ● ఆపై కనిపించకుండా పోయిన నిర్వాహకులు పలమనేరు: పట్టణంలో ఇటీవల ఓ కార్యాలయాన్ని అన్ని హంగులతో ప్రారంభించిన ఓ వ్యక్తి పలువురి వద్ద అధిక వడ్డీలు ఇస్తామంటూ రూ.2 కోట్లకుపైగా వసూలు చేసి మోసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గతంలో ఓ వ్యక్తి స్థానిక మర్కజ్కాంప్లెక్స్లో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో ఫైనాన్స్ కంపెనీని మొదలు పెట్టాడు. ఇందులో కొత్త స్కీమ్లు పెట్టి పది లక్షలు డిపాజిట్ చేస్తే తాము దాన్ని షేర్లలో పెట్టి అధిక వడ్డీలు ఇస్తామని ఆశజూపాడు. దీంతో చాలామంది వీరివద్ద భారీగా డబ్బులు డిపాజిట్ చేసినట్టు తెలిసింది. ఆపై ఏమైందోగానీ ఆ కార్యాలయం మూతబడింది. నిర్వాహకుడు కనిపించకుండాపోయాడు. ఇలా ఉండగా పట్టణానికి చెందిన మసూద్ అనే బాధితుడు రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేసి మోసపోయాడు. ఎలాగా సదరు నిర్వాహకుని ఆచూకీ తెలుసుకొని హైదరాబాద్లోని ఓ లాడ్జీలో ఉండగా వెళ్లి పట్టుకున్నాడు. ఆపై అతనిపై దాడిచేశాడు. తాను ఇచ్చిన డబ్బు తనకివ్వాలని, లేదంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా హెచ్చరించాడు. దానికి సంబంధించిన విడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇలావుండగా ఈ మోసంపై స్థానిక పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేని తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. -
పంట పొలాలపై ఆగని గజ దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో రోజూ ఏదొ ఒకచోట పంట పొలాలపై ఏనుగులు దాడికి తెగబడుతున్నాయి. కొన్ని నెలలుగా ఇక్కడే తిష్ట వేసి పంటలను నాశనం చేస్తున్నాయి. సోమవారం ఉదయం మండలంలోని ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లె, కురవపల్లె, చిట్టారెడ్డిపేట, పాతపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల మంద పంటలను ధ్వసం చేసింది. ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లెలో చామంచుల కోదండయ్య టమాట పంటను తొక్కిపడేశాయి. పశువుల మేత కోసం వేసిన గడ్డి, వరి నారును నాశనం చేశాయి. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. జీవన ఎరువుల పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులకు క్షేత్రస్థాయిలో జీవన ఎరువల వల్ల కలిగే లాభాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జీవన ఎరువుల మందుల పంపిణీ, అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవన ఎరువులను వినియోగంచడంతో పంటలకు బలం వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు. నర్సింగ్ ఉద్యోగావకాశాలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ విక్రమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున జర్మన్ లాంగ్వేజ్లో బీఎస్సీ, జీఎన్ఎం నర్సింగ్లో డిగ్రీ పట్టా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత వసతితో పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, రెండేళ్లు క్లినికల్ అనుభవం, జీఎన్ఎం నర్సింగ్ పూర్తిచేసి మూడేళ్లు క్లినికల్ అనుభవం ఉన్న ఎస్సీ,ఎస్టీ మహిళలు శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను dscweotpt@ gmail. com, ddswctr@gmail.com మెయిల్ చేయాలన్నారు. ఇతర వివరాలకు 80083 59664, 8790654826, 9959534669 నెంబర్లలో సంప్రదించాలని డీడీ కోరారు. -
అక్రమ అరెస్టుతో అణగదొక్కలేరు
చిత్తూరు కార్పొరేషన్: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉయ్ స్టాండ్ ఫర్ మిథున్రెడ్డి అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు మిన్నటించారు. అనంతరం మీడియాతో విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడారు. జగనన్నకు సన్నిహితంగా ఉండే నాయకుల పై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. పార్లమెంట్ సభ్యుడికి రాష్ట్రంలో జరిగిందంటున్న స్కాంకు సంబంధమేమిటని ప్రశ్నించారు. రాయలసీమలో బలమైన నాయకుడు అయిన పెద్దిరెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించే మిథన్పై ఆరోపణలు పేరిట కేసుల్లో ఇరికించాలని చూడడం అన్యాయమన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్సీపీకి మరింత ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, ఉద్యోగులు, పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు, ప్రజాప్రతినిధులు బాబునాయుడు, త్యాగ, రజనీకాంత్, మధుసూదన్, ప్రసాద్రెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, ప్రతిమారెడ్డి, హరీషారెడ్డి, నారాయణ, మురళీరెడ్డి, మనోజ్రెడ్డి, అప్పొజీ, ఆను, అల్తాఫ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
హామీలు తూచ్
కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ముంచేసింది. మద్దతు ధర ఇవ్వకుండా సర్వనాశనం చేసింది.– 10లోలిక్కర్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టు ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నా. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. కూటమి అరాచకాల పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయి. సీఎం చంద్రబాబు కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఒట్టి అభూతకల్పన. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక ఆయన్ను బలహీనపరిచేందుకు కుట్రపన్నుతున్నారు. ఇప్పటి వరకు మద్యం అక్రమ కేసులో అరెస్ట్ చేసిన మా పార్టీ నేతల పై ఎలాంటి ఆధారాలూ చూపలేదు. కూటమిపై ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది. అక్రమ అరెస్టులకు మా పార్టీ నేతలెవ్వరూ భయపడరు. – బియ్యపు మధుసూదన్రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఎంపీ అరెస్ట్ దారుణంఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది దారుణం. కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. భూటకుపు స్కామ్ని అంటగట్టారు. పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులు బనాయించి ఇరికించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ కుట్ర సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ సాగిస్తున్నారు. ఆయన సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్సీపీకి బలమైన నేతలుగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఎంపీని అరెస్ట్ చేశారు. ఇలాంటి రాజకీయాలు మానుకోండి. – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త -
● అబ్కారీ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలవారి మామూళ్లు పెంచాలని పలుచోట్ల హుకుం ● తమ ఆదాయంలో తగ్గించుకోవడంపై ‘ఎకై ్సజ్’ ● జిల్లాను వదలి.. పక్క జిల్లాల వైపు చూస్తున్న అధికారులు
చిత్తూరు అర్బన్: ‘కరవమంటే కప్పకి కోపం..విడవమంటే పాముకి కోపం’ అన్నట్లు తయారైంది జిల్లా లోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారుల పరిస్థితి. ఓ వైపు నెలవారి మామూళ్లు పెంచమని కూటమి నేతలు.. ఇస్తే ఇచ్చుకోండి, కానీ మాకు ఇచ్చేదాంట్లో మాత్రం చెయ్యి పెట్టొద్దంటూ ఓ అధికారి నుంచి ఆదేశాలు అందడంతో పలువురు సీఐలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రైవేటు దుకాణాల ద్వారా ఏరులైపారుతున్న మద్యం ప్రవాహంలో ఎవరికి కావాల్సినంత వాళ్లు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దొందూ దొందే అధికారులు వసూలు చేసి ఇస్తున్న మామూళ్లలో పబ్బం గడుపుకుంటున్న కొందరు నేతలు ఉన్నట్టుండి తమ వాటా పెంచాలని కోరడం.. అధికారులకు మింగుడుపడడం లేదు. కింది స్థాయిలో నెలవారీ మామూ ళ్లు చేసే అధికారులు, ఈ మొత్తం నుంచి అందరికీ పంచిపెట్టి చివర్లో మిగిలిన చిల్లర జేబుల్లో వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటీవల చిత్తూరులోని ఓ ఉన్నతాధి కారి వద్ద దీనిపై పంచాయితీ జరిగినట్లు తెలిసింది. ఆయన తనకిచ్చే నెలవారీ మామూళ్ల నుంచి రూపా యి తగ్గించుకున్నా ఒప్పుకునేదిలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే నేతలకు ఇచ్చే దాంట్లో తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇమడలేక ‘ఎకై ్సజ్’ ఓ వైపు సొంత శాఖలోని అధికారులు, మరో వైపు నేత లు సతాయిస్తుండడంతో నాలుగు సర్కిళ్ల నుంచి సీఐ లు, ఓ ఉన్నతాధికారి జిల్లాను వీడడానికి సిద్ధమైనట్టు తెలిసింది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లిపోవడానికి అక్కడి నేతలతో రాయబారం నడుపుతున్నట్ల సమాచారం. ఓ వైపు నవోదయం, మరోవైపు నాటుసారాపై ఉక్కుపాదం, జిల్లా కేంద్రంలో ప్రోటో కాల్స్ లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా వాటాలు పెంచమని ఆదేశిస్తే ఇక్కడ పనిచేయలేమని కొందరు ఖాకీలు తేల్చి చెబుతున్నారు. – ఓ ఉన్నతాధికారి నుంచి సీఐకి అందిన మౌఖిక ఆదేశం – ఓ ఎకై ్సజ్ అధికారికి చిత్తూరు జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి హుకుం ఎవరి వాటా వాళ్లదే జిల్లాలో మొత్తం 113 మద్యం దుకాణాలున్నాయి. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన నూతన మద్యం పాలసీలో ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్ల ఆదాయం చేకూరింది. జిల్లాలో ఎనిమిది ఎకై ్సజ్ సర్కిళ్లు ఉంటే.. నెలకు కొన్నిచోట్ల దుకాణానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ.15 వేల నుంచి రూ.18 వేలు వసూలు చేస్తున్నారు. సగటున ఒక్కో దుకాణం నుంచి రూ.25 వేలు అనుకున్నా.. నెలకు రూ.28 లక్షల వరకు వసూలవుతోంది. గత పది నెలల్లో రూ.2.8 కోట్లకు పైనే వసూలు చేశారు. ఇందులో ఓ అధికారికి దుకాణానికి రూ.4 వేలు, మరో అధికారికి షాపునకు రూ.2 వేలు, ఇంకొకరికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి. ఇది కాకుండా కూటమి నేతల్లో కొందరికి ఒక్కో దుకాణానికి రూ.5 వేలు ఇవ్వాలి. కొందరు నేతలు ఈ మొత్తం తీసుకోకుండా, దానికి సరిపడే ఆర్థికపరమైన బాధ్యతలను అధికారులకు అప్పగిస్తున్నారు. మిగిలిన దాంట్లో స్టేషన్లోని వాహనాలకు డీజిలు, స్టేషన్ నిర్వహణ చూసుకోవాలి. ఇది కాకుండా మద్యం బార్ల నుంచి అందే నెలవారీ మామూళ్లు అధనం. ‘చూడయ్యా..! నెలకు నువ్వు ఇచ్చేదే షాపునకు రూ.4 వేలు. ఏదో నాయకుడు అడిగాడు అని.. నా దాంట్లో తగ్గిస్తే ఎట్లా చెప్పు. నీ బాధలు ఏవైనా ఉంటే నువ్వే పడు. నేనేమీ బాస్ లాగా మొత్తం నాకే ఇవ్వమని చెప్పలేదు కదా. నాకు ఫ్యామిలీ ఉంది. ఖర్చులు ఉన్నాయి. మొన్న మంత్రి వచ్చిన రోజు ప్రొటోకాల్ ఖర్చు ఎంతయ్యిందో నీకు తెలియదా..? దయచేసి నా వాటా మాత్రం తగ్గించొద్దు.’‘చూడండి. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేశా. చేతిలో డబ్బులు, అప్పులు చేసింది తిరిగి సంపాదించుకోవాలి కదా. మీ సర్కిల్లో ఇప్పటి వరకు ఇస్తా ఉండేది చాలదు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వేరే లెక్క ఇవ్వాలి. అవసరమైతే మీకు వచ్చేదాంట్లో తగ్గించుకోండి..’ -
పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే..
పలమనేరు: పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే చంద్రబాబు లిక్కర్ కేసు లో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని ఇరికించారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో రాష్ట్రంలో 4,380 లిక్కర్ షాపులు ప్రైవేటు వారు నిర్వహించారని చెప్పారు. ఇందులో 40వేల బెల్టుషాపులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే వాటిల్లో చంద్రబాబునాయుడు ఐదింటికి మాత్రం 70 శాతం ఆర్డర్లు ఇచ్చి, మిగిలిన వాటికి 30శాతం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. లిక్కర్ కుంభకోణంలో ఓ టీడీపీ నాయకుడు ఆకాశరామన్న లేఖ రాశాడని దానిపై వారం రోజుల్లోనే విచారణ జరిపి కేసు పెట్టించారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరుగుంటే రూ.26వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఎలా వచ్చిందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్రెడ్డి, నాయకులు దయానందగౌడ, తమీమ్, ప్రహ్లాద, జాఫర్, చలపతి రెడ్డి, చెంగారెడ్డి, మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం రూ.150 కోట్ల సబ్సిడీని అందజేస్తోందని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 చొప్పున సబ్సిడీ అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.150 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాలకు జమచేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులదేనని స్పష్టం చేశారు. జూన్ నెలాఖరు వరకు సేకరించిన మామిడికి సబ్సిడీ జూలైలో, జూలైలో సేకరిస్తున్న మామిడికి ఆగస్టులో రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో సేకరించి పంపిన రైతుల వివరాలు, తోతాపురి మామిడి తూకం, తదితర వివరాలను మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు గ్రామస్థాయిలోని విలేజ్ అగ్రికల్చర్, వీఆర్వోల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఎలాంటి అలసత్వం వద్దు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు. రైతుల బ్యాంకుల ఖాతాలకు సంబంధించి బ్యాంక్ వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఈ క్రాప్ను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి 22,435 మంది రైతుల డేటాను మండల స్థాయి అధికారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతుల జాబితాను తయారు చేసి తహసీల్ధార్ సంతకంతో ధ్రువీకరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్రెడ్డి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల హోరు.. పరిష్కరించాలి మీరు!
● కలెక్టరేట్కు పోటెత్తిన సమస్యలు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు తరలివచ్చిన అర్జీదారులు ● న్యాయం చేయాలంటూ వేడుకోలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై 194 వినతులు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వే చేయించి సమస్య పరిష్కరించండి సర్వే చేయించి సమస్య పరిష్కరించాలంటూ పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నం.226/2లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి తమ ఆధీనంలో ఉందన్నారు. భాగ పరిష్కారం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఆ భూమిలో సర్వే చేసి పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరారు. దివ్యాంగులంటే అలుసెందుకు? కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులంటే అలుసెందుకని దివ్యాంగుల హక్కుల అమలు జిల్లా కమిటీ మెంబర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ మేరకు కలెక్టరేట్లో దివ్యాంగులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. డీఆర్డీఏ ప్రోత్సాహంతో అవకాశాలు, 50 శాతం రాయితీతో దివ్యాంగులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అర్హులైన దివ్యాంగులతో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్ కార్డులు లేవు సారూ తమకు ఆధార్ కార్డులు లేవని, వెంటనే ఇప్పించండి సారూ..! అంటూ గుడిపాల మండలం ఎంకే.పురం, నరిగపల్లికి చెందిన ఒల్లమ్మ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ తాము ఎస్టీ కులానికి చెందిన వారమన్నారు. తమ కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరికీ ఆధార్కార్డులు లేవన్నారు. తాను, తన భర్త, ముగ్గురు పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామన్నారు. పరిశీలించి ఆధార్కార్డు, రేషన్న్ కార్డులు ఇప్పించాలని కోరారు. రూ.60 వేలు లంచం అడుగుతున్నారయ్యా భూ సమస్య పరిష్కరించాలని కోరగా పెద్దపంజాణి తహసీల్దార్ కార్యాలయంలో రూ.60 వేలు లంచం అడుగుతున్నారంటూ బాధితుడు మార్కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దపంజాణి మండలం, గళ్లావారిపల్లి గ్రామంలో పిత్రార్జితంగా తనకు భూమి ఉందన్నారు. 1బీలోనూ తన పేరు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇటీవల 1బీలో తన పేరును తొలగించి వేరే వ్యక్తి పేరు నమోదు చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో శంకరప్ప, తలారి రాజన్నను కోరగా.. వారు రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్కు తన సమస్య విన్నవించుకోగా విచారించి న్యాయం చేస్తామని చెప్పారన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య
సూళ్లూరుపేట: ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్రెడ్డిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయంలో భాగమేనని సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటివ సంజీవయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..‘అక్రమ మద్యం కేసు అని.. దానికి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉంది. జగనన్నకు అండగా నిలిచిన వారి పేర్లును రెడ్బుక్లో రాసుకుని వారినే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లుకు పంపిస్తున్నారు. సిట్ అధికారులు చంద్రబాబు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రయివేట్ ముసుగులో మోసం చేయలేదా?. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా..? దీనిపై ఆయనపై కేసు పెడితే ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి’..అని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయలేదా? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలో వచ్చాక రెడ్బుక్ పాలన చేస్తున్న పెద్ద బాబు, చిన్నబాబుకు ముందుంది ముసళ్ల పండుగ అని సంజీవయ్య అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా కేవలం వైఎస్సార్సీపీ పార్టీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని అరెస్ట్లు మీద అరెస్ట్లు చేస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు జెట్టి వేణుయాదవ్, చిన్న సత్యనారాయణ, స్వామిరెడ్డి, బందిలి మహేష్ అయితా శ్రీధర్, వాకాటి బాబురెడ్డి, నందారెడ్డి, హుస్సేన్, జయకుమార్, పర్వతరెడ్డి రవిరెడ్డి, చిలకా యుగంధర్, సురేష్ పాల్గొన్నారు. -
టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్ చేశారుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్ఫోర్స్ -
‘హద్దు’లు దాటిన అక్రమాలు
తమిళనాడు సరిహద్దు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని టీడీపీ నేతల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆగని ఏనుగుల దాడి పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె, దిగువమూర్తివారి పల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – భరత్, ఎమ్మెల్సీ, కుప్పం ఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు ప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు. – కృపాలక్ష్మి, సమన్వయకర్త గంగాధరనెల్లూరు నియోజకవర్గరంకక్షగట్టి అరెస్ట్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, సమన్వయకర్త చిత్తూరు నియోజకవర్గం లోకేష్ నీకు చిప్పకూడే గతి కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది. – వీ.హరిప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఎంపీ మిథున్రెడ్డి కారును దహనం చేసిన దృశ్యం (ఫైల్)నేడు కలెక్టరేట్లో ‘గ్రీవెన్స్’ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. గ్రీవెన్స్కు అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు కార్యాలయంలో.. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా కలిసి చెప్పుకోవచ్చన్నారు.. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. క్రీడాభివృద్ధికి ఉద్యోగోన్నతి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి రావడం ఆనందంగా ఉందని పీడీ బాబు తెలిపారు. ఆదివారం పీసీఆర్ పాఠశాలలో ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన పీడీలను ఘనంగా సత్కరించారు. బాబు మాట్లాడుతూ ఉద్యోగోన్నతులు పొందిన పీడీలు ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మందికి ప్రమోషన్ రావడం శుభపరిణామమని వెల్లడించారు. ఏ స్థాయి విధులనైనా పీడీలు సమర్థవంతంగా నిర్వర్తించగలరని వెల్లడించారు. ఉద్యోగోన్నతి పొందిన కోమల, సురేష్, సెల్వపాండియన్, కోటేశ్వరరావు, రామ, చంద్రశేఖర్, అమర్నాథ్, మురళీ, దామోదరంతోపాటు పీడీలు రవీంద్రారెడ్డి, నూరుద్దీన్, సుబ్రమణ్యంరెడ్డి, సిరాజ్, దేవానంద్, గురుప్రసాద్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నుకున్నారు. ఆదివారం ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడిగా అరుణ్కుమార్ (జెడ్పీ, ఏఎల్పురం), ప్రధాన కార్యదర్శిగా సురేష్ (జెడ్పీ, పోలవరం), కోశాధికారిగా బాలచైతన్య (జెడ్పీ కల్లుపల్లె), గౌరవాధ్యక్షుడిగా భాస్కరరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా గిరిరాజా (జెడ్పీ, టేకుమంద), రమేష్ (జెడ్పీ, బీఎన్ఆర్పేట), నాగేశ్వరరావు (జెడ్పీ, పైపాళ్యం) ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీదేవి (జెడ్పీ, ఉగ్రాణంపల్లె), హెడ్క్వార్టర్ కార్యదర్శిగా మోహన్ (ఎంసీహెచ్ఎస్, గిరింపేట), మహిళా కార్యదర్శిగా రత్నమ్మ (జెడ్పీ, ముత్తిరేవుల), చిట్టెమ్మ(జెడ్పీ, పిడివికండ్రిగ) ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. సాక్షి టాస్క్ఫోర్స్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు. ● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. ● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది. ● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది. జలయజ్ఞంపై బాబు విషం కృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది. కుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదు పెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం. – నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త – 8లో– 8లో– 8లోన్యూస్రీల్కక్షగట్టి చంద్రబాబు వేధింపులు పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా కుట్రలు సొంత నియోజకవర్గంలో సైతం తిరగనివ్వకుండా దాడులు ముందుగా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం పేరుతో నాటకాలు తర్వాత ప్రభుత్వ, అటవీభూముల ఆక్రమణ అంటూ ఆరోపణలు చివరకు తప్పుడు కేసులో ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేసి వికటాట్టహాసాలు తప్పుడు కేసులో.. తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు. -
బాధలు ‘బదిలీ’!
● నగరి మండలంలోని ఓ సచివాలయంలో పనిచేస్తున్నఉద్యోగిని నిండ్ర మండలం ఆరూరుకు బదిలీ చేశారు. సదరు ఉద్యోగి అక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. అయితే ఎమ్మెల్యే నీ పేరు చెప్పలేదు...రెండు రోజులు ఆగు మాట్లాడి చెబుతా అనే సమాధానం అక్కడి ఎంపీడీవో నుంచి వచ్చింది. దీంతో ఆ సచివాలయ ఉద్యోగి నివ్వెరపోయారు. అదే విధంగా మరో ఉద్యోగి నిండ్ర మండలంలోని ఎలకాటూరుకు బదిలీ అయ్యారు. తీరా అక్కడకు వెళ్లాక నిన్ను ఎస్ఆర్పురానికి మార్చేసామంటూ ఎంపీడీఓ చెప్పడంతో నివ్వెరపోయారు. ఇంకో ఉద్యోగి నగరి మండలం కీళపట్టు నుంచి వడమాలపేట మండలంలోని ఒక సచివాలయానికి బదిలీ కాగా, విధుల్లో చేరేందుకు వెళితే ఎమ్మెల్యేని కలిసి రమ్మ, లేకుంటే ఆయన పీఏతో ఫోన్ చేయించమని సాక్షాత్తు ఎంపీడీఓ తెగేసి చెప్పేశారు. ● ఈ తంతు ఒక్క నగరి నియోజకవర్గంలోనే కాదు. జిల్లాలోని పూతలపట్టు, యాదమరి, చిత్తూరు, పలమనేరు, జీడీ నెల్లూరు, చిత్తూరులో సైతం సాగుతోంది. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధుల్లో చేరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల వేధింపులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 504 గ్రామ సచివాలయాల్లో 5,040 మంది, 108 వార్డు సచివాలయాల్లో 1,080 మంది ఉద్యోగులు వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూన్ 15 నుంచి 30 వ తేదీ వరకు బదిలీల కసరత్తు నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదేళ్ల పాటు విధులు నిర్వహించిన సచివాలయ ఉద్యోగులను బదిలీ చేశారు. బదిలీ అయిన వివిధ కేడర్ల ఉద్యోగులు జూలై 10వ తేదీలోపు కొత్త స్థానాల్లో విధుల్లో చేరిపోవాలి. అయితే పలువురు సచివాలయ ఉద్యోగులు రాజకీయ ఒత్తిడి కారణంగా ఇప్పటికీ విధుల్లో చేరలేదు. కూటమి పాలనలో కక్ష సాధింపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉంది. చిరు జీతాలకు విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి కల్పించడంతో పాటు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. బదిలీల తంతు ముగిసి సదరు ఉద్యోగులు నూతన స్థానాల్లో చేరేందుకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎవరి అనుమతితో తమ నియోజకవర్గంలోని సచివాలయానికి వచ్చావు అంటూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీంవతో చాలా మంది సచివాలయ ఉద్యోగులు కొత్త స్థానాల్లో చేరలేని దుస్థితి. నమస్తే పెట్టి వెళ్లు కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీఓ వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా నగరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని ఎంపీడీఓలు నేరుగా సచివాలయ ఉద్యోగులకు కాల్ చేసి మరీ బెదిరిస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యేల పీఏలు కాల్ చేసి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేకు నమస్తే పెట్టి వెళ్లు అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, ఎంపీడీఓలు ఇలా ఎవరికి వారు సచివాలయ ఉద్యోగులతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీఓల చెడుగుడు ఎమ్మెల్యేలను కలిసి వెళ్లాలని హుకుం లేకుంటే తప్పని వేధింపులు పట్టించుకోని జిల్లా యంత్రాంగం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీచేసింది. కలెక్టర్ అనుమతితో నిబంధనలను అనుసరించి బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియలో పలు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సులు చెల్లకపోవడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేధింపులు సరికాదు సచివాలయ ఉద్యోగులపై రాజకీయ వేధింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగులనే టార్గెట్ చేస్తోంది. ఇది దుర్మార్గమైన పద్ధతి. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలి. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి. -
ప్రజల్లోకి బాబు మోసాలు
పుత్తూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, అంతకంటే ఎక్కువ ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. క్యూ ఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. రోజా మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. షూరిటీ పేరిట బాండులపై చంద్రబాబు, పవన్కల్యాణ్లు సంతకాలు చేసి ఇచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నాడో, ఏ షూటింగ్లో ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు గల్లా ఖాళీగా ఉందని, సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇంటింటికి వెళ్లి సుపరిపాలన పేరిట అమలు చేసిన పథకాల గురించి చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల వద్దకు వచ్చే టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
అంతా తికమకగా ఉంది
డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి చేసిన ప్రకటన తికమకగా ఉంది. ప్రవేశాలు ఆన్లైన్ అంటూ మళ్లీ ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రకటించింది. కనీసం వెబ్సైట్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. దీంతో మా తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేర్పిస్తామంటున్నారు. ప్రవేశాలు ఆలస్యం కావడంతో బీటెక్లో జాయిన్ అవుతున్నా. – శ్రావణి ప్రియ, విద్యార్థి, తిరుపతి అధ్యాపకులకే అర్థం కావడం లేదు డిగ్రీ ప్రవేశాల విధి విధానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాల అధ్యాపకులకు సైతం అర్థం కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియపై ఆరా తీశాం. వెబ్సైట్ తెరుచుకుంటే కానీ తమకే స్పష్టత లేదని అధ్యాపకులు చెబుతున్నారు. –విజయశ్రీ, విద్యార్థిని, తిరుపతి అధికారులపై చర్యలు తీసుకోవాలి డిగ్రీ అడ్మిషన్లను అస్తవ్యస్తం చేసిన ఉన్నత విద్యామండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి. డబుల్ మేజర్ , సింగిల్ అంటూ మూడు నెలలు కాలయాపన చేశారు. ఇప్పడు ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ అయోమయానికి గురి చేస్తున్నారు. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి విద్యార్థుల జీవితాలతో చలగాటం రాష్ట్ర చరిత్రలో డిగ్రీ ప్రవేశాలు జాప్యం కావడం ఇదే తొలిసారి. ప్రభు త్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉన్నత విద్యామండలి అధికారులు రెండు రోజుల క్రితం ఇచ్చిన ప్రకటన అయోమయంగా ఉంది. – భగత్ రవి, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి -
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడి మృతి
తవణంపల్లె : మండలంలోని తెల్లగుండ్లపల్లెలో శనివారం రాత్రి రంగయ్యనాయుడు (78) అనే వృద్ధుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. వివరాలు.. తన చెల్లెలు కుమారుడిని సైకిల్పై తిప్పుతున్నాడని హేమాద్రి అనే యువకుడిపై రంగయ్యనాయుడు చేయిచేసుకున్నాడు. ఈ విషయాన్ని హేమాద్రి తన ఇంట్లో వాళ్లకి ఫిర్యాదు చేశాడు. దీంతో హేమాద్రి అన్న బాలాజీ మరో ముగ్గురు యువకులతో వచ్చి రంగయ్యనాయుడిని నిలదీయగా గొడవ జరిగింది. తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం రంగయ్యనాయుడు తన ఇంటి ముందు షెడ్డులో ఉరివేసుకుని ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. రంగయ్యనాయుడుతో గొడవపడిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. మృతుడి కుమార్తె జనప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆగని ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు): పంట పొలాలపై ఏనుగుల దాడి ఆగడంలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని దేవళంపేట పంచాయతీలోని కొమ్మిరెడ్డిగారిపల్లె, దిగవమూర్తివారిపల్లెలో ఆదివారం తెల్ల వారుజామున ఏనుగుల గుంపు మామిడి చెట్లను వేళ్లతో సహా పెకళించేశాయి. దీంతోపాటు వంకాయ పంట, వేరుశెనగ పంటను తొక్కి నాశనం చేశాయి.