breaking news
Chittoor
-
ఇసుక ధరలకు రెక్కలు
పలమనేరు : అదును చూసి పదును పెట్టడమంటే ఇదేనేమో..! ఇటీవల వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోనూ నీరు చేరింది. దీంతో జిల్లాలో ఇసుక తవ్వకాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇలా డిమాండ్ వస్తుందని ముందుగానే భావించిన ఇసుక స్మగ్లర్లు వేలాది లోడ్ల ఇసుకను డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిప్పర్ ఇసుక ధరను అమాంతం పెంచి చిత్తూరు ప్రాంతం నుంచి పలమనేరు , కుప్పం, ఇటు కర్ణాటకలోని హోస్కోటకు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బుధవారం గంగవరం పోలీసులు రికార్డుల్లేని ఓ ఇసుక టిప్పర్ను సీజ్ చేసి మైనింగ్, ఆర్టీవో అధికారులకు అప్పగించడంతో ఈ ఇసుక అక్రమ రవాణా బాగోతం వెలుగు చూసింది. ముందస్తుగా ఇసుక నిల్వ చేసుకొని.. నదుల్లోంచి ఫిల్టర్ ఇసుక తప్ప ఎక్కడా ఇసుకను తోడేందుకు కష్టంగా మారింది. దీంతో ముందస్తుగా ఇసుకను డంప్ చేసుకున్న వారు మాత్రం ఇప్పుడు భారీ ధరలతో ఇసుక టిప్పర్ల ద్వారా కావాల్సిన చోటుకు తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు, చిత్తూరు, బంగారుపాళెం, గంగవరంలలో ఇసుక డంపులున్నట్లు తెలుస్తోంది. వీటిని బహిరంగంగానే వేసినా ప్రభుత్వ పనుల అవసరాల కోసమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వీటి నుంచే ఇసుక కర్ణాటకకు తరలుతోందనే విషయం అధికారులకు తెలియందేమీకాదు. ధరలు అమాంతం పెంచి.. వర్షాలతో ఇసుకకు నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో ఇసుక స్మగర్లు మొన్నటి దాకా టిప్పర్ ధర చిత్తూరు నుంచి పలమనేరుకు 20 వేలు, వీకోటకు రూ.23 వేలు, కుప్పానికి రూ.25 వేలు, కర్ణాటకకు రూ.90 వేలుగా ఉండేది. ఇప్పుడు పలమనేరుకు రూ.27 వేలు, వీకోటకు రూ.30 వేలు, కుప్పానికి రూ.35 వేలు, హొసకోటకు రూ.1.30 లక్షలకు పెంచేశారు. దీనికి తోడు డ్రైవర్ బత్తా రూ.500 అదనంగా ఇవ్వాల్సిందే.కూటమి అండతో దర్జాగా ... యథేచ్ఛగా అక్రమ రవాణా బంగారుపాళెం నుంచి వీకోట వైపుగా వెళుతున్న ఇసుక టిప్పర్ను గంగవరం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇరువురు కానిస్టేబుళ్లు దీన్ని తూకం వేసి ఆపై సంబంధిత శాఖలకు అప్పగించారు. ఇది వీకోటకు చెందిన ఓ వ్యక్తికి తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. అయితే ఇసుక ప్రభుత్వ పనుల కోసమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. కానీ వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోవడంతోనే పోలీసులు సీజ్ చేసినట్లు తెలిసింది. పోలీసుల పట్టుకుంది ఓ టిప్పరైతే నిత్యం పదుల సంఖ్యలో ఇదే హైవేపై ఇసుక టిప్పర్లు యథేచ్ఛగా వెళుతుండడం గమనార్హం. ప్రస్తుతం సాగుతున్న ఇసుక అక్రమ రవాణాలో చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, బంగారుపాళ్యానికి చెందిన ఓ టీడీపీ నేత, వీకోటకు చెందిన మరో వ్యక్తి ద్వారా ఇక్కడికి ఇసుక రవాణా అవుతున్నట్లు ఇక్కడి ఇసుక ఏజెంట్లే చెబుతున్నారు. ఇప్పుడు బంగారుపాళెం డంప్ నుంచి వీకోట దాకా ఇసుక సరఫరా అవుతోంది. ఈ ప్రాంతంతో పాటు పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో ఇసుక ఏజెంట్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
సైబర్ నేరాలపై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన ముఖ్యమని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి విద్యార్థి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఆ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. మొబైల్స్ రూపంలోనే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మత్తు జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. సైబర్ నేరాలు నిత్యం పెరుగుతుండడంతో విద్యార్థులు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను వినియోగించాలన్నారు. సంబంధం లేని లింక్లను క్లిక్ చేయకూడదన్నారు. మహిళల భద్రతకు అమలు చేస్తున్న శక్తి యాప్ను విద్యార్థినులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పీవీకేఎన్ ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. చిత్తూరు సర్కిల్ ఏసీబీ, విజిలెన్స్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు వెల్లడించకూడదన్నారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఫోన్లలో ఓటీపీలు, లింక్లు వస్తే వాటిని ఆమోదించకూడదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ మహేశ్వర, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.నేడు పుష్పయాగం శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈనేపథ్యంలో తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. -
సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
ఐరాల : మండలంలోని కాణిపాకంలో పండారం వీధికి చెందిన చిన్నపాపమ్మ ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చిన్నపాపమ్మ, భూలోకయ్య దంపతులు పండారం వీధిలో సొంత భవనంలో నివసిస్తున్నారు. ఉదయం చిన్నపాపమ్మ టీ పెట్టడానికి గ్యాస్ పొయ్యిని వెలిగించింది. ఆ సమయంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాగా గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గమనించని చిన్నపాపమ్మ స్టౌవ్ వెలిగించేందుకు లైటర్ ఆన్ చేయగా ఒక్కసారిగా స్టౌవ్ నుంచి పెద్ద శబ్ధం రావడంతో భయంతో బయటకు పరుగులు తీసింది. అప్పటికే ఆమె చీరకు నిప్పు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. మహిళ ఇంటి బయటకు వచ్చిన తరువాత సిలిండర్ పేలడంతో ఇళ్లు ధ్వంసమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి రాణిపేట సీఎంసీకి తరలించారు. -
డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపు
చిత్తూరు కార్పొరేషన్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడించేందుకు సిద్ధం కావాలని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. ఆ సంఘ నాయకులు బుధవారం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు చట్టం 1996ను పటిష్టంగా అమలుచేస్తూ వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించారన్నారు. హామీల పరిష్కారానికి త్వరలో డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ ముట్టడికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు, నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సేవలే చిరస్మరణీయం
చిత్తూరు కలెక్టరేట్ : ఒక ఐఏఎస్ అధికారి తలచుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు...ఎంతో మంది పేద ప్రజలకు విశేష సేవలందించవచ్చు....అలాంటి సేవలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కలెక్టర్లలో దివంగత ఎం.నాగార్జున ఒకరు. ఆయన 1990–91 వ సంవత్సరంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన పనిచేసే సమయంలో జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రస్తుతం కలెక్టరేట్లో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్కు ఎం.నాగార్జున పేరును పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ హాల్ను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నూతన హాల్కు దివంగత ఐఏఎస్ అధికారి నాగార్జున పేరును పెట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్డీవో శ్రీనివాసులు, చిత్తూరు తహసీల్దార్ కులశేఖర్, కలెక్టరేట్లోని పలు విభాగాల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డెల్ఫీ టీవీఎస్తో ఎంఓయూ
పుత్తూరు: చైన్నెకి చెందిన ప్రముఖ డెల్ఫీ టీవీఎస్ కంపెనీతో పుత్తూరులోని పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ) కుదుర్చుకుంది. బుధవారం డెల్ఫీ టీవీఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజన్ బృందం పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. ఈసందర్భంగా ఇరు వర్గాల మద్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఎంఓయూపై సంతకాలు చేశారు. ప్రిన్సిపల్ ఎస్వీకుమార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అవకాశాలు, ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకా శాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ వేలాయుధాచ్చారి, విభాగాధిపతు లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ.2 కోట్లతో సహాయక చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాన్ వల్ల జరిగిన నష్టం వివరాలను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ విలేకరులకు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాన్ సహాయక చర్యలకు ప్రభుత్వం రూ.2 కోట్లు బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. ఆ బడ్జెట్తో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో చెరువులు, రోడ్లు అధికంగా మరమ్మతులకు లోనయినట్లు తెలిపారు. 10 గృహాలు దెబ్బతిన్నాయ్ జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, పులిచెర్ల మండలాల్లో 10 గృహాలు అధిక వర్షాలకు దెబ్బతిన్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. దెబ్బతిన్న ఒక్కొక్క గృహానికి రూ.50 వేలు సాయం అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. 55 చెరువులకు మరమ్మతులు జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాన్కు 55 చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. దెబ్బతిన్న చెరువులను మరమ్మతులు చేసేందుకు రూ.75 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ చెరువుల మరమ్మతు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. పెరిగిన భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా మోంథా తుపాను వల్ల కురుస్తున్న వర్షాలకు 32 మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయని కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలంలో పిడుగు పాటుకు మృతి చెందిన ఓ బీటెక్ విద్యార్థి కుటుంబానికి త్వరలో ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. మోంథా తుపాన్ సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు, పోలీసులు, సిబ్బంది బాగా పనిచేశారని కలెక్టర్ ప్రశంసించారు. నవంబర్ 5వతేదీ లోపు నష ్టపరిహారం నివేదికలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు నవంబర్ 5 వ తేదీలోపు మోంథా తుపాన్ నష్టపరిహారం నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నష్టపరిహారం నివేదికలు కచ్చితత్వంగా ఉండాలన్నారు. ఎలాంటి అలసత్వం వహించకుండా నిర్ధేశించిన తేదీలోపు నివేదికలను సిద్ధం చేయాలన్నారు. నష్టపరిహారం నివేదికలు సిద్ధం చేసిన అనంతరం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. నివేదికల తయారీలో తప్పులు దొర్లితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కచ్ఛితమైన నివేదికలు ఇవ్వాలన్నారు. -
నేడు కటారి దంపతుల హత్య కేసు తీర్పుపై విచారణ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్య కేసులో దోషులకు విధించే శిక్షపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే అయిదుగురిని ఇప్పటికే న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కటారి దంపతుల హత్యలో అయిదుగురిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది. కాగా దోషుల మానసిక పరిస్థితి, సామాజిక స్థితి, జైల్లో ప్రవర్తనపై ఆయా విభాగాల అధికారులు నివేదికలు ఇవ్వాలని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికలను న్యాయస్థానం ముందు ఉంచాలని, దోషులను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే దోషులకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. సీల్డు కవరులో నివేదికను న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. నివేదిక చూసిన తరువాత న్యాయమూర్తి శిక్షపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు కోర్టు కాంప్లెక్సు వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. -
సేవలే చిరస్మరణీయం
సేవలే చిరస్మరణీయంగా నిలుస్తాయని బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు.వరి గింజలు మొలకెత్తి.. ప్రస్తుతం కింద పడిన వరిని కోతకోయాలంటే వరికోత మిషన్లో సాధ్యం కాదు. భూమి ఆరే వరకు ఉంటే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అటు వర్షంతో ఇటు అధిక ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి కొలుకోలేని దెబ్బ తగిలిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కొంత మంది రైతులు కాసింత తెరపివ్వడంతో అన్నదాతలు సహాయక చర్యలకు ఉపక్రమించారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించుకుని పాలాలను ఆరబెట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో కాసింత ఇబ్బందులు లేకపోయినా దిగువ ప్రాంతాల్లో మాత్రం వర్షపు నీరంతా పంట పొలాల్లో నిలిచి ఉంటడంతో పంట కుళ్లి పనికిరాకుండా పోయామని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేటు బస్సుల అక్రమాలకు బ్రేకులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రైవేటు బస్సు అక్రమాలకు బ్రేకులు వేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు పట్టుపట్టారు. కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై ఈనెల 25న సాక్షి దినపత్రికలో ‘అమ్మో బస్సు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు విస్తృతం చేసి నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా మీదుగా నిత్యం 240కు పైగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. బెంగుళూరు, తమిళనాడులోని రామేశ్వరం, మధురై, కోయంబత్తూరు, చైన్నె, వేలూరు, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు నిత్యం ట్రావెల్స్ బస్సులు చిత్తూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలో వేల మంది నిత్యం ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన, సాక్షిలో వచ్చిన కథనంపై స్పందించిన రవాణా అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన తనిఖీలో 12 బస్సులను సీజ్ చేశారు. అలాగే 62 కేసులు నమోదు చేశారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు లేని బస్సులు సీజ్ ప్రధానంగా చిత్తూరు నగరంలోని ఇరువారం బ్రిడ్జి వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ మార్పు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్ గడువు ముగియడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. రికార్డుల్లో బస్సు సీటు రకం..కానీ రోడ్డుపై స్లీపర్ బస్సుగా నడపడం గుర్తించి సీజ్ చేశారు. -
దివ్యాంగుల పింఛన్లపై వేధింపులు తగదు
ఐరాల : అర్హులైన దివ్యాంగుల పింఛన్లపై రాజకీయ వేధింపులు తగదని ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అర్హులైన దివ్యాంగుల పింఛన్ పొందుతున్న వారిపై వేధింపులు నిరసిస్తూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుమతి, లీలాపతినాయుడు తదితరులు బాధిత దివ్యాంగులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, మురళీ మాట్లాడుతూ.. ఐరాల పంచాయతీ, గోవిందరెడ్డిపల్లెకు చెందిన వరదరాజులురెడ్డి, గోవిందమ్మ, చిన్నరాజులరెడ్డి, నాగరత్నమ్మ, తులసమ్మ, చిట్టిబాబుల దివ్యాంగుల పింఛన్లపై అదే గ్రామానికి చెందిన కూటమి నేత తన రాజకీయ ఆదిపత్యం కోసం తన అనుచరులతో కలిసి అధికారులకు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి అనేక పర్యాయాలు విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, బాధిత వికలాంగులు జేఏసీ నేతలకు తెలిపారన్నారు. వీరందరూ ఇదివరకే సదరం రీ వెరిఫికేషన్ చేయించుకుని నూతన సదరం సర్టిఫికెట్లు పొందారన్నారు. కాగా వీరి పింఛన్లు తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పుడు ఫిర్యాదులతో, కుట్రపూరిత ఆలోచనలతో వేధింపులకు గురిచేయడం సమంజసం కాదని హితువు పలికారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కూటమి నేతతో పాటు అతని అనుచరులపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. విచారణ పేరుతో వేధిస్తున్న అధికారులపై ఏపీ లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ఏకాంబరం, ప్రసాద్, కవిత, భాగ్యలక్ష్మి, గోవిందగౌడ్, నారాయణరెడ్డి, భూపతి, బాధిత వికలాంగులు పాల్గొన్నారు. -
పంట నష్టం అంచనా కొంతే..
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో నీటి వసతి ఉన్న చాలా మంది రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఆ వరిపంట కొన్ని చోట్ల ఎన్నుదశలో ఉండగా మరికొన్నిచోట్ల కోత దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కోతలు ప్రారంభించాలనుకున్న తరుణంలో వర్షం అన్నదాతలు నిలువునా ముంచేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రైతుల కష్టమంతా వర్షార్పణమయింది.. చేతికొచ్చే పంట నేలపాలు కాగా.. సాగు ఖర్చు. నీళ్లపాలైంది. జిల్లాలో చాలా చోట్ల వర్షం ధాటికి వరి పంట నీట మునగగా..పలుచోట్ల మట్టిపాలైంది. వరి 430 ఎకరాల దాకా నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు టమాట, కూరగాయల పంటలు పూల సాగు దెబ్బతిన్నాయి. తుపాను హడావుడి.. కానరాని అధికారులు రెండు రోజుల పాటు జిల్లాకు తుపాను ముసురును తెచ్చిపెట్టింది. ఈ ముసురు దెబ్బకే వందల ఎకరాల పంటలు నీటమునగడం, నేలమట్టం అయ్యాయి. అయితే కొంత మంది జిల్లా అధికారులు మినహా.. మిగిలిన అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. పలువురు మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం తుపాను ఆదేశాలకు వర్షపు నీటిలో వదిలేశారు. ప్రతి ఒక్కరు విధుల్లో ఉండాలని, సెలవులు లేవని స్పష్టంగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన విధులకు డుమ్మా కొట్టారు. సోమ, మంగళ వారాల్లో పలు మండల, సచివాలయాల్లో సిబ్బంది లేక బోసిపోయాయి. సచివాలయాలకు ఒకరిద్దరు చొపున మాత్రమే కనిపించారు. విపత్తు సమయంలో కూడా అధికారుల తీరు ఇలా ఉంటే.. ఆపై గొప్పలు చెప్పడం విమర్శలకు దారి తీస్తోంది. చిత్తూరు మండలంలోని పలువురు సచివాలయ సిబ్బందికి ఆ రెండు రోజులపాటు విధుల్లో లేరని షోకాజు నోటీసులు ఇచ్చారు. మిగిలిన మండలాల్లో ఆ ఊసే లేదు. వారిని పట్టించుకునే నాథులు కరువయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మండల స్థాయి అధికారులు తుంగలో తొక్కారు.జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి 430 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పెనుమూరు మండలంలో 140 ఎకరాలు, గుడిపాలలో 135 ఎకరాలు, వెదురుకుప్పంలో 37 ఎకరాలు, పూతలపట్టులో 33 ఎకరాలు, నగరి, పాలసముద్రం, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, సోమల, సదుం, చౌడేపల్లి మండలాల్లో కూడా ఎకరాల కొద్ది పంట నష్టం జరిగినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉద్యాన శాఖలోని బొప్పాయి 7 ఎకరాలు, పూలు 5 ఎకరాలు, టమాట 13 ఎకరాలు, కాలీఫ్లవర్ 5 ఎకరాలు, పొట్లకాయ 2 ఎకరాలు మాత్రమే జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు గణంకాలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలోని ఉద్యానశాఖ అధికారులు మామిడి పునఃపరిశీలన పేరుతో తుపాను నష్టంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణులున్నాయి. సదుం, చౌడేపల్లి, సోమల మండలాల నుంచి మాత్రమే నష్టం వివరాలు వచ్చాయని, మిగిలిన చోట్ల ఉద్యాన పంటలపై చూసీ చూడనట్లు వదిలేశారని రైతులు వాపోతున్నారు. ఉద్యాన పంటలు మొత్తం కలిపి 250 ఎకరాలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చుని, అధికారులు పంట నష్టంపై పక్కాగా పరిశీలన చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్తి ,ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డాం
చిత్తూరు కలెక్టరేట్ : మోంథా తుపాను కరుణించడంతో జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తలేదని జిల్లా స్పెషల్ ఆఫీసర్ పీఎస్.గిరీషా అన్నారు. మోంథా తుపాను స్పెషల్ ఆఫీసర్గా జిల్లాకు విచ్చేసిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మోంథా తుపాను వల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తప్పించుకున్నామన్నారు. మోంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని భావించి ప్రభుత్వం తనను జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించిందన్నారు. రెండు రోజులుగా జిల్లాలో అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగిందన్నారు. జిల్లాలోని గంగాధరనెల్లూరు, నగరి మండలం, నగరి మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు తెలిపారు. నష్టాలపై ప్రాథమిక అంచనాలను కలెక్టర్ త్వరలో ప్రభుత్వానికి త్వరలో పంపిస్తారని తెలిపారు. నగరి వద్ద ఓ ప్రాంతంలో ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే కింది భాగంలోని చెరువుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు కోరారు. వాటిపై తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు స్పెషల్ ఆఫీసర్ వెల్లడించారు. -
రైల్వేస్టేషన్లో ముందస్తు చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని తిరుపతి రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు తిరుపతి, విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి, విశాఖ పట్టణం వంటి ముఖ్యస్టేషన్లకు సంబంధించిన రైళ్ల రద్దు, సర్వీసుల కలిగిన రైళ్ల రాకపోకల వివరాల కోసం 24 గంటలు సేవలు అందించేలా రెల్వేస్టేషన్ ప్రధాన ద్వారంలోని టికెట్టు బుకింగ్ కౌంటర్ భవనంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువల నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలతో పాటు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. రద్దయిన రైళ్ల ప్రాంతాలకు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్టు మొత్తం తిరిగి చెల్లించేందుకుగాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కాగా మంగళవారం తిరుపతి నుంచి వెళ్లే పూరి ఎక్స్ప్రెస్, కడప నుంచి తిరుపతి మీదుగా విశాఖ పట్టణం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్, అలాగే విశాఖపట్టణం వెళ్లే ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం కాకినాడ నుంచి బయలుదేరే శేషాద్రి ఎక్స్ప్రెస్, నర్సాపురం నుంచి బయలుదేరే ధర్మవరం ఎక్స్ప్రెస్తో పాటు తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే డబుల్ డెక్కర్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
సక్రమంగా బిల్లులు పెడితేనే పనిచేయండి
గుడుపల్లె: ఉపాధి పథకంలో చేస్తున్న పనులకు సక్రమంగా మస్టర్లు, బిల్లులు పెడితేనే పనిచేయాలని పీడీ రవికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19వ ఉపాధి పథకం సామాజిక తనిఖీ బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకంలో కూలీలకు సక్రమంగా ఇచ్చే బిల్లులకు సంబంధించి మస్టర్లలో సంతకాలు సేకరించి రికార్డులు సంక్రమంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు మండలంలోని 18 గ్రామ పంచారయతీల్లో జరిగిన ఉపాధి పనులపై బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ పంచాయతీల్లో బిల్లులు పెట్టినా కూడా మస్టర్లలో సంతకాలు లేకుండా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఉపాధి హామీకి సంబంధించి రూ.44 వేలు రికవరీ చేశామన్నారు. మిగిలిన నగదును వారంలోపు చెల్లించాలని తెలిపారు. ఏపీఓ అనీల్కుమార్, ధనయ్య, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెట్లు తదితరులు పాల్గొన్నారు. -
వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి
గంగాధర నెల్లూరు : ఇటుక బట్టీలో వెట్టి చాకిరి చేయిస్తూ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతున్న యజమాని నుంచి ఓ కుటుంబాన్ని జీవన జ్వాల సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వాధికారులు విముక్తి కలిగించారు. గంగాధర నెల్లూరు మండలంలోని బుక్కపట్నం గ్రామం గుట్ట వద్ద పుష్పరాజ్ అనే ఇటుకల వ్యాపారి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓ కుటుంబాన్ని 37 వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి ఇటుకల బట్టిలో పనిచేయడానికి రప్పించుకున్నారు. సంవత్సరాల గడుస్తున్నా ఇంటికి పంపించకుండా కూలి డబ్బు ఇవ్వకుండా నిర్బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, జీవన జ్వాల సంస్థ ప్రతినిధులకు ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించగా స్పందించిన ఆర్డీఓ స్థానిక తహసీల్దార్కు తక్షణమే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది బుక్కాపట్నం గుట్ట వద్దకు చేరుకుని వెట్టి చాకిరి నుంచి కుటుంబాన్ని విముక్తి చేశారు. చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం చెరువు కట్ట వైపు వెళుతున్న వారు.. నీటిలో తేలుతున్న ఓ మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. శవం బాగా కుళ్లి ఉండటంతో ఇది వారం కిందట జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుందని, ఇతడి కుడిచేతిపై ఆంగ్లంలో అను పేరిట పచ్చబొట్టు ఉందని వన్టౌన్ సీఐ మహేశ్వర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440796707 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్ఎస్యూలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఈ విజిలెన్న్స్ అవేర్నెస్ వీక్ ముఖ్యోద్దేశం అని, ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి సమాజహితం కోసం పనిచేయాలని, విశ్వవిద్యాలయాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషషి చేయాలని పిలుపునిచ్చారు. -
ఆగని ఆక్రమణలు
పెద్ద చెరువు.. పలమనేరు : పట్టణంలోని పెద్ద చెరువు గోస ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికే చెరువు మొరవల వద్ద భారీగా ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. కట్టను సైతం చదును చేసి లేఅవుట్లకు దారులు వేశారు. తూర్పు, పడమట మొరవల వద్ద కట్టపై భారీ భవంతులు నిర్మించారు. తాజాగా మంగళవారం కొందరు కట్ట కింద తమ భూమి ఉందంటూ నడికట్టపై గంగమ్మ గుడి వద్ద జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరి స్వార్థం కోసం పెద్ద చెరువు కట్ట కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పెద్దచెరువు మొరవ పారుతోంది. ఇలాంటి సమయంలో కట్టను ఎవరైనా ముట్టుకుంటారా? ఏ మాత్రం కట్ట దెబ్బతిన్నా కట్ట తెగడం ఖాయం. ఇలాంటి తరుణంలో కొందరు ఆయకట్టులో భూములున్న వారు కట్టపై గంగమ్మ గుడివద్ద పూజల పేరిట జేసీబీతో కట్టను చదును చేశారు. వీరి దెబ్బకు కట్ట తెగడం ఖాయమని భయపడిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ ఇంజినీరింగ్, ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చారు. వారెవరూ పట్టించుకోకపోగా ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ మాత్రం వెంటనే స్పందించి అక్కడున్న జేసీబీని పనులు చేయకుండా అడ్డుకున్నారు. కట్ట ఏౖమైనా తమకు సంబంధం లేదు.. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద చెరువు కట్ట ఆక్రమణలు తమ పరిధిలోకి రావని ఇరిగేషన్ అధికారులు చూసుకుంటారని జారుకున్నారు. కట్టపై పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటే మున్సిపల్ అధికారులకు వాటిపై హక్కు ఉంటుంది. కానీ కట్టను తెంచినా పట్టించుకోరట. గతంలోనూ మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల సమన్వయ లోపంతోనే భారీగా అక్రమ కట్టడాలు కట్టపై వెలిశాయనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా ఇరిగేషన్ అధికారుల చర్యలు గతంలో కట్టపై రియల్ ఎస్టేట్కు దారి కోసం కట్టను తవ్వినా ఇరిగేషన్ అధికారులు పెద్దగా స్పందించలేదు. దాన్ని ఆర్అండ్బీ వారు చూసుకుంటారని పట్టించుకోలేదు. కట్టకు ఇరువైపులా పెద్ద భవన నిర్మాణాలు చేపడుతున్నా అది వారి పట్టా భూమిలేనని వదిలేశారు. ఇప్పుడు ఏకంగా నడికట్టపై జేసీబీతో తవ్వుతున్నా అడిగేవాళ్లే లేకుండా పోయారు. అధికారుల తీరుపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టపై జేసీబీతో తవ్వినా పట్టించుకోరా? ఇప్పటికే పెద్ద చెరువు కట్ట ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు చెరువు నిండి మొరవపోతోంది. నిండు కుండలా ఉన్న చెరువు నడి కట్టపై జేసీబీతో తవ్వుతుంటే కడుపు మండి కమిషనర్, ఏఈ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇరిగేషన్ ఏఈ వచ్చి జేసీబీని వెనక్కు పంపారే గాని ఆక్రమణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు. – కావడి నాగరాజు, కౌన్సిలర్, పలమనేరు పెద్ద చెరువును కాపాడుకోవాలి నేను ఇక్కడే పుట్టి పెరిగా, పట్టణానికి పెద్ద చెరువుకు విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి పెద్ద చెరువు కట్ట, చెరువును కాపాడుకోవాల్సిన అవసరం పట్టణవాసులుగా అందరిపై ఉంది. ఈ సమస్యపై పీపీఎస్లాంటి వారు ముందుకు రావాలి. అక్రమార్కుల దెబ్బకు చెరువు నాశనం అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం బాధగా ఉంది. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
చిత్తూరు లీగల్ / చిత్తూరు అర్బన్ : బాలికను ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి, లైంగిక దాడికి పాల్పడ్డ పూజారి కణ్యాణ్ (29) అనే ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరు లోని పోక్సో కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. పుంగనూరుకు చెందిన పూజారి కళ్యాణ్ టైల్స్ వేసే మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి 14 ఏళ్ల వయస్సున్న ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 ఏప్రిల్లో 18న ఆ బాలికను ప్రేమిస్తున్నాంటూ, పెళ్లి చేసుకుంటా నని చెప్పి, పలుమార్లు ఆమెతో శారీరకంగా కలి సాడు. ఆపై అదే నెలలో కర్ణాటకలోని హోస్కోట కు బాలికను తీసుకెళ్లి ఓ లాడ్జిలో తాము భార్య, భర్త అని చెప్పి గదిని అద్దెకు తీసుకుని అయిదు రోజులు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కూడా నిందితుడు బాలికతో పలుమార్లు కలిసాడు. తమ కుమార్తె కనిపించడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, పుంగనూరు అర్బన్ పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసి.. ఆపై బాలి కను గుర్తించారు. విచారణలో జరిగిన విష యం తెలియడంతో కళ్యాణ్పై బాలలపై లైంగిక దాడుల నివారణ చట్టం (పోక్సో) కింద కేసు నమో దు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించగా నేరం రుజువయ్యింది. దీంతో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పు ఇచ్చారు బాధితురాలి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్ను ఆదేశించారు. -
భానుప్రకాష్ రెడ్డికి భావోద్వేగం ఎందుకో?
తిరుపతి కల్చరల్: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని మీడియా సమావేశంలో మాట్లాడడంపై పలు అనుమానాలున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందారపు మురళి అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకామణి వ్యవహారంపై ఏపీ హైకోర్టు స్పందించిన తీరును తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని.. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని మీడియా సమావేశంలో మాట్లాడారని గుర్తుచేశారు. దీనిపై భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత పాలక మండలిలో బీజేపీ నేతలు ఉన్న నాడు ప్రశ్నించక మిన్నకుండిపోవడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నది తన సొంత పార్టీ నేతలా? బయటివారా? ఎవరన్న విషయాన్ని వెల్లడించకుండా భావోద్వేగానికి గురైతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి భార్య డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని జర్నలిస్టు శ్రీనివాసులు చేస్తున్న ఆరోపణపై భానుప్రకాష్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర నివేదికను తీసుకురావాలని, పరకామణిలో చిన్న జియ్యంగార్ మఠం పాత్రపై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 35 ఏళ్లుగా ఒకే వ్యక్తి పరకామణిలో పర్యవేక్షణకు ఎలా వెళతారని క్లర్క్ స్థాయి కూడా లేని రవికుమార్కు రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో భక్తులకు వెల్లడించాలని, ఈ కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు టి.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, పి.సాయిలక్ష్మి, మాధవ్, లక్ష్మి, జయంతి, వేణుగోపాల్, ముజీ పాల్గొన్నారు. -
నేడు యథావిధిగా పాఠశాలలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు మోంథా తుపాను కారణంగా కొద్ది రోజులుగా వరుసగా సెలవులు ప్రకటించారు. ఈనెల 29న బుధవారం తుపాను ప్రభావం ఉండదని భావించిన అధికారులు పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు నిర్వహించాలని డీఈవో వరలక్ష్మి ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించారని వెల్లడించారు. హెచ్ఎంలకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు పూల్–2 శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు దీక్ష ఆన్లైన్ ప్లాట్ ఫామ్లో కోర్సులు అందుబాటులో తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆయా పాఠశాలల హెచ్ఎంలు శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పంచాయతీలకు కేంద్రం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. జిల్లాకు రూ.35 కోట్లు వరకు విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జిల్లాకు కేవలం రూ.1.43 కోట్లు నిధులు మంజూరు చేశారు. మిగిలిన నిధులను త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5న సత్యనారాయణవ్రతం కాణిపాకం: పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్ 5న కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైనా శ్రీవరదరాజులస్వామి ఆలయంలో సత్యనారాయణ వత్రం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య వ్రతం జరుగుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. 8న సంకటహర గణపతి వ్రతం కాణిపాకం : నవంబర్ 8వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సంకటహర గణపతి వ్రతం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుందన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు ముందస్తుగా టిక్కెట్లు తీసుకోవాలని పేర్కొన్నారు. నిత్యం చెరువుల పర్యవేక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం చెరువులను పర్యవేక్షిస్తున్నామని ఇరిగేషన్ శాఖ జిల్లా ఎస్ఈ వెంకటేశ్వరరాజు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత వారం, ఇటీవల కురిసిన వర్షాలకు 51 చెరువులు దెబ్బ తిన్నాయన్నారు. జిల్లా మొత్తం 4122 చెరువులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పూర్తిగా 1434 చెరువులు నిండినట్లు తెలిపారు. 75 శాతం 717 చెరువులు, 50 శాతం 1032 చెరువులు, 25 శాతం 549 చెరువులు నిండిన ట్లు చెప్పారు. జిల్లాలోని బంగారుపాళ్యం, వెదురుకుప్పం, గుడిపాల, ఐరాల, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి, సదుం, పుంగనూరు, తవణంపల్లి, యాదమరి, పలమనేరు, పులిచెర్ల, గంగాధరనెల్లూరు మండలాల్లో పెద్ద సంఖ్యలో జలకళ సంతరించుకున్నట్లు ఇరిగేషన్ శాఖ జిల్లా ఎస్ఈ వెంకటేశ్వరరాజు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,842 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,125 మంది భక్తులు తలనీలాలు అర్పించున్నారు. స్వామివారి హుండీకి కానుకల రూపంలో రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని టిటిడి స్పష్టంచేసింది. -
తడిసి ముద్దయింది...
వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి ఇటుక బట్టీలో వెట్టిచాకిరీ చేస్తున్న ఓ కుటుంబాన్ని అధికారులు గుర్తించి, వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి ముసురు పట్టుకుంది. తేలిక పాటి వర్షంతో జిల్లాను తడిపి ముద్ద చేసింది. పలుచోట్ల రోడ్లను జలమయం చేసింది. దీని దాటికి రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక చెరువులు, వాగులు, వంకలు జలకళలను సంతరించుకున్నాయి. కొన్ని రోజలుగా కురిసిన వర్షాలకు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇకపై కురిసే వర్షాలకు చెరువులు, వంకలు, వాగుల ఉదృతి పెరగనుంది. తద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే పలు మార్గాల్లో నీటి ప్రవాహం పుంజుకుంటోంది. ఆయా మార్గాల్లో ప్రజలు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలతో రాకపోకలు చేయాలని సూచిస్తున్నారు. పంటలు నేలకొరిగాయి. వరి పంట వర్షార్పణమవుతోందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. టమాట రైతులు చతికిలపడుతున్నారు. కూరగాయలు పండించిన రైతులు కంటతడిపెడుతున్నారు. దినసరి కూలీలు ముసురుకు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గడపదాటి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో కరెంటు కోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూగజీవాలు ముసురుకు గజగజ వణికిపోతున్నాయి. మేతకు కష్టతరమవుతోంది. -
మామిడి రైతు బకాయిలు చెల్లించండి
రైతు ఖాతాల్లో జమ చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపుల నిర్వాహకులు, కిలోకు రూ.8 చొప్పున చెల్లించాల్సిన బకాయిలు సత్వరం చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్ర తరం చేయాలని మామిడి రైతు సంఘం కార్యవర్గం తీర్మానించింది. మంగళవారం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో టి.జనార్దన్ అధ్యక్షతన సంఘం సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు గిట్టుబాటు ధర రూ.12 ఇచ్చేలా సంఘం పోరాడాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మ డి చిత్తూరు జిల్లాలో 40 వేల మంది రైతులకు ఇంకనూ రూ.300 కోట్లు పైగా ఫ్యాక్టరీలు, ర్యాంపుల నుంచి చెల్లింపులు జరగాలని, వీటికి ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుని విడుదల చేసేలా కృషి చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే మామి డి సరఫరా చేసి ఐదు నెలలు కావస్తున్న నేపథ్యంలో రైతులు అప్పుల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. తొలుత రైతులతో జరిగిన సమావేశంలో రూ.12 కు సమ్మతించి తర్వాత రూ.4 సబ్సిడీ అందిన నేపథ్యంలో 8 రూపాయలు చెల్లించడానికి సిండికేట్ ససేమిరా అనడం వీరిపై ప్రభుత్వం నియంత్రణ లేనట్టుగా భావించాల్సి వస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం 40 వేల మంది రైతుల క్షేమం కోసం కఠినంగా వ్యవహరించి వారి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేసేటట్టు చూడాలని కోరింది. లేకపోతే నవంబర్ చివరి వారంలో ఉద్యమం తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మునీశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్.కె. సురేంద్రన్, ఉపాధ్యక్షులు, పి. హేమలత, కె. మునిరత్నంనాయుడు, బి. మురళి, ఎ. ఉమాపతి నాయుడు, కార్యదర్శు లు, శ్రీనివాస్, త్యాగరాజులరెడ్డి, ఎల్ మోహన్ రెడ్డి,, కోశాధికారి, ఎల్ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. -
జాయింట్ కమిషనర్ తీరు సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్రెడ్డి తీరు సరికాదని ఆ శాఖ ఉద్యోగులతో పాటు, పలు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కట్టమంచి వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని 9 సర్కిల్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోషియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టి.పూర్ణం మాట్లాడుతూ.. జాయింట్ కమిషనర్ తన వద్ద అటెండర్లగా పనిచేస్తున్న భరత్, లవకుమార్ను అంటరానితనంతో చూడటం సరికాదని మండిపడ్డారు. ఆ ఇద్దరి అటెండర్లలో ఒకరిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించి నిత్యం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఉద్యోగిని కొట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కమిషనర్ వ్యవహార శైలిపై రాష్ట్ర చీఫ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కులం పేరుతో ధూషించడం నేరం ఏపీ నాల్గవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇద్దరు అటెండర్లను కులం పేరుతో ధూషించడంతో పాటు అంటరాని వ్యక్తులుగా చూస్తున్న జాయింట్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. చెప్పులు వేసుకుని రాకూడదని అటెండర్ల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.అసభ్యపదజాలాలతోధూషిస్తూ ఉద్యో గులను మానసికంగా వేధిస్తున్నాడన్నారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం మాట్లాడుతూ.. జాయింట్ కమిషనర్ తీరు పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ.. జేసీ స్థాయి అధికారి అటెండర్ లను కులం పేరుతో ధూషించడం సరికాదన్నారు. కారులో కూర్చొని అటెండర్లను గంటల కొద్ది ఎండలో నిలబెట్టి వేధించడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తున్న జాయింట్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా కార్య క్రమంలో సీటీఎన్జీవో ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఎన్జీవో సంఘం ఉపాధ్యక్షులు మురళి, ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, సీటీఎన్జీవో సంఘం ఉపాధ్యక్షుడు సురేష్కుమార్రెడ్డి, గోవర్ధన్, వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులు, జేఏసీ నాయకులు , జాయింట్ కమిషనర్ వేధిస్తున్నారంటూ వెల్లడిస్తున్న అటెండర్లు భరత్, లవకుమార్ -
దెబ్బతిన్న పంటలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు మోంథా తుపాను... ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇదీ మరింత బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. వాయుగుండం మరో రెండు రోజుల పాటు జిల్లాపై పంజా విసరనుందని అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముప్పు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తుపానుతో లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అధికారులు అప్రమత్తం మోంథా తుపానుతో కంట్రోల్ రూమ్ అలర్ట్ అవుతోంది. జిల్లాలో ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితులను అంచనా వేసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం సూచనలిస్తోంది. మండల అధికారులు వారి పరిధిలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పడు చేరవేసేలా ఆదేశాలిచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, మాత్రలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరించింది. జిల్లాపై తుపాను దెబ్బ పడుతోంది. చిత్తూరు నగరంలో పలుచోట్ల చెట్లు పడి కొమ్మలు వాలిపోయాయి. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఆయా ప్రాంతాల వాసులు రోడ్డు దాటని పరిస్థితి ఏర్పడింది. తవణంపల్లిలో మండలంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పండ్ల తోటలు, సాగు భూములు చెరువులను తలపిస్తున్నాయి. నగరిలోని కుశస్థలి నది ప్రవాహం పుంజుకుంది. జిల్లా ప్రత్యేక అధికారి గిరీషా నదిని పరిశీలించారు. నిండ్ర మండలంలో వర్షం కారణంగా బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పింది. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నది పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం కారణంగా వరి పంట నేలమట్టం అయింది. టమాట పంట నాశనమవుతోంది. బంగాళదుంప భూమి లోపలే కుళ్లిపోతోంది. కూరగాయల పంటలు రైతు చేతికి నష్టాన్ని మిగుల్చుతోంది. భారీ వర్షం పడితే ఈ పంటలు పూర్తిగా నీటమునిగే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జీడీ నెల్లూరు మండలంలోని బంగారెడ్డిపల్లి వద్ద చెరువు నుంచి నీరు రోడ్డుపై జోరుగా ప్రవహిస్తోంది. అలాగే బలిజపల్లి, వెంకటాపురం గ్రామం వద్ద కూడా చెరువులు మొరవపారుతున్నాయి. దీని కారణంగా ఆ చుట్ట్టు పక్కల గ్రామస్తులు రానూపోను అవస్థలు పడుతున్నారు. అక్కన్నగారిపల్లెలో రెండు పూరి గుడిసెలు కూలిపోయాయి. పాలసముద్రం మండలం వీర్లగుడిలో పూరిగుడిసె పడిపోయింది. వెంగమాంబపురం, తిరుమలరాజుపురం, వనదుర్గాపురంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎస్ఆర్పురం మండలం డీకే మర్రిపల్లి గ్రామంలోని ఓ గుడిసెలోకి వరదనీళ్లు చేరాయి. కార్వేటినగరం మండల కేంద్రంలో సుద్దగుంట, పెద్దహరిజనవాడ, చిన్న హరిజనవాడ పక్కాగృహాలు ఉరుస్తున్నాయి. ముసురు వానలకు జిల్లా వ్యాప్తంగా జన జీవనం స్తంభించింది. -
సామాజిక బాధ్యతలో పోలీసులు ముందుండాలి
చిత్తూరు అర్బన్ : ప్రతి నాలుగు నెలల కోసారి రక్తదానం చేసి, సామాజిక బాధ్య తను చాటడంలో పోలీసులు ముందుండాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం చిత్తూరు నగరంలోని పీజీఆర్ లైన్లోని పోలీసు ఆసుపత్రిలో.. పోలీసు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసు ఉద్యోగం కష్టంతో కూడుకున్నదని.. విధులతో పాటు పోలీ సులు వ్యక్తిగత ఆరోగ్యంపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నెల లో ఓసారి పోలీసు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, నిత్యం విధుల్లో తలమునకలై ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు తప్పనిసరన్నారు. సరైన ఆరోగ్యం, వ్యాయామం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం పోలీసుల రక్తదాన శిబిరాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, ఏఆర్ ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, శివానంద కిషోర్, డీఎస్పీలు సాయినాథ్, మహబూబ్బాషా, కృష్ణ, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భయం'కరి'
గజరాజు ఘీంకరిస్తున్నాడు.. శేషాచలం నుంచి బయటకు వచ్చి కర్షకుడిపై కన్నెర్ర చేస్తున్నాడు.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను సాంతం ఆరగిస్తున్నాడు.. ఆనక ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నాడు..కంచె, చెట్టు, తోట, పంట, ఇలా వేటినీ వదలడం లేదు.. చివరకు అడ్డొచ్చిన అన్నదాతనూ మట్టుబెడుతున్నాడు..వరుసదాడులతో హాలికుని కంట కన్నీరు పెట్టిస్తున్నాడు. ఫలితంగా అటు నష్టం.. ఇటు కష్టంతో పుడమిపుత్రుడి పరిస్థితి దయనీయంగా మారింది. గజరాజుల నుంచి కాపాడండిమహాప్రభో అని మట్టి మనుషులు వేడుకుంటున్నా.. అటవీ అధికారులు మాత్రం పర్యటనలు, పరిశీలనకేపరిమితమవుతుంటేచేష్టలుడిగి చూడడమే రైతన్న వంతైంది.చంద్రగిరి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ సమీప గ్రామాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కష్టపడి పండించిన పంటలు చేతికి అందేలోపు గజదాడుల్లో ధ్వంసం అవుతున్నాయి. ఏడాది పొడవునా ఏనుగుల దాడులతో రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గజరాజులు ఏకంగా గ్రామాల్లోకి చొరబడడంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నెల రోజులుగా మదపుటేనుగులు గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నా అటవీ అధికారు లు చోద్యం చూస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిసర గ్రామాల్లో ఏనుగుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి వేళల్లో ఏనుగులు గ్రామ సమీపంలోని పంటలపై దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. మండలంలోని చిన్నరామాపురం, భీమవరం, కొండ్రెడ్డికండ్రిగ, బూడిదగట్టువారిపల్లి, యల్లంపల్లి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అటవీ అధికారులు అటువచ్చి, ఇటు వెళుతున్నారే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలో ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మరణించారు. ఈ క్రమంలో మరో ప్రాణం బలికాక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామాల్లో స్వైరవిహారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 8 ఏనుగుల మంద చిన్నరామాపురంలోకి రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం పశువుల వద్దకు వెళ్లిన, పాడి రైతులు పరుగున ఇళ్లలోకి వచ్చి, తలుపులు వేసుకున్నారు. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగుల గుంపు చిన్నరామాపురంలోకి చేరుకుని పెద్ద ఎత్తున ఘీంకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం గ్రామం వెనుక ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేశాయని వాపోయారు. సోమవారం మరోసారి వరి, మామిడి పంటల ధ్వంసం బూడిదగట్టువారిపల్లిలోని పొలాల్లో పంటలను ఏనుగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు, గ్రామస్తులు సంయుక్తంగా ఏనుగులను తరిమేందుకు యత్నించారు. డప్పులు వాయిస్తూ, బాణసంచా పేల్చుతూ వాటిని బెదరగొట్టారు. ఈ లోపే ఓ కౌలు రైతుకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి యల్లంపల్లిలోని మరో ఇద్దరి రైతుల పొలాల్లోకి వెళ్లాయి. మామిడితోట ప్రహరీ గేట్లు, టేకు చెట్లతోపాటు ఫెన్సింగ్ను పూర్తిగా ధ్వంసం చేశాయి. గతంలో ఎప్పుడూ లేదు 10 ఏళ్ల కాలంలో ఎప్పు డూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంటలపై దాడులకు చేస్తూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడులను నివా రించేందుకు శాశ్వత పరిష్కారం చూపితే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. – రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం నా నోట్లో మట్టి కొట్టాయి నేను కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా ను. 20 రోజుల్లో చేతికి వ చ్చే వరి పంటను ఆదివా రం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సు మారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నాశనం అయ్యింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులే మో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నా రు. ఇలా ఎవరైనా చేస్తారా..? – చిన్నబ్బ, కౌలు రైతు, బూడిదగట్టువారిపల్లి 100 మీటర్లు వెళ్లి ఉంటే ప్రాణాలు పోయేవి వేరుశనగ పంటను రక్షించుకునేందుకు ఆదివారం రా త్రి నేను బైక్లో పొలం దగ్గరకు వెళ్లాను. మార్గం మధ్య లో పెద్ద ఎత్తున ఏనుగులు ఘీంకారాలు చేస్తూ, రోడ్డును దాటుతున్నాయి. వెంటనే అప్రమత్తమై బైక్ లైట్లు ఆఫ్ చేసి వెనుదిరిగి వచ్చేసి, ప్రాణాలను కాపాడుకున్నాను. అనంతరం ఏనుగుల దాడులపై గ్రామస్తులకు సమాచారం చే రవేశాను. అజాగ్రత్తగా ఉంటే నా ప్రాణాలు పోయేవి. – కృష్ణమోహన్, రైతు, కొండ్రెడ్డికండ్రిగమామిడి తోటలో వీరంగం చేశాయి నాకు, మా అక్కకు చెంది న మామిడి తోటల్లో ఏనుగులు వీరంగం చేశాయి. ఏనుగుల మంద దారి మళ్లి మా పొలాలపై పడ్డా యి. తోటకు రక్షణగా ఏర్పాటు చేసిన గేటును పూర్తిగా ధ్వంసం చేసి, విసిరి పడేశాయి. అక్కడ నుంచి మరో తోటలోకి వెళ్లి ఫెన్సింగ్ను తొక్కుకుంటూ అటవీలోకి వెళ్లిపోయాయి. ఈ ఏనుగుల మంద కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు వేరే బతుకు మార్గం తెలియదు. మాపై ప్రభుత్వం కరుణ చూపి ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. లేకుండా అప్పుల పాలై కుటుంబం రోడ్డున పడడం తప్పదు. – నాగేశ్వరమ్మ, మహిళా రైతు, యల్లంపల్లి ప్రాణభయంతో పరుగులు తీశాం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమ యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. ఈ క్రమంలో మా పెంపుడు కుక్క పెద్ద ఎత్తున అరిచింది. వెనక్కి తిరిగి చూస్తే సుమారు 8 ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చేసింది. వెంటనే నేను, నా కోడలు ఇంట్లోకి పరుగులు తీసి, తలుపు గడియ పెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ఏనుగులు మమల్ని చూసి ఉంటే దాడికి పాల్పడేవి. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చిన సందర్భాలు లేవు. అధికారులు ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. – చేకూరి సిద్ధమ్మ, చిన్నరామాపురం -
నేరం చేసినందుకు పశ్చాతాపం పడుతున్నారా..?
చిత్తూరు అర్బన్: పబ్లిక్ కోర్టు నిండా ఇసుకేస్తే రాలనంత జనం. న్యాయమూర్తి తీర్పు ఏం చెబుతారని సర్వ త్రా ఉత్కంఠ. ఆపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో శిక్ష ఖరారు వాయిదా పడింది. దోషులను ఈ నెల 30న న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల ని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 2015 నవంబర్ 17న జరిగిన కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్య కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజు నాథ, వెంకటేష్పై నేరం రజువైనట్లు, తీర్పును 27న వెల్లడిస్తామని గత శుక్రవారం చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఐదుగురు దోషులను చిత్తూరులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఐయామ్ నాట్ కమిటెడ్ శిక్ష ఖరారు చేసే ముందు దోషులను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని న్యాయమూర్తి డా. ఎన్.శ్రీనివాసరావు అన్నారు. ఆపై వరుసగా కొన్ని ప్రశ్నలు అడి గారు. నేరం ఎందుకు చేశారు..? బాధితులకు క్షమాపణ చెప్పదలచారా..? మీ కుటుంబ పరిస్థితి ఏంటి..? శిక్ష విధిస్తే మీ కుటుంబంలో ఎవరిపై ప్రభావం చూపిస్తుంది..? నేరం చేసినందుకు పశ్చాతాపం పడుతున్నారా..? అనే పలు ప్రశ్నలు అడిగారు. వీటికి చింటూ చాలా వరకు ఇంగ్లిషులోనే సమాధానాలిచ్చారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని (ఐయామ్ నాట్ కమిటెడ్), మెరై న్ డిప్లొమో చేసిన తాను బాంబేలోని ఇండియన్ నా వెల్ షిప్ (ఐఎన్ఏ)లో పనిచేశానని, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా నేరం తనపై మోపారని చింటూ పేర్కొన్నాడు. సీకే బాబుపై జరిగిన హత్యాయత్నాల్లో కూడా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ అని, అతని మేనల్లుడు అయినందుకు తనపై కేసు పెట్టారని, చిత్తూరు కోర్టులో గతంలో జరిగిన బాంబు పేలుడు కేసులో మీడియా తనను దోషిగా చూపించే ప్రయత్నం చేసిందని, తీరా ఇది ఉగ్రవాదు లు చేసినట్లు ఎన్ఐఏ తేలి్చందన్నారు. తనకు మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి ఉందని, జైల్లో ఉన్న న్ని రోజులు స్రత్పవర్తనతో నడుచుకున్నట్లు చింటూ చెప్పాడు. కఠారి దంపతుల హత్య జరిగిన విష యం తనకు తెలిసినవెంటనే చట్టంపై ఉన్న గౌరవంతో కోర్టు లో వచ్చి లొంగిపోయానన్నాడు. మారడానికి అవకాశం ఇస్తే తన ఉద్యోగం, వ్యాపారం చేసుకుని బతుకుతానని చింటూ చెప్పాడు. చింటూతో పాటు మిగిలిన నలు గురి వాంగ్మూలాన్ని సైతం న్యాయమూర్తి పేపర్పై రాసుకుని, దోషుల సంతకాలు తీసుకున్నా రు. శిక్ష ఖరారుకు ముందు తమ వాదన వినిపించడానికి అనుమతివ్వాలని డిఫెన్స్ న్యాయవాదులు కోరారు. నివేదిక కోసం ఆదేశం కాగా దోషులు ఐదుగురు మానసిక ప్రవర్తనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ ఆధ్వర్యంలో మానసిక వైద్యనిపుణులు పరిశీలించాలన్నారు. అలాగే వీళ్ల సామాజిక పరిస్థితి, జైల్లో ఉన్నన్ని రోజులు సత్ప్రవర్తనపై జిల్లా ప్రొబేషన్ అధికారి, జిల్లా జైళ్ల అధికారి నివేదిక ఇవ్వాలన్నారు. తరుపది ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని.. అప్పటి వరకు వీళ్లను జ్యుడీíÙయల్ కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం దోషులను భారీ బందోబస్తు నడుమ పోలీసులు చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. -
వామ్మోంథా!
సమన్వయంతో పనిచేయాలి ఆయుధాల పనితీరును వివరిస్తున్న పోలీసులు ఏరొస్తే చెప్పనలివిగాని బాధలు కౌండిన్య నది ప్రవహిస్తే మా ఊరోళ్లకు కష్టాలే. గ్రామం నుంచి పిలకాయిలు కోటూరు హైస్కూల్కు వెళ్లాలంటే నీళ్లలో పోనుకాదు. దొమ్మిరపాపమ్మ గుడికాడ నుంచి కాలువపల్లికి పోయి మళ్లా మండిపేటకోటూరుకు పోవాల. ఏటికవతల ఉండే రైతులు ఆవులకు మేత పెట్టాలంటే సైకిల్పై చుట్టుకొని పోతా ఉండారు. ఊసరపెంటనుంచి కోటూరుకు తారు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణం చేస్తే సౌకర్యంగా ఉంటుంది. – స్వతంత్రనాయుడు, ఊసరపెంట, పలమనేరు మండలం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా కౌండిన్య నది ప్రవహించే మండలాల్లో కంటే పలమనేరు మండలంలోనే నాలుగైదు చోట్ల వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ఇప్పటిదాకా తెలీదు. ఈ గ్రామాలకు మా వీఆర్వోల ద్వారా నేడే వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి కలెక్టర్కు నివేదిక సమర్పిస్తాం. ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా వీటి నిర్మాణం జరిగొచ్చు. – ఇన్బునాథన్, తహసీల్దార్, పలమనేరు కష్టంగా ఉంది సామీ మేముండేది బొమ్మిదొడ్డి లో మా పొలాలుండేది ఏటికవతల. అక్కడే పొలం పాడి ఆవులున్నా యి. పొద్దున.. సాయంత్రం నదిని ట్యూబులపై దాటి పశువులకు మేత పెట్టి పాలు పితికి పాలసెంటర్కు తీసుకొస్తున్నా. ఇక్కడి జగనన్న కాలనీలో 2వేల ఇండ్లున్నాయి. వారు కురపల్లి మీదుగా వస్తున్నారు. టౌన్లో నుంచి ఇక్కడ బ్రిడ్జి కడితే దూరం తగ్గుతుంది. సౌకర్యంగా ఉంటుంది. – సుజాత, పాడిరైతు, బొమ్మిదొడ్డి, పలమనేరు మున్సిపాలిటీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మోంథా ఫీవర్ పట్టుకుంది. సోమవారం ఉదయం నుంచి ము సురు పట్టేసింది. మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు మొదలయ్యాయి. తరుముకొస్తున్న తుపాన్తో జిల్లాకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్టు మూడు రోజుల కిత్రమే వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తాజాగా వరద ముప్పు ఉంటుందని ప్రకటించింది. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులను అప్రమత్తం చేసింది. కంట్రోల్ రూమ్లు సైతం ఏర్పాటు చేశారు. కనిపించరే! మోంథా ప్రభావంతో జిల్లా ప్రత్యేక అధికారి గిరీషాతో పాటు కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. కానీ మండల, క్షేత్రస్థాయి అధికారు లు, సిబ్బంది మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటున్నా రు. విధులకు డుమ్మాకొడుతున్నారు. సచివాలయాలు ఒకరిద్దరితో దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. వీటిపై దృష్టిపెట్టాలి మరి! కాణిపాకం బ్రిడ్జి వద్ద, పుణ్యసముద్రం, తవణంపల్లి మండలం గాజులపల్లి, అరగొండ, మత్యం బోయపల్లిలోని కల్వర్టులు కూలే స్థాయికి చేరాయి. అలాగే పలమనేరులోని కౌండిన్య నది వంతెన, వైఎస్సార్సర్కిల్, చిన్నపేట, కుర్రపల్లి, కూర్మాయి, సముద్రపల్లి మార్గంలో వంతెనలు ప్రమాదకరంగా మారాయి. చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట వంక వద్ద ప్రమాకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. విజయపురం, నిండ్ర మండలాల్లో వరి పొలాలు వర్షపు నీటితో చెరువును తలపిస్తున్నాయి. మరింత వర్షం కురిస్తే వరి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. యాదమరి మండలంలోని చెరువులు మొరవెత్తాయి. దీంతో చిత్తూరు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. నీవానది పరివాహక ప్రాంతాలకు వరదొచ్చే అవకాశాలున్నాయి. అర్బన్ అధికారులు చిత్తూరుపై కాకుండా యాదమరి మండలంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరస్థితిలపై ఆరా తీస్తున్నారు. రోజంతా ముసురే... మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ముసురు ప ట్టుకుంది. రోజంతా చిరుజల్లులు కొనసాగాయి. మంగళవారం జిల్లాకు భారీ వర్ష సూచనలున్నాయని అధి కారులు ప్రకటించారు. దీంతో వరదలొచ్చే అవకాశా లు మెండుగా ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల వాసు లుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. జిల్లాకు రెడ్ అలర్ట్ చిత్తూరు కలెక్టరేట్ : మోంథా తుపాన్ ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించారు. స్పెషల్ ఆఫీసర్ గిరీషా సోమవారం జిల్లాకు విచ్చేశారు. అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందస్తు చర్యలు రాబోయే 24 గంటల్లో మోంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్డీవో, మున్సిపల్, తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూం కేంద్రాలు తుపాన్ వల్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మోంథా తుపాన్ పట్ల చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, ఎస్పీ తుషార్ డూడీలు స్పెషల్ ఆఫీసర్కు వివరించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ తుపాన్ను ఎదుర్కోవడంలో ఎటువంటి అలసత్వం చూపించకూడదన్నారు. ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రికి తరలించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు విధులు నిర్వహించే స్థానాల్లోనే ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవనాలను అవసరమైతే పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లా మొత్తం 4,122 చెరువులు ఉండగా వాటిలో 1,305 చెరువులు నిండినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జలాశయంలో ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డీవోలు శ్రీనివాసులు, అనుపమ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలి
పాలసముద్రం : రాష్ట్రం ఏరులై పారుతున్న మద్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలు రోడ్డు ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులైపారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. జాతీయ రహదారి సమీపంలో బెల్ట్షాపులో మద్యం అమ్మడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటీఎం వలే ఎనీటైం మద్యం అమ్మకాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తోందని దుయ్యబట్టారు. ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న జట్లను అభినందించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. సాఫ్ట్బాల్ సంఘం జిల్లా ట్రెజరర్ దేవా మాట్లాడుతూ జిల్లా జట్లుకు లోకేష్, మునిరాజులు, విఘ్నేష్, కార్తికేయన్, భాస్కర్, రోహిత్, విజయ్, శివ, రవితేజ, చంద్రశేఖర్, విజయ్, తరుణ్, సాయి భార్గవ్, పునీత్సాయి, తరుణ్, భాను ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న జట్లు నవంబర్ 8, 9 తేదీల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీడీలు లోకేష్, శరత్ పాల్గొన్నారు. -
కుప్పం సాక్షిగా.. హైవే పక్కనే కిక్కు
కుప్పం: నిబంధనలకు విరుద్ధంగా కుప్పంలో మద్యం షాపులు ఏర్పాటు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి వెళ్లే జాతీయ రహాదారి పక్కనే బార్ అండ్ రెస్టోరెంట్కు అనుమతినిచ్చారు. బైపాస్ రోడ్డు అనుకుని అధికార పార్టీ కార్యాలయానికి సమీపంలోనే బార్ అండ్ రెస్టోరెంట్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ బార్ వల్ల మద్యం ప్రియులు మితిమీరిన కిక్కుతో వాహనాలు నడుపుతున్నారు. బైపాస్ రోడ్డుపై అతివేగంగా వచ్చే వాహనాలను ఢీకొట్టి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మరోవైపు బైపాస్ రోడ్డు పక్కనే తంబిగానిపల్లి సబ్ స్టేషన్ పక్కనే వైన్ షాపు ఉంది. ఓ వైపు తమిళనాడు వెళ్లే బైపాస్.. మరోవైపు రోడ్డు అటు వైపు కల్యాణ మండలం జనసంచారం అధికంగా ఉండే ప్రాతంలో బ్రాందీ షాపులను ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆంధ్ర నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు, ఈ రోడ్డు ప్రాంతాలకు కంటైనర్లు, పెద్దపెద్ద లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి మార్గం పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. బైపాస్ రోడ్డుకు అనుకుని ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్ట్టారెంట్ తంబిగానిపల్లి వద్ద రోడ్డు ఆనుకుని ఏర్పాటు చేసి మద్యం షాపు -
19 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నారాయణవనం వద్ద 19 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ సాయి గిరిధర్, ఏఆర్ఎస్ఐ ఎన్.ఈశ్వర్రెడ్డి బృందం ఆదివారం కై లాసకోన నుంచి కూంబింగ్ చేపట్టింది. నారాయణవనం సమీపంలోని సింగారకోన రోడ్డు కన్నికలమ్మ ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల పరిశీలించగా 19 ఎరచ్రందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తులను స్థానికులుగా గుర్తించి తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, ఎసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్ఐ రఫీ సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మొరవ కాలువ పటిష్టతకు చర్యలు
గంగాధర నెల్లూరు : మొరవ కాలువను పటిష్ట పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జీడీ నెల్లూరు మండలంలో సుమారు 26 చెరువులు పూర్తిగా నిండాయి. మోంథా తుపాను ప్రభావ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక అధికారి గిరీషా, కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషార్ డూడీ తదితరులు ఆత్మకూరు చెరువు మొరవను పరిశీలించారు. మొరవను పటిష్టపరచ డానికి ఎన్ని నిధులు అవసరమవుతాయని ఆరాతీశారు. సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవసరమవుతాయని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ చెరువు ద్వారా సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, ఎల్లాపల్లి చెరువు, వంక, నీవా కాలువ ఈ చెరువు సమీపన ఉన్నాయని సంబంధిత అధికారులు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు ఆనందరెడ్డి, సుగుణాకర్ రావు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్గౌడ్ పాల్గొన్నారు. -
వరి కుప్పలు మొలకెత్తకుండా ఉప్పు నీళ్లు చల్లండి
గుడిపాల: జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటల పరిస్థితిని సోమవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన తిరుపతి శాస్త్రవేత్తలు, జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ రామకృష్ణారావు, డాక్టర్లు సరళ, వజంతా, నాగమణి, హారతి పరిశీలించారు. మండలంలోని చీలాపల్లె, నారగల్లు, బొమ్మసముద్రం, పేయనపల్లె, ఏఎల్పురం గ్రామాల్లో వారు సందర్శించారు. గుడిపాల మండలంలో ఐదు పంచాయతీలకు సంబంధించి 55 ఎకరాలలో వరి పైరు ఇటీవల కురిసిన వర్షాలకు పడిపోయినట్లు గుర్తించామన్నారు. పంటను కోసి పూర్తిగా ఆరని పంటకు 25 కిలోల ఉప్పును చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చాన్నారు. కోతకోసిన పొలంలో ఉన్న పంట మొలకెత్తకుండా ఉండడానికి 5శాతం ఉప్పు ద్రావణాన్ని పంటపై పడే విధంగా పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయాధికారిన సంగీత పాల్గొన్నారు. తవణంపల్లెలో.. ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో–ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణరావు నేతృత్వంలో తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తవణంపల్లె వ్యవసాయాధికారి జి.ప్రవీన్ ఆధ్వర్యంలో మండలంలోని ఎగువమత్యం, నలిశెట్టిపల్లె, పుణ్యసముద్రం, ఉత్తరబ్రాహ్మణపల్లె గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సూచనలు, సలహాలిచ్చారు. నూర్పిడి చేసిన వరి గింజలు రంగు మారకుండా ఉండడానికి లీటరు నీటిలో ఒక గ్రాము కార్బెండెజం లేదా ఒక మిల్లీ లీటరు ప్రొఫికొనజెల్ మందును పిచికారీ చేయాలన్నారు. -
కారుపై కూలిన చెట్టు
వి.కోట : రోడ్డుపై వెళ్తున్న కారుపై చెట్టు కూలి ముగ్గురుకి స్వల్ప గాయాలైన ఘటన మండలంలో ని కస్తూరి నగరం రోడ్డు వద్ద సోమవారం చోటుచెసుకుంది. స్థానికుల కథనం.. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి నుంచి విరుపాక్షిపురానికి ముగ్గురు వ్యక్తులు వైద్యం నిమిత్తం వి.కోట –పలమనేరు జాతీయ రహదారిపై బోలెరో వాహనంలో ప్రయణిస్తున్నారు. మండలంలోని కస్తూరినగరం వద్ద జాతీయ రహదారిలోని భారి నీలగిరిచెట్టు ప్రమాదవశాత్తు ఆ కారుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాల తో బయటపడగ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనతో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో చెట్టును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రోడ్డు పనులకు రూ.30 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : కుప్పం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కుప్పం పట్టణ కేంద్రం వరకు ఉన్న రోడ్డు పనులకు రూ.30 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. కుప్పం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కుప్పం పట్టణ కేంద్రం వరకు రెండు కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులకు పరిపాలన అనుమతులు జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. -
గ్రానైట్ లారీ సీజ్
బంగారుపాళెం: అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని సోమవారం అధికారులు సీజ్ చేశారు. మండలంలోని జంబువారిపల్లె వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రానైట్ క్వారీ కొనసాగిస్తున్నాడు. గతంలో ఈ క్వారీకి సంబంధించి సాయిరెడ్డి అనే వ్యక్తి అనుమతులను పొంది ఉన్నాడు. అయితే సదరు క్వారీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీపై సాయిరెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు గ్రానైట్ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మామిడి రైతుల నిరీక్షణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం మామిడి రైతులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం అందించిన రూ.4 ప్రోత్సాహక నిధి కొన్ని వేలమందికి జమ కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో బిల్లుల్లో జాప్యం, చెల్లింపులో గందరగోళం నెలకొంది. మామిడి రైతులు బిల్లులు చేతబట్టుకుని జిల్లా కార్యాలయానికి క్యూకడుతున్నారు. నగదు రాలేదని నివేదించుకుంటున్నారు. సోమవారం కూడా జిల్లా కార్యాలయం ఎదుట నిరీక్షించారు. అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన జిల్లాలోని అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి అందజేయనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులు శాప్ క్రీడా యాప్లో సహాయక పత్రాలతో నవంబర్ 4లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
● పొంగుతున్న పాతాళ గంగ
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట గ్రామ సమీపంలోని బోర్లలో పాతాళ గంగ పొంగుతోంది. మండలంలో వెయ్యి అడుల లోతు బోర్లు వేసినా నీటి చుక్క పడని సంఘటనలున్నాయి. ఇలాంటి సమయంలో సింగిరిగుంటకు చెందిన జయచంద్రనాయుడు, పరంధామనాయుడు విజయ్కుమార్కు చెందిన బోర్లలో పాతాళళ గంగ ఉప్పొంగుతోంది. ఆ బోర్ల వద్ద ప్రజలు పూజలు చేస్తున్నారు. వీటిని ప్రజలు సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అవుతున్నాయి. – చౌడేపల్లె సింగిరిగుంట వద్ద జయచంద్రనాయుడి బోరు నుంచి పాతాళ గంగ పైకి సింగిరుగుంట వద్ద పరంధామనాయుడికి చెందిన బోరు నుంచి పైకి వస్తున్న నీళ్లు -
పూల తోట ధ్వంసం
కుప్పం: మండలంలోని ములకలపల్లిలో రీ సర్వేలో అధికారులు చేసిన తప్పులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఇతరులు తన భూమిలోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నారని బాధితుడు మునిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునిరత్నం 40 ఏళ్ల క్రితం ములకలపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలోని సర్వే నంబర్ 9/3బీ1లో 0.50 సెంట్ల భూమిని కోనుగోలు చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో సైతం మునిరత్నం పేరు ఉంది. అధికారులు రీ సర్వే చేసిన సందర్భంలో మునిరత్నంతో పాటు చిన్నక్కకు జాయింట్ ఎల్పీ నంబరు ఇచ్చారు. దీంతో వివాదం నెలకొంది. ఆ భూమిపై హక్కులేని చిన్నక్క కుటుంబ సభ్యులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. 6 నెలలుగా సాగుచేసిన కనకాంబరం పంటను నాశనం చేసి తీవ్రంగా నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై విచారణ చేయడంతోపాటు భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. -
మైనింగ్ మాఫియాపై విజిలెన్స్.?
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో మైనింగ్ మాఫియాపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో వరుస కథనాలు వెలువడ్డాయి. అక్రమ క్వారీలతో పాటు లీజుకు ఉన్న క్వారీల నుంచి అక్రమ తరలింపుపై కథనాలొచ్చాయి. దీనిపై స్పందించిన విజిలెన్స్ అధికారులు మూడు రోజులకు క్రితం లోతుగా విచారణ చేపట్టారని తెలిసింది. అక్రమ క్వారీలను తనిఖీ చేయడంతో పాటు జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలోని ఓ అధికారిని పూర్తి స్థాయిలో విచారించినట్టు సమాచారం. శాఖ డీడీ చాంబర్కు పిలిచి ఆ అధికారిని గంటపాటు అక్రమ మైనింగ్పై ఆరాతీసినట్టు విశ్వసనీయమైన సమాచారం. అక్రమ కార్వీల నిర్వహణ ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటిపై ఏరకమైన చర్యలు తీసుకున్నారు?.. దొంగబిల్లులు, అక్రమ తరలింపులు, అనుమతి పేరుతో అక్రమ క్వారీల నుంచి ఖనిజం తరలింపులు ఎలా జరిగాయి.? ఇదంతా ఎవరి సహకారంతో నడుస్తుంది?.. శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారా..? రాయల్టీ వసూళ్లు ఏరకంగా జరుగుతున్నాయి..? ఎంత వసూలు చేస్తున్నారు?.. ఒకే బిల్లుతో గోల్మాల్ ఏమైనా జరిగాయా..? తదితర కోణాల్లో విచారించినట్టు తెలిసింది. ఈ మైనింగ్ మాయజాలంపై రాష్ట్ర అధికారుల కన్ను పడిందని, త్వరలో కొంత మందిపై వేటు పడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2015.. నవంబరు 17వ తేదీ.. స్థలం – చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు ఏం జరిగింది – మేయర్ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు. చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైంది వీరిపై .. చింటూ, చంద్రశేఖర్ అలియాస్ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకా‹Ùరెడ్డి (32), మంజునాథ్ (36), వెంకటేష్ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది. నిరూపించబడ్డ సెక్షన్లు 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు అనురాధను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి మోహన్ను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి వేలూరు సతీష్ కుమార్ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ వేలూరు సతీష్కుమార్ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్ 307 రెడ్విత్ సెక్షన్ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, వెంకటేష్. సతీష్కుమార్ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ . పోలీసుల భారీ భద్రత దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కలి్పంచారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
కుప్పంరూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు వివరాలిలా. సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి న మహిళ ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందింది. తెల్ల చీర కట్టుకుని ఉన్న మహిళ తప్పిపోయి ఉంటే కుప్పం రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలిస్తే రైల్వే పోలీసులు 9000716436, 8074088806 నంబర్లను సంప్రదించాలని కోరారు. అంత్యక్రియలకు వెళ్లి.. అనంత లోకాలకు ఐరాల: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి ద్విచక్రవాహనంలో వస్తూ డివైడర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కాణిపాకం ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. తవణంపల్లె మండలం ఎగువ తవణంపల్లెకు చెందిన పి.నాగరాజ(45) ఉదయం పూతలపట్టు మండలం బూచేపల్లెలో బంధువు అంత్యక్రియలకు ద్విక్రవాహనంలో వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చిగరపల్లె హైవే బ్రిడ్జి వద్ద అతివేగంతో డివైడర్ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య విజయనిర్మల, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
గోపాలపట్నం: స్థానిక ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికల జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విభాగాల వారీగా విజేతలు వీరే.. అండర్–14 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానాన్ని, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–17 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానాన్ని, అనంతపురం, కృష్ణా జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–19 విభాగం: బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానాన్ని, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అధికారులు, కోచ్లు, ఉపాధ్యాయులు అభినందించారు. వారికి జ్ఞాపికలు, శాలువాలు అందజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
తిరుపతి రూరల్ : మోంథా తుపాను నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఈ క్రమంలోనే సెలవులను రద్దు చేశామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. ఆదివారం సదరన్ డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల ఇంజినీరింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్తు సబ్ స్టేషన్లలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు సీజీఎం స్థాయి అధికారులు ఒక్కో జిల్లాను మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని ఆదేశించారు. ‘పాపవినాశనం’లో గంగ పూజ తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పాపవినాశనం డ్యామ్ వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు హారతి సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమన్నారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. -
పోలీసు ఆయుధాలు.. పరికరాల ప్రదర్శన
చిత్తూరు అర్బన్ : పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు.. పరికరాలను సందర్శకుల కోసం ఉంచా రు. ఎస్పీ తుషార్ డూడీ ఓపెన్ హౌస్ను ప్రారంభించా రు. ఇందులో పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్ కెమెరాలు, కెమెరాలతో భద్రత పర్యవేక్షించే వాహనాలు, పోలీసు జాగిలాలను విద్యార్థులు, ప్రజలకు చూపించారు. ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారు..? వాటి రేంజ్ ఏంటి..? ఒక్కసారి కాలిస్తే ఎన్ని బుల్లెట్లు వెళతాయి..? తదితర వివరాలను విద్యార్థులకు ఎస్పీ స్వయంగా వివరించారు. -
మోంథా ముప్పు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అల్పపీడన ప్రభావంతో ఇది వరకే వర్షాలు దడ పుట్టించాయి. అన్నదాతలను నిలువునా ముంచాయి. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. గురువారానికి తెర వీడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీరా మళ్లీ మరో తుపాను ముంచుకొస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం మోంథా తుపానుగా రూపం దాల్చుకుంది. దీనివల్ల జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మోంథా తుపాను జిల్లాలో అన్నదాతలను ఆందోళనలోకి నెట్టేసింది. ఇది వరకు 178 హెక్టార్లకు వరి నష్టం కాగా..టమాట, కూరగాయల పంటలు, పండ్ల తోటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ఈ తుపానుతో మళ్లీ పంటలకు నష్టం వాటిళ్లనుంది. దీనికి తోడు చెరువు కట్టలు పలుచోట్ల మరమ్మతులకు గురై తెగే ప్రమాదం ఉంది. వర్ష ప్రభావంతో జీడీ నెల్లూరు, ఎస్ఆర్పురం, సోమల తదితర మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పలమనేరులో భారీ వర్షం జిల్లాలో శనివారం రాత్రి పలుచోట్ల వర్షం దంచికొట్టింది. పలమనేరులో అత్యధికంగా 69.0 మి.మీ వర్షం పడింది. సదుంలో 44.8, పెనుమూరులో 55.0, పూతలపట్టులో 50.0, సోమలలో 35.4, చౌడేపల్లిలో 41.4, గంగరంలో 37.6, తవణంపల్లిలో 27.4, గంగాధర నెల్లూరులో 39.2, చిత్తూరు అర్బన్లో 40.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. -
ఖనిజం..లూటీ
ఆ అధికారి అండదండలు సాక్షి టాస్క్ఫోర్స్ : పూతలపట్టు నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలకు పెట్టింది పేరు. ఇక్కడ లభిస్తున్న బ్లాక్ గ్రానైట్ ఖనిజం అత్యంత విలువైంది.దీంతో ఆర్థిక, సామాజిక, అర్థ బలం ఉన్న రాజకీయ నేతలతో పాటూ.. వ్యాపారవేత్తలు సైతం తీవ్రంగా పోటీ పడుతుంటారు. దీనికోసం పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటారు. అనుమతి రాని వారు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి వాటిని చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ తరహాలోనే కొందరు కూటమి నేతలు అక్రమ క్వారీ పనులు చేస్తున్నారని పలు ఆరోపణలు చెలరేగుతున్నాయి. రూ.కోట్లలో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ.. పూతలపట్టు నియోజకవర్గంలోని 3 మండలాల్లో క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు అనుమతుల పేరిట...ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో భాగంగానే యాదమరి మండలంలో దాదాపు 12 గ్రానైట్ నిక్షేపాలు ఉండగా వాటిలో 10 క్వారీల్లో పనులు సాగుతున్నాయి. వీటి నుంచి రోజుకు 30 లారీల్లో గ్రానైట్ బండలను పాలిషింగ్ కర్మాగారాలకు రవాణా చేస్తున్నారు. గ్రానైట్ తరలింపునకు సంబంధిత శాఖల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి ఇచ్చిన మేరకు కాకుండా అక్రమంగా రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ఒక్కో లారీలో పెద్దవి అయితే రెండు, చిన్నవి అయితే 4 వరకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్క యాదమరి మండలం నుంచే రూ.20–30 లక్షల విలువ చేసే ఖనిజ సంపద తరలిపోతోంది. కాగా ఇక్కడ జరుగుతున్న క్వారీలు దాదాపుగా కూటమి నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దాసరపల్లి వద్ద జరుగుతున్న అక్రమ క్వారీలో ఐదు నెలలుగా సుమారు రూ.25 కోట్లు విలువ చేసే ఖనిజం సరిహద్దులు దాటిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ అధికారి సహకారం ఉండడంతో ఈ తంతు జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇక పూతలపట్టులో అయితే 10 క్వారీలు గాను 3 చోట్ల అక్రమంగా తవ్వుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ టీడీపీ నేత ఈ దందాలో చేతులు తిరిగినట్లు ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక లీజుకు ఉన్న క్వారీ దారులు సైతం రాయల్టీలు కట్టకుండా ఖనిజానికి కన్నం వేస్తున్నారు. బంగారుపాళ్యంలో కూడా ఇదే తంతు నడుస్తోంది. విజిలెన్స్ అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు దాసరపల్లిలో జరుగుతున్న అక్రమ క్వారీ విషయం సాక్షి కథనంతో గుట్టు రట్టు కావడంతో విజిలెన్స్ అధికారులు ఆ క్వారీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆ అక్రమ క్వారీ నిర్వాహకుడు ఎవరు..? ఎన్ని నెలలుగా చేస్తున్నాడు..? ఇందుకు సహకరిస్తున్న ఆ అధికారి ఎవరు..? మాముళ్లు ఏమైనా ఇస్తున్నారా..? గొల్లపల్లి క్వారీ పేరుతో ఎలా అక్రమ క్వారీలోని దిమ్మెలకు తరలింపులు చేస్తారు..? దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది? గ్రామస్తులు ప్రశ్నిస్తే..బెంగుళూరులోని ఓ టీడీపీ నేత బెదిరింపులు ఏంటీ అనే విషయంపై పూర్తిగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక యాదమరి మండల ప్రాంతంలోని ఓ క్వారీ అనుమతితో అటవీశాఖ భూముల్లో తవ్వకాలు చేస్తున్నట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సహకరిస్తూ..ప్రోత్సహిస్తున్న ఆ అధికారిపై త్వరలో వేటు పడే అవకాశాలున్నాయని శాఖలోని పలువురు చెబుతున్నారు. అక్రమ గ్రానైట్ దందాను నిలువరించాల్సిన సంబంధిత శాఖాధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలకు తావిస్తోంది.మైనింగ్ శాఖలోని ఓ అధికారికి క్వారీ యాజమానుల నుంచి భారీ మొత్తంలో నెలవారీ ముడుపులు అందుతున్నాయని ఆ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్న రహస్యం. ఎవరా అధికారి ? అతడి అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరుతున్న జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ అక్రమాలను నియంత్రించాల్సిన నిఘా వ్యవస్థ ఏమైనట్టు? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో అక్రమ గ్రానైట్ తరలింపుతో రూ. కోట్లలో ప్రభుత్వానికి నష్టం చేకూరింది. అయితే ఈ అక్రమ క్వారీయింగ్కు అడ్డుకట్ట వేయడానికి కొందరు అధికారులు సాహసిస్తున్నా కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి ఆ అధికారులను నిలువరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
జాతీయ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉర్దూ టీచర్లు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ టీచర్ అవార్డులను ఈ నెల 26న డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథుల నుంచి స్వీకరించారు. వారు ఉర్దూ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధన అందించినందుకు గాను జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లాలోని పుంగనూరులోని ఉర్దూ జెడ్పీ హైస్కూల్లో గణిత టీచర్గా పనిచేస్తున్న రబ్బాని, పలమనేరు న్యూపేట్ హైస్కూల్లో జీవశాస్త్రం టీచర్గా పనిచేస్తున్న సుస్రత్ అలియా బేగమ్, చిత్తూరు నగరంలోని జైహింద్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ముక్తార్ అహ్మద్, చిత్తూరు నగరంలోని ఉర్దూ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మహబూబ్బాషా జాతీయ అవార్డులు స్వీకరించారు. -
టమాటకు రెక్కలు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో సాగు వివరాలు పలమనేరు : జిల్లాలో టమోట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్లో ఆదివారం 14 కిలోల బాక్సు ధర రూ.500 దాటింది. గత నెలగా బాక్సు రూ.200 కూడా దాటలేదు. అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. తోటల్లోనే మొక్కలు కుళ్లిపోవడం, కాయలు దెబ్బతినడంతో భారీగా సరుకు తగ్గింది. దీంతో డిమాండ్కు సరిపడా సప్లయ్ లేక ధర అమాంతం పెరిగేందుకు కారణమైందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఈనెలాఖరు దాకా టమోటా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి అంచనా వేస్తున్నారు. భారీగా తగ్గిన సరుకు గత కొన్నాళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాట తోటలు దెబ్బతిన్నాయి. నీటినిల్వ ఎక్కువగా ఉన్న తోటలు కుళ్లిపోయాయి. కాయలు సైతం కుళ్లి రాలిపోయాయి. దీంతోపాటు తెగుళ్ల కారణంగా కాయలపై మచ్చలు పడి నాణ్యత తగ్గింది. డివిజన్ పరిధిలో తోటలు సగానికిపైగా దెబ్బతినడంతో మార్కెట్కు సరుకు భారీగా తగ్గింది. టమాట ఈ సీజన్లో సాధారణ సాగు 5 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 1500 హెక్టార్లు కోతదశలో ఉన్న తోటలు 600 హెక్టార్లు ఈ సీజన్లో మండీలకు రావాల్సిన సరుకు 100 లారీ లోడ్లు ప్రస్తుతం మార్కెట్లకు చేరుతున్న సరుకు (పొరుగు జిల్లాల నుంచి కలిపి) 60 లోడ్లు -
భక్తులతో బోయకొండ కిటకిట
ప్రత్యేక అలంకరణలోఅమ్మవారుచౌడేపల్లె బోయకొండ ఆలయంలో భక్తుల రద్దీ చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు పెట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఏకపక్షం.. అధ్యక్షా!
ఏ ఉద్యోగ సంఘానికై నా నియమ, నిబంధనలు ఉంటాయి. ఏ సంఘమైనా వాటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, వెసులుబాటును అనుభవించేందుకు ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ బైలాస్ ప్రకారం నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికలను అందుకు విరుద్ధంగా నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా వారందరిని బెదిరించి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో వ్యతిరేకత చూపుతున్న అదే సంఘం సభ్యులు (ఫైల్) చిత్తూరు కలెక్టరేట్ : నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలను పక్కదారి పట్టించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లు ప్రభుత్వ లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలను రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించడంతో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరిగి ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని వెల్లడిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఓ జూనియర్ లెక్చరర్ 2014 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా అతడే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తోంది. అధ్యక్ష పదవికి మరికొందరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ అవకాశం కల్పించడం లేదని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలు తనకు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి ఏకపక్షంగా ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారని ఆ సంఘం సభ్యులే పెదవి విరుస్తున్నారు. ఆ అధ్యక్షుడి అక్రమ వ్యవహారాలపై ఆ సంఘం సభ్యులు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానంను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జోక్యం చేసుకోవాలి అసంబద్ధంగా నిర్వహించిన ఎన్నికలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించి అవకతవకలను విచారించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలున్నాయంటూ రెచ్చిపోతున్న అధ్యక్షుడి వ్యవహార తీరుపై జిల్లాలోని లెక్చరర్లతో పాటు, పక్క జిల్లాల లెక్చరర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత స్వలాభం కోసం మాత్రమే రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారని మండిపడుతున్నారు. చట్టబద్ధత లేని ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు . సమాజాల నమోదు చట్టం, సంఘం నియమావళి ప్రకారం తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇటీవల రాజ్యాంగ నియమావళిని ఉల్లంఘిస్తూ నిర్వహించారని ఆ సంఘం సభ్యులే ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, సమాన హక్కుల వంటి ప్రాథమిక సూత్రాలను గాలికొదిలేశారని సభ్యులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం నిష్పాక్షిక అధికారులను నియమించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే అధికారులుగా నియమించడం చట్టవిరుద్ధమని చెబుతున్నారు. అర్హులైన లెక్చరర్లందరికీ సభ్యత్వం కల్పించకుండా, అనుకూలంగా ఉన్న వారికి మాత్రం అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించారని వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం సమానత్వ హక్కు (భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణం) సమాజాల నమోదు చట్టంలోని నియమావళికి విరుద్ధమని లెక్చరర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కమిటీల ఎన్నికలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది, అలా చేయకుండానే ఎన్నికలు పూర్తి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఎన్నికలు జరగకపోగా, 3 జిల్లాల్లో బహిష్కరించారని వెల్లడిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిర్వహించాల్సిన ఎన్నికలను తమకు అనుకూలంగా తిరుపతిలో నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
వడమాలపేట (పుత్తూరు) : వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ శివకుమార్ కథనం మేరకు పూడి రైలు మార్గంలోని 124బి/31 వద్ద సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు ఒంటిపై బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనదుర్గాపురంలో వైద్య పరీక్షలు పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం గ్రామంలో కొంతమంది ఆదివారం విరేచనాలు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పీహెచ్సీ వైద్యాధికారులు మోహన్క్రిష్ణ, జయకుమార్ వనదుర్గాపురం గ్రామానికి వెళ్లి విరేచనాలు, వాంతులు అయిన వారికి వెద్య పరీక్షలు చేశారు. డాక్టర్లు మాట్లాడుతూ.. వారు తీసుకున్న ఆహారం సరికాదని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ మార్పు వల్ల మనం తినే ఆహారం అప్పటి కప్పుడు చేసింది తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ కుమార్. మండల విస్తరణాధికారి సత్యనారాయణ, సీహెచ్ఓ సుబ్రమణ్యం, ఆరోగ్య సిబ్బందులు పాల్గొన్నారు. -
తీర్పుపై ఉత్కంఠ!
చిత్తూరు అర్బన్ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2015.. నవంబరు 17వ తేదీ.. స్థలం – చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు ఏం జరిగింది – మేయర్ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు. చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైంది వీరిపై .. చింటూ, చంద్రశేఖర్ అలియాస్ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకాష్రెడ్డి (32), మంజునాథ్ (36), వెంకటేష్ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది. నిరూపించబడ్డ సెక్షన్లు ● 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు ● అనురాధను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి ● మోహన్ను హత్య చేసినందుకు సెక్షన్ 302 రెడ్విత్ సెక్షన్ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి ● వేలూరు సతీష్ కుమార్ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ ● వేలూరు సతీష్కుమార్ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్ 307 రెడ్విత్ సెక్షన్ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, వెంకటేష్. సతీష్కుమార్ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్ . పోలీసుల భారీ భద్రత దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. -
పంటలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగువమూర్తి వారిపల్లెలోని పంటలపై ఆదివారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. రాగి పంటను తొక్కి నాశనం చేశాయి. చేతికి వచ్చిన సమయంలో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం సహిత విద్య కో ఆర్డినేటర్ (ఐఈఆర్పీ)ల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. కో–ఆర్డినేటర్ల రెగ్యులర్ పే స్కేల్ నిమిత్తం ఈ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న సహిత విద్య కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. -
భవనం కూల్చుతుండగా కూలీ మృతి
బైరెడ్డిపల్లె : పాత భవనం కూల్చడానికి వెళ్లిన కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని ధర్మపురిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన భాస్కర్ పాత భవనం కూల్చడానికి ఐదుగురు కూలీలకు ఒప్పందం చేశాడు. అదే గ్రామానికి చెందిన ఐదుగురు కూలీలు భవనం కూల్చుతుండగా గంగాధర్ (29) అనే వ్యక్తిపై ప్రమాదవశాత్తు గోడ కుప్పకూలింది. దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన గంగాధర్ను స్థానికులు బైరెడ్డిపల్లె పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు గంగాధర్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి బంగారుపాళెం: స్థానిక సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. అతనికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అనారోగ్యంతో బంగారుపా ళెం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మృతి చెందాడని తెలిపారు. మృత దేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు 9440796736 నంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఎక్కడినుంచి వచ్చిందో.. ఎందుకొచ్చిందో.. బ్యాగులో లక్ష క్యాష్
చిత్తూరు జిల్లా: ఆమె ఎందుకొచ్చిందో.. ఎక్కడికొచ్చిందో తెలియదు. ఊరుగాని ఊరు వచ్చి బస్ షల్టర్లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా వర్షాల కారణంగా అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎవరో భిక్షగత్తె అనుకుని స్థానికులు చేరదీసి ఆదరించారు. శనివారం ఉన్నట్టుండి అపస్మారక స్థితి చేరుకుని మృతిచెందారు. హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్, జయశంకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మహిళ భుజానికి ఉన్న బ్యాగ్ను పరిశీలించారు. ఆమె పేరు రామలక్ష్మి(60)గా నిర్ధారించారు. ఆమెది ధనపాల్చెట్టి స్ట్రీట్, ముత్తుపాళెం, సిద్ధిపేట, చెన్నైగా బ్యాగులోని ఆధార్, బ్యాంకు పుస్తకాలను బట్టి గుర్తించారు. బ్యాగులో ఉన్న రూ. 1.08 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. వీటితోపాటు చెన్నై కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఖాతా పుస్తకాలను పరిశీలించారు. బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.4 లక్షల మేర బ్యాలెన్స్ ఉన్నట్టు స్టేట్మెంట్ను బట్టి గుర్తించా రు. పర్సులో కొన్ని నగలు సైతం ఉండడంతో.. ఫోన్బుక్లో ఉన్న తన కుమార్తె పళణి ఎమ్మాల్కు సమాచారమిచ్చారు. రామలక్ష్మి చౌడేపల్లెకు ఎందుకొచ్చారు.. ఎలా వచ్చారో తెలియడం లేదు. పలమనేరుకు వెళ్లాల్సింది పోయి.. గత మూడు రోజుల క్రితం ఆమె చౌడేపల్లెలో పలమనే రుకు వేళ్లేందుకు ఆటోలో ఎక్కాల్సి ఉండగా పొరపాటున తిరుపతి వైపు వెళ్లే ఆటో ఎక్కినట్టు స్థానికులు చె బుతున్నారు. చౌడేపల్లెకు సుమారు 2కి.మీ దూరంలో ఆటో వెళ్తుండగా మహిళను డ్రైవర్ ప్రశ్నించాడు. పలమనేరుకు వెళ్లాలని సమాధానమివ్వగా ఆమినిగుంట బస్ షల్టర్ వద్ద ఆ మహిళను ఆటోలో నుంచి దింపేశా రు. ఆమెకు తెలుగు రాదు. మూడు రోజులుగా బస్ల్టర్లోనే తలదాచుకున్నారు. చలికి వణుకుతూ అపస్మారస్థితికి చేరుకుని మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామలక్ష్మి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
పకడ్బందీగా రికార్డుల కంప్యూటరీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : వక్ప్ బోర్డ్ రికార్డుల కంప్యూటరీకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సర్కార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల ముతవల్లీ ప్రెసిడెంట్లు, అన్ని పార్టీల ముస్లిం నాయకులకు వక్ఫ్భూముల ఆస్తుల వివరాలు ఉమీద్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను వివరించాలన్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. తప్పిదాలు చోటు చేసుకుంటే సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయం నిర్వహణలో పాదర్శకతను పెంచి, మిగిలిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఎలా ఉపయోగించాలో వివరించారు. వక్ఫ్ ఆస్తుల సమాచారాన్ని అప్లోడ్ చేసే సమయంలో డీఆర్వో, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సహాయం తీసుకొవాలన్నారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథ్రెడ్డి, జిల్లా వక్ప్బోర్డ్ ఇన్స్పెక్టర్ రియాజ్ పాల్గొన్నారు. -
చిరుత సంచారం పుకార్లు
తవణంపల్లె: మండలంలోని అరగొండ– కామాలూరు రోడ్డులో చిరుత సంచారం చేసినట్టు వచ్చిన పుకార్లలో వాస్తవం లేదని ఫారెస్టు బీట్ ఆఫీసర్ రెడ్డెప్ప తెలిపారు. అరగొండ– కామాలూరు రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఓ ప్రయివేటు జ్యూస్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న గుట్టలో మేకలు మేపుతున్న కాపరి చిరుత పులి వచ్చి ఒక మేక పిల్లను పట్టుకొని వెళ్లిందని పుకార్లు చేశారని పేర్కొన్నారు. దీనిపై ఫారెస్టు సిబ్బంది గుట్టలో చిరుత జాడ గురించి గాలిస్తే ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదని వివరించారు. అరగొండ, చారాల, పైమాఘం పరిసరా గ్రామాల్లో చిరుత సంచారంపై అవగాహన కల్పించి అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. -
అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుక
చిత్తూరు కలెక్టరేట్ : అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుకగా ఉండాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ సంఘంలో ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు దాదాపు 31 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ లేకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం పై ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఆ ఆశలను నిరాశపరచకూడదని చెప్పారు. ఇటీవల జారీచేసిన డీఏ ఉత్తర్వుల్లో తీవ్ర గందరగోళం సృష్టించారన్నారు. దాన్ని సరిచేయాలని తమ సంఘమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అనంతరం సవరించిన జీవోను జారీచేశారన్నారు. చేసింది గోరంతే, చేయాల్సింది కొండత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చేసింది గోరంతేనని, చేయాల్సింది కొండత ఉందని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల హెల్త్కార్డులు పనిచేయడం లేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం 60 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపజేసి ఉద్యోగోన్నతులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడేందుకు ఎన్జీవో సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు జగదీశ్, శివప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రదీప్, మురళి, సురేశ్, పుమాల, లక్ష్మీపతి, మహేష్, భానుప్రకాష్, సుభాష్, హరి, గురునాథం, జ్యోతి, పురుషోత్తంరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, సురేశ్రెడ్డి పాల్గొన్నారు. -
నైపుణ్యాలను పెంపొందించండి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం జనవిజ్ఞాన వేదిక ఉచితంగా ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను రూపొందించింది. ఆ పుస్తకాలను శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్శివప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు జయంతి, పర్యావరణ విభాగం కన్వీనర్ సుధాకర్, జేవీవీ నాయకులు విజయ్, చిరంజీవి, గణిత ఫోరం జిల్లా అధ్యక్షులు చంద్రమనాయుడు పాల్గొన్నారు. -
గోడ కూలి మున్సిపల్ కూలీ మృతి
కుప్పం: గోడ కూలి మున్సిపల్ కూలీ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. శనివారం ఉదయం ఆర్టిసీ బస్టాండు ఎదురుగా ఉన్న మున్సిపల్ మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలు దిగారు. ఆ సమయంలో కాలువ ఓ వైపు ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న కూలీ ఆళ్లగడ్డకు చెందిన శీనయ్య(45) మృతిచెందారు. మరో ముగ్గురు కూలీలు హజరతయ్య, సురేష్, వెంకటేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గోడ కూలి మృతి చెందిన శివయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. గాయపడిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా? కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న మురుగు నీటి కాలువలువ పక్కనున్న గోడలు పాచిపట్టి, పెచ్చులూడి శిథిలావస్థకు చేరాయి. ఇరవై ఏళ్లుగా నీటి ప్రవాహంతో దెబ్బతిని కూలే స్థితికి చేరాయి. కానీ అధికారులు మురుగు నీటి కాలువను శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులపై ఒత్తిడి చేయడంతోనే కార్మికులు ఆ కాలువలోకి దిగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నారు. -
వేదాంతపురంలో విషాదఛాయలు
● స్వర్ణముఖి నదీ తీరంలో మిన్నంటిన రోదనలు ● కన్నీటి పర్యంతమైన స్థానికులు ● ఘటనా స్థలిని పరిశీలించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ● మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ● ప్రమాద కారణాలను అన్వేషించాలని డిమాండ్ ‘‘దేవుడా మేమేం పాపం చేశాం.. ఎందుకీ కడుపు కోత.. మా బిడ్డలను ఎందుకు దూరం చేశావు.. చిన్న వయసులోనే ఎందుకు తీసుకెళ్లిపోయావు.. ప్రాణ సమానంగా పెంచుకుంది ఇందుకేనా..? పిల్లల ఉసురు తీసి మాకు ఇంతటి శిక్షను విధిస్తావా..? మా ఆశలను నిలువునా ముంచేస్తావా..? ఇక మేం ఎవరిని చూసుకుని బతకాలి’’ అంటూ వేదాంతపురంలో స్వర్ణముఖి నదిలో మునిగి మృత్యువాత పడిన నలుగురు బాలుర తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి గుండెలవిసేలా ఆక్రందించారు. బాధితుల ఆర్తనాదాలు చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతి రూరల్ : మండలంలోని వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ఏడుగురిలో నలుగురు బాలురు గల్లంతు కావడం విధితమే. శుక్రవారం రాత్రి 10గంటల వరకు చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక మృత దేహం (బాలు) మాత్రమే లభించింది. మిగిలిన వారి కోసం శనివారం ఉదయం 6గంటల నుంచే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల సాయంతో నదిని జల్లెడ పట్టారు. 7గంటలకు ప్రకాష్ అనే బాలుడి మృత దేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం 12గంటల తేజ అనే బాలుడి మృత దేహం లభించింది. తర్వాత వర్షం మొదలవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాన తగ్గిన తర్వాత మళ్లీ గాలించగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మునిచంద్ర మృత దేహం చిక్కింది. వెంటనే మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో లేరనే విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను వెలికితీతీకు అవస్థలు స్వర్ణముఖి నదిలో వరదనీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం, అప్పుడప్పుడూ వర్షం కురుస్తుండడంతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలకు పలు మార్లు అంతరాయం కలిగింది. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం ఉదయం నుంచి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి నదిలోకి వెళ్లారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు, తిరుపతి రూల్, చంద్రగిరి, భాకరాపేట సీఐలు గాలింపు చర్యల్లో పాల్గొన్నా రు. మృత దేహాలను వెలికి తీసేందుకు కృషి చేశారు. ఎట్టకేలకు తమ బిడ్డల చివరి చూపు దక్కేలా చేసినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అదనపు పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా 203 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్ల పరిష్కారం పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2026 ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,776 పోలింగ్స్టేషన్లు ఉండగా అందులో 8 పోలింగ్స్టేషన్లు పాత భవనాలు, కూలిపోయిన భవనాల నుంచి కొత్త వాటికి మార్పు చేశామన్నారు. మరో 68 పోలింగ్ స్టేషన్ల పేర్లను మార్పు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1,500 మంది ఓటర్లకంటే ఎక్కువ ఉన్న పోలింగ్స్టేషన్ల పరిధిలో అదనంగా కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో చర్చించి జిల్లాలో 203 కొత్త పోలింగ్స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 1,979 పోలింగ్స్టేషన్లు ఉంటాయన్నారు. జిల్లాలో 15,74,277 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,74,244 మంది పురుషులు, 7,99,961 మంది మహిళలు, 72 మంది ఇతరులు ఉన్నారన్నారు. ఆర్డీవోలు శ్రీనివాసులు, అనుపమ, భవానీ, శ్రీనివాస్రాజు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
మీ సంతకమే..మీ పిల్లల భవిష్యత్తు
నగరి : మీ సంతకం మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. శనివారం తన నివాస కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిమిత్తం నగరి మున్సిపల్, రూరల్ మండలం, వడమాలపేట మండల నేతలతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టి ఆ సేవలు నిలిచిపోయే విధంగా చేశారని దుయ్యబట్టారు. ఆయన నగరి ఎమ్మెల్యేనా, తిరుపతి ఎమ్మెల్యేనా? నగరిలో ఉన్నది నగరి ఎమ్మెల్యేనా, తిరుపతి ఎమ్మెల్యేలా..? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని మాజీ మంత్రి ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. ఎవరి వద్ద ఎంత కమీషన్ తీసుకుందామా..? అని తిరుపతి నుంచి లెక్కలు వేసుకోవడం మినహా ఆయన ఏమీ చేయడం లేదన్నారు. ఆయన్ను ఎవరైనా కలవాలన్నా తిరుపతికి వెళ్లాల్సిందే అన్నారు. దోచుకున్నామా.. దాచుకున్నామా అన్నరీతిలో పాలన కొనసాగుతోందన్నారు. తాను ఏ అభివృద్ధి పనులు చేశానో ఎమ్మెల్యేగానీ ఆయన అనుచరుగానీ వస్తే కళ్లకు కట్టినట్టు చూపుతానన్నారు. వారు చేసిన అభివృద్ధి చూపగలరా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఏదైనా కట్టించాడా అంటే అది ఆయన తండ్రి విగ్రహం మాత్రమే అన్నారు. పోటీపడి అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయాలన్నారు. అది వదలిపెట్టి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడదామా, లోపలేద్దామా, లిటిగేషన్ పెడదామా అనే దిశగానే పాలన కొనసాగుతోందన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, ఎంపీపీ భార్గవి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.సూపర్ మోసం సూపర్ సిక్స్ సూపర్ ఫట్ అయ్యిందని మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని పేర్కొన్నారు. కొండలు, గుట్టలను వదిలిపెట్టడం లేదని, ఎడాపెడా దోచేస్తున్నారన్నారని ఆరోపించారు. మద్యం, గ్రావెల్, ఇసుకపై వచ్చే ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. మెడికల్ కళాశాలల పీపీపీని వ్యతిరేకించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వ మెడలు వంచుదామన్నారు. -
తుపానుపై అప్రమత్తం
చిత్తూరు అర్బన్: అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే సమాచారంతో చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని నీవానది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నీవానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తమ సిబ్బందితో వెళ్లి.. స్థానికులతో మాట్లాడారు. రాత్రి వర్షం ఎక్కువైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అనంతరం పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఫోన్– 112, 9491074517, 9440796706 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. -
ప్రైవేటు బాట
రవాణా సేవలు.. డబ్బుల వసూలు..? రవాణాశాఖ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరమవుతున్నాయి. ఎల్ఎల్ఆర్ మినహా మిగిలిన సేవలు అప్పన్నంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాయి. మిగిలిన అరకొర సేవలు కూడా ప్రైవేటుకు కట్టబెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతా ప్రైవేట్ పరం కావడంతో ఒకప్పుడు వాహనదారులతో కళకళలాడిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. పరివాహన్పై అవగాహన ఏదీ? జిల్లాలో వాహనాల వివరాలు.. ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ ను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతోంది. జిల్లా మొత్తానికి చిత్తూరు నగర సమీపంలోని బంగారుపాళ్యం వద్ద ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.దీంతో వారు అనేక వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఒకప్పుడు రవాణాశాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పనులపై వచ్చేవారితో కార్యాలయం రద్దీగా ఉండేది. క్రమేణ సేవలన్నీ ఆన్లైన్తో పాటు ప్రైవేటు పరం చేయడంతో రద్దీ తగ్గిపోయింది. సేవలన్నీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో రవాణశాఖ నిర్వీర్యం అయిపోతోంది. అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉందంటే.. గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో కొనుగోలుదారులు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు. స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వ హించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీ, దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనా అధికారి స్థాయిలో మాన్యువల్గా చేసి జారీ చేసే వారు. ఈ సేవలను ఆన్లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు. వాహనాల్లో సామర్థ్యానికి మించి సరుకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్ పోస్టులు ఎత్తివేశారు. రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా ఆ శాఖపై ఆసక్తి సన్నగిల్లుతోంది. -
భారీగా పట్టివేత
సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అయితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తామని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కాకూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసిన విషయమే అయినా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది. -
వరి పంటపై అడవి పందుల దాడి
ఐరాల: మండలంలో వరిసాగు చేసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరి పంట సాగు చేసిన రైతులకు ఒక పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు అడ వి పందుల బెడదతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట పొట్ట దశకు చేరుకోవడంతో అడవి పందులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతానికి సరిహద్దు గ్రామమైన 35 యర్లంపల్లెకు చెందిన రైతు పురుషోత్తంరెడ్డి వరి పంట తొక్కి, తిని నాశనం చేశాయి. తనకు తీరని నష్టం వాటిల్లినట్లు బాధి త రైతు వాపోయాడు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. రైలు ఢీకొని మహిళ మృతి చిత్తూరు కార్పొరేషన్ : నగరానికి సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. గురువారం చిత్తూరు రైల్వే ఎస్ఐ ధర్మేంద్రరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఓ మహిళ చిత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాట్పాడి నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ వయస్సు దాదాపు 50 నుంచి 55 సంవత్సరాలు, బ్రౌన్ కలర్ జాకెట్, లేత ఎరుపు రంగు చీర ధరించి ఉన్నారన్నారు. మృతదేహం వివరాలు తెలిసిన వారు 8688546060 నంబర్ను సంప్రదించాల ని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ చౌడేపల్లె : మండలంలోని దుర్గసముద్రంలో గతంలోని ఓ ఎకై ్సజ్ కేసులో పరారీలో ఉన్న శివకుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. గతంలో ఓ ఎకై ్స జ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న నింది తుడిని ట్రైనీ ఎస్ఐ మణికంఠేశ్వరరెడ్డి ఆధ్వ ర్యంలో పట్టుకొని కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మాజీ మేయర్ హత్య కేసులో నేడు తీర్పు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పు వెలువరించనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధను తుపాకీతో కాల్చి చంపగా, ఆమె భర్త కటారి మోహన్ను కార్పొరేషన్ కార్యాలయంలోనే కత్తులతో వేటాడి నరికి చంపేశారు. టీడీపీ హయాంలో, ఆ పార్టీ నగర ప్రథమ పౌరురాలిని ప్రభుత్వ కార్యాలయంలోనే హత్య చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో కటారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ)తో సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టుకు నేరాభియోగ పత్రం అందచేశారు. కేసులో ఒకరిని న్యాయస్థానం డిశ్చార్జ్ చేయగా, మరో నిందితుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక చింటూతో సహా 21 మంది నిందితులుగా ఉన్నారు. దీనిపై దాదాపు ఏడాదిన్నర కాలంగా సుదీర్ఘ విచారణ జరిపిన చిత్తూరులోని మహిళలపై జరిగే నేరాల విచారణ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈనెల 24వ తేదీ వెలువరించనున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై కటారి దంపతుల కుటుంబం, చింటూ వర్గం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తీర్పు నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. అలాగే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, కటారి కుటుంబ నివాసాల వద్ద పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉంది. విజయోత్సవ ర్యాలీ, ఊరేగింపులు కూడా నిషేధమని డీఎస్పీ తెలిపారు. గురువారం సాయంత్రం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, వన్టౌన్ సీఐ మహేశ్వర తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర కేజీబీవీ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో కేజీబీవీ ఎస్వోలతో సమావేశం నిర్వహించారు. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. కేజీబీవీల్లో అమలు చేస్తున్న విజయపథం, విద్యాసక్తి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం గత విద్యాసంవత్సరం మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేసిన ఎస్వోను సత్కరించారు. సమావేశంలో జిల్లా సమగ్రశిక్షాశాఖ ఏపీసీ వెంకటరమణ, కేజీబీవీ పాఠశాలల జీసీడీవో ఇంద్రాణి, పలువురు ఎస్వోలు పాల్గొన్నారు. పెద్ద శేష వాహన సేవ రేపు తిరుమల: తిరుమలలో శనివారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటలవరకు మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
పచ్చనేతల రేషన్ దందా
సాక్షి టాస్క్ఫోర్స్ : రేషన్ మాఫియా చేస్తున్న కూటమి నేతలు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. లక్షల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో బుధవారం అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువగల 31.4 టన్నుల రేషన్ బియ్యం, ఏడు వాహనాలను డీఎస్పీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలల కిందట.. ఈ ఏడాది జూన్ 30న ఇదే ప్రాంతంలో సుమారు 6 లక్షలు విలువ గల 13 టన్నుల బియ్యం పట్టుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రదారి అయిన టీడీపీ నేత అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్తో పాటు వై.ధనుష్, డి.బోస్, ఎన్.రోహిత్, వి.దినేష్, గజేంద్రన్, రాజేష్ అలియాస్ రాజు అనేవారిని అరెస్టు చేశారు. అక్రమార్కులపై ప్రత్యేక నిఘా బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ విక్రమ్ వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకొని మూతబడి ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ, సీఐ సిబ్బందిని వెంటబెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం, వీఆర్వోతో పాటు సంబంధిత స్థలానికి చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, నాలుగు పెద్ద వాహనాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వను కొలత వేయగా 31.4 టన్నులు ఉన్నట్లు తేలింది. ఈ రేషన్ బియ్యం ఎవరెవరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అక్రమ రవాణాలో పాత్రదారులు ఎవరు అనే విషయాలు ప్రత్యేక దర్యాప్తు చేసి అందరిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్ గోదాముకు సేఫ్ కస్టడీ నిమిత్తం తరలించారు. జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేతదే అక్రమ బియ్యం నిల్వలు రెండుసార్లు పట్టుబడిన జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేత అమృతరాజ్ నాడార్దే అని, ఆయన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుడని నగరి పట్టణ ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. అయినా పట్టుకున్న బియ్యం ఎవరిదో కనిపెట్టాలంటూ పోలీసులు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిండ్ర మండలంలోనూ అదే తంతు ఈ నెల 14వ తేదీన నిండ్ర మండలం, అత్తూరులోను నిల్వ ఉంచిన 34 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆ కేసులోను పోలీసులు నిందితుల పేర్లు వెల్లడించకుండా నగరి పట్టణానికి చెందిన వ్యక్తి బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని మాత్రమే పేర్కొన్నారు. కాని నిందితుల పేర్లు వెల్లడించలేదు. -
కూటమి రాకతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం
కుస్తీ పోటీల్లో చాంపియన్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో చిత్తూరు జిల్లా అండర్–19 విభాగంలో ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది.– 10లోమాజీ మేయర్ హత్య కేసులో నేడు తీర్పు మాజీ మేయర్ హత్యకేసులో శుక్రవారం తీర్పు వెలువడనుంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ప్రైవేటుపై మోజు..
కూటమి ప్రభుత్వం.. కార్పొరేట్కు సలాం.. బడా కంపెనీల అడుగులకు మడుగులు.. ప్రైవేట్తో ఒప్పందం..సర్కారు వైద్యానికి మంగళం.. ఫలితం పేద రోగుల ప్రాణాలు అర్పణం. ఇదీ నేటి సర్కారు స్థితి. తిరుపతిలోని ఉచిత క్యాన్సర్ ఆస్పత్రి నిర్వీర్యమే ఇందుకు నిదర్శనం. ‘క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేద లు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కా వాన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన హాయాంలో నిర్మా ణం చేపట్టిన క్యాన్సర్ ఆస్పత్రి స్థాయి తగ్గించడంతోపాటు నిధులు విడుదల చే యకుండా దుబాయ్ కంపెనీతో టీటీపీ ప్ర భుత్వం ఒప్పందం చేసుకోవడంతో క్యాన్స ర్ రోగులు ఆందోళన చెందుతున్నారు. చెట్ల కింద.. పుట్ల చాటున క్యాన్సర్ రోగులుఇక ఉచితానికి మంగళమే! శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి టాస్క్ఫోర్స్: ప్రైవేటు మోజులో కూటమి సర్కారు.. ఉచిత క్యాన్సర్ ఆస్పత్రిని నిర్యీర్యం చేస్తోంది. ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు అందించే తిరుపతి శ్రీబాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని ప్రాణం తీసి.. దుబాయ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేటు క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు దుబాయ్లో బుర్జిల్ హెల్త్కేర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయం కూటమి గెజిట్ పత్రిక ద్వారా వెళ్లడించింది. వివరాల్లో కెళితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రి క్యాన్సర్ రోగుల పాలిట వరంలా మారింది. ‘క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతానికి వెళ్లకూడదు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలతో ఆస్పత్రి కావాలి’’.. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఆయన ఆదేశాల మేరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతిలో స్విమ్స్ యూనివర్సిటీకి అనుబంధంగా 400 పడకలతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. నాటి సీఎం ఆదేశాల మేరకు 2022లో స్విమ్స్ గవర్నింగ్ బాడీ తీర్మానం చేసి టీటీడీకి పంపింది. 2023 ఫిబ్రవరిలో టీటీడీ అంగీకారం తెలిపింది. అదే ఏడాది ఏప్రిల్లో టీటీడీ సుమారు రూ.130 కోట్లు బడ్జెట్ కేటాయించింది. మరో రూ.100 కోట్ల స్విమ్స్ నిధులతో కలిపి అదే ఏడాది సెప్టెంబర్ 20న పనులు ప్రారంభించింది. 2024 అక్టోబర్లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేపట్టారు. కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం పూర్తి కాలేదు.శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 21 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 73,853 మంది స్వామివారిని దర్శించుకోగా 22,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. ఐరాస సమావేశాలకు మిథున్రెడ్డి నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యసేవలందించాలనే లక్ష్యంతో నాడు వైఎస్ జగన్ ప్రారంభించిన క్యాన్సర్ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే క్యా న్సర్ రోగులకు బెడ్లు దొరక్కపోవడంతో చెట్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని బిక్కు బిక్కుమంటున్నారు. తిరుపతిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులను చూసిన రోగులు కొందరు ఇంటి వద్ద బాధపడుతుండగా, మరి కొంద రు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణపై వైద్యులు కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఏడాదికి 70 వేల నుంచి 80 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రాధేయపడినట్లు తెలిసింది. ఆస్పత్రి అభివృద్ధి చెందితే మరో 200 మందికిపైగా వైద్యులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కోరినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో ద్వారా తెలుసుకున్న క్యాన్సర్ రోగులు షాక్ గురయ్యారు. ఉచితంగా వైద్య సేవలు అందించే ఆస్పత్రిని నిర్యీర్యం చేసి, ప్రైవేటు ఆస్పత్రిని తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడంపై రోగులు, బంధువులు మండిపడుతున్నారు. -
‘అయ్యో’ర్లకు టెట్ గండం!
చిత్తూరు జిల్లా వివరాలు ఎంకి పెళ్లి సుబ్బి.. చందంగా ఉంది ప్రభుత్వ టీచర్ల పరిస్థితి. టెట్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు ప్రస్తుతం సర్వీస్ కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టీచర్లలో ఆందోళన నెలకొంది. ఎప్పుడో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమవుతుందా ? అని ప్రశ్నిస్తున్నారు? టెట్ నిర్వహణపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఉపాధ్యాయులు టెన్షన్కు లోనవుతున్నారు. టెట్ పై టీచర్లలో నెలకొన్న ఆందోళనపై కథనం. చిత్తూరు కలెక్టరేట్ : విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని మార్పులు చేపట్టారు. విద్యార్హతలతో పాటు వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ప్రవేశ పెట్టారు. సర్కారు బడుల్లో బోధించే టీచర్లకు టెట్ తప్పనిసరిగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జిల్లా లో పనిచేస్తున్న టీచర్లలో కలవర పరుస్తోంది. పిల్ల లకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెట్ తప్పనిసరి చేయడంతో పాటు పైగా రెండేళ్లలోపు పాస్ కావాల్సిందేనంటూ నిబంధన విధించడం సీనియర్ టీచర్లలో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం టెట్ పరీక్ష నోటిఫికేషన్ తెర పైకి తీసుకురావడంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో ని 19,320 మంది టీచర్లు పెదవి విరుస్తున్నారు. 2010కి ముందు టీచర్లు టెట్ రాయాల్సిందే.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2010 వ సంవత్సరం నుంచి ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారంతా టెట్ ఉత్తీర్ణత పొందినవారే. అయితే 2010 వ సంవత్సరం కంటే ముందు కేవలం డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందారు. 2010 కంటే ముందు టీచర్ పోస్టులు సాధించిన వారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగ విరమణ పొందే వారు మినహా మిగతా వారు 2027 ఆగస్టు 31 వ తేదీలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఒక వేళ ఆలోగా టెట్లో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పులో వెల్లడించింది. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వేల మంది టీచర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. సర్వీసు నిబంధనలు లేకున్నా.. టెట్ అర్హత తప్పనిసరి చేయడం సరికాదని సీనియర్ టీచర్లు అభిప్రాయపడుతున్నారు. టెట్ నిబంధనపై టీచర్లు గుర్రుమంటున్నారు. ఆగస్టు 2010 తర్వాత జరిగిన నియామకాలు నిబంధదనలకు లోబడి జరుగుతున్నాయి. కానీ అప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిబంధనల్లో లేదని టీచర్లు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యాశాఖ ఎక్కడా వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం వృత్తిలోకి రావాలనుకునే అభ్యర్థులకు అంశంగా పరిగణించాలని చెబుతున్నారు. రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పును పున:సమీక్షించమని రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. టెట్ పరీక్షపై వేల మంది టీచర్లు టెన్షన్ ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలు సంఘాల నాయకులు టెట్ పరీక్ష కు సంబంధించి కూటమి ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఏ మాత్రం స్పందన లేకుండా పోయింది. ఉద్యోగోన్నతి పొందడానికి టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని కోరుతున్నారు. టీచర్లకు బోధన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని , ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యో గోన్నతి పొందేందుకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగోన్నతి తర్వాత టెట్ పాస్ కావడానికి 4 సంవత్సరాల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు 1,909ప్రాథమికోన్నత పాఠశాలలు 205 ఉన్నత పాఠశాలలు 355 మొత్తం పాఠశాలలు 2,469 విధులు నిర్వహిస్తున్న టీచర్లు 9,162 -
కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలం
కుప్పంరూరల్ : కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలమని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. గురువారం రామకుప్పం మండల పరిధిలోని పంద్యాలమడుగు, గొరివిమాకులపల్లి పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి పంచాయతీ అధ్యక్షులు, సభ్యులను ఎన్నుకున్నారు. పంద్యాలమడుగు అధ్యక్షులు గా వెంకటాచలపతి, గొరివిమాకులపల్లి పంచాయ తీ అధ్యక్షులుగా అశోక్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. 2029లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నితిన్రెడ్డి, రామకుప్పం మండల అధ్యక్షుడు బాబురెడ్డి, కో కన్వీనర్ చంద్రారెడ్డి, బాబురెడ్డి, హేమాచలపతి, సైఫుల్లా, సతీష్, వెంకటాచలం, నాయకులు ఉన్నారు. -
ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
– మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీ నాయకులమంతా తమ ప్రాణాలైనా అర్పించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాగే ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి బిడ్డా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు నగదు జమ చేశారన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న సంకల్పంతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలే జీల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభు త్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యతోపాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చేసి, రూ. వేల కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నా రని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైఎస్. జగన్మోహన్రెడ్డి శ్రమిస్తుంటే, చంద్రబాబు పేదల భవిష్యత్తును నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
చిత్తూరులో భారీ భద్రత.. అంతిమ తీర్పు!
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుంది. చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. మరోవైపు నిందితులు, బాధితుల్లో కోర్టు తీర్పుపై ఉత్కంఠత నెలకొంది. పదేళ్ల కిందట రక్తపుటేర్లు.. 2015 నవంబరు 17.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రక్తపుటేర్లు పారాయి. ఓ వైపు తుపాకీ పేలుళ్లు.. మరోవైపు కత్తులతో స్వారీ. నాటి నగర ప్రథమ పౌరురాలైన కటారి అనురాధ మేయర్ స్థానంలో తన ఛాంబర్లో కూర్చుని ఉన్నారు. పక్కనే ఆమె భర్త కటారి మోహన్, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు. ముసుగు (బుర్కా) ధరించి వచ్చిన ఓ వ్యక్తితోపాటు మరికొందరు కూడా ముసుగులు ధరించి తుపాకులు, కత్తులతో ఛాంబర్లోకి చొరబడ్డారు. మేయర్ అనురాధను తుపాకీతో కాల్చగా.. తలను తీల్చుకుంటూ మెదడు చిట్లిపోయి ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఆమె భర్త కటారి మోహన్ను కార్యాలయంలో కత్తులతో వేటాడి పాశవికంగా నరికి హతమార్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కటారి దంపతుల జంటహత్యలతో రక్తపుటేర్లు పారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం హయంలో పోలీసుశాఖ వైఫల్యానికి.. రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రశి్నస్తూ జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేరంలో మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు.. హత్య కుట్రలో సంబంధం ఉందని 23 మంది చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత.. జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుండడంతో చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. న్యాయస్థానం ఏ తీర్పుఇచ్చినా.. కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబు స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.నిందితులు వీరే.. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. చింటూ ప్రధాన నిందితుడిగా వెంకటాచలపతి, జయప్ర కాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ మురుగన్, యోగానంద్, పరందామ, హరిదాస్, మొగిలి, శశిధర్, యోగానందం, ఆర్వీటీ బాబు, లోకేష్ రఘుపతి, నాగరాజు, ఆనంద్కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, సురేష్ పేరిట పోలీసులు కోర్టులో నేరాభియోగపత్రం (ఛార్జ్షిట్) దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు 122 మంది వరకు సాక్షులుగా ఉన్నారు. కేసు మొత్తాన్ని విచారించిన చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం, మహిళలపై జరిగిన నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు తీర్పు వెలువరించనున్నారు. -
సీఎంకు విన్నవించినా పట్టా ఇవ్వలేదు
గుడుపల్లె: సీఎం చంద్రబాబు సార్తోపాటు విద్యాశాఖ మంత్రి లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి విన్నవించినా తన అనుభవంలో ఉన్న భూమికి అధికారులు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని మెహన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. గుడుపల్లె మండల కమ్మగుట్టపల్లె గ్రామానికి చెందిన మెహన్ సర్వే నంబరు 252లో 4 ఎకరాల విస్తీరణంలో పశువుల మేతకు చెందిన భూమిని అనుభవించుకుంటున్నాడు. ఈ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రాలు అందించాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఉన్నాతాధికారులు ఆదేశానుసారం రెవెన్యూ అధికారులు స్పందించి మెహన్ అనుభవిస్తున్న భూమిని సర్వే చేయగా పశువుల మేత భూమి అని తేలింది. దీంతో అధికారులు పశువుల మేత భూమికి పట్టా పాసుప్తుకాలు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. అనంతరం మెహన్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆ భూమికి పట్టాలు ఇవ్వమని చెప్పారన్నారు. దీనికి తోడు గ్రామం పక్కన ఉన్న ప్రభుత్వ భూమి ప్రజల అవసరాల నిమిత్తం కావాల్సింటుందని స్థానిక సర్పంచ్ రిజర్వేషన్ కూడా ఇచ్చారని తహసీల్దార్ సీతారాం తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పినా తనకు పట్టా పాసుపుస్తకాలు అధికారులు ఇవ్వలేదని తనకు ఏమైనా ప్రాణహాని జరిగిందంటే తన భార్య బిడ్డలు అనాథలవుతారని, ఇందుకు అధికారులే బాధ్యులని మెహన్ పెట్టిన వీడియెలో వైరల్ అవుతోంది. -
నాయకులకే ఉపాధి
సాక్షి టాస్క్ఫోర్స్: పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో జాతీయ ఉపాఽధి పథకం పేరుకే జరుగుతోంది. కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఉపాధి సిబ్బంది ఇక్కడ అంతా అధికార పార్టీ నాయకులకు ఉపాధి చూపుతున్నారు. అధికారులు పాత పనులకు బిల్లులు పెడితే 20 శాతం ఇవ్వాల్సిందే. దీంతో రెండు మండలాల్లో ఉపాధి పనులు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నారు. 2024–25 సంవత్సరాల్లో రెండు మండలాల్లో కూలీల కోసం రూ.25 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులు 90 శాతం అధికార పార్టీ నాయకులకు చేరాయి. ఉపాధి పనులు ఎక్కడ జరుగుతున్నాయో కూలీలకు తెలియదు మస్టర్లో సంతకాల కోసం కూలీల దగ్గరకు వెళ్లి సంతకాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల బలవంతంగా సంతకాలు చేసుకుంటున్నారు. మరి కొన్ని చోట్ల కూలీలకు వారానికి రూ.200 ఇచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నట్లు సమాచారం. గతంలో పని చేసిన ఉపాధి సిబ్బందిని తొలగించి, వారికి అనువుగా ఉన్న వారిని నియమించుకున్నా రు. దీంతో అక్రమాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్నాయి. ఉపాధి పథకం ప్రారంభం నుంచి ప్రతి చెరువులో ఎన్ని పనులు చేశారు.. ఇప్పుడు ఎన్ని పనులు చేశారని లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయట పడాతాయి. ప్రతి సంవత్సరం చేసిన గుంతలను మళ్లీ మెరుగులు తీద్ది బిల్లులు చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూలీలకు రోజు పని దొరకడం లేదు. యంత్రాలకు మాత్రం రోజు పనులు కల్పిస్తున్నారు. మండల, గ్రామ పంచాయతీ సరిహద్దులో ఒక్కరు చేసిన పనులను మరొకరు చేసుకుంటున్నారు. ఇద్దరు ఒకే పనిని అధికారులకు చూపుతున్నారు. మినీ గోకులాలు పశువులు లేని వారికి అధికారులు మంజూరు చేయించారు. రెండు మండలాల్లో 195 గోకులాలు మంజూరు చేశారు. వాటిలో 70 శాతం పనులు పూర్తి చేశారు. విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తా యని ప్రజలు చెబుతున్నారు. పుంగనూరు నియోజక వర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం మండలాలకు ఒక మండలానికి నలుగురు విజిలెన్స్ అధికారుల చొప్పున కల్లూరు జెడ్సీ గెస్ట్హౌస్కు బుధవారం సాయంత్రానికి చేరుకున్నారు. అక్కడ రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో జరిగిన ఉపాధి పనులపై రికార్డులను తనిఖీ చేపట్టారు. గురువారం నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు: మండలంలోని మార్లపల్లెకి చెందిన మునిరత్నం (55) బుధవారం గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. అటువైపుగా వెళుతున్న గొర్రెల కాపరులు సంఘటనను గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి వచ్చిన మునిరత్నం ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు తమ గతి ఏమిటని రోదిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి కారణాలపై విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి బంగారుపాళెం: మండలంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని గుండ్లకట్టమంచి దళితవాడకు చెందిన రైతు మునిరాజులు ఉదయం తన మేకలను మేత కోసం అడవికి తోలుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి మేకలను తోలుకుని వస్తుండగా రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. వైద్యురాలి నుంచి రూ.93 లక్షలు లూటీ చిత్తూరు అర్బన్: తాము ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అని చెప్పుకున్న నిందితులు.. ఓ వైద్యురాలి నుంచి రూ.93 లక్షలు కాజేశారు. ఆలస్యంగా మేల్కొన్న ఆమె బుధవారం రాత్రి చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. లావణ్య అనే వైద్యురాలు నగరంలోని మిట్టూరులో పోలీసు సంక్షేమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూ ఇక్కడే పనిచేస్తున్నారు. ఈఏడాది జూలై 2న గుర్తు తెలియని వ్యక్తులు వైద్యురాలికి వీడియో కాల్చేశారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. ‘‘డాక్టర్గా మీరు ఎన్నో అక్రమాలు చేశారు. అందుకుగాను మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’’ అని చెప్పారు. దీంతో ఆమె భయపడిపోయారు. దీన్ని అలుసుగా తీసుకున్న నిందితులు ఏడు దపాలుగా ఆమె నుంచి రూ.93,13,852 నగదును ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల ద్వారా కాజేశారు. ఆలస్యంగా తాను మోసపోయానని గుర్తించిన వైద్యురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలందించండి
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని 410 సెక్షన్లలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటూ నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద 11 కేవీ ఫీడర్లు, ఓవర్ లోడెడ్ 33 కేవీ ఫీడర్లను గుర్తించి వేరు చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి, ఈ పథకంపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. విద్యుత్ శాఖ ఏఈఈలు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155333కు కాల్ చేసి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్, హెచ్ఆర్డీ డైరెక్టర్ కె.గురవయ్య, ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ డైరెక్టర్ పి.ఆయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పి. సురేంద్రనాయుడు, సీఎస్సీ జనరల్ మేనేజర్ చక్రపాణితోపాటు 9 జిల్లాల నుంచి సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఉపాధి లెక్క.. అక్రమాలు పక్కా
కేంద్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో అమలు చేసిన ఉపాధి హామీ పథకం పుంగనూరు నియోజకవర్గంలో నాయకులకు ఉపాధి కల్పిస్తోంది. అవినీతి కట్టడి చేయాల్సిన అధికారులు కూటమి నేతల అవినీతిని పెంచి పోషిస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిధులు నిరుపయోగం అవుతున్నాయి. కూలీలకు ఆకలి కేకలు మిగులుతున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధిహామీ పథకంలో పలు అక్రమాలు జరిగాయి. వీటిపై విజిలెన్స్ విచారణ కోసం బుధవారం స్థానిక జెడ్పీ గెస్ట్హౌస్కు 28 మందితో కూడిన విజిలెన్స్ బృందం చేరుకుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పీఓలు , ఏపీడీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు సంబంధిత ఉద్యోగులను సీనియర్ క్వాలిటి కంట్రోల్ ఆఫీసర్ శాంతారామ్ ఆధ్వర్యంలో రికార్డుల పరిశీలన మండలాల వారీగా నిర్వహించారు. విషయం తెలుసుకుని మీడియా వెళ్లడంతో ఆయన మీడియా నాట్ అలౌడ్ అని, ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం రాష్ట్ర అధికారులు తెలుపుతారని మీడియాను అనుమతించలేదు. కాగా పుంగనూరు నియోజకవర్గంలో కూటమి నేతలు కూలీల పేరిట ఉపాధి పనులు యంత్రాలతో చేసి, దొంగ బిల్లులు పెట్టి, రూ.కోట్లు దోచుకున్నారని, కూలీల కడుపు కొట్టారని, వీటిపై విజిలెన్స్శాఖతో విచారణ జరిపించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరిపి నివేదికలు పంపాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 23 వరకు విజిలెన్స్ కమిటీ ఆరు మండలాల్లో పర్యటించి, అక్రమాలను గుర్తించి, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంది. రహస్యమే... విజిలెన్స్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆయా మండలాల్లో సిబ్బందితో రికార్డులు పరిశీలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పుంగనూరు జెడ్పీ గెస్ట్హౌస్లో అందరిని పిలిపించి, రికార్డులు పరిశీలించడం సర్వత్రా అనుమానాలకు దారి తీస్తోంది. అక్రమాలపై గ్రామాల్లో పర్యటించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని, నాలుగు గోడల మధ్య ఎలా వాస్తవాలు బయటకు వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో ఒక రోజు విశ్రాంతి భవనంలో సరిపోయింది. ఇక మిగిలిన రెండు రోజుల్లో 6 మండలాల్లో పర్యటించాల్సి ఉంది. వర్షం వస్తే ఇక విచారణ సంగతి దేవుడికెరుక. -
పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’
చిట్టి ఆవు.. చూడ చక్కని దూడ.. శుభానికి సంకేతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో విశిష్టస్థానం పొందిన అమూల్య సంపద ఆవు. గోమాతగా ఖ్యాతిగాంచిన కామధేనువైన పుంగనూరు పొట్టి ఆవుకు..ప్రస్తుత యాంత్రిక యుగంలో కష్టకాలం వచ్చింది. ఇలాంటి కాలంలోనూ ఆ పశుపరిశోధన స్థానం అంతరించి పోతున్న చిట్టి ఆవుల పునరుత్పత్తికి నడుం కట్టింది. ప్రభుత్వాల సాయంతో పుంగనూరు జాతి పశువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి ఆవులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్ను గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేశారు. దీనిద్వారా కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని కేటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రంగా ప్రారంభమైన ఈ పశు పరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం ఆవుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 300కు పైగా పశువులు వరకు పెంచింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధనా కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులతో రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్( ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్ను గతంలో ఏర్పాటు చేశారు. పిండమార్పిడి పద్ధతిలో అధిక ఉత్పత్తి గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి వీర్యం తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు వీర్యం నుంచి ఎక్కువ అండాలను తీసుకుని ఎక్కువ ఆవులకు ఇస్తారు. సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో తొలుత 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 300కు పైగా చేరింది. ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా వచ్చే ఐదేళ్లల్లో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశుపరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. -
వాలీబాల్ పోటీలు విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) కార్యదర్శులను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శులు బుధవారం కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి నవంబర్ 1,2 తేదీల్లో పలమనేరు డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే 69వ రాష్ట్రస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పోటీల నిర్వహణలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ డీఐఈఓ సమన్వయంతో పోటీలు విజయవంతం చేయాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 పోటీల కార్యదర్శి బాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నుంచి 13 బాలల, 13 బాలికల జట్లు కళాశాల నుంచి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పలమనేరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సిరాజ్, 14,17 ఎస్జీఎఫ్ అడ్మిన్ కార్యదర్శి శారద, ఖోఖో సంఘం కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తగా ఉండండి
పుంగనూరు: భారీ వర్షాల్లో చిక్కుకుని, ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యమైన పనులు ఉంటే మినహా బయటకు వెళ్లవద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా రైతులు పొలం పనులకు వెళ్లవద్దని, ఒక వేళ వెళితే ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు పడి ఉన్నాయా? లేదా అన్న విషయాన్ని, షార్ట్ సర్క్యూట్ను పరిశీలించి పనులు చేయాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు, కుంటలు, వాగుల వద్దకు పంపకుండా నియంత్రించాలన్నారు. ప్రస్తుతం మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. నీటిని ప్రతి ఒక్కరూ వేడిచేసి, వాటిని తాగడం సురక్షితమని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. -
50 శాతం పచ్చదనాన్ని సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో జిల్లాలో 2047 నాటికి 50 శాతం పచ్చదనాన్ని సాధించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో అటవీశాఖతోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. తక్కువ సాంధ్రత ఉన్న మండలాల్లో మూల నిల్వలను సంరక్షించేందుకు మిశ్రమ విధానాన్ని అమలు చేయాలన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రైవేట్, రోడ్ల పక్కన, విద్యాసంస్థల్లో విరివిగా మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బురాజు మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై మక్కువ చూపించేలా అవగాహన కల్పించాలన్నారు. వనం మనం, వన మహోత్సవం, ప్రకృతి పిలుస్తోంది, కార్తీక వన సమారాధన, మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తున్నమని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జ్ఞానప్రకాష్రాజు, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
● సహాయక చర్యలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● సహాయం, ఫిర్యాదులకు 9491077325, 08572–242777 నంబర్ ● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : అధిక వర్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలతో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిందన్నారు. అధిక వర్షాలతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని రోడ్లు, కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్టు ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం జరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డీపీఓ గ్రామ పంచాయతీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పాత ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం జిల్లాలో అధిక వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. అధిక వర్షాలకు నీరు నిల్వ చేరడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితంతో వివిధ రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదాలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీ, మున్సిపల్, నగరపాలక శాఖ అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని తగ్గించడానికి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోకూడదన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో సంప్రదించాలన్నారు. జిల్లాలో అధిక వర్షాలకు వాగులు, వంకలు, చెరువుల్లో అధికంగా నీరు చేరాయని, పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బురాజు, డ్వామా పీడీ రవికుమార్, డీఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు. అధిక వర్షాలకు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే తెలియజేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26 వ తేదీ వరకు అధిక వర్షాలు కురస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు చేపట్టారు. రెండు షిప్టుల్లో ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించారు. అధిక వర్షాలకు ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినా, సహాయం కోసమైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9491077325, 08572–242777కు కాల్ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సమస్యలు, సహాయానికి కాల్ చేయండి -
ఐజర్లో ఘనంగా స్వచ్ఛోత్సవ్
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్లో బుధవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించిన నాటినుంచి గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛత పట్ల సమాజంలో అవగాహన పెరిగిందన్నారు. దేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, ‘పరిశుభ్రతే సేవ’ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతా హి సేవ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ భుక్య మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ కుమార్ హిమాన్షు శేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని అందులో భాగంగా అమ్మ పేరిట ఒక్క మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు స్వచ్చత పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలను అందజేశారు. -
కుస్తీ చాంపియన్ చిత్తూరు
విజయవాడ రూరల్: నున్న గ్రామంలోని జరుగుతున్న అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీల్లో ప్రీస్టైల్ ఓవరాల్ చాంపియన్గా చిత్తూరు జిల్లా బాలికల జట్టు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్జీఎఫ్), సమగ్ర శిక్ష(ఎస్ఎస్), ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్హాలులో 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. బాలికల ప్రీస్టైల్లో మూడు బంగారు, రెండు రజితం, ఒక కాంస్య పతకం సాధించిన చిత్తూరు జిల్లా జట్టు 22 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకుంది. 17 పాయింట్లతో తూర్పుగోదావరి రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానంలో నిలిచాయి. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, కోచ్లు మేనేజర్లు హాజరయ్యారు. బుధవారం బాలికల విభాగం పోటీలు ముగిశాయి. విజేతలకు నున్న పీఏసీఎస్ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎస్.రవిప్రసాద్, టోర్నీ పరిశీలకుడు చిటికిన రమేష్, ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.శ్రీలత, పి.ఆనంద్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు టి.విజయవర్మ, ఎస్.రమేష్, ఎం.వి.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 26.3 అడుగులు చేరుకున్న అరణియార్ నీటి మట్టం నాగలాపురం: పిచ్చాటూరు మండల పరిదిలోని అరణియార్ రిజర్వాయర్లో నీట మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రభావంతో జలాయంలో నీటి నిల్వ పెరిగింది. క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కొనసాగుతున్నందున రాబేయే రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అరణియార్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కులు ఇన్ఫ్లోలు వస్తున్నాయి. ప్లడ్ గేటు మూసి వేసి ఉండటంతో ఔట్ఫ్లో లేవని అధికారులు వెల్లడించారు. రేపు భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రాజెక్టు వద్ద గట్టి నిఘా ఉంచామని అన్నారు. ఏఈ స్థాయి అధికారులను 24 గంటల పాటు ప్రాజెక్టూ గేటు వద్ద ఉండి పర్యావేక్షించేలా చర్యలు చేపట్టామని తెలిపారు..గ్రామస్తులు, రైతులు రాబోయే సాగు సీజన్కు సరిపడేంత నీరు అరణియార్లో నిల ఉండండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
ఉపాధి దొంగలు దొరికేనా!
గతంలో చేసిన పనులే మళ్లీ..చౌడేపల్లె మండలంలో జేసీబీతో ఉపాధి పనులు చేస్తున్న దృశ్యం(ఫైల్) చౌడేపల్లె : బూరగపల్లె వద్ద జేసీబీతో చేపట్టిన పారంపండ్ పనులు సాక్షి టాస్క్ఫోర్స్ : పుంగనూరు నియోజకవర్గంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.65 కోట్ల మేరకు నిధులను ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి కూలీల కడుపుకొట్టి తమ్ముళ్లు తమ జేబుల్లోకి మళ్లించేశారు. నిబంధనలకు విరుద్దంగా కూలీలతో చేయాల్సిన పనులను జేసీబీ, హిటాచీలతో చేసి కూలీలే చేసినట్లు బోగస్ రికార్డులు తయారు చేసి తమ్ముళ్లకు ఉపాధిని కల్పించి ఆర్థికంగా ప్రోత్సహించారు. నిబంధనలకు విరుద్దంగా చెరువులు, కుంటల్లో ఇష్టానుసారంగా క్యాటిల్పాండ్ , ఫిష్ పాండ్, పారంపండ్ పనులకు అంచనాలు వేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులకే పనులు కేటాయించారు. కూలీలకు పనులివ్వకుండా యాంత్రాలతో పనులు చేసేసి వారికి నచ్చిన కూలీల పేరిట పనులకు వచ్చినట్లుగా తప్పుడు రికార్డులతో కోట్ల నిధులు కొల్లగొట్టారు. గ్రామసభలు నిర్వహించకుండా ఆ పనులకు గ్రామసభ తీర్మాణాలు లేకుండానే నియోజకవర్గంలో ఉపాధి నిధులు ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఈ అక్రమాలపై రాజంపేట ఎంపీ పివి. వెంకట మిథున్రెడ్డి ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీభవాని హర్ష నేతృత్వంలో సుమారు 30 మంది బృందం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పరిశీలించనున్నారు. అవినీతి నిగ్గు తేల్చేనా? పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి నిధుల అక్రమాలపై విజిలెన్స్ అధికారుల బృందం నిగ్గు తేల్చేనా అంటూ గ్రామాల్లో చర్చ సాగుతోంది. రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, సదుం, పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లో ఏ ఒక్క పని సైతం కూలీలు చేయలేదని ఆరోపణలున్నాయి. అధికారుల బృందం పుంగనూరుకు మంగళవారం చేరుకోవడంతో ఆరు మండలాల్లోని ఉపాధి సిబ్బంది రికార్డులను సిద్ధం చేసి జెడ్పీ విశ్రాంత భవనం వద్దకు తీసుకెళ్లారు. వచ్చిన అధికారుల బృందానికి టీడీపీ నేతలు ఉన్నత స్థాయి నేతలు, అధికారుల నుంచి ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు వెలికితీయకుండా సద్దుమణిపించేలా కొందరు నేతలు పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. వణుకుతున్న ఉపాధి సిబ్బంది ఎన్నడూ లేని విధంగా విజిలెన్స్ అధికారులు ఉపాధి పనులను తనిఖీల కోసం రావడం, ఫైల్స్ అప్పగించాలని ఆదేశించడంతో ఆరు మండలాల్లోని ఉపాధి ిసిబ్బంది వణుకుతున్నారు. కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లో సిబ్బంది పనులు కేటాయించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయి ఓ నేత , మండల స్థాయిలో కొందరు నేతలు జాబితా సిద్ధం చేసిన వారికే ఉపాధి పనులు కేటాయించారు. సామాన్యులకు కేటాయించలేదు. వారికి సహకరించని ఏపీడీ, ఏపీఓలు, టీఏలు, జేఈలను వేరొక మండలాలకు బదిలీ చేయించారు. ఏకంగా ఆరు మండలాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేశారు. వారికి నచ్చిన వారిని నియమించుకొని రూ.కోట్లు కొల్లగొట్టారు. తామే ఉపాధి పనులకు కూలీలకు బదులు యంత్రాల ద్వారా పనులు చేయించి నేతల జేబులు నింపామని, తమను ఈ గండం నుంచి కాపాడాలని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి పనులను యంత్రాలతోనే.. ఉపాధి హామీ పథకంలో కూలీలతోనే పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో మట్టి పనులన్నీ చివరికి మామిడి పండ్ల తోటల పెంపకానికి గుంతలు తవ్వే పనులు కూడా యంత్రాలతోనే చేయించారు. విజిలెన్స్ అధికారులకు సిబ్బంది అప్పగించిన రికార్డులు, మూడు దశల ఫొటోలు పరిశీలిస్తే సిబ్బంది, పనితీరు తేట తెల్లమవుతుంది. పేదలకు ఎక్కడ పనులిచ్చారు? పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి పనులు కూలీలకు కల్పించలేదు. అధికారంలోకి వచ్చాక ఈ పథకం పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లోకి వెళ్లిందని కూలీలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పనుల్లేక కూలీలు బయట ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. పనులు అడిగినా ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టించుకోకపోవడంతో పాటు గ్రామీణ స్థాయిలో నేతలు చెప్పిన వారికే యంత్రాలకు పనులిస్తున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నేటి నుంచి తనిఖీలు ప్రారంభం తనిఖీలకు కేటాయించిన విజిలెన్స్ సిబ్బందిని టీమ్లుగా విభజించి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉపాధి పనులు రికార్డులు, ఫైల్స్ పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి అక్రమాలపై నివేదిక ఇవ్వనున్నారు. తనిఖీ బృందానికి అక్రమాలపై ప్రజలు వివరించి ఉపాధి పథకం ఆశయాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. పుంగనూరు : జేసీబీతో చేసిన పనులకు కూలీలతో మెరుగులు దిద్దుతున్న సిబ్బంది (ఫైల్) చెరువుల్లో గతంలో చేసిన పనులు , రైతు పొలాల్లో చేసిన ఫారంపండ్ పనులను తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ వాటికే తుది మెరుగులు దిద్ది ఉపాధి నిధులు కొల్లగొట్టారు. గోకులం షెడ్లు సైతం టీడీపీ వారికే కట్టబెట్టారు. వారు వాహనాల పార్కింగ్ , ఇతర కార్యక్రమాల కోసం నిర్మించి ఉపాధి పథకం ఆశయాన్ని నీరుగార్చారు. పశువులు లేకపోయినా టీడీపీ నేత అయి ఉంటే చాలు అనే అర్హతతో నిధులు వృథా చేసి దోచుకొన్నారు. గ్రామసభ తీర్మానాలు ఏవీ ? గ్రామ స్థాయిలో పనులు గుర్తించి ఆ పనులు చేపట్టడానికి గ్రామసభ తీర్మాణం ఆమోదించాలి. తరువాత మండల పరిషత్ తీర్మాణం పొందాలి. ఆ పనులను పరిపాలనపరమైన అనుమతి పొందిన తరువాత పనులు చేపట్టాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో పద్ధతి ప్రకారం ఉపాధి పనులు చేపట్టలేదు. లబ్ధి పొందేవారు టీడీపీ నేతలై ఉండాలి, ఆ పార్టీకి చెందిన నేతల సిఫార్సు ఉంటేచాలు. సిబ్బంది ఏమైనా చేసే స్థాయికి వెళ్లారు. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే వారిపై ఆ పార్టీ ముఖ్యనేతలకు చెప్పి వారి నోరు మూయించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి తరుణంలో ఉపాధి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేసి నివేదిస్తారో చూడాల్సి ఉంది. -
దర్జాగా కబ్జా !
పలమనేరు : అఽధికారం ఉందనే అహంకారంతో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పీఏ పార్థసారథి ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని దర్జాగా ఆక్రమించి రాత్రికే రాత్రే భారీ కట్టడాన్ని నిర్మించేశాడు. పేదలెవరైనా ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకుంటే తొలగించే అధికారులు దీనిపై అసలు నోరు మెదపడం లేదు. ఇదే అదునుగా భావించిన ఆ పీఏ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాన్ని నిర్మించేశాడు. దీనిపై సాక్షి దినపత్రికలో పలు కథనాలు వచ్చినా అధికారులు చలించలేదు. జరుగుతున్న అన్యాయంపై కడుపు మండిన పలువురు పట్టణ వాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు. దీంతో ప్రజాబీష్టం మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి అక్రమ కట్టడాన్ని ఆపాలంటూ మంగళవారం రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు స్థానిక ఎస్ఐ హంగామా సృష్టించారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల హామీతో అక్కడ జరుగుతున్న పనులను ఆపేశారు. గతంలో ఏమి జరిగిందంటే... పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ప్రభుత్వ నీటి ట్యాంకు ఉంది. ఇందుకు సంబంధించిన గేట్వాల్వ్, పట్టణానికి నీటి సరఫరా ఇక్కడి నుంచే సాగుతోంది. దీనికి తోడు కాలువపల్లి వైఎస్సార్ జలాశయం నుంచి పట్టణానికి మంచి నీటి సరఫరా చేసే భారీపైప్లైను ఇక్కడే ఉంది. ఇక్కడి ప్రభుత్వ స్థలంలో గతంలో చిన్నపాటి గుడిసె ఉండేది. ఎలాగైనా ఈ స్థలాన్ని కబ్జా చేయాలని భావించిన పార్థసారథి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి ఆయనతో సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. ఆపై నన్ను ఎదిరించేవాళ్లెవరంటూ 2007లో ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ వారి ద్వారా పట్టా పొందాడు. ఆపై 2018లో మున్సిపల్ అధికారుల నుంచి ప్లాన్ అప్రూవల్ చేసుకొని ఆ స్థలానికి పన్నులు చెలిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఆ స్థలంలో రహస్యంగా పిల్లర్లు వేసి భారీ భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు. దీనిపై పలు అభ్యంతరాలు వస్తుండడంతో పగలు కాకుండా రాత్రులో మాత్రమే నిర్మాణాన్ని చేస్తూ ప్రస్తుతం గోడల దాకా నిర్మాణం చేపట్టారు. ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో.. పలమనేరు పట్టణంలో మెయిన్రోడ్డు పక్కన ఇంతటి భారీ అక్రమాలు జరుగుతుండడంతో కడుపు మండిన స్థానికులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి. దీంతో వారు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి ఈ ఆక్రమణపై స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడకు తెలిపారు. దీంతో ఆయన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆయన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి అక్రమ కట్టడం వద్దకెల్లి దీన్ని ఆపేయాలంటూ సూచించారు. స్పాట్ నుంచే మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఆర్డీవో భవానికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేసి రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విషయం పక్కదారి పట్టించేందుకు రెచ్చిపోయిన ఎస్ఐ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడం వద్దకు వస్తున్నారని తెలిసి కూటమి నేతల ప్రమేయంతో పట్టణ ఎస్ఐ లోకేష్రెడ్డి భారీ బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పక్కన కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటూ విమర్శించారు. ఉన్నతాధికారులకు ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలా ఉండగా మధ్యలో కల్పించుకున్న ఎస్ఐ లోకేష్రెడ్డి కావాలనే పోలీసులను అమర్యాదగా మాట్లాడుతావా అంటూ మాజీ ఎమ్మెల్యేను సైతం ఏకవచనంతో మాట్లాడారు. ఆ నాకొడుకు, ఈ నాకొడుకంటూ బండబూతులు అందుకున్నారు. ఎలాగైనా అక్రమ నిర్మాణ విషయాన్ని పక్కదోవ పట్టేలా ఆయన పథకం ప్రకారం హంగామా సృష్టించారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోతే.. అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో వచ్చినా, ప్రజలు ఫిర్యాదు చేసినా కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పీఏ అక్రమించుకొని అక్రమ కట్టడాన్ని నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ విమర్శించారు. అసలు ప్రభుత్వ స్థలానికి ఎలా పట్టా ఇచ్చారంటూ గట్టిగా మాట్లాడారు. మంచినీటి ట్యాంకు కోసం ప్రజా అవసరాల కోసం ఉంచిన స్థలాన్ని ఎలా ఆక్రమించుకున్నారంటూ వాదించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే తామే వైఎస్సార్సీపీ నాయకులతో వచ్చి అక్రమ కట్టడాన్ని తొలగిస్తామంటూ అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, చెంగారెడ్డి, ముజ్జు, రెడ్డెప్పరెడ్డి, ఎస్టీ నాగరాజు తదితరులు ఉన్నారు. చర్యలు తీసుకుంటాం ఈ విషయమై స్థానిక టీపీఎస్ ఇందిరాను వివరణ కోరగా ఇదంతా గతంలో జరిగిందని తనకేమీ సంబంధం లేదన్నారు. కమిషనర్ రమణారెడ్డిని అడగ్గా సర్వేయర్ ద్వారా కొలిపించడం, ఈ స్థలం వెనుక పైప్లైన్ ఉందా లేదా అని చూడడం, ఆపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్ ఇన్భునాథన్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ పొరంబోకు స్థలానికి పట్టా ఇచ్చారని దానిపై కోర్టులో కేసులు కూడా నడిచాయన్నారు. దీనికి మున్సిపల్ అధికారులు ఎలా అప్రూవల్ చేశారో తెలియదన్నారు. ఆక్రమణలపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
● ఇద్దరూ గ్రానెట్ క్వారీలో కార్మికులు ● హతుడు, నిందితుడూ ఇద్దరూ ఒడిస్సా వాసులే
బాబాయ్ను హత్య చేసిన అబ్బాయ్ పుత్తూరు : బాబాయ్ని అబ్బాయ్ కత్తితో పొడిచి చంపిన ఘటన పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. సీఐ శేఖర్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా.. పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో భోజనాల సమయంలో నరేష్నాయక్(45)ను అతడి అన్న కుమారుడైన రాజేష్నాయక్(22) కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. మొహిగూడ గ్రామం, గన్జామ్ జిల్లా, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నరేష్నాయక్, ఇతని కుమారుడు కిరణ్చంద్రనాయక్, అన్న బలరామ్నాయక్, అతని కుమారుడు రాజేష్నాయక్ రెండు నెలలుగా చెర్లోపల్లి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. వీరందరూ చెర్లోపల్లి గ్రామ సమీపంలోని శబరి గ్రానెట్ క్వారీలో పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవు రావడంతో అందరూ చెర్లోపల్లి గ్రామంలోనే ఉన్నారు. మంగళవారం భోజనాల సమయంలో నరేష్నాయక్(45), రాజేష్నాయక్(22) ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కూరగాయలు తరిగే కత్తితో రాజేష్నాయక్, తన చిన్నాన్న అయిన నరేష్నాయక్ను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దీంతో నరేష్నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు కిరణ్చంద్రనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి తవణంపల్లె : మండలంలోని ఉత్తర బ్రాహ్మణపల్లె వద్ద కోళ్లఫారంలో పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందడంతో అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఐరాల మండలంలో మొరం గ్రామంలోని జగనన్న కాలనీకి చెందిన చిరంజీవి(38), భార్య వల్లెమ్మ ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన మురళి కోళ్లఫారంలో ఏడాదిగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి మూర్చ రావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వివరించారు. చిరంజీవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వల్ల్లెమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితుడు రాజేష్నాయక్ (ఫైల్) హతుడు నరేష్నాయక్ (ఫైల్) -
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మండలంలోని ఉలవలదిన్నెకు చెందిన ఆదినారాయణ.. 352 గ్రాముల బంగారు నగలను 2008లో శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్లు, ఆ నగలను అప్పటి ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా, తనకు ఆ సమయంలో రశీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడసేవలో వినియోగించకపోవడంతో ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆదినారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈవో, ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రశీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకో వాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డబ్బులిస్తానని పిలిచి.. దోచేశారు యాదమరి : తమిళనాడుకు చెందిన ఓ రియ ల్టర్ తనకు రూ.20 లక్షలు అవసరమని తన స్నేహితుడికి చెప్పగా ఇస్తానని నమ్మబలికాడు. తీరా వచ్చాక తాను అడిగింది ఇవ్వలేదు సరికదా ఆ రియల్టర్ను హింసించి తన ఫోన్ పే నుంచి రూ.2,33,000 దోచేశారు ఇద్దరు కేటుగాళ్లు.స్థానిక ఎస్ఐ ఈశ్వర్ వివరాలు మేరకు...తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ,సినీ నిర్మాతగా మారాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అయితే చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక ఒడిదొడుకులు రావడంతో తన స్నేహితుడైన తమిళనాడుకు చెందిన పరమేశ్వరన్కు ఫోన్ చేసి తనకు రూ.20 లక్షలు అప్పుగా కావాలని అడిగాడు. తనకు సహాయం చేస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మొత్తాన్ని ఏర్పాటు చేస్తానని వెంటనే కుప్పం రావాలని చెప్పగా ..భాధితుడు ఈ నెల 16న బెంగళూరు నుంచి కుప్పం వచ్చారు. అక్కడి నుంచి చిత్తూరులోని ప్రశాంత్ నగర్ కు చెందిన పరమేశ్వరన్ స్నేహితుడు రాజ్ కుమార్ కారులో వెదుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి సమీపంలోని ఓ క్వారీ యజమాని వద్దకు తీసుకెళ్లారు.అక్కడ మణిరత్నంను కారులో బంధించి తీవ్రంగా గాయపరిచారు.ఆ సమయంలో అతడి ఫోన్ నుంచి రూ.2,33,000 నగదును పరమేశ్వరన్ తనకు తెలిసిన వారి నంబర్లకు బలవంతంగా బదిలీ చేయించారు. అనంతరం ఈనెల 18న యాదమరి మండలంలోని నుంజర్ల ప్రాజెక్టు వద్ద మణిరత్నంను హింసించి తమకు మరిన్ని డబ్బులు కావాలని వేధించసాగారు. మరుసటి రోజు చిత్తూరులో వారు టీ తాగుతున్న సమయంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితులు పరమేశ్వరన్, రాజ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి దర్యాపు చేస్తున్నారు. నగలు మాయం అయ్యాయని ఆరోపిస్తున్న ఆదినారాయణనగలు ఇవ్వలేదని చెబుతున్న డీసీ ఏకాంబరం -
చిత్తూరులో బీసీ నేతపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు నగరంలో కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అనుచరులు రెచ్చిపోయారు. సొంత పార్టీ సీనియర్ నాయకుడు, టీడీపీ బీసీ నేత సంతపేట ఈశ్వర్పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వర్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన ఈశ్వర్ టీడీపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నాడు. ఈశ్వర్ తొలి నుంచి స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని అనుచరుడిగా ఉన్నాడు. తాజాగా మంగళవారం ఈశ్వర్ అన్నకుమారుడు గోపి చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణం వద్దకు వెళ్లారు. టపాకాయలు కొంటూ రూ.500 పోగొట్టుకున్నాడు. దీంతో ఈశ్వర్కు ఫోన్చేసి, రూ.500 పంపాలని కోరగా, ఈశ్వర్తో పాటు అతని కుమారులు వంశీకృష్ణ, భార్గవ్ టపాకాయల దుకాణం వద్దకు వచ్చారు. అప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు మౌళి మరో 20 మంది కలిసి గోపిపై దాడికి పాల్పడ్డారు. దీన్ని ప్రశ్నించిన ఈశ్వర్, అతని కుమారులు వంశీకృష్ణ, భార్గవ్పై దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలను తట్టుకోలేక ఈశ్వర్, అతని కుమారులు పరుగులు తీస్తూ గేటు బయటకు వచ్చేశారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్టీ కోసం 30 ఏళ్లకు పైగా జెండా మోసిన తనకు, టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తన కుమారుడు వంశీకృష్ణను అందరూ చూస్తుండగానే కొట్టి.. కొట్టి తరిమారని.. ఎమ్మెల్యే అనుచరుడు మౌళి మరో 30 మంది కొట్టారంటూ ఈశ్వర్ కన్నీటి పర్వంతమయ్యాడు. -
ఇరువర్గాల ఘర్షణ
శ్రీరంగరాజపురం : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని పొదలపల్లిలో చోటు చేసుకుంది. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కథనం మేరకు పొదలపల్లి గ్రామంలో సోషియల్ మీడియాలోని వాట్సాప్ గ్రూప్లో ఇరువర్గాలు అయిన ఏకాంబరం అలాగే ఆనంద్ ఇరువురు పరస్పరం అసభ్యకరమైన రీతిలో పోస్టులు రెచ్చగొట్టే విధంగా పెట్టడంతో రెండు వర్గాలు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి పొదలపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఏకాంబరం, ఆర్.భరత్, ఆర్.లోకేష్, యం.రాజేష్, ఆర్.చరణ్ మారణాయుధాలతో ఆనందరావు ఇంటిపై దాడి చేశారు. దీంతో ఆయనతో పాటు వారు కుటుంబ సభ్యులు భారతి, జానీలకు గాయాలు కావడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
– ఘనంగా అమర వీరుల సంస్మరణ దినం చిత్తూరు అర్బన్ : పోలీసులు లేని సమాజం ఎలా ఉంటుందో ఊహించడానికి సాధ్యపడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం చిత్తూరులోని ఏఆర్ పోలీసు మైదానంలో నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు పనంగా పెట్టి, శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల సేవలు మరువలేనివని, వీళ్ల సేవలను వెలకట్టలేమన్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ.. 1959 నాటి ఘటన దురదృష్టకరమని.. నాటి నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ.. పోలీసులు దేశరక్షణకు సమానంగా సమాజంలో సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. మేయర్ అముద, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చుడా చైర్పర్సన్ కటారి హేమలతతో కలిసి అమరవీరుల చిహ్నానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు రాజశేఖర్రాజు, శివానంద కిషోర్, సాయినాథ్, రాంబాబు, చిన్నికృష్ణ, మహబూబ్ భాష, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉదయ్కుమార్ పాల్గొన్నారు. అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న జిల్లా జడ్జి, చిత్రంలో కలెక్టర్ తదితరులుఅమర వీరుల కుటుంబ సభ్యులతో అధికారులు, ప్రజా ప్రతినిధులు -
ఆశలు.. అడియాశలై!
దీపావళి కనుకగా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగులు, టీచర్లు కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. తీరా వారి ఆశలను కూటమి ప్రభుత్వం ఒక డీఏ ఇస్తున్నామంటూ ప్రకటించి నిరుత్సాహానికి గురిచేసింది. ఆ డీఏను సైతం చర్చల్లో వెల్లడించిన అంశాలకు విరుద్దంగా జీవో జారీ చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశను నింపారు. కూటమి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధ డీఏ జారీపై జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు గుర్రుమంటున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సింది నాలుగు డీఏలు, ఇచ్చింది మాత్రం ఒక డీఏనే. ఆ డీఏ ను సైతం చర్చల్లో ప్రస్తావించిన అంశాలకు విరుద్దంగా ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పెరుగుదలతో చాలా సహజంగా ఇవ్వాల్సిన డీఏ ప్రకటనలో కూటమి ప్రభుత్వం హంగామా ఎక్కువ చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులను మరోమారు మోసగించింది. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్ల కోసం అనేక మోసపూరితమైన హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులను నట్టేట ముంచేశారు. కూటమి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన ఒక్క డీఏ జీవో వల్ల జిల్లాలోని 48 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కదానికి సీఎం స్థాయి చర్చలా... కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డీఏ కోసం ముఖ్యమంత్రితో చర్చలు అవసరమా అంటూ ఉద్యోగులు, టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 12వ పీఆర్సీపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా మోసగించారని చెబుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు నష్టపోయామని, ఇంకెన్ని నెలలు నష్టపోవాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ఈహెచ్ఎస్ రెఫరల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్కార్డుల వైద్యం ఆగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు మాత్రమే ఈఎల్ ప్రకటించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. అసంబద్ధంగా డీఏ జీవోలు కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రకటించిన ఒక్క డీఏ అంశం పై జారీచేసిన జీవోలు 60 ,61 పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్వయంగా సీఎం చేసిన డీఏ ప్రకటనకు విరుద్ధంగా జీవోలు జారీ చేయడం మోసగించడమేనని మండిపడుతున్నారు. 4 డీఏలకు గాను ఒక డీఏను ఈ నెల 18న ప్రకటించి నిరాశ పరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 60, 61 డీఏ ఉత్తర్వుల్లో ఉద్యోగులకు 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనడం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెల్లించాల్సిన 21 నెలల డీఏ బకాయిలను ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలలో, సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదుగా చెల్లిస్తామని సీఎం రాష్ట్ర నాయకుల చర్చల్లో ప్రకటించారని, అయితే అందుకు భిన్నంగా ఉత్తర్వులు విడుదల చేసి మోసగించారని చెబుతున్నారు. అసంబద్ధంగా జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేసి నూతన ఉత్తర్వులను జారీచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– ముగ్గురికి తీవ్ర గాయాలు శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెంది, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి సంగం పాల డెయిరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పెనుమూరు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి(36), ప్రసాద్(54), రమేష్(47) తన స్నేహితులతో కలిసి పళ్లిపట్టుకు ఆటోలో వెళ్తుండగా గంగాధర నెల్లూరు మండలం వేటుకురుపల్లి గ్రామానికి చెందిన ఏ.సుబ్రమణ్యం (60) కార్వేటినగరం పాదిరికుప్పంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో సంగం పాలడెయిరీ వద్ద ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు 108 వాహనం ద్వారా గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఎంసీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అక్రమార్కుల్లో దడ
అక్రమాలు బయటపడేనా ! కరువు ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తుంటే..రాష్ట్రంలో అధికారం మాదే..అడిగేదెవరు , అడ్డొచ్చేదెవరు..అంటూ పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో తమ్ముళ్లు నిధులను అడ్డంగా దోచేశారు. దీనిపై విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగుతుండడంతో అక్రమార్కుల్లో దడ మొదలైంది. సాక్షి టాస్క్ఫోర్స్ : పుంగనూరు నియోజకవర్గంలో 2024–25లో రూ.65 కోట్లు ఉపాధి కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపి నిధులు బొక్కెశారు. దీనిపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్రెడ్డి ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీభవాని హర్ష ఈనెల 15న చిత్తూరు జిల్లా పీడీ డ్వామాకు ఆదేశాలు జారీ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 28 మంది సభ్యులతో ఈనెల 21 నుంచి 23 వరకు పనుల అక్రమాలపై విచారణ చేపట్టి, నివేదికలు పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ బృందానికి సంబంధిత రికార్డులను అందించాలని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణకు రానుండడంతో ఉపాధి హామీ అధికారుల గుండెల్లో వణుకు పుడుతోంది. అధికార పార్టీకి తలొగ్గి , నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేపట్టారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని హడలి పోతున్నారు. పాత పనులకు కొత్త మెరుగులు ఉపాధి పథకంలో నియోజకవర్గంలోని ఓ ప్రధాన నాయకుడికి చెందిన రెండు మండలాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏ పంచాయతీలోనూ ఎన్నడూ ఖర్చు చేయని విధంగా ఒక్కో పంచాయతీలో ఖర్చు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. పాత పనులను కూటమి నాయకులు యంత్రాలతో కొత్త మెరుగులు దిద్ది, ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి. రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగళ్లు పంచాయతీలో గతంలో వాటర్షెడ్ పథకం కింద చేసిన పనులకు ప్రస్తుతం ఉపాధిలో పెట్టి బిల్లులు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. రొంపిచెర్ల మండలంలో 12 పంచాయతీలు ఉండగా అందులో 8 పంచాయతీల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అక్రమాలలో అందనంత ఎత్తుకు వెళ్లినట్లు సమాచారం. మండలంలోని గానుగచింతలో రూ.2.10 కోట్లు, రొంపిచెర్లలో రూ.1.62 కోట్లు, పెద్దగొట్టిగళ్లులో రూ.1.50 కోట్లు, సీహెచ్ రెడ్డిగారిపల్లిలో రూ.1.42 కోట్లు, మోటుమల్లెలో రూ.1.43 కోట్లు, చిచ్చిలివారిపల్లిలో రూ.1.29 కోట్లు, బోడిపాటివారిపల్లిలో రూ.1.20 కోట్లు , అలాగే పులిచెర్ల మండలం కావేటిగారిపల్లెలో రూ.1.54 కోట్లు, కల్లూరులో రూ.1.20 కోట్లు, సోమల మండలం నంజంపేటలో రూ.1.30 కోట్లు, కందూరులో కోటి రూపా యలు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. యంత్రాలతో పనులు ఉపాధిహామీ పథకంలో పనులు చేపట్టాలంటే ముందుగా గ్రామీణ స్థాయిలో ప్రజలు కలసి పనిని ఎంపిక చేయాలి. లేబర్ బడ్జెట్ తయారు చేసి అందుకు అనుగుణంగా రైతులు, ప్రజలకు అనుగుణంగా అర్హతను బట్టి పనులను ఎంపిక చేయాలి. ఆ పనులను సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ తీర్మానం ఆమోదించాలి. ఆ పనులను మండల పరిషత్లో ఆమోదించాలి. ఈ పనులకు ఎస్టిమేట్లు వేసి పరిపాలన అనుమతులు కలెక్టర్ ద్వారా పొందాలి. తరువాత పనులను ప్రారంభించాల్సి ఉంది. కానీ కూటమి నాయకులు వీటికి తిలోదకాలు ఇచ్చి , ఏకపక్షంగా తమకు నచ్చిన వారికి పనులు కల్పిస్తూ , ఆ పనులను కూలీలతో చేయించకుండా యంత్రాలతో చేయిస్తూ ఉపాఽధి నిధులు దోచుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను తన వారిచే చేయించుకునేందుకు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి ఎంపీడీవోలకు పలు లేఖలు రాసి తనకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకుని, పాత వారిని తొలగించారనే విమర్శలు ఉన్నాయి. -
బీర్జేపల్లెలో పిడుగు పాటు
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ, బీర్జేపల్లెలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు రెండు ఇళ్లపై పిడుగులు పడ్డాయి. దీంతో రూ.1.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడింది. ఒక్కసారిగా మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. బీర్జేపల్లె గ్రామానికి చెందిన ఎస్.చంద్ర ఇంటి ముందుగల టెంకాయ చెట్టు తోపాటు నూతనంగా నిర్మించిన ఇంటిపై పిడుగుపడింది. చంద్ర ఇంట్లో విద్యుత్ వైర్లు అన్నీ కాలిపోయాయి. అలాగే పక్కనే ఉన్న శీనప్పకు చెందిన ఇంట్లో కూడా విద్యుత్ సామగ్రి కాలిపోయింది. పిడుగుపాటు శీనప్ప షాక్ గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇంటిపై పిడుగు పాటుకు గురైన ప్రాంతం పిడుగుపాటుకు కాలిపోయిన వైర్లు -
ప్రైవేటీకరణ విరమించుకోవాలి
చిత్తూరు కార్పొరేషన్ : పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం చిత్తూరు నగరంలోని 34వ వార్డు కన్నయ్యనాయుడు కాలనీలో రచ్చబండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు ఆను ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు నియో జకవర్గ సమన్వకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరిస్తున్నామన్నా రు. సేకరించే సంతకాలను గవర్నర్, రాష్ట్రపతిలకు అందజేయనున్నట్లు తెలిపారు. అనూహ్య స్పందన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని విజయానందరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు తరలివచ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకాలు చేశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు ఆలోచనను చంద్రబాబు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయానందరెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సంతకం చేశారు. అనంతరం మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రెడ్డెప్ప, నౌషాద్, రమణ, హరిషారెడ్డి, కౌషర్, బిందురెడ్డి, మస్తాన్, యువత, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేస్తున్న యువత మాట్లాడుతున్న చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి -
గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. అలాగే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో సైతం గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. భార్య కాపురానికి రాలేదని.. యాదమరి: కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి పంచాయతీ, పావడదాసూరు గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు మునెప్ప(35) దినసరి కూలీ. కుటుంబ పోషణకు ఇతరుల నుంచి కొంత అప్పుగా తీసుకున్నాడు. అయితే వాటిని చెల్లించే క్రమంలో విఫలమవడంతో అప్పుల వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి వేధించేవారు. దీంతో అతని భార్య సౌజన్య ఆ అవమానాన్ని భరించలేక మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. తను ఎంతకీ తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన మునెప్ప ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని తల్లి చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లె వద్ద ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ సంఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు, పలమనేరు వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కారు సంక్రాంతి పల్లె వద్ద కు రాగానే ఓ ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా అడ్డు రావడంతో ఎడమవైపు పోతున్న కారు.. యాదమరి నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ట్యాంకర్ రహదారిపై బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ట్యాంకర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో అందులో ఉన్న పెట్రోల్, డీజల్ లీకై ఎక్కడ మంటలు చెలరేగుతాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న బంగారుపాళెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని ఐఓసీ సిబ్బందికి తెలియజేయడంతో వారు సంక్రాంతిపల్లె వద్దకు చేరుకున్నారు. బోల్తా పడిన ఆయిల్ ట్యాంక్ నుంచి మరో వాహనంలోకి డీజల్, పెట్రో ల్ నింపారు. రహదారిపై బోల్తా పడిన ట్యాంకర్ను క్రేన్ల సాయంతో రహదారి పక్కకు తొలగించారు. ట్యాంకర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మా రింది. ట్యాంకర్కు మంటలు చెలరేగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. -
మహిళపై దాడి
శాంతిపురం : తమ వ్యవసా య భూమిని ఆక్రమించుకున్న వారిని అడ్డగించేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని ఓ మహిళ రాళ్లబూదుగూరు పోలీసులను ఆశ్రయించింది. శనివారం జరిగిన దాడిపై బాధితురాలు ఆదివారం పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఎం.కె.పురానికి చెందిన శివమ్మ ఫిర్యాదు మేరకు వివరాలు.. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా ఆమె ఒంటరిగా గ్రామంలో ఉంటోంది. వీరికి వారసత్వ ఆస్తిగా సంక్రమించిన దానిలో 1.45 ఎకరాలను అదే గ్రామానికి చెందిన మరో కుటుంబం ఆక్రమించుకుందని తెలిపారు. దీనిపై శివమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో తన ఆస్తిని స్వాధీనం చేసుకోవటం, అనుభవించటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయినా తనను సొంత భూమిలోనికి రానివ్వకపోవటంతో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కుప్పం ఆర్డీవో, డీఎస్పీ, కడ పీవోలకు వినతి పత్రాలు సమర్పించానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తమ పొలంలో ప్రత్యర్థులు అరటి చెట్లు నాటుతున్నా రని తెలిసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వెంకటప్ప, వెంకటమ్మ, కృష్ణమూర్తి, పుష్ప తనపై దాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. దీనిపై పోలీసు అధికారులు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
నరక దారి
అధ్వాన్నంగా గ్రామీణ రహదారులు నిండ్ర : అధ్వాన్నంగా రహదారిచిత్తూరు : ఇందిరానగర్ వద్ద మురుగునీటి మధ్యే రాకపోకలు తిరుపతి..చిత్తూరు జిల్లాల్లో గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో పూర్తిగా ఛిద్రమయ్యాయి. సంక్రాంతి నాటికే రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. అడుగుకో మడుగును తలపిస్తున్న మార్గాల్లో పల్లెవాసుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలోనే ఇసుక.. గ్రావెల్ మాఫియా కారణంగా రహదారులు మరింతగా దెబ్బతిన్నాయి. అతి వేగంతో వెళుతున్న భారీ వాహనాల తాకిడికి సీసీ రోడ్లు సైతం శిథిలావస్థకు చేరాయి. అక్కడక్కడా నాణ్యతాప్రమాణాలను గాలికి వదిలి అరకొరగా మరమ్మతులు చేసిన మార్గాలు కూడా మళ్లీ ధ్వంసమయ్యాయి. ఈ మేరకు కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్లెదారులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. ఈ ఏడాది పెద్ద పండుగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు చేరుకునే వారికి చూడముచ్చటైన మార్గాలు స్వాగతం పలుకుతాయని ప్రకటనలు గుప్పించి.. దీపావళి వచ్చినా గతుకుల.. అతుకుల రోడ్లతోనే సరిపెట్టి అవస్థలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, తిరుపతి జీడీ నెల్లూరు: ఏటుకూరుపల్లిలో రోడ్డు దుస్థితి -
రికార్డుల్లోనే ఖర్చులు.. క్షేత్ర స్థాయిలో కనిపించని పనులు
జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల్లో అక్రమాలలో పుంగనూరు నియోజకవర్గం టాప్గా నిలిచింది. నియోజకవర్గంలోని మూడు మండలా లు అక్రమాలలో అగ్రస్థానంలో ఉంది. పులిచెర్ల మండలంలో మొత్తం రూ.16.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.12.13 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.94 కోట్లు , రొంపిచెర్ల మండలంలో రూ.15.01 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.13.45 కోట్లు, మెటీరియల్ కింద రూ.1.65 కోట్లు, సోమల మండలంలో రూ.10.99 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనం కింద రూ.7.32 కోట్లు, మెటీరియల్ కింద రూ.3.67 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. -
రంకెలేసిన ఉత్సాహం
వెదురుకుప్పం: ఉత్సాహం ఉరకలేసింది...కాలుదువ్వి న కోడె గిత్తలు ... జనసమూహాన్ని చీల్చుకుంటూ దూ సుకుపోయిన పోట్లగిత్తలు తమ పౌరుషాన్ని చూపా యి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని కొండకిందపల్లెలో జరిగిన జల్లికట్టు జోష్ తెచ్చింది. యువత కేరింతల మధ్య జరిగిన జల్లికట్టు దుమ్ము రేపింది. నిర్వాహకులు ముందుగా ఎడ్లకు పలకలు, వస్త్రాలతో పాటు బెలూన్లు కట్టి పందేలకు సిద్ధం చేశారు. అంతకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకున్నారు. పోట్లగిత్తలు రంకెలేస్తూ దూసుకుపోయాయి. పరుగులు తీస్తున్న ఎడ్లను కట్టడి చేసేందుకు యువకు లు ప్రయత్నించారు. ఎడ్ల వేగాన్ని నిలువరించలేక చేతులెత్తేశారు. ఉత్సాహంతో పందెంలో పాల్గొన్న యువత పరుగులు తీస్తున్న కోడెగిత్తలను కట్టడి చేసి పలకలను లాక్కొన్నారు. కొన్ని ఎడ్లు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా యువతకు చిక్కకుండా పరుగులు తీశాయి. పశువుల కిందపడి కొందరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో గ్రామం జనంతో కిక్కిరిసింది. దూసుకుపోతున్న కోడెగిత్తలు గ్రామంలో జన సందడి -
ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి
ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ పుంగనూరు: దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వారిద్దరూ విడివిడిగా మాట్లాడుతూ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలసి జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. వీరితోపాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్కుమార్ గాంఽఽధీ, ఎస్పీ తుషార్ డూడీ పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు భవిష్యత్లో ఉద్యోగాలు పొందేందుకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కచ్చితంగా అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టాలన్నారు. నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా మురళి, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా ఓబులేశు, ఆర్థిక కార్యదర్శిగా షణ్ముగం, అసోసియేట్ ప్రెసిడెంట్గా సంతానం, జిల్లా అడిషనల్ సెక్రటరీగా వినాయక, జిల్లా కన్వీనర్గా బాబు, జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, ప్రసాద్, రమేష్, నవీన్, నరేష్, సుబ్బలక్ష్మి, ప్రణీత, రజనీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. -
‘పాలారు’కు జలకళ
శాంతిపురం : ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి ఆ వరద నీటితో పాలారు నది మళ్లీ జలకళను సంతరించుకుంది. కర్ణాటకలోని బేతమంగళ డ్యాం గేట్లు ఎత్తడం, సువిశాలమైన రామసాగర చెరువు నుంచి మూడు రోజులుగా మొరవ నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో వి.కోట, రామకుప్పం మండలాల మీదుగా ప్రవహిస్తూ ఆదివారం తెల్లవారుజామున నీరు శాంతిపురం చేరాయి. ఇక్కడి నుంచి కుప్పం మండలం మీదుగా తమిళనాడుకు చేరనున్నాయి. స్థానికంగా భారీ వర్షాలు లేకపోయినా నదిలో నీటి రాకతో స్థానికులు శాంతిపురం చెక్ డ్యాం వద్దకు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఆదివారం బడుగుమాకులపల్లి వారపు సంత ఉండటం, దీని పక్కనే పాలారు నది ప్రవహించడంతో రోజంతా జనాల తాకిడి కనిపించింది. కాగా కర్ణాటక నుంచి వస్తున్న వరద నీటితో పాలారు నది ప్రవహిస్తుంటే సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాలువ ద్వారా తెచ్చిన కృష్ణా నది జలాలు ప్రవహిస్తున్నాయని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నిజంగా నీరు ఎక్కడి నుంచి వస్తోందో తెలిసిన వారు ఈ పోస్టులను చూసి నవ్వుకొంటున్నారు. -
మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో చోరీ
పూతలపట్టు(యాదమరి): ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. భాదితుల కథనం.. మండల పరిధిలోని, పి.కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో చిన్నపాపమ్మ నివాసం ఉంటోంది. తన కుమారుడైన దాము ఆర్మీలో పదవీ విరమణ చెంది తిరుపతిలోని ఓ సెక్యూరిటీ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఆమె తిరుపతిలో నివాసం ఉంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లింది. అయితే దీపావళి పండుగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన వీరికి తమ ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 60 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాలికతోనే దుండగులు రెక్కీ నిర్వహించి చొరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. -
ప్రమాదకరంగా చెరువు
చౌడేపల్లె : రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరదనీరు చేరుతోంది. దుర్గ సముద్రం పంచాయతీ పరిధిలోని బుటకపల్లె చెరువు సుమారు వంద ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ చెరువు నిండి మొరవ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువనున్న చిన్నపాటి కుంటలు, చెరువులు మొరవలు వెళ్లడంతో ఊహించని మేరకు వరద నీరు బుటకపల్లె చెరువుకు చేరుతోంది. చెరువు కట్ట మధ్యలో ఓ చోట మట్టి జారి కట్ట సగభాగం వరకు కోతకు గురై నీరు బయటకు వెళ్తోంది. మళ్లీ వర్షం కురిసినా లేదా వరద నీటి ఉదదృతి పెరిగితే కట్ట తెగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శెట్టిపేట పెద్ద చెరువుకు గండి పడింది. నీరు గండి ద్వారా బయటకు ప్రవహిస్తోంది. కట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయమైన రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వినోదం.. కావొద్దు విషాదం!
పలమనేరు : సరదాగా స్నేహితులతో కలిసి కొంతమంది ప్రకృతి అందాలను వీక్షించి పరవశిస్తుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోష సాగరంలో మునిగి తేలుతుంటారు. సెలయేళ్లు, జలపాతాలు, వాటర్ ఫాల్స్ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సెల్ఫీలు దిగుతూ.. ఫొటోలు తీసుకుంటూ సంబరపడి పోతుంటారు. ఇలాంటి సందర్భంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మొదలే వర్షాలు.. ఆపై రీల్స్.. సెల్ఫీల మోజులో పడి కన్నీళ్లు తెప్పించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కన్నీటి ‘జలపాతం’! నియోజకవర్గంలోని పలు వాటర్ఫాల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ సుడిగుండాలు పలువురిని బలితీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల, యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాలతో కై గల్ దుముకురాళ్ల, కళ్యాణరేవులు, గంగన్న శిరస్సు, వైఎస్ఆర్ జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. సుడిగుండాలతో ప్రమాదకరంగా మారిపోయాయి. ముఖ్యంగా కళ్యాణిరేవులు, కై గల్ వాటర్ఫాల్స్లోని మృత్యులోయ ఇప్పటికే పలువురిని పొట్టనబెట్టుకుంది. ఇక్కడి సుడిగుండం కారణంగా నీటిలోకి దిగితే మళ్లీ పైకి రావడం సులభం కాదు. ఏడేళ్లలో 14 మంది మృతి గత ఏడేళ్లలో పలమనేరు నియోజకవర్గంలోని కై గల్, కళ్యాణిరేవులు, గంగనశిరస్సు, వైఎస్సార్ జలాశయం, వీకోట మండలంలోని గిడుగు జలపాతాల్లో 14 మంది దకా నీళ్లల్లో మునిగి మృతి చెందారు. సంబంధిత జలపాతాల్లో సుడిగుండాలు, నదిలోపలి పరిస్థితులు తదితరాలు గురించి అవగాహన లేకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యువత సెలవుల్లో సరదాగా గడిపేందుకు అడవిలోని కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడున్న ఫాల్స్లో దూకడం కూడా ప్రమాదాలకు కారణమే. -
యూ‘మిస్’
పలమనేరు: మండలంలోని కళ్యాణిరేవులు జలపాతంలో రీల్స్ మోజులో దూకి నీటమునిగిన పట్టణ వాసి యూనిస్(25) మృతదేహాన్ని పలమనేరు ఫైర్ సిబ్బంది శనివారం వెలికితీశారు. మూడు రోజుల క్రితం యూనిస్ స్నేహితులతో కలిసి జలపాతం వద్ద సెల్ఫోన్లో వీడియోలు తీసుకుంటూ భారీగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్లోకి దూకి ఆపై కనిపించకుండా పోయాడు. తమిళనాడుకు చెందిన పది మంది గజ ఈతగాళ్లు సైతం మృతదేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తుదకు శనివారం మధ్యాహ్నం ఘటన జరిగిన ప్రాంతం నుంచి ముందుకు కిలోమీటర్ దూరంలో సుడిగుండంలో చిక్కుకుని రాతిబండలకిందనున్న యూనిస్ మృతదేహం పైకి తేలింది. డ్రోన్ ద్వారా నదిపై గమనించగా ఈ విషయం కనిపించింది. ఆ ప్రాంతంలోకి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆపై స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. కాగా మృతదేహం కోసం స్థానిక ఫైర్ సిబ్బంది పడిన కష్టాన్ని పట్టణవాసులు అభినందించారు. -
చోరికి పాల్పడ్డ ముద్దాయి అరెస్టు
కుప్పం: రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లి గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో చోరబడి చోరీకి పాల్పడ్డ ముద్దాయిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం, అంబూరు సమీపంలోని ఉదఎందిరం గ్రామానికి చెందిన రాజేంద్ర కుమారుడు గోడ్విన్ మోసెస్ రాజేంద్రణ్ అలియాస్ కడిష్ రామకుప్పం, వి.కోట ప్రాంతాల్లో సంచరిస్తూ దోంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో వారం క్రితం చెల్దిగానిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి 95 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీంతో పాటు గతంలో వి కోటలో జరిగిన దొంగతనం కేసులోనూ కడిష్ ముద్దాయిగా ఉన్నాడు. ఇతని వద్ద నుంచి 123.3 గ్రాముల బంగారు నగలు, కత్తి, రాడ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై తమిళనాడులో ఇప్పటి వరుకు 30 కేసులు ఉన్నాయన్నారు. డీఎస్పీ వెంట సీఐ మల్లేష్యాదవ్, ఎస్ఐలు వెంకటమోహన్, నరేష్, శ్రీనివాసులు ఉన్నారు. -
సార్ చెప్పారు.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు!
చిత్తూరు కలెక్టరేట్ : దీపావళి రోజున టపాసులు కాల్చడం సంప్రదాయం. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరులో తాత్కాలిక టపాసుల దుకాణాలు వెలిశాయి. వీటికి అనుమతులు పొందే సమయంలో ముడుపులతో పాటు అగ్నిమాపక, రెవెన్యూ, మరికొన్ని శాఖలకు గిఫ్ట్ బాక్సుల టపాసులు ఉచితంగా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలా ఇవ్వని దుకాణాలకు వచ్చే పండుగకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదంటూ భయపెడుతున్నాడు. ఒక్కొక్క శాఖకు 50 నుంచి 200 వరకు గిఫ్ట్ బాక్సులు ఇవ్వాల్సి వస్తోందని, వారితో పాటు ప్రజాప్రతినిధులకు అదనంగా మరికొన్ని ఇవ్వాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఖరీదైన వెలుగుల పండుగ జిల్లాలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర శాఖలకు ఎప్పటిలాగే ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాపారం మూడు రోజులు మాత్రమే ఉంటుందని, అది కూడా వర్షం కురిస్తే ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క దుకాణం నుంచి రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని, ఈ ఖర్చులు మొత్తం చివరికి వినియోదారులపైనే నెడుతున్నామని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే ముడుపులను పూడ్చుకునేందుకు అదనపు రేట్లను పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారు. అందరికీ చెల్లింపులు ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36 వరకు టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణం నుంచి రెవెన్యూ, అగ్నిమాపక, నగరపాలక శాఖలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు లైసెన్సులు పొందిన వ్యాపారులు నష్టాలను భరించలేక తమ అనుమతులను తాత్కాలికంగా మరొకరికి రూ.30వేల నుంచి రూ.40 వేలకు విక్రయించినట్టు సమాచారం. ధరలపై పర్యవేక్షణ కరువు తాత్కాలిక దుకాణాల్లో అధిక ధరలకు టపాసులు విక్రయిస్తుంటే పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. నియంత్రించాల్సిన పలు శాఖల అధికారులు తమ జేబులు నింపుకుని.. గిఫ్ట్ బాక్సులు తీసుకుని పట్టించుకోకుండా ఉండిపోతున్నారనే విమర్శలున్నాయి.టపాసుల ధరలపై వినియోగదారులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని అధిక ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రామ్నగర్ కాలనీకి చెందిన అమర్ అనే నిరుద్యోగి తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. ఈ దీనికోసం బ్యాంకులో రుణం తీసుకుని రూ.20 లక్షల వరకు వెచ్చించాడు. అగ్నిమాపక, రెవెన్యూ శాఖల్లో అనుమతులు పొందే సమయంలో లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, అంతటితో ఆగకుండా టపాసుల గిఫ్ట్ బాక్సులు అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు ఒక్కొక్కరూ వచ్చి సార్ చెప్పారు.. 30 గిఫ్ట్ బాక్సులు ఇవ్వు.. అంటూ భయాందోళన సృష్టిస్తున్నారని వాపోతున్నాడు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు సైతం గిఫ్ట్ బాక్సులు తమ ఇళ్లకు పంపాలంటున్నారని, ఇంత మందికి ఇచ్చుకుంటూ వెళితే అసలు కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నాడు. చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అరుణ్ తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. అనుమతులు ఇచ్చిన శాఖలకు మామూళ్లతో పాటు 50 నుంచి 100 వరకు టపాసుల గిఫ్ట్ బాక్సులు పంపాల్సి వస్తోందని చెబుతున్నాడు. ఇవ్వకపోతే మరోసారి అనుమతులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నాడు. తెచ్చిన స్టాక్లో అధిక శాతం ఉచితంగా పలు శాఖల అధికారులకు ఇవ్వడం వల్ల ఆ నష్టాన్ని సంపాదించేందుకు రేట్లు పెంచి అమ్ముకోవాల్సి వస్తోందంటున్నాడు. ఎవ్వరికీ ఉచితంగా టపాసుల బాక్సులు ఇవ్వకపోతే తక్కువ రేట్లకే విక్రయించొచ్చని కుండబద్ధలు కొడుతున్నాడు. అధికారులకు పందారం.. ప్రజలపై పెను భారం -
బైక్ను ఢీకొట్టిన కారు
శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో శాంతిపురంలోని పాలారు వంతెన వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వడ్డెర వెంకట్రామప్ప, సత్యప్పలు చికెన్ షాపుల ఎదుట ఉన్న ఇనుప సామాన్ల కొలిమిలో తమ పని ముగించుకుని బైకుపై వెనుదిరిగారు. వెనుక నుంచి వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టడంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రామప్ప(57) అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు ఉన్న సత్యప్ప(59) తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా సత్యప్పను కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సమీపంలో వదిలేసి, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఈ కారులో మద్యం బాటిళ్లను గుర్తించిన కెనమాకులపల్లి వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నిరసనకారులతో ఆందోళన విరమింపజేశారు. -
సీ్త్రలను అగౌరవపరిచే పార్టీ టీడీపీ
● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్వేటినగరం : సీ్త్రలను అవమానించే పార్టీ టీడీపీ అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశమన్నారు. భారతీయ సీ్త్రలు చీర, బొట్టు ధరించడం సంప్రదాయమన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బహిరంగ సభలో తన కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిని సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యకరమైన తీరిలో చీర, బొట్టు, నగలు గురించి అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు. కల్తీ మద్యం గురించి కృపాలక్ష్మి నిరసన తెలియజేస్తే పరుష పదజాలంతో మాట్లాడం సమంజసమేనా....? అని ప్రశ్నించారు. ‘నీకు జన్మనిచ్చింది కూడా మాతృమూర్తే’ అనే విషయాన్ని మరిచి వ్యంగంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అవినీతి, భూకబ్జా చేశానని ఆరోపించడం కాదు.. నిరూపించాలని సవాల్ విసిరారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. పచ్చనపల్లిలో పిడిగుల వాన చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, పచ్చనపల్లి ప్రాంతంలో శనివారం వేకువజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ తరుణంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. దాని ధాటికి చెట్టు రెండుగా చీలింది. ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని లేదు. మూడు రోజుల కిత్రమే అనంతాపురం గ్రామంలో ఓ విద్యార్థి పిడుగుపాటుకు మృతి చెందాడు. చెట్ల కింద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని మండల అధికారులు సూచించారు. -
వైద్య విద్యను కాపాడుకుందాం!
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా? గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘సూపర్గా’ మోసం! సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోటి సంతకాలతో అడ్డుకుందాం మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి షాపు నుంచి ఇవ్వాల్సిందే!
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలిక టపాసుల దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతులిచ్చారు. ఈ అనుమతులతో వారం రోజుల పాటు టపాసులు విక్రయించొచ్చు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36, నగరి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 140 మొత్తం 176 తాత్కాలిక షాపులకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులిచ్చారు. వీటితోపాటు జిల్లాలో పర్మినెంట్ లైసెన్స్లు కలిగిన టపాసుల షాపులు 17 ఉన్నాయి. ఈ ఏడాది అనుమతులిచ్చిన ఆయా శాఖల అధికారులకు ప్రతి షాపు నిర్వాహకుడు కచ్చితంగా గిఫ్ట్ బాక్సులు ఇచ్చుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గర్జించిన కలం!
కలం గర్జించింది. వేధింపులపై గళం విప్పింది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించింది. తప్పులెత్తి చూపితే సరిదిద్దు కోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని హెచ్చరించింది. సాక్షి మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికింది. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. పలమనేరు/కుప్పం: ప్రజాసామ్యంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం తగదని మేధావులు, ప్రజాసంఽఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలా కేసుల సంస్క్రృతి లేదని మండిపడ్డారు. కొన్ని రోజులుగా సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను ఎండగట్టారు. ఇలాంటివి ప్రమాదకరమని, వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. పలువురు జర్నలిస్ట్లు నిరసనలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సాక్షిపై అక్రమ కేసులు అప్రజాస్వామికం సాక్షి పత్రిక, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు అప్రజాస్వామికమని కుప్పం పాత్రికేయుల బృదం స్పష్టం చేసింది. శనివారం కుప్పంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంపై వరుసుగా సాక్షి ప్రతికలో వస్తున్న కథనాలు చూసి జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారీ దారులను వదిలి మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’పై కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం, నోటీసులు ఇవ్వడం, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. కుప్పం విలేకర్లు వెంకటాచలం, హరినాథ్, సుబ్రమణ్యం, నాదముని, నాగరాజు, గణేష్, చలపతి తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా? పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు తగదని పలమనేరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి విలేకరులు, ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వేధింపులకు నిరసనగా స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ ఏవో కుమారస్వామికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత్రికేయులపై కేసులు పెట్టడం ప్రజాసామ్యంలో ఎక్కడా లేదన్నారు. జర్నలిస్టులు రమేష్, మణి, ఆది, మునిరత్నం, దిలీప్, వేణు, అశోక్, మురళి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.మీడియాపై కేసులా..? ప్రజాసామ్యంలో నాలుగో స్తంభంలా పనిచేసే మీడియాపై కేసులు, విలేకరుల నోరునొక్కడం, పత్రికా కార్యాలయాలపై దాడులు మంచిది కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం మీడియా నోరుకొక్కే ప్రయత్నాలు సాగుతు న్నాయి. పోలీసులు సైతం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. – అబ్దుల్ సుభాన్, సౌత్ఇండియా మీడియాసెల్ సెక్రటరీ -
ఆగని దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. శనివారం తెల్లవారు జామున మండలంలోని పాతపేట, పూరేడువారిపల్లె చిట్టారెడ్డిపేట, పాళెం, కోటపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను నాశనం చేశాయి. పూరేడు వారిపల్లె వద్ద వరి పంటను తొక్కిపడేశాయి. అలాగే మామిడి కొమ్మలను విరిచేశాయి. దాదాపు ఏడు ఏనుగులు పంటలపై పడి సర్వనాశనం చేశాయి. చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి కుప్పంరూరల్: చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం మండలం, డి.కె.పల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. కుప్పం సీఐ శంకరయ్య మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి చెరువులో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారని తెలిపారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మెరూన్ కలర్పై తెల్లటి చారల షర్టు ధరించి, బట్ట తల కలిగి ఉన్నాడని, ఎవరైన ఇలాంటి ఆనవాళ్లు కలిగిన వ్యక్తి కనబడక పోయి ఉంటే కుప్పం పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేడు జిల్లా కార్యవర్గ సమావేశం చిత్తూరు కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ తదితర సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు. -
సార్ చెప్పారు.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు!
‘సార్ చెప్పార్.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు.. లేకుంటే నెక్ట్స్ ఇయర్ నీకు లైసెన్స్ రాదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించేశారు. పెత్తనాన్ని చేతిలోకి తీసుకుని పేట్రేగిపోతున్నారు. వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. పట్టపగలే యంత్రాలతో పనులు చేస్తూ కూలీల కడుపు కొడుతున్నారు. దొంగ మస్టర్లు సృష్టించి జేబులు నింపుకుంటున్నారు. అధికారులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. మూగజీవుల సంరక్షణ, వృద్ధి కోసం ప్రవేశపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణ పనులూ తమవారికే కట్టబెట్టేశారు. వాటిపైనే ఆధారపడ్డ పేద కుటుంబాలను వీధిన పడేశారు. తమ్ముళ్ల తీరు చూసి నియోజకవర్గ ప్రజలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీల ద్వారా చేయాల్సిన పనులను పట్టపగలే యథేచ్ఛగా జేసీబీలు, హిటాచీలతో చేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లతో తరలించి బిల్లులు చేసుకంటున్నారు. కూలీలే పనిచేసినట్లు తప్పుడు మస్టర్లు సృష్టిస్తున్నారు. అధికారులను బెదిరించి కూలీల ఖాతాలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఆపై వారి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు గతంలో చేసిన పనులకు మెరుగులద్ది ఆ పనులకే మళ్లీ బిల్లులు చేసుకుంటున్నారు. పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్న సిబ్బంది తమకు అనుకూలంగా లేరని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తున్నారు. తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు. పశువుల సంరక్షణ కోసం మంజూరు చేసిన గోకులాలు సైతం తమ్ముళ్లు వశం చేసుకున్నారు. గోవులు లేకపోయినా గోకులాల పేరిట దోచుకు తింటున్నారు. నియోజకవర్గంలో ఉపాధి ఖర్చు రూ.65.07 కోట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి నిధులు రూ.65.07 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాల ద్వారా రూ.47.65 కోట్లు, మెటీరియల్ కంపోన్మెంట్ ద్వారా రూ.17.42 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలో మొత్తం 19,113 పనులు చేసినట్లు రికార్డులు సిద్ధం చేశారు. యంత్రం..ఇదిగో సాక్ష్యం గోకులం.. తమ్ముళ్లకే అగ్రతాంబూళం పుంగనూరు మండలం, చదళ్లలో జేసీబీలతో చేసి, ట్రాక్టర్లతో మట్టిని అన్లోడ్ చేసిన తమ్ముళ్లు పుంగనూరు నియోజకవర్గంలో కూలీలు చేయాల్సిన పనులను కూటమి నేతలు యంత్రాలతో చేసి, కూలీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. పుంగనూరు మండలం, కుమ్మరనత్తం పంచాయతీ చెరువులో ఫారంపాండ్ను జేసీబీతోనే చేశారు. చదళ్ల చెరువులో చేపల కుంట, క్యాటిల్ఫామ్ను యంత్రాలతోనే చేశారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో యంత్రాలతో పనులు చేసి కూలీల కడుపు కొడుతున్నారు. రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, చౌడేపల్లె, సదుం మండలాల్లో 90 శాతం మేరకు ఉపాధి పనులు జేసీబీలతోనే చేశారు. ఆ తర్వాత వాటిని కూలీలు చేసినట్టు రికార్డులు సృష్టించి జేబులు నింపుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. పశు సంపద వృద్ధి, సంరక్షించాలనే ధ్యేయంతో అమలు చేస్తున్న గోకులం షెడ్లు తమ్ముళ్ల పరమయ్యాయి. పశువులు ఉన్న రైతులను గుర్తించి, వాటి సంఖ్య ఆధారంగా షెడ్లను గ్రేడ్ల వారీగా మంజూరు చేయాల్సి ఉంది. కానీ పుంగనూరు నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించారు. కేవలం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే గోకులం షెడ్లు అప్పగించారు. కొందరు పాత గోకులాలకు సైతం మెరుగులు దిద్ది బిల్లులు చేసి స్వాహా చేశారు. ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు -
కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం
శాంతిపురం : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కెఆర్జే భరత్ తెలిపారు. మండలంలోని ఏడవమైలు వద్ద శుక్రవారం మొరసనపల్లి, కడపల్లి, కర్లగట్ట, తుమ్మిశి, అబకలదొడ్డి, నడింపల్లి పంచాయతీల పార్టీ కమిటీలు ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో క్యాడర్కు జరిగిన నష్టాన్ని గుర్తించిన అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇకపై వారికి తగిన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీల్లో కోవర్టులు, అవకాశవాదులకు చోటు లేకుండా యువత, సోషల్ మీడియా సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు. పంచాయతీల వారిగా క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అధినేతతో కలిసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అధికారం వుండగా పార్టీలోకి వచ్చిన అవకాశవాదులు ఇప్పుడు పార్టీని వీడారని భరత్ చెప్పారు. వారి వల్లే కుప్పంలో పార్టీ 75 వేల ఓట్లకు పరిమితమైనట్టు తెలిపారు. అన్యాయం జరిగిన వారు, రాజకీయ వేధింపులకు గురయ్యే వారు డిజిటల్ బుక్ నమోదు చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, పార్టీ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఏవీ జయరాం, జగదీష్, ఆర్ముగం, విజయకుమార్, పట్టాభి, గజ్జల రమేష్, ప్రభాకర్రెడ్డి, నగేష్, వీరబద్రప్ప తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కమిటీల అధ్యక్షులు వీరే: మొరనపల్లి పంచాయతీ పార్టీ అధ్యక్షుడుగా జానకీరాం, గౌరవాధ్యక్షులుగా కాంతారావ్, కొండన్న వెంకటేష్, అబకలదొడ్డి పంచాయతీ అధ్యక్షుడుగా వీరప్ప, గౌరవాధ్యక్షులుగా పి.మణి, ఆదినారాయణ, కడపల్లి పార్టీ అధ్యక్షుడుగా ఎం.మురుగేష్, గౌరవాధ్యక్షులుగా వెంకటస్వామి, వెంకటేష్, తుమ్మిశి పార్టీ అధ్యక్షుడుగా చంగమరాజు, గౌరవాధ్యక్షులుగా టిపి భాస్కర్, ఎండి బాబు, నడింపల్లి పార్టీ అధ్యక్షుడుగా పిఎం రమేష్, గౌరవాధ్యక్షులుగా కృష్ణప్ప, మునివెంకటప్పలతో పాటు ఆయా పంచాయతీ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను ఎన్నుకున్నారు. -
22న జాబ్మేళా
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులతో కలిసి శుక్రవారం జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న సూళ్లూరుపేట సత్యసాయి కల్యాణ మండపంలో జాబ్ మేళా ఉందని చెప్పారు. తమతో పాటు పలువురు అధికారులు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 21 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదువుకున్న యువతి యువకులు అర్హులుగా పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9121646661, 9985056929, 9988853335 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాధం, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ భరత్కుమార్రెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ ప్రభావతి, జిల్లా ప్లేస్ మెంట్ అధికారి గణేష్ పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల అభివృద్ధే లక్ష్యం
చిత్తూరు రూరల్(కాణిపాకం): క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ మిషన్ సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ విద్యాశంకర్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, రైతులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు పంటలను సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులిచ్చామన్నారు. 20 శాతం వాటా భరిస్తే...20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, అరటి, టమాట, మిరప తదితర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాజరైన అధికారులు, రైతులు మాట్లాడుతున్న రాష్ట్ర కో–ఆర్డినేటర్ -
ఇంకా కనిపించని యువకుడి జాడ
పలమనేరు: మండలంలోని కళ్యాణి వాటర్ పాల్స్ ప్రవాహంలో గురువారం గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది రెండో రోజు శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పలమనేరు పట్టణానికి చెందిన ఫయాజ్ పెద్ద కుమారుడు యూసఫ్(25) చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్యాణి వాటర్పాల్స్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని చూసేందుకు పదిమంది స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లారు. యూసఫ్ నీటిలో దూకాడు. పైనున్న స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేస్తున్నారు. యూసఫ్ నిమిషం వ్యవధిలోనే కనిపించకుండాపోయాడు. స్నేహితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని వెతికినా కనిపించలేదు. గురువారం చీకటి పడడంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. వాటర్పాల్స్ కొండల నుడుమ ఉండడం, నీరు ఇక్కడి నుంచి తమిళనాడులోని మోర్ధానా ప్రాజెక్టుకు నీరు చేరుతుండడంతో మృతదేహం ఎక్కడైనా రాళ్లకు, చెట్లకు చిక్కుకుని వుండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
పాలసముద్రం: మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన అడ్వొకేట్ గాంధీ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చిత్తూరు కోర్టు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు 7 గంటలకు గుండె నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి న్యాయవాదులు చిత్తూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కు టుంబ కలహాలతో గురు వారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునె య్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మా.. నాన్నా ఇక సెలవు.. మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పైళ్లెనప్పటి నుంచి భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చింది. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు గుర్తించారు. -
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,77,02,032ల ఆదాయం వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 510 కిలోలు లభించింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,845, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.20,699 వచ్చింది. యూఎస్ఏవి 139 డాలర్లు, సింగపూర్వి 2 డాలర్స్, మలేషియావి 11 రింగిట్స్, యూఏఈ 25 దిర్హామ్స్, కెనడా 110 డాలర్లు, ఆస్ట్రేలియావి 110 డాలర్స్, యూరోవి 10 యూరోలు వచ్చాయి. డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
దళితుల సమస్యలకు సత్వర పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : దళితుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సమస్యలను గుర్తించి నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బందిపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారించేందుకు చిత్తూరు ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. రెండు రోజుల్లో విచారణ నివేదికలు అందిన వెంటనే చర్యలు చేపడుతామన్నారు. జిల్లాలో 60 వేల మంది గిరిజనులు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉండేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలలో గిరిజనుల సమస్యలపై సర్వే నిర్వహించామన్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. జిల్లాలోని ఎస్సీ కాలనీలలో శ్మశానవాటికల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తామన్నారు. జెడ్పీ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. సభ్యుల ఆమోదంతో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం పక్కనే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులలో 28 విచారణ చేసి 42 మంది బాధితులకు రూ.37,50,000 చెల్లించినట్టు తెలిపారు. సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవోలు శ్రీనివాసులు, భవాణి, అనుపమ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్కుమార్రెడ్డి, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్, రాజ్కుమార్, వరలక్ష్మి, జీవీరమణ, శేషాద్రి, మునస్వామి, రఘురాం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీపాల్గొన్న కమిటీ సభ్యులు, అధికారులు, పోలీసులు -
కలంపై కక్ష
తిరుపతి అర్బన్ : ‘సీఎం చంద్రబాబు జర్నలిస్టులతో రాజకీయం చేయ డం మంచి పద్ధతి కాదు.. రాష్ట్ర చరిత్రలో ఓ వార్త ప్రచురించారని ఏకంగా ఎడిటర్పై కేసు పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు’ అంటూ తిరుపతి పాత్రికేయులు కూటమి సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సాక్షి కార్యాలయానికి పోలీసులు వెళ్లడం.. ఎడిటర్ ధనంజయరెడ్డిని ప్రశ్నించడంపై వారు మండిపడ్డారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా తిరుపతిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి సమాజంలో జరుగుతున్న మంచితో పాటు చెడును తెలియజేయడం ద్వారా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పత్రికలు పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉందని మండిపడ్డారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి జర్నలిస్టులు భజన చేయాలని భావించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తిరుపతి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆర్.మురళి, కార్యదర్శి పి.బాలచంద్ర, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.గిరిబాబు, ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు మబ్బు నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు నగేష్, విజయయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బిగిసిన పిడికిళ్లు!
ఉరిమిన కళ్లు.. ప్రశ్నించే కలానికి సంకెళ్లా? ‘ప్రజల గొంతుకగా నిలిచే పత్రికా రంగాన్ని అణగదొక్కాలనుకోవడం అవివేకం. ఒక పత్రికపైనే కక్ష సాధింపులకు పాల్పడి వేధింపులకు దిగడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. నిరంకుశత్వానికి పరాకాష్ట. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ‘సాక్షి’పై వేధింపులు.. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలి. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం. న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నిరసనలు మిన్నంటించారు. ‘సాక్షి’పై కక్షగట్టడమేంటని ప్రశ్నించారు. తప్పొప్పులు జరిగితే ఖండించాల్సింది పోయి.. విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడం భావ్యం కాదన్నారు. పోలీసుల తీరును ఎండగట్టారు. చిత్తూరు అర్బన్ : వ్యవస్థలో లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడమేనని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత్రికేయులపై కేసులు పెట్టడం దారుణమని ఎండగట్టారు. ప్రజాస్వామ్యమా.. నిరంకుశమా..? అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్ఓ మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
పార్టీ బలోపేతంలో గ్రామ కమిటీలు కీలకం
సదుం: పార్టీని బలోపేతం చేయడంలో గ్రామ కమిటీ సభ్యులు కీలకంగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మండలంలోని అమ్మగారిపల్లెలో పర్యటించారు. ఇటీవల నూతనంగా ఎంపికై నా పార్టీ గ్రామ కమిటీల విధి నిర్వహణపై నాయకులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు కీలకంగా పనిచేసేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అనంతరం రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, నారాయణ రెడ్డి, రమేష్రెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, పురుషోత్తంరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీకు చేతనైంది చేసుకోండి
సాక్షి టాస్క్ఫోర్స్: మద్యం షాపును టెండర్లో దక్కించుకున్న లైసెన్సుదారునిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. పూతలపట్టు పోలీసు స్టేషన్లో వారం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో అసలు పూతలపట్టులో ఏం జరుగుతుందో తెలియక అటు పాలకులు, ఇటు ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఒక లైసెన్సు దారునిపై ఇంత కేవలంగా మాట్లాడుతారా? మండలంలో మిగిలిన మద్యం షాపుల యజమానులు మాత్రం బెల్టు షాపులకు మద్యం సరఫరా చెయ్యొచ్చు. వాళ్లను మాత్రం వదిలేయొచ్చు. మా షాపు నుంచి బెల్టు షాపులకు పంపిస్తే మాత్రం దాడులకు తెగబడుతున్నారు. ఇదెక్కడి న్యాయం.. ప్రతి నెలా మీరు మా నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు కదా. ఇదెక్కడి న్యాయం సార్. సమన్యాయం పాటించండి. కావాలనే మాపై నాలుగు సార్లు దాడులు చేశారు. మిగిలిన వాటిపై ఎందుకు చెయ్యడం లేదు. ఒక పోలీసుగా మీరు న్యాయం చేయాలి. మీరు చెప్పినట్లుగానే మేము చేస్తు న్నాం కదా. కానీ మాపై ఇలా కక్ష కట్టడం భాగాలేదు సార్. ఈ విషయంపై మీతో మాట్లాడాలని స్టేషన్కు వస్తే బయటకి పోరా అని అంటారా?. పోలీసు స్టేసన్ ఉన్నది మా సమస్యలు చెప్పుకుని వాటిని పరిష్కరిస్తారని. కానీ మీరేం చేస్తున్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తారా. ఈ విషయంపై ఐజీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం’.. అని రంగంపేట క్రాస్లో ఉన్నటువంటి ఓ మద్యం షాపు యజమాని పూతలపట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు మీకు చేతనయ్యింది చేసుకోండి.. మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని వారిని బెదిరించాడు. ఈ ఉదంతంపై ఇప్పుడు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారింది. మండలంలో మునుపెన్నడూ లేని కొత్త సంప్రదాయానికి తెర లేవడంతో సంచలన ఘటనలకు పూతలపట్టు అడ్డాగా మారింది. సామాన్య ప్రజల్లో సైతం భయాందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
నాణ్యమైన మద్యాన్ని గుర్తించండి
చిత్తూరు అర్బన్: కల్తీ లేనటువంటి నాణ్యమైన్య మద్యాన్ని మొబైల్ యాప్ ద్వారానే గుర్తించవచ్చని జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ అన్నారు. శుక్రవారం చిత్తూరులోని మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ సురక్ష యాప్ పనితీరును మద్యం ప్రియులకు వివరించారు. మొబైల్ యాప్లో ఎకై ్సజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్ వద్ద ఉన్న స్కాన్ చేస్తే నాణ్యమైన మద్యం వివరాల మొత్తం మొబైల్లోనే చూపిస్తుందన్నారు. ఇలాంటి వివరాలు రాకపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాస్, అర్బన్ సీఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఈనెల 20న దీపావళి ఆస్థానం నేపథ్యంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
మహిళలను కించపరచడమా..సిగ్గు సిగ్గు
– ఎమ్మెల్యే థామస్పై చర్యలు తీసుకోండి కార్వేటినగరం : సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళలతో వెళ్లి కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు ఆత్మగౌరవం, మహిళలే మాకు ఆరాధ్య దైవం అని గొప్పలు చెప్పుకునే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక మహిళ అయిన తనను పబ్లిక్లో కట్టూబొట్టు, వస్త్రధారణ పై అవహేళన చేస్తూ అవమానించడం బాధాకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించక, మహిళలు ధరించే చీర, బొట్టు, నగలపై ఎమ్మెల్యే థామస్ అవహేళన చేస్తూ మాట్లాడడం దారుణమన్నారు. తన తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపైన, తనపైన అనుచితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హోదా రావాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు శేఖర్రాజు, మణి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రాధికరెడ్డి, జెడ్పీటీసీలు సుకుమార్, అన్బులగన్, సర్పంచ్ ధనుంజయవర్మ, నాయకులు వెంకటరత్నం, ధనశేఖర్యాదవ్, తౌకిర్ఖాన్, మహిళ నాయకురాలు మోహనకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై కినుక !
● గత ప్రభుత్వంలో ఎక్కడ ఆగాయో అక్కడే పనులు ● అసంపూర్తి ప్రాజెక్టు పనులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 200 వందల ఎంసీఎఫ్టీ నీటిని ఒడిసిపట్టలేని వైనం ● ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీ విస్మరించిన చంద్రబాబు ● గత ఎన్నికల హామీ గాలికొదిలేసిన ప్రభుత్వం వర్షం నీరు సముద్రంపాలు వెంగంవారిపల్లి అడవిలో ప్రవహిస్తున్న నది పలమనేరు : జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరులో సాగు, తాగునీటికి బోర్లపైన ఆధార పడాల్సిందే. వర్షాలు కురిసినప్పుడు చిన్న నదులు ప్రవహిస్తుంటాయి. అయితే ఆ నీటిని వడిసిపట్టే ప్రయత్నాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కౌండిన్య నదిపై కాలువపల్లి వద్ద వైఎస్ఆర్ హయాంలో జలాశయాన్ని నిర్మించారు. ఆపై వచ్చిన కిరణ్ కుమార్రెడ్డి, చంద్రబాబు సర్కార్ మిగిలిన ప్రాజెక్టుల విషయాన్ని గాలికొదిలేశాయి. గత ఎన్నికల్లో పలమనేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సైతం కూటమి అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాని ప్రాజెక్టుల పరిస్థితి నేటికీ ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది. పలమనేరు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఇక్కడి నదులు ప్రవహించినప్పుడల్లా నీరు వృథాగా పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని మోర్థానా ప్రాజెక్టుకు చేరుతోంది. దీన్ని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు రంగం సిద్ధం చేసింది. అయితే అప్పట్లో కోవిడ్, తదుపరి ఎన్నికల కారణంగా ఈ పనులు వివిధ ధశల్లో ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమైనట్టే. 3 ప్రాజెక్టుల నిర్మాణాలకు గత ప్రభుత్వంలో చర్యలు ప్రాజెక్టుల నిర్మాణంపై గత ప్రభుత్వంలో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిపై రూ.22 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. దీనికి భూసేకరణకు అవసరమైన చెల్లింపులు జరిగి టెండర్ల ప్రకియలో పనులు ఆగాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు రూ.46.82 కోట్ల అంచనాలను గతంలోనే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. పలమనేరు మండలంలోని గంగన్నశిరస్సు ప్రాజెక్టు పనులు గతంలో మొదలై అర్థంతరంగా ఆగాయి. అయితే దీనిపై స్థానిక ఇరిగేషన్శాఖ రూ.27.37 కోట్ల కొత్త అంచనాలతో పబ్లిక్హెల్త్ శాఖకు పంపింది. అయితే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతున్నందున ప్రాజెక్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇక బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి నది విషయం కనీసం ఇరిగేషన్ శాఖకు కూడా తెలియదు. మొత్తం మీద ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే గంగనశిరస్సు ప్రాజెక్టులో 55 ఎంసీఎఫ్టీ, కై గల్ రిజర్వాయర్ ద్వారా 45.27 టీఎంసీ, దుర్గమ్మ ఏరు ప్రాజెక్టు ద్వారా 56 , వెంగంవారిపల్లి 40 ఎంసీఎఫ్టీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 200 ఎంసీఎఫ్టీ దాకా నీటిని ఒడిసిపట్టినట్టే. దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. కూటమి హామీ ఇచ్చింది.. వదిలేసింది.. గత ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సైతం ఈ ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వీటి గురించి పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పను లు ఎక్కడ ఆగాయో ఇప్పటికే అక్కడే ఉన్నాయి. జోరుగా ప్రవహిస్తున్న కౌండిన్య నది వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రవహిస్తున్న దృశ్యం పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కై గల్, దుర్గమ్మఏరు, వెంగంవారిపల్లి నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదుల ప్రవహించినప్పుడు 150 నుంచి 200 ఎంసీఎఫ్టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని మోర్థనా ప్రాజెక్టుకు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తోంది. అయితే కౌండిన్య నదిపై రూ.55 కోట్ల వ్యయంతో పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రిజర్వాయర్ను నిర్మించారు. దీంతో 50 ఎంసీఎఫ్టీల నీటిని ఇక్కడ నిలుబెట్టుకోగలిగాం. ప్రస్తుతం నదులకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిలో ప్రస్తుతం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు కౌండిన్య నదిలో చేరి తమిళనాడులోని మోర్ధనా డ్యామ్కు వృథాగా వెళుతున్నాయి. అదే విధంగా పలమనేరు మండలంలోని ఎరగినేరి నది నీళ్లు సైతం తమిళనాడుకు చేరుతున్నాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏటి నీరు తమిళనాడుకే ఉపయోగపడుతున్నాయి. బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి అడవి లోని మరో నది ఇలా ఈ ప్రాంతంలోని అన్ని నదుల నుంచి ఏటా 200 ఎంసీఎఫ్టీ నీరు సముద్రం పాలవుతోంది. ప్రభుత్వానికి రివైజ్డ్ అంచనాలు పంపించాం గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులకు అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కై గల్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉన్నాయి. దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు ఆర్థికశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉంది. రెండు ప్రాజెక్టులకు రివైజ్డ్ అంచనాలతో ఇటీవలే అంచనాలను పెంచి ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా మొదలుపెట్టేందుకు అవసరమైన ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. – లక్ష్మీనారాయణ, నీటిపారుదల శాఖ జేఈ -
కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
తవణంపల్లె : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర ఆదేశించారు. గురువారం మండలంలోని తొడత్తర హైస్కూల్, తొడత్తర మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. తొడత్తర మోడల్ స్కూల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. డిప్యూటీఈఓతో పాటు తవణంపల్లె ఎంఈఓలు హేమలత, మోహన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సాక్షి మీడియాపై కేసులు అప్రజాస్వామికం
మీడియాపై రాజకీయ కక్ష తగదు ప్రభుత్వం గ త నాలుగు రోజులుగా సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. పోలీసులను ముందు పెట్టి జర్నలిస్టులను భయపెట్టా లని చూస్తున్నారు. ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు. వార్తలపై అభ్యంతరం ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలి తప్ప ఇలా కేసులతో భయపెట్టి లొంగదీసుకోవాలని చూడడం అసాధ్యం. మీడియాను రక్షించాల్సిన వ్యవస్థలే కక్ష పూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. – ఆర్.మురళి, అధ్యక్షుడు, తిరుపతి ప్రెస్ క్లబ్మీడియాకు రాజకీయ కక్ష అప్రజాస్వామికం. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షిలో కథనాలు ప్రచురించారని పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడిచేయడమేంటి? ఎడిటర్ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు చేయడం దారుణం. మీడియాపై అధికారులు ఇలా దాడులకు పాల్పడితే అది ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ఈ విధానాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – విజయ్ యాదవ్, జేశాప్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు -
ప్రతిభకు ప్రోత్సాహం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కౌశల్ ప్రతిభా అన్వేషణ పోటీలు దోహదపడుతాయని డీఈవో వరలక్ష్మి అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో కౌశల్ పోటీ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులను కౌశల్ 2025 క్విజ్ పోటీలకు సిద్ధం చేయాలన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8,9 ,10 తరగతుల విద్యార్థులు అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో 27, 28 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు కౌశల్ క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు హసన్భాషా, గణపతి, కౌశల్ పోటీల నిర్వాహకులు దామోదర్రెడ్డి, అరుణ్కుమార్, మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్ మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 79,919 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,218 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. వినాయక సదన్ తనిఖీ కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని వినాయక సదన్ను గురువారం ఈఓ పెంచల కిషోర్ తనిఖీ చేశారు. పాత సదన్తో పాటు కొత్తగా సముదాయాన్ని పరిశీలించారు. ఆ భవనంలోని ఫర్నీ చర్ శాంపిల్స్ను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. -
బాల్య వివాహాల కట్టడికి సహకారం
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని తిరుపతి ఐసీడీఎస్ పీడీ వసంత అన్నారు. గురువారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బాల్య వివాహాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మరింతగా కట్టడి చేయవచ్చన్నారు. ఉమ్మడి చిత్తూరులో దాదాపు 4500 కు పైగా టీనేజీ గర్భిణులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. యుక్త వయసులో గర్భిణులు గా మారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. -
కాసుల వైద్యం
కాణిపాకం : జిల్లాలో 1200పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. రిజిస్ట్రేషన్ కానీ ఆస్పత్రులు మరో 1000 దాకా ఉన్నాయి. అలాగే ల్యాబ్లు 900 ఉండగా..అనాధికారికంగా 7000పైగా నడుస్తున్నాయి. ప్రధానంగా పలు ఆస్పత్రుల్లో చూస్తే వెయ్యి..పట్టుకుంటే 5 వేలు అనేంతగా వైద్యుల తీరు మారింది. వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకోవాలంటే కన్సల్టెన్సీ ధర తక్కువలో తక్కువంటే రూ.500 నుంచి ఆరంభం. రూ.2 వేలు ఉండే ఆ ధరలు ఉన్నాయి. మందులు మా త్రం నెలకు రాసేస్తారు. అంటే నెల తర్వాత వస్తే మళ్లీ డబ్బులు సమర్పించుకోవాలి. అసలు నాడి పట్టుకోకుండా రోగి లోనికి వచ్చిన సమస్య ఏమిటని అడగడం మరుక్షణం నుంచే మందులు రాసేస్తారు.ఈ కన్సల్టెన్సీ ఫీజులపై నియం త్రణ లేకపోవడంతో రోగిని పిండేస్తున్నారు. ప్రస్తుత తరం వైద్యులను చూసి ఆ తరం వైద్యు లు మారిపోయారు. డబ్బే పరమావధిగా వైద్యం చేస్తున్నారు. దీంతో రోగులు.. వారి కూడా వచ్చే బంధువులు లబోదిబోమంటున్నారు. ఇష్టారాజ్యంగా వైద్య సేవలు చాలా వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులు ఫీజులు, వైద్యం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులను మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా వైద్యంతో పాటు ఆఫరేషన్లు, ప్రసవాలు చూస్తున్నాయి. ఆ అనుమతి లేని ఆస్పత్రుల్లో చాలా మంది వైద్యర్హాత లేని సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు మెడికల్ షాపుల్లోనే ప్రైవేటు క్లినిక్లు, ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుని దర్జాగా చికిత్సలు చేస్తున్నారు. కాసులు సముపార్జనే ధ్యేయంగా జరుగుతున్న ఈ దందాకు వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతిలేని ఆస్పత్రులు చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలోనే పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే మిట్టూరు, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, చర్చివీధి తదితర ప్రాంతాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్లేని ఆస్పత్రులు దర్శనమిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది.కమీషన్ల వ్యాపారం వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి నానుడి.. ఎందుకంటే అప్పటిలో వైద్యుడు దేవుడిలా ఉండేవాడు.. వైద్యమూ అలాగే చేసేవారు.. నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేవారు.. రోగిని చూసి వైద్యం చేసేవారు.. మరిప్పుడు అంతా మారిపోయింది.. రోగి చెప్పింది వినాలంటే (కన్సల్టెన్సీ) రూ.500 నుంచి రూ.1000.. మరీ డిమాండ్ ఉంటే రూ.2 వేలు.. ఒకసారి చేయి పట్టుకుంటే (ఐసీయూ) రూ.10 వేలు..ఆ తరువాత టెస్ట్లు.. మందులు షరా మామూలే.. రోగి నుంచి ఇష్టానుసారం పిండేస్తున్నారు.. ఎమర్జెన్సీ ఆసుపత్రుల్లో అయితే మరీనూ.. లక్షలు ఉంటేనే వైద్యం.. లేదంటే దైన్యమే.. ప్రైవేటు వైద్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక అనుమతులు లేని ఆస్పత్రులు రెచ్చిపోతున్నాయి. ఆసుపత్రి కెళ్తే జేబు ఖాళీ.. ఇవాళ వైద్య రంగంలో కాసుల కక్కుర్తి తప్ప మానవతా దృక్పథం, నైతిక విలువలు కొరవడడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. రోగి వ్యాధిని డబ్బుతో తూకం వేయడం మితి మీరిపోయింది. డాక్టర్లు టార్గెట్లు రీచ్ కావడానికి అవసరం లేకపోయినా ఎక్స్రే, స్కానింగ్, మందులు రాసేస్తున్నారు. ఆస్పత్రులకు పట్టుకొన్న మరో జాడ్యం మందులు (మెడిసిన్). సొంతగా ఆస్ప త్రుల్లోనే మెడికల్ షాపులు ఉండడంతో ప్రిస్క్రిప్షన్న్ నిండిపోయే వరకూ మందులు రాసేస్తున్నారు. దీని వెనుక ఆశ్చర్యపోయే మాయ దాగి ఉంది. గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటివ్స్ని నియమించుకొని వాళ్లను డాక్టరు వద్దకు పంపించి ప్రొడక్టును ప్రచారం చేసుకోవడం జరిగేది. దీనిని ఎథికల్ మార్కెటింగ్ అనే వాళ్లు. ఆ ప్రొడక్టును ఎక్కువగా రాసినందుకు తాయిలాలుగా వచ్చేవి. ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నా బాగా తగ్గింది. ఇప్పుడు కొత్త ఒరవడి వచ్చింది. బెంగుళూరు, చైన్నెలతో పాటు పలు చోట్ల మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మందులు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇవి వైద్యులకు చాలా తక్కువ ధరకు వస్తాయి. వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తారు.అందుకే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మందులు రాస్తుంటారు. గ్యాస్ట్రిక్ లేకపోయినా గ్యాస్ ట్యాబ్లెట్ రాసేయడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వైరల్ ఫీవర్కు యాంటి బయోటిక్ రాయకూడదు.అసలు యాంటి బయోటిక్స్ తక్కువగా సూచించాలని ఆ తరం వైద్య నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అయినా తమ మెడికల్ షాపుల వ్యాపారం కోసం వైరల్ ఫీవర్కు యాంటి బయోటిక్స్తో చీటీలో నింపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో రాసే మందులు వ్యాధి నయం మాట అటుంచితే కొత్త రోగా లు చుట్టు ముడుతున్నాయి. చివరికి రోగి ఒళ్లు, ఇల్లు గుల్లవుతోంది. చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల విషయంపై నిఘా పెట్టాం. ఇదివరకే రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులతో పాటు రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రి వివరాలను సేకరించాలని ఆదేశించాం. ఆ బాధ్యత డెమో సెక్షన్ వాళ్లు చూస్తున్నారు. చిత్తూరు నగరంలో ఎక్కడెక్కడ అనుమతులు లేని ఆస్పత్రులు ఉన్నాయో చూస్తాం. అధిక ఫీజు వసూళ్లు చేసే ఆస్పత్రులపై కొరడా ఝలిపిస్తాం. అలా జరిగితే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు అధిక శాతం ఆస్పత్రులు కమీషన్లతో లాభాలు గడిస్తున్నాయి. ఆర్ఎంపీ, పీఎంపీ ఆయా ఆస్పత్రుల్లో ఎన్రోల్ చేయించుకొని పేషెంటును రిఫర్ చేస్తే కొంత మొత్తం లేదా 40 శాతం వరకూ కమీషన్ ముట్టజెబుతున్నారు. అందుకే ఈ మధ్య నగరాల్లోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో గ్రామీణ రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక స్కానింగ్, ఎక్స్రే తదితర టెస్టులకు తమ వద్దకు పంపిస్తే లేబోరేటరీలు ఆయా ఆస్పత్రులకు 50 శాతం వరకూ కమీషనన్ రూపంలో ఇస్తున్నాయి. ఫలానా ల్యాబ్కు మాత్రమే వెళ్లాలని ఆస్పత్రుల్లో సూచించడం, వేరే దగ్గర చేయించుకొంటే తిరస్కరించడం, స్పష్టంగా ఫలితాలు రాలేదని చెప్పడం దాదాపుగా అందరికీ అనుభవమే. దీనికి ఆ కమీషన్ల కక్కుర్తే కారణం. ఓ వ్యక్తి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షకు ఓ ల్యాబ్కి వెళ్లారు. రూ.1200 అవు తుందని వాళ్లు చెప్పారు. ఆ వ్యక్తి డాక్టరు ఫోన్్ చేసి వారికి ఇచ్చారు. తాను వేరే ఊరి డాక్టరునని, తనకు కమీషనన్ వద్దని చెప్పడంతో రూ.600 మాత్రమే ల్యాబ్ వారు బిల్లు వేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడు ఎందుకు కన్నీరు పెడుతోందో చెప్ప డానికి ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే సుమా!.. రోజూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. -
మహిళలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
– మహిళలపై గౌరవం లేని పార్టీ టీడీపీ శ్రీరంగరాజపురం : మహిళలు అంటే గౌరవంలేని పార్టీ టీడీపీ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని ముద్దుకుప్పంలోని విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దళిత మహిళ అయిన తనను అవమానకరమైన రీతిలో సభ్య సమాజం తలదించుకొనేలా ఏక వచనంతో అసభ్యకర పదజాలంతో మాట్లాడటం దారుణమన్నారు. ఈ సృష్టికు మూలం మహిళ అలాంటి వారి గురించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం మహిళలందరినీ అవమానించినట్టేనని అన్నారు. తన చీరల గురించే మాట్లాడం కంటే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై మాట్లాడాలని, వాటిని పరిష్కరించాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సహకరిస్తాం, అంతేకానీ మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అవమానిస్తూ మాట్లాడటాన్ని జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మహిళ లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
అలా ముగించేశారు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలను మొక్కుబడిగా మార్చేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనప్పుడల్లా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వెల్లడిస్తున్నా జిల్లా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపణలు గుప్పించారు. క్షుణ్ణంగా నిర్వహించాల్సిన 1 నుంచి 7 స్థాయీ సంఘాల సమావేశాలు మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించి మమ అనిపించేశారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశాలకు చిత్తూరు, తిరుపతి, అన్న మయ్య జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ప్రతి సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు గైర్హాజరవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. ఇలాంటి స్థాయి లేని సమావేశాలను నిర్వహించి ఎలాంటి లాభమూ లేదని జెడ్పీటీసీలు నిట్టూర్చారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, 5 వ స్థాయి సంఘం చైర్పర్సన్ భారతి, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టిసారించండి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయన్నా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన నాడు–నేడు పనుల నిధులు చాలా పాఠశాలల ఖాతాల్లో ఉన్నాయన్నారు. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా నిబంధనల మేరకు ఖర్చు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. హాజరుకాని కూటమి ఎమ్మెల్యేలు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరు కావాల్సిన కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టా రు. అదే విధంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల జిల్లా అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపారు. దీంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు సిబ్బంది సమా ధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. బాధ్యతగా హాజరు కావాల్సిన జిల్లా అధికారులు గైర్హాజరు కావడంతో సభ్యులు విమర్శలు గుప్పించారు. ప్రతిసారి ఏదో ఒక సాకుతో గైర్హా జరవుతున్న జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్థాయీ సంఘాల సమావేశాలకు హాజరయ్యే ప్రజల సమస్యలను చర్చించాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా హాజరు కాకపోవడంపై విమర్శలు గుప్పించారు. చర్చించిన సమస్యలు ఇలా..... కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్ని స్తున్నారని, ఎందుకు మంజూరు చేయడంలేదని సదుం జెడ్పీటీసీ సోమశేఖరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామా ల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోయారు. బిల్లులు అప్లోడ్ చేసేందుకు చిత్తూరు జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇస్తే తిరుపతి జిల్లాలో మాత్రం మార్చి 6వ తేదీ వరకు సమయం ఇవ్వడం ఏమిటని డ్వామా అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నా యని వాటిని పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ లకు రైతులు నెలల తరబడి నిరీక్షిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో 50కి పైగా ఆసుపత్రులు ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన అశ్విని ఆసుపత్రిని మాత్రం అన్నమయ్య వైద్యశాఖ అధికారులు లంచం కోసం సీజ్ చేశారని పీలేరు జెడ్పీటీసీ రత్నశేఖర్ ఆరోపించారు. జగనన్న కాలనీ ఏర్పాటుకు భూమి చదును చేసి ఎర్రమట్టి పోసి ప్లాట్లు కేటాయించగా, అందుకు ఖర్చు చేసిన నిధులను అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద విడుదల చేసిన నోటిఫికేషన్ అనుమతి లేకుండా విడుదల చేశారనే ఆరోపణలున్నట్లు గుడుపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి అన్నారు. ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బడుల ను మూసివేయడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఎదురవుతోందని సదుం జెడ్పీటీసీ సోమ శేఖర్రెడ్డి విమర్శించారు. సదుం మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి అటెండెన్స్ లేకుండా నష్టపోతున్నారని చెప్పారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
కేసులతో మీడియాను భయపెట్టలేరు
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..! వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియాకు సంకెళ్లు వేయడం అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసినట్లే. పత్రికల్లో ప్రచురించే కథనాలపై కేసులు పెట్టడం అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. పోలీసులను ముందు పెట్టి మీడియాను తన అదుపులోకి ఉంచుకోవాలని ప్రభుత్వం చూడడం సిగ్గుచేటు. పోలీసు కేసులతో మీడియాను కట్టడి చేయాలన్న ఆలోచన సరైంది కాదు. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – పి. బాలచంద్ర, జనరల్ సెక్రటరీ, తిరుపతి ప్రెస్ క్లబ్ -
కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్
బంగారుపాళెం : కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అన్యాయాలకు డిజిటల్ బుక్ సమాధానం చెబుతుందని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నా రు. గురువారం మండలంలోని నల్లంగాడు, శెట్టేరి, తూంపాయనపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు, అను బంధ విభాగాల కమిటీ నియాయక సమావేశాలను డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కుమార్రాజా, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు లలిత కుమారి, సర్పంచ్ ధనుంజయరావు, ఉపసర్పంచ్ శంకర్, ఎంపీటీసీ ఉషశ్రీ, మాజీ సింగిల్ విండో, ఏఎంసీ అధ్యక్షులు దత్తాత్రేయరెడ్డి, కృపాసాగర్రెడ్డి, రాష్ట్ర సామాజిక మాధ్యమాల సంయుక్త కార్యదర్శి కిషోర్కుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, జిల్లాట్రేడ్ యూనియన్ కార్యదర్శి రఘుపతిరాజు, సీనియర్ నాయకులు పాలాక్షిరెడ్డి, ధామస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, యూత్ అధ్యక్షుడు గజేంద్ర పాల్గొన్నారు. -
యువత అన్ని రంగాల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయం కళాశాల ప్రాంగణంలో మై భారత్ ఆధ్వర్యంలో సమితి స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడా పోటీల్లో రాణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. మై భారత్ ప్రాంగీయ గణాంక అధికారి బాబురెడ్డి, విజయం కళాశాలల ఏవో రాజగోపాల్నాయుడు, యూత్ ఫర్ సేవా అధ్యక్షుడు హరీష్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుజ్జు లాగేశారు!
ఏడాది పాటు చెమటోడ్చి కష్టించే మామిడి రైతులంటే అందరికీ అలుసుగా మారింది. తోతాపురి మామిడి రైతులను ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. పంట విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న కర్షకుల ఆశలు అడియాశలయ్యాయి. తోతాపురి విక్రయంలో అన్ని దశల్లోనూ పుడమి పుత్రులు దగా పడ్డారు. కాణిపాకం: మామిడి కాయల విక్రయంలో బినామీ లెక్కలకు రెక్కలొచ్చాయి. అక్రమాలు పరిశీలన పక్కదారి పట్టింది. అసలు లెక్కలను అధికారులు తోసిపుచ్చారు. బోగస్ లెక్కలను తేల్చలేకపోయారు. తద్వారా ప్రభుత్వం అందించిన మామిడి ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపు దుర్వినియోగమైందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రా యితీ పోయినా ఫ్యాక్టరీ చెల్లించాల్సిన రూ.8 కోసం రోడ్డెక్కారు. రైతు సంఘం నేతల గొంతు నొక్కేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి అవకతవలను నివారణకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.12 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చెల్లించేలా, ప్రభుత్వం ప్రోత్సాహక నిధి కింద రూ.4 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే కాయల విక్రయానికి టోకెన్ల పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో రాయితీపై కన్నేసిన కొందరు అక్రమాలకు తెగబడ్డారు. మధ్యవర్తుల దందా.. మామిడి కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీల వద్ద కొందరు కాపు కాచారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి టోకన్లను అమ్ముకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పండిన కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించారనే వాదనలు వినిపించాయి. ఈ దోపిడీ జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. దీనికితోడు వ్యాపారులను బుట్టలో వేసుకుని కూటమికి చెందిన కొందరు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి దోపిడీకి తెరలేపారు. ర్యాంపులను అడ్డం పెట్టుకుని కాయలు కాటా వేసి, బోగస్ పేర్లు, బిల్లులు సృష్టించారు. ఇలాంటివి బంగారుపాళెం, కుప్పం, వి.కోట, పలమనేరు, సోమల తదితర ప్రాంతాల్లో జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే నీలం కాయలను కూడా ర్యాంపులకు తరలించి తోతాపురి లెక్కల్లోకి ఎక్కించారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ మామిడి దినోత్సవ సభలో భగ్గుమన్నారు. బోగస్ లెక్కలను బయటకు తీస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే అధికారులు పరిశీలన పేరుతో జాప్యం చేసి తమ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ర్యాంపుల వద్ద లెక్కలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. రూ.8 మాటేంటీ..ప్రభుత్వం తోతాపురికి ప్రకటించిన మద్ధతు ధర విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రూ.4 ప్రోత్సాహక నిధి చెల్లించి..చేతులు దులుపుకుంటోంది. అయితే ఫ్యాక్టరీ నుంచి కిలో రూ.8 ఇవ్వాల్సి ఉండగా..దీనిపై నోరువిప్పడం లేదు. ఇది వరకే కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5 చెల్లించగా రైతులు భగుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రైతు సంఘ నాయకులు అక్రందన సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. బుధవారం బంగారుపాళెం మండలంలోని మార్కెట్యార్డులో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి రైతుల సంఘం నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. సభను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్ధతు ధరపై పోరాడుతున్న రైతు నాయకులను అడ్డుకుంటే భవిష్యత్ ఉండదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిధి మంజూరుతో ఇలా.. అధికారులు పరిశీలన పూర్తి చేసి ఇచ్చిన నివేదికలపై రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరుజిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతులు 79,963 సార్లు కాయలు తరలించగా 3.67లక్ష టన్నుల కాయలు విక్రయించినట్లు లెక్కకట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.146 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ చెల్లింపులపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ లెక్కలు తేల్చకుండా నిధులు జమ చేయడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అమ్మకాలు..చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది తోతాపురి రకం 39,895 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కాగా 4.99 లక్షల టన్నుల కాయలు దిగుబడి వచ్చినట్లు అధికారుల అంచనా వేశారు. మొత్తం 43 ఫ్యాక్టరీలుండగా 31 ఫ్యాక్టరీలు కాయల కొనుగోలు చేశాయి. ఈ ఫ్యాక్టరీ లు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేయగా.. 25 ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేసినట్లు అధి కారులు అప్పట్లో నివేదికలిచ్చారు. బోగస్ లెక్కలు తేల్చాలి కొన్ని ర్యాంపుల్లో ప్రభుత్వ నిధిని దోచుకోవాలని బోగస్ లెక్కలు చూపించారు. ఆ లెక్కలు తేలకుండా నిధి జమ చేశారు. దీంతో ప్రజానిధి పక్కదారి పట్టిందని భావిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ బోగస్ లెక్కలు తేల్చాలి. అలాగే ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇవ్వాలి. ఇందుకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సభకు పూనుకున్నాం. – ఉమాపతినాయుడు, మామిడి రైతు సంఘ ఉపాధ్యక్షులు ఫ్యాక్టరీల నుంచి రూ. 8 ఇప్పించాలి ప్రభుత్వం తోతాపురికి మద్ద తు ధరగా కిలో రూ.12 ప్రకటించింది. ఆ ప్రకారమే రైతు లకు నగదు ఇప్పించాలి. ఫ్యా క్టరీలు కేజీకి రూ. 5 ఇస్తే ఒప్పకోం. కచ్చితంగా రూ.8 ఇవ్వా ల్సిందే. ఇవ్వని ఫ్యాక్టరీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనేపథ్యంలోనే బంగారుపాళ్యంలో అక్రందన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను అడ్డుకోవద్దు. మేము రైతుల కోసం పోరాడుతున్నాం. ఇందుకు అందరు సహకరించాలి. – జనార్దన్, మామిడి రైతు సంఘ అధ్యక్షులు ఇంకా చేయాల్సింది ఉంది మామిడి కొనుగోలుపై పరిశీలన చేపట్టాం. పరిశీలనలో చాలా వరకు తీసేశాం. ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. చేస్తాం. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుం టాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానాలు వద్దు. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, చిత్తూరు -
కలానికి సంకెళ్లు!
నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ..కూటమి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ..చిత్తూరు అర్బన్ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు. జిల్లాలో కేసులు ఇలా.. పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపిస్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ● కుప్పం రూరల్ మండలంలో ఒకరు చనిపోతే శ్మశాన వాటికలో ఓ వర్గం అనుమతించలేదని, స్థానికంగా పోలీసులు కల్పించుకోవడంలో పరిస్థితి సద్దుమణిగిందంటూ సాక్షితో పాటు ఇతర పత్రికల్లోనూ వార్తలు ప్రచురితమయ్యాయి. కానీ స్థానిక సాక్షి విలేకరి నాగరాజుపై స్థానిక కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జూన్లో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ● కుప్పంలో హంద్రీ–నీవా కాలువ గేట్లలోకి పాము వచ్చిందని, గేటు మరమ్మతు చేసే సమయంలో నీళ్లు ఆగాయంటూ ‘సాక్షి’లో వార్త ప్రచురితమయ్యింది. దీన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గతనెల ‘సాక్షి’ రిపోర్టర్లపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ● పుంగనూరులో ఓ మైనర్ బాలిక కనిపించలేదని పోలీసులు మీడియాకు చెప్పడంతో గతేడాది వార్త ప్రచురించారు. అయితే బాలిక హత్యాచారానికి గురయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలి, నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలు రాసినందుకు సాక్షి ఎడిటర్తో పాటు స్థానిక విలేకరి ప్రకాష్పై కేసు పెట్టారు. ● తిరుమలలో కల్తీనెయ్యి వ్యవహారంపై పాలకులు ఆరోపణలు చేయడం, దీనిపై సుప్రీం కోర్టు కల్పించుకుని విచారణకు ఆదేశించడం తెలిసిందే. తిరుమలలో జరిగి వాస్తవాలు బయటపెట్టినందుకు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఒకరి ఫ్లెక్సీ మరొకరు తొలగిస్తుండగా తొట్టంబేడు ‘సాక్షి’ రిపోర్టర్ హరీష్రెడ్డి వీడియో తీశారు. దీనిపై వార్త రాసినందుకు ఏప్రిల్లో అతని పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి.. మొలకచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇది సరఫరా కావడంపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు.ఆక్షేపణీయం జర్నలిస్టులను ఏ ప్రభుత్వమైనా జర్నలిస్టులుగానే చూడాలి. యాజమాన్యాలతో ముడిపెట్టొద్దు. వాస్తవాలను రాసిందుకు కేసులు పెడుతూ పోవడం మంచి పద్ధతికాదు. ఇది ప్రతికా స్వేచ్ఛను హరించడమే. ఆది ఆక్షేపణీయం. – మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజేభావ వ్యక్తీకరణపై దాడి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు భావ వ్యక్తీకరణ వ్యక్త పరిచే హక్కును కల్పించింది. ప్రభుత్వాల్లో జరిగే తప్పులకు పత్రికలు ఎత్తి చూపిస్తాయి. ఇందులో తప్పేం ఉంది. ఆ మాత్రం దానికి పత్రికా కార్యాలయాల్లో సోదాలు చేయడం, పాత్రికేయులపై కేసులు పెట్టడం సరైంది కాదు. – కెఎం.అశోక్కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజేపోరాటలే శరణ్యం పత్రికలు, పాత్రికేయులపై కేసులు పెట్టి నోళ్లు మూయిస్తామనుకునే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. జిల్లాలో పలువురు పాత్రికేయులపై కేసులు పెట్టారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తున్నాం. మున్ముందు ఇలాంటివి కొనసాగితే రోడ్డెక్కి పోరాటాలు చేయక తప్పదు. – కాలేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే -
రైతులకు అన్యాయం
బంగారుపాళెం : మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ వారి కడుపు కొడుతోందని మామిడి రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బ్రహ్మానందాశ్రమం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన మామిడి రైతు ఆక్రందన సభ నిర్వహించారు. గుజ్జు యజమానుల నుంచి అందాల్సిన రూ 370 కోట్లు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగించాల్సిందేనన్నారు. ఏపంటకూ గిట్టుబాటు లేదు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర అందడంలేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రికి చిత్తశుద్థి ఉంటే గుజ్జుయజమానులను కట్టడి చేయడం పెద్ద పనికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు గుజ్జు ఫ్యాక్టరీ యజమానులకే అండగా ఉంటోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రైతు ఉద్యమాలకు రాజకీయం చేయడం స్థానిక ఎమ్మెల్యేకు తగదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు మాట్లాడుతూ.., పల్ఫ్ను టీటీడీ, ఇతర సంస్థలకు సరఫరా చేస్తే గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యమన్నారు. సభను అడ్డుకునేందుకు కుట్రలు మామిడి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్, మునీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఆక్రందన సభ అడ్డుకునేందుకు వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. నియోజకవర్గంలో రూ. 4 చొప్పున 75 కోట్లు మంజూరు అయినందుకు అభిషేకాలు చేయడం గొప్పకాదని, 8 రూపాయలు చొప్పున రూ 150 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, మురళీ, ఏఎస్ఎప్ జాతీయ నేత శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేంద్ర, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు మునిరత్నంనాయుడు, ఉమాపతి నాయుడు, కార్యదర్శులు శ్రీనివాసులు, మోహన్రెడ్డి,సందీప్రెడ్డి, ఓబుల్రాజు, తవణంపల్లె మాజీ ఎంపీపీ, వైఎస్సార్సీపీ నేత రవికుమార్, చెంగల్రాయరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.


