Chittoor
-
అయ్యా.. మా మొర ఆలకించరా?
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 234 అర్జీలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. మా మొర ఆలకించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో గత రెండు వారాల తర్వాత ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 232 అర్జీలు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. మూడు నెలల పాటు పలమనేరు డివిజన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిత్తూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో దాదాపు 250 అర్జీలు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. పలమనేరులో పీజీఆర్ఎస్ నిర్వహించడం వల్ల పలమనేరు డివిజన్ నుంచి అందే అర్జీల సంఖ్య తగ్గినట్టు పేర్కొన్నారు. శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించండి శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని చిత్తూరు రూరల్ మండలం, బీఎన్ఆర్పేట రెవెన్యూ, అనంతాపురం ఎస్సీ కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామానికి చెందిన సుకన్య, కవిత తదితరులు మాట్లాడారు. గత 40 ఏళ్లుగా శ్మశానవాటికకు వినియోగిస్తున్న స్థలంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. -
రగులుతున్న తమ్ముళ్లు!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు కండువా కప్పుకున్న వారికే పదవులు కేటాయించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు తమ స్థాయికి తగని పోస్టులు కట్టబెట్టడంపై కినుక వహిస్తున్నారు. ఇంతకాలం ఎదురుచూసినందుకు ఇంతగా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గుర్తింపు, గౌరవం రెండూ లేవని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ విజయం కోసం పనిచేసిన తమను కాదని ఎన్నికల ముందు చేరిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి ముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని డాలర్స్ దివాకర్రెడ్డికి, మొన్న డీసీసీబీ చైర్మన్ పోస్టును అమాస రాజశేఖరరెడ్డికి ఇవ్వడంతో నామినేటెడ్ పదవులన్నీ దాదాపు భర్తీ పూర్తయినట్లేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ రెండు పదవులు తమకే వస్తాయని ఆశగా ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక నామినేటెడ్ పదవుల్లో ఆశించేందుకు ఏమీ లేకుండా పోయినట్లేనని ఆగ్రహంగా ఉన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీ కోసం తెరవెనుక నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వారంతా ముందుగా టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం పోటీపడ్డారు. అలా ఆశించిన వారిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలెవరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కలేదు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పోస్టును ఎగరేసుకుపోయారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీనే నమ్ముకునిఏళ్లుగా ఎదురుచూస్తున్న వారందరికీ భంగపాటు తప్పలేదు. చిత్తూరు జిల్లాలోనూ.. చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో పదుల సంఖ్యలో ఉన్న టీడీపీ నాయకులందరికీ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. డీసీసీబీ చైరర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చాలా నమ్మకంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్ నాయకుల్లో ప్రథముడు. టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. అయితే దొరబాబుని కాదని, అమాస రాజశేఖరరెడ్డికి చైర్మన్ గిరీ కట్టబెట్టారు. ఆయన గతంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో అడ్డగోలుగా కుప్పం నియోజక వర్గానికి నిధులు కేటాయించారే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు, లోకేష్ మళ్లీ అమాసకే డీసీసీబీని కట్టబెట్టారు. అమాస కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినట్లు కూడా పెద్దగా ప్రచారం లేదు. అదే విధంగా టీడీపీ కోసం పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మిగిలింది కాణిపాకం, బోయకొండ పాలకమండళ్లు మాత్రమే. ఆయా బోర్డుల చైర్మన్, సభ్యత్వం కోసం అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అందులోనైనా న్యాయం జరుగుతుందా? లేదా? అని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంపై అసంతృప్తి గుర్తింపు.. గౌరవం లేదని సీనియర్ నేతల ఆవేదన ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడంపై మండిపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలుసీనియర్లందరికీ అవమానం తిరుపతికి చెందిన ఎన్టీఆర్ రాజు కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈ సారి కూడా ఆ కుటుంబానికి దక్కలేదు. తిరుపతిలో టీడీపీ అంటే గుర్తొచ్చే నాయకుల్లో ముందు వరుసలో ఉండేది నరసింహయాదవ్. టీడీపీ సీనియర్ నేతగా పచ్చ చొక్కా తప్ప మరొకటి ధరించని నరసింహయాదవ్ మరో పర్యాయం తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆయనకు ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టి తీవ్రంగా అవమానించారు. టీడీపీలో మరో నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఆమె ఎమ్మెల్సీ లేదా టీటీడీ పాలకమండలి సభ్యత్వం, అది కూడా కాకుంటే తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఈ మూడింటిలో ఏదీ దక్కలేదు. అస్సలు ఎలాంటి ప్రాధాన్యత లేని, ఆ పదవి ఒకటి ఉందనే విషయం తెలియని గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు, ఆమె అనుచరులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో అతిముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టడంపై టీడీపీలోని అనేక మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దివాకర్రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకు సంబంధించిన వివరాలతో అమరావతికి లేఖ పంపినట్లు తెలిసింది. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్నా తమను గుర్తించలేదంటూ కొందరు నాయకులు అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అదే విధంగా శాప్ చైర్మన్ రవినాయుడుపైనా కొందరు టీడీపీ నేతలు అమరావతికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి జిల్లాలో మిగిలిన శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి కోసం పలువురు టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. -
ఇళ్లను కూల్చేందుకు కుట్ర
గత 30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని యాదమరి మండలం, దాసరపల్లి గ్రామ పంచాయతీ ఆది ఆంధ్రవాడ ప్రజలు వాపోయారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలోని సర్వే నం.343/2 డీలో ఎకరా ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిలో గత 30 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తమ ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. -
మేత బీడును కాపాడండి
ఎన్నో ఏళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలు మేపుకుంటున్న భూమిని కొందరు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఆర్పురం మండలం, ఆర్ఆర్పురం ఎస్టీ కాలనీ వాసులు పే ర్కొన్నారు. ఈ మేరకు వారు కలెక్టర్కు సమస్యను వివరించారు. తమ గ్రామ పరిధిలో సర్వే నం.170లో 18/2లో ఉన్న భూమిని మోతుబారి రైతు కుటుంబీకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విచారించి న్యాయం చేయాలని వారు కోరారు. గుడి వద్ద మద్యం షాపు వద్దు గుడి వద్ద ఉన్న మద్యం షాపును తొలగించాలని వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. తమ గ్రామంలో చర్చి, మాతమ్మ గుడికి సమీపంలో మద్యం షాపు ఉందన్నారు. ఆ దారిలో ఆలయాలకు వెళ్లే సమయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. -
పాఠశాలను మార్చకండి
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మార్చకండి అంటూ పుంగనూరు మండలం, మరసనపల్లెకు చెందిన గ్రామస్తులు రమణప్ప తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో అర్జీ అందజేశారు. మరసనపల్లె గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, ఆ పాఠశాలలో ప్రస్తుతం 22 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. త్వరలో ఆ పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను దూరప్రాంతంలో ఉన్న ఈడిగపల్లెకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా మారిస్తే తమ పిల్లలు కిలోమీటరు వరకు కాలినడకన నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని కలెక్టర్ను కోరారు. -
అరటి సాగులో అద్భుతాలు
గ్రూపు –1లో తప్పినా.. సాగులో సక్సెస్ ● తండ్రికి అండగా నిలవాలని నిర్ణయం ● అరటి సాగు చేపట్టి అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు కుప్పంరూరల్: గ్రూప్–1లో తప్పినా.. సాగులో సక్సెస్ అయ్యాడు కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జ్ఞానప్రకాష్. అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తండ్రికి తోడూనీడగా ఉంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన జ్ఞానప్రకాశ్ బీ.ఏ వరకు చదువుతున్నాడు. తన తండ్రి రెవెన్యూశాఖలో చిరుద్యోగి. గ్రూపు –1 అధికారి కావాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు. 2023లో గ్రూపు –1 పరీక్ష రాసి సఫలీకృతుడు కాలేకపోయాడు. దీంతో తన తండ్రికి తోడుగా నిలవానుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో అరటి సాగుకు ఉపక్రమించాడు. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి 2.5 ఎకరాల్లో పచ్చివాల, 2.5 ఎకరాల్లో యాలక్కి రకాలు సాగుచేశాడు. ప్రస్తుతం పంట మరో నెలలో చేతికి రానుంది. కుప్పం మార్కెట్లో యాలక్కి కిలో రూ.70, పచ్చివాల రూ.30 ధర పలుకుతోంది. ఈ లెక్కన జ్ఞానప్రకాష్కి రూ.25 లక్షల వరకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. తోడైన దేవుడు యువకుడు పడుతున్న కృషికి దేవుడు కూడా తోడయ్యాడు. కుప్పం ప్రాంతంలో వెయ్యికిపైగా అడుగుల లోతుకు బోరు వేసినా నీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ జ్ఞానప్రకాశ్ అరటి సాగుకు రెండు బోర్లు తవ్వగా.. కేవలం 105, 160 అడుగుల్లోన్నే పుష్కలంగా నీరు లభించింది. పాడి సాగులో మరో లక్ష ఆదాయం గత ఏడాది నుంచి జ్ఞానప్రకాష్ పాడి పెంపకం కూడా చేపట్టాడు. అరటి తోటలో వచ్చే పశుగ్రాసం, అరటి ఆకులు దాణాగా వినియోగిస్తున్నాడు. తండ్రి సహకారంతో రూ.5 లక్షలు ఖర్చు చేసి 10 పాడి ఆవులను పెంచుతున్నాడు. ప్రస్తుతం రోజూ ఆవులు పూటకు 75 లీటర్ల లెక్కన రెండు పూటలా 150 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. నెలకు రూ.1.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా మా తండ్రి రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఆయన పడుతున్న బా ధలు చూడలేక చిన్నప్పటి నుంచే గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా. మొదటి ప్రయత్నంలో ఒక్క పరీక్ష పోయింది. మరో పరీక్ష కోసం ఎదురు చూస్తు న్నా. ఇంతలో ఎలాగైనా తండ్రికి తోడుగా నిలవాలనుకున్నా. అదుకే 5 ఎకరాల పొలంలో రూ.5 లక్షలు వెచ్చించి అరటి సాగు చేపట్టా. వ్యాపారులు వచ్చి టోకుగా రూ.25 లక్షలకు తోటను అడుగుతున్నారు. బయట మార్కెట్కు తరలిస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. – జ్ఞానప్రకాష్, యువ రైతు, గుల్లేపల్లి, కుప్పం మండలం -
జాతరకు కట్టుదిట్టమైన భద్రత
● చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో గంగ జాతర జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన సోమవారం చిత్తూరులోని ఏఆర్ మైదానంలో జాతర విధులు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. చిత్తూరు జాతరకు దాదాపు 500 మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్టు తెలిపారు. ట్రాఫిక్ను నిత్యం పర్యవేక్షించడంతోపాటు వాహనాల మళ్లింపుపై దృష్టి పెట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం జాతర ధర్మకర్త లావణ్యతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, శివానందకిషోర్, డీఎస్పీలు సాయి నాథ్, సయ్యద్ మొహ్మద్ అజీజ్, చిన్నికృష్ణ, మహబూబ్ బాష, సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య తదితరులు పాల్గొన్నారు సదుం తహసీల్దార్గా జయప్రకాష్ చిత్తూరు కలెక్టరేట్: సదుం తహసీల్దార్గా కుప్పం డివిజనల్ పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జయప్రకాష్ను నియమిస్తూ సోమ వారం కలెక్టర్ సుమిత్కుమామార్ ఉత్తర్వులు జారీచేశారు. అక్కడ ఇన్చార్జ్ తహసీల్దార్గా ఉన్న హుస్సేన్ అవినీతినిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు జయప్రకాష్ను నియమించారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
కుప్పం రూరల్: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రామకుప్పం చెరువులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం చెరువులో పడిన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఐదు అడుగుల ఎత్తు కలిగి, ఎర్రగులాబీ రంగు చీర, వంకాయ పువ్వు రంగు పావడా, ఆకుపచ్చ, తెలుపు రంగుల పూసల హారం ధరించి ఉంది. రెండు చేతులపై పచ్చబొట్లు ఉన్నాయి. మృతురాలు వివరాలు ఎవరికై నా తెలిస్తే 9440900703 నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాద వశాత్తు చెరువులో పడిందా.. లేక ఎవరైనా కొట్టి చంపి చెరువులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అరటి సాగులో అద్భుతాలు
అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రామకుప్పం మండలానికి చెందిన యువరైతు జ్ఞానప్రకాష్. జిల్లాకు ఆరు సబ్స్టేషన్ల మంజూరు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాకు ఆరు సబ్స్టేషన్లు మంజూరైనట్టు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, తవణంపల్లె, పెద్దపంజాణి, శాంతిపురం మండలాలకు ఒక్కో సబ్స్టేషన్ కేటాయించారన్నారు. ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.4 కోట్ల మేర మంజూరు చేశారని చెప్పారు. స్థలం ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివే దిక ఇస్తే నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు వివరించారు. ఆక్రమణలపై తనిఖీలు కుప్పం: మండలంలోని కుంజేగానూరు గ్రామ రెవెన్యూకు సంబంధించి గుట్ట పోరంబోకు కబ్జాపై ‘సాక్షి’లో ‘కుంజేగానూరులో భూచోరులు’ శీర్షికన ఆదివారం వార్త వెలువడింది. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆక్రమణలకు గురైన గుట్టపోరంబోకును సోమవారం పరిశీలించారు. డీకేటీ పట్టా ఉన్నా క్రయవిక్రయాలు చేయరాదన్నారు. ఓ రైతు పొలానికి ఆనుకుని ఉన్న మిట్ట పోరంబోకులో ఎవరికీ అనుమతులు లేవని, అది పశువుల మేత బీడుగా రికార్డుల్లో ఉందన్నారు. అక్కడ కట్టడాలు కట్టి కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. – 8లో -
మా మొర ఆలకించరా?
‘అయ్యా.. మా మొర ఆలకించండి. సమస్యలు పరిష్కరించండి’ అంటూ పలువురు అధికారులకు మొరపెట్టుకున్నారు. మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు అర్బన్: అన్నదాత ఖర్చు తగ్గించుకుని లాభాసాటి వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అందచేయడం పరిపాటి. ఈ క్రమంలో రైతులకు అవసరమైన పరికరాలను అందించాలని కూటమి ప్రభుత్వం భావించింది. వ్యవసాయానికి అవసరమైన యంత్రపరికరాలు ఇవ్వడానికి జిల్లాకు రూ.2.85 కోట్ల వ్యయంతో 1,645 పరికరాల కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ పరికరాల కొనుగోలుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపడం లేదు. అనుకున్నదొక్కటి బహిరంగ మార్కెట్తో పోలిస్తే రాయితీపై ఇస్తున్న పరికరాల ధర ఎక్కువగా ఉండడమే రైతులు వీటిని వద్దనడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాయితీపోను రైతులకు వచ్చే లబ్ధి చాలాతక్కువగా ఉంది. ఫలితంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యవసాయశాఖ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ఓ వైపు జిల్లా యంత్రాంగం రోజువారీ సమీక్షలు చేస్తూ లక్ష్యం మేరకు రైతులతో రాయితీ పరికరాలు కొనుగోలు చేయించాలని నిర్దేశించారు. ఇదేంది ఇలా జరిగిందబ్బా! రైతుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ట్రాక్టరు ఆధారిత పరికరాలకు కేటాయించిన రాయితీ సొమ్మును తైవాన్ స్ప్రేయర్లు వంటివాటికి వాడుకునేలా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వం అందించే రాయితీ పరికరాలు తీసుకోవడానికి రైతులు పోటీపడి ముందుకు వస్తారనుకుంటే పరిస్థితి భిన్నంగా ఉందని మండలాల్లోని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు. మండలానికి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రొటావేటర్లు, హైడ్రాలిక్ రివర్స్ నాగళ్లు, ట్రాక్టర్ ఆధారిత పనిముట్లను రైతులు కొనుగోలు చేయడం లేదు. 40 శాతం మంది దూరం సేద్యానికి అవసరమైన యంత్ర సాయం వ్యక్తిగతంగా అందించేందుకు పరికరాలు ఆయా మండలాలకు చేరుస్తున్నారు. తొలుత జిల్లాలోని 36 మండలాల్లో అన్నదాతలకు రొటావేటర్లు, పవర్ టిల్లర్స్, బ్యాటరీ స్పేయర్లు, పవర్ వీడర్లు అందించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగానే పరికరాలు అవసరమైన వారి నుంచి వివరాలు సేకరించి అధికారులు ఆన్లైన్ చేయించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళ, సన్న, చిన్నకారు రైతులకు వీటిని కేటాయించారు. జిల్లాకు 1,645 యూనిట్ల పరికరాల కేటాయింపే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు వరకు 1,016 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే 40 శాతం మంది రైతులు రాయితీ పరికరాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే గడువు ముగిసినా, లక్ష్యం చేరువుకాకపోవడంతో మిగిలిన యూనిట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్సబ్సిడీ వ్యవసాయ పరికరాలపై అనాసక్తి రాయితీ పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపించని రైతులు మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ లబ్ధే కారణం మళ్లీ దరఖాస్తుకు అవకాశమిచ్చిన యంత్రాంగంజిల్లాలో రాయితీ పరికరాల లక్ష్యాలు పరికరం కేటాయింపు వచ్చిన పరికరాలుట్రాక్టర్ 740 582రోటావేటర్ 94 76బ్యాటరీస్పేయర్లు 280 256 పవర్ వీడర్లు 109 89 బ్రష్కట్టర్లు 08 02 వపర్ టిల్లర్స్ 02 02‘రైతులకు నిత్యం అవసరమైన రొటావేటర్ పరికరానికి వ్యవసాయశాఖ నిర్ణయించిన ధర రూ.1,51,980. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రూ.50 వేలు. రైతు చెల్లించాల్సింది రూ.1.02 లక్షలు. కానీ ఇదే పరికరం మార్కెట్ ధర రూ.1.20 లక్షలు. రాయితీ ఇచ్చినా ధరలో పెద్దగా తేడా లేకపోవడంతో మంచి కంపెనీ నుంచి రొటావేటర్ కొనుక్కోవచ్చని రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న రాయితీ పరికరాలపై పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు.’ .. ఇది ఒక్క రొటావేటర్ పరిస్థితే కాదు.. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న స బ్సిడీ వ్యవసాయ పనిముట్ల రేట్లన్నీ ఇదేవిధంగా ఉండడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బయట మార్కెట్లో మంచి కంపెనీకి చెందిన పరికరాలు కొనుగోలు చేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక అధికారులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కావాల్సినవి తెప్పిస్తాం జిల్లాలో రూ.2.85 కోట్ల రాయితీపై 1,645 వ్యవసాయ పరికరాలు అందించేలా చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల పరికరాలు ఇచ్చేశాం. కొందరు రైతులు పరికరాల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడంతో వాళ్లకు ఏ పరికరాలు కావాలో వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
● జాతరకు సర్వం సిద్ధం
చిత్తూరు గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరకు సర్వం సిద్ధమైంది. గంగమ్మ తల్లిని మంగళవారం వేకువ జామున కొలువుదీర్చనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సంతపేట, కొంగారెడ్డిపల్లి. ఓబన్నపల్లి, గిరింపేట, కట్టమంచి ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో తొలిపూజ జరగనుంది. దొడ్డిపల్లిలో సోమవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారు ఇంటింటా వెళ్లి పూజలు అందుకోకున్నారు. మంగళవారం ఉదయం ఆయా వీధుల్లో కొలువుదీరనున్నారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణా లేదన్నారు. మాజీ మహిళా మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని నిలదీశారు. సీఐ సుబ్బనాయుడు ఆమె పట్ల దురుసుగా ప్రరవర్తించడం సిగ్గుచేటన్నారు. ఒక బీసీ ప్రజాప్రతినిధిపై ఇలా ప్రరవర్తించడం సరికాదన్నారు. మాజీ మంత్రి వద్ద ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటే వారెంట్ లేదా ఎఫ్ఐఆర్ చూపాలని, ఎటువంటి నోటీసులూ లేకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కక్ష్య సాధింపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. అనంతరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలిరెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు సరళమేరీ, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు నారాయణలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేదన్నారు. రజనీపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బనాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, ఎంపీటీసీ ప్రతిమారెడ్డి, నాయకులు నౌషద్, చల్లాముత్తు, గిరి, చంద్ర, మదన్, కవిత, బిందు, శాంతి, దీనదయాళ్, భువన, రాజేష్, హరీషారెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ఏఐ వైద్యం.. ప్రమాదకరం!
జిల్లా సమాచారం జిల్లా ప్రభుత్వాస్పత్రి 01 ఏరియా ఆస్పత్రి 04 సీహెచ్సీలు 08 అర్బన్ హెల్త్ సెంటర్లు 15 పీహెచ్సీలు 50 ● బంగారుపాళ్యంకు చెందిన ఓ గృహిణి ఇంట్లో పనులు చేస్తూ కాలుజారి పడింది. యూట్యూబ్లో చూసి సెల్ఫ్ మెడికేషన్ వాడడం మొదలు పెట్టింది. నాలుగు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోగా.. కాలు వాపు మరింత పెరిగింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. నెల రోజుల పాటు చికిత్సనందించారు. బిల్లు కూడా అధిక మొత్తంలో వేశారు. గాయమైన మొదట్లోనే వైద్యుడ్ని సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు సూచించారు. ● చిత్తూరు నగరంలోని రాజేంద్ర అనే వ్యక్తి గుండె నొప్పిగా ఉందని ఓ ప్రైవేటు డాక్టర్ను ఆశ్రయించాడు. ఆ డాక్టర్ (జూనియర్ డాక్టర్) క్షుణంగా పరిశీలించారు. ఇతర సమస్యలపైనా ఆరా తీశారు. తర్వాత ఆ నొప్పి ఆధారంగా.. ఏఐలో సర్చ్ చేశారు. వాటి ఆధారంగా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి మాత్రలు ఇచ్చారు. గుండె నొప్పి తగ్గకపోగా కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ● చిత్తూరు నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఒళ్లు నొప్పులతో బాధపడుతూ మాత్రల కోసం గూగుల్ను ఆశ్రయించాడు. వాటిని వేసుకున్న తర్వాత కూడా నొప్పులు తగ్గకపోగా జ్వరం వచ్చింది. వారం రోజుల తర్వాత ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి సరైన చికిత్సనందిస్తే కాస్త కోలుకున్నాడు. .. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చాలా మంది తమ సమస్యలకు సంబంధించి గూ గుల్, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ సూచిస్తున్న మందులు వాడి ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. ఇలా సొంత వైద్యం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)నే ఫాలో అవుతున్నారు. ఆరోగ్య విషయంలో కూడా దాన్నే నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కొందరు చాట్జీపీటీలో ఏ రోగానికి ఏ మాత్రలు వాడలో వెతుకుతూ.. అధిక డోసులు కలిగిన మందులు వాడేస్తున్నారు. ఫలితంగా కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. చివరికి రోగం ముదిరి ప్రాణాల మీదకి రాగానే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అలెర్జీ ఉన్న వారికి గూగూల్ చెప్పిన మందులు వాడడం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడి రోగం ముదురుతుంది. సెల్ఫ్ మెడికేషన్ కేసులకు జిల్లా నిలయంగా మారింది. ఈ తరహా వాడకం వల్ల రోగాలు ముదిరి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తిరుపతి స్విమ్స్, రుయా, చిత్తూరు జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో నిత్యం ఉండే ఓపీ సేవల్లో సగానికి పైగా కేసులు ఇలాంటి తరహాలోనే ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా నడివయస్సు వారే అధికంగా ఉండడం గమనార్హం. అందులోనూ విద్యావంతులు కూడా ఉంటున్నారు. సొంత వైద్యానికి ప్రాధాన్యం చిన్నరోగానికే వైద్యుని వద్దకు వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటర్నెట్, మెడికల్ దుకాణాలు, ఇరుగు పొరుగు వారి సలహాలతో కావాల్సిన మందులు కొని వాడుతున్నారు. నాలుగు రోజుల వరకు సమస్య తగ్గకుండా విషమిస్తే గానీ ఆస్పత్రికి వెళ్లడం లేదు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ ఇదే తంతు. మలేరియా, డెంగీ లక్షణాలు ఉన్నా తేలిగ్గా తీసుకోవడం, రోగం ముదిరిన తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారు. వైద్య పరీక్షల్లో రోగం తీవ్రత తెలిసి బెంబేలెత్తిపోతున్నారు. గూగుల్, చాట్ జీపీటీల వాడకం వల్ల నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో విద్యావంతులతో పాటు డాక్టర్లు సైతం ఏఐ ముసుగులోనే విచ్చలవిడిగా మందులు వాడి రోగాల పాలు ఏఐ సూచనలు మాత్రమే.. ట్రీట్మెంట్ చేయదంటున్న వైద్యులు ఆన్లైన్ వైద్యం మంచిది కాదు జనం టెక్నాలజీ మీద పడిపోతున్నారు. ఏం కావాలన్నా ముబైల్ ఫోన్లో సర్చ్ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా వైద్యం విషయంలో ఈ రకమైన ప్రయత్నాలు వద్దు. ఏఐ డయోగ్నోసిస్లో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేతప్ప వైద్యం చేయదు. డబ్బులు ఖర్చవుతాయని ఇలాంటి ట్రిక్స్ చేస్తే.. అనారోగ్య సమస్యలు తప్పవు. డాక్టరు సలహాతోనే మందులు వాడాలి. – అశోక్కుమార్, వైద్యనిపుణులు, చిత్తూరు -
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
రొంపిచెర్ల : తమిళనాడులోని అరుణాచలం దైవదర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప యర్రముక్కపల్లెకు చెందిన రమణ కుటుంబ సభ్యులు ఏడుగురు అరుణాచలం ఆలయ దర్శనం కోసం ఆదివారం బయలుదేరారు. చిత్తూరు మీదుగా వెళ్లాల్సిన వారు తిరుత్తణికి వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకుని మళ్లీ అరుణాచలం పోదామని వెళ్తుండగా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు బస్టాప్ వద్ద తిరుపతి నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అరుణాచలం వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమణ (59), భార్య రాధ(55), చైతన్య(16), రేష్మిక (4) గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స కోసం పీలేరు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన మహిళ రాధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తూ జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, కారు రెండు దెబ్బతిన్నాయి. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శిఽంచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు.. కారు ఢీ : మహిళ మృతి ముగ్గురికి గాయాలు -
తుడా చైర్మన్గా దివాకర్రెడ్డి
తిరుపతి తుడా:తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 నామినేటెడ్ పోస్టుల ను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురికి చోటు లభించింది. ఆశావహులకు భంగపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి శంకర్రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులతో బడి సుధాయాదవ్, నగిరి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తుడా చైర్మన్ కోసం పోటీ పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చివరి వరకు పైరవీలు చేశారు. అనేక మంది ఆశావహులు పోటీపడి భంగపడ్డారు. చివరికి మంత్రి లోకేష్ ఆశీస్సులతో దివాకర్ రెడ్డికే తుడా చైర్మన్గిరి దక్కింది. నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో తిరుపతిలోని టీడీపీ ముఖ్యనేతలంతా అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తిలో సీనియర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. ఇందులో తుడా చైర్మన్ సహా మిగిలిన పోస్టుల భర్తీ పై అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు పనికిరాని పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఈ పదవులు నాలుక మీద గీసుకునేందుకు కూడా పనికిరావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ అధిష్టానం పై రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల్లో పలువురికి చోటు చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కూటమి నాయకులకు పదవులు వరించాయి. ఇందులో రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కుప్పంకు చెందిన రాజశేఖర్, రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన సుగుణమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తిరుపతికి చెందిన దివాకర్ను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్ను నియమించింది. బంగారు నగలు అప్పగింత చిత్తూరు అర్బన్ : పోగొట్టుకున్న బంగారు నగలను ఓ వ్యక్తి పోలీసుల సమక్షంలో ఆదివారం బాధితుడికి అప్పగించారు. చిత్తూరు వన్టౌన్ పోలీసుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన కాంట్రాక్టర్ యోగానందం జ్యోతి ట్రేడర్స్లో రెండు బ్యాగుల బియ్యం కొనుగోలు చేశారు. ఈ బ్యాగులను కారులో పెడుతున్న సమయంలో బంగారు ఆభరణాల బ్యాగును మరిచి..రోడ్డుపైనే పెట్టేసి బెంగుళూరు వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి చూసే సరికి ఆ నగల బ్యాగు కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలో ఓ చిన్న షాపు నడుపుతున్న వినాయకం ఆ బంగారు ఆభరణాల బ్యాగును భద్రపరిచినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న 240 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా వినాయకంను అభినందించి రూ. 5 వేల నగదును బహుమతిగా అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల గురుకుల పాఠశాలలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముంబయికి చెందిన హై 5 బాస్కెట్ బాల్ ఫౌండేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 11 వరకు బాస్కెట్ బాల్ వేసవి రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహించారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అవసరమైన ఖర్చులు మొత్తం ఫౌండేషన్ నిర్వహించిందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఫౌండేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం అభినందనీయమన్నారు. అనంతరం వేసవి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పి చిన్నికష్ణ, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు, హై 2 ఫౌండేషన్ మేనేజర్ స్నేహిత, జయ సూర్య పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్.. భూసేకరణ షురూ!
● సచివాలయాల్లో ఎల్ఏ వివరాల ప్రదర్శన ● మార్కెట్ రేటుపై నాలుగురెట్లు ఎక్కువగా పరిహారం కోరుతున్న రైతులు ● నిర్ధారణ కాని అలైన్మెంట్లు పలమనేరు : బుల్లెట్ ట్రైన్ మార్గానికి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 70 కి.మీలలో భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. చైన్నె–బెంగళూరు– మైసూరు బుల్లెట్ ట్రైన్ మార్గానికి మూడు రాష్ట్రాల్లో 435 కిలోమీటర్లలో పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ మేరకు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాళెం, గుడిపాల మండలాల్లోని ఈ మార్గం వెళ్లే గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో భూములు కోల్పోనున్న రైతుల పేరు, సర్వే నంబరు, ఎంత మేర భూసేకరణ చేస్తారనే విషయాలను తెలుపుతూ నోటీసులను ప్రదర్శించారు. కర్ణాటక రైతుల మాదిరిగానే పరిహారం బెంగళూరు– చైన్నె ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం గతంలో ఇదే ప్రాంతంలో రైతుల నుంచి భూములను సేకరించారు. ఇందులో చాలా మంది రైతులకు గిట్టుబాటు అవార్డు దక్కలేదని వారు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు, కర్ణాటకలోని కోలారు డీసీ (డిస్ట్రిక్ కలెక్టర్) ద్వారా జరిపిన భూసేకరణ కార్యక్రమంలో అక్కడి రైతులు మార్కెట్ ధరపై నాలుగు రెట్లు ఎక్కువగా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని భూములు కోల్పోయే రైతులు సైతం తమకు కర్ణాటక రైతులు తరహాలోనే తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయాల్లో పెట్టిన భూసేకరణ నోటీసులు అలైన్మెంట్ల గందరగోళం బుల్లెట్ ట్రైన్ కోసం ఇప్పటికే సర్వేకోసం హైవే మాగ్నిట్యూడ్ కంపెనీ, ట్రాఫిక్ కోసం పీకే ఇంజినీర్స్, అలైన్మెంట్ కోసం ట్రాన్స్లింక్, ఫైనల్ అలైన్మెంట్ కోసం ఆర్వీ అసోషియేట్స్, సర్వేకోసం సుబుది టెక్నాలజీస్, ఎస్ఐఏ కోసం ఓవర్సీస్ మిన్టెక్ కంపెనీలు పనులు చేపట్టారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటి దాకా రెండు అలైన్మెంట్లపై సర్వే చేపట్టారు. అయితే వీటిల్లో దేన్ని నిర్ధారిస్తారో ఇంకా సృష్టం కాలేదని సమాచారం. భూసేకరణ వివరాలు ప్రదర్శన పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం కంభంపల్లి, గడ్డూరు, రామణపల్లి, గంగినాయనిపల్లి, బేలుపల్లి, పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి, సముద్రపల్లి, పెంగరగుంటల మీదుగా బంగారుపాళెం మండలంలోని గొల్లపల్లి, బోడబండ్ల, మహాసముద్రం, గుడిపాల మండలంలోని మాధవరం, జంగాళపల్లి, చిత్తూరు మండలంలోని ఇరువారం, కలెక్టర్ ఆఫీసు, గువ్వకల్లుల మీదుగా తమిళనాడులోకి బుల్లెట్ ట్రైన్ ప్రవేశిస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో ఇప్పటికే భూములు కోల్పోయే రైతుల పేర్లు, వారి మొత్తం విస్తీర్ణం, అందులో ఎల్ఏ విస్తీర్ణాలను తెలుపుతూ వివరాలను అక్కడి నోటీసు బోర్డులౖపై ప్రదర్శించారు. ఆ మేరకు జిల్లాలో 70 కిలోమీటర్ల మేర ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం వెళ్లనుంది. -
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పే..ద్దపాము చౌడేపల్లె : చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరు సమీపంలోని పంట పొలంలో వేసిన గుడిసెలో తొమ్మిది అడుగుల పొడవు గల భారీ జెర్రిపోతును ఆదివారం గుర్తించారు. పొలం యజమానులు భయంతో అక్కడే చంపేశారు. -
● తొలకరి సీజన్లో పిడుగులు పడే అవకాశం ● పిడుగుపాటుతో పెను ప్రమాదం ● అప్రమత్తతే శ్రీరామరక్ష
పాలసముద్రం: వేసవిలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడంతోపాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములతో కూడిన పిడుగులు పడుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే భయమేస్తోంది. మెరుపు మెరిసి బలంగా ఉరిమిందటే ఎక్కడో ఓ చోటు పిడుగు పడే ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఉరుము ఉరిమిందంటే పొలాల్లోని రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు పిడుగు భయంతో చెట్ల చాటుకు పరుగులు తీస్తారు. ఒక్కొక్కసారి అదే వారి ప్రాణం మీదకు తీసుకొస్తుంది. చెట్లు ఎత్తుగా ఉండడంతో పిడుగులు ఎక్కువగా వాటిని ఆకర్షిస్తాయి. ఈ విషయం తెలియక చెట్ల కిందకు వెళ్లి పిడుగుపాటుతో చనిపోయినవారు జిల్లాలో లేకపోలేదు. అలాంటి వారిలో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇటీవల పిడుగులు ఏ ప్రాంతంలో ఏ సమయంలో పిడుగు పడే ప్రమాదం ఉందో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగానే పసిగట్టి తెలియజేస్తున్నారు. దీంతో కొంతవరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే పిడుగు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఆరు బయట ఉండకూడదు ఉరుములు, మెరుపులు, వర్షం కురిసే సమయంలో ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతాలు, మైదానాలు, పొలాల్లో ఉండకూడదు. అలాగే పొడవైన చెట్ల కింద ఉండకూడదు. ఒకే చోట గుంపుగా ఉండకూడదు. గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార లాంటి ఇనుప వస్తువులు పెట్టుకోకూడదు. పిడుగు బారి నుంచి తప్పించుకునేందుకు నివాస గృహాలే మేలు. – హేమలత, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అప్రమత్తంగా ఉండాలి మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిడుగుపాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు సాధ్యమైనంత తొందరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తెన ప్రదేశాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉండకూడదు. – హనుమంతరావు, జిల్లా ఇమ్యూనేజేషన్ ఆఫీసర్, చిత్తూరు పాటించాల్సింది ఇవి.. వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎత్తైన చెట్లు, సెల్ టవర్లు, స్తంభాలు, కొండలు వద్దకు వెళ్లకూడదు. ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కంప్యూట ర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ స్టవ్లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించకూడదు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు నీటితో కూడిన పనులు చేయకూడదు. గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదు. -
సిద్దంపల్లిలో చైన్ స్నాచింగ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు మండలం సిద్దంపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు (తాళిబొట్టు గొలుసు) అపహరించారు. పోలీసుల వివరాల మేరకు ఇలా...సిద్దంపల్లి గ్రామానికి చెందిన వెంకటాద్రినాయుడు భార్య ధనలక్ష్మి ఇంటి బాల్కనీలో పడుకున్నారు. అర్ధరాత్రి వచ్చిన దొంగలు వీధిలైట్లు ఆఫ్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె మెడలో బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ చోరీలో సగం గొలుసు మాత్రం దొంగ చేతికి చిక్కింది. ఇంతలో మంచంపై పడుకున్న బాధితురాలి కొడుకు కేకలు పెట్టడంతో మిగిలిన సగం గొలుసును వదిలి దొంగ గోడ దూకి పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చోరీకి గురైన గొలుసు మొత్తం 27 గ్రాములు..అందులో సుమారు 10 గ్రాముల గొలుసు భాగాన్ని దొంగ చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
18 ఏళ్ల సేవలపై వేటు !
పుత్తూరు : మున్సిపాలిటిలో 18 ఏళ్లుగా జనన, మరణాల చూసే రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికురాలు కృష్ణ జయంతిని ఎలాంటి తప్పు చేయకున్నా.. కేవలం కక్ష సాధింపుతో తొలగించి ఆమె జీవితాన్ని నడిరోడ్డు మీదకు లాగారు. గత నెల 8వ తేదీన కృష్ణ జయంతిని సెలవుపై వెళ్లాలని కమిషనర్ మంజునాథగౌడ్ ఆదేశించారు. తాను ఏదైనా తప్పు చేశానా? నన్ను రావొద్దనడానికి గల కారణాలను చెప్పాలని ఆమె ప్రాధేయపడింది. నాపై ఒత్తిడి ఉంది.. మళ్లీ చెప్పే వరకు ఆఫీసుకు రావద్దంటూ కమిషనర్ చెప్పడంతో ఆమె మౌనంగా వెనుదిరిగారు. ఇది జరిగి నెల కావస్తుండగా ఈ లోపు తిరిగి విధుల్లో చేరడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం శూన్యం. గేట్పుత్తూరుకు చెందిన జేసీబీ బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో ఉన్న వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి తనను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జయంతి ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో సుమారు రెండు దశాబ్దాలుగా రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృష్ణజయంతిని విధుల నుంచి తప్పించడంపై ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్–టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు! రెడ్బుక్ రాజ్యాంగం మేరకు కమిషనర్ చర్యలు కక్ష సాధింపే కారణమంటున్న బాధితురాలు -
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు కిక్కిరిశారు. సెలవులు కావడంతో భక్తులు స్వామి దర్శనార్థం ఉదయం నుంచే క్యూ కట్టారు. ఉచిత, శ్రీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలో ఉన్న భక్తులకు అల్పాహారం అందజేశారు. ప్రముఖులు వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన సేవలు కల్పించారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ఆన్లైన్లో పోస్టుల మెరిట్ జాబితాచిత్తూరు రూరల్ (కాణిపాకం):జిల్లా వైద్య విధా న పరిషత్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను ఆన్లైన్ ఉంచినట్లు డీసీహెచ్ఎస్ పద్మాంజలి తెలిపారు. ఎంపికై న వారి కి మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులకు ఫోన్కాల్ ద్వారా తెలియజేశామని, కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. జనారణ్యంలోకి దుప్పి వెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో ఆదివారం సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి వచ్చింది. రక్త గాయాలతో ఉండగా గమనించిన స్థానిక రైతు ఇంటికి తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి దుప్పిని స్వాధీనం చేసుకొని చికిత్స చేయించి అడవిలో వదిలారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 15,377 విద్యార్థులుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోపలికి అనుమతించరాదని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలోని పరీక్షలు నిర్వహించే 35 పరీక్ష కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆన్లైన్న్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లా సమాచారం మొదటి సంవత్సరం విద్యార్థులు (జనరల్) 10,236 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్) 3,724 మొదటి సంవత్సరం (ఒకేషనల్) 810 ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) 607 మొత్తం విద్యార్థులు 15,377 పరీక్ష కేంద్రాలు 35ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయి. కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులదే బాధ్యత. – శ్రీనివాసులు, ఇంటర్మీడియట్ డీఐఈవో, చిత్తూరు -
ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!
చెరువు చుట్టూ పదూళ్లకు ఆదరువు.. చెరువే మనుగడకు ఆధారం..తొలకరికి ఆవాసం.. సిరులకు ప్రాకారం.. చెరువే సమస్తం.. మన నేస్తం.. అలాంటి నీటి వనరులను అభివృద్ధి చేసి వినియోగించుకోవాలి. అయితే వాటికి రక్షణ లేకుండా పోతోంది. పైగా అవి అక్రమణలకు అడ్డాగా మారుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు కళ్లున్న ధృతరాష్ట్రుల్లా చేష్టలుడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాల విస్తీర్ణంతో అలరారే చెరువులు చిక్కి శల్యమై.. చివరకు కనుమరుగవుతున్నాయి. కబ్జాలకు కారణాలివే.. ● అధికార యంత్రాంగం ఉదాసీనత. ● చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం. ● చిత్తూరు, తిరుపతి నగరాల్లో భూములకు భారీ డిమాండ్ రావడం. ● తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లను అడ్డుకోలేక పోవడం. ● రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, నగరపాలక అధికారుల మధ్య సమన్వయలోపం. ● చట్టంలోని లొసుగుల కారణంగా ఆక్రమణలు గుర్తించినా తొలగించే పరిస్థితి లేకపోవడం. ● చెరువును పూడ్చి అందులో అక్రమంగా నిర్మించి న నివాసాలకు విద్యుత్,నీటి వసతి కల్పించడం. ● అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులే పలుచోట్ల చెరువుల్లో వెంచర్లు వేయడం. ● వరదలొచ్చి మునిగినప్పుడే తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టి పెట్టకపోవడం. చిత్తూరు కలెక్టరేట్ : చెరువు అంటేనే రైతాంగానికి, నీటి నిల్వలకు కల్పతరువు. కానీ అవే చెరువులు మరికొద్ది రోజుల్లో పుస్తకాల్లో మాత్రమే చదువుకునే స్థితికి చేరుకునేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కబ్జాలకు గురవుతున్నాయి. రెండు జిల్లాల్లో వేల సంఖ్యలో చెరువులు ఆక్రమణల చెరలో పడినట్లు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన కనిపించకుండా పోవడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా చట్టం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు చెరువులు కబ్జాకు గురవుతున్నా చూసీ చూడనట్టు మిన్నకుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణల పర్వం ఇలా.. ● చిత్తూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని గిరింపేట గంగినేని చెరువు నగరంలో ప్రధానమైనది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్తో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. అలాగే నగర శివారులోని జడియం చెరువు, కట్టమంచి చెరువు, దుర్గానగర్ కాలనీలోని కుమ్మరివాని కుంట చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువుల్లో దాదాపు 75 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ● నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువు ఆక్రమణకు గురైంది. ఆ చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాలు, 439 ఎకరాలకు మునక పట్టాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జీవో నంబర్ 188 ప్రకారం చెరువులో నీరు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. అయితే స్థానిక టీడీపీ నాయకుడు చెరువులో గ్రావెల్ పోసి లెవల్ చేసుకుని దాదాపు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ● తిరుపతి నగరంలోనే 8 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఆక్రమించేస్తున్నారు. కొందరు నేతలు రెవెన్యూ అధికారులకు ముందే చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నాం. దాని జోలికి రాకండి అంటూ ఆదేశిస్తున్నారు. దీంతో కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై తమకు సమాచారం ఉన్నప్పటికీవాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నాచెరువు 77.46 ఎకరాలు, శెట్టిపల్లె చెరువు 55.25 ఎకరాలు, చెన్నాయగుంట 52.56 ఎకరాలు, పాన్ చెరువు 49.40 ఎకరాలు, కొరమీనుగుంట 32.20 ఎకరాలు, పూలవాని గుంట 23.82 ఎకరాలు, గొల్లవాని గుంట 29.04 ఎకరాలు, మంగళం చెరువు 75.98 ఎకరాలు ఉంది. మొత్తంగా 8 చెరువుల విస్తీర్ణం 395.71 ఎకరాలు అయితే ఇందులో 100 ఎకరాలకు పైగానే ఆక్రమణలకు గురైంది. ● తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లెలోని సాగునీటి చెరువు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ చెరువు స్థలాన్ని నాయుడుపేటకు చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ● తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు చెరువు విస్తీర్ణం సుమారు 156 ఎకరాలు. అందులో 50 ఎకరాల వరకు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. ● తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. సర్వే నంబర్ 839లోని 11 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది . అది రోడ్డుకు ఆనుకుని ఉండడంతో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఈ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ● చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 787 చెరువులున్నాయి. ఇందులో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం ఉన్నవి) 57 వరకు ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 వరకు ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి. మిగిలిన వంద చెరువులు 10 నుంచి 30 శాతం వరకు కబ్జాల బారిన పడ్డాయి. ఈ చెరువుల కింద ఆయకట్టు గతంలో 20 వేల హెక్టార్లుగా ఉండగా ఇప్పుడు 2 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. ● సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామంలోని చెరువు ఆక్రమణ చెరలో చిక్కుకుంది. కొందరు అక్రమార్కులు దర్జాగా ఇళ్ల నిర్మాణం చేపట్టేశారు. మాదనపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 839లో 11 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ చెరువు ఉంది. దీని ఆయకట్టు భూములను శ్రీసిటీ సెజ్కు కేటాయించారు. ఇదే అదునుగా కబ్జాదారులు రెచ్చిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చిట్టమూరు మండలం జంగాలపల్లి చెరువులో ఆక్రమణలుఆక్రమణలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని గంగినేనిచెరువు తిరుపతి జిల్లా కేంద్రంలో ఆక్రమణలో చెన్నాయగుంట చెరువుకబ్జాకు గురైన సత్యవేడు మండలం మాదనపాలెం గ్రామ చెరువుఅడిగేదెవరు.. ఆపేదెవరు? చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెరిగిపోతున్న చెరువుల హద్దులు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు. వందల సంఖ్యలో జల వనరులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన వాటిలో కొన్ని ఆక్రమణల పాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువతోపాటు చెరువుల భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నా రు. చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లతో రూ.వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. 2వేల వరకు కబ్జా కోరల్లో..! చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 8,063 చెరువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 2 వేల చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కబ్జాలే ఎక్కువ. సామాన్యుడు చెరువు గట్టుపై చిన్న పాక వేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారు. ఆగమేఘాలపై వాటిని తొలగించేస్తారు. అదే ఆక్రమణలకు పాల్పడిన కూటమి ప్రజాప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రిజిసే్ట్రషన్లకు అగచాట్లు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలోని క్రయ, విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. నెలలు గడుస్తున్నా స్టాంపు పేపర్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయాలు చేసేవారు అగచాట్లు పడుతున్నారు. సమస్య కొన్ని నెలలుగా ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టాంపుల కొరతను సాకుగా చూపి వెండార్లు ధరలు రెట్టింపు చేశారు. కొంత మంది రూ.100 స్టాంపును రూ.200కు విక్రయిస్తున్నారు. గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని క్రయ విక్రయదారులు వాపోతున్నారు. ●పిచ్చాటూరు వెళ్లి కొన్నా.. మా ఆస్తుల సెటిల్మెంట్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అయితే అవసరమైన స్టాంప్ పేపర్లు నగరిలో లేవు. రిజిష్ట్రార్ కార్యాలయంలో రెండు పత్రాలు మాత్రమే ఇచ్చారు. దీంతో తిరుపతి జిల్లా పిచ్చాటూరుకు వెళ్లి స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశా. ప్రింటింగ్లో ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ స్టాంపులు కొనాల్సి వస్తుందేమోననే భయంతో రెండు పేపర్లు అదనంగానే కొనాల్సి వచ్చింది. – గురుమూర్తి, టివి కండ్రిగ, నగరి మండలం ఈ–స్టాంపులతోనూ చేసుకోవచ్చు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సబ్ రిజిస్ట్ష్ట్రార్ కార్యాలయాలకు స్టాంపులు అందుతాయి. సమస్య వారి దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పంపుతామని చెప్పారు. రూ.10, రూ.20 స్టాంపులు ఇస్తున్నాం. ఇవేకాకుండా ఈ–స్టాంపులతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. – సత్యప్రసాద్, సబ్ రిజిస్ట్రార్, కార్వేటినగరం ● నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కొరత ● స్టాంపు ధరలకు రెక్కలు ● రెట్టింపు ధరలు వసూలు చేస్తున్న వెండార్లు ● కొన్ని నెలలుగా కొరతతో అవస్థలు ● స్టాంపులు చేతికొచ్చాకే స్లాట్ బుకింగ్లు నగరి : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పందాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు వినియోగించే రూ.100, రూ.50, రూ.20, రూ.10 విలువ గల స్టాంపు పేపర్లకు కొరత ఏర్పడింది. చిత్తూరు, చిత్తూరు రూరల్, నగరి, పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం, కుప్పం, బంగారుపాళెం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం స్టాంపుల కొరత కారణంగా రిజిస్ట్రేషన్లకు ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు స్టాంపులకు మించి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని కార్యాలయాల్లో రూ.100, రూ.50 స్టాంపులు లేక రూ.20, రూ.10 స్టాంపులు మాత్రమే అందిస్తున్నారు. స్టాంప్ వెండర్స్ వద్ద కూడా స్టాంపులు లభించడం లేదు. నిలిచిన సరఫరా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్లను తెప్పిస్తుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగతాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. అయితే అక్కడ చెల్లించాల్సిన బకాయిలు ఉండటంతోనే స్టాంప్ పేపర్లు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు పరుగులు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉండటంతో తక్కువగా జరిగే కార్యాలయాలకు పరుగులు తీసి అక్కడి నుంచి స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలా తెచ్చుకున్న పేపర్లు ప్రింట్ తీయడంలో పొరపాటు జరిగితే మళ్లీ పేపర్ల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రయ విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. స్టాంపుల కోసం తిరగలేనివారు ఒకటి రెండు పేపర్లతో పాటు తెల్లబాండ్ పేపర్లు వాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించేస్తున్నారు. నెలలు గడుస్తున్నా స్టాంప్ పేపర్ల కొరత సమస్య పరిష్కారం కాకపోవడం ఆస్తులు కొనుగోలు, విక్రయాలు చేసేవారికి ఇబ్బందికరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నాడు రాద్దాంతం.. నేడు ఆధారం గత ప్రభుత్వం ఈ–స్టాంపు విధానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాద్దాంతం చేసింది. ఫిజికల్ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులు చూడటానికి జిరాక్స్ పేపరు మాదిరిగా ఉందని ప్రింటర్ నుంచి తీసే ఈ–స్టాంపు పేపరుపై అక్షరాలు కొద్ది కాలానికే చెరిగిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభించకపోవడంతో ఈ– స్టాంపులను వాడుకోవాలని కూటమి ప్రభుత్వం సూచిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ–స్టాంప్ల ధరలకు రెక్కలు వచ్చాయి. స్టాంపు ధరకు రెట్టింపు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి ఉంది. అధిక ధర వసూలు కొందరు వెండార్ల వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ డిమాండ్ సృష్టిస్తూ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపు రూ.50కి రూ.100 స్టాంపు రూ.200కు విక్రయాలు జరుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ధర ఎక్కువైనా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. డిమాండ్కు తగిన విధంగా స్టాంపులు లభించని పరిస్థితి నెలకొంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు లభించే కొద్దిపాటి పేపర్లతోనే కొనసాగుతున్నాయి. ఆ నిల్వలు ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
చంద్రగిరి వద్ద డివైడర్ను డీకొట్టిన బస్సు
చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ రాజారెడ్డి, కండక్టర్ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్కుమార్, దీపారాణి, నితీశ్కుమార్, అక్షయ్కుమార్, తిరుసడై, తేజస్విని, రామ్లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తప్పులు దొర్లకుండా.. నష్టం కలగకుండా
● బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు వేగవంతం ● ఉమ్మడి చిత్తూరు జిల్లా కసరత్తు ప్రక్రియలో విద్యాశాఖ నిమగ్నం ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న ప్రక్రియ ● పర్యవేక్షించిన చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎన్ కుమార్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో ముందస్తు కసరత్తును చిత్తూరు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కసరత్తు నిర్వహించారు. ఈ ప్రక్రియలో తప్పులు దొర్లకుండా..ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ కసరత్తులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు. పకడ్బందీగా చర్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 66 మండలాల్లో త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఉమ్మడి చిత్తూరు పరిధిలో నిర్వహించనుండడంతో చిత్తూరు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిద్ర లేని రాత్రులు గడుపుతూ కసరత్తు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క పోస్టును బ్లాక్ చేయకుండా కసరత్తు నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న టీచర్ల సీనియారిటీ, ఖాళీల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలక ఘట్టం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్ధిష్టమైన ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్, డీఈఓ కార్యాలయ ఏడీ వెంకటేశ్వరరావు, డీవైఈఓలు ఇందిర, బాలాజీ, లోకేశ్వరరెడ్డి, 66 మండలాల ఎంఈఓలు, పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న టీచర్ల వివరాలు ప్రభుత్వ యాజమాన్యంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 598 మండల పరిషత్, జెడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 13,969 నగరపాలక కార్పొరేషన్ పరిధిలో: 454 మున్సిపాలిటీ పరిధిలో: 433 మొత్తం విధులు నిర్వహిస్తున్న టీచర్లు: 15,454 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండాల్సిన టీచర్ల పోస్టుల వివరాలు ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని మంజూరు పోస్టులు 723 మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలో మంజూరు పోస్టులు 15,552 నగరపాలక కార్పొరేషన్ మంజూరు పోస్టులు 589 మున్సిపాలిటీ పోస్టులు 508 మొత్తం పోస్టులు 17,372ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీల వివరాలు ప్రభుత్వ యాజమాన్యంలో ఖాళీలు 125 ఎంపీపీ, జెడ్పీ పరిధిలోని ఖాళీలు 1583 నగరపాలక కార్పొరేషన్లోని ఖాళీలు 135 మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీలు 75 మొత్తం ఖాళీలు 1,918 6 వేల ఖాళీలు చూపే అవకాశం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం 1,918 ఖాళీలున్నాయి. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో 6 వేల వరకు ఖాళీలు చూపించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల వెల్లడిస్తున్నారు. అలాగే ఉద్యోగోన్నతులు, మిగిలిన ఖాళీలకు తాజాగా నిర్వహించే డీఎస్సీలో వచ్చే టీచర్లను భర్తీ చేసేందుకు కసరత్తు చేపడుతున్నారు. క్లియర్ వేకెన్సీల వివరాల ఆధారంగా మొదట్లో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత 1:2 విధానంలో ఉద్యోగోన్నతుల జాబితా విడుదల చేయనున్నారు. -
భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి
తిరుపతి సిటీ: ‘ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. రాష్ట్రంలో అలాంటి హక్కుకు భంగం కలిగేలా ఘటనలు జరగడం ప్రమాదకరం. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు చట్ట విరుద్ధం. ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపితే కేసులు, భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు చేయడంలో ఆంతర్య మేమిటో అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల హవా కొనసాగుతోంది. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి లే దు’..అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాదిగా సాగుతు న్న పాలనపై తన అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే.. బలహీన పడుతున్న విద్యావ్యవస్థ రాష్ట్రంలో పాఠశాలలు బలహీన పడే పరిస్థితి నెలకొంది. 9 రకాల పాఠశాలల ఏర్పాటు అనే కాన్సెఫ్ట్తో ప్రభుత్వం నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీంతో వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సుమారు 10వేల ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ కానున్నాయి. గత ప్రభుత్వంలో మ్యాథ్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రమోషన్లు రద్దు కానున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు విలయతాండవం చేయనున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రొత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు–నేడు పథకంతో గత ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించింది. మరికొన్ని పాఠశాలల్లో మౌలికవసతులను కల్పించాల్సి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదు. 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని గత ప్రభుత్వ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వక్తుల చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. డీఎస్సీపై ఆంక్షలు దారుణం మెగా డీఎస్సీ పేరుతో 16 వేల పోస్టులకు పైగా విడుదల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అందులో ఆంక్షలు విధించడం దారుణం. అభ్యర్థుల వయోపరిమితి 47కు పెంచాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల ప్రిపరేషన్కు కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలి. అర్హతల పేరుతో మార్కుల శాతం పరిగణనలోని తీసుకునేలా నిబంధనలు విధించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రశ్న పత్రాలు ఇవ్వాలి. తప్పు ఎత్తిచూపే హక్కు మీడియాకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపే హక్కు పత్రికలకు, మీడియాకు ఉంది. అలాంటి వాటిని స్వీకరించి తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ అలా జరగకపోగా మీడియా ప్రతినిధులపైన, కలం కార్మికులపైన దాడులు చేయడం దారుణం. భయపెట్టడం, కేసులు బనాయించడం దారుణం. ప్రతికా చ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధం. పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు అవస్థలు పడుతున్న విద్యార్థులు 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలండర్ ఏదీ? రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు రంగాల హవా సంక్షేమం గాలికి వదిలేశారు తప్పును ఎత్తి చూపితే కేసులు, దాడులా? ‘సాక్షి’తో మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు సంక్షేమం గాలికే కూటమి ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ, ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాలు నిర్వీర్యమయ్యాయి. వాటి ప్రస్తావనే ఎత్తడం లేదు. పీ4, స్వరాంధ్ర 2.0 అంటూ స్వప్నలోకంలో ప్రగతి జరుగుతున్నట్లు ఉంది. రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న గ్యారంటీ లేదు. 20 లక్షల ఉద్యోగాల మాటేంటో? నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండ్ విడుదల హామీలు ఏమయ్యా యో. ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. -
కుంజేగానూరులో భూచోళ్లు
కుప్పం: పశువులకు మేతకు సౌకర్యంగా ఉన్న గుట్ట పొరంబోకుపై కొందరు కూటమి నేతల కన్ను పడింది. గుట్టకు ఆనుకుని ఉన్న డీకేటీ భూములను చూపిస్తూ గుట్ట పొరంబోకును చదును చేసి లేఅవుట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి చదును చేసి లేఅవుట్గా మార్చి ప్లాట్లు వేసి, లాభార్జన గడించే పనిలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. గుట్టపొరంబోకు చదును మండలంలోని కుంజేగానూరు రెవెన్యూ పరిధిలో బస్టాండ్ వద్ద 2.40 ఎకరాల గుట్టపొరంబోకు స్థలం ఉంది. ఈ భూమిలో కుంజేగానూరు, ఎన్.కొత్తపల్లి, నూటకుంటకు చెందిన గ్రామాల్లోని పశుపోషకులు పశువుల మేత బీడుగా ఉపయోగిస్తున్నారు. కుంజేగానూరు బస్టాండ్కు ఎదురుగా రోడ్డు పక్కన ఉండడంతో ఈ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైన కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేపట్టా రు. తమ అనుభవంలో ఉన్నట్లు కొందరు టీడీపీ నేత లు నకిలీ రికార్డులు సృష్టించి, స్వయం ఉపాధి కోసం రెండు దుకాణాల రూములను నిర్మిస్తున్నారు. 2.40 ఎకరాల గుట్ట పొరంబోకును చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇ లా ఉండగా మరోవైపు గరికచీనేపల్లెకు చెందిన ఓ టీడీపీ ప్రధాన నేత కుంజేగానూరుకు వెళ్లే ఆవుల ఓనిని పూర్తిగా చదును చేసి, బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పశువులను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకువెళ్లేందుకు ఈ ఆ వులఓనిగా వినియోగించేవారు. టీడీపీ నేత దాన్ని ఆక్రమించడంతో వారు ఇక్కట్లు పడుతున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం టీడీపీ నేత ఆవుల ఓని చదును చేసి, పొలంలో క లుపుకుని బొప్పాయి సాగు చేస్తున్నారని గతంలో రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని మరికొందరు టీడీపీ నేతలు గుట్టపొరంబోకు కబ్జా కు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేయగా తాము డీకేటీ పట్టా పొందామని రికార్డులు చూపిస్తూ వ్యవహరిస్తునట్లు సమాచారం. ఉన్న తాధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
మామిడితోటపై ఏనుగుల దాడి
బంగారుపాళెం: మండలంలోని మొగిలిలో శుక్రవారం రాత్రి మామిడితోటపై ఏనుగులు దాడి చేశాయని బాధిత రైతు తెలిపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు గౌనిచెరువు వద్ద మామిడితోట ఉంది. సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మామిడితోటలోకి ప్రవేశించి చెట్ల కొమ్మలను విరిచి కాయలను కొరికి నేలపాలు చేశాయని తెలిపారు. పంట చేతికందే సమయంలో ఏనుగులు తోటపై దాడి చేసి నష్టపరిచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగులు తరచూ రైతుల మామిడి తోటలపై దాడులు సాగిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖాధికారులు ఏనుగులు పంటలపైకి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుక్కల దాడిలో జింక మృతి పాలసముద్రం: మండలంలోని కన్నికాపురం సమీపంలోని వంకలో శనివారం కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వేసవి కారణంగా అడవిలో నీరు లేకపోవడంతో కన్నికాపురం దళితవాడకు సమీపంలోని వంకలో నీరు తాగడానికి వచ్చిన జింకను గమనించిన వీధి కుక్కలు మూకుమ్మడిగా దానిపై దాడి చేసి, గాయపరిచాయి. దీంతో జింక మృతి చెందింది. -
వరసిద్ధుడి సేవలో ఆర్టీఐ కమిషనర్
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని శనివారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ (ఆర్టీఐ) చావలి సునీల్కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారు లు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి, ప్రసాదం, స్వామి వారి చిత్రపటం అందజేశారు. అర్ధగిరి క్షేత్రంలో పౌర్ణమి వేడుకలు రేపు తవణంపల్లె: మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ హనుమంతురావు తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అ లంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు ఆలయ మండపంలో స్వామివారికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రాకారోత్సవం వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజనలు, భక్తి కీర్తనల సంగీత కచేరి ఉంటుందన్నారు. కాణిపాకంలో భక్తుల రద్దీ కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున స్వామివారికి అభిషేక పూజలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన సేవ క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని గోసంరక్షణ ట్రస్టు కు ఇద్దరు దాతలు శనివారం రూ.లక్ష వంతు న విరాళాలు ఇచ్చారు. గుంటూరుకు జిల్లాకు చెందిన సూరిశెట్టి రమేష్ రూ.లక్ష నగదును ఆలయాధికారులకు అందజేశారు. ఆలయాధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే చైన్నెకు చెందిన దాత కలవకుంట ప్రత్యోత్ రూ.లక్ష నగదు ఆలయాధికారులకు అందజేశారు. ఆలయ సిబ్బంది కోదండపాణి దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించారు. పెళ్లి పేరుతో వంచన పుంగనూరు: పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామసముద్రం మండలం చింపరపల్లెకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతి తండ్రితో ఆర్థిక లావాదేవిలు అడ్డు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి ఇల్లు రాసుకున్నాడు. ఇలా మోసం చేస్తూ నిలదీసినందుకు యువతిని ప్రేమ పేరుతో మోసగించి, గర్భవతిని చేశాడని ఆమె పోలీసులకు కిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
● దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్ లక్ష్యం ● వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్య తో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి కేద్రం ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అను మతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతోపాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యనందిస్తున్నట్టు తెలిపారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటి అన్ని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బీ.శ్రీకర్రెడ్డి, బీ.సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
ఇక జగమర్ల గ్రామానికి మహర్దశ ●
● దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా అభివృద్ధి ● జిల్లాలో పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపిక ● యానాదుల జీవన ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు ● విద్యాభివృద్ధికి ప్రత్యేక పాఠశాలలు, ఉపాధికి పెద్దపీట ●దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాల అభివృద్ధి కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం అందుకు ఊపిరి పోయ నుంది. ఈ పథకం అమలుకు పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపికైంది. దీంతో ఆ పల్లె ప్రగతి పథంలో నడవనుంది. ఆనందంగా ఉంది ఎక్కువగా ఎస్టీలున్న తమ గ్రామం జనజాతీయ గ్రా మ్గా ఎంపిక కావడం ఆ నందంగా ఉంది. ఆ నిధుల తో మా గ్రామం బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఇక్కడున్న యానాదుల అభ్యున్నతి విద్యతోనే సాధ్యమని నమ్ముతున్నా. – విజయ్, సర్పంచ్, జగమర్ల, పలమనేరు మండలం 6 కిలోమీటర్ల రోడ్డు వేస్తే అభివృద్ధి మా గ్రామస్తులు పండించిన పంటను బంగారుపాళెం, పుంగనూరు, చౌడేపల్లి, సోమలకు తరలించాలంటే పలమనేరు హైవేలోకెళ్లి బంగారుపాళెం వెళ్లాలి. సోమల, చౌడేపల్లికి వెళ్లాలంటే పలమనేరుకు వెళ్లి చౌడేపల్లి, పుంగనూరు చుట్టుకుని వెళ్లాల్సివస్తోంది. అదే తుంబకుప్పం రోడ్డు పనులు జరిగితే రైతులకు చాలా మేలుగా జరుగుతుంది. – రెడ్డెప్పరెడ్డి, జగమర్ల, పలమనేరు మండలం పలమనేరు: అభివృద్ధిలో వెనుకబడి ఎక్కడో విసిరేసినట్టున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్రం నడుం బిగించింది. అన్ని గ్రామాలతో స మానంగా గిరిజన గ్రామాలను సైతం అభివృద్ధి చేసి, గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని గత ఏడాది గాంధీ జయంతి రోజున ప్రారంభించింది. దేశంలోని 63 వేల గిరిజన గ్రామాల్లో ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరేలా రూ.80 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని జగమర్ల, మొగిలిపొదరేవులు, కల్లిగుట్ట గ్రామాలను పరిశీలించి, వీటిలో అత్యంత వెనుకబడిన పల మనేరు మండలంలోని జగమర్ల గ్రామాన్ని తొలిదశలో ఎంపిక చేసినట్టు జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి మూర్తి తెలిపారు. పట్టి పీడిస్తున్న రోడ్డు సమస్య ఇదీ.. దేవళంపెంట(యానాదికాలనీ) నుంచి తుంబకుప్పం గ్రామానికి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతానికి ఈ రహదారి మట్టిరోడ్డుగా ఉంది. ఈ మార్గంలో వాహనా లు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డును బాగు చేసి, తారు రోడ్డుగా మార్చితే పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల మండలాలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే పీలేరు, పూతలపట్టు, తవణంపల్లె, సదుం, సోమల, చౌడేపల్లెకు వెళ్లేందుకు జగమర్ల గిరిజనులకు అనుకూలంగా ఉంటుంది. ఇక పలమనేరు, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల, పెద్దపంజాణి మండలాలలోని ఆరు మారుమూల అటవీ గ్రామాలకు రాకపోకల సౌకర్యం కలుగుతుంది. గ్రామంలో ఏమి చేస్తారంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా గ్రామంలో విద్యకు పెద్దపీట వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. గ్రామంలో ఎక్కువగా చేసే పనులను గుర్తించి, వాటిని పెంచి జీవనోపాది పెంచే కార్యక్రమాలు చేపట్టనుంది. గిరిజన కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు, పాడి పరిశ్రమ అభివృద్ధిలాంటివి ఉంటాయి. -
పూతలపట్టులో మాక్ డ్రిల్
పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో శనివారం అడిషనల్ ఎస్పీ శివా నంద కిషోర్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ యూనిట్ వంటి కీలక ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఉద్యోగులు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సైరన్లు మోగినప్పుడు అనుసరించాల్సిన భద్రతా ప్రోటో కాల్, బాంబు బెదిరింపుల సమయంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చర్యలు, అలాగే హెల్త్, ఫైర్ రె స్పాన్స్ టీమ్ల పాత్రను ఈ డ్రిల్లో ప్రాక్టికల్గా చూపించారు. ఐఓసీఎల్ వంటి ఇంధన సంస్థలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు అత్యంత కీలకమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, ప్యాకెట్లు, పరికరాలను సిబ్బంది తాకకూడదని, వెంటనే పోలీసులకు లేదా బాంబ్ స్క్వాడ్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీలు సాయినాథ్, ఏఆర్ డీఎస్పీలు చిన్ని కృష్ణ, పూతలపట్టు సీఐ కృష్ణ మోహన్ తదిరతులు పాల్గొన్నారు. -
అంతా నా ఇష్టం!
● డీఎస్పీ వాహనాన్ని లాగేసుకున్నా నోరెత్తకూడదు ● యూనియన్ ఆఫీస్ను ఖాళీ చేయించేందుకు యత్నం ● ‘బాస్’కు వాస్తవాలు చెప్పలేక కుమిలిపోయిన ఖాకీలు ● చిత్తూరు ‘ఏఆర్’లో ‘సూపర్బాస్’గా చెలామణి చిత్తూరు అర్బన్: ఆర్ముడు రిజర్వు (ఏఆర్)..లా అండ్ ఆర్డర్. పోలీసుశాఖకు ఈ రెండూ గుండెకాయ, మెదడు లాంటివి. ఏ ఒక్క విభాగంలో చిన్న తేడా వచ్చినా.. ఒకరి ఒంటెద్దు పోకడతో ఇంకొకరికి ఇబ్బందులు తప్పవు. చిత్తూరు పోలీసుశాఖలోని ఏఆర్ విభాగంలో ‘చిన్నబాస్’గా చలామణి అవుతున్న ఓ వ్యక్తి ఏకంగా తనకు తానే ‘సూపర్బాస్’ అనుకుని భ్రమలో ఉన్నతాధికారులపైనే కాలు దువ్వాడు. విషయం ‘బాస్’ ఎదుట కక్కలేక, తమలో తాము మింగలేక చాలా మంది ఖాకీ అధికారులు లోలోపల కుమిలిపోయారు. ఉదయించిన ‘భాస్కరు’డు అస్తమించిక తప్పదన్నట్లు.. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ఒక్కో ఘన కార్యం వెలుగులోకి వస్తోంది. ఎవరైనా లెక్కలేదంతే.. జిల్లా పోలీసుశాఖలో ఎస్పీ తరువాత ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఆర్డర్ వారీగా ఉంటారు. ఇందులో ఓ కానిస్టేబుల్ డీఎస్పీతో మాట్లాడాలంటే ఓ విధానం ఉంది. అదే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడలన్నా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఏఆర్లో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా ఏఎస్పీలనే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాట్లాడుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక డీఎస్పీ అంటే అస్సలు లెక్కలేదు. కనీసం తనతోటి ర్యాంకు ఉన్న వ్యక్తితో ప్రవర్తించే తీరు కూడా వివాదస్పదమే. జిల్లా పోలీసుశాఖలో పనిచేసే ఓ డీఎస్పీ తనకు ఆరోగ్యం బాగాలేదని సెలవుపై వెళ్లారు. ఈ సమయంలో వాహనాన్ని హెడ్క్వార్టర్కు అప్పగించారు. తిరిగొచ్చి వాహనం అడిగితే, ఎవరూ సమాధానం చెప్పలేదు. తీరా విచారిస్తే ఆ సూపర్బాస్ డీఎస్పీ వాహనాన్ని మరో ప్రాంతానికి పంపేసినట్లు తెలుసుకున్నారు. ఇప్పటికే తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రయాణానికి అనుగుణంగా ఉండేందుకు రూ.లక్ష వరకు తన వాహనానికి ఖర్చు చేశానని, దాన్ని తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోలేదని సమాచారం. అసలు తనకు ఎందుకు ఫోన్ చేశారంటూ ఎదురు ప్రశ్నించి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ అధికారి కుంగిపోయి తనకు జరిగిన అవమానం ఎవరికీ చెప్పకుండా మదనపడిపోతున్నారు. నీడను కూల్చే యత్నం.. నాలుగు వేల మందికి పైగా సిబ్బంది ఉన్న పోలీసుశాఖకు జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయం పెట్టుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా ఖాకీలు వస్తే యూనియన్ ఆఫీస్లో కాసేపు సేదతీరి, తమతోటి సిబ్బందిని పలకరించడానికి ఓ నీడ ఉందనే ఆనందంలో ఉన్నారు. కానీ యూనియన్ వాళ్లతో గిట్టని ఆ ‘సూపర్బాస్’ ఏకంగా ఆ కార్యాలయాన్నే ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఏఆర్ కార్యాలయం లోపల యూనియన్ ఆఫీస్ ఎలా పెట్టుకుంటారని, దీన్ని ఖాళీ చేయాలని ఖాకీలపైనే ఒత్తిడి తీసుకొచ్చాడు. విషయం ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెబితే ఏం జరుగుతుందోనని యూనియన్ నాయకులు సైతం నోరెత్తలేదు. తీరా విషయం బాస్కు తెలియడంతో ఆయన కల్పించుకోవడంతో యూనియన్కు నిలవడానికి నీడైనా దొరికినట్లయ్యింది. అన్నింటికీ ఒక్కటే కారణం.. ‘ఏయ్ నేను ఇంతకు ముందు ఎక్కడ పనిచేశానో తెలుసా..? సీఎం పేషీకు ఫోన్ చేయమంటావా..?’ అనే మాటలు అందరి నోళ్లు మూయించేశాయి. మరి ఆ పేషీ నుంచే ‘సూపర్బాస్’కు మళ్లీ జిల్లాలో పనిచేయడానికి ఆదేశాలు వస్తాయో..? ఏకంగా సీఎం వద్దే బాధ్యతలు నిర్వర్తించే భాగ్యం దక్కుతుందో వేచి చూడాలి. -
చైన్ స్నాచర్ అరెస్టు
నగరి : కొంతకాలంగా నగరి, విజయపురం ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల్లో వెళుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్లను చోరీ చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న చైన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, సీఐ విక్రమ్ లు కథనం మేరకు.. నగరి సబ్డివిజన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల ఛేదనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నగరి పరిసర ప్రాంతాలు, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాత నేరస్తులతో పాటు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. శనివారం ఉదయం సీఐకి అందిన సమాచారం మేరకు, నాగలాపురం జంక్షన్ వద్ద విజయపురం మండలం, ఇల్లత్తూరుకు చెందిన అజిత్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఆనంతప్పనాయిడుకండ్రిగ, విజయపురం మండలం పన్నూరు సబ్స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనంలో వచ్చి మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక అపాచీ మోటార్ సైకిల్, చోరీ చేసిన సుమారు రూ.4 లక్షల విలువైన 45 గ్రాముల బరువు రెండు బంగారు బొందు చైన్లులు స్వాధీనం చేసుకున్నారు. అజిత్ అరెస్టులో ప్రతిభ కనబరిచిన సిబ్బంది లోకనాథం, గణేష్, ధన కోటి, రమేష్ను అభినందించడంతోపాటు వారికి రివార్డులు అందించారు. నూతన కార్యవర్గం చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా పరిషత్ యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ వివరాలను ఎన్నికల అధికారి పీఎంఆర్ ప్రభాకర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా చలపతిరెడ్డి, సుజాత, లక్ష్మీపతి, కార్యదర్శిగా రాజేంద్రన్, సహాయ కార్యదర్శులుగా రూప్సాగర్, బాలకృష్ణ్ణ ఎన్నికయ్యారు. అలాగే కార్యనిర్వహక కార్యదర్శిగా చక్రవర్తి, కోశాధికారిగా వాసుదేవరావు, జిల్లా కౌన్సిలర్లుగా గిరిధర్రెడ్డి, శశిధర్ చౌదరి, చంద్రశేఖర్రెడ్డి, తులసీరామ్, దస్తగిరిసాహెబ్, సుష్మకీర్తి, శ్రీనివాసులు, హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నికలకు పరీశీలకులుగా చెంచురత్నం, చక్రపాణి వ్యవహరించారు. -
అవకతవకలు జరిగితే కఠిన చర్యలు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దర్శన సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆలయ ఈఓ పెంచలకిషోర్ హెచ్చరించారు. వరసి ద్ధి వినాయకస్వా మి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం అన్ని విభా గాల అధికారులు, సిబ్బంది, అర్చకులతో ఆయన సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అందరూ అ కింత భావంతో పనిచేయాలన్నారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. దర్శ నార్థం సిబ్బందికి ఎవరైనా తెలిసిన వ్యక్తులు వస్తే కచ్చితంగా టికెట్లు తీసుకోవాలన్నా రు. దర్శన విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నా రు. ఆలయ అదాయ పెంపు విషయంలో ప్రతి ఒక్కరూ దేవస్థానానికి సహకరించాలన్నారు. ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు. ఇక బయోమెట్రిక్తో పత్రాల అందజేత చిత్తూరు కార్పొరేషన్: సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు ఇక బయోమెట్రిక్ అయ్యాక ఇవ్వాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణన్ మురుగన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షిగా బయోమెట్రిక్ పెట్టిన వారికి తతంగం ముగిశాక బయోమెట్రిక్ పెట్టించుకుని పత్రాలు అందజేసేవారు. ప్రస్తుతం అలా కాకుండా క్రయ, విక్రయదారుల్లో ఎవరైనా ఒకరు కచ్చితంగా బయోమెట్రిక్ పెడితేనే పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అక్రమ సోదాలు అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమ సోదాలు అన్యాయ మని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా పలు పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధానాలు ప్రస్తుతం అమలు చేయడం దారుణమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కలంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ఆ విషయం తెలిసనప్పటికీ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాజాగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఏకపక్షంగా సోదాలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘ నాయకులు కృపానందరెడ్డి, యాదవేంద్రరెడ్డి, హరిప్రసాద్, కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, కుపేంద్ర, తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు అనైతికం పుంగనూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని, ఇది అనైతికమని పాత్రికేయులు ఆరోపించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలను ఖండిస్తూ శుక్రవారం పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ లోపాలను సాక్షి దినపత్రికలో ప్రచురిస్తుండడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేయడం బాధకరమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమే ధ్యేయంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వాపో యారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సైపుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్కుమార్, ఎన్.రసూల్, మర్రిబాబు, కోటారెడ్డి ప్రసాద్, జగదీష్, కృష్ణమూర్తి, రెడ్డెప్ప, జావీద్, పురుషోత్తం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల ఆందోళనలుజర్నలిస్టులపై దాడులు మానుకోవాలి చౌడేపల్లె: కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు నాగరాజ, రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేయడం తగదన్నారు. జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ భార్గవికు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రసూల్, సుబ్రమణ్యంసింగ్, మురళి, హరిప్రసాద్, శ్రీనివాసులు, చిన్నా, రమేష్, వెంకటేష్, పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ముమ్మర తనిఖీలు
101 కేసుల నమోదు చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ మణికంఠ చిత్తూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సైతం తనిఖీ చేశారు. ప్రజల భద్రతను మెరుగుపరచి, నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో 1,781 వాహనాలను తనిఖీ చేయగా, నిబంధన లు పాటించని 101 మందిపై కేసులు నమోదు చే శారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 9 మందిపై, చౌడేపల్లెలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టారు. పెద్దపంజాణిలో సరైన బిల్లులేకుండా సరఫరా చేస్తున్న 10 వేల లీ టర్ల డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ వాయిదా చిత్తూరు అర్బన్: చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జరగాల్సిన జాతీయ లోక్అదాలత్ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్.భారతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్ను జూలై 5వ తేదీన నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు. కక్షిదారులు సహకరించాలని కోరారు. ఎన్సీడీ సర్వే పూర్తి చేయండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎన్సీడీ సర్వే వే గవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డీఎంఅండ్హెచ్ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చాలా పీహెచ్సీల పరిధిలో ఎన్సీడీ సర్వే చేయడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారన్నారు. ఎందుకంతా నిర్లక్షమని, సర్వే త్వరితగతినగా పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్సీహెచ్ఐడీ, అభ ఐడీకి అనుసంధాన ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
పటిష్టంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈఓ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై ఛీప్, డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ పరీక్షలకు 15,377 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ చాలా ముఖ్యమైనవన్నారు. పరీక్షల నిర్వహణలో అనుభవం ఎంతో నేర్పిస్తుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో ప్రశ్నపత్రాలు తీసుకెళ్లవద్దు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లకూడదని పరీక్షల డీఈసీ కన్వీనర్ దయానందరాజు వెల్లడించారు. చెడ్డపేరు తెచ్చుకోకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ విధులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ తీరు ఒకటే అయినప్పటికీ కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రంలో చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులే బాస్లని తెలిపారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థినీ తనిఖీ చేసిలోనికి పంపాలన్నారు. ప్రాంగణంలో చిట్టీలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసులు గేట్ లోపల సెల్ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. సెట్ పరిశీలనలో జాగ్రత్తలు ముఖ్యం ఏ రోజుకు ఆరోజు ఉన్నతాధికారులు సూచించే ప్రశ్నపత్రాల సెట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని డీఐసీ సభ్యుడు శరత్ చంద్ర అన్నారు. పరీక్షల నిర్వహణలో చెక్లిస్ట్ను అనుసరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేటప్పుడు సెట్ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించుకుని తీసుకెళ్లాలన్నారు. ప్రశ్నపత్రాలు తక్కువ రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ప్రశ్నాపత్రాలు ఇచ్చే సమయంలో మీడయం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ట్రస్టులకు విరాళం
కాణిపాకంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు దాతలు శుక్రవారం నగదు విరాళాలు అందజేశారు.శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు శాఖలో జరుగుతున్న పరిణామాలపై ఆ శాఖలో విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఏ ఇద్దరు ఖాకీలు ఒక చోట కలిసినా ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న బదిలీలపై మాట్లాడుకుంటున్నా రు. తాజాగా స్పెషల్ బ్రాంచ్లో సీఐగా పనిచేస్తున్న భాస్కర్, మోటారు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఎంటీఓ) భాస్కర్పై బదిలీ వేటు పడింది. వీరిద్దరూ ఏదో ఒక స్టేషన్కు బదిలీ అయివుంటే పెద్దగా చర్చ నడిచేదికాదు. కానీ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గురించే ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్బీ సీఐ ఎన్.భాస్కర్ను ఏకంగా కర్నూల్ రేంజ్ వేకెంట్ రిజర్వుకు (వీఆర్), ఎంటీఓ జి.భాస్కర్ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆద్యంతం వివాదాస్పదం.. ఎంటీఓ.. జిల్లా పోలీసుశాఖలో పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టనే చెప్పాలి. పోలీసుశాఖలోని వాహనాల పర్యవేక్షణ, వీటికి ఉపయోగించే ఇంధనం, పోలీసు వాహనాలకు డ్రైవర్ల కేటాయింపు వంటి పనులను చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇపుడా పరిస్థితి లేదు. ఎంటీఓ అంటేనే పోలీసు ఉన్నతాధికారిని కాకా పట్టడం, ఏయే సబ్–డివిజన్లో ఇన్స్పెక్టర్ ఎవర్ని కలుస్తున్నాడు..? ఎస్ఐ సెలవు పెట్టి ఎక్కడికి వెళుతున్నాడు..? డీఎస్పీ పనితీరు ఎలా ఉంది..? లాంటి విషయాలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పడం, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిపై ఆరోపణలు చేయడం, యూనియన్ నాయకులపై పెత్తనం చెలాయించడం లాంటి పనులపైనే దృష్టి పెడుతున్నారు. తల్లిలాంటి ఏఆర్ విభాగంలో ఏఎస్పీల నుంచి డీఎస్పీలు, తోటి ఆర్ఐలు ఉన్నతాధికారులనే ఎదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఇక ఏఆర్ అధికారులు వాహనాలు అడిగితే అమర్యాదగా మాట్లాడడం, పైగా చోరీ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను తన వద్దకు తెప్పించుకోవడం, కుటుంబ సభ్యుల్ని అందులో ఎక్కించుకుని రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై ఏఆర్తోపాటు లా అండ్ ఆర్డర్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు సమాచారం. ఇదికాదన్నట్లు మొత్తం ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగం తన కనుసన్నల్లోనే పనిచేయాలన్నట్లు ‘సూపర్ బాస్’గా చెలామణి అవుతూ ఓ వెలుగు వెలిగిన సందర్భం. చిత్తూరులోని పోలీసు ఏఆర్ కార్యాలయం – 12లో– 12లోన్యూస్రీల్పంచాయతీలకు రూ.1.38 కోట్లు విడుదల చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు రాష్ట్ర గ్రాంట్గా తొలి త్రైమాసికానికి రూ.1.38 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తల సరి ఆదాయం(పర్క్యాపిటా) కింద రూ.15,05, 785, వృతి పన్ను రూ.36,33,196, సర్పంచుల గౌర వేతనాలకు రూ. 86,95,992, లైబ్రరీ గ్రాంటు రూ.673 కలిపి రూ.1.38 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లో ఈ నెల 12, 13వ తేదీల్లో జమ చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి జిల్లాలోని 26 మంది గ్రేడ్ –3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్– 2 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని ఖాళీలున్న గ్రేడ్ –2 గ్రామ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ హరణ ఆటవిక చర్య చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం ఆటవిక చర్య అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వమండా పోలీసులు సోదాలు చేయడం నీతిమాలిన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగమైన ఒక స్తంభాన్ని కూల్చేయాలనుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీపై కోపమే కారణమా? చిత్తూరు స్పెషల్ బ్రాంచ్లో బదిలీలు అంటే ‘బాస్’ కల్పించుకుంటే తప్ప జరగదు. అలాంటిది బాస్కు చెప్పా పెట్టకుండా ఓ సీఐ స్థాయి అధికారికి ఇక్కడి నుంచి తప్పించడం, అదే బాస్కు నీడలా నడిచిన ఎంటీఓపై బదిలీ వేటు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికితోడు ‘ప్రత్యేక విభాగం’లో పనిచేసే మరో అధికారి ఇతర జిల్లాలో పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. చిత్తూరు ఎస్పీ మణికంఠ కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా ప్రవర్తించడం పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. ఈయన్ని బదిలీ చేయాలని కూటమి నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఒకరు జూన్లో ఎస్పీ బదిలీ అవుతారంటే, 15 రోజుల్లో వెళ్లిపోతారని మరొకరు ప్రచారం చేస్తున్నారు. ముందు ఎస్పీ మార్కు వేసుకున్న అధికారులను ఇప్పటి నుంచే తప్పించడానికి కూటమి నేతలు కంకణం కట్టుకున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. జిల్లా పోలీసు శాఖలో ఏదో జరిగిందని.. అసలేమి జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల మూకుమ్మడి పోలీసుల బదిలీలు.. తాజాగా ఎస్బీ సీఐ, ఎంటీఓల బదిలీ జరగడం.. పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఏమి జరుగుతుంది.. ఎందుకిలా జరుగుతుంది.. అన్న చర్చ నడుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ సీఐ.. ఎంటీఓపై బదిలీ వేటు ఇద్దరికీ పోస్టింగులు ఇవ్వని యంత్రాంగం బదిలీలపై చిత్తూరు పోలీసుశాఖ సర్వత్రా చర్చ ‘సూపర్ బాస్’గా దూసుకెళ్లడమే కారణమా? దారి తప్పిన ఎస్బీ.. ఇక పోలీసుశాఖలో ఎస్పీ తరువాత కీలకమైన విభాగం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ). జిల్లాలో స్టేషన్ల పనితీరు ఎలా ఉంది.? ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఎవరు..? రాజకీయ నాయకులతో సమస్యలొస్తే తీసుకునే చర్యలపై ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయడమే ఎస్బీ ప్రధాన కర్తవ్యం. కానీ ఇటీవల కాలంలో పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల్లో వాటాలు, అక్రమ గ్రానైట్ తరలింపులో మామూళ్లు, కబేళాలకు తరలించే పశువుల లారీల్లో చిలక్కొట్టుడు లాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏం జరిగినా కుర్చీ వేసుకుని మరీ కూర్చుని వేలు పెడుతున్నారని, ఎస్బీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కూటమి పార్టీ ఎమ్మెల్యే బంధువును అక్కడి నుంచి తప్పించి.. తన అనుచరుడికి పోస్టింగ్ ఇప్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓ దశలో ఎస్బీ కూడా ‘సూపర్బాస్’గా వ్యవహరించడం చాలా మంది అధికారులకు మింగుడుపడలేదు. వీటిపై ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్యే డీఐజీకి ఫిర్యాదు చేయడంతో వేటుపడినట్లు సమాచారం. -
తక్షణం పీఆర్సీ కమిషన్ వేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించాలని ఏపీటీఎఫ్ 1947 జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. జీఓ 117 కు ప్రత్యామ్నంగా తీసుకొచ్చిన 9 రకాల పాఠశాలలు గందరగోళంగా ఉన్నాయన్నారు. పాత విధానంలో 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10 ఉన్నత పాఠశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 12 వ వేతన సవరణ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు చంద్రశేఖర్నాయుడు, చంద్రన్, జగదీష్, మధు, తులసి, అప్జల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్ గిరి.. వరించేదెవరినో?
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి ఆశావహులను ఊరిస్తోంది. ఎవరికి వారు తమకే పదవి వ స్తుందని, ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా రు. కూటమి సర్కారు మాత్రం ఎటూ తేల్చ కుండా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో ఆ కుర్చీ ఎవరికి దక్కుతుందోనని ద్వితీయ శ్రేణి కూటమి నేతలు వేచి చూస్తున్నారు. కాణిపాకం: అతిపెద్ద ఆలయాల్లో ఒకటైనా వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాలకమండలి ప్రకటించే విషయంలో అదిగో..ఇదిగో అంటూ ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్కు మళ్లీ పట్టమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్నవాళ్లకే ఇస్తే ఆలయాభివృద్ధికి దోహద పడతారనే వాదనలు మరోవైపు గట్టిగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. చతుర్ముఖ పోటీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న పాలక వర్గం రాజీనామా చేసింది. అప్పటి నుంచి కొత్త పాలక వర్గం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, కూటమి నేతలు పూర్ణచంద్ర, మధుసూదన్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు కుర్చీ కోసం పోటీపడుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ తానే చైర్మన్ అంటూ మణినాయుడు బహిరంగంగానే అందరికీ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, కొందరు నేతల మద్దతు ఉండడంతో మణినాయుడుకే చైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చైర్మన్ మణినాయుడుకే ఇవ్వాలని కొందరు ప్రతిపాదించారు. అయితే అధిష్టానం ఒక్క మణినాయుడు పేరు కాదు.. ఆయనతోపాటు మరో ముగ్గురు, నలుగురు పేర్లు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ నలుగురి పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఆ నలుగురిలో మణినాయుడు తరువాత చైర్మన్ పదవి కోసం పూర్ణ గట్టిగా పోటీపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కాణిపాక దేవస్థానం కాణిపాకం పాలకమండలి ఏర్పాటులో జాప్యం? అదిగో..ఇదిగో అంటూ నాన్చుతున్న ప్రభుత్వం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఆశావహుల్లో ఉత్కంఠ ఆలస్యం వెనుక ఆంతర్యమేమిటో? కాణిపాకం దేవస్థాన చైర్మన్ పదవి ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటోనని ఆశావాహులు, ఉభయకర్త లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మణినాయుడికి ఇస్తారా? ఇవ్వరా అనే అను మానాలు పుట్టుకొస్తున్నాయి. మరో ముగ్గురిలో ఆర్థి కంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇస్తే బా గుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక కొత్త గా ఎస్సీ సామాజిక వర్గానికి కట్టబెడతారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదనను అధిష్టానం పరిశీలనలో పెట్టి నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విష యంపై ప్రజాప్రతినిధి కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజం కాదని.. ఇక్కడ ఎీస్సీ సామాజిక వర్గం మాటే ఉండదని పలువురు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఈ గందరగోళం నడుమ స్థానికంగా ఉన్న వ్యక్తిని కాదని బయట వ్యక్తులకు ఇస్తారని కొందరు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో కేటాయించిన పలు నామినేటెడ్ పదవులు ఆశావహులకు కాకుండా ఊహించని వ్యక్తుల ఇవ్వడం కూడా కాణిపాకం చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో గుబులు పుట్టిస్తోంది. -
బాబు పాలన అధ్వాన్నం
● కుప్పం ద్రవిడ వర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదు ● టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై బాబు స్పందించాలి ● కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతామోహన్ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో 30 సార్లుకు పైగా ఆందోళనలు చేపట్టామన్నారు. టీటీడీలో పని చేసే అర్చకులు, శాశ్వత ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలిపిరి నుంచి పేరూరు వరకు 400 ఎకరాలు టీటీడీ భూములున్నాయని, ఆ భూముల్లో ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తిరుమల కొండకు ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయితే కొండపై సుమారు 500 దుకాణాలున్నా వాటిలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ ఉన్నారా? అని ప్రశ్నించారు. జనాభా నిష్పత్తి ప్రకారం 500 దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే టీటీడీలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్రవిడ వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఎస్వీయూలో ప్రొఫెసర్లకు కూడా మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు నెల నెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. శ్రీసిటీని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, 250 కంపెనీలు ఏర్పాటు చేశామని, వేల మందికి ఉద్యోగాలు తామే ఇచ్చామని తెలిపారు. నిన్న ఒక మంత్రి శ్రీసిటీకి వచ్చి వెళ్లారని, ఆయన పర్యటన గురించి ఢంకా బజాయించుకుంటూ పేపర్లో గొప్పగా కథనాలు రాయించుకున్నాడని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ హయాంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లకు పసుపు రంగు వేయించడం దౌర్భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, వెంకటేష్, ముని శోభ, తేజోవతి, కుమార్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన
చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ నెల 12వ తేదీన డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్న ట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు నిరసన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు నోటీసును శుక్రవారం డీఆర్వో మోహన్కుమార్, డీఈఓ వరలక్ష్మికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్షధోరణి ప్రదర్శిస్తుందన్నారు. విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ, ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండానే రోజుకో వింత ఆలోచనలతో ఉపాధ్యాయుల సర్దుబాటు తీవ్ర ఆందోళనకు లోను చేస్తోందన్నారు. వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సమావేశాల్లో సమస్యలు వెల్లడిస్తున్నా ఏ మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలు చెలరేగుతున్నాయన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతుల సమస్యలు పరిష్కరించాలని పదే పదే చెబుతున్నా ఏ మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనను గమనించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్, గౌరవాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సహధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్పీ బాషా, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలు
కాణిపాకం: శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని అన్నదానం, గోంసరక్షణ ట్రస్టులకు శుక్రవారం దాత కుటుంబాలు నగదు విరాళం చేశాయి. హైదరాబాద్కు చెందిన దాత బాలాజీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు మొత్తం రూ.1.73 లక్షలు నగదు విరాళం ఇచ్చారు. ఇందులో అన్నదాన ట్రస్టుకు రూ.62వేలు, గోసంరక్షణ ట్రస్టుకి రూ.1.11 లక్షల చొప్పున్న అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన సత్య నారాయణ రమాదేవి కుటుంబసభ్యులు గోసంరక్షణ ట్రస్టుకు రూ. 50వేలు, నిత్యాన్నదానం ట్రస్ట్కకు రూ.50 వేలు మొత్తం రూ. ఒక లక్ష విరాళం ఇచ్చారు. ఈ నగదును అందుకున్న ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వామి వారి దర్శనం కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందికి రూ.లక్ష జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు భూముల పరిశీలన శాంతిపురం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ప్రతిపాదిత విమానాశ్రయ సమీపంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం భూములను పరిశీలించారు. అడిడాస్, నైక్ కంపెనీల ప్రతినిధులు దండికుప్పం, అమ్మవారిపేట, విజలాపురం, మణీంద్రం, కిలాకిపోడు ప్రాంతాల్లో పర్యటించారు. కడా ప్రాజెక్టు ఆఫీసర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, శాంతిపురం తహసీల్దార్ శివయ్య కంపెనీల ప్రతినిధులను తీసుకువచ్చి భూములను చూపారు. అందుబాటులోని భూములు, సేకరించనున్న భూముల వివరాలను అధికారులు పారిశ్రామిక ప్రతినిధులకు వివరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
బాల్యవివాహాలను నిరోధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహలను నిరోధించాలని 8వ డివిజన్ సచివాలయ మహిళా పోలీసు సునీత అన్నారు. శుక్రవారం నగరంలోని వెంగళరావు కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యుక్త వయసు బాలికల భవిష్యత్కు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేనరికాలు, ఆచారాల పేరుతో బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేసి బాలికల జీవితాలను బుగ్గిపాలు చేయకూడదన్నారు. ప్రేమ పేరుతో మోసగించడం, నమ్మి వెంట వచ్చిన వారిని చిత్రహింసలు పెట్టడం, బాలికల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించడం నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలని చెప్పారు. బాలికలు తమకు తాము కాపాడుకునేలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయాందోళన చెందకూడదన్నారు. బాలికలు కౌమార దశలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ కార్యకర్త చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతులతో కలెక్టర్ చర్చలు
కుప్పం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చర్చలు జరిపారు. శుక్రవారం కడా పీడీ కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం మండల్లోని అమ్మారిపేట, 30–సొన్నేగానిపల్లి, దండికుప్పం, కిలాకిపోడు, మణీంద్రం, బందలగుట్ట, కడచినకుప్పం, విజలాపురం గ్రామాల్లోని రైతులతో చర్చించారు. గతంలో విమానాశ్రయం కోసం ప్రభుత్వం ఇప్పటికే భూములు తీసుకుందని, ఉన్న కొద్దోగొప్పో భూములను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకుంటే తమ జీవనం దుర్భరమైపోతుందని కలెక్టర్తో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకందరికీ ఎకరా, 50 సెంట్లు పొలం మాత్రమే ఉందని, ఆ పొలంలో పశుగ్రాసం సాగుతో పాడి పరిశ్రమ ద్వారా జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల కోసం ఉన్న కొంత భూమిని కూడా లాక్కుంటే తమ జీవనం కష్టతరమవుతుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశ్రమలు రావడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రైతులు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. భూములు నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, కోల్పోయిన భూములకు మెరుగైన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తూ తమ భూములు ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. ప్రత్యేకంగా ప్రతి రైతుతో చర్చించి, సర్దుబాటు చేస్తామంటూ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. గోడు విన్నవించుకున్న రైతులు న్యాయం చేస్తామన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్త దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: ౖవెఎస్సార్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ కార్యకర్త దాడులు చేశాడు. పాత కక్షలతో ఇంటి అరుగుపై కూర్చున్న వ్యక్తిపై బులెట్ లో దూసుకెళ్లి, గుద్ది గాయ పరిచాడు. ఆపై కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేసి, చితకబాది భయ బ్రాంతులకు గురి చేసిన ఘటన చిత్తూరు మండలం 36.గొల్లపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు మండలం 36.గొల్లపల్లికి చెందిన సుందరయ్య తన ఇంటి అరుగుపై కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన టీడీపీకి చెందిన పవన్ బులెట్ పై అతివేగంగా అతని పైకి దూసుకొచ్చాడు. దీంతో సుందరయ్యకు గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆ యువకుడు సుందరయ్య మామ వజ్రాలు మందడి వీపుపై ఇనుప వస్తువుతో చితకబాదాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేరారు. మళ్లీ ఆ యువకుడు చిత్తూరులోని కొందరు అల్లరి మూకలను రప్పించి, బాధితుడి ఇంట్లోని మహిళలు, వృద్ధులపై దాడి చేశాడు. ఆ కుటుంబం ఎప్పుడు ఏం చేస్తారని భయపడుతోంది. కాగా నిందితుడు ఎన్నికల సమయంలో కూడా ఓ వ్యక్తిపై దాడిచేసి తలపై గాయపరిచాడు. దీనిపై కేసు కూడా నమోదైంది -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చౌడేపల్లె: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన శుక్రవారం పుంగనూరు మార్గంలోని చిన్న యల్లకుంట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లె మండలం పొదలపల్లె సమీపంలోని ఓ రైతుకు చెంది మామిడితోటకు యానాది రెడ్డెప్ప(35) కాపలాగా ఉన్నాడు. అతనికి భార్య రాజేశ్వరి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి పెద్దయల్లకుంట్ల సమీపంలోని ఓ మామిడితోటలో కాపలాగా ఉన్న తన అక్క సిద్ధమ్మ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న భార్యాపిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి, తాను కాపలా ఉన్న మామిడితోట వద్దకు వెళ్లేందుకు రెడ్డెప్ప చౌడేపల్లె– పుంగనూరు మార్గంలోని పొదలపల్లె సమీపంలో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వాహనం ఈడ్చుకుని వెళ్లి, కొద్ది దూరంలోని పొదల చాటున పొలాల్లోకి పడేసి ఉడాయించారు. అటు వైపుగా వెళ్లే పాదచారులు గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదుపుతప్పి లారీ బోల్తా శ్రీరంగరాజపురం : అదుపుతప్పి ఆయిల్ ప్యాకెట్లు తరలిస్తున్న లారీ బోల్తా పడిన సంఘటన మండలంలోని గంగమ్మగుడి వద్ద చో టు చేసుకుంది. పోలీ సుల కథనం మేరకు.. చైన్నె నుంచి చిత్తూరుకు ఆయిల్ ప్యాకెట్ల లోడ్తో శుక్రవారం ఓ లారీ బయలుదేరింది. లారీ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని శ్రీరంగరాజపురం మండలం ఆరిమాను గ్రామానికి సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూద స్థావరాలపై దాడులు 9 మంది జూదరుల అరెస్టు వెదురుకుప్పం : జూదస్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసిన సంఘటన మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో కొంతమంది జూదం ఆడుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో కలసి జూద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి, రూ.15,830 స్వాధీనం చేసుకున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ సుమన్ తెలిపారు. ఎవరైన జూదం ఆడిన, సారా కాసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 170 కళాశాలలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 10,236, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,724, ఒకేషనల్ మొదటి సంవత్సరం 810, ద్వితీయ సంవత్సరం 607 మొత్తం 15,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరందరికీ పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు సమస్యలు లేకుండా ఆర్టీసు బస్సులు సకాలంలో నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర వైద్యసేవలకు కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను నియమించాలన్నారు. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో మృతుల ఓటర్లను తొలగించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మృతుల ఓట్లను తొలగించాలన్నారు. జిల్లాలో ఎన్సీడీ 3.0 సర్వే చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సర్వేలో ప్రతి కుటుంబంలోని వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఫారం 6 కు 3,595 దరఖాస్తులు అందగా 2,297, ఫారం 7 లో 3,034 దరఖాస్తులు అందగా అందులో 1,889, ఫారం 8 లో 5,304 దరఖాస్తులకు 4,177 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మృతి చెందిన, మల్టిపుల్ ఓటర్లను జాబితాను తొలగించేలా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో నూతన ఓటర్లకు కార్డుల పంపిణీ, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్ల జాబితాలో పేర్ల మార్పునకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని వివిధ పార్టీల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, వైఎస్సార్ సీపీ పార్టీ తరఫున ఉదయ్కుమార్, ఇతర పార్టీల నుంచి బాలసుబ్రహ్మణ్యం, సురేంద్రకుమార్, యశ్వంత్, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, భాస్కర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్ పాల్గొన్నారు. -
7 రకాల రేషన్ కార్డుల సేవలకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పౌరసరఫరాల శాఖకు సంబంధించి 7 రకాల రేషన్కార్డుల సేవల కు అవకాశం కల్పించారని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 7 రకాల రేషన్కార్డుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో కొత్తరేషన్ కార్డులు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు (బర్త్, పెళ్లి), బియ్యం కార్డు నుంచి సభ్యుల విభజన, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (మృతులు మాత్రమే), కార్డులు సరెండర్, బియ్యం కార్డులో చిరునామా మార్పు, తప్పుడుగా నమోదైన ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఇప్పటికీ ఏ రేషన్కార్డులోను నమోదు కాని అర్హత కలిగిన పేదలు కొత్త రేషన్కార్డుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కార్డు ఉండి ఏవైనా సవరణలుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 7,707.484 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా మే, 2025 నెలకు గాను 8,642.431 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ రేషన్షాపులోనైనా బియ్యం ఇంకా అవసరం ఉంటే సంబంధిత తహసీల్దార్ స్పష్టమైన నివేదికను పంపాలని ఆదేశించారు. రేషన్కార్డు లబ్ధిదారులు తమకు అందాల్సిన రేషన్ ను సంబంధిత ఎండీయూ వాహన ఆపరేటర్, రేషన్షాపు డీలర్ వద్ద పొందాలని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. విభిన్నప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 11 వ తేదీ లోపు www.mdfc.apefss.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎండీఎఫ్సీ.ఏపీఈఎఫ్ఎస్ఎస్.ఇన్) వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న అంధులు, బధిరులు, శారీరక విభిన్నప్రతిభావంతులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని ఆయన వెల్లడించారు. బోయకొండ హుండీ రాబడి రూ.63.89 లక్షలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.63.89 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ.63,89,617, బంగారం 40 గ్రాములు, వెండిి 470 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ7 నోట్లు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 42 రోజులు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు అని ఈఓ చెప్పారు. అలాగే రణభేరి గంగమ్మ ఆల య హుండీ ద్వారా రూ.40,463 నగదు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కాలకూటమిపై
విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలకు నిరసనగా భగభగ మండే భానుడికి దీటుగా పాత్రికేయలోకం కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగింది. పత్రికా స్వేచ్ఛ హరింపునకు నిరసనగా పదం పదం కలిపి కదం తొక్కింది. మీడియా గొంతు నొక్కె చర్యలు తగవని గర్జించింది. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని ధ్వజమెత్తింది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం● సాక్షి ఎడిటర్ నివాసంలో ఖాకీల జులుంపై నిరసన ● చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన ఏపీయూడబ్ల్యూజే చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్క్లబ్ నేతలు చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో పాత్రికేయులపై దాడులు, తప్పుడు కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్కుమార్ ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయడం, అనుమతి లేకుండా సోదాలు చేయడం ఆయన మాససిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారథిలా ఉన్న మీడియా రంగంపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ధనంజయరెడ్డిపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టారని, ఇది కోర్టు పరిధిలో ఉండగా.. నేడు ఇంట్లోకి చొరబడి ఆయన కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమేష్బాబు, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, సీనియర్ పాత్రికేయు లు శివ, గజపతి, బాలసుందరం, హరీష్, రాజేష్, సాయి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియాపై బెదిరింపు ధోరణి మంచిది కాదుపలమనేరు: మీడియాపై పోలీసుల బెదిరింపు ధోరణి మంచిది పద్ధతి కాదని ప్రెస్క్లబ్ నేతలు అన్నారు. పోలీసులు విజయవాడలోని సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి ఎలాంటి నోటీసులు లేకుండా చొరబడి అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ పలమనేరు ప్రెస్క్లబ్ జర్నలిస్టులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఇన్చార్జ్ ఏఓ రమేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏదో కేసులో ముద్దాయిలు అపార్ట్మెంట్లో ఉన్నారనే సమాచారంతో ఆ భవన సముదాయంలోని అన్ని ఇళ్లను తనిఖీలు చేస్తున్నామని భయపెట్టడం పద్ధతి కాదన్నారు. గౌరవప్రదమైన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపైనే పోలీసులు జులం ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో ఆయన పరువు ప్రతిష్టలకు విఘాతం కల్పించే రీతితో పోలీసులు వ్యవవహరించడం తగదన్నారు. ఎలాంటి కేసులు లేకున్నా కేవలం సాక్షి మీడియాను అణగదొక్కేందుకు ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇది కేవలం సాక్షి ఎడిటర్పై మాత్రమే జరిగింది కాదని, భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇలాంటి ఆంక్షలు, దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పరిరక్షణకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ఇలాంటి దిగజారుడు చర్యలు దిగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్, రెడ్డెప్ప, మణి, రమేష్, మోహన్మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఢీసీసీబీ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి పచ్చనేతల మధ్య చిచ్చు పెట్టింది. కూటమి సర్కారు ఆ పదవిని ఓ నేతకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసినా.. ఆ కుర్చీని ఆశిస్తున్న ఆశావహులు కేటాయింపు చెల్లదని.. దాన్ని రద్దు చేసి, తమకే ఇవ్వాలని ఓ సీనియర్ నేత వర్గం పట్టుపడుతోంది. దీంతో డీసీసీబీ కుర్చీకి కుమ్ములాట జరుగుతోంది.డీసీసీబీ కార్యాలయంచితూరు రూరల్ (కాణిపాకం): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్ పదవి కేటాయింపు జరిగినా ఆ కుర్చీపై తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అని కుమ్ములాడుతున్నారు. దీంతో పదవి దక్కించుకున్న అమాసకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆ పేరును కూటమి ప్రభుత్వం ప్రకటించినా.. సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని నిలదీశారు. చైర్మన్ పదవిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆశించినా.. డీసీసీబీ పదవిని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆశించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవి దొరబాబుకే వస్తుందని అందరూ ఊహించారు. ఆయన అనుచరులతోపాటు, డీసీసీబీ అధికార వర్గం సైతం చైర్మన్ కుర్చీ దొరబాబుకేనని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా ఎవరూ ఊహించని విధంగా అమాసకు చైర్మన్ పదవి కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. మళ్లీ అమాసకే... కూటమి ప్రభుత్వం గతనెల 28వ తేదీన అమాస రాజశేఖర్రెడ్డికి డీసీసీబీ పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుంచి 2019 మధ్యకాలంలో పలుమార్లు ఈయనే చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. 13 ఏళ్ల పాటు డీసీసీబీ పదవిని అనుభవించారు. మళ్లీ ఈ పదవిని అమాసకు కట్టబెట్టేందుకు కూటమి నేతలు నల్లారి కిషోర్కుమార్రెడ్డి, నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ చక్రం తిప్పారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో బ్యాంకు తరఫు రూ.కోటి చెక్కును అందించిన విషయం, కుప్పంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బ్యాంకు నిధులు కేటాయింపు అమాసకు కలిసొచ్చిందని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పదవి కాలంలో అవసరం లేని భవన నిర్మాణం, వాస్తు దోషం పేరుతో గుడి నిర్మించిన ఘనత, రైతుల ధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణలను మళ్లీ వారు వేలెత్తి చూపుతున్నారు. అమాసకు ఎలా ఇస్తారు? అమాసకు మళ్లీ డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై కూటమిలో కుమ్ములాట మొదలైంది. ఆశావాహులు, సీనియర్ నేతలు ఈ పదవి కేటాయింపుపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం డీఆర్సీ మీటింగ్కు హాజరైనా జిల్లా రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్రెడ్డి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అమాసకు ఎలా పదవి ఇస్తారంటూ నిలదీశారు. పార్టీకి కష్టపడిన వారికి ఇవ్వకుండా మళ్లీ అమాసకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. చైర్మన్ పదవిని మార్చాలని భీష్మించారు. సీనియర్లకు ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారికి పదువులు ఇవ్వడం విడ్డూరమంటూ విరుచుపడ్డారు. దీంతో మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకెళతానని వాళ్ల మధ్య నుంచి తప్పుకున్నారు. డీసీసీబీగా చైర్మన్ పదవి అమాస రాజశేఖర్రెడ్డికి కేటాయింపు జీర్ణించుకోలేని తమ్ముళ్లు మంత్రిని నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ, పలువురు నేతలు పార్టీలోని సీనియర్లకు ఇవ్వాలి డిమాండ్చైర్మన్ ప్రమాణస్వీకారం వేళ.. డీసీసీబీ చైర్మన్ పదవి అమాసకు కేటాయించి, వారం రోజులు దాటింది. దీంతో చైర్మన్ పగ్గాలు చేపట్టేందుకు అమాస సిద్ధమవుతున్నారు. కార్యాలయానికి రంగులు వేయిస్తున్నారు. ఆయన చాంబర్కు కొత్త హంగులు దిద్దించుకుంటున్నారు. త్వరలో ప్రమాణాస్వీకారానికి ముహుర్తం ఖరారు చేయనున్నారు. ఈ తరుణంలో చైర్మన్ పదవిపై పేచీ పెట్టేందుకు కొందరు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. అమాసకు ఆ పదవి లేకుండా చేయాలని కొందరు బహిరంగంగా పట్టుబడడంతో అమాస వర్గం మల్లగుల్లలు పడుతోంది. ముహుర్తానికి ముందే మార్పునకు చూడాలని ఓ సీనియర్ నేత గట్టిగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి
గంగాధర నెల్లూరు: తక్కువ పెట్టుబడితో ఆయిల్ పామ్ సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చ ని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు చేసిన నాలుగేళ్లకే రైతులు లాభాల బాట పడతారని, అంతవరకు అంతర పంటలతో రైతులు దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్పామ్ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పీడీ బాలసుబ్రమణ్యం, మండల ఉద్యాన అధికారి లోకేష్, వ్యవసాయధికారి భవాని పాల్గొన్నారు. మద్యం షాపులో ఘర్షణ ● ఎనిమిది మందిపై కేసు నమోదు నగరి : నగరి సమీపంలోని కీళపట్టు వద్ద బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విక్రమ్ గురువారం తెలిపారు. ఒక వర్గంలో అమృతరాజ్ నాడార్, మైకెల్ సహ నలుగురిపైన, మరో వర్గంలో కుమరేశన్, రాజాసహ నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం షాపులో జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి రెండు వర్గాల ఘర్షణకు దారి తీసిందన్నారు. కేసును డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారన్నారు. బాలుడిపై కుక్కల దాడి పుంగనూరు: పట్టణంలోని దూళ్లవాళ్లఇండ్లలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గురువారం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కుక్కలు కరిచాయి. గాయ పడిన బాలుడిని స్థానికులు గుర్తించి బాలుడిని తల్లిదండ్రులతో కలసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతున్నాడు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
చౌడేపల్లె: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఎస్ అగ్రహారంలో గురువారం చోటు చేసకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఏ.కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన కమలాకర్, హేమలత దంపతులకు లోకేష్(27) కుమారుడు ఉన్నాడు. కమలాకర్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. కొన్నేళ్ల కిందట పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ మృతి చెందాడు. దీంతో లోకేష్ తన తల్లి హేమలతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవని సాగించేవాడు. ఇటీవల తమ పొలంలోని 5ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాడు. అలాగే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐల తాకిడి అధికం కావడంతో ఆర్థిక భారం అధికమైంది. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ గ్రామంలో చీటీల నిర్వాహకుల నుంచి సైతం డబ్బులు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో ఆ విషయం తల్లి హేమలతకు తెలియడంతో లోకేష్ను మందలించింది. దీంతో గ్రామానికి సమీపంలోని యల్లమ్మ గుంత సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. చెట్టు కొమ్మకు వేళాడుతున్న లోకేష్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించి తల్లి హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కంట తడిపెట్టించిన పోన్ స్టేటస్.. లోకేష్కు చెందిన ఐపోన్లో స్టేటస్కు ఐయామ్ సారీ అంటూ దుఖంతో పెట్టిన స్టేటస్ చూసిన స్థానికులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. లోకేష్ ఎంత పని చేశావయ్యా అంటూ రోదించారు. -
స్కెచ్లో దర్శనం
నేలపై మాయం..● రాజు కాలువ కబ్జా కథకుప్పంరూరల్: కూటమి ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. కొంత మంది అక్రమార్కులు అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తుండగా, మరికొంత మంది చుట్టు పక్క ఉన్న డీకేటీ, ప్రభుత్వ స్థలాలు, రాజు కాలువలను కలుపుకుని లే అవుట్ వేశారు. ప్రశ్నించాల్సిన అధికారులు ఏటు వైపు నుంచి ఒత్తిళ్లు వస్తాయోనని మిన్నకుండిపోతున్నారు. దీంతో కాలువలు, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కుప్పం పట్టణానికి అనుకుని ఉన్న ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న చీమనాయనపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 99/3లో కొంత మంది రియల్ వ్యాపారులు లే అవుట్ వేశారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఈ స్థలం ఎంతో విలువైనదిగా గ్రహించిన రియల్టర్లు 99/3లో ఉన్న రాజు కాలువను సైతం ఆక్రమించుకున్నారు. రాజు కాలువ వారు కొనుగోలు చేసిన స్థలం మధ్యన ఉండడంతో మట్టి పోసి రాజుకాలువను మాయం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లే అవుట్ రాళ్లను పూడ్చి అమ్మకానికి సిద్ధం చేశారు. రాజుకాలువ నేలపై మాయమై, లే అవుట్ స్కెచ్లో ప్రత్యక్షమైంది. ఇలా కాలువ పూడ్చి వేసి, విలువైన స్థలాన్ని రికార్డుల్లో మాత్రం అలాగే ఉంచారు. దీంతో భారీ వర్షాలు వస్తే నీరు బయటికి పోకుండా అక్కడే నిలువ ఉండిపోయే ప్రమాదం ఉంది. నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే ఎగువ నుంచి వచ్చే నీరు బయటికి పోలేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రమాదం ఉందని తెలిసి, అందులోను నిత్యం రాష్ట్రం, జిల్లాస్థాయి అధికారులు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన విలువైన రాజుకాలువను అక్రమిస్తే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కడా పీడీ అయినా స్పందించి రాజుకాలువను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. రాజుకాలువను ఆక్రమించి వేసిన లే అవుట్ -
అధైర్యపడొద్దు... వచ్చేది మన ప్రభుత్వమే
కుప్పంరూరల్: అధైర్య పడొద్దు... 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత నాది...అని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుప్పం నాయకులతో అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన్ని కలిసి కుప్పం నాయకులతో సుధీర్ఘంగా చర్చించారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, దాడులు ఎక్కువయ్యాయని కుప్పం నాయకులు జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చేది మన ప్రభుత్వమే అని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనది చెప్పారు. ఎవరెవరు అన్యాయం చేశారో వారిని గుర్తు పెట్టుకోవాలని, వారికి రెండింతలు తిరిగి ఇస్తామని చెప్పారు. అధికారులైనా, నాయకులైనా ఎవరినినైనా వదిలేదిలేదన్నారు. అధికారులు రిటైర్డ్ అయినా, నాయకులు సముద్రాలకు అవతల వెళ్లి దాక్కున్న తీసుకువచ్చి శిక్ష వేస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక ఇన్చార్జ్ స్థానికంగానే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో దాడులకు గురైన వారిని ఒకసారి విజయవాడకు తీసుకురావాలని చెప్పినట్లు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్సీ భరత్, సెంథిల్కుమార్, కుప్పం నియోజకవర్గ నాలుగు మండలాల నేతలు పాల్గొన్నారు. కుప్పం సమస్యలు మాజీ సీఎం దృష్టికి.. బైరెడ్డిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకవర్గ ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను కుప్పం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మొగసాల రెడ్డెప్ప మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో కుప్పం, రామకుప్పం మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కుప్పం నేతలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి సారూ!
● రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు అపస్ నేతల వినతి చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. గురువారం విజయవాడలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో కమిషనర్ నిర్వహించిన స మావేశంలో ఆయన పలు సమస్యలపై చ ర్చించారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకు ఆ సంఘం నేత లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షు లు బాలాజీ విలేకరులతో మాట్లాడారు. తొలుత హెడ్మాస్టర్ బదిలీలు, హెచ్ఎంల ఉద్యోగోన్నతులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఉద్యోగోన్నతులు బదిలీలు ని ర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సు ముఖత చూపించారన్నారు. ఉద్యోగోన్నతు ల ప్రక్రియలో ఖాళీలను గుర్తించాక 1:2 ప్రాతిపదికన సీనియార్టీ జాబితా ప్రకటించి, అందరూ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారన్నారు. రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ పొందే వారుంటే మినహాయింపు ఇస్తారని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగోన్నతులకు త్వరలో నిర్ణయం ప్రకటిస్తారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ప్రాతిపదికన టీచర్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా ఫౌండేషన్ స్కూళ్లలో 1:20 ప్రకారం టీచర్లను నియమించాలని డిమాండ్ చేశామన్నారు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో కనీసం ఇద్దరు టీచర్లు నియమించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని కోరామన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే అదనపు సెక్షన్ కింద పరిగణించాలన్నారు. ప్రతి 30 మంది విద్యార్థులకు రెండో సెక్షన్ను ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు మీడియం కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పనిభారం 30 పీరియడ్లకు మించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైస్కూల్ ప్లస్ పీజీటీలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 610 జీఓలో వివిధ జిల్లాల్లో 18 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పీడీలకు న్యాయం చేయాల ని కోరారు. పాఠశాల రోల్ మార్చి 31 నాటికి కాకుండా ఏప్రిల్ 7 వరకు తీసుకోవాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీ సైతం నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
యాదమరి పీహెచ్సీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైద్యులు
యాదమరి: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ మౌనిక సందర్శించారు. గురువారం ఆమె మండలంలోని బుడిగిపెంట గ్రామానికి చెందిన విజయదీప్(14)అనే బాలుడిని పరిశీలించారు. రెండు నెలలు క్రితం పలురకాల ఆరోగ్య రుగ్మతలతో చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స అనంతరం బాలుడికి సంబంధించిన ఆరోగ్య నివేదికలను జిల్లా వైద్యాధికారులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు పంపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి క్రమంలో ఇక్కడికి వచ్చిన డాక్టర్.. కాన్పు సమయంలో అందించిన వ్యాధి నిరోధక టీకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి ఎలాంటి సమస్య లేదని, కేవలం సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అతను కొంత కాలం పలు రుగ్మతలతో ఇబ్బంది పడ్డాడని, ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పారు. అనంతరం గ్రామంలోని రెండేళ్లలోపు చిన్నారులకు అందించిన వాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం యాదమరి: అక్రమంగా నిల్వ ఉంచి 10 టన్నుల రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు. గురువారం మండలంలోని పుల్లయ్యగారిపల్లిలో పురుషోత్తం నాయుడికి సంబంధించిన ప్రైవేటు భవనాన్ని కొంత మంది మొక్కజొన్న వ్యాపారం చేస్తామని లీజుకు తీసుకున్నారు. అయితే అందులో యాదమరికి చెందిన అబ్దుల్ సలాం, పలమనేరుకు చెందిన చెంగల్ రాయులు, కర్ణాటకకు చెందిన రోషన్, ప్రదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం నిల్వ చేసి, అక్రమ రవాణా చేస్తున్నారని స్థానిక తహసీల్దార్కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తన బృందంతో మెరుపు దాడులు చేసి, ఆ భవనంలో నిల్వ ఉంచిన 10 టన్నుల రేషన్ బియ్యం, క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పకడ్బందీగా ఆరోగ్య కార్యక్రమాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు పక్కాగా సేవలు అమలు చేయాలని సూచించారు. వారి నమోదు విషయంలో అలసత్వం వద్దని, ప్రసవ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. జన ఔషధిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. -
పలమనేరులో భారీ వర్షం
● నేలరాలిన మామిడి, ● దెబ్బతిన్న తీగ పంటలు పలమనేరు: మండలంలో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు పెనుగాలులు వీచాయి. దీంతో పలుచోట్ల మామడికాయలు నేల రాలాయి. కోతకొచ్చిన టమాట దెబ్బతింది. ఇక తీగ పంటలైన కాకర, బీర, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల అరటి పంటకు నష్టం వాటిల్లింది. పెనుగాలులతోపాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో మామిడి కాయలకు మచ్చలు పడ్డాయి. వీటికి మార్కెట్లో ధర ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లో రాలిన మామిడిని తక్కువ ధరతో అమ్ముకోవాలని చెప్పారు. ముఖ్యంగా పెంగరగుంట, సముద్రపల్లి, కరిడిమొడుగు, బయ్యప్పగారిపల్లి పంచాయతీల్లో మామిడి తోటలకు ఎక్కువగా నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యానశాఖ అధికారి లక్ష్మీప్రసూనను వివరణ కోరగా వర్షానికి దెబ్బతిన్న పంటలను గురువారం పరిశీలించి, తగు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పట్టణంలో అంధకారం వర్షం కారణంగా పలమనేరు పట్టణంలోని రాధాబంగ్లాతోపాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అంధకారం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, నాగమంగళం హైవేవద్ద వర్షపునీరు నిలిచింది. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
కార్వేటినగరం: అయిల్ పామ్ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమవుతుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి వస్తోందని, అప్పటి వరకు అంతర పంటలు సాగు చేసుకుని, రెండు విధాల లాభాలు గడించవచ్చన్నారు. ఈ పంట 30 ఏళ్ల వరకు రైతుకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ పంటను నీరు ఇంకే అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, పంట సాగుకు రైతులకు 40 శాతం సబ్సిడీ వస్తోందన్నారు. మొక్కలను త్రిభుజా కార పద్ధతిలో నాటు కోవాలని, అలాగే 14 నుంచి 18 నెలల్లో పూతకు వస్తుందని, రెండున్నరేళ్ల వరకు పూతను తీసి వేయాలన్నారు. ఆయిల్ పామ్ పంటలో కోకో పంటను కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. నిండ్ర, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు మండలాల్లో ప్రభుత్వం ఆయిల్పామ్ మొక్కలను ఉచితంగా అందింస్తొందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏపీఎంఐపీ పీడీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, కోకో ద్వారా చాక్లెట్ తయారీతో పాటు వాటి బొప్పెల్లో పొటాషియం అధికంగా ఉండటంతో వాటిని పశువుల దాణా తయారీలో వినియోగిస్తారని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 70 శాతం రాయితీ ద్వారా డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరాజు, మండల వ్యవసాయ అధికారి హేమలత, 3 ఎఫ్ ఆయిల్ఫామ్ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
కథ కంచికి.. మరి ఖాకీలు..?
● చిత్తూరులో దొంగా–పోలీస్ ఆట ముగిసినట్టేనా..! ● ఇన్స్పెక్టర్ను వీఆర్కు పంపడంతో సరిపెట్టేశారు ● ఎస్ఐతో పాటు ముగ్గురు పీసీల పాత్రపై సందేహాలు ● క్లీన్చిట్ ఇస్తారా.. తప్పు చేసినట్టు నిర్ధారించారా? ● ఇంతకూ విచారణలో ఏం తేల్చారో! చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్. ఇటీవల వివాదాలకు, పలు ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పనిచేసే ఒకరిద్దరు ఖాకీలు చేసే తప్పుడు పనుల కారణంగా.. నిజాయితీగా ఉంటున్న మిగిలిన పోలీసులూ నిందలు మోయాల్సిన పరిస్థితి. ఇటీవల ఇక్కడ పని చేసిన ఇన్స్పెక్టర్ (సీఐ)ను అవినీతి ఆరోపణలపై వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు పంపించారు. ఇది శిక్షా? శిక్ష నుంచి తప్పించడమో? తెలియడంలేదు. ఇదే సమయంలో ఆరోపణలున్న మరో నలుగురిని ఇక్కడే కొనసాగిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కొక్కరికీ ఒక్కో‘లా’.. పలమనేరు అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లిన బురదను కడుక్కోవడానికి జిల్లాలో ఏకంగా 250 మందికి పైగా సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.. అవినీతి ఆరోపణలు వచ్చిన ఖాకీలపై ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. నిందితుడి భార్య, బంధువుల నుంచి రూ.12.50 లక్షలు ఖాకీలు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చిత్తూరులోని ఓ కానిస్టేబుల్ తన ఫోన్పేకు రూ.3 లక్షలు వేసుకోవడం, ఓ అధికారి రూ.3 లక్షలు, మరో అధికారి రూ.6 లక్షలకు పైగా తీసుకుని అందులో కొంత మొత్తం వెచ్చించి స్టేషన్కు రంగులు వేయించడం, సిబ్బందికి, అధికారులకు యూనిఫామ్ కొనిచ్చారనే ఆరోపణలు పోలీసుశాఖను కుదిపేశాయి. అనంతపురం డీఐజీ నుంచి చిత్తూరు ఎస్పీ వరకు దీనిపై ఆరా తీశారు. చివరకు చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్రాజును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు. సుదీర్ఘ విచారణ తరువాత గతనెల 8న చిత్తూరు వన్టౌన్ సీఐగా పనిచేస్తున్న జయరామయ్యను వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన ఓ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సీఐను వీఆర్కు పంపడం అతడిని శిక్షించినట్టా..? కాపాడినట్టా..? అంటూ పోలీసుశాఖలోని అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.500 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన అధికారులు, రూ.12.50 లక్షలు దొంగ నుంచే కొట్టేసిన అధికారుల విషయంలో మిన్నకుండడం విమర్శలకు దారితీస్తోంది. పైగా ఆరో పణలున్న ఎస్ఐ చేతిలో తప్పులు చేసేవాళ్లపై కేసులు నమోదు చేసే బాధ్యతను పెట్టడం సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని సామాన్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విచారణలో ఏం నిర్ధారించారు..? తప్పు చేయకపోతే సీఐను మాత్రం ఎలా వీఆర్కు పంపుతారు..? ఎస్ఐ, మరో ముగ్గురి పాత్ర లేదా..? అనే సందేహాలు బేతాళ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. విచారణ విషయాలు బయటపెట్టకపోవడానికి ఇది దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన అంశాలు కావు. అసలు దొంగ–పోలీస్ ఆటను విచారించిన అధికారులు వాస్తవాలను ప్రజలకు చెప్పాలిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదీ జరిగింది.. సంపత్. విద్యుత్శాఖలో రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఏడాది జనవరిలో చిత్తూరులోని ఇతని ఇంట్లో చోరీ జరిగింది. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసలు అన్ని నగలు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావ్..? నీకు ఎక్కడి నుంచి వచ్చాయ్..? డబ్బులు ఎలా వచ్చాయి..? అని పలు ప్రశ్నలతో విసుగెత్తించి, ఆలస్యంగా కేసు నమోదు చేశారు. అదే నెల 30వ తేదీన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 238.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 65 గ్రాముల వెండి, మూడు సెల్ఫోన్లు, ఓ వాచీ, రూ.4.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే కథ నడిచింది. రాయచోటిలో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ, ఇక్కడ చోరీ సొమ్ము నుంచి రూ.12.50 లక్షలు చిత్తూరు పోలీసులకు లంచంగా ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ మొత్తా న్ని తమకు ఇచ్చేస్తే దొంగ చోరీ చేసిన సొత్తుగా చూపించి, బాధితులకు ఇచ్చేస్తామని రాయచోటి పోలీసులు అడిగితే చిత్తూరు పోలీసులు అందుకు నిరాకరించడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేశారు. -
గుణశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేయండి
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అసత్యపు ఆరోపణలు చేసిన విజయపురం మండలం, కళియంబాకం గ్రామానికి చెందిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుణశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐ విక్రమ్కు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్కు వెళ్లినవారు తమ ఫిర్యా దు పత్రాన్ని సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నీలమేఘం మాట్లాడుతూ అధికారపార్టీ నేతల వద్ద మెప్పుపొందేందుకు గుణశేఖర్రెడ్డి తనపైనా, మాజీ మంత్రి కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆధారా లు లేకుండా ఆరోపణలు చేయడం నీచ రాజకీయానికి పరాకాష్ఠ అని, ఆయన అవివేకానికి నిద ర్శనమన్నారు. సంఘంలో గౌరవప్రదమైన స్థా నంలో ఉన్న వారిపై రాజకీయ లబ్ధి కోసం, స్వప్రయోజనాలకు ఆరోపణలు చేస్తున్న గుణశేఖర్రెడ్డిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టా లని కోరామన్నారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు రమేష్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాలన్, కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, మురుగ, నాయకులు కృష్ణమూర్తి, అయ్యప్ప పాల్గొన్నారు. పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి తనపై, తన కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేసిన గుణశేఖర్రెడ్డిపై మాజీమంత్రి ఆర్కేరోజా బుధవారం పరువునష్టం దావా చేశారు. నాటు బాంబు పేలి బాలుడికి గాయాలు యాదమరి: వన్యప్రాణుల కోసం పెట్టిన నాటు బాంబుకు ఓ బాలుడు తీవ్రగాయాలు పాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మండలంలోని కాశిరాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య భార్య తులసి తన కుమారుడు లోహిత్(7)ను వెంట తీసుకుని మేకలు మేపడానికి సమీప అడవిలోకి వెళ్లారు. అయితే అక్కడ వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు నాటు బాంబును అమర్చారు. బాలుడి కాళ్లకు ఏదో తగిలిందని గమనించి.. దానిని చేతిలోకి తీసుకున్నాడు. అది చేతిలోనే పేలడంతో బాలుడి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. చిత్తూరులోని దుకాణంలో చోరీ చిత్తూరు అర్బన్: నగరంలోని పొన్నియమ్మగుడి వీధిలో ఉన్న ఓ దుకాణంలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ పాల్పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పొన్నియమ్మ గుడివీధిలో బాబు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ దుకా ణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం మూసి వేసి, ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి చూడగా తలుపులు ప గులగొట్టి పలు వస్తువులను చోరీ చేసిన విషయం గుర్తించాడు. పోలీసులకు సమాచా రం ఇవ్వగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. -
గిరిజన గ్రామాన్ని అభివృద్ధి చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో గిరిజన గ్రామ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ మోహన్కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో జిల్లాలోని పలమనేరు మండలం జగమర్ల గిరిజన గ్రామాన్ని సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. జగమర్ల గ్రామంలో మౌలిక సదుపాయాల పెంపు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో కీలకమైన అంశాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జగమర్ల గ్రామానికి డీఆర్డీఏ, విద్య, వైద్యం, ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పీఆర్, జిల్లా పంచాయతీ, వ్యవసాయ అనుబంధ, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శాఖల అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి అందజేసే 144 అంశాల ఫార్మాట్ను సంబంధిత శాఖల అధికారులు వివరాలు నింపి పంపాలన్నారు. సంబంధిత శాఖలు అందజేసే వివరాలపై కలెక్టర్ ప్రతి నెలా జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్చిస్తారన్నారు. ఆయా శాఖలు అందజేసే వివరాలను కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. అదేవిధంగా పలమనేరులో మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చిత్తూరు డీవైఈఓ ఇందిర అన్నారు. బుధవారం పాత కలెక్టరేట్లోని డీవైఈఓ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. మొదటగా డీఈఓ వరలక్ష్మిని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు డివిజన్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంపొందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. డివిజన్ పరిధిలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం నూతన డీవైఈఓను ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్, జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి, గణేష్, హెచ్ఎం, ఎంఈఓ సంఘాల ప్రతినిధులు త్యాగరాజులురెడ్డి, రుక్మిణమ్మ, కోమల, అరుణ్కుమార్, మధుసూదన్రెడ్డి, భాస్కరరావు, సోము, తులసిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్
చిత్తూరు కార్పొరేషన్: మహిళలకు కుట్టు మిషన్లు, శిక్ష ణ పేరుతో కూటమి నాయకులు భారీ మోసానికి తెగబడ్డారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్నియాదవ్, రాష్ట్ర మొదలియార్ విభాగం అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ, మహిళా విభాగం నాయకులు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్ కొనుగోలుకు రూ.4300, ఒక వ్యక్తి శిక్షణ నిమిత్తం రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7,300 ఖర్చు అవుతుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. వాస్తవంగా లబ్ధిదారులకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు అయితే, ఇతర ఖర్చులు పొను కూటమి నాయకులకు రూ.150 కోట్లు దోచిపెట్టేందుకు పథక రచన చేశారని ఆరోపించారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసగించారని మండిపడ్డారు. బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో రూ.150 కోట్లకు పైగా దోపిడీ చేస్తున్న కూటమి పాలకులు, త్వరలోనే కమ్మ, కాపు, వైశ్య, క్షత్రియులకు ఈబీసీ కార్పొరేషన్ల పేరుతో మరో రూ.81 కోట్లు నొక్కేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా, బీసీ విభాగాలు ముఖ్య నాయకులు అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, ప్రతిమారెడ్డి, నారాయణ, త్యాగ, నవీన్యాదవ్, కవిత, కౌసర్, హరిషారెడ్డి, మంజులరెడ్డి, గోపి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. డీఆర్వోకు వినతి బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్ సీపీ మహిళా, బీసీ విభాగం జిల్లా, రాష్ట్ర నాయకులు విమర్శించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్వో మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కుట్టు శిక్షణకు లక్ష మంది బీసీ మహిళలకు రూ.73 కోట్లు పైగా ఖర్చవుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం రూ.257 కోట్లు పైగా చూపించడం ఏమిటన్నారు. పెద్ద కంపెనీలకు టెండర్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎల్2, ఎల్3 కంపెనీలకు టెండర్ కట్టబెట్టి రూ.కోట్లు దోచుకుంటోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, మహిళలకు న్యాయం చేయాలన్నారు. -
కారు ఢీకొని కల్లుపల్లి వాసి మృతి
పలమనేరు: పట్టణ సమీపంలోని గంటావూరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం స్కూటీలో రోడ్డు దాటు తున్న వ్యక్తిని కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మునిరత్నం అలియాస్ చిన్నబ్బోడు పలమనేరులోని గంటావూరు చెరువుకట్ట రోడ్డు నుంచి స్కూటీలో వెళుతూ హైవే దాటే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి అతడి స్కూటీని ఢీకొంది. దీంతో మునిరత్నం అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. కాగా మృతునికి డిగ్రీ చదివే కుమారుడున్నారు. ఇతని భార్య కొన్నాళ్ల కిందట మృతి చెందింది. గత నెలలో మృతుడి అన్న సుబ్రమణ్యం అలియాస్ పెద్దబ్బోడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కల్లుపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి వడమాలపేట (విజయపురం) : తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న డిల్లీ (40) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. నాగలాపురం వినోబానగర్కు చెందిన డిల్లీ తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా.. వడమాలపేట కదిరిమంగళం మలుపు వద్ద వెంకటగిరికి చెందిన ఓ కుటుంబం అంజేరమ్మను దర్శించుకుని కారులో తిరిగి వెళ్తూ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన డిల్లీని పోలీసులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు. తల్లిపై కొడుకులు, కోడళ్ల దాడి చిత్తూరు అర్బన్: కన్నతల్లిపై దాడికి పాల్పడిన కొడుకులు, ఇద్దరు కోడళ్లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని వెంగళరావు కాలనీకి చెందిన సుగుణమ్మ ఈనెల 5వ తేదీ ఇంటి వద్ద ఉండగా, కుటుంబ విషమయై తన కొడుకులతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు కలిసి తనపై దాడి చేసి, గాయపరచారని సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితురాలి కొడుకులు కరుణకుమార్, హరీష్, కోడళ్లు రేవతి, రోసీపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువతి ఆత్మహత్య బంగారుపాళెం: మండలంలోని తుంబపాళేనికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సీఐ కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కరయ్య కుమారై శశికళ(21) డిగ్రీ వరకు చదువుకుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేక పోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 5వ తేదీ పిడుదుల నివారణ మందు తాగింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పీఐ తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాకింత విషమిచ్చి.. భూములు తీసుకోండి
● పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా? ● సర్వేని అడ్డుకుని..అధికారులపై ఆగ్రహం శాంతిపురం: ‘మాకు తలా ఇంత విషమిచ్చి.. మా ప్రాణాలు తీసేశాక మా భూములు తీసుకుని మీరు ప్యాక్టరీలు కట్టుకోండి. తరాలుగా అనుభవిస్తున్న భూములు పూర్తిగా లాక్కుని మీరిచ్చే కాసులు ఖర్చ య్యాక మేము వీధుల్లో అడుక్కుతినాలి.’ అని రైతు లు వాపోయారు. కుప్పం నియోజకవర్గంలోని రామ కుప్పం–శాంతిపురం మండలాల పరిధిలో ఇండస్ట్రీయల్ పార్కు కోసం దండికుప్పం, సిద్ధారెడ్లపల్లి, వెంకటేష్పురం, అమ్మవారిపేట గ్రామాల్లో భూ సేకరణ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు పాలెంగట్టు వద్ద గుమికూడి అడ్డుకున్నారు. పదేళ్ల క్రితం విమానాశ్రయం కోసం తీసుకున్న భూములు ఇప్పటి కీ వృథాగా ఉన్నాయని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయత్నం చేసినా సర్వే చేయనివ్వకపోవడంతో బుధవారం కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, శాంతిపురం తహసీల్దార్ శివయ్య, రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ వెళ్లి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. తమను నిరాశ్రయులను చేసే అభివృద్ధి తమకు వద్దని రైతులు తెగేసి చెప్పారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడా పీఓ వికాస్ మర్మత్, కుప్పం డీఎస్పీ పార్థసారథి, అధికార పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తమ భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు ప్రశ్నించారు. అభివృద్ధి కోసం నాయకులు వాళ్ల సొంత భూములను ఇచ్చాక తమ భూములకు రావాలని స్పష్టం చేశారు. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను వదిలిపెట్టి తమ పొట్టలు కొట్టవద్దని చెప్పారు. చదువు లేని తమకు పరిశ్రమల్లో ఏమి ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. మళ్లీ తమ భూముల జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, నాయకులు ఎంతగా చెప్పినా రైతులు అంగీకరించకపోవడంతో మళ్లీ కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. బాధిత రైతులకు వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, బాధితుల్లో ఒకరైన కుప్పం రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి బాధితులకు సంఘీభావం తెలిపారు. స్థానిక ఉపాధికి సహకరించండి సీఎం చంద్రబాబుకు పలు సందర్భాల్లో కుప్పం ప్రజలు చేసిన వినతుల మేరకు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలు తెస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు వచ్చే పరిశ్రమలకు సహకరించాలని కోరారు. రైతులు సహకరించి భూములు ఇస్తే పరిహారంతో పాటు వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందరి అభ్యంతరాలు తీర్చాకే ముందుకు పోతామన్నారు. శాంతిపురం మండలంలోనే నైక్, అడిడాస్ కంపెనీలు ప్రారంభిస్తారని చెప్పారు. ఏమి కావాలో అడగండి పరిశ్రమలకు భూములు కోల్పోయేవారు తమకు, వారి పిల్లల భవిష్యత్తుకు ఏమి కావాలో అడిగితే సీఎం దృష్టికి తీసుకుపోతామని కడా పీఓ వికాస్ మర్మత్ చెప్పారు. వ్యవసాయం ద్వారా 15 ఏళ్లలో రానంత మొత్తాన్ని పరిహారంగా ఇప్పిస్తామన్నారు. పదేళ్ల క్రితం ఎయిర్పోర్టుకు భూములిచ్చిన వారికి రావాల్సిన రూ.14 కోట్ల పెండింగ్ బిల్లులు వడ్డీతో సహా ఈ నెలాఖరు లోపు అందుతాయన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం
మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపు నగరి : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీ మంత్రి ఆర్కే రోజా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. బుధవారం నగరి పట్టణంలోని తన నివాసంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విభాగాలు, అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు ఇకపైన యాక్టివ్ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి అటకెక్కాయని, ఆస్పత్రుల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా ఆగిపోయయాయన్నారు. వ్యవసాయం సహా విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందుతోందన్నారు. పాలనలో పారదర్శకత లేదన్నారు. అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయన్నారు. వీటిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వారికి అండగా ఉండి పోరాడాలన్నారు. ఈ సమావేశాల్లో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, పార్టీ అనుబంధసంఘాల నేతలు పాల్గొన్నారు. -
కుట్టు..ఉపాధికి పడేనా మెట్టు
మాకింత విషమిచ్చి.. మాకింత విషమిచ్చి మా ప్రాణాలు తీసి, భూములు తీసుకుని, ఫ్యాక్టరీలు కట్టుకోండని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అల్లూరి ఆశయాలు ఆదర్శం● సగం సెంటర్లలోనే శిక్షణ ప్రారంభం ● ఎంపికలో రాజకీయ ప్రమేయం ● కేంద్రాలలో అరకొర సౌకర్యాలు ● కొన్ని సెంటర్లలో పాడైన కుట్టుమిషన్ల ఏర్పాటు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాంప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామ ని మాజీ మంత్రి ఆర్కే రోజా వైఎస్సా ర్ సీపీ నేతలకు పిలుపునిచ్చారు.గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025– 10లోచిత్తూరు కలెక్టరేట్ : అభం శుభం ఎరుగని చిన్నారుల ఆరోగ్యంపై కూటమి సర్కారు కాఠిన్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించినా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకుండా వేడుక చూస్తోంది. పైగా అంగన్వాడీ కార్యకర్తలకు 15 రోజులు, ఆయాలకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు కేంద్రా న్ని నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చాలీచాలని ఇ రుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు వేసవి కారణంగా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రస్తుతం పాఠశాల, కళాశాల, డిగ్రీ విద్యార్థులందరికీ వేసవి దృష్ట్యా సెలవులు ఇచ్చేశారు. అయితే అభం శుభం ఎరుగని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మా త్రం కూటమి సర్కారు సెలవులు ప్రకటించలేదు. మండుతున్న ఎండల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు వేసవి తాపం తట్టుకోలేపోతున్నారు.గ్రామీణ నిరుద్యో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం సీడాప్ సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు డీడీయూ–జీకేవై పథకంలో జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, బ్యూటీ థెరపీ కోర్సుల్లో నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. వైఎస్సార్ కడప కేంద్రంలో ఇచ్చే ఈ శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి, కంప్యూటర్ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్ తోపాటు అర్హతను ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18–30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. జిల్లాలోని గ్రామీణ పేద కుటుంబాల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్ఐహెచ్ఏఆర్ఎస్కేఐఎల్ఎల్.సీవోఎం (www.niharrki.com) లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9063082227, 9966448807 నంబర్లలో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కోర్టులో 171 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చిత్తూరు అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయస్థానాల్లో పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 171 పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్ 7, జూనియర్ అసిస్టెంట్ 25, టైపిస్ట్ 13, ఎగ్జామినర్ 3, కాపీయిస్ట్ 17, ప్రోసెస్ సర్వర్ 21, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 85 చొప్పున ఖాళీలున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.aphc.gov.in అనే వెబ్సైట్లో ఈనెల 13 నుంచి వచ్చేనెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లా కోర్టు పరిధిలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారు ఈనెల 13 నుంచి వచ్చేనెల 24వ తేదీలోపు చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇతర వివరాలకు చిత్తూరు జిల్లా కోర్టులోని పరిపాలన అధికారిని సంప్రదించాలని న్యాయశాఖ అధికారులు తెలిపారు. సిందూర్ విజయవంతంపై జెడ్పీ చైర్మన్ హర్షం పలమనేరు: ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశా రు. పట్టణంలో బుధవా రం ఆయన మాట్లాడు తూ పెహల్గాంలో ఉగ్రవాదులు దాష్టికాన్ని చూసి బాధపడిన ఎందరో భారతీయులకు మనసులు ఇంకా కుదటపడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్తు దేశం అండగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సైనికుల సంబరాలు పలమనేరు పట్టణానికి చెందిన మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికులు బుధవా రం స్థానిక ఏటీఎం వద్ద సంబరాలు చేసుకున్నా రు. ఇలాంటి సమయంలో ప్రజలంతా దేశం కో సం అండగా నిలుద్దామన్నారు. ఇందులో మిల టరీ సిద్ధయ్య, మాజీ సైనికులు పాల్గొన్నారు. సహకార బ్యాంకుల బలోపేతానికి కృషి చిత్తూరు రూరల్ (కాణిపాకం): సహకార బ్యాంకుల బలోపేతానికి కృషి చేయాలని డీసీసీబీ సీఈఓ శంకరన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో బ్రాంచ్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ఖాతా దారుల సంఖ్యను పెంచుతూ బ్యాంకుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. పకడ్బందీగా రుణాలు ఇవ్వడంతో పాటు తిరిగి రుణాల వసూళ్లపై కూడా దృష్టి సారించాలన్నారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన సూచించారు. రేషన్ కార్డు దరఖాస్తులకు ఆన్లైన్లో అవకాశం చిత్తూరు రూరల్ (కాణిపాకం): రేషన్కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. బుధవారం నుంచి రేషన్కార్డుకు సంబంధించిన వెబ్సైట్లో దరఖాస్తుకు ఆప్షన్ ఇచ్చింది. ఈ కొత్తకార్డులతో పాటు కార్డులో సభ్యుల చేరిక, సభ్యుల తొలగింపు, కార్డు విభజన, కార్డు సరెండర్ తప్పుడు ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సచివాలయం వేదికగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పాత పద్ధతి, నిబంధనల ప్రకారమే కార్డులు జారీ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. దరఖాస్తు దారులు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఫొటో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే కార్డు విభజనకు అవకాశం ఉంటుందని డీఎస్ఓ శంకరన్ తెలిపారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ లాగిన్లో అప్రూల్ అయినా వెంటనే కార్డులు సచివాలయంలోనే తీసుకోవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వం 21 రోజులు గడువు విడించిందని ఆయన పేర్కొన్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చిత్తూరు అర్బన్: అల్లూరి సీతారామరాజు ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలు అమలు చేయడంతోపాటు న్యాయాన్ని నిలబెట్టాలనే అల్లూరి జీవిత సత్యం భారతావని మరువదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ శివ నందకిషోర్, డీఎస్పీలు మహబూబ్ బాషా, చిన్నికృష్ణ, డీసీఆర్బీ సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి చిత్తూరు కలెక్టరేట్ : భారతదేశంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వాల శక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. సాయుధ పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వస్తుందని నమ్మిన మన్యం వీరుడు అల్లూరి అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, తదితరులు పాల్గొన్నారు. – 10లో– 10లోన్యూస్రీల్ ఉన్నత విద్యాసంస్థలకూ సెలవులు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు లేమి ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులు సరిహద్దు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం సెలవులు జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రా ల్లో ఫ్యాన్లు ఉన్నా ఉక్కపోతతో ఇబ్బంది పడు తున్నారు. ఫ్యాన్లు లేని చోట్ల చిన్నారుల పరిస్థి తి చెప్పనవసరం లేదు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుంటే, వారిని సముదాయించలేక ఆయాలు ఇబ్బంది పడుతున్నారు. విద్యు త్ సరఫరా లేని సమయంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు బాధ వర్ణనాతీతంగా ఉంది. అలాగే గర్భిణులు, బాలింతలు సైతం పౌ ష్టికాహారం కోసం ఎండలోనే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నారుల వికాసానికి.. పూర్వప్రాథమిక విద్యకు వేదిక అయిన అంగన్వాడీ కేంద్రాలు సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడికి తాళలేక అవస్థలు పడుస్తున్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అయినా కూటమి సర్కారు సెలవులు ఇవ్వకుండా వేడుక చూస్తోంది. జిల్లాలోని అంగన్వాడీల సమాచారం మెయిన్ అంగన్వాడీలు 1,795 మినీ అంగన్వాడీలు 625 7 నెలల నుంచి 3 ఏళ్ల బాలురు 28,783 7 నెలల నుంచి 3 ఏళ్ల బాలికలు 27,012 3– 6 సంవత్సరాల బాలురు 17,521 3– 6 సంవత్సరాల బాలికలు 17,481 మొత్తం బాల,బాలికలు 90,797సర్కారుకు ఆ మాత్రం తెలియదా? అంగన్వాడీ కేంద్రాలకు ఈ నె ల ఒకటో తేదీ నుంచి నెల రో జులు సెలవులు ఇవ్వాలని అడి గాం.ఇంతవరకు అతీగతీ లేదు. చిన్నారులు, గర్భిణులు, చిన్నా రులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం ఇళ్ల కు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పని ఒత్తిడి తగ్గిస్తామన్నారు కానీ, ఇంకా పెంచుతూనే ఉన్నారు. జీతాల విషయంలోనూ పట్టించుకోవడం లేదు. ఎండలు మండుతున్నా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని సర్కారుకు తెలియదా? – ప్రేమ, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్పొరుగు రాష్ట్రాల్లో సెలవులిచ్చారు కదా? జిల్లా సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చారు. ఏపీలో మాత్రం వింత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు. సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – రాధమ్మ, ఏఐటీయూసీ యూనియన్ నాయకురాలు, ఎస్ఆర్ పురం వేసవి సెలవుల్లో కిశోరి వికాసమట.. వేసవి సెలవుల్లో కూటమి సర్కారు కిశోరి వికాసం కార్యక్రమం చేపడుతోంది. వేసవి సెలవులు ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేపడుతుండడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నెల 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యక్రమం మంచిదే అయినప్పటికీ, వేసవి సెలవుల్లో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కన్వీనర్లుగా వారి కేంద్రాల పరిధిలోని కిశోరి బాలికలను సర్వే చేసి, సచివాలయాల పరిధిలో ఏఎన్ఎం, ఎంఎస్కేలతో కలిసి ప్రతి మంగళ, శుక్రవారాల్లో బడి బయట పిల్లలు, బాల్యవివాహాలు, పుట్టే బిడ్డల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా సాగుతోంది. -
ఆరోగ్యానికి పుండు
పండ్లు మాటున విషం పొంచి ఉంది. కాయలను రసాయనాలతో మాగబెట్టడడంతో వాటిని తింటే అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లా సమాచారం రైతు భరోసా కేంద్రాల సంఖ్య 502 ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం 71,305 హెక్టార్లు వేరుశనగ సాధారణ విస్తీర్ణం 35,238 హెక్టార్లు మొత్తం రైతుల సంఖ్య 1.80 లక్షలు వేరుశనగ సాగు చేసే రైతులు 90 వేలు (సుమారు) జిల్లాకు అవసరమైన వేరుశనగ విత్తనం 40,338 క్వింటాళ్లు కోతపెట్టిన విత్తనం 13,988 క్వింటాళ్లు ప్రస్తుత విత్తన కేటాయింపు 26,350 వేరుశనగ కే–6రకం కేజీ మార్కెట్ ధర రూ.93 నారాయణి కేజీ ధర రూ.95– 8లో– 8లో -
పుంగనూరుకెందుకన్ని నిధులు?
● కూటమి ప్రజాప్రతినిధుల అక్కసు ● ఆ నియోజకవర్గానికి నిధులు తగ్గించాలని హుకుం ● కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ● పాల్గొన్న ఇన్చార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రజాప్రతినిధులు పుంగనూరు నియోజకవర్గంపై అక్కసు చూపించారు. ఆ నియోజకవర్గానికి ఎందుకు అన్ని నిధులు ఎక్కువ ఇచ్చారు.. ఇకపై ఆ నియోజకవర్గానికి తగ్గించండి అని టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అధికారు లకు హుకుం జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మధ్యాహ్నం 1.15 గంటలకే తూతూమంత్రంగా మమ అనిపించేశారు. ఈ సమీక్షలో 15 శాఖల్లోని అంశాలను చర్చించాల్సి ఉండగా.. 8 శాఖల్లో అంశాలపై తూతూమంత్రంగా చర్చించి చేతులు దులుపుకున్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో ఇన్చార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఎఫ్ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. హైవేలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి జిల్లాలోని జగమర్ల–ఐతేపల్లి రోడ్డులో గత సంవత్సర కాలంలో ప్రమాదాలు జరిగి 600 మృతి చెందారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. చిత్తూరు తిరుపతి బెంగళూరు హైవేల్లో నిత్యం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పి.కొత్తకోటకు సమీపంలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సమస్యలకు అధిక నిధులు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో కేటాయించిన నిధులను అధికంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. జిల్లాలో మామిడి దిగుబడి అధికంగా ఉన్నందున పల్ప్ను టీటీడీ భక్తులకు అందజేసేలా ప్రజా ప్రతినిధుల సహకారంతో టీటీడీ ఆమోదం పొందితే మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీన కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టం పరిహారం అందించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నిధులెందుకు మురగబెడుతున్నారు? అసలే నిధుల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ నిధులున్నా ఎందుకు మురగపెడుతున్నారంటూ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక శాతం నిధులు ఖర్చు చేయకుండా అలాగే ఉంచితే తర్వాత నిధులు ఎలా వస్తాయంటూ చురకలంటించారు. అధికారిక సమావేశంలో స్టేజీపై టీడీపీ నేత జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం అధికారికంగా కలెక్టరేట్లో చేపట్టగా ఈ సమావేశంలో టీడీపీ నేత స్టేజీ తిష్టవేశారు. ఎలాంటి హోదా లేని పుంగనూరు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి దర్జాగా స్టేజీపై కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారిక సమావేశంలో హోదా లేని ఆ టీడీపీ నేత ఎలా పాల్గొంటారని, గతంలో సైతం అనేక సమావేశాల్లో ఇలానే పాల్గొన్నాడని అధికారులు గుసగుసలాడారు. అదే విధంగా జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొని సమావేశానికి ఇబ్బంది కలిగేలా చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. విచారణ చేసి నివేదికలివ్వండి ఇటీవల ప్రభుత్వ, అపోలో ఆస్పత్రిలో జరిగిన ఓ మహిళ మృతి ఘటనపై సమీక్షలో చర్చించారు. అపోలో ఆస్పత్రిలోని వైద్యుల అలసత్వం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోలో ఎంఓయూను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నిబంధనల ప్రకారం అపోలో యాజమాన్యం మందులను కొనుగోలు చేస్తోందా..?లేదా.. పలు అంశాలపై విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇవ్వాలన్నారు. గగనంగా మామిడికి గిట్టుబాటు జిల్లాలో ఎక్కువ మంది మామిడి రైతులున్నారని, అయితే ప్రతిసారీ మామిడికి గిట్టుబాటు ధర కల్పించడం గగనమవుతోందని ఇన్చార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధర, ఎగుమతులు, టీటీడీతో ఒప్పందం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని, జిల్లాలో ఉన్నతాధికారులకు ఉన్న చిత్తశుద్ధి క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులకు లేదని మండిపడ్డారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే ఈరోజుకీ ప్రజలు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. తప్పెవరిదని రెవెన్యూ ఉద్యోగులు గుండైపె చేయి వేసుకుని పరీక్షించుకోవాలన్నారు. -
సార్ చెబుతుంటే.. మేడమ్ వింటున్నారు..
ఖరీఫ్ విత్తు సమయం ఆసన్నమైంది.. హలం పట్టి పొలం దున్ని సాగుకు సన్నద్ధమయ్యాడు పుడమి పుత్రుడు. రాయితీ విత్తు కోసం ఎదురు చూస్తున్నాడు. కూటమి సర్కారు రాయితీ విత్తనం అరకొరగా కేటాయించింది. ఆ విత్తుపై కూటమి నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. అర్హుడైన కర్షకుడికి కాయలు అందేనా?.. విత్తనం కోసం అన్నదాత విలపించాల్సిదేనా?.. సాగు సాగేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి.జిల్లాకు అరకొరగా వేరుశనగ విత్తన కేటాయింపు ● ఆ విత్తనానికీ కూటమి నేతల పోటీ ● ముందస్తుగా ఆర్డర్లు ● నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ● అర్హులైన రైతులకు కాయలు కష్టమే ● వేరుశనగ సాగు కష్టమే● సీఎం ముందు విలపించిన ఓ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025గర్భిణుల సేవలపై నిర్లక్ష్యం వద్దు చిత్తూరు రూరల్ (కాణిపాకం): గర్భిణులకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాతా శిశు మరణాలను కట్టడి చేసేందుకు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలన్నారు. గర్భిణుల సేవల్లో నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సుఖ ప్రసవాలు పీహెచ్సీల్లో జరగాలన్నారు. హైరిస్క్ కేసులను జిల్లా ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్యులు ప్రవీణ, అనూష, అనిల్కుమార్, గిరి, వేణుగోపాల్, శ్రీవాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): కొత్త రేషన్కార్డులకు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని డీఎస్ఓ శంకరన్ తెలిపారు. కొత్తకార్డుల దరఖాస్తుతోపాటు కార్డుల విభజన, సభ్యులు చేరిక, చిరునామా మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చన్నారు. వెబ్సైట్లో కూడా కార్డులు దరఖాస్తు, జారీకి బుధవారం నుంచి అవకాశం కల్పించవచ్చన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. కాగా ఇప్పటి వరకు కొత్త రేషన్కార్డుల కోసం సుమారు 20 వేల వరకు దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇదివరకు ఈకేవైసీ చేయించుకున్న వాళ్లు కార్డు విభజన చేసుకోవాలంటే ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కార్డులు మంజూరు, నిబంధనలు, ఇతరాత్ర విషయాలపై అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఆన్లైన్లో పొందుపరిచే నిబంధనల ప్రకారమే కార్డులు జారీ ఉండవచ్చని వారు భావిస్తున్నారు. కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకోనుందని అంటున్నారు. పెద్దపంజాణి ‘గీత’ మద్యం షాపునకు దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు అర్బన్: కల్లు గీత సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వు చేసిన పెద్దపంజాణిలో మద్యం దుకాణం ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ (ఈఎస్) శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మద్యం దుకాణం లైసెస్స్ కోసం మంగళవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 50 శాతం రాయితీతో కల్లుగీత సామాజికవర్గానికి మద్యం దుకాణం కేటాయిస్తామని, ఇందు కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణాన్ని కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు చిత్తూరు నగరంలోని మిట్టూరులో ఉన్న ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఈఎస్ కార్యాలయం, పుంగనూరులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. కాణిపాకం: జిల్లాకు ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను అరకొరగా కేటాయించింది. ఈ విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ సందిగ్ధంలో పడింది. దీనికి తోడు కూటమి నేతలు విత్తన కాయల కోసం పోటీపడుతున్నారు. ముందస్తుగా విత్తన కాయల కోసం ఆర్డర్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల అధికారులు సైతం వారి సిఫార్సులకు తలొగ్గారు. జిల్లాలోని రైతులు ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా సాగు చేసే పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. జిల్లా వ్యాప్తంగా 1.80 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 90 వేల మంది రైతులు ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేస్తారు. తలొగ్గిన అధికారులు కూటమినేతలు, కార్యకర్తల సిఫార్సులకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది చాలా మంది తలొగ్గారు. నేతల డిమాండ్ మేరకు కాయలను నేరుగా ప్రైవేటు భవనాలకు మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారు. కానీ పక్షంలో కాయల కోసం వచ్చే రైతుల పేరిట రెండు, మూడు బ్యాగులకు టోకన్లు వేసి నేతలకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. జీడీ నెల్లూరు, చిత్తూరు, ఎస్ఆర్ పురం, పలమనేరు, కుప్పం, వి.కోట, శాంతిపురం, బంగారుపాళెం, పూతలపట్టు, నగరి, గుడిపాల తదితర మండలాల్లో చేయడానికి ప్రయత్నాలు అధికంగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు చిత్తూరు కార్పొరేషన్: డిప్యూటీ ఎంపీడీఓల నుంచి ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందినవారికి మండలాలను కేటాయించారు. ఈ వివరాలను మంగళవారం జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలియజేశారు. ఎర్రావారిపాళెం డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న మాలతిని కేవీబీపురం ఎంపీడీఓగా నియమించారు. నాగలాపురంలో పనిచేస్తున్న వెంకటరత్నమ్మను బీఎన్కండ్రిగ ఎంపీడీఓగా, రామకుప్పంలో పనిచేస్తున్న రాధాకృష్ణకు గుడుపల్లె ఎంపీడీఓగా, వెదురుకుప్పంలో పనిచేస్తున్న పురుషోత్తానికి అక్కడే ఎంపీడీఓగా, అనకాపల్లిలో పనిచేస్తున్న శిరీషను గుడిపాల ఎంపీడీఓగా నియమించారు. చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మంగళవారం జిల్లాలోని పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్, డీఎన్ఏ ప్రొఫైలింగ్, సైబర్ ఫోరెన్సిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాలు కొత్త రూపాలు ఎలా దాలుస్తున్నాయి ? నిందితులను ఎలా పట్టుకోవాలి ? సాక్ష్యాల సేకరణపై ఎస్పీ మణికంఠ వివరించారు. నిపుణులను సైతం పిలిపించి సందేహాలను నివృత్తి చేయించారు. ఈ సదస్సులో ఎస్పీ వేదికపై కూర్చుని క్లాస్ చెబుతుంటే.. కింద కూర్చుని విషయాలను ఓ మహిళా అధికారి ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ అధికారిణి హర్షిత తిరుపతి రైల్వే (జీఆర్పీ) డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే ఈమె ఎస్పీ సతీమణి కావడం గమనార్హం. ఇలా ఒకే వేదికలో ఎస్పీ దంపతులు వేర్వేరు హోదాల్లో సెమినార్కు హాజరుకావడం విశేషం. న్యూస్రీల్విత్తనకాయల కోత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్లో 71,305 హెక్టార్లల్లో 22 రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఇందులో 35,238 హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ మేరకు తొలుత 40,338 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం 26,350 క్వింటాళ్ల కాయలను మాత్రమే కేటాయించింది. కేటాయించిన విత్తనకాయలు సరిపోవని, 13,988 క్వింటాళ్ల విత్తనాలు ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ఇవి వస్తాయా? లేదా అనే అనుమానం ఉంది. ఇప్పటికే కేటాయించిన కాయలను పంపిణీ చేస్తే ఒక్కొక్క రైతుకు ఒక బ్యాగు చొప్పున్న 88 వేల మందికి ఇవ్వవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. వేరుశనగ రాయితీ ధరను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.అవసరం మేరకు కాయలు ఇవ్వాలి వేరుశనగ సాగు చేసే రైతులకు అవసరమైన మేరకు కాయలు ఇవ్వాలి. సిఫార్సులు లేకుండా అర్హులైన రైతులకు కాయలు అందేలా చూడాలి. 26,350 క్వింటాళ్ల కాయలు వస్తే జిల్లాకు సరిపోవు. కచ్చితంగా 40 వేల క్వింటాళ్ల కాయలు అవసరం ఉంది. అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దు. ముందుస్తుగానే కాయలు పూర్తి స్థాయిలో తెప్పించుకుని ఇచ్చేలా చూడాలి. –ఆర్ వెంకటరెడ్డి, రైతు నాయకుడు, జీడీ నెల్లూరు కూటమి నేతల వల అప్పుడే క్షేత్రస్థాయిలో వేరుశనగ విత్తనాల కోసం కూటమి నేతల వద్దకు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. అధిక మొత్తంలో కొల్లగొట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మండల నేతలు ఒక్కొక్కరూ 50 నుంచి 100 బ్యాగులు ఆశిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు 10 నుంచి 50 బ్యాగులు కావాలని హుక్కుం జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాము పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణికి దిగుతున్నారని పలువురు అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. -
హత్యాయత్నం కేసులో పదిమంది అరెస్టు
పలమనేరు: పట్టణంలో గత నెల 25వ తేదీన సునీల్కుమార్ అనే యువకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో పదిమంది నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహరాజు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వారిలో కళ్యాణ్కుమార్, పవన్, సాయి, హరితో పాటు మరో ఆరుగురున్నారని తెలిపారు. ఇదే కేసులో మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. జాతర సందర్భంగా రౌడీయిజం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. జాతరకు సంబంధించి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పాత కేసుల్లోని వారిని కూడా బైండోవర్లు చేసుకుంటున్నామని తెలిపారు. తంబిగానిపల్లిలో చోరీ కుప్పం: మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో కాపురమున్న బాబు ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 10 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు.. బాబు తన పెంకుటింట్లో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గది తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీరువాలో ఉంచిన 10 గ్రాముల బంగారు ఆభరణం, 250 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.4వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం పోలీసులు తెలిపారు. జామీనుదారులకు జైలు ఐరాల: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితులకు జామీను ఇచ్చిన పీలేరుకు చెందిన నాగరాజు, తండ్రి సిద్ధయ్యకు ఆరు నెలలు జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక సెషన్స్ కోర్టు జడ్జి నరసింహమూర్తి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంగళవారం ఎస్ఐ నరసింహులు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ జామీనుదారులను కోర్టులో హాజరు పరచుకుండా ఉన్నందుకు జడ్జి శిక్ష విధించినట్లు వెల్లడించారు. విద్యుత్షాక్తో యువకుడి మృతి పుంగనూరు: తన సొంత ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటుండగా విద్యుత్షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రాంపల్లెలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రాంపల్లెకు చెందిన గోవిందప్ప కుమారుడు మణి(32) ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో ఇంటి కట్టడాలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ఇంటి పై నుంచి నీటి సంపులో పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు మణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
● సగం సంపాదన ఇంటి అద్దెకే! ● పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ పెరిగిన ఇంటి అద్దెలు ● ఏడాదిలో భారీగా అద్దె పెంచిన యజమానులు ● మరింత భారంగా కరెంట్ చార్జీలు ● ఇబ్బందుల్లో సామాన్యుల బతుకుబండి
పలమనేరు: పట్టణ సమీపంలోని సాయినగర్కు చెంది న జ్యోతి కుటుంబం ఓ అద్దె ఇంట్లో కాపురముంటోంది. ఆమె ఓ గార్మెంట్స్లో పనిచేస్తూ నెల జీతం రూ.10 వేలతో తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఇందులో ఇంటి అద్దెకు రూ.6 వేలు, విద్యుత్ బిల్లుకు రూ.550 మొ త్తం కలిపి రూ.6,550 అవుతోంది. మిగిలిన సగం సంపాదనలో పిల్లల చదువులు, ఇంటి సామగ్రి, ఆస్పత్రి ఖర్చులు తదితరాలకు సైతం ప్రతి నెలా అప్పులు చే యాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి యజమాని అద్దె పెంచినప్పుడల్లా ఆ ఇల్లు ఖాళీ చేసి తక్కువ అద్దె ఉన్న మ రో ఇంటికి వెళ్లడం ఆమెకు పరిపాటిగా మారింది. ఇది కేవలం పలమనేరు ప్రాంతంలోనే కాదు జిల్లాలో అద్దె ఇంటిదారుల పరిస్థితి. అద్దెల భారం పట్టణాలు, నగరాల్లో అయితే మరీ ఎక్కువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కొండెక్కా యి. సూపర్సిక్స్ మాయమైంది. దీంతో పేదల బతుకులు భారంగా మారాయి. ఇక పంచాయతీలు, ము న్సిపాటిలిటీ, కార్పొరేషన్లలో ఇంటి పన్ను, నీటి పన్ను లు పెంచేశారు. దీంతో అద్దె పెంచాల్సి వచ్చిందని ఇంటి యజమానులు చెబుతున్నారు. భారీగా పెరిగిన ఇంటి అద్దెలు గత రెండేళ్లకు ఇప్పటికీ ఇంటి అద్దెలు రెట్టింపు అయ్యా యి. చిత్తూరు, పలమనేరు, కుప్పం లాంటి చోట్ల ఇంటి అద్దె రూ.4 వేలు నుంచి రూ.8 వేలు వరకు ఉంది. పుంగనూరు, నగిరి, పుత్తూరులో రూ.6 వేలుగా ఉంది. ఇక మండల కేంద్రాల్లో రూ.3 నుంచి రూ.4 వేలుగా ఉంది. గతంలో పెద్దనోట్ల రద్దుతో అద్దెల భారం ఎ క్కువైంది. అప్పటి నుంచి ఇంటి యజమానులు ఏటా అద్దెను కొంత పెంచుతూ వచ్చారు. దీనికి తోడు అన్ని వస్తువులపై జీఎస్టీ రావడంతో అధికభారం పడింది. పంచాయతీల్లో మొదలు, మున్సిపాలిటీలో ఇంటి, నీ టి పన్నులు పెంచేశారు. దీంతో ఇంటి యజమానులు ఈ దఫా ఎక్కువగా అద్దెలు పెంచేశారు. అద్దె ఇళ్లలో మరెన్నో సమస్యలు అద్దె ఇంట్లో ఏదేని శుభకార్యమైతే పర్వాలేదు కానీ అశుభ కార్యమైతే ఇంటి యజమానులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమయాల్లో అంత్యక్రియలు సొంత ఊర్లలో చేసుకోవాల్సి వస్తోంది. ఇన్ని సమస్యల మధ్య అలవాటు పడిన చోటును వదులుకోలేక పెంచిన అద్దెలు కష్టమైనా చెల్లిస్తున్నారు. కాదు కూడదు అంటే వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సిందే. వెంటనే మరో అద్దె ఇల్లు దొరుకుందా? అంటే అదీ సమస్యే. దీంతో అద్దె ఇళ్లలో కాపురాలుండేవారు తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలో అర్థంగాక కుమిలిపోతున్నారు. అద్దెల నియంత్రణకు చట్టాలూ కరువే వ్యవస్థాగతంగా అద్దెల నియంత్రణకు చట్టాలు, నిబంధనలు లేకపోవడం ఇంటి యజమానులకు వరంలా మారింది. దీంతో వారు ఇష్టానుసారంగా ఏటా అద్దెలు పెంచుతున్నా.. వీరిని ప్రశ్నించేవారే లేరు. గతంలో పదేళ్లకు, ఐదేళ్లకు, మూడేళ్లకు అద్దె ఇంట్లో ఉండేలా యజమానులు అగ్రిమెంట్లు రాసిచ్చేవారు. ప్రస్తుతం ఏడాదికి మాత్రమే అగ్రిమెంట్లను రాసిస్తున్నారు. జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం జనాభా 18.72 లక్షలు (2011 జనాభా లెక్కల మేరకు) ప్రస్తుత జనాభా సుమారు 23 లక్షల దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు 6 మండలాలు 32 మున్సిపాలిటీలు 4, కార్పొరేషన్ 1 జిల్లాలోని ఇళ్లు 6,39,953 అద్దె ఇళ్లు సుమారు 80వేలు నెలొస్తే ఇంటి అద్దెతో భయమేస్తుంది నేను మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గతంలో రూ.2,500 ఉన్న అద్దె ఇప్పుడు రూ.6 వేలు అయ్యింది. నెలకు రూ.350 వస్తున్న కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.550 వరకు వస్తోంది. అద్దె ఇలా పెంచుతూపోతే ఎలా అని ఓనర్ను అడిగితే గతంలో ఉన్న ఇంటిపన్ను ఇప్పుడు డబులైంది. మీకు ఇష్టం ఉంటే ఉండండి లేదా వేరే ఇల్లు చూసుకోమని చెబుతున్నాడు ఇంటి ఓనర్. నాకొచ్చే సంపాదనలో సగం ఇంటి అద్దెకు పోతే ఎలా కుటుంబాన్ని పోషించాలో ఏమో. – జ్యోతి, పలమనేరుచట్టాలు రావాలి నేను గతంలో అమెరికా వెళ్లి వచ్చా. అక్కడ మా పిల్లలున్నారు. అక్కడి ప్రభుత్వం ఇంట్లోని సౌకర్యాలు, విస్తీర్ణం తదితరాలను సర్వే చేసి, అద్దె నిర్ణయిస్తుంది. యజమాని ఇస్టానుసారంగా అద్దెలు పెంచడం జరగదు. అలాంటి చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తే అద్దెల భారం తగ్గుతుంది. ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. – గురురాజారావు, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
కుట్టుమిషన్ల పేరిట బీసీలకు కుచ్చుటోపీ
● వైఎస్సార్సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పవిత్ర పలమనేరు: కుట్టు మిషన్ల పేరుతో బీసీలకు కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టిందని వైఎస్సార్ సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎం పవిత్ర తెలిపారు. పలమనేరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళలకు చేయూత ద్వారా అందజేసే కుట్టుమిషన్లు సక్రమంగా అందించలేదన్నారు. కేవలం ఇందులో కమీషన్ల కోసం నాసిరకమైనవాటిని ఎంపిక చేశారని విమర్శించారు. మరోవైపు లబ్ధిదారులను పెంచి, తద్వారా కూటమి ప్రభుత్వం రూ.245 కోట్లను దోచుకుంటోందని ఆరోపించారు. ఓ కుట్టుమిషన్ ధర రూ.4,300, టైలరింగ్ శిక్షణకు రూ.3 వేలు మొత్తం కలిపి రూ.7,300 అవుతుందని, రాష్ట్రంలో లక్షమంది లబ్ధిదారులకు రూ.73 కోట్లు అవుతుందన్నారు. అయితే ప్రభుత్వం ఇందుకు రూ.245 కోట్లు చూపడం కూటమి అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యమని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల బాగు కోసం కాదని, కేవలం నేతల జేబులు నింపుకోవడానికే మాట చెప్పాల్సివస్తోందన్నారు. -
ఆరోగ్యానికి పుండు
‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. చాటింపుతో నేటి నుంచి తిరుపతి గంగజాతర ప్రారంభమైంది.. వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర కొనసాగుతుంది.. గనుక నగరవాసులెవ్వరూ ఊరువదలి వెళ్లరాదు.. ఇంతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయరాదు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలహో...’ అంటూ కై కాల వంశస్థలు తిరుపతి గంగజాతర చాటింపును వేశారు. ● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● అమ్మవారి కొడిస్తంభానికి అభిషేకం, ఒడిబాల సమర్పణ ● ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మతల్లి దర్శనంజాతర మొదలైందహో!తిరుపతి కల్చరల్: తిరుపతిలో జాతర సందడి నెలకొంది. గ్రామదేవత తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద కోలాహలం ఏర్పడింది. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించారు. అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్ పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నటీ ఆస్పత్రి సర్కిల్ ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి డప్పు కొట్టి అష్టదిగ్భంధన చేసి చాటింపు చేశారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది. ఒడిబాల సమర్పణ భక్తకోటి కోర్కెలు తీర్చే కల్పవళ్లి, తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగ జాతర బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. జాతర సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు చేసి ఒడిబాల సమర్పించారు. అమ్మవారు వజ్రకిరీటం, బంగారు ముఖ కవచం ధరించి భక్తులను అనుగ్రహించారు. పలువురు భక్తులు వెయ్యి కళ్ల దుత్తలు నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పసుపు, కుంకుమ తీసుకొచ్చి కొడిస్తంభం వద్ద పూజలకు సమర్పించారు. ఆలయ ఈవో ఏ.జయకుమార్, అర్చకులు రామకృష్ణశర్మ, మురళీస్వామి పాల్గొన్నారు.పండు ఆరోగ్యదాయకం..రోజూ ఓ పండు తింటే మంచిదని వైద్యులు చెప్పే మాట. అయితే ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న పండ్లు తింటే ఆరోగ్యం పుండవక మానదు. వీటి మాటున విషయం దాగి ఉంది. పక్వానికి రాని, గాలీవానలకు రాలిన కాయలను విషపూరిత రసాయనాలతో మాగబెడుతుండడంతో వాటిని తిన్న వారు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. -
● ఫలాలపై రసాయన పంజా ● కార్భైడ్ వినియోగంతో విషపూరితం
పలమనేరు: ఆరోగ్యం కోసం పండ్లు తింటుంటే వాటి మాటున విషం పొంచి ఉంటుంది. మార్కెట్ల్లో ప్రస్తుతం పలు రకాల పండు సరసమైన ధరల్లో లభిస్తుండడంతో కొనడానికి, తినడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే వారు మాత్రం ఆలోచిస్తున్నారు. పలు రకాల కాయలను మాగబెట్టడానికి విచ్చల విడిగా రసాయనాలు వాడుతుండడమే ఇందుకు కారణం. కనిపించని సహజపద్ధతులు గతంలో కాయలు మాగబెట్టేందుకు సహజసిద్ధంగా ఊదర ప్రక్రియ, బోద కసువులో పెట్టి మాగబెట్టే పద్ధతులు ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాలోని పలు పట్టణాల్లో నిర్ణీత రుసుం చెల్లిస్తే పచ్చి కాయలను రసాయనాలతో మాగబెట్టే గోడౌన్లున్నాయి. గోడౌన్కు తరలించిన పచ్చి కాయలు 24 గంటల్లోపు పండ్లుగా మారుతున్నాయి. ప్రమాదకర రసాయనాలతో... గోడౌన్కు తరలించిన అరటి, మామిడి కాయలను మొదట మ్యాంకోజబ్–45 అనే పౌడర్ను ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున వేస్తారు. ఆ నీటిలో ఈ పచ్చి కాయలను ముంచి పక్కన బెడతారు. తర్వాత ఎథిలిన్, కాల్షియం కార్బైడ్ తదితర బిళ్లలు, రసాయనాలను నీటిలో వేస్తే దాని నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓ గదిలో కాయలను ఉంచి ఈ గ్యాస్ను వదిలి ఆ గదిలోకి గాలిపోకుండా చేస్తారు. మరోవైపు వేపర్ ట్రీట్మెంట్ పేరిట కాయలను బందీ చేసిన గదుల్లోకి విషపూరితమైన మిథైల్ గ్యాస్ను వదిలి పెడతారు. దీంతో 24 గంటల్లోకి పచ్చి కాయలకు సైతం మంచి రంగు వచ్చి పండ్లుగా మారుతున్నాయి. మరికొంత మంది ఇంజెక్షన్ల ద్వారా కాయల్లోకి రసాయనాలు పంపి, మాగబెడుతున్నారు. కాల్షియం కార్భైడ్ అమ్మకాలపై నిషేధమున్నా... జిల్లాలో 8 వేల వరకు పండ్ల దుకాణాలున్నాయి. అలాగే 80 వరకు రీపినింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో విషపూరితమైన రసాయనాలతో మాగబెట్టిన పండ్లను దుకాణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా వీరిపై చర్యలు లేవు. పట్టించుకునేవారే కరువయ్యారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆహార కల్తీ నిరోధక శాఖ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు అసలు పట్టించుకోవడం లేదు. మోతాదుకు మించి రసాయనాల వాడకం ఏ పంటను పండించినా అవరసమైన మోతాదులోనే రసాయనిక మందులను పిచికారీ చేయాలి. అయితే రైతులకు దీనిపై అవగాహన లేక పంట బాగా రావాలని అనవరసంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో ప్రకృతి పాడవడంతోపాటు మనిషికి లేనిపోని రోగాలు వస్తున్నాయి. అందుకే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. –మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయఅధికారి, చిత్తూరురోగాలను కొని తెచ్చుకున్నట్టే... పండు రంగు చూసి ఆశపడి కొని తింటే రోగాన్ని తెచ్చుకున్నట్టే. రసాయనాలతో మాగబెట్టిన పండ్ల తినడంతో అది విడుదల చేసే ఆర్సెసినిక్ యాసిడ్ కారణంగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. సీజన్లో దొరికే సహజసిద్ధంగా మాగబెట్టిన పండ్లను తినడం మేలు. – మమతారాణి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుకార్భైడ్తో మాగబెడితే చర్యలు తప్పవు మామిడి కాయలను రసాయనాల ద్వారా మాగబెట్టడంపై నిషేధం ఉంది. కార్భైడ్ను వినియోగించినట్టు తనిఖీల్లో తేలితే మూడేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా తప్పదు. సహజపద్ధతిలోనే మామిడిని మాగించాలి. మామిడిని మాగబెట్టే సెంటర్లను ఇప్పటికే మార్కెటింగ్, హార్టికల్చర్, సచివాలయ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అవసరమైతే మామిడి మార్కెట్లో పండ్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా రసాయనాలపై టెస్ట్లు చేయిస్తాం. – విధ్యాధరి, జేసీ, చిత్తూరు ● -
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, సర్వేయింగ్ కోర్సులకు ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువతి, యువకులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సులకు పదో తరగతి, ఆపై కోర్సులు చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసే అభ్యర్థులకు ఏపీఎస్ఎస్డీ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9704762155, 7396631623 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఉన్న స్కిల్ హబ్ కేంద్రంలో ఈ నెల 9 వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. ఐదు కేంద్రాల్లో నేడు ఐసెట్ తిరుపతి సిటీ: తిరుపతి జిల్లావ్యాప్తంగా ఐదు పరీక్షా కేంద్రాలలో ఐసెట్–2025 బుధవారం నిర్వహించనున్నారు. జిల్లాలో గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పుత్తూరు ఎస్వీ పెరుమాళ్ ఇంజనీరింగ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, తిరుపతి జూపార్క్ సమీపంలోని ఐయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో సుమారు 5వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు 300 మంది గైర్హాజరు తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ రాత పరీక్షకు 300 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 911 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 611 మంది మాత్రమే వచ్చారని తెలియజేశారు. ఆయా కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీటితోపాటు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉరుములు.. మెరుపులతో వర్షం కాణిపాకం: చిత్తూరు, పూతలపట్టు నియోజవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. అర్ధగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. చాలా చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అపార్ట్మెంట్ పైనుంచి పడి వాచ్మన్ మృతి తిరుపతి రూరల్: పూతలపుట్టు – నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెన్ అపార్ట్మెంట్లో వాచ్మన్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి సోమవారం అర్ధరాత్రి కాలుజారి కింద పడడంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. రేణిగుంట మండలం, అన్నసామిపల్లికి చెందిన మునిశేఖర్ (32) 2020 నుంచి గార్డెన్ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తూ 6వ అంతస్తులోని పెంట్ హౌస్లో నివాసముంటున్నాడు. మునిశేఖర్ భార్య రోజావతి అక్కడే స్వీపర్గా పనిచేస్తుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునిశేఖర్ మద్యం మత్తులో 6వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు. ఆ వెంటనే అపార్ట్మెంట్ వాసులు చికిత్స నిమిత్తం అతన్ని రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
శ్రీరంగరాజపురం మండలం దిగువ రింపుజరాజపురంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.ట్రాన్స్కోకు రూ.12.50 లక్షల నష్టం చిత్తూరు(కార్పొరేషన్): జిల్లాలో ఆదివారం కురిసిన గాలీవాన కారణంగా ట్రాన్స్కోకు రూ.12.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సాయంత్రం నుంచి గాలీవానతో పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మల స్తంభాలు, లైన్పై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. వీటని వర్షంలో సిబ్బంది పునరుద్ధరించారన్నారు. మొత్తం 111 స్తంభాలు, 56 ట్రాన్స్పార్మర్లు, 4 కిలోమీటర్ల దూరం లైన్ దెబ్బతినిందన్నారు. దీంతో విద్యుత్శాఖకు నష్టం వాటిల్లిందన్నారు. ఐసెట్ పరీక్షను అడ్డుకుంటాం చిత్తూరు కలెక్టరేట్ : జీఓ నంబర్ 77 రద్దు చేయకుంటే ఈ నెల 7వ తేదీన నిర్వహించే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఆ సంఘం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 77ను రద్దు చేయాలన్నారు. గత సంవత్సరం ఆ జీఓ రద్దు చేయకుండా ప్రైవేట్ కళాశాలలో పీజీ అడ్మిషన్లు చేశారన్నారు. ఈ సంవత్సరం ఆ జీఓను రద్దు చేయకుండా మే 7న ఐసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేంద్ర, పవన్, నందకిశోర్, కార్యకర్తలు పాల్గొన్నారు. – 8లో -
వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా?
● రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): మీరంతా వేరే చోటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా..లేదా? అని ప్రభుత్వ వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రశ్నించారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత అత్యవసర విభాగంలో అందుతున్న సేవలు, లోటుపాట్లపై ఆస్పత్రి అధికారులను, అపోలో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎంఎస్ వార్డులోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయన మీరంతా వేరే చోటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రభుత్వ వైద్యబృందాన్ని ప్రశ్నించారు. ఇందుకు పలువురు... ఎండీయూ ఒప్పందం ప్రకారం 70 శాతం అపోలో, 30 శాతం ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఇక్కడ పనిచేసేలా ఉందని బదులిచ్చారు. ఆ ప్రకారమే పనిచేస్తామని..బదిలీలు, డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలని వారు ఆయన్ని కోరారు. ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి దినపత్రికలో సోమవారం అరకొర వైద్యం పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు స్పందించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను అడిగే సమయంలో.. స్టాఫ్ నర్సులు 78 మందికి 61 మంది మాత్రమే ఉన్నారా? అని అధికారులను ఆరా తీశారు. ఇందుకు ఏపీజీఎన్ఏ అధ్యక్షురాలు రాణి, సభ్యులు హిమబిందు సమాధానమిస్తూ స్టాఫ్నర్సు ఖాళీలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఇతరాత్ర పోస్టులు ఖాళీలున్నాయని, దీంతో పనిభారం అధికంగా ఉందని తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు ఇద్దరు డాక్టర్లే ఉన్నామని..కొంత మంది డాక్టర్లు అవసరమవుతోందని పలువురు వైద్యులు కోరారు. డీసీహెచ్ఎస్ పరిధిలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్స్, స్టాఫ్నర్స్లను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే 15 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రకుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆస్పత్రి అధికారులతో సమీక్ష నిర్వహించగా...ఒప్పందం ప్రకారం ఆస్పత్రి నిర్వహణ జరుగుతోందా? లేదా ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలి దేవి, డీఎంఅండ్హెచ్ సుధారాణి, అపోలో నిర్వాహకులు నరేష్కుమార్రెడ్డి, రాంగోపాల్రెడ్డి తదితరులున్నారు. -
గంగ జాతర పోస్టర్ల ఆవిష్కరణ
● నేడు జాతర చాటింపు ● 13,14 తేదీల్లో జాతర చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు న గరంలోని పొన్నియమ్మ దేవస్థానంలో సోమ వారం గంగజాతర పోస్టర్లను ఆవిష్కరించారు. వంశవ పారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్య మాట్లాడుతూ పూర్వీకుల కట్టుబాట్ల మేరకు జరిగే గంగ జాతరలో అందరూ భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. గంగ జాతరను పురస్కరిచుకుని మంగళవారం సాయంత్రం చాటింపు జరుగుతుందన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో జాతర జరుగుతుందన్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. భక్తులందరూ జాతరను అంగరంగ వైభవంగా జరిపించేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్మ ధర్మకర్తలు హేమంత్, నిర్వాహకులు గుణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 38 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 38 వినతులు అందాయి. చిత్తూరు ఏఆర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కుటుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థికసాయం అందజేత చిత్తూరు అర్బన్: నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎస్పీ మణికంఠ చందోలు ఆర్థికసాయం చెక్కును అందజేశారు. గుడుపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు ఐడీఆర్ఎఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష మొత్తానికి సంబంధించిన చెక్కును ఎస్పీ మణికంఠ, మృతురాలు లక్ష్మి భర్త హరీష్కు అందజేశారు. కుటుంబానికి శాఖపరంగా సాయపడతామని ఆయన హామీ ఇచ్చారు. వరసిద్ధుడికి రూ.8.49 లక్షల విరాళం కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి సోమవారం ఓ దాత రూ.8.49 లక్షల నగదు విరాళం ఇచ్చారు. నంద్యాలకు చెందిన దాత రషు శరణేష్ కుటుంబ సమేతంగా రూ.8,49,983 నగదును ఆలయంలో ఆన్లైన్ ద్వారా చెల్లించారు. ఇందులో బంగారు రథాని కి రూ.3,99,992, ఈ–హుండీకి రూ.2,49,995, నిత్యాన్నదానానికి రూ.49,999, ఆలయాభివృద్ధికి రూ.49,999, ఉచిత ప్రసాదానికి రూ.49,999, గో సంరక్షణ ట్రస్టుకు రూ.49,999 వంతున అందజేశారు. ఆ విరాళ పత్రాన్ని ఏఈఓ రవీంద్రబాబుకు దాత అందజేశారు. దాతకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
గ్రీవెన్స్లో తీరని సమస్యలు
● భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు ● సమస్యలపై నిర్లక్ష్యం వద్దన్న జేసీ విద్యాధరి పలమనేరు: పలమనేరు డివిజన్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని గ్రహించిన జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ప్రత్యేక చొరవ చూపి ఇక్కడే నెల రోజుల పాటు గ్రీవెన్స్డే నిర్వహించాలని సంకల్పించారు. కానీ ఇక్కడ జరుగుతున్న గ్రీవెన్స్డేలో ప్రజలు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్జీదారులు హోరెత్తారు. అర్జీల్లో ఎక్కువగా రీసర్వే, భూసమస్యలు, వివాదాలకు సంబంధించిన వినతులే వచ్చాయి. సమస్యలను శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కేవలం కింది స్థాయి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు త్వరిత గతిన పరిష్కారం కావడంలేదనే విషయం ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి గ్రీవెన్స్డేకు వచ్చినవారే మళ్లీ రావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 273 వినతులు వచ్చాయి. వీటిలో భూ ఆక్రమణలపై 38, సామాజిక పింఛన్లు 32, ఇళ్ల పట్టాలు 23, ఆర్ఓఆర్ 19, పట్టాదారు పాసు పుస్తకాలు 16, అసెన్మైంట్ 10, మ్యుటేషన్ 10, దారి సమస్యలు 10, పీపీబీ 5 వచ్చాయి. -
కలెక్టర్ ఆదేశాలు‘మరుగు’న!
చిత్తూరు కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నాయి. బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడానికి రూ.కోట్లు వెచ్చించి, మరుగుదొడ్లను నిర్మించేలా చర్యలు చేపడుతోంది. అయితే కొంతమంది అధికారులు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ప్రాంగణంలో విద్యాశాఖతోపాటు సమగ్రశిక్ష శాఖ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో దాదాపు 25 మంది మహిళా ఉద్యోగులు, 35 మంది పురుషులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు పలు పనుల నిమిత్తం నిత్యం విద్యాశాఖ కార్యాలయానికి విచ్చేస్తుంటారు. జిల్లా విద్యాశాఖ ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లు పాడైపోయి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ముఖ్య శాఖల్లో ఒకటైన విద్యాశాఖలో మరుగుదొడ్లు ఉన్నా..లేనట్టే అయ్యింది. దీంతో ఉద్యోగులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు మరుగుదొడ్లు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి సమస్యను ఎవరితో చెప్పుకోలేక ఇటీవల డీఈఓ దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డీఈఓ వరలక్ష్మి మరుగుదొడ్ల మరమ్మతుల సమస్యను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.5.35 లక్షలను కలెక్టర్ ఫండ్స్ నుంచి వెంటనే విడుదల చేశారు. అడ్వాన్స్ ఇస్తేనే పనులు మొదలు మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం ఇంకా ప్రారంభం కాని పనులు ఇక ఏడు రోజులే గడువు అది సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయం.. స్వచ్ఛతకు పుష్కలంగా నిధులున్నాయ్.. మే 15లోపు మరుగుదొడ్ల మరమ్మతు చేయాలని కలెక్టర్ ఆదేశాలు.. అయినా అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత.. వెరసి ఆ కార్యాలయంలోని మహిళా ఉద్యోగినులు ఉదయం ఇంట్లో బయలు దేరే ముందు.. ఇంటి కెళ్లిన తరువాతే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఒక వేళ అత్యవసరమైనా అవస్థ పడాల్సిందే. కలెక్టర్ ఆదేశాలే మరుగున పడిపోతున్నాయని ఉద్యోగుల ఆవేదన. ఇదీ సర్వశిక్ష శాఖ ఇంజినీరింగ్ అధికారుల వ్యవహరశైలి. విద్యాశాఖ కార్యాలయంలోని మరుగుదొడ్ల పనులను ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సమగ్రశిక్ష శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఉత్తర్వుల్లో ఆదేశించారు. నిధులను సైతం సమగ్రశిక్ష శాఖ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. అయితే పనులు మొదలు పెట్టాల్సిన ఇంజినీరింగ్ విభాగం సైట్ ఇంజినీర్ మునిరత్నం ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే పనులు మొదలుపెడతానంటూ అలసత్వం వహిస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో మరుగుదొడ్ల పనులకు ఇసుక, కంకరను తోలించి మిన్నకుండిపోయారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆ మరుగుదొడ్ల పనులను పూర్తి చేసేందుకు ఇక పది రోజులే గడువు ఉంది. ఆ లోపు పనులు పూర్తి చేస్తారా? కలెక్టర్ ఉత్తర్వులను దిక్కరిస్తారా? అని విద్యాశాఖ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. -
ప్రగతి జాడ కనిపించేనా?
● గిట్టుబాటు ధర లేక టమాట రైతుల గగ్గోలు ● పంటలపై ఆగని గజదాడులు ● రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరత ● రెవెన్యూ కార్యాలయాల్లో ముడుపులు ఇవ్వకుంటే చుక్కలే ● నేడు జిల్లా స్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం చిత్తూరు కలెక్టరేట్ : ‘ఇన్చార్జ్ మంత్రి జిల్లాలో సమస్యలు పట్టించుకునేనా? ఈ సమావేశంలోనైనా అభివృద్ధి గురించి చర్చించేనా? లేదా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెండు నెలలకు ఒకసారి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో జిల్లా అభివృద్ధితోపాటు, ప్రజల సమస్యలు చర్చించాల్సి ఉంది. అయితే కీలకమైన ఈ అభివృద్ధి కమిటీ సమావేశం కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టానుసారంగా తమకు నచ్చినప్పుడు నిర్వహిస్తున్నారు. అప్పుడైనా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే.. అదీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకు ఒకటే సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు ఇన్చార్జ్ మంత్రి రాంప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పట్ల క్షుణ్ణంగా చర్చించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది కొరత.. రైతుకు అవస్థ రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఆ కేంద్రాల్లో పనిచేస్తున్న అరకొర సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. ఫలితంగా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో 249 రైతు సేవా కేంద్రాలుండగా 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వ్యవసాయ, ఉద్యానశాఖల కు సంబంధింన పోస్టులే అధికంగా ఉండడంతో సమస్యలు అధికంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో నెలలు గడుస్తున్నా ఆ పోస్టులను భర్తీ చేయని దుస్థితి. ముడుపులిస్తేనే పనులు జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఆ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ముడుపులిస్తేగానీ పనులు జరగడం లేదు. అడిగినంత ఇస్తేనే ఫైళ్లను ముందుకు పంపుతున్నారు. అడిగినంత ఇచ్చుకోలేని రైతుల భూముల మ్యుటేషన్ దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారు. లేదంటే చిన్న చిన్న కారణాలను సాకుగా చూపించి పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం లంచాలు అడుగుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాలకు పరిష్కారం కోసం వెళ్లే దరఖాస్తులను పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తున్నారు.అప్పుల ఊబిలో టమాట రైతు జిల్లాలో ప్రధాన పంట అయిన టమాట. ఈ పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. టమాట ధరలు రోజు రోజుకూ తగ్గిపోతుండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి రకం 15 కిలోల బాక్సు రూ.90కి తగ్గిపోయింది. రెండు, మూడోరకం రూ.40 నుంచి రూ.60 వరకు మాత్రమే ధర ప లుకుతోంది. టమాట ధరలు పతనావస్థలోనే కొ నసాగుతున్నా కూటమి సర్కారు ఏ మాత్రం ప ట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంటలపై ఆగని గజదాడులు జిల్లాలోని కుప్పం, బంగారుపాళెం, పలమనేరు, పులిచెర్ల, గుడిపాల తదితర మండలాల్లో రైతుల పంటలపై గజదాడులు ఆగడం లేదు. జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ రైతుల పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. ఈ నెల 2 వ తేదీన పులిచెర్ల మండలంలోని కమ్మపల్లి, రాయవారిపల్లి పంచాయతీల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. అదే రోజు బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగులు పంటలపై దాడి చేశాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయిన్నప్పటికీ కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
11 నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్ : నారాయణవనంలోని శ్రీపద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 10న అంకురార్పణ నిర్వహిస్తారని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్తంగా ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్నం, ఏఈవో రవి, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారుల వేధింపులపై విజిలెన్స్ విచారణ సత్యవేడు: సత్యవేడు ఆర్టీసీ డిపో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని డ్రైవర్ గంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్సు అధికారి తిమ్మారెడ్డి, సీఐ వర్మ సోమవారం విచారణ చేపట్టారు. ఏప్రిల్ 29న డ్రైవర్ గంగయ్య డ్యూటీ నిమిత్తం ఆర్టీసీ గ్యారేజ్కు వచ్చాడు. బస్సును సెక్యూరిటీ పాయింట్ వద్దకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం వరకు కండక్టర్ రాకపోవడంతో ఆ సర్వీసును డీఎం వెంకటరమణ రద్దు చేసి మధ్యాహ్నం మూడు గంటల డ్యూటీకి వెళ్లాలని డ్రైవర్ గంగయ్యను ఆదేశించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, రాత్రి డ్యూటీకి వెళ్లలేనని గంగయ్య చెప్పడంతో డీఎం దూషించాడు. డ్రైవర్ సెక్యూరిటీ పాయింట్ వద్దకు వెళ్లగా అక్కడున్న సెక్యూరిటీ అధికారి సైతం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గంగయ్య హైబీపీ కారణంగా కింద పడి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో కోలుకున్నాడు. తర్వాత అధికారులు దూషించడంపై విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణకు వచ్చిన విజిలెన్సు అధికారులు తొలుత బాధితుడు గంగయ్యను విచారించి స్టేట్మెంట్ నయోదు చేశారు. అనంతరం కంట్రోలర్ వెంకటేశ్వర్లు, సెక్యూరిటీ అధికారి పళని, ఆర్టీసీ కండక్టర్ ఓ వెంకటేశులును విచారించి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆర్టీసీ డీఎం వెంకటరమణను విచారించినట్టు తెలిసింది. -
ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం
చిత్తూరు అర్బన్: పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలను ఎస్పీ మణికంఠ చందోలు విలువైన బహుమతులతో సత్కరించారు. సోమ వారం చిత్తూరు నగరంలోని పోలీసుల అతిథి గృహంలో 570కి పైగా మార్కులు సాధించిన వి ద్యార్థులకు బహుమతులు అందజేసి, అభినందించారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల క ష్టాలను తెలుసుకుని పిల్లలు ముందడగు వేయాలన్నారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉన్న త చదువులు చదవాలన్నారు. తల్లిదండ్రులకు గుర్తింపు తెచ్చి పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ మహాబూబ్బాషా సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీ గా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,380 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 4 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలి గిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పీజీఆర్ఎస్ రద్దయినా విచ్చేసిన ప్రజలు
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక ) సోమవారం రద్దు అయ్యింది. అయినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు విచ్చేశారు. కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించే అధికారులు ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. దయచేసి న్యాయం చేయండి ఇంటికి వెళ్లే దారిని అక్రమంగా ఆక్రమించుకున్నారని, దయచేసి న్యాయం చేయాలని పెనుమూరు మండలానికి చెందిన నాగభూషణం ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు విచ్చేసిన ఆయన తన సమస్యను వెల్లడించారు. పెనుమూరు మండలంలో సర్వే నంబర్ 467/1ఏ లోని 20 సెంట్ల భూమిలో 30 ఏళ్లుగా నివసిస్తున్నట్లు తెలిపారు. తమ ఇంటికి వెళ్లే దారి సర్వే నంబర్ 468/1 లో కుంటపోరంబోకు స్థలం ఉందన్నారు. గత 30 ఏళ్లుగా అదే దారిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అయితే కళావతి అనే మహిళ ఆ దారిని ఆక్రమించి దారి లేకుండా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కోదండయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు యస్.నాగరాజులు డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు కార్మికులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కవిత, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మణి, మహిళా సమైక్య నగర కార్యదర్శి బి.కుమారి, హెచ్.బాలాజీ రావు, మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు జయశంకర్, సురేష్, బుల్లెమ్మ, కస్తూరి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. కాలువ ఆక్రమించారు చెరువు కాలువ భూమిని ఆక్రమించారని ఐరాల మండలానికి చెందిన బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు చెరువు కాలువను ఆక్రమించి తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కరించాలని గతంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.కలెక్టర్ తనకు న్యాయం చేయాలని అర్జీదారుడు కోరారు. -
నాన్నకు ప్రేమతో..
సాధారణంగా పిల్లలు చిన్నతనం నుంచి తమ తల్లిదండ్రుల్నే రోల్ మోడల్గా తీసుకుంటూ లక్ష్యం కోసం శ్రమిస్తారు. కలలు కనడం వేరు. ఆ కలలను సాకారం చేసుకోవడంలో పడే శ్రమ వేరు. అలా శ్రమించి, ఓ యువతి తన తండ్రి కలలను సాకారం చేసింది. ‘‘తల్లీ! మనం చిన్నమారుమూల గ్రామంలో ఉన్నాం.. ఇక్కడ మనలాంటి పేదలకు ఎన్నో సమస్యలున్నాయి. ఇవన్నీ తీరాలంటే కష్టాలు తెలిసిన మనలాంటి వాళ్లు కలెక్టర్గా రావాల..నీవు ఎలాగైనా కలెక్టరై ప్రజలకు సేవ చేయాలమ్మా!’’ ఇదీ ఆ మధ్య తరగతి తండ్రి చిన్నతనం నుంచే నూరిపోసిన మాటలు ఆమె మదిలో బలంగా నాటుకుపోయాయి. నీట్లో ఎంపికై ఎంబీబీఎస్ చదివి డాక్టరైంది. అంతటి తో సంతృప్తి చెందలేదు. తండ్రి పంచిన ప్రేమ, నింపిన స్ఫూర్తి, ధైర్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా ముందుకు కదిలింది. నాలుగుసార్లు సివిల్స్కు ఆన్లైన్లో శిక్షణ పొందింది. ఈ పర్యాయం జాతీయ స్థాయిలో 446 ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది. ఊరంతా తబ్బిబ్బవుతోంది.పలమనేరు : పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని రామాపురం మారుమూల గ్రామం. అభివృద్ధికి నోచుకోని ఈ గ్రామం మండల కేంద్రానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 66 కుటుంబాలు ఉన్నాయి. సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. చాలావరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే. సరిగ్గా కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామస్తులకు అటు రవాణా, చదువులు, వైద్యం, ఇతరత్రా వాటికి కర్ణాటక పట్టణాలు అనుకూలంగా ఉండడడంతో ఆ ప్రాంతాలతోనే ఎక్కువ అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారు. సరిహద్దు గ్రామం కావడంతో ఇటు ఆంధ్రాలో అటు ఆనుకుని కర్ణాటకలోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆంధ్రా భూముల్లోని బోర్లతో రెండువైపులా పంటలు సాగు చేస్తున్నవారూ కొందరు ఉండటం విశేషం! గ్రామస్తులైన రవికుమార్, నందిని దంపతులు కర్ణాటకలోని శ్రీనివాసపురంలో ప్రైవేటు స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరికిద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ఆర్.మాధవిని ప్రాథమిక విధ్యను సైతం అక్కడే చదివించారు. ఆపై పీయూసీలో బైపీసీ కోలార్ సహేంద్ర కళాశాలలో చదివి నీట్లో 900 ర్యాంకు సాధించింది. దీంతో బెంగళూరులోని ఈఎస్ఐలో ఎంబీబీఎస్ ఫ్రీ సీటును సాధించి డాక్టరైంది.తండ్రి కోరిక సాకారం చేయాలని..!తాను ఎంబీబీఎస్ చేస్తున్నా సివిల్స్ సాధించాలనే తండ్రి కోరిక కోసం కష్టపడింది. డాక్టర్ కోర్సులో చాలా బిజీగా ఉన్నప్పటికీ హాస్టల్లో రాత్రుల్లో నిద్రపోకుండా సివిల్స్కు కేవలం ఆన్లైన్లోనే శిక్షణ పొందింది. ఎంబీబీఎస్ చేరినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు సివిల్స్లో ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు ఈసారి సివిల్స్లో 446 ర్యాంకు సాధించింది. మరో ఆరునెలల పాటు శిక్షణ పొంది ఆపై ఐఏఎస్ లేదా ఐపీఎస్కు ఎంపికానుంది. ఇలా ఉండగా, బైరెడ్డిపల్లెకు చెందిన రంపం శ్రీకాంత్ సైతం సివిల్స్లో 904 ర్యాంకును సాధించడం విదితమే.తన తండ్రి కల నెరవేర్చడానికి కాలేజీ డేస్ నుంచే పట్టుదలతో చదివినట్టు సివిల్స్ విజేత మాధవి చెప్పారు. సివిల్స్కు ఎంపికై న నేపథ్యంలో ఆమె అనుభవాన్ని పాఠకులకు పంచేందుకు సాక్షి ఫోన్లో ఇంటర్వ్యూ చేసింది.సాక్షి : డాక్టరయ్యాక సివిల్స్కు ఎలా ప్రిపేర్ అయ్యారు?మాధవి : డాక్టరయ్యాక ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరాను. సివిల్స్లో చేసిన ప్రయత్నాల నుంచి కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత రెగ్యులర్గా ఆన్లైన్లో కొన్ని నెలల పాటు శిక్షణ పొందాను. రోజుకు 8 గంటలు శిక్షణకు కేటాయించేదాన్ని.సాక్షి : సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నారు?మాధవి : ఎమర్జింగ్ మెడిసిన్ తీసుకున్నా.సాక్షి : పుస్తకాలు, మెటీరియల్ కోసం ఏం చేశారు?మాధవి : 400 పైచిలుకు పుస్తకాలు చదివా. ఇంతకుముందు సివిల్స్కు ప్రిపేర్ అయిన సీనియర్స్ నుంచి మెటీరియల్ తీసుకున్నా. అది కూడా నాకు ఉపయోగపడింది.సాక్షి : ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు వేశారు?మాధవి : మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ప్రశ్నలే వేశారు. కాన్ఫిడెంట్గా అన్నింటికీ సమాధానాలు చెప్పాను.సాక్షి : మీకు స్ఫూర్తి ఎవరు?మాధవి : ఇంకరెవరు మా నాన్నే! సమస్యల నడుమ పెరిగాం. నువ్వు డాక్టరైతే నలుగురికి సూదులేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే సివిల్స్లో ఎంపికై తే ఎందరికో మేలు చేయవచ్చు. అభివృద్ధికి నోచుకోని మన ఊరిలాంటి ఊర్లనెన్నో బాగు చేయవచ్చు..అని చెప్పేవారు. ఆ మాటలే నాపై బలమైన ప్రభావం చూపాయి. ఈ విజయం మానాన్నకే అంకితం.‘సాక్షి’తో మాధవి చాలా సంతోషంగా ఉండాదిమా ఊరంతా వ్యవసాయ కుటుంబాలే. చదువుకునేందుకు ఏ సౌకర్యాలూ లేవు. మాధవి పక్కనే ఉన్న కర్ణాటకలో చదివి, డాక్టరవడమే కాకుండా ఇప్పుడు సివిల్స్కు ఎంపిక అవడం చెప్పలేనంత సంతోషంగా ఉండాది. మా ఊరికే కాదు..దేశంలో ఎక్కడ పనిచేసినా ప్రజలకు మేలు చేస్తాదనే నమ్మకం మా ఊరికుంది.–రామరాజు, గ్రామపెద్ద, రామాపురం -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
● 19 మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం శ్రీరంగరాజపురం: ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మండలంలోని ఏఎం పురం పంచాయతీ దిగువ రిపుంజరాజపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఉపాధి కూలీల కథనం మేరకు.. ఉపాధిహామీ పనుల్లో భాగంగా దిగువ రిపుంజరాజపురంలోని ఉపాధి హామీ కూలీలు సుమారు 30 మంది సోమవారం ఉదయం కొండకాలువ పనులకు వెళ్లారు. గ్రామానికి సమీపంలోని కాలువ పనులు చేస్తున్న కూలీలపై ఉన్నట్టుండి తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు శ్రీరంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిని 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆంజనేయులు, జారచంద్రుడు పరిస్థితి విషమంగా ఉంది. ఫీల్డ్అసిస్టెంట్ కొంత మంది ఉపాధి కూలీలకు బీమా చేయలేదని ఆరోపించారు. గాయపడిన వారిని ఎంపీడీఓ మోహన్మురళి, ఏపీఓ లలితకుమారి పరామర్శించారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు
● అధికారులతో కృష్ణబాబు చిత్తూరు కలెక్టరేట్ : వివిధ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్చార్జ్ ఆఫీసర్ కృష్ణబాబు ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుప్పం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉండడంతో పరిశ్రమల స్థాపన విరివిగా నెలకొల్పాలన్నారు. ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయం ఆధారిత పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా కేంద్రంతో పాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. శిశు ఆధార్ నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖ పరిధిలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కిల్ ఆఫ్ చిత్తూరు కార్యక్రమం అమలులో రైతులకు సాంకేతిక పరిజ్ఞానంలో అవగాహన పెంచుతున్నామన్నారు. ఈ సమీక్షలో ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఎఫ్ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, పలు శాఖల అధికారులు రవికుమార్ నాయుడు, సత్యనారాయణ, చంద్రశేఖర్రెడ్డి, వెంకటరమణ, వెంకటేశ్వరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలే లక్ష్యం కుప్పం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సదుపాయలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అన్నారు. సోమవారం కుప్పం వంద పడకల అస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని ఆరోగ్య రంగంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. టాటా సంస్థ డిటిజల్ నెర్వ్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. అత్యవసరమైన సమయాల్లో మందులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రికి వచ్చిన రోగులను నాణ్యమైన భోజనం అందుతుందా లేదా? మందులు అందుబాటులో ఉన్నాయా లేవా? అని అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆస్పత్రికి రోజుకు 300 నుంచి 350 మంది వరకు రోగులు రావడంపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని రోగులకు రక్తపరీక్షలు, అన్ని రకాల ఆధునికంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విలేజ్ హెల్త్ క్లినిక్లకు వచ్చే రోగులకు సంబంధించి అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని వైద్యులకు సూచించారు. విలేజ్ క్లినిక్లో విధులు నిర్వహించే ఆరోగ్య సిబ్బంది బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం గుడుపల్లె: సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర వైద్య, సంక్షేమశాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కనమనపల్లెలోని హెల్త్ క్లినిక్ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా గ్రామాల్లోని వైద్యాధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి బీపీ,షుగర్, రక్త హీనత , దీర్ఘకాలిక వ్యాధులపై ఇంటింటా సర్వేలు నిర్వహిస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా ఏఎన్ఎంలు, నర్సులు ఇళ్ల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తున్నారని అని ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో కుప్పం ఏరియా ఆస్పత్రి కమిషనర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్, డీఎంహెచ్ఓ సుధారాణి, ఎంపీడీఓ రాధాకృష్ణ, తహసీల్దార్ సీతారాం, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్, టీఎం బాబు పాల్గొన్నారు -
నీటి సమస్య పరిష్కరించండి
పలమనేరు: వేసవి కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి సమస్య అధికంగా ఉందని, సమస్య పరిష్కారానికి సంబంధిత ఎంపీడీఓలు వెంటనే చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సూచించారు. పలమనేరులోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఆయన నీటి సమస్యపై అధికారులతో సమీక్షించారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపీడీఓలుగా బాధ్యతలు చేపట్టనున్న వారికి పోస్టింగ్ ఉత్తర్వులపై సంతకాలను చేశారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల పరిశీలన పలమనేరు నియోజకర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె మండలాల్లో సాగుతున్న హంద్రీ–నీవా కుప్పం ఉప కాలువ సిమెంట్ లైనింగ్ పనులను జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సోమవారం పరిశీలించారు. కాంట్రాక్టర్ ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా? అని చూశారు. కాలువ పనులను పూర్తి చేసి సీఎం చంద్రబాబు ఈ కాలువలోకి నీటిని వదలి ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పనులు చేసి ఆపై నీరు వదలకుంటే ఇక్కడి ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు. -
నందీశ్వరుడిపై శివపార్వతుల విహారం
పుత్తూరు: కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి వార్షి క బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతులు నందీశ్వరుడిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం ఆలయంలో ప్ర త్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం భిక్షాట న ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి నందీశ్వరుడిపై కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. నందివాహన సేవకు కోలా విఠల్, కోలా పెద్ద మునెమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్పై ఫిర్యాదు చిత్తూరు అర్బన్: సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కే.చిన్నయ్యపై చిత్తూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ స్థానిక వన్ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. చిన్నయ్య తన తండ్రికి ఉద్యోగం ఉండగా, ఆ విషయాన్ని దాచిపెట్టి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడని, తప్పుడు సర్టిఫికెట్లను అందజేసి, పదోన్నతులు పొందాడని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) ఆదేశాలతో కేసు నమోదుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న చిన్నయ్యపై తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ పరిధిలోని సంస్కృతి నగర్లో ఆదివారం సాయంత్రం పెనుగాలులకు చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న మురళి అక్కడకు చేరుకుని విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి లైన్ ఆఫ్ చేసుకుని చెట్టు కొమ్ములు తొలగించే పనులు చేపట్టాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఆఫ్ చేసుకుని దానిపై నిలుచుని చెట్టు కొమ్ములు తీస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్కు గురై ట్రాన్స్ఫార్మర్పైనే కుప్పకూలిపోయాడు. స్థానికులు అరవడంతో అతడితో పాటు వచ్చిన విద్యుత్తు సిబ్బంది సబ్ స్టేషన్కు సమాచారం అందించి ఆ ప్రాంతంలో మొత్తం సరఫరా నిలిపివేయించారు. అనంతరం లైన్మెన్ను కిందకు దించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ● విద్యుత్ షాక్కు గురైన లైన్మన్ -
ప్రశాంతంగా ‘నీట్’
● 677 మంది విద్యార్థులు హాజరు ● 33 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. చిత్తూరులోని రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 710 మంది విద్యార్థులకు గాను 677 మంది విద్యార్థుళు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరైనట్లు పరీక్షల సిటీ కో–ఆర్డినేటర్ జీవనజ్యోతి వెల్లడించారు. ముందుగానే కేంద్రాలకు పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే విద్యార్థులను ఆయా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు ముందస్తుగా వెల్లడించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. అధికారుల తనిఖీ పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు,ప్రిన్సిపల్ మనోహర్, ఏఆర్ డీఎస్పీ మహబుబ్బాషా, పీవీకేఎన్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శరవణ పాల్గొన్నారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి ఆక్రమణ
సాక్షి, టాస్క్ఫోర్స్: అధికారం అండతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. చంద్రగిరి పట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని ఓ మైనార్టీ నేత అక్రమించుకుని గుట్టు చప్పుడు కాకుండా షెడ్డు నిర్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి లెక్కదాఖలా సర్వే నంబరు 61/3లో కొంత మేర గ్రామకంఠం భూమి ఉంది. ఆ భూమిలో కొన్నేళ్లుగా ముస్లింలు పీర్ల పండుగను నిర్వహించుకుంటున్నారు. మిగిలిన సందర్భంగా భూమి ఖాళీగా ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.50 లక్షలకు పైగా ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత కన్ను పడింది. ఇటీవల వరుస సెలవులు రావడంతో శరవేగంగా అక్రమంగా షెడ్డును నిర్మించాడు. తరతరాలుగా పీర్లచావిడిగా వినియోగించుకుటున్న భూమిని ఆక్రమించుకోవడంపై ముస్లిం పెద్దలు మండిపడుతున్నారు. 2022లో కూడా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి అతను యత్నించాడని, అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అతను ఆక్రమించుకున్నాడని వాపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆక్రమణ తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఈ ఆక్రమణ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ముస్లింలు, స్థానికులు మండిపడుతున్నారు. అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నట్టు రెండు వారాల క్రితం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. దీనిపై వీఆర్వో పురుషోత్తంను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆదివారం తిరుపతి నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనంకోసం నడచి వెళుతుంగా ఫణి(10) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. దీంతో చిన్నారి తొడభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబీకులు వెంటనే బోయకొండ గంగాపురంలోని పీహెచ్సీకి వెళ్లారు అక్కడ వైద్యం చేసేందుకు ఎవరూ లేరు. దీంతో గంగమ్మ ఆలయ పరిపాలన కార్యాలయానికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫలితం లేకపోవడంతో బాలుడిని హుటాహుటిన చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాల్సి వచ్చింది. నిత్యం వేలాది మంది విచ్చేసే బోయకొండ ఆలయం వద్ద కనీసం ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు కూడా లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. అలాగే పెద్దసంఖ్యలో హల్చల్ చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరముందని కోరుతున్నారు. -
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రి సమస్యల వలయంలోకి వెళ్లిపోయింది. ఖాళీ పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. అవసరాలకు అనుగుణంగా మందులు లేకపోవడంతో వైద్యం పడకేసింది. దీనికితోడు ఆస్పత్రి నిర్వహణకు సైతం బడ్జెట్లో కోత విధిం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 400 పడకలు ఉన్నాయి. నిత్యం 1,200 వరకు ఓపీలు వస్తుంటాయి. అలాగే ఇన్ పేషెంట్లు 350 మంది ఉంటుంటారు. అత్యవసర సేవల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి 200 కేసుల వరకు ఓపీకి వస్తుంటాయి. అయితే ప్రభుత్వాస్పత్రిలో పలు సమస్యలు తలెత్తడంతో సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తీలో నిర్లక్ష్యం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం డాక్టర్ల నుంచి సిబ్బంది వరకు పలు పోస్టులు ఖాళీలగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టులు ఖాళీ అయితే వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు పోస్టుల భర్తీ...అయోమయంగా మారింది. ప్రధానంగా ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉంది. ఇద్దరు డాక్టర్లతోనే పోస్టుమార్టం చేయిస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా 40 పైగా పోస్టుమార్టం కేసులు ఇక్కడకు వస్తుంటాయి. నలుగురు డాక్టర్లుంటే పోస్టుమార్టం సమస్య తీరుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోక్సో కేసు కౌన్సెలింగ్కు సంబంధించి ఒక గైనిక్ డాక్టర్ ఉండాలనే నిబంధన ఉంది. అలాగే హెడ్నర్సు పోస్టులు రెండు ఖాళీలున్నాయి. స్టాఫ్ నర్సులు 78 మందికి గాను 61 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కూడా కొంత మందిని అదనపు పనులకు కేటాయించారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు 15 మంది అవసరమవుతోందని, జీడీఓలు 8 మంది ఉండాలని, ఫార్మాసిస్ట్లు 6 మంది దాకా అవసరమని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది కొరత కారణంగా పనిభారం పెరుగుతోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సక్రమంగా సేవలు అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అందని మందులు జిల్లా ఆస్పత్రికి ముఖ్యంగా మందుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ కేంద్రం నుంచే సరఫరా రావడం లేదని.ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కనీసం జ్వరం, దగ్గు, జలుబుకు సైతం మందులు లేకపోవడం గమనార్హం. దీంతో బయట మందులు కొనుగోలు చేసుకోవాలని రోగులను కోరాల్సి వస్తోందని, వారు తమపై మండిపడుతున్నారని వైద్య సిబ్బంది వాపోతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిని చుట్టుముట్టిన సమస్యలు భర్తీకి నోచుకోక ఖాళీగా పలు పోస్టులు పోస్టుమార్టానికి సైతం లేని డాక్టర్లు అందుబాటులో లేని మందులు బడ్జెట్లో యథేచ్ఛగా కోతలు నేడు జిల్లా ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు రాక నిధుల కొరత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా ఆస్పత్రికి అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించేంది. కూటమి వచ్చాక మందులు, మాత్రలు సరఫరా కాకపోగా ఆస్పత్రి నిధులు కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. చాలీచాలని నిధులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నేడు ఆస్పత్రి పరిశీలన చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఆస్పత్రికి చేరుకుని పలు విభాగాలను పరిశీలించనున్నారు. రోగులు, ఆస్పత్రి అధికారులతో మాట్లాడనున్నారు. ఈతరుణంలో పై సమస్యలను తెలుసుకుని ఆస్పత్రి అభివృద్ధికి కృషికి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
దోపిడీ కేసులో ఇద్దరి అరెస్ట్
పుత్తూరు : నగరి రోడ్డులోని మీనాక్షి ఏజెన్సీలో ఏప్రిల్ 19వ తేదీన పట్టపగలు ఉదయం 8 గంటలకు జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. నిందితులు పిచ్చాటూరు మండలం, శేషంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్(17), పాండియన్(34)గా గుర్తించినట్లు వెల్లడించారు. తమినాడులోని గుమ్మిడిపూండికి చెందిన మరో ఇద్దరు నిందితులు దినేష్, జగన్లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయోగంగా కియోస్క్లు ● అన్నదాతకు అందని పథకాలు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా పనిచేసిన ఆర్బీకేలు ● 503 రైతు భరోసా కేంద్రాలకు గాను 340 చోట్ల సొంత భవనాలు ● రూ.109 కోట్లకు గాను రూ.74.12 కోట్లు వెచ్
కార్వేటినగరం : అన్నదాతకు చేయూతనందించేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల ఇంటి ముంగిటకే సేవలు అందించాలనే ఉదేదద్దేేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచి జరిగే పనులను సైతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చింది. తర్వాత రైతులకు కనీస సేవలు కూడా అందించకుండా ఇబ్బంది పెడుతోంది. మూలపడిన కియోస్క్ యంత్రాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వాతావరణంలో మార్పులు తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. పంట ఉత్పత్తుల మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునే వారు. ప్రస్తుతం రైతు సేవాకేంద్రాల్లో కియోస్క్ యంత్రాలను మూలనపడేశారు. వీటి ద్వారా రైతులకు అందే సేవలను సైతం నిలిపేశారు. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 503 రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)లు ఏర్పాటు చేసింది. రూ.109 కోట్లు మంజూరు చేసి సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.74.12 కోట్లు వెచ్చించి పలు గ్రామాల్లో 340 పక్కా భవనాలు నిర్మించింది. మరో 163 భవనాలను వివిధ దశల్లోకి తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులను నిలిపివేసింది. రైతు సేవా కేంద్రాలని ప్రకటించి సేవలను దూరం చేసింది. కేవలం ధాన్యం కొనుగోళ్లకు మాత్రం ఆయా భవనాల్లో కొన్నింటిని వినియోగిస్తోంది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని సర్వేలు, పింఛన్ల పంపిణీ అంటూ బయటకు పంపేస్తోంది. అన్నదాతలకు అందుబాటులో లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో నిత్యం అందుబాటులోనే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా ఆర్బీకేల్లో ఉద్యానశాఖ అధికారి, వ్యవసాయాధికారి, అగ్రికల్చర్ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండేవారు. ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. అప్పటి సర్కారు సైతం రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవాకేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసింది. -
డబ్బులు కాసే చెట్టు!
● మహోగని సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు ● జిల్లాలో ప్రస్తుతం 150 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు ● 12 ఏళ్లకు కోత.. ఆదాయం రూ.కోట్లలో.. విజయపురం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు రైతులు వినూత్నంగా మహోగని చెట్ల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 150 ఎకరాలకు పైగా మహోగని సాగు చేపట్టారు. విజయపురం మండలంలో 12 ఎకరాలు, నగరి–7, సత్యవేడు–13, చిన్నగొట్టిగల్లు–10, ఎర్రవారిపాళెం–10 ఎకరాలు ప్రస్తుం సాగులో ఉన్నాయి. ఈ చెట్లు గోధుమ రంగు కలపతో విశిష్టంగా ఉంటాయి. మహోగనికి చెందిన కలప, ఆకులు, గింజలు మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ చెట్టు చెక్కతో ఓడలు, ఫ్లైవుడ్, ఆభరణాలు వంటి వస్తువులను తయారు చేస్తారు. అలాగే సంగీత వాయిద్యాలు, విగ్రహాల తయారీలోను వాడతారు. సారవంతమైన నేల అవసరం మహోగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కాబట్టి కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిని అన్ని రకాల భూముల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. మహోగని చెట్లు పెరగడానికి సారవంతమైన నేల అవసరం. బలమైన గాలులు వీచే చోట ఈ చెట్లను నాటకూడదు. ఎకరాకు రూ. 50వేల వ్యయం ఎకరా పొలంలో 120 మహోగని మొక్కలు నాటుకోవచ్చు. ఒక మొక్క రూ. 400న ఉంచి 450 వరకు ధర పలుకుతుంది. ఈ విధంగా ఎకరాలో నాటేందుకు రూ. 45వేలు నుంచి 55వేలు వెచ్చించాల్సి వస్తుంది. మహోగని చెట్టు పరిపక్వం చెందేందుకు 12 ఏళ్లు పడుతుంది. అయితే 5 ఏళ్లకు ఒకసారి విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక కేజీ మహాగని విత్తనం ధర మార్కెట్లో రూ. 1,000. ఈ విధంగా కూడా రైతుకు ఆదాయం ఉంటుంది. అలాగే మహోగని చెట్టు 60 నుంచి 80 అడుగుల వరకు పెరుగుతుంది. ఒక క్యూబిక్ ఫీట్ రూ. 1,500 నుంచి 2,500 వరకు రేటు ఉంది. ఇలా ఒక మహోగని చెట్టుకు రూ. 80 నుంచి 1.20లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో 120 మహోగని చెట్లను నాటడం ద్వారా 12 ఏళ్లలో రూ.కోటి వరకు ఆదాయం పొందవచ్చు. ఆరోగ్యానికి సైతం.. మహోగని చెట్టుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. మహోగని చెట్టు దగ్గర దోమలు కూడా చేరవు. దీని ఆకులు, విత్తనాలను దోమల నివారణతోపాటు క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే రంగులు, వార్నిష్లు, సబ్బులతోపాటు మందుల తయారీకి వినియోగిస్తారు. ఈ చెట్టు బెరడు నుంచి అనేక ఔషధాలను కూడా సిద్ధం చేస్తారు. మూడు ఎకరాల్లో సాగు నేను మూడు ఎకరాల్లో మహోగని చెట్లు సాగు చేస్తున్నా. మా మిత్రుడు కూడా ఇదే సాగు చేస్తున్నాడు. ముందు ఆయన సలహా మేరకే నేను కూడా ఇందులో దిగాను. 12 ఏళ్ల తర్వాత అధిక ఆదాయం ఉంటుందని తెలిసింది. కాకపోతే ఓపిక ఉండాలి. కొత్తరకం చెట్టు కాబట్టి మంచి ఆదాయం ఇస్తుందని ఎదురుచూస్తున్నా. – శేఖర్రాజు, కోసలనగరం. విజయపురం మండలం -
నేడు పలమనేరులో గ్రీవెన్స్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.ఆయన ఆదివారం మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. నేడు పోలీసు కార్యాలయంలో.. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యపై నేరుగా కలిసి తెలియ జేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని వెల్లడించారు. డీఆర్సీ సమావేశం రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. చిత్తూరు డీవైఈఓగా ఇందిర చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు డీవైఈఓగా రొంపిచెర్ల ఎంఈవో–1 ఇందిరను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీకి రిపోర్టు చేసిన తర్వాత డీవైఈఓ విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేరుతో దౌర్జన్యం – బాధితుల ఆవేదన చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమికి చెందిన ఓ మహిళా నేత జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పేరు చెప్పి తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఉష, సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లెలో తమకు రెండు ఎకరాల భూమి ఉందన్నారు. తమ తల్లిదండ్రులు పసుపు కుంకుమం కింద సదరు భూమిని ఇచ్చనట్లు వెల్లడించారు. అయితే కూటమి నేత అరుణకుమారి దారిని ఆక్రమించుకుని, దాన్ని కాపాడుకునేందుకు తమ భూమిలో సీసీ రోడ్డు వేయిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎమ్మెల్యే థామస్ ఆదేశించారంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే , ఇతర నేతలు ఆమె అక్రమాలను గుర్తించాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఐసెట్ హాల్ టికెట్లు విడుదల తిరుపతి సిటీ:ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసెట్–2025 హాల్ టికెట్లను ఆదివారం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన ఐసెట్–2025 పరీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్ష సెంటర్ల మార్పు.. విద్యార్థులకు అవస్థలు తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారుల తీరుతో డి గ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థు లు అవస్థలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ కోసం డిగ్రీ కళాశాలల్లో పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిగ్రీ పరీక్షల సెంటర్లు ఆయా కళాశాలలో ఏర్పాటుచేసినట్టు హాల్ టికెట్లలో ఉంది. అధికారులు మాత్రం నీట్ జరుగుతున్న కేంద్రాల్లో సెంటర్లు ఉన్న డిగ్రీ విద్యార్థులకు పక్కనున్న జూనియర్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడే విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు విద్యార్థులను సంబంధిత ప రీక్షా కేంద్రాలకు తమ వాహనాల్లో తరలించారు. -
కమిషనర్ చిన్నయ్యపై చర్యలు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగర పాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి, ప్రస్తుతం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) వారం క్రితం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరడం, ఉద్యోగోన్నతులు పొందడంలో అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాథ్ నివేదిక మేరకు చిన్నయ్యను వెంటనే సూళ్లూరుపేట కమిషనర్గా రిలీవ్ చేస్తూ.. చిత్తూరు కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమించి, విధుల్లో చేరిన తర్వాత సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే చిన్నయ్యకు అపాయింట్మెంట్ ఆర్డర్, ప్రమోషన్లు ఇచ్చిన అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే దీనిపై చిన్నయ్య హైకోర్టును ఆశ్రయించడంతో జీఓపై కోర్టు స్టే విధించింది. అయితే చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టే దిశగా అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 84113 మంది స్వామివారిని దర్శించుకోగా 33,868 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఎర్రచందనం దుంగలు సహా కారు సీజ్
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు కారును సీజ్ చేసినట్టు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి వైల్డ్లైఫ్ డీఎఫ్వో వివేక్కు అందిన రహస్య సమాచారం మేరకు మామండూరు బీట్ పరిధిలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించినట్టు తెలిపారు. దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారని, అందులో పరిశీలించగా 26 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని తెలిపారు. కారుతో పాటు ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్టు వివరించారు. తనిఖీల్లో ఎఫ్ఆర్వో సుదర్శన్రెడ్డి, డీఆర్వో గౌస్ కరీమ్, ఎఫ్బీవోలు శరవణకుమార్, జాన్ శ్యామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి తోటకు నిప్పు శ్రీరంగరాజపురం : మండలంలోని ఎగువ కమ్మకండ్రిగలో భాస్కర్నాయుడు అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోటకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 250 మామిడి చెట్లతోపాటు డ్రిప్ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వెల్లడించారు. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ప్రభుత్వ స్పందించి తను ఆదుకోవాలని కోరారు. -
పరిశ్రమల స్థాపనతో మహిళలకు ఉపాధి
● టైలరింగ్ శిక్షణ వర్క్షాప్లో ఎమ్మెల్యే, కలెక్టర్ సుమిత్కుమార్ గంగవరం : ఒక కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ ఇంటి యజమానితో పాటు మహిళలకు కూడా జీవనోపాధి లభించినప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉండవని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ టెక్స్ట్టైల్స్ పరిశ్రమ ద్వారా పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలో పని చేసేందుకు పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో టైలరింగ్ అనుభవం ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలకు శనివారం వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతోనే మహిళలకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. గార్మెంట్స్ ఏర్పాటు ద్వారా పలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, కంపెనీ సీఈఓ రితేష్కుమార్, జనరల్ మేనేజర్ మొయిద్దీన్, డీఐసీ ఏడీ వెంకటరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్ ఇస్మాయిల్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సోమశేఖర్గౌడ్, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు, మహిళలు పాల్గొన్నారు. -
విద్యుత్శాఖకు నష్టం రూ.11 లక్షలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలీవానతో విద్యుత్శాఖకు రూ.11 లక్షలు నష్టం వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం నష్టం వివరాలను తెలియజేశారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, జీడీనెల్లూరు, పులిచెర్ల, సదుం ప్రాంతాల నందు మొత్తం 78 కరెంటు స్తంభాలు, 16 ట్రాన్స్ఫార్మర్లు, 2.5 కిలోమీటర్లు కేబుల్, కిలోమీటర్ కండక్టర్ నేలవాలిందన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు. నగరంలో కొంగారెడ్డిపల్లెలో జరుగుతున్న పనులను ఈఈ మునిచంద్ర పరిశీలించారు. -
కౌండిన్య నదిలో మోటార్ల అపహరణ
కౌండిన్య నదిలో ఇసుకాసురుల అరాచకాలు అంతే లేకుండా పోతున్నాయి. ఇసుక దోపిడీకి అన్నదాతలు అడ్డొస్తున్నారని వారికి చుక్కలు చూపిస్తున్నారు. పంటలకు ఆదరువుగా ఉన్న వ్యవసాయ మోటార్లను అదృశ్యం చేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుగుతున్నారు. కూటమి పదినె లల పాలనలో 50కిపైగా మోటార్లు చోరీ కావడం ఆందోళన కలిగిస్తోంది. ● పది నెలల్లో 50కి పైగా వ్యవసాయ మోటార్ల చోరీ ● ఇసుకాసురులకు అడ్డుపడితే..అంతే..! ● రాగి తీగల కోసం మరికొందరు చోరులు ● మోటార్ల చోరీతో ఎండుతున్న పంటలు ● పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం క్యాటిల్ ఫామ్ వద్ద ఇసుక తవ్వకాలు చేస్తున్న జీడిమాకులపల్లి ఇసుకాసురులు పలమనేరు : జిల్లాలోని కౌండిన్య నది పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల మీదుగా తమిళనాడులోని మోర్థన డ్యాం దాకా ప్రవహిస్తుంది. కౌండిన్య నదిని ఆనుకొని గుంతల్లో ఫిల్టర్ పాయింట్లో సబ్ మెర్సిబుల్ మోటార్లను అమర్చుకొని పంటలకు సాగునీటిని అందిస్తున్న రైతులకు ఇసుకాసురులు ఇప్పుడు విలన్లుగా మారారు. ఇసుక తవ్వకాలకు అడ్డొస్తున్నారని రైతులపై కసి పెంచుకున్న ఇసుకాసురులు మోటార్లు చోరీ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరోవైపు కొంత మంది యువకులు మద్యానికి బానిసై మోటార్లను చోరీ చేస్తున్నారు. దీంతో సాగునీటిని అందించలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోటార్ల చోరీలు ఎక్కువైనట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. కౌండిన్య నదికి ఆనుకుని రెండు వైపులున్న రైతుల మోటార్లు ఈ పది నెలల్లో 50కి పైగా చోరీ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పోలీసులకు అందని ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డు తగిలిన రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత నాలుగు నెలలో పది మోటార్లు చోరీకి గురయ్యాయి. కానీ ఈ చోరీలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెట్టాలి కౌండిన్య నదికి ఆనుకొని ఎంతో మంది రైతులు ఫిల్టర్ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నారు. అక్కడున్న ఇసుకను తోడేస్తే వారికి నీరు రాదని ఇసుకాసురులను అడ్డగిస్తున్నారు. దీంతో వారిపై కోపం పెంచుకొన్న వారు మోటార్లను చోరీ చేస్తున్నారా లేదా ఇంకెవరైనా వీటిని దొంగలిస్తున్నారా పోలీసులు గుర్తించాల్సి ఉంది. ఏదైనా కేసులొస్తే వారు పట్టించుకోకపోవడంతో ఈ దొంగతనాలు ఆగడం లేదు. ఈ చోరీల వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి రైతులకు న్యాయం చేయాలి. – వెంకటేగౌడ, వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పలమనేరు పంటలు ఎండిపోతున్నాయి కౌండిన్య నది పక్కన భూమి ఉంది. నదిలో మోటారు వేసుకొని సాగు చేసుకుంటున్నా. మూడు రోజుల కిందట నా బోరుకు ఆనుకొని జేసీబీతో ఇసుకను తోడుతుండగా అభ్యంతరం చెప్పా. ఆ మరుసటి రోజు చూస్తే నా మోటారు కనిపించలేదు. అందుకే అనుమానంతో ఇసుకాసురులపై పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ అరాచకాల వల్ల పంట నిలువునా ఎండిపోతోంది. – వనార్థన్రెడ్డి, రైతు, కొంగోళ్లపల్లి, గంగవరం మండలం మోటార్లను కనిపించకుండా చేసేస్తున్నారు.. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు మండలాల గుండా ప్రవహించి తమిళనాడు రాష్ట్రం ద్వారా బంగాళాఖాతంలో చేరే కౌండిన్య నదికి ఆనుకొని వ్యవసాయం చేసే రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు నదిలోని ఇసుక కారణంగా ఆరు ఇంచీల బోర్లను వేయలేరు. దీంతో మాన్యువల్గా ఫిల్టర్ పాయింట్ల ద్వారా 30 అడుగులు లోతు దాకా రెండు, మూడు ఇంచీల బోర్లను డ్రిల్ చేసి అందుకు 3 హెచ్పీ, 5హెచ్పీ సబ్ మెర్సిబుల్ మోటార్లను అమర్చుకొని పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొంత మంది పేద రైతులు నదిలోని చెక్డ్యామ్ల వద్ద గుంతల్లో నిలిచిన నీటికి మోటార్ అమర్చి పంటలను సాగు చేస్తున్నారు. అయితే నదిలో ఇసుక ఉంటేనే వీరికి నీటి లభ్యత ఉంటుంది. కానీ ఇసుకాసురులు జేసీబీలు పెట్టి మొత్తం ఇసుకను తోడేస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు వారిని అడ్డుకుంటే రైతుల మోటార్లు కనిపించకుండా చేస్తున్నారు. అధికారులకు తెలియందేమీకాదు కౌండిన్య నదిలో నిత్యం ఇసుకను తరలిస్తున్న వారెవరు, ఇసుక డంపులు ఎక్కడున్నాయి. కర్ణాటకకు వెళుతున్న ఇసుక, ఏ గ్రామంలో ఇసుక స్మగర్లున్నా రు. ఎవరికి ఎన్ని ట్రాక్టర్లున్నాయి. కొత్తగా జేసీబీ లు కొని మరీ ఇసుక తోడుతున్న వారెవరో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తెలియందేమీకాదు. అంతెందుకు గత ప్రభుత్వంలో ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్న స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్లు కూటమి పాలనలో కళ్లు కనిపించని కబోధులుగా మారారనే విషయం ప్రజల్లోనే కాదు పోలీసుశాఖలోనే వినిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ పూట మందు కోసం కొందరు... ఇసుకాసురుల అరాచకాలకు తోడు వ్యసనాలకు అలవాటు పడిన కొందరు యువకులు కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న మోటార్లు, కేబుల్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి వాటిని దొంగలించి అందులోని సిల్వర్, కాఫర్ తీగలను పట్టణంలోని గుజిడీ దుకాణాలకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి జల్సాల కోసం ఎంత మంది రైతుల పంటలు ఎండుతున్నాయే, ఆ రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. -
పశువులపై ఒంటరి ఏనుగు బీభత్సం
● అక్కడికక్కడే ఒక ఆవు మృతి ● చావు బతుకుల మధ్య మరొక్కటి పెద్దపంజాణి : పాడి పశువులపై ఒంటరి ఏనుగు దాడిలో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాప్పల్లి పంచాయతీ అటవీ సరిహద్దు గ్రామమైన పెనుగొలకల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. పెనుగొలకల గ్రామానికి చెందిన రామయ్య కుమారుడు క్రిష్ణప్ప వ్యవసాయంతో పాటు పాడి పశువులు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పశువులను పగలంతా పొలాల వద్ద మేతకు వదిలి సాయంత్రం అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు కింద కట్టేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం వేకువ జామున పలమనేరు రేంజ్ కీలపట్ల బీట్ నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు పశువులపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతోంది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఉదయం పొలం వద్దకు వెళ్లిన బాధిత రైతు జరిగిన సంఘటనను చూసి ఆందోళనకు గురయ్యాడు. ఏనుగుల దాడిలో దాదాపు రూ 80 వేలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పుంగనూరు ఎఫ్ఆర్వో శ్రీరాములు.. ఆవుకు పంచనామా నిర్వహించి, తీవ్రగాయాలతో ఉన్న మరో ఆవుకు చికిత్స చేయించారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపి నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్వో తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు సుకుమార్, బాలసుబ్రమణ్యం, ఎఫ్బీఓ రవికుమార్ పాల్గొన్నారు. -
భయపెట్టిన ఈదురు గాలులు
● నేలకొరిగిన చెట్లు, స్తంభాలు, దాబాలు పుంగనూరు/చౌడేపల్లె: పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుంగనూరు – భీమగానిపల్లె జాతీయ రహదారిపై కృష్ణదేవరాయుల సర్కిల్లో వున్న హైమాస్క్ లైట్లు గాలికి విరిగిపోయాయి. జాతీయ రహదారిలో ఉన్న దాబాల పైకప్పుకు వేసిన రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో నిర్వాహకులు మినహా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే సింగిరిగుంట, మంగళం, ఏటవాకిలి, మొరుంపల్లి, బండ్లపల్లి, గుడిసెబండ తదితర ప్రాంతాల్లో టమాట పంట దెబ్బతినింది. చౌడేపల్లె మండలంలోనూ గాలీవాన భీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన కురిసింది. మామిడి, వరి, బీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో చోటు
చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి జిల్లాలోని పలువురికి చోటు కల్పిస్తూ..పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. చంద్రగిరికి చెందిన అన్వర్ బాషాను, శ్రీకాళహస్తికి చెందిన మహ్మద్ రసూల్ను రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శులుగా, నగరికి చెందిన మోహన్రెడ్డిని రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా, చంద్రగిరికి చెందిన నాగేనమ్మను రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శిగా, నగరికి చెందిన గోపాల్రెడ్డిని రాష్ట్ర ఎంప్లాయిస్, పెన్షన్ విభాగ సహాయ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. దళితుల శ్మశానవాటిక ఆక్రమణ – తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చౌడేపల్లె : మండలంలోని పెద్దయల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లె దళితులకు చెందిన శ్మశానవాటిక (ఒలికిల గడ్డ) ఆక్రమణకు గురైందని గ్రామస్తులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన చిప్పిలి రెడ్డెప్ప అతని కుటుంబీకులు ట్రాక్టర్తో రాత్రి సమయంలో దున్నుతుండగా అడ్డుకోబోయిన వారిపై దౌర్జన్యం చేసి దున్నేశారని ఎర్రప్ప.. తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా...ఒలికిలగడ్డలో కొన్నేళ్లుగా తమ పూర్వీకుల నుంచి నేటికీ అదే శ్మశాన వాటికలో ఖననం చేసేవాళ్లమన్నారు. 248/3 సర్వే నంబరులో 66 సెంట్ల స్థలంలో సమాధులున్నాయని, వాటిని రాత్రిపూట దున్నేయడంతో అధికారులను ఆశ్రయించామని చెప్పారు. శ్మశాన వాటిక స్థలం తమదని ఆక్రమణదారుడు చెప్పడంతో ఇన్నాళ్లు పొలంలోకి రాని అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై దాడికి యత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల సమాధులను దున్నేయడంతో పాటు బండరాళ్లను సైతం ధ్వంసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. సర్వదర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,344 మంది స్వామివారిని దర్శించుకోగా 32,169 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అకాలవర్షం.. అపారనష్టం
చిత్తూరు రూరల్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాలవర్షం అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు పలు రకాల పంటలను దెబ్బతీసింది. దీని దాటికి పలు చోట్ల మామిడికి అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలవాలడంతో పాటు మామిడి కాయలు మొత్తం నేలరాలాయి. అలాగే అరటి, బొప్పాయి, కొబ్బరి పంటలు కూడా నష్టాన్ని మిగిల్చా యి. ఈ సమాచారం అందుకున్న ఉద్యానశాఖ అధికారులు శనివారం పంట పరిశీలనలో పడ్డారు. 7 మండలాల పరిధిలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అధికంగా మామిడి పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. మామిడితో పాటు పలు రకాల పంటలు మొత్తం 171.46 హెక్టార్లల్లో పంట దెబ్బతింటే 404 రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. పెనుమూరు మండలంలో మామిడి 12 హెక్టార్లు, యాదమరిలో అరటి ఒక హెక్టారు, మామిడి 5 హెక్టార్లు, చిత్తూరులో అరటి 0.8 హెక్టార్లు, బొప్పాయి 0.4 హెక్టార్లు, మామిడి 54 హెక్టార్లు, కొబ్బరి 0.06 హెక్టార్లు, గుడిపాలలో అరటి 1.6 హెక్టార్లు, బొప్పా యి 0.4 హెక్టార్లు, మామిడి 25 హెక్టార్లు, పలమనేరు లో 39 హెక్టార్లు, తవణంపల్లిలో మామిడి 22.2 హెక్టా ర్లు, ఐరాలలో మామిడి 10 హెక్టార్లల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో గాలీవాన బీభత్సంతో దెబ్బతిన్న పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్న మామిడి 171.46 హెక్టార్లలో పండ్లతోటల నష్టం గుర్తింపు నష్టం మరింత పెరిగే అవకాశం -
అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలతమ్మ దంపతులు శనివారం సందర్శించారు. ఆయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవగ్రహ ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. సదుమమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను పలువురు వైఎస్సార్ సీపీ యూత్ విభాగం సభ్యులు కలిశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పుట్రాజు, హరినాథరెడ్డి, మనోజ్, మనోహర్ రెడ్డి, ఇర్ఫాన్, దాము తదితరులు పాల్గొన్నారు. టీబీ పరీక్షలు విధిగా చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : టీబీ పరీక్షలు విధిగా చేయాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపీలో 10 శాతం తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలన్నారు. పీహెచ్సీ పరిధిలో ఆశా వర్కర్లు అనుమానిత వ్యక్తులకు గళ్ల పరీక్షలు చేయించాలన్నారు. అలాగే డెంగ్యూ కేసులపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయనివారణ అధికారి వెంకట ప్రసాద్, మలేరియా అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ● జెడ్పీ సీఈఓకు వైఎస్సార్టీఏ నేతల వినతి చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ ఉద్యోగుల సమస్యలపై సీఈఓ రవికుమార్ నాయుడును ఏపీ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ నాయకులు కలిశారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓకు పలు సమస్యల పై వినతి పత్రం అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి రెడ్డిశేఖర్రెడ్డి, జిల్లా గౌరవ అఽఽధ్యక్షుడు సోమచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకాంత్ మాట్లాడారు. 2023–24కు సంబంధించి పీఎఫ్ వార్షిక స్లిప్స్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నాన్ డ్రాయల్, నో డ్యూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించే విధానాన్ని తీసివేయాలన్నారు. పది సంవత్సరాల ముందు పదవీ విరమణ పొందిన చందాదారుల నిల్వ సొమ్ములు చాలా మందికి చెల్లించాల్సి ఉందన్నారు. పలమనేరు సబ్ ట్రెజరీ ద్వారా జరిగిన చెల్లింపులు సీఎఫ్ఎంఎస్ నందు సక్రమంగా ఆప్లోడ్ చేయనందున ఖాతాదారులకు నేటికి జమ కాలేదన్నారు. సమస్యలను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వివరించారు. కాణిపాకంలో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెంచల కిషోర్ ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు. -
అమరావతి అభివృద్ధి చేస్తే చాలా?
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరం : ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా.. అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం పుత్తూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో నరేంద్ర మోదీ ప్రధామంత్రి హోదాలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే మిగిలిన ప్రాంతాలు వెనుకబడి పోతాయని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఒకే ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే ఉప ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. గతంలో ఢిల్లీ నడిబొడ్డున ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు.. మోదీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. నేడు మోదీని పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే బాబు కంటే ఊసరవెల్లే నయమని అన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సిద్ధాంతమన్నారు. చంద్రబాబు కుటుంబానికి పోలవరం ఒక ఏటిఎం అని విమర్శించిన మోదీ నేడు చంద్రబాబు విజన్ అని ప్రశంసించడం దారుణమన్నారు. అమరావతి శంకుస్థాపన పేరుతో పబ్లిసిటీ కోసం రూ.500 కోట్లు ప్రజాధనం వృథా అయిందని నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. -
తరగతులకు
మూకుమ్మడిగా రెమిడియల్ తరగతులకు టీచర్లు డుమ్మా ● కానరాని ‘పది’ సప్లిమెంటరీ విద్యార్థుల ప్రత్యేక తరగతులు ● రెమిడియల్ పేరుతో టీచర్లను వేదించడం సరికాదు ● రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులపై మండిపాటు ● ఉత్తర్వులు ఉప సంహరించుకోవాలని డిమాండ్ వేధింపులపై ఆగ్రహం రెమిడియల్ తరగతుల పేరుతో టీచర్లను వేధించడం సరికాదని ఉపాధ్యాయ సంఘం నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తీర్ణులు కానీ విద్యార్థుల కోసం రెమిడియల్ తరగతుల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడంపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఉత్తర్వులు టీచర్ల వేసవి సెలవులను నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులను వేధించేందుకు తీసుకున్న రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. టాస్క్ఫోర్స్ : విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉంటే జిల్లాలో మంచి ఫలితాలు సాధ్యపడేవి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ‘పది’ ఫలితాల్లో సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాష్ట్రంలో 24వ స్థానంకు దిగజారింది. ఈ ఫలితాలపై ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారనే చందంగా పది పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అయిన తర్వాత రెమిడియల్ తరగతులంటూ ఆర్భాటం చేస్తోంది. ఈ ఆర్భాటంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో పది ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈనెల 2వ తేదీ నుంచి రెమిడియల్ తరగతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కనిపించని తరగతుల నిర్వహణ కూటమి ప్రభుత్వం జారీచేసిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల రెమిడియల్ తరగతుల నిర్వహణ జిల్లాలో ఈనెల 3 వ తేదీ ఎక్కడా నిర్వహించ లేదు. ఈనెల 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెమిడియల్ తరగతులను ప్రతి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రెమిడియల్ తరగతుల నిర్వహణ జాడే కనిపించలేదు. ఉత్తర్వులు హడావుడిగా రాత్రిపూట రెమిడియల్ తరగతులు 2వ తేదీ నుంచి నిర్వహించాలని షెడ్యూల్ లో పేర్కొని ఉత్తర్వులేమో అదే తేదీ రాత్రికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో రెమిడియల్ తరగతుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ షెడ్యూల్లో ఈనెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించారు. అయితే ఉత్తర్వులు మాత్రం 2వ తేదీ రాత్రి విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇలాంటి ఆకస్మిక ఉత్తర్వుల జారీపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూకుమ్మడిగా బహిష్కరణ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మూకుమ్మడిగా రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను పాటించకుండా బహిష్కరించారు. వేసవి సెలవుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విధులు ఎవరు నిర్వహిస్తారంటూ రెమిడియల్ తరగతులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఈ తరగతులను పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాల్సిన హెడ్మాస్టర్లే విధులకు డుమ్మా కొట్టారు. అయితే ఈ తరగతుల పర్యవేక్షణను ఎంఈఓలు, డీవైఈఓలు, డీఈవో సైతం పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 3వ తేదీన ఎన్ని పాఠశాలల్లో రెమిడియల్ తరగతులు నిర్వహించారో? ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో? ఎంత మంది టీచర్లు విధులకు హాజరయ్యారనే వివరాలు విద్యాశాఖ అధికారుల వద్దే లేని పరిస్థితి. ఈ తరగతుల నిర్వహణపై అయ్యోర్లు గుర్రుమంటుండంతో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. -
నేడే నీట్
● పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేసిన అధికారులు ● జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు ● హాజరు కానున్న 710 విద్యార్థులు చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ) ఆదివారం జరగనుంది. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా గుర్తింపు పొందిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 710 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి నీట్కు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవీకేఎన్లో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అన్ని నియమ, నిబంధనలు పాటిస్తూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. -
● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడిబొడ్డులోని కట్టమంచి చెరువులో తవ్వకాలు ● ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి తరలింపు ● నిమ్మకు నీరెత్తిన చందంగా జిల్లా యంత్రాంగం
చిత్తూరు టాస్క్ఫోర్స్ : సీఎం సొంత జిల్లా కేంద్రంలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ రవాణా గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా ఏదో మారుమూల సాగుతోంది అనుకుంటే పొరబాటే. జిల్లా కేంద్రంలోని నడిబొడ్డులో ఉన్న కొత్తబస్టాండ్ పక్కనే ఉన్న పేరొందిన కట్టమంచి చెరువులో ఈ అక్రమ మట్టి రవాణా తతంగం సాగుతోంది. నేలతల్లి కన్నీళ్లు పెట్టేలా ప్రతి రోజు యథేచ్ఛగా మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. అధిక వేగంతో ట్రాక్టర్లు నగరంలోని కట్టమంచి చెరువులో తవ్వుతున్న మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అధిక వేగంతో వెళుతున్నాయి. వందల చొప్పున ట్రాక్టర్లు పగటి పూట వేగంగా వెళుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ట్రాక్టర్లలో మట్టి అక్రమ రవాణా కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఇంత తతంగం సాగిస్తున్నప్పటికీ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కట్టమంచి చెరువులో అక్రమంగా ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లురోజుకు వందల లోడ్లు కట్టమంచి చెరువులో రోజు మూడు ప్రొక్లెయినర్లను పెట్టి మట్టిని తవ్విస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుతున్నారు. ప్రతి రోజు వందల ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 15 రోజులుగా రోజుకు వంద లోడ్లు చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి అక్రమ రవాణా సాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని నగర సరిహద్దులో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తుండడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. సుందరీకరణ పనుల పేరుతో అక్రమంగా మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పనులు జరగలేదని అంటున్నారు. చెరువు ప్రాణాధారం..పల్లెకు, పట్టణానికి ఆయువుపట్టు. జనం పాలిట కల్పతరువు.. ఎందరో మహానుభావుల దాతృత్వంతో వీటిని తవ్వించారు. అయితే కాలక్రమేణ స్వార్థం పెరిగింది. వాటిని ఆక్రమించుకునే ప్రబుద్ధులు పెరిగారు. ఫలితంగా నీటి వనరులు తగ్గిపోయి..తరచూ కరువు తాండవిస్తోంది. ప్రజలతోపాటు జంతువులు, పక్షులకూ నీరు కరువు అవుతోంది. ఆ ఆక్రమణలను తొలగించి ఆధునికీకరించాలని నిర్ణయించారు. నిధులు మంజూరు చేశారు. అయితే నాయకులు కాసుల వేటలో పడి, ఆధునికీకరణ లక్ష్యం నీరుగార్చారు. ఇష్టారాజ్యంగా తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అయినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే దందాకు పరాకాష్ట కట్టమంచి చెరువు సుందరీకరణకు కలెక్టర్ ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు ఇచ్చారే తప్ప.. ఇక్కడ మట్టిని తవ్వుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకోమని చెప్పలేదు. ఎమ్మెల్యే చేస్తున్న దందాలకు అక్రమంగా చెరువు మట్టిని తవ్వి వ్యాపారం చేస్తుండడమే నిదర్శనం. ఇప్పటి వరకు దాదాపు 5 వేల లోడ్లకు పైగా మట్టిని అమ్ముకున్నారు. అసలు చెరువులో మట్టి ఎంత తవ్వాలి? ఎంత తవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు..? అన్న విషయం గురించి ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. అధికారుల తీరుపై అవసరమైతే ఏసీబీ, విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తాం. – ఎంసీ.విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుకే సుందరీకరణ.. కట్టమంచి చెరువు సుందరీకరణ పనులను గత ఏడాది చేపట్టారు. కట్టమంచి చెరువు పూడికతీత పనులకు చిత్తూరు ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద పాల్గొని, గత ఏడాది సెప్టెంబర్ 24 వ తేదీన భూమి పూజ చేసి ప్రారంభించారు. చిత్తూరు కార్పస్ ఫండ్తో సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నప్పటికీ పూడికతీత పనులకే ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ పనుల ముసుగులో మట్టిని అక్రమంగా తరలించి కూటమి నేతలు జోబులు నింపుకుంటున్నారు. -
బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని జిల్లేడుపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన చెంగల్రెడ్డి(79) నలగాంపల్లెలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, స్వగ్రామానికి వెళ్లేందుకు చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిని దాటుతుండగా తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని 108లో ప్రథమ చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. విద్యుత్షాక్తో యువకుడి దుర్మరణం బైరెడ్డిపల్లె: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లెలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెల్వం కుమారుడు ప్రదీప్ (20) ఇంట్లో ఫ్యాన్ పాడైపోవడంతో మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు బైరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రదీప్ను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వివాహిత ఆత్మహత్య కార్వేటినగరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పసలవానిమిట్ట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పసలవానిమిట్ట గ్రామానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఎలక్ట్రిషీయన్గా పని చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. ఇతడు బెంగళూరుకు చెందిన శిల్ప(21)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతితో పెద్దల సమక్షంలో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. త్వరలో తమ బిడ్డకు పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో కానీ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, శిల్ప ఉరివేసుకుంది. గుర్తించిన స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శిల్ప మృతి చెందిన సమాచారాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహిత మృతిపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. -
వడగండ్ల వాన.. పంటలకు నష్టం
● చిత్తూరులో వడగండ్లవాన ● పెనుగాలులకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు ● రాలిన మామిడి కాయలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం, మండలంలో శుక్రవారం సాయంత్రం అర్ధగంటపాటు పెనుగాలులతో కూడిన వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలుచోట్ల కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. అకాలవర్షం మామిడి పంటను దెబ్బతీసింది. ఈదుగాలులకు మామిడి చెట్లలో 30 నుంచి 50 శాతం వరకు కాయలు నేలరాలిపోయాయని రైతులు వాపోతున్నారు. సిద్ధంపల్లి, పెరుమాళ్లకండ్రిగ, గువ్వకల్లు, దిగువమాసాపల్లి, తాళంబేడు, చింతలగుంట తదితర ప్రాంతాల్లో అధిక శాతం చెట్లు కూలిపోయాయని రైతులు చెబుతున్నారు. పెనుగాలులకు నేలవాలిన స్తంభాలు చిత్తూరు కార్పొరేషన్: నగరంలో శుక్రవారం వీచిన పెనుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకస్మాత్తుగా సాయంత్రం వాతవారణం చల్లబడింది. ఎక్కువగా గాలి వీయడంతో కొన్ని ప్రదేశాల్లో చెట్ల, కొమ్మలు లైన్పై పడి స్తంభాలు నేల కూలాయి. సిబ్బంది లైన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే పలు ప్రాంతాల్లో లైన్ ట్రిప్ప్ అవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సత్యనారాయణపురం, బార్బర్కాలనీ, సాంబయ్యకండ్రిగ ప్రాంతాల్లో స్తంభాలు పడిపోయింది. -
యువకుడి ఆత్మహత్య
కుప్పం: పట్టణం చిత్తరంజని రోడ్డులోని ఓ ఇంట్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పపడ్డిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసలు కథనం మేరకు.. కుప్పం పట్టణం చిత్తరంజని రోడ్డులో బాలసుబ్రమణ్యం శ్రాస్తీ వద్ద గుడుపల్లె మండలం కంచి బందార్లపల్లి గ్రామానికి చిరంజీవి పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వచ్చినా చిరంజివి ఇంటి యాజమాని బాబుస్వామి బయటకు వెళ్లాలని పిలిచినా.. తాను రావడం లేదని ఇంట్లోనే ఉంటానని చెప్పి ఉండి పోయాడు. ఏమి జరిగిందో ఏమోకానీ చిరంజీవి ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యాజమాని తలుపు తట్టగా తెరవకపోవడంతో అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తీసి చూడగా ఇంట్లో చిరంజీవి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు మృతుడి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తల్లితండ్రులు, ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,863 మంది స్వామివారిని దర్శించుకోగా 31,030 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
ఆటోను ఢీకొన్న జేసీబీ
● తండ్రి కొడుకులకు తీవ్రగాయాలు గుడిపాల: ఆటోను జెసీబీ ఢీ కొన్న ఘటనలో తండ్రి, కొడుకుతోపాటు మరో ఐదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలైనట్టు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. నగరి మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన రుషేంద్రబాబు(35) తిరుపతిలో బియ్యం వ్యాపారం చేసేవాడు. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి కందిపప్పు, ఉద్దిపప్పు తీసుకు వచ్చి తిరుపతిలో విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో గుడిపాల మండలం పల్లూరు గ్రామంలో నూతనంగా బియ్యం దుకాణం పెట్టేందుకు ఏర్పాట్లు చేశాడు. శుక్రవారం కాణిపాకం గుడికి వెళ్లి పల్లూరులో బియ్యం దుకాణం ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా తనకు ఉన్న ఎలక్ట్రిక్ ఆటో ఏపీ 39 డబ్ల్యుడీ 2074లో వస్తుండగా గుడిపాల మండలంలోని అనుపు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఏపీ26 ఏజే6976 జేసీబీ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో రుషేంద్రబాబుతోపాటు అతని కుమారుడైన భువనచంద్ర(5) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొలమాసనపల్లిలో చోరీ
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లిలో ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి ఇంట్లో చోరీ విషయం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కొలమాసనపల్లెకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి గురువారం కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటికి తాళం వేసుకుని శాంతిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం గమనించిన దొంగలు అదేరోజు రాత్రి ఆ ఇంటి కిటికీని తొలగించి, ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఇంటికొచ్చిన బాధితురాలు చోరీ జరిగిన విషయం గుర్తించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బీరువాలోని 20 గ్రాముల బంగారం, అరకిలో వెండి, రూ.80 వేల నగదును చోరీకి గురైనట్టు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శతాధిక వృద్ధుడి మృతి బంగారుపాళెం: మండల కేంద్రంలో శుక్రవారం శతాధిక వృద్ధుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న సుబ్బానాయుడు(100) వయోభారం కారణంతో మృతి చెందాడు. ఈయన అక్టోబర్ 1924లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన శతాధిక వృద్దుడు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అవార్డు గ్రహీతకు సత్కారం చిత్తూరు కలెక్టరేట్ : వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందుకున్న రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగంధర్కు సత్కారం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు మహేష్ మాట్లాడుతూ ప్రెస్క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్టణంలో అంతర్జాతీయ సామాజిక అవార్డుల కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నా యుగంధర్ చేసిన సామాజిక సేవకు గాను వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందజేశారన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవ, సాయి, కిషోర్, మహేష్ బాబు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
తిరుపతి సిటీ: స్వర్ణాంధ్ర –2047 సాధనలో భాగంగా సీఎం విజనరీకి అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని డీఆర్వో నరసింహులు అధికారులను ఆదేశించారు. పద్మావతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టీం సభ్యులు, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. వర్క్షాపులో ఏపీ ప్రణాళిక శాఖ సంచాలకులు రావి రాంబాబు, ప్రణాళికా శాఖ సీనియర్ సలహాదారు సీతాపతిరావు, సీపీఓ ప్రేమ్చంద్ర, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. -
నైరాశ్యం..నిర్వేదం
చిత్తూరు అర్బన్: నామినేటెడ్ పదవుల్లో తమను గుర్తించకపోవడంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందో..లేదోననే నిర్వేదంలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కుప్పం మినహా అన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం, ఎంపీ స్థానం గెలుచుకోవడంలో కుప్పంలో పోలైన ఓట్లు ఓ సరికొత్త రికార్డును నెలకొలపడం తెలిసిందే. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని ఏడు స్థానాలకు గానూ ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు చెందిన నేతలు కూటమిగా ఏర్పడి కీలక పాత్ర పోషించారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో నాలుగు దఫాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయ్యింది. ఇందులో చాలా మంది మహా మహా ఉద్దండులకు చోటు లభించకపోగా కీలక పదవులపై ఆశలు పెట్టుకున్న కూటమి నేతల ఆశలపై ఆ పార్టీ అధిష్టానం నీళ్లు చల్లి పక్కన పెట్టేసింది. అసలు తమకు రాజకీయ భవిష్యత్తు ఉందా..? రానున్న రోజుల్లో ఇవ్వడానికి ఏవైనా పోస్టులు ఉన్నాయా..? ఏ పోస్టు ఇవ్వకుంటే మున్ముందు జనం గుర్తు పెట్టుకుంటారా..? అనే ప్రశ్నలు ఆ పార్టీ ప్రధాన నేతలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో తాము ప్రతిపాదించని, ఊహించని వ్యక్తులకు పలు కీలక పదవులు ఇవ్వడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లకు మింగుడుపడడంలేదు. పక్కన పెట్టేశారా..? ● చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్ గెలుపు చాలా మంది అంచనాలను తారుమారు చేసింది. ఈ గెలుపులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నాయుడు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ భర్త చంద్రప్రకాష్ నాయుడు, మాజీ కార్పొరేటర్ వసంతకుమార్ నాయుడు ఉన్నట్టు చెప్పుకుంటారు. సీకేకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగినా నిరాశే మిగిలింది. చుడా చైర్పర్సన్ కోసం వసంతకుమార్ ఏకంగా జగన్మోహన్తోపాటు ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగడితే ఆ సీటు మాజీ మేయర్ కటారి హేమలత తన్నుకుపోయింది. డీసీసీబీ చైర్మన్ తనకే దక్కుతుందనుకున్న దొరబాబుకు ‘అమాస’ రూపంలో భంగపాటు తప్పలేదు. ● అమర్నాథరెడ్డి గెలుపులో తానూ ఉన్నానని, ప్రభుత్వం వస్తే తనకు మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ ఇస్తారకునున్న వి.కోట రామచంద్రనాయుడికి నైరాశ్యం తప్పలేదు. ఏఎంసీ చైర్పర్సన్ బీసీ–మహిళకు రిజర్వుకావడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. డీసీఎంఎస్ చైర్మన్ ఆశించిన పెద్దపంజాణి భాస్కర్రెడ్డిని అసలు పరిగణలోకే తీసుకోలేదు. ● పుంగనూరులో అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అన్ని అధికారాలను తన వద్దే ఉంచుకున్న చల్లాబాబు సైతం తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తారని ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఊహలకే పరిమితం చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ తనకే వస్తుందనుకున్న సమీపతికి పోటీగా సుబ్రమణ్యంరాజును తెరపైకి తీసుకొచ్చారు. బోయకొండ ఆలయ చైర్మన్ అవుతానని ఖారారుగా ఉన్న లక్ష్మీపతిరాజును వెంకటముని యాదవ్, ఎస్కె.రమణారెడ్డి రూపంలో కుర్చీకి అడ్డుగా నిల్చున్నారు. ● కుప్పంలో రెప్కో చైర్మన్ రేసులో రాజ్కుమార్, సురేష్బాబు, చంద్రశేఖర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమకే రెప్కో కుర్చీ ఇస్తారా..? కొత్త వాళ్లను కూర్చోపెడతారా..? అనే ప్రశ్నలు రోజురోజుకు వీళ్లల్లో హైటెన్షన్ను తెప్పిస్తోంది. ఏఎంసీ చైర్మన్గా పోటీ పడుతున్న కాణిపాకం వెంకటేష్, నాగరాజు, ఆంజనేయుల రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇలాగా ఉంది. ● కాణిపాకం చైర్మన్ కుర్చీ కోసం మణినాయుడు, పూర్ణచంద్రలో ఒకరికి భంగపాటు తప్పదు. శాప్ చైర్మన్, బంగారుపాళెం ఏఎంసీ చైర్మన్ ఆశించిన పూతలపట్టు ఎమ్మెల్యే మద్దతుదారుడు జయప్రకాష్ నాయుడికి ఏ పదవి రాకపోవడంతో ఇతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నగరిలో దేశాలమ్మ గుడి చైర్మన్, ఏఎంసీ పదవులకు మదన్, సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి మధ్య నెలకొన్న పోటీ కొత్త వ్యక్తుల తెరపైకి వచ్చేలా చెబుతున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మన్ పదవికి శ్రీధర్ యాదవ్, ధనుంజయ నాయుడు మధ్య నెలకొన్న పోటీలో ఒకరు కరివేపాకు అవడం ఖాయంగా కనిపిస్తోంది. అనుకున్నదొక్కటి.. అయినదొకటి! నామినేటెడ్ పదవులు దక్కక తమ్ముళ్ల ఆందోళన ఆశపడి నిరాశకు లోనవుతున్న కూటమి నేతలు మున్ముందు రాజకీయ భవిష్యత్తే ఉండదనే డైలామా నగరి నుంచి కుప్పం వరకు ‘పచ్చ’ నేతల నైరాశ్యం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కీలకంగా మారాం.. పార్టీ అధికారంలోకి వచ్చింది.. మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. మంచి నామినేటెడ్ పదవి వస్తుంది.. అని పలువురు పచ్చ నేతలు కలలుగన్నారు. అయితే వారి ఆశలపై బాబు నీళ్లు చల్లారు. దీంతో అనుకున్నదొకటి.. అయినదొకటి.. మనల్ని కరివేపాకులా వాడుకున్నారన్న నైరాశ్యం..నిర్వేదంలో ఉన్నారు. -
ప్రజల పక్షాన పోరాడండి
మాయగాళ్లకు‘మన్ను’దన్ను సుందరీకరణ పేరుతో కూటమి నేతలు చిత్తూరు కట్టమంచి చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు.– 10లోరోడ్డు పనులకు రూ.72 కోట్లు వడగండ్ల వాన.. పంటలకు నష్టం చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025తిరుపతికి వెళ్లే బస్సులు రాక చిత్తూరు బస్టాండ్లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు చిత్తూరు జిల్లా నుంచి 130 బస్సుల సేవలను అమరావతికి మళ్లీంచారు. దీంతో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు పడరాని పాట్లు పడ్డారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వచ్చారు. ఇందుకు జనసమీకరణ చేయడానికి కూటమి నేతలు జిల్లాలో మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో గురువారమే అమరావతికి తరలించారు. ఇందుకు జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల నుంచి 130 బస్సులను ఆర్టీసీ అధికారులు వారికి కేటాయించారు. మిగిలిన అరకొరగా బస్సులను స్థానికంగా నడిపారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు గమ్యం చేరడానికి కుస్తీ పట్టాల్సివచ్చింది. గంటల తరబడి నిరీక్షణ వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక పోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, చికిత్స కోసం వచ్చి తిరుగు ప్రయాణమైనవారు.. వృద్ధులు బస్టాండ్లలో నిరీక్షించి, నీరసించిపోయారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో గమ్యానికి చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో గ్రామీణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో సీట్ల కోసం నువ్వా? నేనా? అన్నట్లు ఫీట్లు చేయాల్సివచ్చింది. అధికంగా తిరుపతి, బెంగళూరు, పీలేరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తవణంపల్లి, పెనుమూరు, జీడీనెల్లూరు కడప తదితర మార్గాల్లో నిత్యం బస్సులు రద్దీగా కనిపిస్తుంటాయి. ఈ మార్గాల్లో నడిచే బస్సులను కూడా రాజధానికి మళ్లించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. దీనికితోడు ఎండ వేడమి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు. మళ్లీ అప్పులు తప్పవా..? టీడీపీ గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సేవలను పక్కన పెట్టింది. టీడీపీ ప్రభుత్వ సమావేశాలు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. ఆర్టీసీ కూడా అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపింది. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను వినియోగించుకున్నారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు రూ.4 కోట్ల మేర బకాయిలు పడింది. అప్పట్లో వారు చెల్లించింది రూ.14.64 లక్షలు మాత్రమే. మళ్లీ ఇలా సభలకు వెళ్లిన బస్సులకు సుమారు రూ.1.10 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో ఖాళీగా ఉన్న బెంగళూరు స్టాప్ ‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన చిత్తూరులో నీట్ నిర్వహించనున్న కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీ లించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని పీవీకేఎన్, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 4వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో వి ద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు నీట్కు హాజరుకానున్నట్లు తెలిపారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. సెంటర్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, పీవీకేఎన్ ప్రిన్సిపల్ జీవనజ్యోతి, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర, పీవీకేఎన్ కళాశాల పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ శరవణ పాల్గొన్నారు. వ్యవసాయ జిల్లా కార్యాలయం ఏఓగా అంజయ్య గుడిపాల: జిల్లా వ్యవసా య కార్యాలయం పరిపా లన అధికారిగా గుడిపాల మండలం 189కొత్తపల్లెకు చెందిన అంజయ్య శుక్రవారం పదవీ భాధ్యతలు చేపట్టారు. ఆయన ఇక్కడే సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఏఓగా ఉద్యోగోన్నతి పొందారు. జగనన్నపై ‘చిట్టి’ అభిమానంపలమనేరు: అభిమానానికి హద్దులు లేవనేమాట నిజమే. గంగవరం మండలం నలసానపల్లెకు చెందిన డ్రైవర్ బాలాజీకి జగన్మోహన్రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయన పుట్టినరోజుకు సైతం తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చారు. ఎన్నికల వేళ తన ఇంటికి కట్టుకొనేందుకు తీసుకెళ్లిన పార్టీ బ్యానర్లు, జెండాలను జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇతని మూడేళ్ల కుమార్తె చిట్టికి సైతం జగన్మోహన్రెడ్డి అంటే చాలా ఇష్టం. టీవీలో ఆయన కనిపించగానే జగన్ మామ అంటూ కేరింతలు కొడుతోంది. దీంతో గ్రామంలో గంగజాతర మొదలైంది. కాస్త విభిన్నంగా ఆలోచించిన బాలాజీ తన కుమార్తెకు పార్టీకి చెందిన జెండాలు, బ్యానర్ను టైలర్కిచ్చి బిడ్డకు దుస్తులు కుట్టించాడు. వాటిని ధరించిన చిట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దుస్తులు వేసుకుని గ్రామంలో చెంగుచెంగున వెళుతుంటే గ్రామస్తులు సైతం ఆ చిన్నారిని చూసి భలే ఉంది పాప డ్రెస్ అంటూ ఆశ్చర్యంగా తిలకించారు. చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఆర్అండ్ బీ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని పలు రహదారులు 221 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడానికి రూ.72 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దమల్లెల–ఎర్రావారి పాళెం రోడ్డుకు రూ.1.50 కోట్లు, చిత్తూరు–పు త్తూరు రోడ్డు నుంచి కమ్మకండ్రిగ రోడ్డు రూ.2 కో ట్లు, చిత్తూరు–తిరుత్తణి రహదారి నుంచి వేలూ రు రోడ్డు రూ.2 కోట్లు, నగరి నుంచి వెంగన్న కండ్రిగ రోడ్డుకు రూ.2 కోట్లు, అడవిబుదుగూరు క్రా స్ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.1.20 కోట్లు కేటాయించారు. కుప్పం–సంగనపల్లె రోడ్డు రూ.70 లక్షలు, కుప్పం–పొగురుపల్లె–గుడుప ల్లెరూ.70 లక్షలు, రామకుప్పం–వి.కోట పేర్నంబట్టు రోడ్డుకు రూ.1.35 కోట్లు మంజూరు చేశా రు. అలాగే బందార్లపల్లె క్రాస్ నుంచి పాముగానిపల్లె రో డ్డు రూ.67 లక్షలు, రామకుప్పం–వి.కోట–పేర్నంబట్టు రోడ్డు రూ.1.90 కోట్లు, కుప్పం– చిగురుగుంట రోడ్డుకు రూ.2.65 కోట్లు, గుడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు (వయా కేనుమాకుపల్లె, పెద్దూరు) రోడ్డుకు రూ.1.85 కోట్లు, గుడ్యాణంపల్లె–దిన్నేపల్లె రోడ్డు రూ.85 లక్షలు, 64 పెద్దూరు నుంచి కర్లగట్ట రోడ్డు రూ. 68 లక్షలు మంజూరు చేశారు. కుప్పం సరిహద్దు రహదారి నిర్మాణానికి రూ.4.95 కోట్లు, గుడ్యాణంపల్లె రోడ్డు రూ.1.15 కోట్లు, కుప్పం – గుడుపల్లె రోడ్డు రూ.80 లక్షలు, కుప్పం–పొగురుపల్లె రోడ్డు రూ. 84 లక్షలు, గు డ్యాణంపల్లె నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.3.55 కోట్లు, ఎన్హెచ్ 219 క్రాస్ రోడ్డు రూ.40 లక్షలు, యామిగానిపల్లె రోడ్డు రూ.1.05 కోట్లు,పలమనేరు–కృష్ణగిరి బైపాస్ రోడ్డు రూ.79 లక్షలు, కుప్పం–పట్చూరు రోడ్డు రూ.3.84 కో ట్లు, కుప్పం–మల్లానూరు రోడ్డుకు రూ.6.05 కో ట్లు కేటాయించారు. పలమనేరు – కృష్ణగిరి రోడ్డు కు రూ.40 లక్షలు, వెంకటపల్లె నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డుకు రూ.50 లక్ష లు, కుప్పం–పలమనేరు రోడ్డు రూ.4.05 కోట్లు, కుప్పం– గుడుపల్లె రూ.6.02 కోట్లు, కుప్పం–పెద్దపర్తికుంట రూ.5.16 కోట్లు, రామకుప్పం–విజలాపురం రూ.3.85 కోట్లు, సీకేటీ రోడ్డు–పాకాల–దామలచెరువు రూ.2.20 కోట్లు, రాయలపేట–మాధవరం రూ.2.20 కోట్లు, రాయలపేట–కల్లుపల్లె రోడ్డుకు రూ.4.45 కోట్లు కేటాయించారు. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి చౌడేపల్లె: ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడిలా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతిలోని పెద్దిరెడ్డి స్వగృహంలో చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వారిని కలిశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులు, అన్యాయాలు, ఆక్రమణలు, కార్యకర్తలకు కలిగిన కష్టనష్టాల గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డికి వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తామున్నామని, అధైర్యపడొద్దని భరో సా ఇచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలోని బలోపేతం చేయడంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చేకూరిన లబ్ధిని వివరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తెలిపి, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్తకర్త సైనికుల్లా కష్టపడి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి, పేద ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరాజు, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్బాబు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు పద్మనాభరెడ్డి, జి.శ్రీనివాసులురెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీకి సత్కారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన జి.నాగభూషణరెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతం చేయడంతోపాటు గ్రామస్థాయి నుంచి ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.– 10లో– 10లోన్యూస్రీల్ ఆర్టీసీ బస్సులు అమరావతి సభకు మళ్లింపు జిల్లా నుంచి 130 బస్సులు ప్రయాణికులకు తిప్పలు ఆర్టీసీ బస్సుల సమాచారం.. డిపోల సంఖ్య – 5 మొత్తం బస్సులు – 400 పల్లెవెలుగు – 233 ఎక్స్ప్రెస్ – 100 సప్తగిరి ఎక్స్ప్రెస్ – 33 సూపర్లగ్జరీలు – 30 ఇంద్ర – 04 రోజువారీ తిరిగే కి.మీ – 1.50 లక్షలు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య – 1.11 లక్షలు గతంలో యాత్రలు, సభలకు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న బస్సులు – 1,292 అప్పట్లో బకాయిలు – రూ4 కోట్లు బకాయిల్లో అప్పట్లో చెల్లించింది.. – 14.64 లక్షలు మాత్రమే ఇప్పుడు పీఎం సభకు తీసుకున్న బస్సులు – 130 బస్సులకు చెల్లించాల్సిన నగదు – రూ.1.10 కోట్లు (సుమారు) చిత్తూరు జిల్లాలో బస్సుల కొరత ప్రయాణికులను వేధించింది. గంటల కొద్దీ బస్టాండ్లలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో జిల్లా నుంచి జన సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా నలుమూలల నుంచి జనాన్ని అమరావతికి తరలించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం గురువారం రాత్రి నుంచి పలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుంది. దీంతో బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. ఫలితంగా సకాలంలో బస్సులు లేక ప్రయాణికులకు ప్రయాణం ప్రయాసగా మారింది. డిపోల వారీగా అమరావతికి పంపిన బస్సుల సంఖ్య డిపో పేరు పంపిన బస్సులసంఖ్య చిత్తూరు వన్డిపో 30 చిత్తూరు టూడిపో 35 పుంగనూరు 35 పలమనేరు 10 కుప్పం 20తిరుపతి బస్సులను కూడా మళ్లిస్తే ఎట్టా? నేను ప్రతిరోజు తిరుపతి–చిత్తూరు వస్తుంటాను. పని చూసుకుని సాయంత్రం 5 గంటల కల్లా తిరుపతికి బస్సు ఎక్కెలా చూసుకుంటున్నాను. డైలీ సాఫీగానే ప్రయాణం సాగుతోంది. 5 నుంచి 10 నిమిషాల్లో బస్సులు దొరికేది. అయితే శుక్రవారం బస్సు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా. బస్సులు అర్ధగంటకు ఒకటి వస్తోంది. అది కూడా బెంగళూరు బస్సు మాత్రమే. అన్నీ బస్సుల్లోనూ సీట్లు ఫుల్గా ఉన్నాయి. నిలబడి వెళదామనుకున్నా కుదరడం లేదు. తిరుపతికి వెళ్లే బస్సులను కూడా మళ్లించడం కరెక్టు కాదు. – విజి, తిరుపతి–చిత్తూరు ప్రయాణికుడు నేడు ఇదే పరిస్థితి..? అమరావతికి జనాన్ని తరలించిన బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునురుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి, ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది. 221 కిలోమీటర్ల మేర పలు రోడ్లు నిర్మాణం కుప్పం–మల్లానూరు రోడ్డుకు అత్యధికం -
పేద రైతుపై టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్సు: పొలం పనులు చేసేందుకు వెళ్లి న పేద రైతు టి.చిన్నరెడ్డెప్ప ఆస్తిపై కన్నేసిన టీడీపీ నాయకులు ఆయన్ని చితకబాది, తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం కంగానెల్లూరు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుడి కుమార్తె టి.శ్యామల పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం మేరకు.. గ్రామానికి సమీపంలో టి.చిన్నరెడ్డెప్పకు సుమారు 88 సెంట్ల పొలం ఉంది. అందులో వ్యవసాయం చే సేందుకు వెళ్లిన టి.చిన్నరెడ్డెప్పపై అదే గ్రా మానికి చెందిన టీడీపీ నాయకులు టి.గంగులప్ప, టి.చెన్నకేశవులు, టి.జయశంకర్ దౌర్జన్యంగా దాడి చేసి గా యపరిచారు. పొలం పనులకు వెళ్లిన ప్రతిసారి గొ డవ చేస్తున్నారని బాధితుడి కుమార్తె ఆవేదన వ్య క్తం చేశారు. కూటమి సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి పలుమార్లు తమపై దాడి చేసి తన తండ్రి చిన్నరెడ్డెప్ప, తల్లి శంకరమ్మను కొట్టి గాయపరిచిన్నారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలం వివాదమై కోర్టులో కేసు సైతం వేసినట్లు చె ప్పింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నరెడ్డెప్ప ను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స చేయి స్తున్నారు. ఫిర్యాదులో పేరొన్న కూటమి నేతల వా రి కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబానికి ప్రా ణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కోరింది. -
తిరుమల: శేషాచలం అడవుల్లో ఎగసిపడుతున్న మంటలు
సాక్షి, తిరుమల: శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా బాలపల్లి డివిజన్, మొగలిపెంట వద్ద మరోసారి మంటలు వ్యాపించాయి. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది యత్నిస్తున్నారు.ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అటవీప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవ్వరు వెళ్లరాదని అధికారులు అంటున్నారు.కాగా, గత ఏడాది కూడా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. కోరుట్ల అటవీ ప్రాంతం, కాకులకొండల్లో భారీగా మంటలు వ్యాపించాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దమైంది. -
ద్విచక్రవాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
కుప్పం: గుడుపల్లి మండలంలో రెండు రోజులుగా జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. మూడు రోజులు క్రితం గుడుపల్లిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసు విచారణలో భాగంగా పొగురుపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చోరీకి గురైన వాహనాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. కుప్పం మండలం మోడల్ కాలనీకి చెందిన సతీష్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా రెండు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపాడు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారు ఢీకొని ఒకరికి గాయాలు పెద్దపంజాణి: చౌడేపల్లి–పుంగనూరు మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద గురువారం ఎలక్ట్రిక్ స్కూటర్ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి(మాజీ సైనికుడు)పెద్దపంజాణి మండలం రాజుపల్లి పంచాయతీ కమ్మినాయునిపల్లి సమీపంలోని హెచ్పీసీఎల్ పంపింగ్ స్టేషన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని, ఎలక్ట్రిక్ స్కూటర్లో స్వగ్రామం చారాలకు బయలు దేరాడు. మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద పుంగనూరుకు వెలుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య వెదురుకుప్పం: కుటుంబ కలహాల నేపథ్యంలో కొండకిందపల్లె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కొండకిందపల్లె గ్రామంలోని హేమలత(29)కు, కార్వేటినగరం మండలం జాండ్లపేట గ్రామానికి చెందిన నరేష్కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నరేష్ విడాకులు ఇవ్వాలని కోరాడు. హేమలత కుటుంబ సభ్యులు ఒక్కటి చెయ్యాలని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోగా మనస్తాపం చెందిన హేమలత గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
సీహెచ్ఓల సమ్మెట
జిల్లా వివరాలు పీహెచ్సీలు: 50 విలేజ్హెల్త్ క్లినిక్లు: 464 సీహెచ్ఓలు: 451 సమ్మెకు ముందు రోజువారీ ఓపీల సంఖ్య(సుమారు): 9,280 కూటమిపైవారంతా పల్లెనాడి పట్టే చిరుద్యోగులు.. నిత్యం పల్లెల్లో పేదలకు వైద్యసేవలు అందించడంలో శ్రమిస్తుంటారు. వారిని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పరిష్క రించమని కూటమి సర్కారుకు విన్నవించారు. పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత శాంతియుత పోరాటం చేశారు. అయినా ప్రయోజనం శూన్యం. దీంతో నిరవధిక సమ్మె సైరన్ మోగించారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): డిమాండ్ల సాధనకు మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, సీహెచ్ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో విలేజ్ హెల్త్ క్లినిక్లు వెలవెలబోతున్నాయి. వైద్య సేవలు అందక పల్లె ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చికిత్స కోసం పీహెచ్సీ, ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులు ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సీహెచ్ఓలు రోడ్డెక్కారు. వినూత్నరీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలతో హెరెత్తిస్తున్నారు. వామ పక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. జిల్లాలో 464 విలేజ్ హెల్త్ క్లినిక్లున్నాయి. ఇందులో 14 రకాల వైద్యపరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారిని సీహెచ్ఓలుగా నియమించింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సీహెచ్ఓలు విశేష సేవలందిస్తున్నారు. అయితే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలిలా.. మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, సీహెచ్ఓలు పల్లెల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్లకు వచ్చే రోగులకు సాధారణ జబ్బులతోపాటు దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్కు సైతం వైద్యపరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. పిల్లలు, గర్భిణులకు పరీక్షలు చేసి, చికిత్స చేసేవారు. రోగికి వచ్చిన వ్యాధిపై ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పీహెచ్సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలి మెడిసిన్ సెంటర్లోని వైద్యులకు ఫోన్ చేసి రోగులతో మాట్లాడించి చికిత్స చేయించారు. దీంతో రోగులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే అవసరం తప్పేది. అలాగే విలేజ్ హెల్త్క్లినిక్కు రాలని రోగులకు ఇంటికెళ్లి పరీక్షలు చేసి, మందులు, మాత్రలు ఇస్తున్నారు. టీకాలు వేయించడంలో ముందుండి పనిచేస్తున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఎన్సీడీ సర్వేలో ఏఎన్ఎంలతో సమానంగా సీహెచ్ఓలుగా కీలకంగా వ్యవహరించారు. కానీ వీరిని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీంతో వీరు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కారు. నిరవధిక సమ్మెలోకి... ఏపీ మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్– కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీహెచ్ఓలు గతనెల 16వ తేదీ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఎదుట శాంతి యుతంగా నిరసన చేపట్టారు. 27వ తేదీ జిల్లా అధికారులకు నోటీసులిచ్చి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీంతో 28వ తేదీ నుంచి గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్లకు సీహెచ్ఓలు వెళ్లడం లేదు. దీంతో పల్లె ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ జబ్బులతో పాటు పిల్లలు, గర్భిణలకు వైద్యం కోసం సూదూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. డిమాండ్లు ఇవీ.. ● ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి. ● పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ● ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. ● క్లినిక్ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి. ● నిర్దిష్ణమైన జాబ్ చాటర్ అందించాలి. ● ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలి. ● హెచ్ఆర్ పాలసీ, ఇంక్రీమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు తదితరాలను త్వరిగతగతిన అమలు చేయాలి. సమ్మెలో సీహెచ్ఓలు జిల్లాలో సీహెచ్ఓల నిరవధిక సమ్మె విలేజ్ హెల్త్ క్లినిక్లు వెలవెల సేవలు అందక పల్లె ప్రజలకు పాట్లు దిగిరాని ప్రభుత్వం డిమాండ్ల సాధనకే సమ్మె జీతభత్యాల విషయంలో ఎన్నో స మస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్తో సమ్మెకు దిగాం. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఈ నిరసనతో ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 28వతేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. – భానుప్రియ, ఉపాధ్యక్షురాలు, ఏపీ మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్ఎ అసోసియేషన్, చిత్తూరు పీఆర్సీ ఇవ్వాలి సీహెచ్ఓల జీత భత్యా లు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన ఎంఎల్ హెచ్ఎపీలను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జీఓ నంబర్ 64 ప్రకారం ఎన్హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్ ఇస్తున్నా మాకు మాత్రం ఇవ్వడం లేదు. – రషీద్, సీహెచ్ఓ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారానికి హామీ ఇవ్వాలి. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. మా డిమాండ్లు పరిష్కరం అయ్యేంత వరకు ఈ నిరవధిక సమ్మె ఆగదు. – మోహనకుమారి, సభ్యురాలు, ఏపీ మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్సీహెచ్ఎ అసోసియషన్, చిత్తూరు -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్కు గాయాలు
పాలసముద్రం : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొనడంతో డ్రైవర్కు తీవ్ర గాయా లు కాగా, ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం పాలసముద్రం మండంలంలో చోటు చేసుకుంది. పల్లిపట్టు ఎస్ఐ రమేష్ కుమార్ కథనం మేరకు.. తిరుపతి నుంచి వెంగళరాజుకుప్పం గ్రామానికి ఏపీ 26 జెడ్ఓ 162 ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. తమిళనాడు వడకుప్పం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బస్సు డ్రైవర్ రామమూర్తి సీట్లో ఇరుకుపోయాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా బస్సులోని మునస్వామి, చంద్రశేఖర్ అనే ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్న్ని బయటకు తీసి, తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పల్లిపట్టు ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు. వ్యక్తికి గాయాలు పుంగనూరు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని చదళ్ల సమీపంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలానికి చెందిన శ్రీనివాసులు(45) తన టమాట పంటకు పుంగనూరు పట్టణంలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి, తిరిగి సోమల వైపు వెళుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ దుర్మరణం పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అండిగానిపల్లికు చెందిన రవితేజ(24) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. రవితేజ స్వగ్రామానికి వచ్చి తన సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పుంగనూరు పట్టణానికి వచ్చాడు. బాలాజీ థియేటర్ వద్ద వెళుతుండగా అతివేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు రవితేజ వాహనాన్ని ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరుగున వచ్చి కుప్పకూలిపోయాడు! పూతలపట్టు (కాణిపాకం): చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఓ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపి, సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ వద్దకు పరుగున వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు మండలంలోని ఓ ప్రైవేటు పాల డెయిరీకి సంబంధించిన లారీకి తమిళనాడు రాష్ట్రం తిరువరం జిల్లా మైలాడవరానికి చెందిన మదిఆలగన్ (52) డ్రైవర్ గా పనిచేస్తున్నారు. డెయిరీ వద్దకు లారీని తీసుకెళుతుండగా మార్గంమధ్యలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వాహనాన్ని ఆపి వేసి సమీపంలోని ప్రైవేటు క్లినిక్ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్ఎంపీ వైద్యుడు ప్రాథమిక చికిత్సకు ప్రయత్నించగా మృతి చెందారని నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రెండు రోజులుగా జ్వరం ఉందని, ఆస్పత్రిలో చూపించుకుని ఇంటికొస్తానని కుటుంబసభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీపీఎస్ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
● కలెక్టరేట్ ఎదుట ఏపీసీపీఎస్ఈఏ నాయకుల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షు లు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వా రు మాట్లాడుతూ రాష్ట్రంలో 3.5 లక్షల సీపీఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. సీపీఎస్ ఉద్యోగు లు ఆర్థికంగా, సామాజికంగా, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. సీపీఎస్ ఉద్యోగులు పరిస్థితిని మే డే రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహించామన్నారు. సీపీఎస్ అసోసియేషన్ జిల్లా నాయకులు సీపీఎస్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరగడమే కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనులకి పొంతన లేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా లో ఆ సంఘం నాయకులు దేవకుమార్, హరిప్రసాద్రెడ్డి, మోహన్కుమార్, నరసింహులు, సుబ్బలక్ష్మి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
కౌండిన్యలో ఏనుగుల సంచారం
బంగారుపాళెం: మండలంలోని మొగిలి దేవరకొండ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దేవరకొండ సమీపంలో గల కౌండిన్య అడవిలో ఏనుగులు తిరుగుతున్నాయన్నారు. బుధవారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనిచెరువులో ఏనుగులు నీటిలో సేదతీరి అడవిలోకి వెళ్లిపోయాయి. తిరిగి రాత్రి మొగిలి గ్రామంలోని శ్రీనిఫుడ్ ఫ్యాక్టరీ వద్దకు రెండు ఏనుగులు ప్రవేసించి హల్చల్ చేయడంతో సె క్యూరిటీ, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఏ నుగుల రాకను గుర్తించి కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగులు దేవరకొండ ప్రాంతంలో తి రుగుతున్నాయని తెలిపారు. ఏనుగులు సంచారంతో అడవిలోకి ఎవరూ వెళ్లరాదని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
● కోట్ల విలువ చేసే రాతి సంపద దోపిడీ ● కూటమి అండతో విచ్చలవిడిగా రవాణా ● తిరుమండ్యం కొండలో అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు ● భారీ పేలుళ్లతో బీటలు వారిన నివాసాలు ● దుమ్ము ధూళితో దిగుబడి తగ్గుతోందంటున్న రైతన్నలు
అనుమతి గోరంత.. తవ్వేది అంతా..! అన్నట్టుగా తయారైంది వడమాలపేట మండలంలో మైనింగ్ లీజు పరిస్థితి. తిరుమండ్యం గ్రామంలో 7.5 ఎకరాలకు అనుమతి తీసుకుని దాదాపు పది ఎకరాలకుపైగా తవ్వేసినా ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యంవడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తిరుమండ్యం గ్రామంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతికి మించి కొండను పిండి చేస్తూ విలువైన రాతి సంపదను కొల్లగొడుతోంది. తిరుమండ్యం గ్రామ లెక్కదాఖలాలో సర్వే నం.175లో సుమారు 116 ఎకరాల గుట్ట పోరంబోకు ఉండగా.. అందులో 2.96 హెక్టార్లు (సుమారు 7.5 ఎకరాలు) మైనింగ్ నిమిత్తం లీజుకు తీసుకున్నారు. కొండను తవ్వి నెలకు సుమారు 45 వేల టన్నుల వరకు తరలిస్తున్నారు. ఇప్పటికే వారికి ఇచ్చిన పరిధిని దాటేశారు. దాదాపు 10 ఎకరాల మేరకు విస్తరించి తవ్వకాలు జరుపుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. క్వారీదారుకు అధికార పార్టీ నేతల అండ ఉండడంతో మైనింగ్ శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెట్టేస్తున్నారు. ‘మేము తనిఖీలు చేస్తుంటాం.. మీరు తరలిస్తూ ఉండండి’ అన్నచందంగా పరస్పర ఒప్పందంతో ఈ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక లోడ్డుకు బిల్లు చూపి.. పది లోడ్ల కంకర అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం. పడగవిప్పుతున్న పర్యావరణ కాలుష్యం ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంటే మరోవైపు సమీప గ్రామస్తులను పర్యావరణ కాలుష్యం గుదిబండగా మారింది. ఈ కార్వీకి 200 మీటర్ల దూరంలో దివంగత మహానేత వైఎస్సార్ ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన 25 నివాసాలు ఉన్నాయి. క్వారీలో రాళ్లను పేల్చడానికి వాడాల్సిన నమోదుకంటే ఎక్కువ నమోదులో పేలుడు పదార్థాలు వాడడంతో ఆ ప్రకంపనలకు సమీప ప్రాంతాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే 20 ఇళ్లు బీటలు వారిపోయాయి. రాత్రి పూట కంటిపై కనుకు లేకుండా పోతోందని స్థానిక భయాందోళన చెందుతున్నారు. క్వారీకి చుట్టుపక్కల సుమారు 300 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రైతులు మామిడి, వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. ఆ పంటలపై క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పడడంతో దిగుబడి తగ్గిపోతోంది. సుమారు 20 ఎకరాలలో దిగుబడి దారుణంగా పడిపోయింది. అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తవ్వేసి..మింగేసి! లీజు తీసుకున్నవారికి పదేళ్లవరకు కంకర తరలింపుకు అనుమతి ఉంటుంది. కేటాయించిన విస్తీర్ణములో మాత్రమే రాళ్లను తవ్వి తరలించాలి. అలా తరలించే రాళ్లకు క్వారీదారు టన్నుకు రూ.150 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. అదే టన్నుకు బయట రూ.2,100 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. నెలకు 45 వేల టన్నుల రాళ్లను తరలిస్తుండగా అందులో 20 నుంచి 30 శాతానికి మాత్రమే రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల సొమ్ము క్వారీదారు జేబుకు చేరుతోంది. అందులో అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం. పంట దిగుబడి రావడం లేదు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో ఒక ఎకర మామిడి తోట వేసుకోగా, మిగిలిన భూమిలో వరి సాగు చేసుకొని జీవనం సాగించేవాడ్ని. క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పంటలపై పడి దిగుబడి చాలావరకు తగ్గిపోయింది. మామిడి చెట్లకు పూత రావడం లేదు. వచ్చే పూత కూడా రాలిపోతోంది. నష్టాలపాలవుతున్నాను. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. –ధనంజయులురెడ్డి, తిరుమండ్యం -
తాగునీరు.. తాగ లేరు!
● జలం..గరళం ● కొళాయిల్లో కలుషిత నీరునగరి : మున్సిపల్ ప్రజలకు మున్సిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరు గురువారం ఏకాంబరకుప్పం పరిధిలో రంగు మారి పింక్ కలర్లో రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ నీటిని ఎలా వాడాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా డైయింగ్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే హానికర రసాయన రంగునీటి కారణంగా ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీంతో బోర్లలో వచ్చే నీరు తాగడానికి వీలుపడదు. మున్సిపాలిటీ వారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి సరఫరా చేసే నీరే అందరూ వినియోగించుకుంటున్నారు. అయితే కొళాయిల్లో వచ్చే నీరు కూడా రసాయన రంగుల్లో వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదేమీలేక... ప్రైవేటు వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. -
పోరంబోకు భూమి ఆక్రమణ
గంగాధరనెల్లూరు: మండలంలోని వింజం రెవెన్యూ నాగూరుపల్లె సర్వే నంబర్ 893 /2లో 7.37 ఎకరాల పోరంబోకు భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి ఎన్నో తరతరాలుగా చుట్టుపక్కల గ్రామస్తులు పశువుల మేత కోసం వాడుకునేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కూటమి నేతల దీనిపై కన్ను వేశారు. నకిలీ పట్టా సృష్టించి, దాన్ని ఆన్లైన్లో పొందుపరిచి అదే గ్రామానికి చెందిన అమరావతమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశారని, తరువాత అమరావతమ్మ నుంచి తన కోడళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని, ప్రస్తుతం ఆ భూమిలో అమరావతమ్మ కుటుంబసభ్యులు భారీ యంత్రాలతో చదును చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో తాము అడ్డుకోగా తమకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల అండదండలున్నాయని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. పలుమార్లు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టక పోగా ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. సదరు భూమిపై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయగా మండల రెవెన్యూ కార్యాలయం నుంచి సదరు సర్వే నంబర్పై ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదని, ఎవరికి ఎలాంటి పట్టా ఇవ్వలేదని సదరు సర్వే నంబర్ పోరంబోకు భూమి అని స్పష్టం చేశారు. కాగా సదరు భూమిపై అమరావతమ్మ కుటుంబ సభ్యులకు హక్కులు ఎలా కల్పిస్తారని, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతూ వారి మాటే చెల్లుబాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్రీడలతో ఉజ్వల భవిత: డీఎస్డీఓ బాలాజీ చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) బాలాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెసానిక్ మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలవులను వృథా చేయకుండా క్రీడా శిబిరంలో క్రీడల్లో శిక్షణ పొందాలన్నారు. క్రీడల్లో పట్టు సాధిస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త జయప్రకాష్నాయుడు, ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ రీజినల్ మేనేజర్ నాగరాజు, షణ్ముగం, రాజా, కోదండరామస్వామి తదితరులు పాల్గొన్నారు. యువకునిపై హత్యాయత్నం ● గంగమ్మ చాటులో దాడి చేసిన ఓ గ్యాంగ్ ● నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పలమనేరు: పట్టణంలో గంగమ్మ చాటు సందర్భంగా ఓ యువకునిపై కొందరు మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పలమనేరు సీఐ నరసింహరాజు కథనం మేరకు.. పట్టణానికి చెందిన గాంధీనగర్ వాసి సునీల్కుమార్(27) పాతపేటలోని ఓ గ్యాస్గోడౌన్లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గంగమ్మ జాతర చాటింపు సందర్భంగా సునీల్కుమార్ ఇంటికి వెళుతుండగా అతన్ని టార్గెట్ చేసిన కొందరు మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతన్ని స్థానికులు ఇక్కడి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మొండోళ్ల కాలనీకి చెందిన కళ్యాణ్, అతని సన్నిహితులైన పవన్, సాయి, హరి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడి చేసినట్టు సీఐ తెలిపారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని, వీరితోపాటు మరికొందరు ఉన్నారని తెలిపారు. ఈ ఘటన పాతకక్షల కారణంగా జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పట్టణంలో రౌడీయిజం సహించే ప్రసక్తే లేదని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. -
సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పేరు గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుగా మారింది. త్వరలో ప్రధాన కార్యాలయం నుంచి బ్రాంచ్ కార్యాలయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్ల పేర్లను మార్చనున్నా రు. ఉమ్మడి జిల్లాతోపాటు కృష్ణా జిల్లాలో 264 బ్రాంచ్లు ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఒకప్పటి శ్రీవెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, కనకదుర్గ గ్రామీణ బ్యాంకు కలిసి 2006లో సప్తగిరి గా మారాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా సేవలు అందించనుంది. పౌల్ట్రీరంగంతో ఉపాధి కల్పనకు చర్యలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో పౌల్ట్రీ రంగంతో ఉ పాధి కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతు లు వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్ర మ, పౌల్ట్రీ రంగాల్లోని ఉపాధి అవకాశాలను స ద్వియోగం చేసుకోవాలన్నారు. ఆ అవకాశాల తో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో ఉ పాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ముందుగా పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన రైతులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు పౌల్ట్రీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సా యం బ్యాంకర్లతో అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన డీపీ ఆర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులను సూచించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతన వెతలు గుడుపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న 3,618 మందికి ఏడాదిగా జీతాలు అందలేదని ఆ యూ నియన్ ఉపాధ్యక్షుడు నౌషద్ ఖాన్ పేర్కొన్నారు. 2024 సంవత్సరం మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అందలేదన్నారు. పెండింగ్ జీతాలు చెల్లించి, వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి, ఉన్నతా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. -
విద్యాశాఖ ఏడీ–1గా సుకుమార్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ–1గా యూజే సుకుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో విధులు నిర్వహించిన ఆయన చిత్తూరు విద్యాశాఖ ఏడీ 1గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన విధులు స్వీకరించిన అనంతరం డీఈఓ వరలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్ల సమస్యల పరిష్కారానికి, ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఎప్పటికప్పుడు అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయన్ని ఏడీ–2 వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్లు సత్య, వీజీ రమణ, సిబ్బంది మురళి, గోపాల్ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుంబుర తీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
జిల్లాలో 201 రిజిస్ట్రేషన్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని చిత్తూరు ఆర్వో మినహాయించి మిగిలిన 7 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొ త్తం 201 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా రూ.75.88 లక్షలు ఆదాయం వచ్చింది. చి త్తూరు రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి, సబ్రిజిస్ట్రార్ ఆనంద్తో కలిసి డ్యాకుమెంట్లను కోనుగోలుదారులకు అందజేశారు. చిత్తూరు రూరల్లో 33 డ్యాకుమెంట్లు జరగగా రూ.10.29 లక్షలు, పలమనేరు 32 డ్యాకుమెంట్లు రూ.14.39 లక్షలు, బంగారుపాళెం 19 రూ.10.93 లక్షలు, నగరి 25 రూ.21.94 లక్షలు, పుంగనూరు 36 రూ.6.91 లక్షలు, కుప్పంలో 36కు రూ.7 లక్షలు, కార్వే టినగరం 24 రూ.4.33 లక్షలు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. నేటి నుంచి రేషన్ పంపిణీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. రేషన్కార్డుదారులకు పంపిణీ కోసం ప్రభుత్వం జిల్లాకు 8,500 మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. -
చినతిరుమల.. కీలపట్ల!
● మే 5నుంచి కోనేటిరాయుని వార్షిక బ్రహ్మోత్సవాలు ● అంత్యంత చారిత్రక నేపధ్యం ఉన్న పురాతన ఆలయమిది ● ఇక్కడి మూలవిరాట్టు తిరుమల మూలమూర్తిని పోలిఉంది ● తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలలో కీలపట్ల ప్రస్థావన ● జిల్లానుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి సైతం భక్తులు పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చారిత్రిక వైష్ణవాలయాల్లో తిరుమల వేంకటేశ్వరునితోపాటు పలమనేరు నియోజవర్గంలోని గంగవరం మండలం కీలపట్లలో వెలసిన కోనేటిరాయుని ఆలయానికి చినతిరుమలగా పేరుంది. తిరుమలకు వెళ్లలేని పేద భక్తులు కీలపట్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలోని మూలవిరాట్టు విగ్రహం ఎలా ఉందో ఇక్కడి ఆలయంలోనూ స్వామివారి మూలవిరాట్ అలాగే ఉంటారని, తిరుమల స్వామివారే ఇక్కడున్నారని భక్తుల నమ్మకం. తిరుమల తరహాలో ఇక్కడి ఆలయంలోనూ ఏటా స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదీ ఆలయ చరిత్ర.. కీలపట్లలోని మూలవిరాట్టు కోనేటిరాయుని(శ్రీ వేంకటేశ్వరస్వామి) విగ్రహాన్ని భృగుమహర్షి ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. ఆపై చోళులు, పల్లవులు, విజయనగర రాజుల ఏలుబడిలో విశేష పూజలందిచారని తెలుస్తోంది. అప్పట్లో మహ్మదీయుల దండయాత్రలకు భయపడిన గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని కోనేటిలో దాచి ఉంచినందునే స్వామివారికి కోనేటిరాయునిగా పేరొచ్చినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చంద్రగిరిని పాలించిన సామంతులు బోడికొండమ నాయుడుకి కలలో స్వామి వారు కనిపించి కోనేటిలోని విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించమని చెప్పినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 4 నుంచి కోనేటి రాయుడి ఉత్సవాలు మే 4న సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది. మే 5న ధ్వజారోహణం, అదేరోజు సాయంత్రం పెద్దశేషవాహనం, 6న చిన్నశేషవాహనం, హంసవాహనం, మే 7న సింహవాహనం, ముత్యపుపందిరి, 8న కల్పవృక్ష వాహనం, 9న మోహినీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవం, గరుడవాహన సేవలు జరుగుతాయి. మే 10వ తేదీ ఉదయం హనుమంత వాహనసేవ, వసంతోత్సవం, గజవాహనసేవ, 11న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 12న స్వామివారి రథోత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మూలవిరాట్లు ఒకేపోలిక కీలపట్లలోని స్వామివారు, తిరుమలలోని స్వామివార్ల మూలవిరాట్లు ఒకే తరహాలో ఉంటారని ప్రతీతి. కోనేటి రాయుని విగ్రహంపై కటి వరద హస్తాలు, శంకు చక్రాలు, విగ్రహం చాతిపై శ్రీదేవి, భూదేవి ముద్రలతో అచ్చం తిరుమలలో స్వామివారిలాగే దర్శనమిస్తున్నారు. -
శ్రీనిఫుడ్ ఫ్యాక్టరీలో ఏనుగుల హల్చల్
బంగారుపాళెం: మండలంలోని మొగిలి శ్రీనిపుడ్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఏనుగులు ప్రవేశించి హల్చల్ చేశాయి. ఫ్యాక్టరీ సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి గౌనిచెరువు మీదుగా రెండు ఏనుగులు ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. సెక్యూరిటీ, ఫ్యాక్టరీ సిబ్బంది ఏనుగుల రాకను గురించి అరుపులు, కేకలు వేయడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. బుధవారం సాయంత్రం రెండు ఏనుగులు గౌనిచెరువులో దిగి సేద తీరాయని, అటు తరువాత అడవిలోకి వెళ్లి తిరిగి సమీపంలోని ఫ్యాక్టరీలోకి వచ్చాయన్నారు. మూడు, నాలుగు సార్లు ఏనుగులు ఫ్యాక్టరీలోకి వచ్చాయని సిబ్బంది తెలిపారు. -
అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
శ్రీరంగరాజపురం : అడవిలోని పెద్ద చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన సంఘటన మండలంలోని రాణిపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాణిపురం గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు బీడీ తయారీకి ఉపయోగించే తూనీక ఆకుల కోసం బుధవారం పుల్లురు అడవికి వెళ్లారు.ఆ సమయంలో పుళ్లూరు అడవిలోని పెద్ద చెరువు వద్ద ఎముకలు బయటపడిన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8 గంటల సమయానికి పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహం ఉన్న స్థలానికి చేరుకొని పరిశీలించి మృతి చెందినది పురుషుడిగా గుర్తించారు. అతను చనిపోయి దాదాపు మూడు నుంచి ఐదు నెలలు క్రితమే మృతి చెంది ఉండవచ్చునని చెబుతున్నారు. ఆత్మహత్యా? లేక ఎవరైన హత్య చేశారా అనే విషయాలు విచారణలో తేలనున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
వరసిద్ధుడికి వెండి, బంగారు ఆభరణాలు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారికి బుధవారం ఓ భక్తుడి కుటుంబం వెండి, బంగారు ఆభరణాలను సమర్పించింది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు చంద్రమౌళి గురుక్కల్, సుబ్బరత్నమ్మ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఆభరణా లను ఈఓ పెంచలకిషోర్కు అందజేశారు. 200 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, హారం, చైన్ ముక్కు పుడకలు, 500 గ్రామల వెండి బిస్కెట్ ఇచ్చారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని దాత కుటుంబ సభ్యులు రాఘవేంద్ర గురుకల్, ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, వాసు, రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం కమిటీలో జిల్లా నేతలు తిరుపతి సిటీ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీని బుధవారం ప్ర కటించారు. ఇందులో తిరుపతి జిల్లాకు చెంది న చిట్టేటి హరికృష్ణ సెక్రటరీగా, కామిరెడ్డి మోహన్రెడ్డిని జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన జి.సుధాకర్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విధాన పరిషత్ ఏడీగా సునీత చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్ ఏడీగా సునీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కావలి ఆస్పత్రిలో ఏఓగా పనిచేస్తున్న ఈమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైద్య విధాన పరిషత్ ఏడీగా బాధ్యతలను స్వీకరించారు. రిటైర్డు పోలీసులకు సన్మానం చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసుశాఖలో ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను ఎస్పీ మణికంఠ ఘనంగా సన్మానించారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో జరిగిన సమావేశంలో పోలీసుశాఖలో రిటైరైన మనోహరన్ (ఏఎస్ఐ), సుధాకర్ పిల్లై (ఏఎస్ఐ), మహ్మద్ రఫీ (హెడ్ కానిస్టేబుల్), శివాజీ (ఏఆర్–హెడ్ కానిస్టేబుల్)ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. పదవీ విరమణ చేసినప్పటికీ పోలీసుశాఖ నుంచి ఎప్పుడూ సహకారం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీ మహబూబ్ బాషా, పోలీసు యూనియన్ అధ్యక్షుడు ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశేష కృషి ● జన్యు సామర్థ్యపు విత్తన కోడెల ఉత్పత్తిలో ముందడుగు ● సంకరజాతి పశువుల అభివృద్ధే లక్ష్యంగా పరిశీలన పథక కేంద్రం శాస్త్రవేత్తల కార్యాచరణ
లక్ష్య సాధన దిశగా కేంద్రం జిల్లాలో 2013–14 కేంద్రం ప్రారంభం నుంచి ఈ పథకం లక్ష్యం కోసం అధికారులు కృషి చేస్తున్నారు. మంచి పాడి వృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇ ప్పటివరకు 305 విత్తనపు కోడెలను పరీక్షకు పెట్టా రు. అలాగే పాల దిగుబడికి 38,807 ఆవులను న మోదు చేశారు. 420 హెచ్జీఎం కోడె దూడలను ఉ త్పత్తి చేశారు. పాడి పంటలు..వ్యవసాయ కుంటుబాలకు రెండు కళ్లు. పంట సాగులో నష్టమొస్తే కర్షకులను పాడి పశువులు కామధేనువుల్లా ఆదుకుంటున్నాయి. అలాంటి పాడి సంపద ఉత్తమంగా ఉంటే రైతులు ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత నిస్తాయి. ఇందుకు ఉత్తమ విత్తన కోడెల ఎంపికే లక్ష్యంగా చిత్తూరు కేంద్రంగా పశుసంతతి పరిశీలన కేంద్రం ఏర్పాటు అయ్యింది. ఈ కేంద్రం ఉత్తమ కోడెల ఎంపికలో లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. అత్యుత్తమ విత్తన కోడెలు, ఆవులను వృద్ధి చేసి, పాడి సమృద్ధికి పాటుపడుతోంది. అన్నదాతలకు అండగా నిలుస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): పాల దిగుబడి పెంపే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, దృఢమైన సంకరజాతి పశు సంపదను ఉత్పత్తిలో జిల్లాలోని పశు సంతతి పరిశీల న పథక కేంద్రం ప్రధాన భూమిక పోషిస్తోంది. వీర్య కేంద్రాల్లోని విత్తన కోడెలను పరిశీలించి, తద్వారా అ త్యధిక జన్యుసామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉ త్పత్తి చేయడంలో ఈ కేంద్రం ముందు వరుసలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్ర మలో మేలు జాతి సంతతిని పెంచుతూ పాడి పరిశ్రమాభివృద్ధికి కృషిలో గుర్తింపు పొందింది. విత్తన కోడెలను ఉత్పత్తి చేయడంలో లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఉత్తమ కోడెల ఎంపిక ఇలా.. రాష్ట్రంలోని నంద్యాల, బనవాసి, విశాఖపట్నంలోని వీ ర్య కేంద్రాలతోపాటు దేశంలోని పలు వీర్యకేంద్రాల్లోని విత్తనపు కోడెల నుంచి వీర్యాన్ని సేకరించి, ఆ వీర్య నాళికలను చిత్తూరులోని పశు సంతతి పరిశీలన పథక కేంద్రానికి పంపుతారు. ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల పశువులకు ఆ వీర్యనాళికలను కృత్రిమ గర్భధారణ చేస్తారు. ఆ పశువు ఈ నిన దూడలను పర్యవేక్షిస్తారు. ఆ పేయదూడలు పెద్ద వై ఈనిన తరువాత పాలిచ్చే సమయంలో వాటి పాల దిగుబడిని కొలిచి, విత్తనపు కోడెల సామర్థ్యాన్ని లెక్కి స్తారు. వీటిలో మంచి పాల దిగుబడి వచ్చిన పశుసంపద జననానికి కారణమైన కోడెను నిరూపితమైన కో డె(ప్రూవింగ్ బుల్)గా గుర్తిస్తారు. ఈ కోడెకు పుట్టిన పేయదూడలను ఉత్తమ ఆవులు(ఎలైట్ డాటర్) అంటారు. ఇలా ఈ కేంద్రంలో ఏటా సుమారు 20 విత్తన కోడెల వీర్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో మంచి ధృఢమై న 2–4 కోడెలను ఎంపిక చేస్తారు. అలాగే పాల దిగుబడిని కొలవడం ద్వారా అత్యధిక పాల దిగుబడి ని చ్చే ఆవులను గుర్తించడంతోపాటు ప్రూవింగ్ బుల్కు పుట్టిన కోడె వీర్యాన్ని, పేయ దూడలకు గర్భ ధారణ చేయించి, వాటికి పుట్టిన పశుసంపదను అత్యుత్తమ పశుసంపదగా పరిగణిస్తారు. మగ దూడలైతే హెచ్జీఎం(హైజెనిటిక్ మెరిట్) విత్తన కోడెలుగా పరిగణిస్తా రు. ఈ హెచ్జీఎం విత్తను కోడెలను ప్రభుత్వం రైతు లకు మంచి ధర చెల్ల్లించి, కొనుగోలు చేసి, దేశంలోని వీర్య కేంద్రాలకు సరఫరా చేస్తుంది. సంవత్సరం పరీక్షకు పెట్టిన పాలదిగుబడి ఉత్పత్తి చేసిన విత్తన కోడెల నమోదు చేసిన హెచ్జీఎం కోడె సంఖ్య ఆవులు దూడల సంఖ్య2013–14 20 567 0 2014–15 25 3129 9 2015–16 30 925 25 2016–17 30 1255 49 2017–18 30 4130 55 2018–19 18 2431 36 2019–20 18 2034 0 2020–21 20 3635 10 2021–22 22 6555 31 2022–23 23 6041 108 2023–24 23 3584 79 2024–25 23 4518 49 భవిష్యత్ దృష్ట్యా... పాల నమోదు కార్యక్ర మం ద్వారా అధిక పాల దిగుబడినిచ్చే ఉత్తమ ఆవులను గుర్తిస్తున్నాం. దేశంలోని అన్ని వీర్య కేంద్రాల్లోని సంకర జాతి జెర్సీ–సహివాల్ జాతి విత్తనపు కోడెలను పరీక్షిస్తున్నాం. అత్యధిక జన్యుసామర్థ్యం కలిగిన కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నాం. రాబోవు తరాల్లో సంకరజాతి జెర్సీ ఆవుల పాడి ఉత్పాదక జన్యు సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. – వాసు, జిల్లా పశుసంతతి పరీశీలన కేంద్ర డీడీ, ప్రాజెక్టు కోఆర్డినేటర్, చిత్తూరు ఇదీ ఉద్దేశం.. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ద్వారా సంకరజాతి జెర్సీ ఆవుల్లో ఎన్డీపీ–1 స్కీం కింద పశుసంతతి పరిశీలన పథకాన్ని 2013–14 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది 2018–19 వరకు కొనసాగింది. తరువాత 2019–20 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) కింద అమలు చేస్తున్నారు. సంకర జాతి జెర్సీ ఆ వుల్లో జన్యుపర్యంగా పాడి ఉత్పాదక శక్తిని పెంపొందించడం, వీర్య కేంద్రంలో ఉన్న విత్తనపు కోడెలను (బ్రీడింగ్ బుల్స్) పరిశీలించి, వాటి ద్వారా అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చిత్తూరు కేంద్రంగా... చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ సమీపంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తోంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెర్సీ–సహివాల్ జాతి సంకర ఆవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంకర ఆవులు మంచి రోగ నిరోధక శక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి పాల దిగుబడికి పేరు గాంచాయి. అందుకే రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. -
ఉద్యోగులపై కపట ప్రేమ
చిత్తూరు కార్పొరేషన్: కూటమి సర్కారు ఉద్యోగులపై కపట ప్రేమ చూపుతోందని వైఎస్సార్సీపీ ఉద్యోగు లు, పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. అధికారం కోసం ఉద్యోగులకు అ డ్డమైన హామీలిచ్చి తీరా వాటిని విస్మరించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలో వచ్చి 11 నెలలవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇ చ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు చెప్పాలన్నారు. ప్రతినెల సక్రమంగా జీతాలు కూడ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ఉ ద్యోగులకు అన్ని రకాలుగా కలిపి మొత్తం రూ.30 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు. సీపీఎస్ రద్దు ఎప్పుడు చేస్తారోనని 3 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు వేచి చూస్తున్నాయన్నారు. పీఆర్సీ కమిషన్ తీసి వేశారని, ఉద్యోగులకు మూడు డీఎలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అన్ని సంఘాలను కలిసి సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మెదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసాద్రెడ్డి, నాయకులు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్ నెల ఆఖరు వరకు గడువు ● ఇప్పటికీ 1,05,185 మందికి పెండింగ్ ● వలస కూలీలు, ఉద్యోగులే పెండింగ్లో అధికం
కాణిపాకం: ఈకేవైసీ గడువు మళ్లీ పొడిగింపు జరిగింది. పేదలకు పరేషాన్ తీరింది. ఈ ప్రక్రియ గడువు బుధవారంతో ముగుస్తుందని టెన్షన్ పడిపోయారు. వచ్చే నెల నుంచి సరుకులు కట్ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ ఈకేవైసీ గడువు జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో కార్డుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల మంది పైగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎక్కడైనా చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఫలితం శూన్యమవుతోంది. వలస కూలీలు, ఉద్యోగులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన జాబితాలో అధికంగా ఉన్నారని అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 1,339 రేషన్ దుకాణాల పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 16,70,470 మంది సభ్యులున్నారు. పారదర్శకత పేరుతో జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నవీకరిస్తున్నారు. మృతులు ఉండడంతోపాటు అనర్హులైన పలువురు ఉద్యోగులు రేషన్ పాందుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈకేవైసీ అధికంగా పెండింగ్ ఇక్కడే.. జిల్లాలో కుప్పం, వి.కోట, పలమనేరు, చిత్తూరు, నగరి, పుంగనూరు, రామకుప్పం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అధిక శాతం మంది బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సరుకు రాదని.. గడువు ముగుస్తుండడంతో చాలా మంది కార్డుదారులు పనులు మానుకుని ఈకేవైసీ కోసం క్యూ కట్టారు. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగు పరుగున వస్తున్నారు. మిగిలిన కొంత మంది అవగాహన లోపం కారణంగా రాలేకపోతున్నారు. ఒక రోజు పని వదులుకుంటే కష్టమని కొంతమంది, రాలేని పరిస్థితుల్లో మరికొంత ఉన్నారు. వీరికి ఉన్న చోటే ఈకేవైసీ చేసుకోవచ్చనే విషయం తెలిక ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు, బయట రాష్ట్రాల్లో చదివే కళాశాల విద్యార్థులు సైతం ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. వీరితోపాటు మృతులు, కదలేని వృద్ధులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కలిపి 75 వేల మందికి పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 0–5 పిల్లలు 26,628 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని గుర్తించారు. వీరిలో ఐదేళ్లు దాటిన పిల్లల తల్లిదండ్రులకు ఈకేవైసీ ప్రక్రియ తలనొప్పిగా మారింది. మండుటెండలో పిల్లలను వెంట పెట్టుకుని ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో..ఆ ప్రాంతాల్లోనే ఈకేవైసీ చేయించుకోవాలని కొంత మంది డీలర్లు మెలిక పెడుతున్నారు. రేషన్కు ప్రతి సభ్యుడికీ ఈకేవైసీ తప్పనిసరి మెలిక.. అదీ ఏప్రిల్ 30 వరకే గడువు.. ఆపై సరుకులు కట్.. వెరసి.. రేషన్కార్డులు పరేషాన్ కావాల్సిన పరిస్థితి. సుదూర ప్రాంతాల్లోని పిల్లలు.. కదలలేని వృద్ధులు.. వేలి ముద్రలు పడని చిన్నారులు ఏమి చేయాలని పేదలు ఖంగారు.. ఎట్టకేలకే మళ్లీ ఈకేవైసీ గడువు పొడిగింపుతో వారి పరేషాన్ తీరింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా సమాచారం... చౌకదుకాణాలు – 1,339రేషన్కార్డుల సంఖ్య – 5.40 లక్షలు కార్డులోని సభ్యులు – 16,70,470ఈకేవైసీ చేయించుకున్నవారు – 15,37,402పెండింగ్లోని 0–5 వయస్సుపిల్లలు – 26,628 80 ఏళ్లు దాటిన వృద్ధులు – 1,255 చేయించుకోవాల్సి వారు మొత్తం – 1,05,185 ఈకేవైసీ కొత్తకార్డులకు శాపమా? ఈకేవైసీ ప్రక్రియను సాకుగా చూపి, కూటమి ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల మంజూరును వాయిదా వేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో కొత్త రేషన్కార్డులకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రకటించింది. సంక్రాంతికి కొత్త కార్డులని, ఆ తర్వాత ఉగాదికని చెప్పింది. అప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో కూటమి నేతలు కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేక గుటకలు మింగుతున్నారు. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ పొడిగింపుతో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ఆందోళన వద్దు ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జూన్ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ విషయాన్ని గమనించి ఇంత వరకు ఈకేవైసీ చేయించుకోని వారు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డీలర్లు ఈప్రక్రియను పూర్తిచేసేలా చూడాలి. కార్డుదారులను ఇబ్బంది పెట్టవద్దు. – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు మార్చి నుంచి ప్రారంభం ఈకేవైసీ ప్రక్రియ గత మార్చి 19వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల్లో ప్రారంభమైంది. తొలుత మార్చి 23 వరకు గడువు పెట్టారు. ఆ తర్వాత నెలాఖరు వరకూ పొడిగించారు. అ ప్పటికీ ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన కార్డుదారులు పెద్ద సంఖ్యలో మిగిలిపోవడంతో ఈకేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 15, 37,402 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. మరో 1,05, 185 మంది ఈ ప్రక్రియ పూర్తి చేయించుకోవాల్సి ఉంది. -
నేడు పింఛన్ల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు పింఛన్ల పంపిణీపై క్షేత్ర స్థాయి అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే ఒకటో తేదీన జిల్లాలోని 2,64,520 మంది లబ్ధిదారులకు రూ.112.80 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అలసత్వం వహించకుండా పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ నగదు అందజేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. గత నెలల్లో వివిధ కారణాలతో పింఛన్ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం నగదు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాంతిభద్రతల పటిష్టతకు చర్యలు పుత్తూరు: జిల్లాలో శాంతిభద్రతల పటిష్టతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్రాజు తెలిపారు. బుధవారం పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వడమాలపేట, నారాయణవనం, పుత్తూరు స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గంజాయి, సారా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, శాంతిభద్రతలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకించి ఈగల్ టీమ్ను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు జాతీయ రహదారుల్లో నిఘా వ్యవస్థను పెంచుతున్నట్లు తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, బీట్ సిస్టమ్ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎస్హెచ్ఓల ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తూ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.రవికుమార్, సీఐ కెబీ సురేంద్రనాయుడు, ఎస్ఐ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● జిల్లాలో ఈ నెల 4న పరీక్ష ● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహణపై బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నీట్ నిర్వహించాలన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మే 4వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను సంబంధిత అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయండి పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో, ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ల భద్రత నడుమ కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించాలని చెప్పారు. పరీక్ష నిర్వహించే సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా, మౌలిక వసతుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిర్దేశించిన ప్రాంతంలో తల్లిదండ్రులు వేచి ఉండేందుకు షామియానా, నీటి వసతులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సరైన సమయానికి చేరుకునేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విభిన్నప్రతిభావంతులకు వీల్చైర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర వైద్యసేవలకు అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసు తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను ఆర్ముడ్ పోలీసుల ఎస్కార్ట్తో పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేయించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, డీఈఓ వరలక్ష్మి, ఆర్డీఓ శ్రీనివాసులు, పీవీకేఎన్ కళాశాల పరీక్షల విభాగం కోఆర్డినేటర్ శరవణ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి రోజా విస్తృత పర్యటన
నగరి : ప్రారంభోత్సవాలు, వేడుకలు అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం అరక్కోణం పనంబాకంలో నగరి పట్టణానికి చెందిన వారు నూతనంగా నిర్మించిన ఏజేఎస్ కళ్యాణ మండపాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం తిరుపతి పద్మావతిపురం సుబ్బయ్య ఫంక్షన్ హాల్లో స్విమ్స్ అమర్ కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. వడమాలపేట మండలం పూడి గ్రామంలో వైస్ సర్పంచ్ రాజశేఖర్ గారి కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం నిండ్ర మండలం ఎక్స్ సర్పంచ్ రేవతి కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.