Chittoor
-
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సర్కా రు బడుల్లో చదువుతున్న పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు సాధించేలా చర్యలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే దక్కింది. ప్రతి పేద విద్యార్థి అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ఆశయంతో మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేశారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ చేసే ఒక్కొక్క ట్యాబ్, రూ.15,500 విలువ చేసే బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి విద్యార్థికి రూ.33 వేల విలువ చేసే లబ్ధిని చేకూర్చారు. పాఠాలు బోధించే అన్ని సబ్జెక్టుల టీచర్లకు సైతం ట్యాబులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆ ట్యాబుల్లో 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ను సైతం లోడ్ చేసి అందజేశారు. ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి పంపిణీ చేశారు. ఈ ట్యాబ్లను అందుకున్న విద్యార్థులు తమ విద్యాసామర్థ్యాలను పెంచుకుని ప్రస్తుతం విద్యలో ముందడుగు వేస్తున్నారు.గత వైఎస్సార్సీపీ సర్కారులో ఉచితంగా అందజేసిన ట్యాబ్ల వివరాలు.. -
ఇంటర్ అడ్మిషన్ల సంగతేంటి?
● మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు ● అడ్మిషన్ల ఊసే ఎత్తని ఇంటర్మీడియట్ అధికారులు ● నేడు జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం ● వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగుపడ్డ విద్యాసంస్థలు చిత్తూరు కలెక్టరేట్ : జూనియర్ కళాశాలలకు ఈ నెల 1వ తేదీతో వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందే మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను ఇంటర్మీడియట్ అధికారులు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చేరవేశారు. సోమవారం నుంచి కళాశాలలు పున: ప్రారంభం కానుండడంతో నూతన అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టారు. ఇటీవల జూనియర్ కళాశాలల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన లెక్చరర్లు కొత్త కళాశాలల్లో విధుల్లో చేరనున్నారు. 74 కళాశాలలకు పాఠ్యపుస్తకాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 ప్రభుత్వ కళాశాలలకు ఇంటర్మీడియట్ అధికారులు ముందస్తుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయా కళాశాలలు శుభ్రం చేయించి పున:ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 31 ప్రభుత్వ, కేజీబీవీ 8, హైస్కూల్ ప్లస్ 28, ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలు 7 ఉన్నాయి. ఈ కళాశాలలకు మొదటి సంవత్సరానికి సంబంధించి 28,807, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,464 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. కానరాని ముందస్తు ప్రణాళిక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గత విద్యాసంవత్సరం అధిక శాతం పరీక్షల్లో ఫెయిలయ్యారు. గత విద్యా సంవత్సరంలో పటిష్ట ప్రణాళిక, తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. అడ్మిషన్ల మాటే మరిచారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు గతంలో పటిష్ట ప్రణాళిను అమలు చేసేవారు. ఊరూరా ప్రచారం నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా అడ్మిషన్ల ప్రచారం ఊసే కనిపించలేదు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా అడ్మిషన్ల వేటలో ఉంటే ప్రభుత్వ కళాశాలలు మాత్రం తమకెందుకులే అన్న ధోరణిలో ఉన్నాయి. ప్రతి ఏటా గతం కంటే అడ్మిషన్లను పెంచేలా చర్యలు చేపట్టేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం అలాంటి చర్యలేమీ జిల్లాలో జాడలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు అంతంతమాత్రమే జరుగుతాయని పలువురు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సర్కారులో మెరుగు గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగుపడ్డాయి. 2019వ సంవత్సరానికి ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌళిక వసతులు అరకొరగా ఉండేవి. వాటిని మెరుగుపరిచేందుకు అప్పటి టీడీపీ సర్కారు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నాడు నేడు పథకంతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేసింది. ప్రస్తుత కూటమి టీడీపీ సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి మాటే మరిచింది. జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31 కేజీబీవీ 08 హైస్కూల్ ప్లస్ 28 ఏపీ మోడల్ కళాశాలలు 07 మొత్తం కళాశాలలు 74 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,464 -
కిటకిటలాడిన బోయకొండ
జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు ఆదివారం భక్తులు తరలిరావడంతో కిటకిటలాడింది. ● చిత్తూరు నగరం సత్యనారాయణపురం ప్రాంతంలోని 60వ షాపులో ఉదయం 10 గంటలకు సర్వర్ మొరాయించింది. దీంతో డీలర్ బయోమెట్రిక్ మిషన్ను కార్యాలయానికి ఇచ్చి పంపారు. అక్కడికెళ్లి చూస్తే నగరమంతా సర్వర్ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో కార్డుదారులు గంటలకొద్దీ పడిగాపులు కాశా రు. మధ్యాహ్నం వరకు రేషన్కోసం నిరీక్షించి నీరసించి పోయారు. ఈ పక్కన ఉన్న షాపులో కార్డుదారులను గదమాయిస్తూ బెదిరింపులకు గురిచేశారు. అన్ని చోట్ల నీడ కల్పించాలని చెప్పినా అలాంటివేవీ కనిపించలేదు. – 8లో– 8లో -
బదిలీల్లో ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో అధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్టీఏ ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలకు చేసిన చట్టం అధికారులకు చుట్టం అయ్యిందే తప్ప ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న ప్రతి పూటకో నిర్ణయం వివాదంగా ఉందన్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్స్ 196 మంది బదిలీకి దరఖాస్తు చేసుకుని పీఎస్హెచ్ఎంగా వెళ్లాలని, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, విడో, విడాకులు తీసుకున్న మహిళలపై దుర్మార్గ నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతర తెలుగు మాధ్యమం లేకుండా చేయడం అన్యాయమన్నారు. విద్యార్థి నిష్పత్తి 1:40 కాకుండా 1:49 చేసి మిగులు టీచర్లను ప్రాథమిక బడులకు తరలించడం పద్ధతి కాదని విమర్శించారు. చట్టంలోని నియమ, నిబంధనలను పాటించకుండా టీచర్ల వ్యతిరేక విధానాలతో 6304 మంది ఎస్జీటీలు ఉద్యోగోన్నతికి నోచుకోక నష్టపోయారన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీన సోమవా రం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. పోలీసు కార్యాలయంలో.. చిత్తూరు అర్బన్: నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. నేడు పులిగుండు వద్ద యోగాంధ్ర చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఈ నెల 2వ తేదీన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పులిగుండు వద్ద నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్రను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇది వరకే కాణిపాకంలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 2వ తేదీన పులిగుండు వద్ద దాదాపు 2 వేల మందితో కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలో ప్రక్షాళనచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కీలక శాఖల్లో ఒకటైన విద్యాశాఖ(డీఈవో) కార్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. ఈ మేరకు ఆ కార్యాలయంలో ఏళ్ల తరబడి కొందరు సూపరింటెండెంట్లు ఒకే చోట పాతుకుపోయారు. వారందరికీ ఈ బదిలీల్లో స్థానచలనం కల్పించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీచేశారు. రాయలసీమ జోన్ పరిధిలో నిర్వహించిన బదిలీల్లో పలువురు సూపరింటెండెంట్లకు బదిలీలు నిర్వహించారు. ఇందులో చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు వీజీ రమణ, సత్యనారాయణను వైఎస్సార్ కడప జిల్లా (డీఈవో కార్యాలయం)కు బదిలీ చేశారు. చిత్తూరు డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్లు ప్రేమకుమారిని వైఎస్సార్ కడప జిల్లా సమగ్రశిక్ష శాఖకు, రామ్కుమార్ను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు సూపరింటెండెంట్లకు స్థానచలనం కల్పించారు. నూతన సూపరింటెండెంట్లు వీరే ప్రస్తుత బదిలీల్లో ఇతర జిల్లాల నుంచి పలువురు సూపరింటెండెంట్లు చిత్తూరు డీఈవో కార్యాలయానికి విచ్చేయనున్నారు. తిరుపతి జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్ సూపరింటెండెంట్ గా ఉన్న రమేష్, కర్నూలు జిల్లా డీఈవో కార్యాలయంలో ఉన్న రవికుమార్కు చిత్తూరు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నందకుమార్, చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణకుమారికి ఉద్యోగోన్నతులు కల్పించారు. ఆ ఇద్దరినీ చిత్తూరు డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్లు నియమిస్తున్నట్లు ఆర్జేడీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రేషన్ కోసం కష్టాలు మొదలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి పాలనలో సేవలు ఒక్కొక్కటిగా రద్దవుతుండడంతో జనం వీధినపడుతున్నారు. నాడు ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ల వ్యవస్థకు నేడు మంగళం పాడారు. గ్రామ సచివాలయాల్లో అందుతున్న సేవలు నేడు అందకపోవటంతో జనం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదు. తాజాగా ఇంటింటికీ రేషన్ చేరవేసే వాహనాలను రద్దు చేసి లబ్ధిదారులంతా దుకాణాల వద్దకు వెళ్లి బియ్యం, చక్కెర ఇతరత్రా సరుకులు తీసుకోవాలని ఆదేశించారు. కూట మి సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆదివారం రేషన్ లబ్ధిదారులంతా వీధినపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. డీలర్లు వాహనాల్లో రేషన్ తీసు కుని లబ్ధిదారుని నివాసానికి వెళ్లి సరుకులు పంపిణీ చేసేవారు. కూటమి పాలన వచ్చిన వెంటనే రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడేశారు. లబ్ధిదారులంతా రేషన్ దుకాణానికే వెళ్లి సరుకులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.అట్టహాసంగా ప్రారంభోత్సవాలుతిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రేషన్ దుకాణాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. పాత రేషన్ దుకాణాలకు మామిడి తోరణాలు, పూలు అలంకరించి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కూటమి నేతల ద్వారా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రారంభోత్సవాలకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లను ఆహ్వానించవద్దని అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులే ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆలస్యమైనా కూటమి నేతలు వచ్చే వరకు రేషన్ పంపిణీ చేయడానికి వీల్లేదని అనేక చోట్ల డీలర్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.గంటల తరబడి ఎండలో నిల్చొని..రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయటంతో చేసేది లేక లబ్ధిదారులంతా ఆదివారం ఉదయమే దుకాణాల వద్దకు చేరుకున్నారు. అయితే కూటమి ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వచ్చే వరకు రేషన్ వేయద్దని చెప్పడంతో లబ్ధిదారులంతా ఎండలో బారులు తీరక తప్పలేదు. కొన్ని చోట్ల కూటమి నేతలు వచ్చి ప్రారంభించి వెళ్లిపోయాక డీలర్లు ఇద్దరు, ముగ్గురికి సరుకులు పంపిణీ చేసి సోమవారం రండి అని వెనక్కు పంపించి వేశారు. చిత్తూరు నగరంలోనే కాకుండా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరో వైపు అనేక ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించటంతో గంటల తరబడి ఎండలో వేచి ఉండక తప్పలేదు. డోర్ డెలివరీ లేకపోవటంతో రెండు, మూడు కిలోమీటర్ల నుంచి లబ్దిదారులు రేషన్ దుకాణాలకు తరలిరావడం కనిపించింది. గంటల తరబడి వేచి ఉండి రేషన్ తీసుకుని నెత్తిన మోసుకుని ఎండలోనే సొంత ఊర్లకు తిరిగి వెళ్తూ కనిపించారు. మరి కొన్ని చోట్ల రేషన్ దుకాణాలు తెరుచుకోకపోవటంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంకొన్ని చోట్ల దుకాణాలు ఆలస్యంగా తెరుచుకోవడంతో అప్పటి వరకు లబ్ధిదారులు పడిగాపులు గాశారు.ఐదు కేజీలకు పది కిలోమీటర్లునాకు 85 సంవత్సరాలు. నా కు తోడు ఎవరూ లేరు. ప్రభు త్వం అందించే ఐదు కేజీల బియ్యానికి సుమారు మూడు కిలోమీటర్లు అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లాలి. రోడ్డుపై వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో వాహనం ద్వారా ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేసేవారు. నేడు కిలోమీటర్ల దూరం నడక తప్పడం లేదు.– బొజ్జమ్మ, జగన్నాథపురం ఎస్టీ కాలనీ, కార్వేటినగరం మండలంకూలి పనులు వదులుకుని..రేషన్ కోసం పేదవాడి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కూటమి పాలన వచ్చాక రేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డోర్ డెలివరీ రద్దు చేయటంతో ఆ రేషన్ కోసం కూలీ నాలీ చేసుకుని బతికేటోళ్లు అనేక మంది ఆదివారం పనులన్నీ మానేశారు. ఒకటో తేదీ ప్రారంభిస్తారు కనుక కచ్చితంగా రేషన్ తీసుకోవచ్చని భావించి అనేక మంది కూలీ పనులు మానేసి దుకాణాలకు చేరుకున్నారు. ఇదే విషయం అక్కడున్న వారు చర్చించుకోవటం కనిపించింది. చేసేది లేక కూటమి పాలకులను తిట్టుకుంటూ లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది.జాడలేని కంది పప్పుకూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ దుకాణాల్లోనూ కందిపప్పు పూర్తిగా సరఫరా చేయలేదు. చక్కెర అరకొరగానే ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,339 చౌకదుకాణాలు ఉన్నాయి. ఈ చౌక దుకాణాల పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డు దారులు ఉన్నారు. ఈ నెల కోటా కింద 8,320 మెట్రిక్ టన్నుల బియ్యం, 256 మెట్రిక్ టన్నుల చక్కెర సరఫరా చేశారు. కందిపప్పు మాత్రం సరఫరా చేయలేదని తెలిసింది. కార్డు దారులకు బియ్యం, అరకొర చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. -
మరో రెండు కుంకీలు
పలమనేరు: మండలంలోని మొసలిమడుగు ఏనుగుల శిబిరానికి ఆదివారం మరో రెండు ఏనుగులను స్థానిక అటవీ అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడి క్యాంపునకు ఇప్పటికే కర్ణాటకలోని మైసూరునుంచి శిక్షణ పొందిన నాలుగు కుంకీ ఏనుగులను తరలించారు. దీంతోపాటు కుప్పం ఫారెస్ట్ పరిధిలోని రామకుప్పం మండలం ననియాల క్యాంపులోని వినాయక, జయంత్ అని పిలిచే రెండు కుంకీ ఏనుగులను అధికారులు ఇక్కడికి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. దీంతో ఇక్కడి క్యాంపులో మొత్తం ఆరు కుంకీలు ఉన్నాయి. వీటికి అవసరమైన మేతను అధికారులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ తెలిపారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో ఏనుగులను అదుపు చేయనున్నారు. -
తమిళనాడు, ఏపీ ఉద్యాన అధికారుల చర్చలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పండ్ల గుజ్జు పరిశ్రమల ప్రలోభాలకు రైతులు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మామిడి ధరలపై క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సమన్వయ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెరెక్టర్ మోహన్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం ఆదివారం చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ కార్యాలయం చేరుకుంది. ఉద్యానశాఖాధికారి మధుసూదన్రెడ్డి, ఏడీ కోటేశ్వర్రావుతో మామిడి ధరలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. క్రిష్ణగిరి, చిత్తూరు జిల్లాలో మామిడి ధరల్లో తేడా లేకుండా చూసుకోవాలని తీర్మానించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు రెండు జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. -
రాష్ట్ర ప్రజలకూ తప్పని వెన్నుపోటు
కార్వేటినగరం: పిల్లనిచ్చిన సొంత మామనే కాదు.. అధికారం కోసం యావత్తు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుదే అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెన్నుపోటు దినం పోస్టర్ను నాయకులతో కలసి ఆవిష్కరించారు. నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగనన్న గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని నెరవ్చేకుండా ప్రజలను మభ్యపట్టే కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, నాయకులు జనార్దన్, రాజశేఖర్రెడ్డి, హరిరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కుప్పయ్య, నియోజకవర్గ యువత అధ్యక్షుడు కిషోర్రెడ్డి, యువనాయకుడు శ్యామ్, కాళప్ప, మణి పాల్గొన్నారు. -
ఆగని గజరాజుల దాడులు
పెద్దపంజాణి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఏనుగుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాపల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి, బేరుపల్లి, రాగిమాకులపల్లి, గౌదమాకులపల్లి, కమ్మపాళ్యం, గంకొండ, చీకలదిన్నేపల్లి తదితర గ్రామాలు అటవీ సరిహద్దులు కలిగి ఉన్నాయి. తరచూ ఏదో ఒక గ్రామంలో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చింది. అయినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదివారం వేకువజామున పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీటు నుంచి వచ్చిన ఏనుగుల గుంపు తిప్పిరెడ్డిపల్లెకు చెందిన చంద్రారెడ్డి, అమరారెడ్డి, బాబు రెడ్డి తదితరుల మామిడి తోటలపై విరుచుకుపడ్డాయి. మామిడికొమ్మలను విరిచేసి సుమారు ఒక టన్ను కవర్లు కట్టిన బేనీషా, ఖాదర్, ఇమామ్పసంద్ మామడి కాయలను నెమరువేశాయి. ఈ దాడుల్లో దాదాపు రూ.50 వేల నష్టం జరిగినట్లు అంచనా. ఉదయం తోటలోకి వెళ్లిన రైతులు ఏనుగుల విధ్వంసాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధిత రైతులు వెంటనే జిల్లా అటవీశాఖ అధికారిణికి సమాచారం చేరవేశారు. స్పందించిన ఆమె క్షేత్రస్థాయి అధికారులను సంఘటనా స్థలానికి పంపించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తన కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. -
కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబుచేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలన్నీ నిండి కిటకిటలాడాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జేఎల్ఎంల ఇష్టారాజ్యం!
పలమనేరు: గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలొచ్చినా వెంటనే బాగు చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ సేవల్లో భాగంగా జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) విధానాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇందులోని ఉద్యోగులు పలు రకాల సర్వేల్లో మునిగిపోయారు. ఫలితంగా సచివాలయాల్లో ఎలాంటి సేవలు లేకుండా బోసిపోయింది. ఈ నేపత్యంలో అత్యవసర సేవలంటూ హాజరు నుంచి వెసులుబాటు ఉన్న జూనియర్ లైన్మన్లు అటు సచివాలయాలకు రాకుండా ఇలా ప్రజలకు అవసరమైన సేవలు చేయకుండా నెల నెలా జీతాలు మాత్రం తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన సంబంధిత మండలాల ట్రాన్స్కో అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక సచివాలయాలకు బాధ్యులైన ఎంపీడీవోలకు వీరిపై ఆజమాయిషీ లేదు. జేఎల్ఎం విధులు ఆయా పంచాయతీలోని సీనియర్ లైన్మన్కు సహాయకులుగా ఉంటూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పంచాయతీలో నూతన విద్యుత్ స్తంభాలు, లైన్ల ఏర్పాటు చేపట్టాలి. ఏదేని మరమ్మతలు వస్తే వెంటనే స్పందించాలి. ప్రజలకు అవసరమైన విద్యుత్ సమస్యలను వెంటనే బాగుచేయాలి. ఎందుకంటే మండల స్థాయిలో ట్రాన్స్కోలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతుందనే గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరిని నియమించి సచివాలయాలకు అనుసంధానం చేసింది. జరుగుతున్నదేమిటంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయంలో పదిశాఖల చెందిన వారికి పలు రకాల సర్వేలను అంటగట్టింది. అయితే వీరు ఉదయం, సాయంత్రం విధిగా సచివాయలాల వద్దకెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అత్యవసర సేవల్లో ఉన్నందున జేఎల్ఎంలు మాత్రం ఏ సచివాలయం వద్దనైనా హాజరు వేసుకునే వెసులుబాటు ఉంది. దీంతోపాటు వీరికి ఎలాంటి సర్వేలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని 80శాతం మంది జేఎల్ఎంలు అసలు విధులకు హాజరు కావడంలేదు. కనీసం సంబంధిత ట్రాన్స్కో ఏఈలు చెప్పిన పనులు చేయడం లేదు. ప్రజలకు సంబంధించిన సేవలు చేయాలన్నా ఎంతో కొంత చేతిలో పెడితేగానీ పనులకు రావడంలేదు. ఎందుకంటే వీరిపై అజమాయిషీ ఎంపీడీవోలకు లేదు. జేఎల్ఎంలపై ఎంపీడీవో ఫిర్యాదు జిల్లాలో మొత్తంగా వీరి పనితీరు సరిగ్గాలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి ఎంపీడీవో రాజేంద్రబాలాజీ తాజాగా ఆ మండలంలోని పదిమంది జేఎల్ఎంలు విధులకు రావడంలేదని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. వీరికి జీతాలను ఆపేయాలని సూచించారు. కానీ ట్రాన్స్కో దీనిపై అసలు పట్టించుకోలేదు. దీంతో జేఎల్ఎంలు ఇప్పుడు ఎవరిమాట వినే పరిస్థితి లేదని తెలిసింది. నెలకు జీతం రూ.35వేలు వృథానేనా? సచివాలయాల్లోని జేఎల్ఎంలకు నెలకు వేతనం రూ.35వేలుగా ఉంది. అంటే రోజుకి వెయ్యికిపైగానే. కానీ వీరు చేసేందుకు ఎలాంటి పనిలేకుండా పోయింది. అసలు వీరిని పట్టించుకోవడం లేదు. వీరిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరిని ఆయా శాఖలకు అనుసంధానం చేస్తామన్నారు. మళ్లీ సచివాలయాలను బలోపేతం చేస్తామన్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోక సచివాలయ వ్యవస్థ రోజు రోజుకూ నిర్వీర్యమవుతోంది. విధులకు డుమ్మా కొట్టి జీతాలు పొందుతున్నవైనం పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు అత్యవసర సేవల పేరిట ఆడింది ఆట పాడిందేపాట జేఎల్ఎంల సమాచారం జిల్లాలో మొత్తం మండలాలు : 31 గ్రామపంచాయతీలు : 797 మొత్తం గ్రామాలు : 822 సచివాలయాలు : 11,158 వీటిలో జూనియర్ లైన్మన్లు : 11వేలమంది -
నేటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
ఉత్సవాల ఆరంభం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులుతిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈనెల 2వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ వీఆర్.శాంతి, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ ధనుంజయరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7.02 నుంచి 7.20 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగనున్నాయి. -
కుక్కల దాడిలో రెండు పొట్టేళ్లు మృతి
చౌడేపల్లె: కుక్కల దాడిలో రెండు పొటేళ్లు మృత్యువాత పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కోటూరు హిదాయిత్నగర్కు చెందిన చాన్బాషా తన పొలం వద్ద పొటేళ్లు మేపుతుండగా మరొక రైతు పెంచుకుంటున్న కుక్కలు పొటేళ్లపై దాడిచేసి చంపేశాయి. ఈ ఘటనలో సుమారు రూ.20 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాధు చేసినట్లు చాన్బాషా పేర్కొన్నారు. నష్టపోయిన బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టెంపో ఢీకొని వ్యక్తి మృతి గుడుపల్లె: రోడ్డు దాటుతున్న వ్యక్తిని టెంపో ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు, మండలంలోని శెట్టిపల్లె గ్రామానికి చెందిన చెంగప్ప(60) కుప్పం నుంచి పలమనేరుకు వెళ్లే జాతీయ రహదారిపై శెట్టిపల్లె వద్ద ఉన్న రోడ్డు దాటుతున్న తరుణంలో బస్సు తగిలి కిందకు పడిపోయాడు. రోడ్డుపై పడిన వెంటనే వెనుక నుంచి వస్తున్న టెంఫో ఢీ కొంది. దీంతో చెంగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే గుడుపల్లె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చెంగప్ప బంధువులకు తెలియజేసి మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదర్శ గ్రామాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఎంపిక చేసిన 5 ఆదర్శ గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో వందశాతం సోలార్ విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఇందులో ఒక పంచాయతీని ఎంపిక చేసి మొదట శతశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. పెనుమూరు, గుడిపాలలోని బొమ్మసముద్రం, విజయపురంలోని పల్లూరు, చౌడేపల్లె, కల్లూరు పంచాయతీలను ఎంపిక చేశారన్నారు. వీటికి సంబంధించి సంబంధిత ఈఈలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అక్కడ వసతులు, సోలార్ విధానం పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఎంత మంది ఉన్నవారు, ఇతర కేటగిరీ సర్వీసుల వివరాలు, మొత్తం సర్వీసుల సంఖ్య వివరాలు తీసుకుంటున్నామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తే కేంద్రం సంబంధిత పంచాయతీ అభివృద్ధి పనులకు రూ.కోటి నిధులు విడుదల చేస్తుందన్నారు. దుప్పిని కాల్చి చంపిన కేసులో జైలు కుప్పం : కుప్పం అటవీ రేంజ్ పరిధిలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిను కాల్చిన కేసులో నిందితుడిని రిమాండుకు పంపినట్లు అటవీ శాఖ అధికారి జయశంకర్ తెలిపారు. కుప్పం మండలం వాలూరు గ్రామానికి చెందినా కనకరాజ్ గుడుపల్లె మండలం మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వెటాడి నాటు తుపాకితో కాల్చి చంపినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు వచ్చినా సమాచారం మేరుకు మల్లప్పకొండ ప్రాంతంలో పర్యవేక్షించగా కనకరాజ్ దుప్పి చర్మంతో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా అదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడితో పాటు నాటు తుపాకి , ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఆయన తెలిపారు. -
మధ్యాహ్నభోజన పోటీల్లో జిల్లాకు 2వ స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ పోటీలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా తరపున మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొని ప్రతిభ చాటారు. బడి పిల్లలకు శుభ్రత, ప్రకృతి వైపరీత్యాలు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, అగ్నిప్రమాద సమయంలో ఎలా తప్పించుకోవాలనే అంశాలపై వంట కార్మికులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన సిబ్బందికి పోటీలు నిర్వహించగా ఇందులో చిత్తూరు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లభించింది. ఈ అవార్డు పొందిన, గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను డీఈవో వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఆడబిడ్డకు అగచాట్లు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన జూన్ 12కు ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై మహిళలు మండి పడుతున్నారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 అందజేస్తామని చెప్పినా ఆ ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నా ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటి వరకు సొమ్ము అందించలేదు. అదే వైఎస్ జగనన్్ సర్కార్ హయాంలో రెండేళ్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రజలను ఆదుకున్న పరిస్థితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. -
ఒంటరి ఏనుగు హల్చల్
రొంపిచెర్ల : మండలంలోని బండ కిందపల్లె, పెద్దగొట్టిగల్లు పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం పూట్టావారిపల్లె నుంచి రాత్రి బయలుదేరి కమోళ్లపల్లె, మటోళ్లపల్లె, బండకిందపల్లె దళిత వా డ రామిరెడ్డిగారిపల్లె వైపు వెళ్లింది. మటోళ్లపల్లె సమీపంలోని గాలి చెరువు వద్ద అర్ధరాత్రి పెద్దగా శబ్దాలు చేసుకుంటూ రావడంతో మామిడి తోటల వద్ద కాపలాగా ఉన్న రెడ్డెప్ప దంపతులు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకలించింది. భాస్కర్ రెడ్డి పొలం వద్ద ఉన్న ముళ్ల కంచెను విరిచి బండకిందపల్లె వైపు వెళ్లింది. రొంపిచెర్ల మండల సరిహద్దులోని మామిడి తోటల్లో ఒంటరి ఏనుగు ఉండడంతో రైతులు పరుగులు తీశారు. హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకిలించిన ఏనుగు -
ఇక చౌక దోపిడీ!
● మళ్లీ పాత పద్ధతుల్లో రేషన్ పంపిణీ ● డీలర్ల చేతికి పంపిణీ పగ్గాలు ● దండుకోవడానికి ప్రభుత్వం సహకారం ● దాచుకున్న డబ్బాలు, గోనెసంచులు మళ్లీ తెరపైకి ● అక్రమాలకు అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు ● నేటి నుంచి చౌక దుకాణాల నుంచి పంపిణీ జిల్లా సమాచారం షాపుల సంఖ్య : 1339 కార్డుదారులసంఖ్య : 5.40 లక్షలు బియ్యం సరఫరా ప్రతినెలా : 9వేల టన్నులు చక్కెర : 256 టన్నులు తొలగించిన డీలర్ల సంఖ్య : 300 మంది తొలగించిన ఎండీయూ ఆపరేటర్ల సంఖ్య : 336 కాణిపాకం : జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి కూటమి ప్రభుత్వం తోడవుతోంది. మళ్లీ పాత పద్ధతులకు శ్రీకారం చుట్టింది. దండుకోవడానికి దగ్గరుండి సహకరిస్తోంది. దీంతో రేషన్ పక్కదారి పట్టనుంది. డీలర్లు పాత డబ్బాలు, గోనె సంచులు బయటకు తీసి పూజలు చేస్తున్నారు. సరుకులు అమ్మకానికి తలుపులు తెరిచిపెట్టారు. అక్రమాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. నేటి నుంచి రేషన్ దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జిల్లాలో 1390 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా ప్రభుత్వం 9 టన్నుల వరకు బియ్యం , 250 టన్నుల వరకు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తోంది. ఈ సరుకుల ఆధారంగానే చాలా మంది కార్డుదారులు జీవనం సాగిస్తున్నారు. ప్రతినెలా సరుకుల అందక, డీలర్లతో పోరాటం చేయలేక పస్తులతో గడిపిన క్షణాలను కార్డుదారులు మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై భయపడుతున్నారు. 2019 ముందు రేషన్ పంపిణీ ఇలా.. 2019 ముందు రేషన్ పంపిణీ కోసం కార్డుదారులు పడిగాపులు కాసేవారు. అప్పట్లో ప్రజలకు సకాలంలో సరుకులు అందేవి కావు. కాస్త ఆలస్యమైతే రేషన్ లేదని వెనక్కి పంపించేసే వారు. ఇచ్చిన సరుకుల్లో కోతలు కనిపించేవి. గోనె సంచి, డబ్బాలతో తూక మేసి.. రేషన్మేసేసేవాళ్లు. ఇలా భారీగా రేషన్ల్లో కోతలు పడేవి. 2019 తర్వాత రేషన్ సరఫరా ఇలా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు మేలు చేసేలా చేసింది. ప్రధానంగా రేషన్ పంపిణీలో పారదర్శకతను తీసుకొచ్చింది. ఇంటింటికీ రేషన్ విధానాన్ని అమలు చేసింది. వాహనం కేటాయింపుతో పాటు ఎండీయూ ఆపరేటర్లను నియమించింది. ఈ విధానంతో ప్రతి నెలా 1వతేది నుంచి 17 తేదీ వరకు వీధి వీధికి వెళ్లి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసేది. లేవలేని వృద్ధులు, నడవలేని వృద్ధులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇక పాత పద్ధతిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడింది. డీలర్ల ఆటలకు తాళం పడింది. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియాకు ఊపిరొచ్చింది. ప్రతినెలా లక్షల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు జోరందుకుంది. టన్నుల కొద్ది బియ్యం పోలీసుల కంటపడి వెలుగులోకి రావడంతో కూటమి నేతల అక్రమ వ్యాపారం బట్ట బయలైంది. అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తిన కూటమి నేతలు పలు రేషన్ డీలర్లతో చేతులు కలిపి ఈ దందాను నడిపిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న డీలర్లను తొలగించి వారికి అనుకూలంగా ఉన్న కూటమి నేతలకు డీలర్లుగా నియమించుకున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో 300 మంది డీలర్లను కొత్తగా నియమించారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న మహిళ పేరిట కూడా రేషన్ షాపు కేటాయించారంటే...దీని బట్టే రేషన్ బోగస్ను అంచనా వేయవచ్చు. అలాగే అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న 336 మంది ఎండీయూ ఆఫరేటర్లను తొలగించింది. దీంతో ఇంటింటా రేషన్ పంపిణీ వ్యవస్థ రోడ్డున పడింది. రాగులు, కందిపప్పునకు రాంరాం కందిపప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. రాగులు పంపిణీ ఆపేసింది. నేటి నుంచి మళ్లీ పాత పద్ధతులు రానున్నాయి. రోజుకు 8 గంటలు రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. డీలర్లు వారి వద్ద కార్డుదారులను క్యూ కట్టించనున్నారు. అప్పుడే కొన్ని చోట్ల డబ్బాలు, గోనె సంచులు సిద్ధం చేసి ఉంచారు. అన్ని రకాలుగా కోతలు పెట్టేందుకు సంసిద్ధమయ్యారు. రేషన్ పండగ పేరుతో కార్డుదారుల నుంచి పిండుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏడాది కాలంలో పట్టుకున్న రేషన్ వివరాలు ఇలా.. నెల 6ఏ పట్టుబడ్డ బియ్యం కేసులు (క్వింటాళ్లల్లో) జూన్–2024 1 6.16 ఆగష్టు 8 131.9 సెప్టంబర్ 6 93.98 అక్టోబర్ 1 24.1 నవంబర్ 3 18.65 డిసెంబర్ 4 316.56 ఫిబ్రవరి–25 3 110.99 మార్చి 2 104.57 తూకంలో తేడాలొస్తే చర్యలు రేషన్ పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూస్తాం. అందుకే కొంత మందితో కూడిన ఓ టీంను ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. మళ్లీ ఐదు రోజులపాటు జిల్లాలోనే ఉంటాం. రేషన్ పంపిణీలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తాం. కోతలుంటే చర్యలు ఉంటాయి. కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – రాజేంద్ర ప్రసాద్, ప్రత్యేక అధికారి, చిత్తూరు -
చట్టం పకడ్బందీగా అమలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాల, కౌమార కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 (సవరణ చట్టం 2016)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..14 ఏళ్లలోపు బాలలను పనిలోకి అనుమతించకూడదన్నారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లోకి తీసుకోవడం నేరమన్నారు. బాల కార్మికులకు సంబంధించి ఫిర్యాదులుంటే 1098 నంబర్లో సంప్రదించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇటుక బట్టీలు, మైనింగ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డెయిరీ పరిశ్రమల్లో బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం గోడ పత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, రియల్ ఎడ్యుకేషన్ , లిటరసీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల వాగ్వాదం
జీడీనెల్లూరు మండలంలో టీడీపీ ఇరు వర్గాలు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మాట నిలబెట్టుకున్నారు గత ఐదేళ్ల పాటు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు. నాలుగు సంవత్సరాలు చేయూత ఆర్థిక సహాయంతో పాటు నా పిల్లలకు అమ్మఒడి పథకం లబ్ధి చేకూరింది. ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – సలోమీ, గుడిపాల మండలం ఆడబిడ్డ నిధి ఇవ్వాలి ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అ మలు చేసి ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్నా రు. ఇంత వరకు ఆ పథ కం అమలు గురించే పట్టించుకోలేదు. గతంలో ఏటా నా ఖాతాలోకి ఈబీసీ నేస్తం పథకం డబ్బులను జమచేశారు. గత సర్కారు పాలనలో అందిన సంక్షేమ పథకాల ఆర్థిక సాయంతో కిరాణం పెట్టుకున్నాను. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి. – సరసమ్మ, లబ్దిదారురాలు, చిత్తూరు మండలం కిరాణా కొట్టు నడుపుతున్నా గత సర్కారు పాలనలో కాపునేస్తం ద్వారా నాకు రూ.60 వేలు ఆర్ధికసా య ం అందింది. ఆ సాయంతో దుకాణం నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నా. ప్రస్తుతం ఇలాంటి సాయం అందలేదు. ప్రస్తుత ప్రభు త్వం కాపులకు ప్రత్యేకంగా ఎలాంటి ఆర్ధిక సాయం అందించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏ హామీ అమలు చేయ లేదు. – కాటమ్మ, అత్తూరు, నిండ్రమండలం చిత్తూరు జిల్లా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ప్రస్తుత కూటమి ప్రభు త్వం సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియడం లే దు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇంత వరకు ఊసేలేదు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో ఈబీసీ నేస్తం నగదు అందుకున్నాను. ఆ నగదుతో కుట్టుమిషన్ కొనుగోలు చేసుకుని అభివృద్ధి చెందా. – వనమ్మ, లబ్ధిదారురాలు, చిత్తూరు మండలం – 8లో -
మారిన సర్కారు బడుల రూపురేఖలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో పూర్తిగా రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు సమకూరాయి. పూర్వపు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థపై గత ఐదేళ్లు ప్రత్యేక దృష్టి పెట్టడంతో విద్యాభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో నాడు నేడు పథకానికి వేల కోట్లు ఖర్చు చేశారు. 2019కు ముందు టీడీపీ పాలనలో సర్కారు బడుల్లో చెట్ల కింద చదువులు .. వానొస్తే బడులకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి. రంగులు వెలిసిపోయి...బూజు పట్టిన గోడలతో సర్కారు బడులు దర్శనమిచ్చేవి. అలాంటి పరిస్థితులను గత ఐదేళ్లల్లో రూపుమాపారు. ఒకే ఒక్కడు గత ఐదేళ్లల్లో నాడు– నేడు పథకం అమలు వివరాలునియోజక మొత్తం ఖర్చు చేసిన వర్గం పాఠశాలలు బడ్జెట్ (రూ.కోట్లలో) చిత్తూరు 130 41.63 జీడీ నెల్లూరు 273 80.94 కుప్పం 439 152.64 నగరి 138 43.95 పలమనేరు 484 178.99 పుంగనూరు 317 93.90 పూతలపట్టు 215 58.27 మొత్తం 1996 650.32 -
వైఎస్సార్సీపీ పాలనలో భరోసా
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,52,743 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఏటా రూ.229.11 కోట్లు ఖర్చు చేసింది. అంతే కాకుండా జిల్లాలోని రూరల్లో ఉన్న 95,994 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.196.98 కోట్లు, అర్బన్లోని 12933 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.19.90 కోట్లు చొప్పున సున్నా వడ్డీ అందించి ఆదుకుంది. వైఎస్సార్ చేయూత ద్వారా రూరల్లో 172616 మందికి రూ.323.66 కోట్లు, అర్బన్ లో 19144 మందికి రూ.35.9 కోట్లు, కాపు నేస్తం పథకంలో 6656 మందికి రూ.10 కోట్లు, వైఎస్సార్ ఆసరా పథకంలో రూరల్లో 270197 మందికి రూ.568.51 కోట్లు, అర్బన్లో 47026 మందికి రూ.47.70 కోట్లు చొప్పున అందించి మహిళల మనస్సుల్లో గత సీఎం వైఎస్ జగన్ సర్కార్ చెరగని ముద్ర వేసింది. వైఎస్సార్ సీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాభిషేకం గత వైఎస్సార్సీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో 1,67,308 మందికి ఉచిత ఇళ్ల పట్టాలను అందజేసి పేదవాడి సొంతింటి కల ను నెరవేర్చింది. వారందరికీ ఉచితంగా గృహాలు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేశారు. కులం,మతం, ప్రాంతం, పార్టీలు ఏవీ చూడకుండా ఇంటి పట్టాలను మంజూరు చేసి మహిళల పేరుతో ఉచితంగా రిజిస్టర్ చేయించారు. గతంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 1039 లే అవుట్లో పక్కాగృహాలతో కళకళలాడుతున్నాయి. -
● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే
తమ్ముళ్ల వాగ్వాదం గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పంచాయతీలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్ థామస్ ఎదుటే తమ్ముళ్ల వాగ్వాదం చోటుచేసుకుంది. వింజం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛను అందించారు. అనంతరం వింజం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలి అంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించగా అదే గ్రామంలోని మరొక వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని మరో మండిపడింది. దీంతో ప్రారంభోత్సవం చేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ తతంగం అంతా నడిరోడ్డుపై జరగడంతో ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవకతవకలపై విచారణ చిత్తూరు రూర ల్(కాణిపాకం): ఏపీ హంస అసోసియేషన్ అవకతవకలపై రాష్ట్ర వైద్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నెల 3వ తేదిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ముందు హాజరు కావాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యకుడికి నోటీసులు జారీ చేసింది. ఏపీ హంస సంఘం బోగస్ సభ్యులను చూపుతున్నారని, బోగస్ ఎన్నికల నిర్వహిస్తున్నారని, డబ్బులకు ఆఫీస్ బేరర్ల పోస్టులు అమ్ముకుంటున్నారని, ఆ పోస్టుల ద్వారా బదిలీల నుంచి తప్పించేలా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అందుకే విచారణకు ఆదేశించింది. -
ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై కదిరి మంగళం బైపాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చంద్రశేఖర్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా.. వడమాలపేట కట్టకింద ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ కదిరి మంగళం బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుభాషిణి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు. -
మామిడి విలవిల
● దిగజారుతున్న ధరలు ● అల్పోన్సో ధర పతనం ● కోతలు వద్దంటున్న ట్రేడర్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మళ్లీ మామిడి ధరలు పతనమయ్యాయి. బేనీషా ధర మరింత పతనానికి చేరుకుంది. ఇదే దారిలో అల్పోన్సో ధరలు పయనిస్తోంది. చందూర ధర దారుణంగా పడిపోయింది. కాయలను కొనేవారు లేక మార్కెట్లో కాయలు నిల్వలు పేరుకుపోయాయి.. దీంతో ట్రేడర్లు కోతలు వద్దని రైతులను నిలుపుదల చేయిస్తున్నారు. చిత్తూరు నగరం కట్టమంచిలోని మామిడి కాయల మార్కెట్ వెలవెలబోతోంది. గత నాలుగు రోజులుగా మార్కెట్కు కాయలు రాకపోవడంతో వ్యాపారం డల్గా మారింది. శుక్రవారం 5 నుంచి 6 టన్నుల కాయలు వచ్చాయి. ఇందులో అధికంగా బేనీషా కాయలు ఉన్నాయి. ఈ బేనీషా మార్కెట్లో విక్రయాలు జరగక ట్రేడర్లు కుప్పలు పోసి పెట్టారు. రైతులకు కోతలు వద్దని నిలుపుదల చేసినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. కాగా ఇమామ్ పసంద్ ధరలు మాత్రం గిట్టుబాటు అవుతోంది. మిగిలిన టేబుల్ రకాల ధరలు మాత్రం పతనమవుతున్నాయి. ఇలా అయితే రైతుకు కోత కూలి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి ధరలు ఇలా... మామిడి రకం ధర (రూ.లలో) బేనీషా 10–20 చందూర 4–6 తోతాపురి(టేబుల్ రకం) 12 కాలేపాడు 20–30 మల్లిక 20–30 ఇమామ్ పసంద్ 50–60 అల్పోన్సో 20–30 -
వర్షానికి నేలకూలిన వృక్షం
– ముగ్గురికి తీవ్ర గాయాలు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ముగ్గురిని ఆసుపత్రి పాలు చేసింది. నగరంలో రాత్రి 45 నిమిషాల పాటు వర్షం కురిసింది. పలమనేరు రోడ్డులో చెట్టు కింద ఉండగా ఉన్నపలంగా చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ఆ సమయంలో కింద పడ్డ చెట్టు కొమ్మ తగిలి చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లికి చెందిన రత్నవేలు, నగరంలోని మిట్టూరుకు చెందిన యశ్వంత్, తమిళనాడులోని వేలూరుకు చెందిన గోవిందస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు స్థానికులు రోడ్డుపై చెట్టును తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులేకుండా చేశారు. -
భార్యను మోసం చేసి.. మరోపెళ్లి చేసుకున్న భర్తకు జైలు
చిత్తూరు అర్బన్ : భార్య బతికుండగానే.. ఆమెను మోసం చేసి, మరో యువతిని పెళ్లాడిన భర్తకు ఏడాది జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ చిత్తూరులోని న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ఉమాదేవి కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన పి.విజయ కుటుంబ సమస్యల కారణంగా తవణంపల్లె మండలం వడ్డిపల్లె గ్రామంలో నివాసం ఉంటున్నారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పంకు చెందిన హేమంత్కుమార్ (28) విజయను పెళ్లి చేసుకుని, నాలుగేళ్లు కాపురం చేశాడు. తరువాత తన భార్యకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై 2020 ఆగస్టులో విజయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఇరుపక్షాల వాదనలు విన్న చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు.. హేమంత్కుమార్ చేసిన పనిని తప్పుపట్టింది. విజయను మోసం చేసి రెండోపెళ్లి చేసుకున్నందుకు నిందితుడికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. -
మొక్కుబడిగా పౌర హక్కుల దినం
– దళిత సర్పంచ్కు అవమానం చౌడేపల్లె : పౌర హక్కుల దినం సమావేశం పరికిదొన దళితవాడలో శుక్రవారం మొక్కుబడిగా నిర్వహించారు. పరికిదొన సర్పంచ్ లక్ష్మిదేవి దళిత సర్పంచ్ అయినప్పటికీ ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండా తహసీల్దార్ హనుమంతునాయక్ గ్రామానికి చేరుకొని పౌరహక్కుల దినం మమ అనిపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతినెలా చివరి శనివారం సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని దళిత సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి దళిత నాయకులు, పోలీసుశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా వీరెవరు హాజరుకాలేదు. అయినప్పటికీ తహసీల్దార్ దళితవాడలోని మహిళలు, వృద్ధులతో సమావేశం ముగిసిందని మినిట్స్ రాయించి చేతులు దులుపుకున్నారని సంఘం నేతలు ఆరోపణలు చేశారు. అధికారులే దళిత హక్కులను కాలరాస్తూ అన్యాయం చేస్తున్నారని అంబేడ్కర్ఽ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రెడ్డెప్ప , సర్పంచ్ లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఆగేది రామాపురమే!
● బుల్లెట్ ట్రైన్కు జిల్లాలో ఒక్కటే స్టాపింగ్ పాయింట్ ● మైసూరు–చైన్నె మార్గానికి భూసేకరణకు సిద్ధం ● జిల్లాలో 41 రెవెన్యూ గ్రామాల మీదుగా లైన్ పలమనేరు : చైన్నె– మైసూరు బుల్లెట్ ట్రైన్ మార్గానికి సంబంధించి ఫీల్ట్ వర్క్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ డీటైల్డ్ సోషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఐఏ), రీ సెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ (ఆర్ఏపీ)లను వెంటనే సిద్ధం చేయాలని ఎన్హెచ్ఎస్ఆర్సీల్ (నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) జీఎం నిషాంత్ సింఘాల్ నుంచి జిల్లా కలెక్టర్కు తాజాగా ఆదేశాలందాయి. మైసూరు నుంచి చైన్నె దాకా 463 కిలోమీటర్ల దూరం వెళ్లే ఈ మార్గం చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నియోజకవర్గం మీదుగా 77 కి.మీ మేర వెళ్లనుంది. జిల్లాలో 41 గ్రామాల్లో వెళ్లనున్న మార్గం కర్ణాటక నుంచి బైరెడ్డిపల్లి మండలంలోని కంభంపల్లి, ఆలపల్లి, జీసీపల్లి, లక్కనపల్లి, శెట్టిపల్లి, బేలుపల్లి, అంకింవారిపల్లి, అయ్యంరెడ్డిపల్లి, గుండ్లపల్లి, కొలమాసనపల్లి, మొరం, జల్లిపేట, కూర్మాయి, పలమనేరు, సముద్రపల్లి, పెంగరగుంట, పూతలపట్టు నియోజకవర్గంలోని మొగిలి, టేకుమంద, గొల్లపల్లి, రాగిమాను పెంట, బోడబండ్ల, కూర్మాయిపల్లి, చిత్తూరు నియోజకవర్గంలోని బుడితిరెడ్డిపల్లి, యాదమరి, పెరియంబాడి, జంగాళపల్లి, మాధవరం, మాపాక్షి, 190 రామాపురం, కొత్తపల్లి, వసంతాపురం, బసవపల్లి, పసుమంద, కుప్పిగానిపల్లి, రాగిమాను పట్టెడల మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రామాల్లో 876 మంది రైతుల భూములను సేకరించనున్నారు. జిల్లాలో ఒక్కటే.. మైసూరు నుంచి చైన్నె దాకా మొత్తం తొమ్మిది చోట్ల స్టాపింగ్లున్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో 5, తమిళనాడులో 3 చోట్ల బుల్లెట్ ట్రైన్ ఆగనుంది. చిత్తూరు జిల్లాలో మాత్రం 190–రామాపురం వద్ద మాత్రమే చిత్తూరు జిల్లా స్టాపింగ్గా పెట్టారు. -
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల ఎంపిక
తిరుపతి కల్చరల్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన వివిధ నియోజకవర్గాల నేతలను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర యూత్ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పిట్టా హేమంత్రెడ్డి, రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని, రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శులుగా నగిరికి చెందిన డీ.లోకనాథం, మల్లం రవిచంద్రారెడ్డి(తిరుపతి), ఎస్.కిషోర్(పలమనేరు) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర యూత్ వింగ్ సహాయ కార్యదర్శులుగా భాగ్యరాజ్ ప్రభంజన్ (కుప్పం), చెంగారెడ్డి(పుంగనూరు), కె.శశిథర్రెడ్డి(చంద్రగిరి), పి.దొరబాబు(పూతలపట్టు), శిబి చంక్రవర్తి(సత్యవేడు) ఎంపికయ్యారు. రాష్ట్ర వలంటీర్స్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా దిండివరం గణేష్(తిరుపతి), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా సీఎస్.హరీష్ (పూతలపట్టు) నియమితులైనట్టు పేర్కొంది. ‘సదరం’ పాట్లు చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు ప్రభు త్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం పునః పరిశీలన కార్యక్రమంలో దివ్వాంగులు అవస్థలు ప డ్డారు. శుక్రవారం ఆ పరీక్ష కేంద్రం వద్ద విక లాంగత్వ పింఛన్దారులు గుమికూడి పునఃపరిశీలన పరీక్ష చేసుకునేందుకు కుస్తీ పట్టారు. ఇటు వైద్యులు, అటూ పింఛన్ దారులు ఇబ్బందులు పడ్డారు. అక్కడ కూర్చుకోవడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. జూన్ 12 వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు జేడీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాలు జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జిల్లాలోని 15 మండలాల్లో రైతులకు చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తొలి దశలో వెదరుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో చేపట్టే కార్యక్రమాల్లో రైతులకు సాంకేతిక యాజమాన్యాలు పద్ధతులు, ప్రకతి వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలు తెలియజేయనున్నట్లు జేడీ వివరించారు. ఎన్ఎస్యూ డీఈ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ దూర విద్యాకేంద్రం ఆధ్వర్యంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.రంగనాథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సంస్కృతంలో ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సు, ఏడాది వ్యవధి డిప్లొమో, రెండు సంవత్సరాల వ్యవధి పాక్శాస్త్రి కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కోర్సులకు ఆసక్తిగల వారు వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440626562 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
యాదమరి : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు మండలం తుమ్మిండపాల్యంకు చెందిన సదా కుమారుడు సిద్దు(11), తమిళనాడు రాష్ట్రం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజ్కుమార్ కుమారుడు అవినాష్ (13) మండల పరిధి కీనాటంపల్లి పంచాయతీ కోయూరులోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చారు. శుక్రవారం గ్రామానికి సమీపంలో ఉన్న కొత్తచెరువు కుంట వద్ద సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ముందుగా కుంటలోకి దిగి ఆడుకుంటున్న చిన్నారి సిద్దు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న అవినాష్ సిద్దుని కాపాడే యత్నంలో బురదలో కూరుకుపోయి మత్యువాత పడ్డారు. ఇది గమనించిన అటువైపుగా వెళ్తున్న కొందరు స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వస్తే ఇలా మృత్యుఒడికి చేరుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఒక రోజు హెడ్మాస్టర్లుచిత్తూరు కలెక్టరేట్ : సర్వీస్లో చేరినప్పటి నుంచి హెడ్మాస్టర్ కావలన్నది ప్రతి టీచర్ కల. అలాంటి కల ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు టీచర్లకు నెరవేరింది. కానీ ఆ కల ఒక రోజుకు మాత్రమే మిగిలింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం ఓల్డ్ పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీదేవి, తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్ మండలం జెడ్పీ పద్మావతిపురం హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా విధులు నిర్వహిస్తున్న తిమ్మసముద్రం సుధారాణి ఒక రోజు హైస్కూల్ హెచ్ఎంలుగా విధులు నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఈ నెల 31 వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరికి ఈ నెల 29 న హైస్కూల్ హెచ్ఎం గా ఉద్యోగోన్నతి లభించింది. -
గంజాయి స్వాధీనం
గుడిపాల : గంజాయి స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా.. ఒడిసా రాష్ట్రం, బద్రాక్ జిల్లాకు చెందిన అశోక్దాస్ అనే అతను గంజాయి తీసుకొని గొల్లమడుగు చెక్పోస్ట్ సమీపంలో ఉన్నాడని సమాచారం అందిందన్నారు. వెంటనే గుడిపాల తహసీల్దార్ జయంతికి సమాచారం అందించామన్నారు. సంఘటనా స్ధలానికి తహసీల్దార్తో పాటు పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసి విచారించగా గాజులపల్లెలోని సాంబా గ్రానైట్ ఫ్యాక్టరీలో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన గ్రామానికి వెళ్లి వచ్చేటప్పుడు బద్రాక్ జిల్లాలో గంజాయిని ఒక కిలో రూ.3 వేలకు కొని ఇక్కడ రూ.20 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పాడన్నారు. అతడి వద్ద నుంచి సుమారు 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఆర్ఐ రమాసాయి, వీఆర్ఓ నాగరాజు, పోలీసులు పాల్గొన్నారు.తగ్గిన పాల ధరలుచిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వర్షాల కారణంగా పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా పాల ధరలు పడిపోయాయి. లీటర్పై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.నేడు లీటరు రూ.33ఏప్రిల్కు ముందు రోజు వారీగా 12 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది...ప్రస్తుతం 19 లక్షల లీటర్లకు పుంజుకుంది. ఇలా పాల ఉత్పత్తి పెరగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల ధరలు పడిపోయాయి. ఏప్రిల్లో పాల మధ్యస్థ ధర లీటర్ రూ.35.50 ఉండగా నేడు రూ.33కు పడిపోయింది.● ప్రస్తుతం డెయిరీల నుంచి డీలర్లకు విక్రయించే పాల ప్యాకెట్ లీటర్ ధర రూ.65.40 ఉంది. డీలర్లు ప్రజలకు అమ్మే ఎమ్మార్పీ ధర రూ.72 నుంచి రూ.74 ఉంది. అయితే ధరలు తగ్గుముఖం పడితే ఆ ధరలను తగ్గించకుండా డెయిరీలు పాడి రైతులు, ప్రజలను మోసం చేస్తున్నాయి. -
తరగతుల రద్దు చెల్లదు
● డీఈఓ, ఆర్జేడీలను వివరణ కోరిన హైకోర్టు ● హాకింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ కుప్పంరూరల్ : హాకింగ్ పాఠశాలలో స్టేట్ సిలబస్కు చెందిన 8, 9, 10 తరగతుల రద్దు విషయంలో న్యాయమే గెలిచిందని కుప్పం హాకింగ్ ఇంటర్ నేషనల్ స్కూల్ కరస్పాండెంట్, కుప్పం మున్సిపాలిటీ వై ఎస్సార్ సీపీ అధ్యక్షుడు హఫీజ్ అన్నారు. గత శుక్రవారం తమ పాఠశాలలో స్టేట్ సిలబస్కు చెందిన 8, 9,10 తరగతులు రద్దు చేస్తూ డీఈవో ఆదేశాలు ఇచ్చారన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన విషయంపై తాము హైకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. కోర్టు గురువారం విచారణకు స్వీకరించి ఒకే ఒక్క వాదనలోనే తరగతుల రద్దు విషయం చెల్లదని తేల్చి చెప్పారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తరగతులు రద్దు చేశారని ఆరోపించారు. జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చారు. వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు తమకు ఎంతగానో మద్దతుగా నిలిచారన్నారు. తమకు స్టేట్ సిలబస్ అనుమతులు ఉన్నా సీబీఎస్సీ సిలబస్పైనే 1 నుంచి 10 వరకు తరగతులు సాగిస్తున్న విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని కోరారు. -
యోగా అలవర్చుకోవాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వం ఉత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు శిక్షణ మైదా నం నందు 4 వేల మందితో నిర్వహించారు. యోగా కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జూన్ 1 నుంచి 20 వరకు ప్రతి మండలం, గ్రామంలోనూ యోగాపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.మోహన్ కు మార్, ఆర్డీ ఓ.భవాని, జడ్పీసీఈవో రవి కుమార్ నాయుడు, ,ఉద్యాన శాఖ డీడీ .మధుసూదన్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి, అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.ఏపీని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజంకార్వేటినగరం : చంద్రబాబు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చేశారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం పుత్తూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార దాహంతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు అబద్దాలు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. జగనన్న పాలనకు, చంద్రబాబు పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మద్యం, మనీ, మాఫీయా, మీడియాను గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రంలో దౌర్జన్య కాండ సృష్టిస్తున్నాడని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.నేడు పింఛన్ల పంపిణీచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ నెలకు సంబంధించి జిల్లాలో 2,63,776 మందికి రూ.112.73 కోట్లతో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31న పింఛన్లు పొందలేని లబ్ధిదారులకు జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు అందజేయాలని ఆదేశించారు.నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీ వాయిదాచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీలు గురువారం పలు కారణాలతో వాయిదా వేశారు.ఈ బదిలీలకు ఉమ్మడి చిత్తూరు పరిధిలోని నాన్ టీచింగ్ విద్యాశాఖ ఉద్యోగులు శుక్రవారం డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పలు కారణాలతో బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. -
చదువుకు ఊపిరి..అమ్మఒడి
ఒకే ఒక్కడు గత ఐదేళ్లల్లో అమ్మఒడి అమలు ఇలా.. నియోజకవర్గం లబ్ధిపొందిన విద్యార్థుల ఖర్చు చేసినది తల్లులు (రూ.కోట్లలో)చిత్తూరు 1,10,045 165.07 గంగాధరనెల్లూరు 98,758 148.14 కుప్పం 98486 147.73 నగరి 94256 141.38 పలమనేరు 90965 136.45 పుంగనూరు 1,09,036 163.55 పూతలపట్టు 97858 146.79 చిత్తూరు కలెక్టరేట్ : ఆర్థిక పరిస్థితులతో ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కాకుండా...పనికి పంపే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని బడికి పంపేలా గత వైఎస్సార్సీపీ సర్కారులో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్ల పాటు జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంను ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థులకు అమలు చేశారు. పాఠశాల విద్య చదివే విద్యార్థులతో ఆగిపోకుండా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు సైతం అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున ఐదు సంవత్సరాలు జమ చేశారు. విద్యారంగం సంస్కరణలో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసిన పూర్వపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే ఒక్కడుగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా 6,99,404 మంది విద్యార్థులకు గత ఐదేళ్ల పాటు అమలు చేసి రూ.1049.11 కోట్లను ఖర్చు చేశారు. పథకం లబ్ధిపొందిన లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. -
● కొత్త స్థానాల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు ● సీనియర్ ఎస్ఏలకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు
హెచ్ఎం బదిలీలు షురూ చిత్తూరు కలెక్టరేట్ : బదిలీల ప్రక్రియలో మొదటి అంకం అయిన గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీల ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎంలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో బదిలీ అయిన హెచ్ఎంలు కొత్త పాఠశాలల్లో చేరారు. ఈ నెలలో కొంత మంది హెచ్ఎంలు ఉద్యోగ విరమణ కానున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న హెచ్ఎంలు ఇంకా రిలీవ్ కాకపోవడంతో జూన్ 1వ తేదీన విధుల్లో చేరనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 169 మంది గ్రేడ్ 2 హెచ్ఎంలు నూతన పాఠశాలలకు బదిలీ అయ్యారు. కొనసాగిన ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ ఉద్యోగోన్నతులకు అర్హత పొందిన వారికి గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చేపడుతున్న ఈ ప్రక్రియలో దాదాపు 155 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. వైభవంగా మహాకుంభాభిషేకం కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ మహా కుంభాషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం జీర్ణోద్దారణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకంలో భాగంగా మూడో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అధికారులు, ఉభయదారులు, దాతలు ఊరేగింపుగా కలశాలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, దాత అనిల్ కుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు. -
సమన్వయంతో జంతు సంక్షేమం
చిత్తూరు కలెక్టరేట్ : సంస్థల సమన్వయంతో జంతు సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఏబీసీ కార్యక్రమంపై పలు శాఖల అధికారులు, ఎన్జీవో సంఘం నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల చిత్తూరులో ప్రారంభించిన ఏబీసీ సెంటర్ ఏర్పాటుపై చిత్తూరు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కలెక్టర్కు కృతజ్ణతలు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు చిత్తూరులో ఏబీసీ కేంద్రం ప్రారంభించడం హర్షణీయమన్నారు. జంతువులకు ఆహారం, వైద్య సేవల కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంహెచ్వో లోకేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ హరి, కిసాన్ డాక్టర్ ధనంజయ్, చిత్తూరు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు న్యాయవాది మాలతి, మంజునాథరెడ్డి, ఆర్తీ, విజయశిరీష పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి చిత్తూరు కలెక్టరేట్ : స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు. గురువారం డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల అధ్యక్షతన జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష మంది సంఘం సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జిల్లాలో వెదురు, మునగ పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మొబైల్ వ్యాన్లో రైతుల పండించిన తాజా కూరగాయలు, సంఘం సభ్యులు చిరుధాన్యాలతో తయారు చేసిన తినుబండారాలు, చిరు ధాన్యాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి విక్రయించే కార్యక్రమాన్ని తవణంపల్లి మండలంలో చేపట్టారన్నారు. సమావేశంలో డీపీఎం రవి, ఏపీఎంలు హేమ, సుబ్బారెడ్డి, మధు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఈనెల 29న జారీచేసిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 1 తేదీ నుంచి ఆగస్టు 31 వరకు పెంచుతున్నామన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
పలమనేరు /గంగవరం : కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి వద్ద చైన్నె– బెంగళూరు హైవేలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని గంటావూరుకు చెందిన సయ్యద్ మహ్మద్(57) స్కూటర్పై స్వగ్రామానికి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు అతడి బైక్ను ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గంగవరం పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీరు ..పలమనేరు /గంగవరం : బెంగళూరులో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గంగవరం మండలంలోని సామరాజుపల్లికి చెందిన శ్రీనివాసులరెడ్డి కుమార్తె లిఖిత(45) బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. సిటీలోని హుగ్లీ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఆమెను ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.బైక్ను ఢీకొన్న కారు : ఇద్దరి మృతిబంగారుపాళెం : మండలంలోని పాలమాకులపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చిత్తూరు పట్టణం లక్ష్మీనగర్కు చెందిన అమరేంద్రబాబు(48), బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లెకు చెందిన రమేష్(44) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై పనులకు వెళ్లి బలిజపల్లె నుంచి బంగారుపాళెం వైపు వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా చిత్తూరు నుంచి పలమనేరు వెళుతున్న కారు.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పంటలపై ఏనుగుల విధ్వంసంచౌడేపల్లె : మండలంలోని పందిళ్లపల్లె పంచాయతీ తొప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె, చుక్కావారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పంటలను గురువారం తెల్లవారు జామున ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. వరి ,మామిడి, బెండ, బీర, టమాట పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్ల పైపులు ధ్వంసం చేసి విరిచేశాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
టీచర్ల బదిలీల్లో రగడ
● డీఈఓపై దురుసు ప్రవర్తన ● మహిళా అధికారిణిని కించపరిచేలా వ్యాఖ్యలు ● కమిషనర్కు ఫిర్యాదు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు చిత్తూరు కలెక్టరేట్ : బాధ్యతగా వ్యవహరించి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన సంఘం నాయకులు డీఈఓ పై దురుసుగా ప్రవర్తించారు. ప్రస్తుతం టీచర్ల కసరత్తు జరుగుతున్న విషయం విధితమే. ఏ శాఖలోనూ లేని విధంగా విద్యాశాఖలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తు అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తూనే జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను రోడ్డున పడే విధంగా వ్యవహరించి విమర్శలకు తావిస్తున్నారు. రీ అపోర్స్మెంట్ పాయింట్లపై వివాదం జిల్లాలోని కొంత మంది టీచర్లకు రీ అపోర్స్మెంట్ పాయింట్లు నమోదు చేయడం లేదంటూ ఫ్యాఫ్టో సంఘం నాయకులు గురువారం డీఈఓ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడకు చేరుకున్న వివిధ సంఘాలు, ఫ్యాఫ్టో నేతలు డీఈఓతో వాదనకు దిగారు. రీ అపోర్స్మెంట్ పాయింట్లు ఎందుకు ఇవ్వరంటూ దురుసుగా ప్రవర్తించారు. తిరుపతి జిల్లా ఫ్యాఫ్టో నాయకులు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు సురేష్ మహిళా డీఈఓ వరలక్ష్మి పై దురుసుగా ఆమె కేడర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రవర్తనను చూసిన మిగిలిన సంఘం నాయకులు అడ్డు పడుతున్నప్పటికీ రెచ్చిపోయారు. రీ అపోర్స్మెంట్ పాయింట్ల క్లారిఫికేషన్ ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెబుతున్నా ఆ సంఘం నేత కోపంతో ఊగిపోయారు. అసహనానికి లోనైన జిల్లా విద్యాశాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించిన తిరుపతి జిల్లా ఏపీటీఎఫ్ సంఘం నేత సురేష్, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలానికి చెందిన ఎస్జీటీ విజయకుమార్పై శాఖాపరమైన చర్యలకు కమిషనర్ కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఆ ఇద్దరిపై త్వరలో వేటు పడనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించిన అధికారులు బదిలీల ప్రక్రియలో 2021 బదిలీల్లో వచ్చి 2025 బదిలీల్లో రీ అపోర్స్మెంట్ గురవుతున్న టీచర్లకు పాత స్టేషన్ పాయింట్లు వర్తింపజేయాలన్న టీచర్ల డిమాండ్ను జిల్లా విద్యాశాఖ అధికారులు పరిష్కరించారు. ఈ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 29వ తేదీలోపు, ఎస్జీటీలు ఈనెల 30వ తేదీ నుంచి గ్రీవెన్స్లో పాత స్టేషన్ పాయింట్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. -
ఊరు దాటాల్సిందే!
అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించింది. అమాయక ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా రని నమ్మేశారు. కూటమి ఇచ్చి న కపట హామీలను నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడా ది అవుతున్న సమయంలో ఏ సంక్షేమ పథకం....ప్రభుత్వ సేవలు.... సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో విస్మయం చెందుతున్నారు. గత ఐదేళ్ల పాటు ఇంటి ముంగిటకే చేరిన సంక్షేమపాలన, ప్రభుత్వ సేవలను గుర్తు చేసుకుని తప్పు చేశా మని ఆవేదన చెందుతున్నారు. నమ్మి కూటమి టీడీపీకి ఓట్లు వేసిన పాపానికి ప్రస్తుతం సంక్షేమ పథకా లు, ప్రభుత్వ సేవలకు గడప కాదు కదా ఊరు దాటాల్సిన దుస్థితి ఏర్పడిందని మదన పడుతున్నారు.నాన్ డీబీటీ పథకంలో లబ్ధి ఇలా.... నాన్ డీబీటీ పథకం, లబ్ధి పొందిన వారు, ఖర్చు చేసిన మొత్తం (రూ.కోట్లలో)జగనన్న గోరుముద్ద, 137898, 140.78జగనన్న విద్యాకానుక, 141030, 100.16ఇళ్ల పట్టాలు, 90670, 2266.75రేషన్కార్డుల పంపిణీ, 78665, - -
నేడు కార్యాలయాల వద్ద పడిగాపులు
● ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యం కూటమి పాలనలో కులం, మతం, పార్టీ, వర్గం అనే అంశాలను తుంగలో తొక్కారు. అమలు చేస్తున్న అరకొర సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల పేరు వెనుక మూడు అక్షరాలుంటే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్భాటంగా ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఏ పని కావాలన్నా కూటమి ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ప్రజలు సలాం కొట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి పాలనను చూస్తున్న ప్రజలు విస్తుపోతున్నారు. ● కొత్త పింఛన్ల ఊసే లేదు కూటమి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే జిల్లాలో 15 వేలకు పైగా పింఛన్లను తొలగించి పేదల పొట్ట కొట్టింది. ప్రస్తుత సర్కారు పాలనలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఒక్క లబ్ధిదారునికి సైతం నూతన పింఛన్ మంజూరు చేయని దుస్థితి. దీంతో ప్రతి సోమవారం వృద్ధులు కాళ్లు అరిగేలా పింఛన్ల మంజూరుకు కలెక్టరేట్కు విచ్చేసి వినతులు అందజేసి వేడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా అర్హులు కొత్త పింఛన్ల మంజూరుకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు కూటమి పాలనలో వలంటీర్లను నిలిపివేయడంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కనుమరుగయింది. దీంతో ఈ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు అవస్థలు పడుతూ సచివాలయాల వద్ద పడిగాపులు పడి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. ● రేషన్ వాహనాలు కనుమరుగు ప్రతి నెలా పేద ప్రజల ఇంటి వద్దకు రేషన్ సరుకులను చేరుస్తున్న రేషన్ బండికి కూటమి సర్కారు కనుమరుగు చేసింది. రేషన్ వాహనాలకు రాజకీయ రంగును పులిమి రద్దు చేశారు. దీంతో ఇంటింటికి రేషన్ పథకానికి మంగళం పాడారు. ఆ వాహనాలను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న వేల మంది రోడ్డున పడ్డారు. ● గడప దాటుతున్నా పరిష్కారం కాని సమస్యలు ప్రస్తుత కూటమి సర్కారు వలంటీర్లను తొలగించడంతో ప్రజలు అర్జీలు చేతపట్టి గడప దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. కలెక్టరేట్లలో సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని ముఖ్యమైన 29 శాఖల్లో 55,789 అర్జీలు నమోదు అయ్యాయి. అందులో 10 శాతం వినతులు కూడా పరిష్కారానికి నోచుకోని దుస్థితి కూటమి పాలనలో నెలకొంది. ● ఒక్క సెంటు భూమి ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుత కూటమి పాలనలో సొంతింటి కోసం ప్రజలు నిత్యం కలెక్టరేట్లో దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ కూటమి పాలనలో ఒక్క పేద లబ్ధిదారునికి సెంటు భూమి ఇవ్వని దుస్థితి ఏర్పడింది. ● కానరాని ఇంటింటికీ వైద్యం ప్రస్తుత కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వని దుస్థితి ఏర్పడింది. -
విరివిగా మొక్కలు నాటండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో గురు వారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జూన్లో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. జూన్, జులై నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూములు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.అలసత్వం వహిస్తే చర్యలుజిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలపై విధులు సక్రమంగా నిర్వహించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఇళ్ల పురోగతిని పరిశీలించాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను త్వరతిగతిగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎఫ్వో భరణి, సామాజిక అటవీశాఖ అధికారి జ్ఞానప్రకాష్, డ్వామా పీడీ రవికుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ, హౌసింగ్ పీడీ గోపాల్నాయక్, ఈఈ, డీఈలు పాల్గొన్నారు. -
నాడు ఇంటి వద్దకే సేవలు
● వైఎస్సార్పీపీ పాలనలో పార్టీలకతీతంగా.. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో కులం, మతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేశారు. ప్రజలు సంక్షేమ పథకాలకు ఎవ్వరి దగ్గరికి వెళ్లి సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా పథకాలను పంపిణీ చేశారు. ఒక్క ఏడాది పథకాలు అమలు చేసి చేతులు దులుపుకోకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల దరఖాస్తులను పూర్తి చేసి అందజేసేవారు. జిల్లా వ్యాప్తంగా 612 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,220 మంది వలంటీర్లు ప్రతి నెలా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించేవారు. ● వైఎస్సార్సీపీ పాలనలో అదనంగా పింఛన్లు వైఎస్సార్సీపీ పాలనలో ఏటా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించి మంజూరు చేసేవారు. 2019 సంవత్సరానికి ముందు టీడీపీ ప్రభుత్వం జిల్లాలో 4,65,180 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేసేది. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు జిల్లాలో 5,22,869 మందికి పింఛన్లను అందజేసింది. దాదాపు 57 వేల మందికి అదనంగా పింఛన్లను అందజేసింది. ● వలంటీర్లతో సేవలు ప్రతి నెలా ఒకటో తేదీన వేకువజామునే వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టి పింఛన్లు అందజేసేవారు. దూర ప్రాంతాల్లో చికిత్సలు పొందుతున్న లబ్ధిదారులకు సైతం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పింఛన్లు ఇచ్చేవారు. ● ఇంటి వద్దే సమస్యల పరిష్కారం గత ఐదేళ్లల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా గ్రామ సచివాలయం పరిధిలోనే పరిష్కారం అయ్యేవి. వాలంటీర్లే ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవారు. ప్రతి నెలా అధికారిక యంత్రాంగం గ్రామాల్లో పర్యటించేవారు. ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేవారు. ● అర్హులయితే సరి..పట్టా ఇవ్వండి గత వైఎస్సార్సీపీ సర్కారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆయా గ్రామాల పరిధిలోని లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి పట్టాతో పాటు పక్కా గృహం మంజూరు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1263 లే అవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 1,48,877 మంది లబ్ధిదారులకు పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశారు. దీంతో లక్షల మంది సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. ● డాక్టర్లే ఇంటి వదకు వచ్చి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించారు. ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు చేశారు. అదే విధంగా డాక్టర్లే ఇళ్ల వద్దకు వెళ్లి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యం అందించారు. గత సర్కారు పాలనలో 31 సంచార వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి 5 లక్షలకు పైగా ప్రజలకు వైద్య సేవలందించారు. -
పీఎం సూర్యఘర్ లక్ష్యం పెంపు
చిత్తూరు కార్పొరేషన్ : పీఎం సూర్యఘర్ లక్ష్యా న్ని పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. గురువారం విజయవాడ నుంచి సీఎండీలతో కలిసి అన్ని జిల్లాల ట్రాన్స్కో ఎస్ఈలతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఎస్ఈ కార్యాలయం నుంచి ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, టెక్నికల్ ఈఈ జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా లక్ష సర్వీసులు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. వీటిని జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీలకు అదనంగా రూ.20 వేలు రాయితీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభు త్వం అంగీకారం తెలిపిందన్నారు. 200 యూ నిట్లు విద్యుత్ వాడే ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు ఉచితంగా సౌర ఫలకాలు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా బీసీలకు ఇస్తున్న రాయితీ గురించి అవగాహన కల్పించాలన్నా రు. నెలకు 300 యూనిట్లు వాడుతున్న సర్వీసులకు వీటిని వినియోగించుకునే విధంగా ప్రచా రం చేయాలన్నారు. జెడ్పీలో బదిలీల కౌన్సెలింగ్ చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్లో బదిలీలకు అర్హులైన వారికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఐదు సంవత్సరాలు పైగా పనిచేస్తున్న సీనియర్ సహాయకులు 11 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సీఈఓ రవికుమార్నాయుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన ఉద్యోగులతో చర్చించి బదిలీల ప్రక్రియను తదుపరి ముగించనున్నట్లు సీఈఓ తెలిపారు. పంచాయతీరాజ్లో చిత్తూరు ఏఈ ఉమా మహేష్ ఐరాలకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆర్అండ్బీలో జూనియర్ సహాయకులు 7 మంది, టైపిస్టులు 4, రికార్డు సహాయకులు 3, అటెండర్లు 24 మంది ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. జూన్ 4 నుంచి వేరుశనగ విత్తన పంపిణీ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో జూన్ 4వ తేదీ నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన ఏడీఏలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించి జిల్లాకు ఇప్పటి వరకు 15943 క్వింటాళ్ల విత్తనం వచ్చిందన్నారు. మరో 10 వేల క్వింటాళ్ల వరకు కాయలు రావాల్సి ఉందన్నారు. జూన్4వ తేదీన చేపట్టబోయే పంపిణీ అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు డ్రోన్లు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు ఏడీఏ ఉమ, సౌభాగ్యలక్ష్మి, గీతాకుమారి, శివకుమార్ పాల్గొన్నారు. నేడు మెగా యోగా చిత్తూరు కలెక్టరేట్ : యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్లో మెగా యోగా కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మెగా యోగా క్యాంపెయిన్ శుక్రవారం ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ జీతాలు చెల్లించాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 2 నెలల పెండింగ్ జీతాలతో పాటు 2019–2021 జీతాలు మంజూరు చేయాలన్నారు. 2019–2021 వరకు సుమారు 36 నెలల జీతాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 350 మంది ఆయాలకు చెల్లించాలన్నారు. కొంత మందికి 18 నెలల జీతాలు ఇచ్చి మరికొంత మందికి 14 నెల జీతాలు పెండింగ్లో పెట్టారన్నారు. రాజకీయ కక్షతో తొలగించిన ఆయాలను విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆయమ్మల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆశ, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకుమారి పాల్గొన్నారు. -
మామిడి రైతులను ఆదుకోకుంటే ఆత్మహత్యలే
● జిల్లాలో మామిడి ధరలు పతనం ● రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానిదే బాధ్యత ● సమావేశంలో రైతుల ఆవేదన ● జూన్ 2న కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా మామిడి రైతులను ఆదుకోకుంటే.. రైతుల ఆత్మహత్యలను చూస్తారని.. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని రైతు నాయకులు ప్రకాష్, హరిబాబునాయుడు, శేషాద్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు నగంలోని ప్రెస్క్లబ్లో గురువారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో మామిడి ధర దిగజారిందన్నారు. మార్కెట్లోకి వెళ్తే మామిడి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు. సీజన్ ప్రారంభమైనా ఫ్యాక్టరీలు తెరుచుకోవడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు. ధరలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసిగా ఉండి గతంలో చక్కెర ఫ్యాక్టరీలను మూయించారన్నారు. చెరుకు పంట పోగా.. మామిడి నాటితే.. ఈ పంటను కూడా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులంతా ఏకమై జూన్ 2వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలోని రైతులంతా పాల్గొని గిట్టుబాటు ధర కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు నాయకులు మహదేవనాయుడు, రఘునాథనాయుడు, జయచంద్రనాయుడు, చిన్నబ్బరెడ్డి, లోకమందడి తదితరులున్నారు. -
చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 82,597 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
తగ్గిస్తారా.. తప్పు ఒప్పుకుంటారా?
నినాదాలు చేస్తున్న అభినయ్, వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి దూకుడుకు కూటమి ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారును నిత్యం ఇరుకున పెడుతుండడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది. మొన్నటికి మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వినూత్న రీతిలో తెలిపిన నిరసనగా సమాధానం చెప్పుకోలేక సతమతమైంది. తర్వాత సూపర్ సిక్స్ హామీలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడంతో కూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. ఈ క్రమంలోనే యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నాటకీయంగా చూపించిన పెట్రో ధరల విషయాలను గుర్తుచేస్తూ ఇరుకున పెట్టడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాజకీయాల్లో విశ్వనీయత ఉండాలంటే నేతలు మాట ఇస్తే దాని మీది నిలబడాలని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో యువగళం సందర్భంగా నారా లోకేష్ కర్ణాటక, ఆంధ్రలో పెట్రో ధరల మధ్య తేడాను చూపుతూ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రో ధరలు తగ్గిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ సదరు హామీ అమలు కాకపోవడంతో భూమన అభినయ్ మండిపడ్డారు. బుధవారం వేకువజామున కర్ణాటకలో లోకేష్ వెళ్లిన పెట్రోల్ బంక్కే వెళ్లి పెట్రోల్ పట్టించుకున్నారు. ధర ఎంత ఉందో బహిరంగంగా ప్రదర్శించారు. వెంటనే కుప్పంలో లోకేష్ వెళ్లిన బంక్లోనే పెట్రోల్ తీసుకుని ధరను చూపించారు. కర్ణాటక కంటే కుప్పంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు వెంటనే పెట్రో ధరలు తగ్గించాలని కోరారు. లేకుంటే తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువగళం హామీ హామీ అమలు చేయాలి పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి నారా లోకేష్కు భూమన అభినయ్ డిమాండ్ -
రోడ్డు రోలర్ను ఢీకొని యువకుడి మృతి
విజయపురం : రోడ్డు పక్కన ఆగి ఉన్న రోడ్డు రోలర్ను బైక్తో ఢీకొని తమిళ్ సెల్వన్ (24) అనే యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం పన్నూరులో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా...ఇష్టకామేశ్వపురం గ్రామానికి చెందిన దొరస్వామి రెండో కుమారుడు తమిళ్ సెల్వన్ సొంత పని నిమిత్తం కనకమ్మసత్రం వెళ్తుండగా పన్నూరు దళితవాడ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న రోడ్డు రోలర్ను బైక్తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగా తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యచిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరానికి చెందిన రవి (41) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ మహేశ్వర కథనం మేరకు... చిత్తూరులోని గూలింగ్స్ పేటకు చెందిన రవి ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రీషన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు చుట్టు ముట్టడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.అనుమానాస్పద స్థితిలో మేకలు మృతిపుత్తూరు : మండల పరిధిలోని ఎగవ కనకంపాళెం గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన బుధవారం సాయంత్రం 10 మేకలు మృతి చెందాయి. మేకలు దిగువ కనకంపాళెం గ్రామానికి చెందినవి కాగా వాటి మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతి చెందిన మేకలను గ్రామస్తులు పూడ్చిపెట్టినట్లు సమాచారం. -
‘మహా’ అగచాట్లు
● మహానాడు సేవలో ఆర్టీసీ ● ప్రయాణికులను పట్టించుకోని ప్రభుత్వం ● తమిళనాడు, బెంగళూరుకు బస్సుల్లేక ఇక్కట్లు ● జిల్లా వ్యాప్తంగా 200 పైగా బస్సుల మళ్లింపు ● ‘మెప్మా’ ద్వారా బలవంతపు జన సమీకరణ ఆర్టీసీ అధికారుల మౌనం మహానాడుకు సభలకు చిత్తూరు డిపో నుంచి 90, కుప్పం 50, పుంగనూరు 50, పలమనేరు నుంచి 27 బస్సులను కడపకు మళ్లించారు. జిల్లా మొత్తంగా 200కు పైగా ఆర్టీసీ బస్సుల లోటు రావడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ చర్యలు కల్పించడంలో అధికారులు చేతులెత్తేశారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో బెంగళూరు, వేలూరుకు నిత్యం వందల ట్రిప్పుల్లో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేయాల్సి ఉంది. బస్టాండుల్లో బస్సుల కోసం ప్రజలు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నా, సీట్ల కోసం కుస్తీలు పడుతున్నా అధికారులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఉత్తర్వులు రావడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు. చిత్తూరు అర్బన్ : తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమానికి జిల్లా నుంచి దాదాపు 200 ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో జిల్లాలోని ప్రయాణికులకు మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ సంస్థపై.. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. కడపలో జరుగుతున్న మహానాడుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మహిళా సంఘాలు రాకపోతే జరిమానా కడప నగరంలో మూడు రోజులుగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులను మహానాడుకు సభలకు తీసుకెళ్లడానికి ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు జన సమీకరణ బాధ్యత తీసుకున్నారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలోని మహిళా సంఘాలను మహాసభలకు పంపించారు. ఎవరైనా సభలకు రాకపోతే రూ.300 జరిమానా విధిస్తామని, సంక్షేమ పథకాలు రావని భయపెట్టి మహిళలను కడపకు తరలించారు. గంటల కొద్దీ నిరీక్షణ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడటంతో సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరులో చదువుకునే విద్యార్థులు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులు బస్సుల్లేక పడరాని పాట్లు పడ్డారు. గమ్యస్థానానికి బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్టాండుల్లో నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వాళ్లు, మహిళలు, తిరుమల నుంచి తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సు ల కోసం నిరీక్షించి, నీరసించిపోయారు. పల్లె వెలుగు నుంచి లగ్జరీ బస్సుల వరకు టీడీపీ సభలకు తరలించడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, బెంగళూరు, పీలేరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తవణంపల్లి, పెనుమూరు, జీడీ నెల్లూరు కడప తదితర మార్గాల్లో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బస్సులు.. ఆయా ప్లాట్ఫామ్లపై నిర్మానుషంగా కనిపించాయి. -
మామిడికి గిట్టుబాటు ధర
– రైతు సంఘాలకు కలెక్టర్ హామీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో తోతాపురి రకం మామిడికి మరో నాలుగు రోజుల్లో గిట్టుబాటు ధర నిర్ణయిస్తామని రైతు సంఘాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హామీ ఇచ్చారు. మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ బుధవారం కలెక్టరేట్ వద్ద మామిడి రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం వారు కలెక్టర్కు పలు సమస్యలు వెల్లడించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు మాట్లాడుతూ.. తోతాపురి మామిడికి కిలోకు రూ.30 గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గుజ్జు యజమానుల నుంచి రూ.20, ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుంచి మరో రూ.10 అందజేయాలని డిమాండ్ చేశారు. రైతుక మామిడి ఉత్పత్తికి రూ.15 ఖర్చు అవుతోందన్నారు. జిల్లాకు మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. బేనీషా రకం మామిడికి రైతు బజారులలో అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. ఆ మామిడికి కిలోకు రూ.50 చొప్పున గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. సంప్రదింపుల కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్, నాయకులు ఆనంద్ నాయుడు, హరిబాబు చౌదరి, మునీశ్వర్ రెడ్డి, భారతి, నాగరాజు నాయుడు, రాజేందర్ రెడ్డి, మస్తానయ్య, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
రూ.17,809 కోట్లతో రుణ ప్రణాళిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రూ.17,809 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ బుధవారం కలెక్టరేట్లో రుణ ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీఎల్ఆర్, డీసీసీ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడేలా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు వివిధ రకాల రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పాటునివ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో భాగంగా నిర్ధేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు కచ్చితంగా చేరుకోవాలన్నారు. ఇందులో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు. అదేవిధంగా పంటలకు రుణాలు, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమకు షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాలను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పరిశ్రమల స్థాపనకు రుణాలను మంజూరు చేయాలన్నారు. స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్బీఐ ఏపీఆర్వో రోహిత్ అగర్వాల్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్డీఎం హరీష్, డీసీసీ కన్వీనర్ ఇందిరా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి రుణాల మంజూరులో అలసత్వం వద్దు బ్యాంకర్లు కచ్చితంగా రుణ లక్ష్యాలను చేరుకోవాలి వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ 2025–26 వార్షిక రుణ ప్రణాళిక 2025–26 సంవత్సరానికి జిల్లా క్రెడిట్ ప్లాన్ ప్రాధాన్యతా రంగంలో మొత్తం క్రెడిట్ వ్యయం రూ.17,809.37 కోట్లు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వివిధ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు 815145 ఖాతాలకు రుణాలు ఇవ్వడం. ప్రాధాన్యత లేని రంగానికి రూ.2,787.17 కోట్లు కేటాయింపు, ఈ మొత్తం క్రెడిట్ వ్యయం రూ.17,809.37 కోట్లు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులు రూ.12,195.27 కోట్లు. ఈ రంగంలో దాదాపు 6.38 లక్షల మంది రైతులు, భూమిలేని కార్మికులకు సహాయం. చిన్న – సూక్ష్మ పరిశ్రమల రంగానికి కేటాయింపులు రూ. 2,216.07 కోట్లు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.220.81 కోట్లు. వాణిజ్య బ్యాంకుల వాటా రూ.11,843.43 కోట్లు. ఇది జిల్లా క్రెడిట్ ప్లాన్లో 66.50% వాటా. -
తుడాను సందర్శించిన ‘కాగ్’
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను బుధవారం కాగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వీసీ మౌర్య తుడా చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న అకౌంటింగ్ విధానాలను కాగ్ బృందానికి వివరించారు. డిజిటలైజేషన్కు తక్షణం చర్యలు చేపట్టాని కాగ్ కమిటీ అధికారులకు సూచించింది. సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కాగ్ రీవూ ప్రకాష్, కాగ్ డైరెక్టర్ జనరల్ రష్మీ అగర్వాల్, డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఎన్వీ నిఖిత, సీనియర్ డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఆర్.శ్యామ్, తుడా కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు. -
విగ్రహ పునఃప్రతిష్టాపనకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 30న చేపట్టే శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపనకు విచ్చేయాలని కలెక్టర్ను ఆహ్వానించారు. బుధవారం కాణిపాకం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి ఆహ్వానం అందజేశారు. ఏఈవో మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ను పునఃప్రతిష్టాపన చేస్తామన్నారు. మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం వేద పండితులు కలెక్టర్కు వేద మంత్రాలతో ఆశీర్వదించి ఆలయ ప్రసాదంను అందజేశారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నుంచి ‘టీబీ ముక్తభారత్’ చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లాలో జూన్ నెల మొదటి వారం నుంచి టీబీ ముక్తభారత్ కార్యక్రమం ప్రారంభమవుతుందని డీఎంహెచ్ఓ సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో బుధవారం ఎంఎల్పీహెచ్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జూన్ మొదటి వారం నుంచి వంద రోజుల పాటు టీబీ ముక్తభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హైరిస్క్ జనాభా ఉన్న ప్రాంతంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ మధుమేహం, బీపీ, మద్యం తాగేవారికి, గతంలో టీబీ ఉన్నవారికి టీబీ స్కీన్రింగ్ పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఎంపీహెచ్ఓలకు పూర్తయిన కౌన్సెలింగ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఎంపీహెచ్ఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 92 మందికి డీఎంహెచ్ఓ సుధారాణి సమక్షంలో కౌన్సెలింగ్ చేశారు. సాయంత్రానికి కౌన్సిలింగ్ పూర్తి చేసి హైరిస్క్ ప్రాంతాల్లో పనిచేసేలా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి –అపోలోపై విచారణ – జూన్ 3వ తేదీన కమిటీ రాక చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి–అపోలోలో జరుగుతున్న లోపాలు, నిర్వహణ తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో రాష్ట్ర డీఎస్హెచ్ రమేష్నాథ్, డిప్యూటీ కమిషనర్ రమేష్ కిషోర్, రాష్ట్ర వైద్యవిధాన కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర డీఎస్హెచ్ ఈఈ విజయ భాస్కర్, రాష్ట్ర డీఎస్హెచ్ బయో మెడికల్ ఇంజినీర్ సందీప్రెడ్డిని నియమించింది. వీరు జూన్ 3వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. -
యోగా యాప్లో నమోదుకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రజలందరూ యోగా యాప్లో నమోదు కావాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై అవగాహన పెంచేందుకు మండల , గ్రామస్థాయి వరకు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని (మే 21 నుంచి జూన్ 21) వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కలిగించేలా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. నేటి నుంచి గ్రామస్థాయిలో యోగా పోటీలు ప్రారంభించాలన్నారు. 4756 మంది యోగా శిక్షకులుగా నమోదయ్యారన్నారు. అదే విధంగా జిల్లాలో 1,66,713 మంది ప్రజలు యాప్ లో నమోదయ్యారని చెప్పారు. జూన్ 21 నాటికి ప్రతి ఒక్కరు యోగాపై అవగాహన కలిగి, సాధన చేసే విధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
‘పూతలపట్టు పోలీసులు వేధిస్తున్నారు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారని పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లెకు చెందిన భానుప్రకాష్ ఆరోపించారు. బుధవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 14వ తేదీన గ్రామానికి చెందిన ఫీల్డ్ ఆఫీసర్ ఆదెమ్మ తమ గ్రామంలో బాలకార్మికుల చేత పనిచేయించారని, ఈ విషయాన్ని ఫొటోలతో సహా పీడీకి ఫిర్యాదు చేశానన్నారు. తర్వాత 21వ తేదీ పూతలపట్టు పోలీసులు తనను స్టేషన్కు రమ్మన్నారని చెప్పారు. తాను స్టేషన్కు వెళ్తే ఏ వివరాలు చెప్పకుండా.... అకారణంగా రెండు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పారు. తనను ఎందుకు స్టేషన్లో కూర్చోబెట్టారని అడిగితే ‘ఫీల్డ్ ఆఫీసర్ పైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ తనను దుర్భాషలాడారని ఆరోపించారు. తనపై ఏ కేసు పెట్టారని ఆర్టీఐ కింద అర్జీ ఇచ్చినా పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.నేటి నుంచి రైతులకు సాంకేతికతపై అవగాహనరేణిగుంట : వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై గురువారం నుంచి అవగాహన కల్పించనున్నట్లు రాస్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఖరీఫ్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినియోగించాల్సిన టెక్నాలజీని వివరించనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబుతిరుపతి సిటీ: ఎస్వీయూ లైబ్రరీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కె.సురేంద్రబాబును వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్గా నియమిస్తూ వీసీ అప్పారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేంద్రబాబు వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో డీన్గా ఉన్న ప్రొఫెసర్ ఎస్ కిషోర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.వృద్ధురాలికి గాయాలుపాకాల: మండలంలోని ఇరుగురురంగయ్యగారిపల్లె వద్ద బుధవారం రోడ్డు దాటున్న మరియమ్మ అనే వృద్ధురాలిని 104 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ కుడి కాలు విరిగింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
సినిమా థియేటర్లలో తనిఖీలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొన్ని థియేటర్లకు లైసెన్సు లేకుండా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికెట్ లేకుండా నిర్వహిస్తున్నారు. కొత్త థియేటర్లతో పోలిస్తే పాత థియేటర్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులు తనిఖీలో బట్టబయలైంది. ప్రేక్షకులకు కనీసం తాగునీరు అందుబాటులో లేదని, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతూ అధ్వాన్నంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనానికి రూ.20, కారుకు రూ.40 చొప్పున వసూలు చేస్తున్నట్లు తనిఖీలో గుర్తించారు. చిత్తూరు నగరంలో మొత్తం 6 థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో రెండు థియేటర్లల్లో ఫైర్ సర్టిఫికెట్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బయట రూ.10 అమ్మే పాప్ కార్న్ థియేటర్లో రూ.100గా ఉన్నట్లు గుర్తించారు. వాటర్ బాటిల్ కూడా ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తున్నారని గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, శానిటేషన్ సర్టిఫికెట్లు లేవని తనిఖీలో బయటపడిందన్నారు. -
నేటి నుంచి ‘గురుకుల’ంలో అడ్మిషన్లు
కుప్పం : రామకుప్పం మండలం విజలాపురంలోని గురుకుల గిరిజన బాలుర పాఠశాలను గిరిజన బాలికల స్కూలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారతశాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి పాఠశాలలో బాలికల అడ్మిషన్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. 3 నుంచి 8వ తరగతి బాలికలకు ప్రవే శం కల్పించనున్నట్లు వివరించారు. కేవలం కుప్పం నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన బాలికలకు ఈ పాఠశాలలో అడ్మిషన్కు అవకాశమిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9502806425 నంబర్లో హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వరబాబును సంప్రదించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చిత్తూరు అర్బన్ : పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ..మృతి చెందిన కుటుంబాలకు చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మార్చి 31వ తేదీన హెడ్ కానిస్టేబుల్ కుబేంద్ర మృతి చెందారు. ఇందుకు గాను మృతుడి భార్య వాణికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కు ఇచ్చారు. అలాగే చిత్తూరులో పనిచేస్తూ ఫిబ్రవరి 2వ తేదీన శ్యామల కుమారి మృతి చెందారు. మృతురాలి కుమారుడు ప్రశాంత్కు రూ.లక్ష చెక్కును అందజేసి వారికి భరోసా ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించం చిత్తూరు రూరల్(కాణిపాకం): ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమిస్తే సహించే ప్రసక్తే లేదని డీఎంహెచ్ఓ సుధారాణి హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ గర్భిణులకు స్కానింగ్ చేసే అధికారం ఆర్ఎంపీలకు లేదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు. స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. యోగాతో శక్తి.. ప్రశాంతత కాణిపాకం : యోగాతో శక్తి, ప్రశాంతత సిద్ధిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆరోగ్యవంతం జీవనానికి ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో యోగా మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో కాణిపాకం, పులిగుండు, బోయకొండ, కంగుంది ప్రాంతాల్లో యోగ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా యోగాసనాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యోగాసనాలు వేశారు. ఆలయ ఈఓ పెంచల కిషోర్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ భవానీ, డీఎంహెచ్ఓ సుధారాణి, దేవదాయశాఖ ఏసీ చిట్టెమ్మ పాల్గొన్నారు. వ్యాధి నిరోధక సంజీవని.. చిత్తూరు కలెక్టరేట్ : యోగా వ్యాధి నిరోధక సంజీవని అని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. మంగళవారం పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల వద్ద యోగా మందిరంలో నిర్వహిస్తున్న మాస్టర్ ట్రైనర్స్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నేటితో మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ యోగా అని వివరించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ బాలాజీ, జీసీడీఓ ఇంద్రాణి, ఆయుష్ వైద్యులు ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్వర్ణయుగం
మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. గ్రామ సచివాలయాలు రావడంతో సామాన్య గ్రామీణుడికి సైతం ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 700లకు పైగా సేవలను గ్రామీణుల గడప వద్దకే చేర్చారు. వలంటీర్లు ద్వారా పల్లెవాసుల కష్టనష్టాలకు ఆసరాగా నిలిచారు. శిథిలావస్థలోని సర్కారు బడులకు ప్రాణం పోశారు. కార్పొరేట్ హంగులతో నిరుపేద పిల్లలకు ఉత్తమ విద్యను అందించారు. రోగం వస్తే దూరాభారం వెళ్లాల్సిన పనిలేకుండా సొంత ఊరిలోనే వైద్యం చేయించుకునేందుకు విలేజ్ క్లిన్క్లు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఇంటింటికీ వైద్యసేవలు తీసుకువచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా నిలిచారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికే చేర్చారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సాగును సంబరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించారు. గ్రామాల్లో పాలశీతలీకరణ కేంద్రాలే ఏర్పాటు చేశారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించారు. పశువులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దాదాపు ప్రతి పల్లెలో మూడు నుంచి నాలుగు ప్రభుత్వ భవనాలు నిర్మించారు. సీసీ రోడ్లు వేయించారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనించాయి. పల్లెసీమలు కళకళలాడాయి. -
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వెలిగిన గ్రామాలు ● సకల సేవలకు సచివాలయాలు ● కార్పొరేట్కు దీటుగా పాఠశాలలు ● అన్నదాతకు అండగా రైతుభరోసా కేంద్రాలు ● అందుబాటులో విలేజ్ క్లినిక్లు ● ప్రస్తుత కూటమి పాలనలో పడకేసిన పల్లె ప్రగతి ● అసంపూర్తిగా భవనాలు ● అలంకారప్రాయ
● ఏడాది క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన రైతు భరోసా కేంద్రాలలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు మార్చేసింది. వాటి పనితీరును అస్తవ్యస్తం చేసేసింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం 30 సొన్నేగానిపల్లె ఆర్బీకే పరిధిలో సొన్నేగానిపల్లె, నాయనపల్లె, కూతేగౌనిపల్లె, బాబూనగర్, కేపీ మిట్ట, సంతూరు, గొల్లపల్లె, వెంకటేష్పురం గ్రామాల రైతులు ఉన్నారు. గత ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకూ ఈ ఆర్బీకేలో వేరుశనగ విత్తనాల పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఆ ఊసే లేదు. కనీసం ఒక్క ఎరువుల బస్తా కూడా రాలేదు. సిబ్బందిని కూడా రైతులకు అందుబాటులో లేకుండా కూటమి ప్రభుత్వం చేసేసింది. మంగళవారం ఉదయం ఆర్ఎస్కేకు వచ్చిన ఇన్చార్జి సైతం కార్యాలయంలో మీటింగ్ ఉందని వెళ్లిపోయాడు. దీంతో రోజంతా కేంద్రం మూతపడి ఉంది. ఇదే తంతు ఏడాదిగా జరుగుతుండడంతో ఇక్కడి వచ్చే రైతుల సంఖ్య కూడా తగ్గిపోయింది. -
కూటమి పాలనలో సర్వం.. నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణులను గాలికి వదిలేసింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత వైఎస్సార్సీసీ ప్రశేశపెట్టిన చక్కటి కార్యక్రమాలకు సైతం తిలోదకాలిచ్చింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని నిర్వీర్యం చేసింది. అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించింది. విలేజీ్ క్లినిక్ల లక్ష్యాలను నీరుగార్చింది. కనీస మాత్రం మందులు కూడా లేకుండా చేసి పల్లెవాసుల ఆరోగ్యంతో ఆటలాడుకుంది. ఇంటింటికీ వైద్యసేవలను తూతూమంత్రంగా మార్చేసింది.ఆర్బీకేలకు రైతు సేవా కేంద్రాలుగా మార్చి.. అన్నదాతలకు అసలు సేవలే అందకుండా దుర్బుద్ధిని చాటుకుంది. పంటల సాగులో కనీసం సలహాలు అందించేందుకు కూడా వ్యవసాయాశాఖ అధికారులు అందుబాటులో లేకుండా చేసింది. నాడు–నేడు కింద అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న బడులను నిర్దయగా వదిలేసింది. పేద బిడ్డల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేందుకు తెగబడింది. -
చెక్డ్యామ్కు గండి కొట్టిన ఘనుడు
పలమనేరు మండలం మొరం పంచాయతీలో కౌండిన్యనదిపై నిర్మించిన చెక్డ్యామ్కు ఓ రైతు గండి కొట్టాడు.● ఇతడి పేరు భాస్కర్ రెడ్డి, విజయపురం మండలం, కళియంబాకం గ్రామం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈయనకు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే ఎరువులు, క్రిమిసంహారక మందులు, యూరియా అన్నీ అందేవి. ప్రస్తుతం ఎరువుల కోసం నానా యాతన పడుతున్నాడు. గతంలో రూ.270 తెచ్చుకునే ఎరువులను నేడు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్ఎన్ కండ్రిగకు వెళ్లి రూ.300లకు కొంటున్నాడు. ట్రాన్స్పోర్టుకు రూ.30 అదనంగా ఖర్చవడంతోపాటు ఎరువుల కొనుగోలు కంటూ సగం రోజు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరు నెలలుగా ఎరువులకోసం రైతు సేవా కేంద్రంలో అడుగుతున్నా ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నాడు. తూతూ మంత్రంగా జనుము మాత్రం పంపిణీ చేశారని వాపోయాడు. తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియని దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని వాపోతున్నాడు. ● ఇతడి పేరు మనోహర్రెడ్డి, గుడిపాల మండలం మరకాలకుప్పం గ్రామం. ఏటా రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాడు. అదే విధంగా ఈ పర్యా యం కూడా సాగుకు సన్నద్ధమయ్యాడు. అయితే ఇ ప్పటి వరకు రైతు సేవాకేంద్రాల్లో వేరుశనగ విత్త నాలు పంపిణీ చేయలేదు. అడిగితే సిబ్బంది తమకు తెలియదంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నా రని ఆవేదన చెందుతున్నాడు. దుక్కులతో పొలం సిద్ధం చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మే 15వ తేదీకే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేవారని గుర్తుచేసుకుంటున్నాడు. కూట మి పాలనలో విత్తనాల ఊసేలేదని ఆరోపిస్తున్నాడు. వ్యవసాయశాఖ అధికారులకే వేరుశనగ విత్తనాల పంపిణీపై ఓ క్లారిటీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. సీజన్ పూర్తయి, అదును తప్పిన తర్వాత వి త్తనాలు ఇస్తారేమో అని ఆందోళన చెందుతున్నాడు. జిల్లా సమాచారం మొత్తం పంచాయతీలు : 697 రెవెన్యూ గ్రామాలు : 822 గ్రామీణ జనాభా : 15.04 లక్షలు కుటుంబాలు : 4,65,970 గ్రామ సచివాలయాలు : 504 ఉద్యోగులు : 5,040 గతంలో పనిచేసిన వలంటీర్లు : 7,728 రూరల్ లోని కుటుంబాలు : 4,65,970 – 8లో -
ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు. -
ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి
● ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పలమనేరు : ఆర్టీసీలో ఖర్చులు తగ్గించి ఆదా యాన్ని పెంచే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొ న్నారు. పలమనేరు డిపోలో మంగళవారం జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలమనేరు బస్టాండు, డిపోలను ఆయన పరిశీలించారు. అనంతరం డిపో వద్ద మొక్కలను నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. డిపోలోని 11 మంది ఆదర్శ ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వలే మీరు కార్మికులు కాదని ఉద్యోగులేననని గుర్తుంచుకోవాలన్నారు. సీఎస్పీ, ప్రమాదబీమా, ఆర్పీఎస్లు సెటిల్ చేశా మన్నారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ పెండింగ్ బకాయిలను త్వరలో ఇస్తామన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణికులకు మర్యాదనివ్వడం చాలా ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో స్థానిక డీఎం టీకే స్వామి, వివిధ కార్మికసంఘాల నేతలు పాల్గొన్నారు. -
మామిఢల్
మామిడల్ ● పడిపోయిన మామిడి ధరలు మామిడి కాయల ప్యాకింగ్లో వ్యాపారులు●చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం కట్టమంచిలోని మామిడి కాయల మార్కెట్ మంగళవారం బోసిపోయింది. వారం రోజులుగా మార్కెట్కు టేబుల్రకాలు 15 టన్నుల వరకు వచ్చేవి. మంగళవారం కేవలం 4 టన్నుల బేనీషా కాయలు మాత్రమే వచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. పడిపోయిన మామిడి ధరల కారణంగా రైతులు కోతలను నిలిపేశారు. రేట్లు వచ్చిన తర్వాత అమ్ముకుందామని కోతకు బ్రేక్ వేశారు. ఎక్కువగా బెంగుళూరు, చైన్నెలో ఉన్నవారికి విక్రయాలు చేసుకుంటున్నారు. బల్క్ బుకింగ్ చేసుకుని వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బేనీషా కిలో రూ.15, చందూర రూ.4 నుంచి రూ.5, అల్పోన్సో రూ.25, తోతాపూరి (టేబుల్రకం) రూ. 10 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. -
స్టాంప్ పేపర్స్.. నోస్టాక్
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నందు స్టాంప్ పేపర్స్ కొరత ఏర్పడింది. గతవారం చివరిలో జిల్లా లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.100 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్ మొత్తం 40 వేలు అందించారు. వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది సోమవారం అమావాస్య, మంగళవారం పాడ్యమి అని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక సిబ్బంది బుధవారం ఆ పేపర్స్ను సీల్ వేసి వాటిని ఆన్లైన్ చేసి ఎప్పుడు ప్రింట్ తీసి ఇస్తారో నని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. -
చెక్డ్యాంకు గండికొట్టిన ఘనుడు
● నీళ్లు వృథాగా పోతున్నాయని రైతుల ఆవేదన పలమనేరు : కౌండిన్య నదిలో నిర్మించిన చెక్డ్యాం కారణంగా తన పొలంలో ఎక్కువగా నీరు నిలుస్తోందని ఓ రైతు ఏకంగా చెక్డ్యాంకే గండికొట్టిన సంఘటన మండలంలోని మొరం పంచాయతీలో మంగళవారం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్యలోని పలు చెక్డ్యామ్ల్లో నీరు చేరింది. అయితే ఈ నీటినిల్వతో తన పొలంలో నీటి ఊట వస్తోందని తొప్పనపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి చెక్డ్యామ్ కింద గండిని కొట్టాడు. దీంతో నీరు వృథాగా పోవడంపై అక్కడి రైతులు అతన్ని వారించినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక సర్పంచ్ విశ్వనాథ రెడ్డి ద్వారా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్థానిక ఇరిగేషన్ డీఈ చోక్లానాయక్ తమ సిబ్బందితో కలిసి గండి పడిన చెక్డ్యామ్ను పరిశీలించి ఇసుక బస్తాలతో నింపాలని అక్కడి రైతులకు సూచించారు. ఇందుకు కారణమైన వ్యక్తిని పిలిపించి వారించగా అతను తాను టీడీపీకి చెందిన వాన్నని ఏమైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని చెప్పడంతో డీఈ సైతం వెనుదిరగాల్సి వచ్చింది. -
డీడీపై కలెక్టర్కు ఫిర్యాదు
● కలెక్టరేట్ వద్ద డీఎస్సీ అభ్యర్థుల నిరసన చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య దురుసు వ్యవహార శైలిపై కుట్టి శిక్షణ కేంద్రం డీఎస్సీ అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి ఆవేదనను చెప్పుకున్నారు. శిక్షణ కేంద్రంపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవుతున్న సమయంలో తమ ఏకాగ్రత దెబ్బతినేలా అధికారి వ్యవహరించడం ఎంత వరకు న్యాయమన్నారు. నిరసన కార్యక్రమంలో కుట్టి శిక్షణ కేంద్రం డైరెక్టర్ పవనకుమారి, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఉద్యోగోన్నతుల సర్టిఫికెట్ల పరిశీలన చిత్తూరు కలెక్టరేట్ : గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ ఎయిడెడ్ పాఠశాలలో పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 150 ఖాళీలకు గ్రేడ్–2 హెచ్ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. సెలవులో జాయింట్ కలెక్టర్ చిత్తూరు కలెక్టరేట్ : వ్యక్తిగత పనుల నిమిత్తం జాయింట్ కలెక్టర్ విద్యాధరి సెలవుపై వెళ్లారు. 27 నుంచి 29 వ తేదీ వరకు అందుబాటులో ఉండరు. జేసీగా కలెక్టరే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. తిరిగి 30న జేసీ వీధులకు హాజరవుతారు. చోరీ కేసులో నిందితుడికి జైలు చిత్తూరు అర్బన్ : ఆలయంలో హుండీ పగులగొట్టి చోరీ చేసిన ఘటనలో రామ్మోహన్ (35) అనే నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి డి.ఉమాదేవి కథనం మేరకు... బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె పంచాయతీ పాపుదేసివారికండిగ గ్రామంలోని వినాయకస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు 2023 మార్చి 31న రాత్రి ఆలయ హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న రూ.2 వేలు అపహరించుకుని వెళ్లారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీ చేపట్టి నిందితుడు అనంతపురం జిల్లా కదిరికి చెందిన రామ్మోహన్ (35)గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ విషయం వెలుగులోకి రావడంతో నిందితుడిపై బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. -
డబుల్ మేజర్..
ఈ ఏడాది నుంచి డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్టులు ● కరిక్యులమ్ రూపకల్పన పూర్తి చేసిన ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ ● వీసీలు, నిపుణులతో చర్చించి నిర్ణయించిన ఉన్నత విద్యామండలి ● ఏఐ, మిషన్లర్నింగ్ కోర్సులతో సరికొత్త డిగ్రీలు ● అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల సంగతేమిటో? ● జిల్లాలో ఓఏఎమ్డీసీ నోటిఫికేషన్ కోసం 30 వేల మంది ఎదురుచూపు తిరుపతి సిటీ: విద్యారంగంలో నూతన సంస్కరణల్లో భాగంగా డిగ్రీలో ఈ ఏడాది నుంచి డబుల్ మేజర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. ఇదివరకు ఉన్న సింగిల్ మేజర్ సబ్జెక్టుతో పాటు మరో మేజర్ సబ్జెక్ట్ను విద్యార్థులు అభ్యసించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కరిక్యులమ్ రూపకల్పన కోసం నియమించిన రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఈ ఏడాది విడుదలయే ఓఎమ్డీసీ నోటిఫికేషన్లో డబుల్ మేజర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని వర్సిటీల వీసీలతో, నిపుణులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న మల్టీడిసిప్లీనరీ విధానంలో మూడు సబ్జెక్టులు మేజర్గా ఉండేవి. 2023–24లో సింగిల్ మేజర్ సబ్జెక్ట్తో డిగ్రీ పూర్తిచేసే అవకాశం కల్పించారు. ఇప్పడు రెండు మేజర్ సబ్జెక్ట్లను విద్యార్థి చదవాల్సిందేనంటూ సరికొత్త విధానాన్ని అములు చేయబోతున్నారు. ఏఐ, మిషన్లర్నింగ్ కోర్సులతో సరికొత్త డిగ్రీలు డబుల్ మేజర్ సబ్జెక్ విధానంలో డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. మేజర్ సబ్జెక్టులకు అనుసంధానంగా మైనర్ సబ్జెక్టులుగా క్వాంటమ్ కంప్యూటింగ్, మెషిన్ లర్నింగ్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్ సబ్జెక్టులను చేర్చేందుకు కసరత్తు పూర్తిచేశారు. దీంతో బీటెక్ సాంకేతిక విద్యనభ్యసించే వారికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ సబ్జెక్ట్లను డిగ్రీ చదివే విద్యార్థులు మైనర్ సబ్జెక్ట్లుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండనుంది. ఎదురుచూపులు ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిగ్రి ప్రవేశాల కోసం వెలువడే ఓఏఎమ్డీసీ (ఆన్లైన్ అడ్మిషన్స్ టు డిగ్రీ కాలేజస్) నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నోటిఫికేషన్ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కానీ డబుల్ మేజర్ సబ్జెక్ట్ అంటూ విద్యార్థులను కన్ఫ్యూజన్లోకి నెడుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో పలువురు విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలో ఇంజినీరీంగ్, పలు కంప్యూటర్ డిగ్రీ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. డబుల్ మేజర్ అంటే.. డబుల్ మేజర్ సబ్జెక్టులు అంటే డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన మేజర్ సబ్జెక్ట్కు 48 క్రెడిట్లు, రెండో మేజర్ సబ్జెక్ట్కు 32 కెడ్రిట్లు ఇవ్వనున్నారు. ఎంపిక చేసుకున్న మేజర్ సబ్జెక్ట్లలో ఏదో ఒకదానిలో పీజీ చేసుకునే అవకాశం ఉంటుంది. మరో మైనర్ సబ్జెక్ట్గా విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు బీఎస్సీ ఎంపీసీలో విద్యార్థి తనకు నచ్చిన మ్యాథ్స్, ఫిజిక్స్ను రెండు మేజర్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకోవచ్చు. మూడవ సబ్జెక్ట్గా ఏదేని మైనర్ సబ్జెక్ట్ను ఎంపికచేసుకుని అభ్యసించవచ్చు. నూతన విద్యా విధానంలో భాగంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ప్రస్తుతం అమలులో ఉంది. కానీ విద్యార్థులు మూడేళ్ల డిగ్రీపైనే మొగ్గు చూపుతున్నారు. ఉపాధి అవకాశాలు మెండు ఉన్నత విద్యామండలి ఈ ఏడాది నుంచి డబుల్ మేజర్ సబ్జెక్ట్లను డిగ్రీలో ప్రవేశపెట్టడం ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి రెండు మేజర్ సబ్జెక్టులలో పట్టు సాఽధించి ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు. ఇప్పటికే అందిరి వీసీలు, విద్యారంగ నిపుణులతో చర్చించి నిర్ణయించారు. ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ కరిక్యులమ్ రూపకల్పన పూర్తి చేసిందని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఓఏఎమ్డీసీ నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. –సీహెచ్.అప్పారావు, వీసీ, ఎస్వీయూ అధ్యాపకుల కొరత మాటేమిటో? ప్రభుత్వం డిగ్రీ విద్య విషయంలో గందరగోళం సృష్టిస్తోంది. డబుల్ మేజర్ సబ్జెక్టులను ప్రవేశపెడుతూ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి అసలు విషయం బోధన సిబ్బంది కొరతపై ఆలోచించకపోవడం గమనార్హం. అన్ని ఉన్నా.. అల్లుడునోట్లో శని అనే చందంగా తయారైంది కూటమి ప్రభుత్వ పాలన. డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు, ల్యాబ్ సౌకర్యాలు, అధ్యాపకుల కొరతతో జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే పలు కళాశాలల్లో మేజర్ సబ్జెక్టులకు శాశ్వత అధ్యాపకులు కొరతతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా డబుల్ మేజర్ అంటూ ఊదరగొడితే నష్టపోయేది విద్యార్థులే. -
మద్యం అమ్మకాల్లో ‘ఎల్లో టాక్స్’
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలోని 114 మద్యం దుకాణాలు, 8 బార్లలో కూటమి నేతలు నెలవారీ మామూళ్లు (ఎల్లో టాక్స్) వసూలు చేస్తున్నారు. అదికూడా వాళ్ల చేతికి ఏమాత్రం మట్టి అంటుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మొత్తం వసూళ్ల ప్రక్రియ కోసం అబ్కారీ శాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్ బాయ్స్గా నియమించుకున్నారనే విమర్శలున్నాయి.ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.30 వేల చొప్పున, బార్ నుంచి నెలకు రూ.20 వేల చొప్పున మొత్తంగా నెలకు రూ.అరకోటి వరకు ‘ఎల్లో టాక్స్’ వసూలవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీ ప్రధాన నాయకుడికి 70 శాతం, మద్యం దుకాణం ఉన్న పోలీస్ స్టేషన్కు 10 శాతం, 20 శాతం ఎక్సైజ్ అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ ఇందులో అబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారికి ఒక్కో దుకాణానికి నెలకు రూ.4 వేలు, మరో అధికారికి రూ.2 వేలు పంచాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులదే. -
7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు
వడమాలపేట (విజయపురం) : వడమాలపేట మండల అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ జరిపించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులు విశిష్ట వాహనాల్లో విహరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీ నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన దంపతులు రూ.500లు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ తప్పనిసరి యాదమరి: మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ను రెండేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా వేయించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన యాదమరి ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ చేశారు. హనుమంతరావు మాట్లాడుతూ టీకా వేసుకోని వారిని గుర్తించాలని, జూలైలోపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక డ్రైవ్ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. వరసిద్ధుని సేవలో న్యాయమూర్తులు కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందేష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక వేర్వేరుగా సేవించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈఓ పెంచల కిషోర్ తీర్థప్రసాదాలతోపాటు స్వామివారి చిత్రపటం అందించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,538 మంది స్వామివారిని దర్శించుకోగా 37,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
హెచ్ఎం కేడర్ బదిలీలకు 210 దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రధానోపాధ్యాయుల కేడర్ బదిలీలకు 210 దరఖాస్తులు అందాయి. అందులో రెండు దరఖాస్తులను వివిధ కారణాలతో విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు. మిగిలిన 208 దరఖాస్తులను ఆమోదించారు. హెచ్ఎం కేడర్లో 181 ఖాళీలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జెడ్పీ కింద 155, ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో 10, మున్సిపల్ కార్పొరేషన్లో 9, మున్సిపాలిటీల్లో 7 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వెబ్సైట్లో నమోదు చేసిన ఖాళీల ఆధారంగా హెచ్ఎంలు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బదిలీల ఉత్తర్వులను ఆన్లైన్లోనే జారీచేయనున్నారు. నేడు ఉద్యోగోన్నతులకు పరిశీలన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం మంగళవారం ఉద్యోగోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. చిత్తూరులోని లిటిల్ ప్లవర్ ఎయిడెడ్ పాఠశాలలో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్సైట్, డీవైఈఓ, ఎంఈఓలకు పంపినట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. గొప్పలు చెప్పుకుని.. గుట్టుగా జారుకుని! చిత్తూరు కలెక్టరేట్ : చేసిందేమీ లేకపోయినా...గొప్పలు చెప్పుకునేందుకే మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి జిల్లా పర్యటనకు విచ్చేశారని పలువురు విమర్శలు గుప్పించారు. సోమవారం కలెక్టరేట్లోని సాంఘిక సంక్షేమ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా దళితులకు కూటమి ప్రభుత్వం ఏదో చేసేసినట్లు ఊదరగొట్టారు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనప్పటికీ రూ.కోట్లు విడుదల చేసి దళితులకు మేలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొంది మాదిగ, మాలలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో 954, తిరుపతి జిల్లాలో 1,267 యూనిట్లకు ప్రభుత్వం రూ.92 కోట్లు మంజూరు చేసిందని గొప్పలు చెప్పారు. అయితే రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే మాత్రం నీళ్లు నమిలారు. ఇంతకీ రుణాలు ఎప్పుడిస్తారు అంటే సమాధానం చెప్పకుండా జారుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన
కుప్పం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం విజయవాడకు తిరుగు ప్రయాణ మయ్యారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన నూతన గృహప్రవేశం తర్వాత ఉదయం 11 గంటలకు ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద ఏర్పా టు చేసిన హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన చేరుకున్నారు. అనంతరం హెలిక్యాప్టర్లో బెంగళూరు చేరుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ కంచెర్ల శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డిఐజి షిమోషి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్ పాల్గొన్నారు. -
● హామీల అమలు కోసం వైఎస్సార్సీపీ కార్యాచరణ ● అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు ● అధినేత ఆదేశాల మేరకు సమావేశమైన పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ● 4న ‘వెన్నుపోటు దినం’ పాటించాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎన్నికల ముందు సూపర్సిక్స్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై కలసికట్టుగా పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ నేతలు సంకల్పించారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. సోమవారం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, చావా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్రెడ్డి, భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ, భరత్కృష్ణ, రాష్ట్ర అధికారప్రతినిధి శివశంకరరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిరసనగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం పాటించాలని, ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వెన్నుపోటు దినం.. విజయవంతం చేద్దాం ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నేతలు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే నిరసనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు,, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజా వ్యతిరేకత దశదిశగా ప్రతిధ్వనించేలా కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువత, విధ్యార్థులను పథకాల పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశౠరు. దగా పడిన జనానికి అండగా నిలిచి పోరాడాల్సిన భాద్యత తమ మీద ఉందని వెల్లడించారు. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని, సామాన్య ప్రజలను సైతం భాగస్వాములు చేయాలని సూచించారు. -
పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎండీయూ వాహనాలు నిలిపేస్తోందని ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుబాటులో రూ.100 స్టాంప్ పేపర్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్ జ్యుడీషియల్ రూ.100 స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచామని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. ఇన్ని రోజులు ఈ పేపర్లు స్థానికంగా నిల్వలేవని, ప్రస్తుతం వాటిని అందజేశామన్నారు. చిత్తూరు అర్బన్లో 7,000, చిత్తూరు రూరల్లో 4,000, బంగారుపాళ్యంలో 3,000, పలమనేరులో 6,000, పుంగనూరులో 5,000, కుప్పంలో 6,000, కార్వేటినగరంలో 3,000 కలిపి మొత్తం 40,000 స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా స్పెషల్ ఎడిషన్ స్టాంప్స్ కూడా అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొనుగోలుకు చం‘దూరం’ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మామిడి కాయల మార్కెట్లో చందూర రకం మామిడిని అడిగేవారు లేరు. మ్యాంగో గుజ్జు ఫ్యాక్టరీలు కూడా చందూరను కొనుగోలు చేయడం లేదు. కేవలం అల్పోన్సోను మాత్రమే కొంటున్నాయి. దీంతో చందూర కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గుచూపడం లేదు. ప్రస్తుతం చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్కు ప్రస్తుతం టేబుల్ రకాలైన బేనీషా, చందూర, అల్పోన్సో వంటివి మాత్రమే జోరుగా వస్తున్నాయి. ఇందులో అల్పోన్సోకు మాత్రమే డిమాండ్ ఉంది. మిగిలిన రకాల ధరలు క్షీణిస్తున్నాయి. బేనీషా రెండు రోజులకు కిత్రం కేజీ రూ.20 ఉంటే ..సోమవారం రూ.15లకు పడిపోయింది. తోతాపురిలో టేబుల్ రకం రూ.12 నుంచి రూ. 10లకు చేరింది. అల్పోన్సో మాత్రం తొలి నుంచి కూడా రూ.25 పలుకుతోంది. ఇక చందూర కేజీ రూ.8లకు పడిపోయింది. ఫ్యాక్టరీ వాళ్లు చందూరను వద్దంటున్నారని ట్రేడర్లు సైతం ముఖం చాటేస్తున్నారు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. – 8లో -
అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన
కలెక్టరేట్లో సమర్పిస్తున్న వినతులకు అతీగతీ లేకుండా పోయిందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు అర్బన్: జిల్లాలో గత ఏడాది అక్టోబర్లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించి, ప్రైవేటు షాపులకు పగ్గాలు అప్పగించింది. కేవలం కూటమి పార్టీ నేతలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రైవేటు మద్యం దుకాణాలకు తొలుత 20 శాతం లాభాలు వస్తాయని పాలసీ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆపై దుకాణాలు దక్కించుకున్న తమవారికి లాభం చేకూర్చేలా ప్రణాళిక రచించింది. ల్యాండింగ్కాస్ట్లో 20 శాతం లాభాలు చూపించినా, తమకు వాస్తవానికి అంత మొత్తం రావడంలేదని వ్యాపారులు చెప్పడంతో.. హుటాహుటిన ఇతర పన్నులు తగ్గించి, మరో 4 శాతం దుకాణదారుల జేబుల్లోకి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అదునుగా జిల్లాలోని కూటమి నేతలు రంగంలోకి దిగారు. ప్రతి మద్యం దుకాణంలో అమ్మకాలపై శ్రీపచ్చశ్రీ పన్ను చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు. తొలి దఫాలో నోటిఫికేషన్లో 104 దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులతో పాటు, ఈ ఏడాది కల్లుగీత సామాజిక వర్గాలకు ఇచ్చిన పది షాపుల నుంచి కూడా మామూళ్లు వసూలు చేయడం మొదలుపెట్టారు. ప్రతి నెలా రూ.అర కోటి వరకు జిల్లాలోని 114 ప్రైవేటు మద్యం దుకాణాలు, 8 బార్ల నుంచి కూటమి నేతలు నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్నారు. అది కూడా వాళ్ల చేతికి ఏమాత్రం మట్టి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.30 వేలు చొప్పున, బార్ నుంచి నెలకు రూ.20 వేలు చొప్పున.. మొత్తంగా నెలకు రూ.అరకోటి వరకు పచ్చ పన్ను వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రతి నియోజకవర్గంలోని కూటమికి చెందిన ప్రధాన నాయకుడికి 70 శాతం, మద్యం దుకాణం పరిధిలోని పోలీస్ స్టేషన్కు 10 శాతం, 20 శాతం ఎకై ్సజ్ అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తం వసూలు ప్రక్రియ కోసం ఆబ్కారీశాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్ ఏజెంట్లు నియమించుకున్నారనే విమర్శలున్నాయి. మళ్లీ ఇందులో ఆబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారికి ఒక్కో దుకాణానికి నెలకు రూ.4 వేలు, మరో అధికారికి రూ.2 వేలు వాటా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ శాఖ సిబ్బందే చూసుకోవాలి. అయితే స్టేషన్ నిర్వహణ, సారా నిర్మూలన పేరిట తనిఖీలకు వెళ్లేప్పుడు వాహనాలకు డీజిల్ నింపుకోవడానికి కూడా ఏమీ మిగలడంలేదని కొందరు అధికారులు నిట్టూరుస్తుండడం గమనార్హం. – 8లో– 8లోన్యూస్రీల్ మద్యం అమ్మకాలపై ‘పచ్చ’ పన్ను ఒక్కో వైన్షాపు నుంచి రూ.30 వేలు వసూలు కలెక్షన్ ఏజెంట్లుగా ఎకై ్సజ్ అధికారులు ఇష్టారాజ్యంగా దుకాణదారులకు అనుమతులు అధిక ధరలతోపాటు రాత్రింబవళ్లు విక్రయాలకు గ్రీన్సిగ్నల్ జిల్లాలోని వైన్షాపుల యజమానులతో కూటమి నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా అనధికారికంగా ‘పచ్చ’ పన్ను విధించారు. రాత్రింబవళ్లు మద్యం విక్రయాలు సాగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముకునేందుకు ‘పచ్చ’ జెండా ఊపేశారు. ఇందుకోసం ఒక్కో దుకాణం నుంచి ప్రతి నెలా రూ.30వేలు చెల్లించాలని నిబంధన అమలు చేస్తున్నారు. ముడుపుల వసూలు బాధ్యతను ఘనత వహించిన ఎకై ్సజ్ అధికారులకే అప్పగించారు. ప్రతిష్టాత్మక ఖాకీలను కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారు. ఇక అంతా మీ ఇష్టం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేస్తు న్న అధికారులు.. దానికి ప్రతిఫలంగా వ్యా పారులకు కొన్ని వెలుసుబాట్లు కూడా కల్పించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచాల్సిన మద్యం షాపులను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుకునే అవకాశమిస్తున్నారు. ఇక ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లను తెల్లవారుజాము 5 గంటలకే తెరచి, అర్ధరాత్రి వరకు విక్రయాలు చేసుకునేందుకు అనధికారిక అనుమతులు ఇచ్చేశారు. అనధికార పర్మిట్ గదులు వందల సంఖ్యలో ఉన్నా అధికారులు పట్టించుకోకుండా, ఇక అంతా మీ ఇష్టం అంటూ వ్యా పారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు తెరచి ఉంచిన వైనాన్ని ‘సాక్షి’పత్రిక ఎండగట్టడంతో.. మేల్కొన్న అధికారులు, ముందస్తు సమాచారం ఇచ్చి మరీ సమయపాలన తనిఖీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనితోడు చాలా దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్చగా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా వైన్షాపుల వారు క్వార్టర్ బాటిల్పై రూ. 10 నుంచి రూ. 20 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపు పేరిట బాటిల్ మద్యంపై రూ. 30 నుంచి రూ. 50 వరకు, అర్ధరాత్రి దాటక రూ.50 నంచి రూ.100వరకు ఎక్కువ రేటుకు విక్రయాలు సాగిస్తున్నారు. -
రీవాల్యుయేషన్లో అక్ర‘మార్కులు’!
సాక్షి టాస్క్ఫోర్స్: ఎస్వీయూలో డిగ్రీ, పీజీ పరీక్ష పేపర్ల రీ–వాల్యువేషన్ ప్రక్రియలో జరుగుతున్న గోల్మాల్ను అధికారులు సీరియస్గా పట్టించుకోకపోవడంతో వర్సిటీలోని కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిగ్రీకి సంబంధించిన పలు పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వచ్చాయంటూ వందల సంఖ్యలో రీవాల్యువేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అవకాశంగా ఎగ్జామినేషన్ సెక్షన్లో పనిచేస్తున్న కొందరు ఎక్కువ మార్కులు వేయిస్తామంటూ వేలల్లో వసూలు చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు ఎగ్జామినేషన్ సెక్షన్లో పనిచేసే ఓ అధికారి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం! ఇదే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని సెమిస్టర్ల డిగ్రీ, పీజీ పరీక్ష పేపర్ల రీవాల్యువేషన్లో మళ్లీ తప్పులు దొర్లడంతో అధికారులకు అనుమానం వచ్చి ఉద్యోగులను నిలదీశారు. రీవాల్యువేషన్ చేసిన పేపర్లను తమ ముందు ఉంచాలని ఎగ్జామినేషన్ సెక్షన్ సిబ్బందిని నిలదీశారు. ఈ పరిస్థితిని ఊహించని ఎగ్జామినేషన్ సిబ్బంది కొందరు తెల్లముఖం వేసినట్లు తెలుస్తోంది. -
డీఐజీగా మునిశంకరయ్య
చిత్తూరు కార్పొరేషన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువ, ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ మునిశంకరయ్యకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా డీఐజీగా ఆయనకు ఉద్యోగన్నతి కల్పించారు. ఈయన స్థానంలో ఇన్చార్జ్గా తిరుపతి జిల్లా రిజి స్ట్రార్ శ్రీరామ్కుమార్ను నియమించారు. ఆస్పత్రుల్లో బదిలీలకు కుయుక్తులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్లో ఐదేళ్లు, మూడేళ్లు దాటిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి జిల్లా అధికారులు రెండు రోజుల కిందటే రాష్ట్రస్థాయి అధికారులకు పంపారు. మంగళవారం బదిలీలకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నచోటే పాతుకుపోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఆస్పత్రుల్లో డ్యూటీలకు ఢుమ్మా కొట్టి యూనియన్ మీటింగ్, ప్రజాప్రతినిధులు, కూటమి నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. ముందుగానే సిఫార్సు లేఖలకు క్యూకడుతున్నారు. దీనికితోడు యూనియన్ల సహకారం ఉంటుందని కొత్త కమిటీకి సై అంటున్నారు. బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చాక కూడా కమిటీ ఏర్పాటు చేయడంపై కొందరు ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అత్యవసరంగా రాత్రి పూట కూడా సమావేశం నిర్వహించి కమిటీ ఏర్పాటు చేయడం సరికాదని వ్యతిరేకిస్తున్నారు. ఇలానే జరిగితే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం ● వైద్యుడి దుర్మరణం కోలారు: కర్ణాటకలోని చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ వైద్యుడు మృతి చెందారు. వివరాలు.. అనంతపురంలోని ఇందిరానగరకు చెందిన కృష్ణ జగన్(24) కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో అనంతపురం వెళ్లిన ఆయన కారులో తిరుగుప్రయాణమయ్యారు. ఉదయం 8.30 గంటల సమయంలో బంగారుపేట తాలూకా సిద్ధనహళ్లి వద్ద టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ కృష్ణ జగన్ అక్కడికక్కడే మరణించారు. బంగారుపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ వ్యక్తి మృతి బంగారుపాళెం : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు .. మండలంలోని బోడబండ్లకు చెందిన వెంకటేష్ (48) శనివారం ద్విచక్రవాహనంపై పలమనేరుకు వెళ్లి తిరిగివస్తుండగా పాలమాకులపల్లె పిళ్లారి గుండు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం చైన్నెలో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య కామాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అతీగతీ లేదని అర్జీదారుల ఆవేదన
● కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై 266 వినతులు నమోదు చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి వారం కలెక్టరేట్కు దూరాభారం నుంచి తరలివచ్చి వినతులు ఇస్తూనే ఉన్నాం.. అయితే అతీగతీ లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పెద్దసంఖ్యలో జనం విచ్చేసి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 266 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో కులశేఖర్ వెల్లడించారు. ఉద్యోగం ఇప్పించండి ఎలాంటి జీవనాధారం లేని తనకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని పెద్దపంజాణి మండలం చిన్నముద్దేపల్లెకు చెందిన శారద అనే మహిళ విన్నవించారు. తనకు 5 ఏళ్ల పాప, 20 నెలల బాబు ఉన్నారని, భర్త నుంచి ఎలాంటి ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టపోషణ కూడా కష్టంగా ఉందని, అధికారులు స్పందించి సాయం చేయాలని కోరారు. పదోతరగతి వరకు చదువకున్నానని, చిన్నపాటి ఉద్యోగమైనా ఇప్పించి ఆదుకోవాలని పేర్కొన్నారు. మేత భూమి కబ్జా శ్రీరంగరాజపురం మండలం ఏఎం పురం ఆదిఆంధ్రవాడ, ఏఎం పురంలో పశువుల మేత భూమిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. సర్వే నెంబర్ 170 లోని 18.02 ఎకరాల మేత భూమిని హరినాయుడు, రెడ్డెప్పనాయుడు, నరసింహులు, రోహిత్ దొంగ పట్టాలు సృష్టించి కబ్జాకు పాల్పడ్డారన్నారు. దీనిపై నెల క్రితం ఉన్నతాధికారులు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి మేత భూమిని కాపాడాలని కోరారు. పింఛన్ ఇప్పించండి పింఛన్ కోసం పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని బైరెడ్డిపల్లె మండలం చలగపల్లెకు చెందిన మునస్వామి అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 85 ఏళ్లు దాటుతున్నాయని, అయితే ఇప్పటి వరకు పింఛన్ రాలేదని వాపోయారు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఒంటరిగా మిగిలిపోయిన తనకు పింఛన్ మంజూరు చేయించి జీవనాధారం కల్పించాలని విన్నవించారు. -
పొట్టకొట్టారు.. వీధిలోకి నెట్టారు!
నగరి : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు ఉన్నవాటికే ఎసరు పెడుతున్నారని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వాహనాలను నిలిపి నిరసన తెలిపారు. ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 326 మంది ఆపరేటర్లు ఉన్నారన్నారు. ప్రభుత్వ విధానంతో వందల కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు. రేషన్ దుకాణాల ఎదుట ప్రజలు పడిగాపులు కాయకుండా ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న తమను కొనసాగించాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందనే కారణంతో జనాలకు ఉపయోగపడే ఎండీయూ వాహనాలను నిలిపివేయడం సరికాదన్నారు. వీటిని రద్దు చేసి తమ పొట్టకొట్టవద్దని విన్నవించారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్ర అందించారు. ఎండీయూ ఆపరేటర్ల నిరసన రోడ్డున పడే పరిస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు అందించే పని అప్పగించింది. వాహనాలు బ్యాంకు రుణాల ద్వారా తీసుకుని ఇప్పటికీ ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని నిలిపేస్తే రుణ వాయిదాలు కూడా చెల్లించలేం. దీంతో మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. – వేణు, జిల్లా అధ్యక్షుడు, ఎండీయూ యూనియన్వాహనమే జీవనాధారం ఎండీయూ వాహనం ద్వారా ఉపాధి పొందుతున్నాం. నాలుగేళ్ల నుంచి ఇదే నడుపుతూ జీవనం సాగిస్తున్నా. ప్రతి నెలా 15వ తేదీ లోపు ఇంటింటికీ వెళ్లి సరుకుల పంపిణీ పూర్తి చేసేవాళ్లం. ప్రభుత్వం ఇప్పుడు ఈ వాహనాలను రద్దు చేయడంతో దిక్కుతోచని – వీపీ శ్రీనివాసన్, జిల్లా ఉపాధ్యక్షులు, ఎండీయూ యూనియన్ -
పులిచెర్ల మండలాన్ని మదనపల్లెలో కలపొద్దు
● చిత్తూరు లేక తిరుపతి కావాలి ● టీడీపీ మండల నాయకుల డిమాండ్ పులిచెర్ల(కల్లూరు) : పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్లో కలపవద్దని సమీపంలోని చిత్తూరులేక తిరుపతి డివిజన్లోనే ఉంచాలని టీడీపీ మండల నాయకులు రాయవారిపల్లెలోని టీడీపీ నేత రామనాథం నాయుడు ఇంటిలో సమావేశమయ్యారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు కాని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి రెవెన్యూ డివిజన్లోనే మండలాన్ని ఉంచాలని కోరారు. గతంలో పులిచెర్ల మండలం తిరుపతి డివిజన్లో ఉండేదని ఇప్పుడు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లె డివిజన్లో కలపడం ఇష్టంలేదని దీనిపై ప్రభుత్వం, కలెక్టరుకు రాత పూర్వకంగా అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. ఒకప్పుడు పులిచెర్ల సమితి ఉండేదని ఈ సమితిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ జన్మనిచ్చిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం ఈ మండలాన్ని చిత్తూరు లేక తిరుపతి డివిజన్లో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని తెలిపారు. ఈ విషయంలో కలెక్టరును కూడా కలిసి రాత పూర్వకంగా అందరూ టీడీపీ నాయకులు విన్నవిస్తామన్నారు. -
సూర్య, చంద్రప్రభలపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సంతాన వేణుగోపాలుడు పశుపాలకుడైన శ్రీకృష్ణునిగా .. జీవకోటికి వెలుగును ప్రసాదించే దినకరుడిపై విహరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణాభరాలు, పట్టుపీతాంబరాలతో శ్రీకృష్ణునిగా భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగారు. కార్యక్రమంలో ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షారాబ్ బాబుసురేష్ ,కంకణభట్టర్ తరుణ్కుమార్, వేద పండితులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. వనసంపదతో పర్యావరణ సమతుల్యత చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించడం అలవాటు చేసుకోవాలని 35వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మోనిస్ అన్నారు. ఆదివారం బెటాలియన్ ఆధ్వర్యంలో నగరంలోని రిజర్వ్ ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వన సంపదతో పర్యావరణ సమతుల్యత లభిస్తుందన్నారు. క్రమేణా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం కేడెట్లకు మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు, అటవీ రక్షణ చట్టాలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పది రోజుల ఎన్సీసీ శిక్షణా కార్యక్రమంలో వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, ఆటల పోటీల్లో గెలుపొందిన కేడెట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ లోకనాథన్, ఎన్సీసీ అధికారులు ప్రసాద్రెడ్డి, కార్తీక్, ధనంజేయులు, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరోసిస్పై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా 9 మండలాలు.. 15 గ్రామాల్లోని 34 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉందని, దీనిపై తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని జీడీ నెల్లూరు, గుడిపాల, ఐరాల, పుంగనూరు, పూతలపట్టు, తవనంపల్లి, యాదమరి మండలాల్లో అధిక ఫ్లోరైడ్ ప్రభావం ఉందన్నారు. బడులు పునఃప్రారంభమైన వెంటనే 11 ఏళ్ల లోపు పిల్లలకు డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామన్నారు. అలాగే కమ్యూనిటీ సర్వేలో స్కెలిటల్ ఫ్లోరోసిస్తో బాధపడుతున్న వారికి నెక్ బెల్ట్, లంబార్ బెల్ట్, వాకింగ్ స్టిక్స్, వాకర్, వీల్ చైర్స్, టాయిలెట్ చైర్స్ వంటి పరికరాలు అందజేస్తామన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో వ్యాధి బారిన పడకుండా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలందరూ సురక్షితమైన తాగునీరు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ నాయక్ పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల యోగా కేంద్రంలో యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఆదివారం ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటిరోజు ఆదివారం డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో యోగాతో కలిగే ఆరోగ్య లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శిక్షణలో పాల్గొన్న ట్రైనర్లు శిక్షణ అనంతరం ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు మండలస్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చే ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ బాలాజీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసనాయుడు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
పార్టీకి ద్రోహం చేసి నీతులా?
– ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై వెంకటేగౌడ ఫైర్ పలమనేరు : ఉండవల్లి శ్రీదేవి పార్టీకి వెన్నుపోటు పొడిచి శుద్దపూసలా నీతులు వల్లించడం సరికాదని పలమనేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వెంకటేగౌడ విమర్శించారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తాడికొండలో కొత్త అభ్యర్థిగా ఆమె గెలవడం కేవలం పార్టీని చూసేగాని ఆమెను చూసి కాదన్నారు. వైఎస్సార్సీపీలో ముందుగా పార్టీకి ద్రోహం చేసినవాళ్లంతా నేడు మైకుల్లో సొంత పార్టీని విమర్శించడం చూస్తుంటే రేపు వీరు కూటమి నేతలను విమర్శించరనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. మహానాడు కోసం పలమనేరుకు వచ్చిన ఉండవల్లి శ్రీదేవికి కనీసం పలమనేరు పేరు తెలియకుండా ఇదే ఊరు అనడంతోనే ఆమె కథ అందరికీ అర్థమైందన్నారు. పింఛన్ల పెంపుపై నాడు అధినేత తప్పు చేశారని చెప్పిన ఆమె అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 2024 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదని తెలిసే వైఎస్సార్సీపీని వీడి కూటమిలో కలిశారని అది ఆమె స్వార్థం కాదా అని ప్రశ్నించారు. మొన్నటి దాకా వైఎస్సార్సీపీ పాలన బాగుందని కితాబిచ్చిన మీరు విధిలేక కూటమి పాలనను మెచ్చుకుంటున్నారనే విషయం టీడీపీ కార్యకర్తలకు సైతం బాగా అర్థమైందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోని చంద్రబాబును నిలదీయాల్సిందిపోయి వైఎస్సార్సీపీపై అవాకులు, చవాకులు మాట్లాడడం మంచిది కాదన్నారు. కడపలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు వచ్చిన ఆమె దాన్ని చూడాలి గానీ మీకు రాజకీయ బిక్ష పెట్టిన జగన్ మోహన్రెడ్డిని విమర్శించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. -
టీచర్లు నష్టపోకుండా బదిలీలు..
టీచర్లు నష్టపోకుండా బదిలీలు నిర్వహించాలని వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ నేతలు డీఈఓకు విన్నవించారు.సౌర కాంతులు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ను అందించనున్నారు.సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించింది. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీస ఏర్పాట్లు కరువయ్యాయి. ఆస్పత్రి అధికారుల్లో నిర్లిప్తత నెలకొంది. జిల్లాను కరోనా ఫీవర్ పట్టుకుంది. నిత్యం వేలాదిగా తిరుపతి వెళ్లేందుకు భక్తులు చిత్తూరు మీదుగానే వెళుతుంటారు. ఇదే మాదిరిగానే కాణిపాకంకు వేలాదిగా యాత్రికులు తరలివస్తుంటారు. దీనికితోడు తమిళనాడు, కర్ణాటక రాష్రాలు జిల్లా సరిహద్దులోనే ఉంది. స్వామి దర్శనంతో పాటు వివిధ పనుల నిమిత్తం రోజువారీగా సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాకు రాకపోకలు చేస్తున్నారు. ఈ తరుణంలో జిల్లాకు కరోనా ముప్పు పొంచి ఉందని పలువురు భావిస్తున్నారు. గతంలో సుమారు 2 వేల మంది మృతి 2019లో కరోనా కల్లోలం ఉమ్మడి జిల్లా నుంచే మొదలైన సంగతి అందరికీ తెలిసిందే..అప్పట్లో తొలి కేసు శ్రీకాళహస్తీలో నమోదు కాగా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బెల్ మోగింది. ఇలా 2019 నుంచి 2021 వరకు మూడు దశల్లో కరోనా విజృంభించగా... ఇందులో వేల మంది మృతి చెందిన వారు లేకపోలేదు. కరోనా మూలంగా ఉమ్మడి జిల్లాలో అప్పట్లో సుమారు 2 వేల మందికి పైగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో తిరిగి వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన మొదలైంది. పెరుగుతున్న కొత్త వేరియంట్లు కోవిడ్–19 వైరస్ కొత్త వేరియంట్లు, ముఖ్యంగా ఒమిక్రాన్ ఉప–వేరియంట్లు, ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వేరియంట్లలో కోవిడ్ 8.1.3.1.1 వంటి వేరియంట్ల గురించి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన ఉప–వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తోంది. అమెరికాలో 70 శాతం కోవిడ్ కేసులు. యూకేలో 60 శాతం కేసులు, ఆస్ట్రేలియాలో మూడో అత్యంత ప్రబలమైన వేరియంట్.8.1 ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుంటడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆస్పత్రిలోని బెడ్లు (ఫైల్) – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ జిల్లా సరిహద్దుల్లో కరోనా కేసులు ముందస్తు జాగ్రత్తలకు ప్రభుత్వం ఆదేశం అప్రమత్తం కానీ అధికారులు జాగ్రత్తలు పాటించాలని నిపుణుల సూచన కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది.. ఇప్పటికే విశాఖ, కడప, చైన్నె, బెంగళూరు నగరాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు దేశ వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇంకా మేల్కోకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు తగిన జాగత్త్రలు పాటిస్తే ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కనిపించని ముందస్తు చర్యలు జిల్లాకు కరోనా వ్యాప్తి పొంచి ఉంది. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికితోడు ఆ రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఆస్పత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెడ్లు, ఆక్సిజన్ , వెంటిలేటర్లు , పరీక్ష కిట్లు తదితర ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ కోసం ప్రత్యేక బెడ్లు కేటాయించడంలో అలసత్వం చూపుతున్నారు. దీని బట్టిచూస్తే జిల్లాకు కరోనా ముప్పు తప్పేలా లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గతంలో కరోనా అంటేనే ఆస్పత్రుల్లో చకచకా ముందస్తు ఏర్పాట్లు జరిగేవి. ప్రణాళిక ప్రకారం బెడ్లు కేటాయింపు జరిగేవి. పరీక్షల కోసం కిట్లు అందుబాటులోకి తెచ్చేవారు. సీఎం చంద్రబాబు జిల్లాలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే..మిగతా జిల్లాల పరిస్థితి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోవిడ్కు ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లక్షణాలు ఇవీ.. జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యశాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్ల్లో మాస్కులు, పీపీఈ కిట్లు, త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశించింది. వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పనిచేసే ల్యాబ్లో మాస్కును పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైన్నె, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రోగులు తేలికపాటి ఒత్తిడితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం కోవిడ్కు సంబంధించి మూడు రోజులకు ముందు ఎలాంటి ఆదేశాలు రాలేదు. శనివారం ఆదేశాలు వచ్చాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఆస్పత్రులకు ఆదేశాలిస్తాం. బెడ్లు కేటాయిస్తాం. వారికి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. – పద్మాంజలి దేవి, డీసీహెచ్ఎస్, చిత్తూరు భయపడాల్సిన పనిలేదు కొత్త వేరియంట్కు భయపడాల్సిన పనిలేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగిన జాగ్రత్తలతో బయటకు రావాలి. కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి. వృద్ధులు, చిన్నారుల పట్ల అ ప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం లేకుండా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. – సుధారాణి, డీఎంహెచ్ఓ, చిత్తూరు -
గంగమ్మా.. దీవించమ్మా
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ దీవెనల కోసం భక్తులు బోయకొండకు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండలో ఎటుచూసినా జన సంద్రంగా మారింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘ఇంటర్’లో బదిలీల కుదుపు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ విద్యాశాఖలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీలు షురూ అయ్యాయి. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్లో జూన్ 8వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లు, వారి పనితీరు ఆధారంగా పాయింట్లను కేటాయించనున్నారు. ఒక కళాశాలలో అయిదేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. రెండేళ్లు పూర్తయిన సిబ్బంది రిక్వస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు జిల్లాలో 468 కి పైగా ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి స్థానచలనం ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. పాయింట్ల కేటాయింపు ఇలా.. బదిలీల్లో ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లకు పాయింట్లు కేటాయించనున్నారు. 16 శాతం హెచ్ఆర్ఏ ఉన్న కేటగిరీ–ఏ ఉంటే ఏడాదికి 2 పాయింట్లు, 12 శాతం హెచ్ఆర్ఏలో పనిచేస్తుంటే ఏడాదికి 4 పాయింట్లు, 10 శాతంలో పనిచేస్తున్న జేఎల్ లకు ఏడాదికి 6 పాయింట్లు ఇస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఏడాదికి 8 పాయింట్లు కేటాయిస్తారు. వీరి పనితీరును బట్టి బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. అలాగే జూనియర్ లెక్చరర్లకు ఆయా సబ్జెక్టుల్లో ఇంటర్ ఫలితాల్లో 40 శాతం ఉత్తీర్ణులైతే ఎలాంటి పాయింట్లు ఉండవు. 41–60 శాతం వరకు అయితే 2 పాయింట్లు, 61–80 శాతం వరకు 4 పాయింట్లు, 81–100 శాతానికి 6 పాయింట్లు కేటాయిస్తారు. అలాగే ప్రిన్సిపల్స్కు పాయింట్లు కేటాయించనున్నారు. జిల్లాలో 75 అన్ని యాజమాన్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో అధ్యాపకులు, సిబ్బంది కలిపి 500 కు పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి అయిన వారికి కచ్చితమైన బదిలీ జరగనుంది. రెగ్యులర్ బదిలీల తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఖాళీల ఆధారంగా పోస్టులను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. తప్పనిసరిగా స్థాన చలనం వెబ్ కౌన్సెలింగ్లో నిర్వహించే ఈ ప్రక్రియలో బదిలీల ఉత్తర్వులను జూన్ 8వ తేదీ లోగా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 మే 31 నాటికి ఒకే కేంద్రంలో ఐదేళ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని, రెండేళ్లు పూర్తయిన వారు రిక్వస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2027 మే 31వ తేదీ లోపు ఉద్యోగ విరమణ పొందే వారికి బదిలీల నుంచి మినహాయింపు కల్పించారు. జిల్లాలో దాదాపు 468కి పైగా స్థానచలనం జూన్ 8 దాకా బదిలీల ప్రక్రియ నిర్వహణ కసరత్తు చేస్తున్న ఇంటర్మీడియట్ అధికారులు బదిలీల అనంతరమే ఒప్పంద అధ్యాపకులకు పోస్టింగులు మేనేజ్మెంట్ల వారీగా కళాశాలలు ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31 హైస్కూల్ ప్లస్ 24 కేజీబీవీ 08 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 04 బీసీ వెల్ఫేర్ గురుకులాలు 01 ఏపీ మోడల్ స్కూల్స్ 07 మొత్తం కళాశాలలు 75పకడ్బందీగా బదిలీలు చేపడుతున్నాం రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారుల ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. షెడ్యూల్ మేరకు అందిన అభ్యంతరాలను పకడ్బందీగా పరిశీలించి ఆదివారం తుది జాబితాను విడుదల చేస్తున్నాం. బదిలీల్లో ఎవరైన నిబంధనలను అతిక్రమించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డా.ఆదూరు శ్రీనివాసులు, ఆర్జేడీ, డీఐఈవో (ఇంటర్మీడియట్), చిత్తూరు 31న బదిలీ పోస్టింగులు బదిలీల షెడ్యూల్ మేరకు ఆదివారం అభ్యంతరాలు పరిశీలన చేసి, తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి ఈనెల 31న పోస్టింగ్లను కేటాయింపు చేస్తారు. బదిలీలకు అర్హులైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే పోర్టల్లో ప్రకటించారు. అధికారులు ధ్రువీకరణ చేసిన జాబితాలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో తమ ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది. పోస్టింగ్ ఆర్డర్స్ సైతం ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకుని తమకు కేటాయించిన స్థానాల్లో చేరాలని అధికారులు చెబుతున్నారు. -
● గంటల తరబడి రోడ్డుపై బైఠాయింపు ● ట్రాఫిక్ జామ్తో అవస్థలు పడ్డ ప్రయాణికులు
బ్యానర్లు చించేశారని తమ్ముళ్ల ఆందోళన చౌడేపల్లె : ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లు ఎవరో చింపేశారని తమ్ముళ్లు ఆదివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇటీవల మంత్రి రాంప్రసాద్రెడ్డి మండల పర్యటనలో భాగంగా ఆ పార్టీ నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఎవరో చింపివేశారని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులకు సర్ధిచెప్పడానికి యత్నించినా ఆయన మాటలను ఖాతరు చేయకుండా హంగామా చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
బదిలీలకు అడ్డదారులు
ఉద్యోగుల బదిలీల్లో కొన్ని ఉద్యోగుల సంఘాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. క్యాష్, పలుకుబడి ఉన్న వారికి సంఘాల్లో ఆఫీస్ బేరర్స్గా చేర్చుకుని సిఫార్సు లేఖలు అందజేస్తున్నారు. మరికొన్ని సంఘాలు ముడుపులు స్వీకరించి సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లు సమాచారం. కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కి ఉన్నచోటే కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవోలో ఉన్న మినహాయింపులను అవకాశంగా మార్చుకుని కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘంలో సభ్యత్వం లేనివారికి, ఓటరు జాబితాలో పేరు లేని వారికి రాత్రికి రాత్రే ఆఫీస్ బేరర్లుగా నియామక పత్రాలు ఇచ్చి బదిలీల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. మినహాయింపులకు సిఫార్సు లేఖలు జిల్లా పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ, ఇరిగేషన్, జిల్లా పరిషత్, పే అండ్ అకౌంట్స్, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీల్లో స్థానచలనం పొందాల్సి ఉంటుంది. అయితే వారు అడ్డదారుల్లో ఆఫీస్ బేరర్లుగా ధ్రువపత్రాలు పొంది బదిలీల నుంచి మినహాయింపులు కోరుతున్నారు. రెవెన్యూ శాఖలో ఆఫీస్ బేరర్ పత్రాలతో పాటు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సమర్పిస్తున్నారు. వీఆర్వోలు తమ స్థానాలను కొనసాగించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలను నీరు గార్చే ప్రయత్నాలు అడ్డదారులు తొక్కుతున్న కొన్ని ఉద్యోగ సంఘాలు సంఘాల్లో కొత్తవారికి అవకాశాలు, సిఫార్సు లేఖలు ఉన్నతాధికారులకు కుచ్చుటోపీ నిబంధనల ప్రకారం ఒక సంఘంలో ఎవరెవరికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారో ఆ వివరాలతో పాటు ఎన్నికల అధికారి ధ్రువీకరించిన జిల్లా కార్యవర్గ లేఖను కలెక్టర్కు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో ఆయా సంఘాల అధ్యక్షులు.. ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఆఫీస్ బేరర్ పత్రాలు ఇచ్చేస్తున్నారు. తమ సంఘం తరఫున ఎంత మందికి లేఖలిచ్చారో ఆ విషయాలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన లేఖలను కలెక్టర్కు ఇవ్వకుండా కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆయా ఉద్యోగ సంఘాలు ఇస్తున్న లేఖలను కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సమగ్ర విచారణ చేయించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. సంఘాల్లో పేర్లు మార్చేస్తూ.. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఆఫీస్ బేరర్లకు మూడు పర్యాయాలు పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యే దాకా బదిలీ చేయకూడదు. తాలూకా, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల వివరాలను కలెక్టర్ ద్వారా హెచ్వోడీకి పంపాల్సి ఉంటుంది. ఒక సంఘంలో 13 నుంచి 15 లేదా 20 మంది వరకు ఆఫీస్ బేరర్లు ఉంటారు. అందులో ఐదుగురికి మించి ఉద్యోగులు ఐదేళ్లు, తొమ్మిదేళ్లకు పైబడి సర్వీసు పూర్తి చేసిన వారు ఉండరు.. కాగా మొత్తం కార్యవర్గంలో 75 శాతం మందికి బదిలీల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ ఆయా సంఘాల పత్రాలు ఇస్తున్నారు. రాత్రికి రాత్రే గుర్తింపు పొందిన సంఘాల్లో సభ్యుల పేర్లను మార్చేసి కలెక్టర్కు నివేదికలు ఇస్తున్నారని విశ్వసనీయ సమాచారం. -
ఘాట్ రోడ్లో ప్రమాదం
తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న శ్రీవారి భక్తులు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఒకటో మలుపు వద్ద కారు కొండను ఢీంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తుల్లో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుంకీలతో భీ‘కరి’ కట్టడి తిరుపతి మంగళం : అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వస్తున్న మద గజాలను కుంకీ ఏనుగులతో కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని ఎలిఫెంట్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పలమనేరులోని క్యాంపుతో పాటు జూ పార్కును కూడా కుంకి ఏనుగుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గజ దాడులలో ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా, పంట పొలాలు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా గే జూ పార్క్ లోని వన్యప్రాణుల స్థావరంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. అనంతరం జంతువుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జూలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంవలో తిరుపతి సీఎఫ్ సెల్వం, అనంతపురం సీఎఫ్ యశోదాబాయి పాల్గొన్నారు. ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, శ్రీపద్మావతి కళాశాల్లోని పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రతేక అధికారి కోన శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జీ అజ్మీరా, డీఆర్ఓ నరసింహులుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఉదయం నిర్వహించిన పరీక్షకు 5,261 మందికి గాను 2,941 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 2,320 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,261 మందికి గాను 2,929 మంది హజరైనట్లు తెలిపారు. 2,332 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అభ్యర్థులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
గుడిపాల: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైల్లో ఆదివారం నేపాల్కు చెందిన అర్జున్బహుదూర్(39) గుడిపాల మండలం 197రామాపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైల్లో నుంచి నిద్రమత్తులో జారి కింద పడ్డాడు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 ఈఎంటీ బద్రి, ఫైలట్ బాబి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్జున్ బహుదూర్ తలకు బలమైన గాయం తగిలినట్లు తెలిపారు. అనంతరం చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. -
కందిపప్పు దూరం
● రేషన్ షాపుల్లో ఇవ్వని పప్పు ● బియ్యం, పంచదారకే పరిమితం ● మార్కెట్లో చుక్కలంటుతున్న ధరలు ● ఆవేదన చెందుతున్న కార్డుదారులుకలెక్టర్ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు పునరుద్ధరించాలి ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు దినుసు ధరలు కిలో రూ. 100 దాటింది. నూనె ధర రూ.150 పలుకుతోంది. ఇతర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో పేదలు నిత్యావసర సరుకులను కొనలేని పరిస్థితుల్లో ఉ న్నారు. నిరుపేదలకు అవసరమైన నిత్యవసర వస్తువులైన పంచదార, నూనె, చింతపండు, ఉల్లిపాయలు, చిరుధాన్యాలు, ఉప్పు, కారం, ఇతర వస్తువులను తక్కువ ధరకు అందించాలని కార్డుదారులు కోరు తున్నారు. చౌక ధరల దుకాణాల్లో నిలిపివేసిన కందిపప్పును తిరిగీ పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పేదలకు కందిపప్పు కరవుతోంది. చౌక దుకాణాల్లో రాయితీ ద్వారా అందించే పప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. అయిదు నెలల కిందట పప్పు పంపిణీని నిలుపుదల చేసింది. తద్వారా పేదలు కందిపప్పునకు దూరమయ్యారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర మోత మోగిపోతోంది. పేదలు మార్కెట్లో కొనలేని పరిస్థితి దాపురించింది. జనవరి నుంచి ఇప్పటి వరకు చౌకదుకాణాల్లో కందిపప్పు ఊసేలేదు. ఎండీయూ వాహనాలను రద్దు చేసినంత వేగంగా కందిపప్పు సరఫరాను ప్రభుత్వం ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు చిరు ధాన్యాలు కూడా ఇస్తామని చెప్పారని.. నాలుగైదు మాసాలుగా కంది పప్పునకే దిక్కు లేదని అపహాస్యం చేస్తున్నారు. రేషన్ కార్డు దారులకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా అందించే నిత్యావసర సరుకులు అంతంత మాత్రమే అందుతున్నాయని కార్డుదారులు వాపోతున్నారు. పేదల అవస్థలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర రూ.200 వరకు పలుకుతోంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు రూ.67కు విక్రయించేవారు. ఈ ధరకు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా లేకపోవడంతో సామాన్య ప్రజలు బయట మార్కెట్లో పెరిగిన ధరతో కందిపప్పును కొనేందుకు ఆర్థి క ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5.40 లక్షల రేషన్ కార్డులు, 1339 రేషన్ షాపులు న్నాయి. వీరందరి కోసం ప్రతినెలా 9 వేల మె ట్రిక్ టన్నుల బియ్యం, 543 మెట్రిక్ టన్నలు కందిపప్పు, 350 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరమవుతోంది. గత ఐదు నెలల నుంచి బియ్యం, అర కిలో పంచదార మాత్రమే చౌక దుకాణాల ద్వారా సరఫరా అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు బయట మార్కెట్లో కొనలేక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బియ్యం, చక్కెర, రాగులు, రాగిపిండి, గోధుమపిండి, ఇతర నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరకు ప్రభుత్వం సరఫరా చేసింది. రాను రాను చౌక ధరల దుకాణాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జనవరి నెల ముందు వరకు చౌక ధరల దుకాణాలలో కందిపప్పు, బియ్యం, అర కిలో పంచదార సరఫరా అయ్యేవి. ప్రస్తుతం కందిపప్పును అయిదు నెలలుగా అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. -
రుణాలకు ‘చంద్ర’గ్రహణం
శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో శ్రీవారి దర్శనభాగ్యం లభిస్తోంది.వ్యాపారులు ముందుకు రాకపోవడం సీఎం భద్రతలో అలసత్వం వద్దు ఇసుక ధరలకు రెక్కలు ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్య నదిలో నీరు చేరడంతో మార్కెట్లో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది.ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025మామిడి ధరలు ఆరంభంలోనే అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చెంతనే పండ్ల గుజ్జు పరిశ్రమలు ఉన్నా ఆదుకోలేకపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన మామిడి పండ్లకు ధరలు రోజురోజుకు పతనమవుతుండడం ఆవేదనకు గురిచేస్తోంది. పరిశ్రమలు పక్క రాష్ట్రాల నుంచి మామిడి పండ్లను దిగుమతి చేస్తుండడంతో జిల్లాలో పండించే మామిడికి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కాపుదశ ఆలస్యంగా జిల్లాలో ప్రారంభం కావడంతో పక్క జిల్లాల నుంచి మార్కెట్కు పండ్లు పోటెత్తుతున్నాయి. ధరలు లేకపోవడంతో ప్రస్తుతం తోటల్లోనే కాయలను వదిలేసే పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. కాణిపాకం : మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఫలరాజును ఏటా ధరలు కుంగదీస్తున్నాయి. ఆరంభంలోనే ఈసారి మామిడి ధరలు రైతులను ఢీలాకు గురిచేస్తున్నాయి. గిట్టుబాటు కానీ ధరతో రైతుల చేతికి నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రెండు రోజుల్లో టేబుల్ రకానికి డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అడిగేవారు లేకపోవడంతో ధరలు పతానికి చేరుకున్నాయి. కోత కోసి మార్కెట్కు కాయలను తెస్తే... ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో మామిడి రైతుల్లో గుబులు పుట్టుకుంది. ధరల పతనానికి కారణాలు జిల్లాలో 47 పండ్ల గుజ్జు పరిశ్రమలున్నాయి. మే నెల ఆరంభం నుంచే కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. కేరళ నుంచి అల్పోన్సో కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు చేయడం ప్రారంభించాయి. ఇదే మాదిరిగానే మరికొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకుని విజయవాడ నుంచి కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు తయారీని వేగవంతం చేశాయి. దీని కారణంగా జిల్లా కాయలపై దెబ్బపడుతోంది. అక్కడి ధరలను తక్కువ చూపించి...ఇక్కడ కాయల ధరలను తగ్గించేస్తున్నారు. ఇక జిల్లాలో పండే టేబుల్ రకాలను చిత్తూరు మార్కెట్ నుంచి అధికంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వ్యాపారులు కొనుగోలు చేసి వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్నారు. అయితే విజయవాడ ప్రాంతంలో సీజన్ ముగింపు దశలో ఉందని...దీంతో అక్కడి నుంచి ఈ రెండు రాష్ట్రాల వ్యాపారుల వ్యాపారం పుంజుకోవడంతో ..ఇక్కడి వ్యాపారం పడిపోయినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. దీంతో పాటు అక్కడి మామిడి ధరలు తక్కువ పలకడం...ఇక్కడ వ్యాపారం మందగించిందని అంటున్నారు. చేతులెత్తేస్తున్న ట్రేడర్లు టేబుల్ రకం కాయల ధరలు పడిపోతున్నాయని భావించి చాలా మంది రైతులు కాయలు పక్వానికి రాకముందే జోరుగా కోతలు కోస్తున్నారు. పక్వానికి రాకపోయినా కోత కోసి మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇక ఇప్పుడు రైతులు తోతాపురి కోత కోస్తామంటే అసలే వద్దంటున్నారు. మేం కొనలేమని మందే ట్రేడర్లు చేతులెత్తేస్తున్నారు. ధరలు లేకపోవడంతో కొంత మంది రైతులు కాయలను అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. లేకుంటే ఆవులకు మేత పెడుతున్నారు. చిత్తూరులో మార్కెట్లో ఎగుమతికి సిద్ధమవుతున్న కాయలు మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన జెడ్పీ చైర్మన్ వి.కోట : వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు శనివారం కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు. అనంతరం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మా ట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమా లు, అన్యాయాలు, దౌర్జన్యాలు తమ అధినేతకు వివరించారు. అలాగే తమ ప్రభు త్వ ఆధ్వర్యంలో కొనసాగించిన అభివృద్ధి పను లను వివరించారు. ఆయనతో పాటు శాంతీపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, మండల నాయకులు కృష్ణమూర్తి, సురేష్ పాల్గొన్నారు. అటవీ సిబ్బందికి మావటీల శిక్షణ చిత్తూరు కార్పొరేషన్ : కుప్పం, పుంగనూరు, పలమనేరు రేంజ్ పరిధిలోని 30 మంది అటవీ సిబ్బందికి మావటీలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల జిల్లాకు కుంకీ ఏనుగులు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 5 ఏనుగులు రాగా, ఇందులో ఒకటి తిరుపతి జిల్లాకు, నాలుగు చిత్తూరు జిల్లాకు కేటాయించారు. వీటితోపాటు గతంలో ఉన్న రెండు ఏనుగులు కలిపి మొత్తం 7 ఏనుగులు పలమనేరులోని ననియాలలో ఉన్నాయి. బెంగళూరు నుంచి కుంకీలతో పాటు జిల్లాకు వచ్చిన మావటీలు ఇక్కడ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకే జిల్లా నుంచి సిబ్బంది బెంగళూరుకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు. కాగా ఇక్కడ సిబ్బందికి బెంగళూరుకు చెందిన మావటీల సమక్షంలో పలు మెలకువలు వారికి నేర్పనున్నారు. ఏదైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెలరోజుల పాటు వారికి మెలకువలు నేర్పించిన తరువాత కుంకీలను గజ దాడుల నివారణకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్పీలకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్పీ (సీనియర్ రీసోర్స్ పర్సన్)కు మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఎస్ఆర్పీలను శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే రెసిడెన్షియల్ శిక్షణకు హాజరు కావాలని ఆదేశించారు. అదే విధంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణిత, సైన్స్ టీచర్లకు ఎక్స్పోజర్ విజిట్ను నిర్వహించనున్నారు. ఈ విజిట్ ఈనెల 26వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు అయిదు విడతల్లో చేపట్టనున్నారు. ఇందుకు జిల్లాలో ఎంపిక చేసిన టీచర్ల జాబితాను జిల్లా సమగ్రశిక్ష కార్యాలయానికి పంపారు. ఆ జాబితాలో ఎంపిక చేసిన టీచర్లు తప్పనిసరిగా పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆక్రమణ దుష్ప్రచారం కాదు.. నిజమే సాక్షి టాస్క్ఫోర్స్ : ఆక్రమణ దుష్ప్రచారం కాదని.. నిజమేనని అటవీశాఖ అధికారులు తేల్చారు. పది రోజుల కిందట చిత్తూరు మండలం ఎగుమాసాపల్లి ప్రాంతంలో అటవీశాఖ భూమి ఆక్రమణకు గురైంది. ఈ విషయంపై టీడీపీ నేతలు, గ్రామస్తులు అటవీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆక్రమణలో భాగంగా చదును చేస్తున్న రెండు జేసీబీలను పట్టుకున్నారు. ఆ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిని విచారించగా ఈ భూ ఆక్రమణలో...ఓ కూటమినేతే కీలకమని తేలింది. ఆక్రమిత భూమి అటవీశాఖదా...కాదా అనే తేల్చడానికి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆక్రమణ భూమి అటవీశాఖ భూమిగా నిరూపితమైంది. అయితే ఈ విచారణకు బ్రేకులు వేసి జేసీబీలను అటవీశాఖ అధికారుల నుంచి విడిపించేందుకు భారీ స్థాయిలో రాజకీయం నడిచింది. ఈ ఆక్రమణ వ్యవహరంపై ఇటీవల సాక్షి దినపత్రికలో భూమేత పేరిట కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఆక్రమణదారులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. కేసును తప్పుదారి పట్టించేందుకు కుట్రలు చేశారు. అయితే ఆ దుష్ప్రచారం అవాస్తమని..ఆక్రమణ నిజమని అటవీశాఖ అధికారులు నిరూపించారు. నలుగురు వ్యక్తులపై కేసులు పెట్టి జేసీబీలను సీజ్ చేశారు. అటవీభూమి ఆక్రమణలో నలుగురిపై కేసు చిత్తూరు కార్పొరేషన్ : అటవీ భూమి ఆక్రమణకు యత్నించిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో థామస్ తెలిపారు. శనివారం ఎఫ్ఆర్వో కార్యాలయంలో వివరాలను తెలియజేశారు. ఎగువమాసపల్లెకు చెందిన కుమార్నాయుడు, గువ్వకల్లుకు చెందిన లీలాకర్రెడ్డి, జంగాపల్లెకు చెందిన జేసీబీ డ్రైవర్లు మధుబాబు, గోపిపై కేసు నమోదు చేశామన్నారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలం ఎగువమాసపల్లెలో రెండు జేసీబీల ద్వారా భూమిని చదును చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. వీటిపై సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జేసీబీలను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులో తీసుకున్నామన్నారు. వారిని విచారించగా ఎగువమాసపల్లెకు కుమార్నాయుడు, లీలాకర్రెడ్డి చెప్పడంతో పనులు చేశామన్నారు. ఆ భూమి వారిదని చెప్పడంతో చదును చేయడానికి వెళ్లనట్లు చెప్పారన్నారు. తదుపరి రెవెన్యూ, అటవీ సిబ్బంది కలిసి సంయుక్తంగా సర్వే చేయగా అటవీ భూమిని తేలిందన్నారు. దాదాపు అర ఎకరంలో కలుపు మొక్కలను తొలగించినట్లు గుర్తించామన్నారు. డీఎఫ్ఓ ఆదేశాల మేరకు అటవీభూమి అన్యాక్రాంతం కింద కేసు నమోదు చేశామన్నారు. సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు వివరించారు. యోగాతో మానసిక ప్రశాంతత చిత్తూరు కలెక్టరేట్ : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నేటి యాంత్రిక యుగంలో యోగాతో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో యోగా చాలా ముఖ్యమన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి, డీఎస్డీవో బాలాజీ, ఎంహెచ్వో లోకేష్, యోగా గురువులు నరేంద్ర, బాబు, రాజేంద్ర పాల్గొన్నారు.శాంతిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సొంతింటి గృహప్రవేశం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం చూపరాదని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ నాచ్కేత్ విశ్వనాథ్ పోలీసులను ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక కల్యాణ మండపంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సీఎం, ఇతర వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పం–పలమనేరు జాతీయ రహదారి పక్కన కడపల్లి పంచాయతీలోని శివపురం వద్ద నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక సూచనలు చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. వి.కోట వైపు నుంచి వచ్చే వాహనాలను బడుగుమాకులపల్లి నుంచి విజలాపురం మీదుగా కుప్పానికి, కుప్పం వైపు నుంచి వచ్చే వాహనాలను తంజంకొట్టాలు నుంచి రాళ్లబూదుగూరు మీదుగా తుమ్మిశికి మళ్లించాలని చెప్పారు. ద్రవిడ యూనివర్శిటీ నుంచి పీఈఎస్ మీదుగా సీఎం రాకపోకలు సాగించే రూట్ మ్యాప్ను వివరించారు. కాగా ఎస్ఎస్జీ డైరెక్టర్ నాచ్కేత్ విశ్వనాథ్, జిల్లా ఎస్పీ మణింకంఠ చందోలు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, కుప్పం డీఎస్పీ పార్థసారథి సీఎం పర్యటన మార్గాన్ని, గృహ ప్రవేశం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ రూట్ మ్యాప్లోని ప్రాంతంలో ఉన్న కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.చిత్తూరు, తిరుపతి జిల్లాలో కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల వివరాలు కార్పొరేషన్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా పేరు దరఖాస్తులు దరఖాస్తులు బీసీ 18175 14293 బ్రాహ్మణ 44 40 ఈబీసీ 384 281 కమ్మ 440 326 క్షత్రియ 46 78 రెడ్డి 363 351 వైశ్య 120 133 కాపు 1781 1872 ఎంఎస్ఎంఈ 24 70 బీసీ జెనరిక్ 42 46 కుమ్మర, మేదర 85 53 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నాం దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రభుత్వం రెండు నెలల కిందట ఆర్భాటం చేసింది. ఉపాధి రుణాలిస్తుందనే ఆశతో జిల్లాలోని నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. చివరికి ఆ రుణాలను మంజూరు చేయకుండా అభ్యర్థులకు మొండిచేయి చూపింది. ఆశావహులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రస్తుతం రుణాలు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం బోర్డు తిప్పేసింది. దీంతో దరఖాస్తుదారులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయం ● స్వయం ఉపాధి రుణాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు ● మొదట్లో గొప్పగా ప్రచారం చేసిన కూటమి ● అణగారిన వర్గాలకు కుచ్చుటోిపీ ● మంజూరు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ పడిపోయిన ధరలు ధరలు పోతాయని జోరుగా మామిడి కోతలు బేనీషా, చందూర రకం పండ్ల ధరలు పతనం టేబుల్ రకాలను అడిగేవారు కరవు తోతాపురి కొనుగోళ్లు నిల్ రైతుల్లో గుబులు పట్టించుకోని ప్రభుత్వం కూటమినేతల ఆటకట్టించిన అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు నమోదు ప్రజాప్రతినిధులకు తలొగ్గని అటవీశాఖ అధికారులుగంగ జాతర తర్వాత చిత్తూరు మ్యాంగో మార్కెట్లో 15 ట్రేడర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే మామిడి వ్యాపారం జోరందుకుంది. వారి వద్దకు టేబుల్ రకాలు వెతుక్కుని వస్తున్నాయి. ఆ కాయలను వారి నుంచి కొనుగోలు చేసే వ్యాపారులు తగ్గుముఖం పట్టడంతో మామిడి ధరలు పడిపోయాయి. వారానికి ముందు బేనీషా కిలో రూ.30 పలికింది, తర్వాత రూ. 27కు తగ్గింది. ఇప్పుడు కిలో ధర రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. వారానికి ముందు చందూర కిలో రూ. 11 నుంచి రూ.20 వరకు అమ్ముడుబోయింది. ఇప్పుడు కిలో రూ. 8కు కొనుగోలు జరుగుతోంది. అల్పోన్సో మాత్రం కిలో ధర రూ.25తో నిలకడగానే ఉంది. తోతాపురిలో టేబుల్ రకాన్ని మాత్రమే కొంటున్నామని.ఈ కాయ కిలో ధర రూ. 12 రేటు ఫిక్స్ చేశారు. సాధారణ తోతాపురి కాయలను కొనేవారు లేరంటూ రూ.4కు ఇస్తే తీసుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు. అడిగేవారే లేరు.. బేనీషాను అడిగేవారు లేరు. చందూరు కూ డా అంతే పరిస్థితి. ఎ వరైనా కొనుగోలు చే సేందుకు వస్తే కిలో రూ.15కే ఇచ్చేస్తాం. ఆరంభంలో బేనీషా రూ. 30 పలికింది. మొన్న రూ.27 ఉండేది. ఈ రోజు అడిగే వారు లేక కుప్పలు పోసి పెట్టాం. ఈ దెబ్బకు బెంగుళూరా (తోతాపురి) కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ వాళ్లు కూ డా కొనే పరిస్థితుల్లో లేరు. రాజస్థాన్, మధ్యప్రదేశ్కు జరిగే వ్యాపారం డల్గా ఉంది. – రత్నంరెడ్డి, వ్యాపారి–రైతు, చిత్తూరు కలెక్టర్ చొరవ చూపాలి మామిడి సాగుకు పెట్టే ఖర్చులు సగం కూడా రావడం లేదు. పూత నుంచి కాయ పక్వానికి వచ్చే వరకు పంటను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ పంట వస్తే రాత్రింభవళ్లు నిద్ర ఉండదు. అక్కడే కాపాలా కాస్తున్నాం. వర్షాలు, ఎండను లెక్కచేయకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఆ కష్టం మాకు దక్కడం లేదు. మార్కె ట్లో ధరలు నిలకడగా ఉండేలా చూడాలి. కలెక్టర్ చొరవ చూపాలి. – కుప్పయ్యనాయుడు, రైతు, సిద్దంపల్లి గ్రామం, చిత్తూరు మండలం టేబుల్ రకాలు.. ధరలు నేలచూపు జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818 హెక్టార్లు, అల్పోన్సో 3,127 హెక్టార్లు, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లల్లో సాగువుతున్నాయి. ప్రస్తుతం వీటిలో టేబుల్ రకాలను మాత్రమే రైతులు కోతకు పెట్టారు. ఈసారి గంగజాతర తర్వాత నుంచి టేబుల్ రకాలను జోరుగా కోతకోస్తున్నారు. రైతులకు అందుబాటులో ఉండే చిత్తూరు, పలమనేరు, దామలచెరువు ఇతర మార్కెట్కు కాయలను తరలిస్తున్నారు. ఽఅయితే ఈ కాయలకు మార్కెట్లో ధరలు పలకడం లేదు. చందూర, బేనీషాను కొనేవారు లేరని చిత్తూరు మార్కెట్లోని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీని దెబ్బకు వారు నాటుకాయలు, తోతాపురిపై పూర్తిగా ముఖం చాటేశారు. -
మహిళ మెడలో గొలుసు అపహరణ
పుత్తూరు : బైక్పై వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును మరో బైక్పై వచ్చిన దుండగుడు లాక్కొని పరారైన సంఘటన శనివారం రాత్రి పుత్తూరులో చోటు చేసుకుంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. తిరుపతికి చెందిన కళ్యాణి(55) పుత్తూరులో వ్యవసాయ మోటార్ల షాపును నిర్వహిస్తున్నారు. యథావిధిగా రాత్రి 8 గంటలకు షాపును మూసివేసిన కళ్యాణి, తమ్ముడు శ్రీరామ్తో కలసి తిరుపతికి బైక్పై బయలుదేరారు. స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగుడు కళ్యాణి మెడలోని రెండున్నర సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనలో కిందపడ్డ కళ్యాణికి తల వెనక భాగంలో, మెడపైనా రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణి -
పుంగనూరు 6 మండలాల బదిలీ నోటిఫికేషన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల బదిలీకి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రచురించారు. ఈ మేరకు ఆ నోటిఫికేషన్ ను కలెక్టరేట్తో పాటు జిల్లాలోని ఆర్డీవో, అన్ని మండల కార్యాలయాలకు పంపారు. ప్రచురించిన ప్రాథమిక నోటిఫికేషన్ ను అన్ని కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో పెట్టాలన్నారు. ప్రచురించిన ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం..... ● చిత్తూరు జిల్లాలోని ఆరు మండలాలను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ● చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్కు బదలాయించనున్నారు. ● మండలాల బదిలీ పై అభ్యంతరాలు, సూచనలను ఇంగ్లీషు, తెలుగులో లిఖిత ర్వకంగా రాసి చిత్తూరు కలెక్టరేట్లో 30 రోజుల లోపు ఇవ్వాలని పేర్కొన్నారు. -
ఇసుక ధరలకు రెక్కలు
● వర్షాలతో చెరువులు,కౌండిన్యలోకి చేరిన వరద ● మూడు నెలలు ఇసుక తోడేందుకు వీలుకాని పరిస్థితి ● ఇప్పటికే దాచుకున్న ఇసుక డంపులకు డిమాండ్ ● ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.4 వేలకు పైమాటే ● సిండికేట్గా ఏర్పడి అమాంతం పెంచిన అక్రమార్కులు సీజ్ చేసి తక్కువ ధరకు అందించాలి పలమనేరు ప్రాంతంలో కౌండిన్య నదిని ఆ నుకుని ఇన్నాళ్లు ఇసుక ను తోడిన కూటమి ఇ సుకాసురులెవరు? వారెక్కడ ఇసుకను డంపు చే శారో అధికారులకు తెలియందేమీ కాదు. దీనికోసం దాడులు అవసరంలేదు. వారికే తెలుసు కాబట్టి దాన్ని సీజ్ చర్యలు తీసుకోవాలి. సీజ్ చేసిన ఇసుకను అవసరమైన వారికి తక్కువ ధరతో అందుబాటులోకి తీసుకురావాలి. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు ఇసుక తవ్వకాలను ప్రకృతే అడ్డుకుంది మండలంలోని కౌండిన్యతో పాటు పలు చెరువుల్లో కూటమి నాయకులు ఇన్నాళ్లు ఇసుక, మట్టిని కొల్లగొట్టేశారు.ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రకృతే వర్షాన్ని కురిపించి వాగులు, వంకలు పొర్లి చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో ఇసుక తవ్వకాలకు ఆ వరుణుడే బ్రేక్ వేశాడు. – నరసింహారెడ్డి, వైస్ సర్పంచ్, కొలమాసనపల్లి పలమనేరు : పలమనేరు రెవెన్యూ డివిజన్లో కూటమి పేరు చెప్పుకొని కొందరు ఇసుకాసురులు కౌండిన్య నదిలోని ఇసుకను భారీగా తరలించి రహస్య ప్రదేశాల్లో దాచుకున్నారు. వారం రోజులుగా స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో పలు చెరువులు , నదిలోకి వరద నీరు చేరడంతో మరో మూడు నెలల దాకా ఇసుక తరలించేందుకు వీలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇసుకాసురుల తవ్వకాలకు వరుణుడే అడ్డుకట్ట వేశాడు. దీంతో నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. కానీ గతంలో డంప్ చేసిన ఇసుకను ఇప్పుడు ఇసుకాసురులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.2,500 ఉండగా ఇప్పుడు రూ.4 వేలకు చేరింది. మరో పది రోజుల తర్వాత ఈ ధర రూ.5 వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో డంపులు పెట్టుకున్న ఇసుకాసురుల పంట పండనుంది. దొరికనంత దోచేశారు.. వర్షాలొస్తే ఇసుక దొరకదేమోనని ఏడాదిగా కౌండిన్య నది, చెరువుల్లో నిత్యం ఇసుకు తోడిన అక్రమార్కులు భారీగా రహస్య ప్రదేశాల్లో డంపులకు చేర్చుకున్నారు. ముందుగా నదిలోని ఇసుకను దొరికినంత దోచుకోవడం కోసం ఒకరిమీద మరొకరు పోటీలు పడి మరీ ఇసుకను పోగేసుకున్నారు. కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరు కూటమి పేరు చెప్పుకొని అప్పులు చేసి మరీ ట్రాక్టర్లు, జేసీబీలను తెచ్చి ఇసుకను తోడేశారు. నిల్వ చేసుకున్న గ్రామాలు ఇలా.. నియోజకవర్గంలోని గంగవరం మండలంలో కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న జీడిమాకులపల్లి, బైపాస్ రోడ్డు, క్యాటిల్ఫామ్, రామాపురం పొలా లు, మారేడుపల్లి, ముబ్బువాళ్లపేట, పలమనేరు మండలంలోని మొరం, కూర్మాయి, జల్లిపేట, మొసలిమడుగు, సముద్రపల్లి, కూర్మాయి, జంగాళపల్లి, తావడపల్లి, వడ్డూరు, పెద్దపంజాణి మండలాల్లోని 20 దాకా గ్రామాల్లో భారీగా ఇసుక డంపులున్నాయి. సిండికేట్గా ఏర్పడి అమాంతం ధరలు పెంచి.. వర్షాల కారణంగా ఇసుకకు డిమాండ్ వచ్చిపడింది. దీంతో ఇప్పటికే దాచుకున్న ఇసుకాసురులు సిండికేట్గా ఏర్పడి ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల దాకా పెంచేశారు. త్వరలో ఇది రూ.5 వేలు దాటడం ఖాయం. గతంలో కర్ణాటకలోని హోసకోట్ వ్యాపారులకై తే ఇక్కడ టిప్పర్ రూ.28 వేల దాకా అమ్మేవారు. ఇప్పుడు టిప్పర్ ధర రూ. 40 వేలకు చేరింది. సంబంధిత శాఖలైన మైనింగ్, రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల అధికారులు రహస్య డంపులను సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని అధికారుల ద్వారా సామాన్యులకు అందుబాటు ధరలతో విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం దక్కుతుందనే మాట స్థానికంగా వినిపిస్తోంది. -
తమ్ముళ్ల దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్స్ : పూతలపట్టు నియోజకవర్గంలో పాతకక్షలకు కూటమి నేతలు పదును పెట్టారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అధికార మదంతో పచ్చరౌడీలు పెట్రేగిపోతున్నారు. ఆందోళనలు సృష్టించి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ వింత పోకడను ప్రశ్నిస్తున్న అమాయకులైన దళితులు, మెనారిటీలపై దాడులకు తెగబడుతున్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రౌడీ రాజకీయమా? ప్రశ్నించే గొంతును కూకటివేళ్లతో పెకలించాలనే దృఢ సంకల్పంతో పక్కా ప్రణాళికలతో గొడవలు సృష్టించి పచ్చని పల్లెల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా పేదవారి కన్నీళ్లు తుడుస్తూ తల్లిదండ్రులకు భారం కారాదని తల్లుల ఖాతాలకు డబ్బులు వేసేవారు. కానీ నేటి ప్రభుత్వంలో అమ్మఒడి అందక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల, కళాశాల యాజమాన్యాల ఫీజుల చెల్లించక ఇబ్బందుల పడుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన ఓ ప్రైవేటు లెక్చరర్పై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారు. సామాన్యులపై కూటమి ప్రతాపం ● ఓ నిరుపేద మైనార్టీ బాలుడు తన కుటుంబం పడుతున్న కష్టాలను చూడలేక .. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే తమ కుటుంబం ఇలా కష్టాలు పడేవా అని మదనపడ్డాడు. స్థానికంగా కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను భరించలేక 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి అధికార సింహాసనాన్ని అధిరోహిస్తుందని..తన అభిమానాన్ని వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నాడు. ఇది భరించలేని పచ్చ నేతలు కాపు గాసి రాత్రి సమయంలో అదును చూసి ఆ బాలుడిని అపహరించి చిత్రహింసలకు గురిచేసి దాడి చేశారు. దీనిని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ అభిమానుల ఐదుగురిపై విచక్షణా రహితంగా కత్తులు, రాడ్లు, కరల్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఈ ఘటనలో ఓ యువకుడికి కంటిలో రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ● ఎస్సీ, ఎస్టీ కేసు విత్డ్రా తీసుకోలేదని పూతలపట్టు మండలం ఆకనబట్టు సర్పంచ్ మణిపై టీడీపీ నేత జయప్రకాష్ బూతులతో బెదిరించాడు. ఇంతకీ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. మాట మాటకు ఫోన్లో కులం పేరుతో దూషిస్తూ..భయబ్రాంతులకు గురి చేశాడు. కేసు వెనక్కి తీసుకోకపోతే కుటుంబ సమేతంగా చంపేస్తానంటూ బూతులతో హెచ్చరికలు జారీ చేశాడు. ఇవీ కొన్ని మాత్రమే బయటకు కనిపించిన చాలా వరకు వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఇటువంటి దారుణ ఘటనలు కోకొల్లలు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న కూటమి గూండాలను కూకటివేళ్లతో పెకలించి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించి పక్షపాతాన్ని చూపడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలపై పచ్చనేతల ఆగడాలు అధికార మదంతో పేట్రేగుతున్న తమ్ముళ్లు పూతలపట్టులో రెచ్చిపోతున్న కూటమి శ్రేణులు దాడులపై న్యాయపోరాటానికి దిగుతాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా దాడులు, అరాచకాలు జరుగుతున్నాయి. కనీసం సామాన్య జనానికి సరైన న్యాయం జరగడం లేదు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు దాడులు చేయిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. అన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజు అధికారం చేతిలో ఉందని ఇలా చేయడం ఎంత వరకు సమంజసం. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఒక ఎస్సీ సర్పంచ్ను కులం పేరుతో దూషించడంతో పాటు బూతులు తిట్టడం కరెక్టు కాదు. దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై న్యాయపోరాటానికి దిగుతాం. – సునీల్కుమార్, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే -
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి తెలిపారు. కలెక్టరేట్లోని పర్యాటక శాఖ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషియన్లో 2025–26కు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఏపీ పర్యాటక శాఖలు సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హత ఆసక్తి ఉన్నట్లైతే 97013 43846, 97004 40604, 95021 13163 నంబర్లలో సంప్రదించాలన్నారు. కోర్సులు పూర్తి చేసే అభ్యర్థులకు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉద్యోగ అవకాశాలు, బ్యాంక్ రుణ సదుపాయం, బాల బాలికలకు వేరువేరుగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారని చెప్పారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కోర్సుల వివరాలు 1. బీయస్సీ, హెచ్, హెచ్.ఎ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్ 40% మార్కుల పైగా సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కోర్సులో ఎఫ్ అండ్ బి ప్రొడక్షన్, ఎఫ్ అండ్ బి సర్వీస్, కరెంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ నేర్పించి 4 నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారన్నారు. 2. క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ (సీసీఎఫ్పీపీ) కోర్సుకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులో ఏడాది పాటు దేశ విదేశాల వంటకాలను నేర్పించి 6 నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారని తెలిపారు. 3. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ – బేవరేజ్ సర్వీస్ (సీసీఎఫ్బీఎస్ ) కోర్సుకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సులో ఐదు నెలల పాటు రెస్టారెంట్, బార్ సర్వీస్ నేర్పించి 1 నెల ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారని చెప్పారు. -
హాకింగ్ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది
అంజన్న అభయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్దగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.● రాజకీయ కక్షతోనే స్టేట్ సిలబస్ అనుమతులు రద్దు ● సీబీఎస్ఈ అనుమతులు ఉన్నాయి ● హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ 23 రోజులు..1000 రిజిస్ట్రేషన్లు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వివాహ ధ్రువపత్రాలు అందజేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025– 10లో● ఇతని పేరు కృష్ణయ్య పాలసముద్రానికి చెందిన రైతు.. పొలంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్ కో అధికారులు బాగు చేస్తార ని రెండు వారాలుగా నిరీక్షించారు. ఫలితం లేకపోవడంతో చిత్తూరుకు స్నే హితుడి ట్రాక్టర్ తీసుకొని రూ.1500 డీజిల్ పట్టుకొని, డ్రైవర్కు రూ.800 కూలీ ఇచ్చి తీసుకొచ్చాడు. మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసి సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతులు చేయించుకొని తీసుకెళ్లారు. ఆయన పొలం నుంచి రానుపోనూ 84 కిలోమీటర్లు ప్రయాణించి అగచాట్లు పడ్డాడు. ఉమ్మడి జిల్లా విద్యుత్ సమాచారం గతేడాది, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఎస్పీఎంల (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) నందు రిపేరు చేసిన వివరాలు ఇబ్బందులు పడుతున్నాం ఎండకాలంలో ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు అవుతున్నాయి. కరెంటోళ్లకు విషయం చెబితే పెద్ద గా పట్టించుకోవడం లే దు. బతిమలాడి పనులు చేసుకోవాలి. మాట లు చెబుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో పనులు కావడం లేదు. ట్రాన్స్ఫార్మర్ రిపేరుకు వస్తే వాటిని బాగు చేసి తీసుకురావడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు . – గంగిరెడ్డి, రైతు చంద్రగిరి రోలింగ్ స్టాక్ లేదంటున్నారు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు అయ్యే వరకు స్థానికంగా విద్యుత్శా ఖ కార్యాలయాల్లో రో లింగ్ స్టాక్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పాడైన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి మార్చే వరకు రోలింగ్ స్టాక్లోని ట్రాన్స్ఫార్మర్ను రైతు వాడుకుంటారు. కానీ రోలింగ్ స్టాక్ లేదని అధికారులు అంటున్నారు. పలుకుబడి ఉన్నవారి పనులు త్వరగా చేస్తున్నారు. – తిరుమలరెడ్డి, రైతు నగరి 1912కు ఫిర్యాదు చేయండి వేసవిలో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు ఎక్కువ గా వస్తుంటాయి. సకాలంలో వాటిని బాగు చేసి పంపాలని రైతులను ఇబ్బంది పెట్టరా దని సంబంధిత అధికారులను ఆదేశించాం. సమస్యల పై 1912కు ఫిర్యాదు చేయండి. రవాణా, మరమ్మతు, ఇతర సేవలకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫార్మర్ల రోలింగ్ స్టాక్ను అందుబాటులో ఉంచుతాం. – సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్, ట్రాన్స్కో ఎస్ఈలు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఐఐటీ, నీట్ శిక్షణకు స్క్రీనింగ్ పరీక్ష చిత్తూరు కలెక్టరేట్ : డా.బీఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ఐఐటీ, నీట్ శిక్షణ సెంటర్ల ప్రవేశానికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ జిల్లా కో ఆర్డినేటర్ గీత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న బాల, బాలికలు ఈనెల 25వ తేదీన నిర్వహించే రెండవ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ నగర్లో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ కళాశాలలో నిర్వహిస్తార న్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, ఆధార్కార్డు జిరా క్స్ తీసుకుని రావాలని ఆమె వెల్లడించారు. సిజేరియన్లను తగ్గించాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో సిజేరియన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. మాతాశిశు మరణాల కట్టడికి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణులకు సకాల ఆరోగ్య సేవలు అందేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. ప్రధానంగా సుఖ ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, డీఐఓ హనుమంతరావు, వైద్యులు అనిల్కుమార్, ప్రవీణ, అనుష, రామ్మోహన్, ప్రసాద్, శ్రీవాణి పాల్గొన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చెన్నయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు లెదర్ స్టిచ్చింగ్ ఆపరేటర్, లెదర్ ఫుట్వేర్, లెదర్ కట్టర్ పుట్వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణకు ఎస్సీ కులస్థులై ఉండాలన్నారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి, ఉచిత కిట్లు అందజేస్తామన్నారు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 98493 73131, 63056 88868 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నెల 2024 2025 ఫిబ్రవరి 1,152 1,224 మార్చి 1,194 1,806 ఏప్రిల్ 1,146 1,548 మే (17వరకు) 1,242 732 మొత్తం 4,734 5,310 పాడైన ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే అన్నదాతల అగచాట్లు అన్నీఇన్ని కావు. పొలం నుంచి సొంత డబ్బు వెచ్చించి ట్రాన్స్ఫార్మర్ను సమీప మరమ్మతుల కేంద్రానికి తీసుకెళ్లడం గగనమవుతోంది. అంత కష్టపడి అక్కడికి తీసుకెళ్లినా బేరం కుదిరితే గానీ రిపేరు చేసి ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుకుబడి ఉన్న వారికే రోలింగ్స్టాకు అందిస్తున్నారు. సాధారణ రైతులకు అయితే రోలింగ్ స్టాకు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరమ్మతుల కేంద్రంలో రైతులు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : ఎండలు మండుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా ఇంట్లో ఫ్యాన్ స్పీడ్ 5 మీద ఉన్నా గాలి చాలడం లేదు. ఇక ఏసీ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సగటున జిల్లాలో 40–44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం బయటకెళ్లి పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేలోపు చెమటలతో దుస్తులు తడిసిపోతున్నాయి. ఎండల మంటతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో రైతన్నలు వాటిని బాగు చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్లను రైతులు బాగు చేసుకోవాలంటే కష్టాలు పడుతున్నారు. సగటున నెలకు దాదాపు 1000 తక్కువ కాకుండా రిపేర్లకు గురవుతున్నాయి. ఎక్కువగా వేసవిలో ఈ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. చిత్తూరు, పుంగనూరు, పుత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తిలో సమస్య అధికంగా ఉంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు రైతులను వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అదనంగా మరమ్మతులు ఏడాదిలో ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్ లోపు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత నెలల కంటే 30–50 శాతం అధికంగా రిపేర్లు వస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు 4,734 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే 17 వరకు 5,310 ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ అయ్యాయి. జెడ్పీటీసీల ఆవేదన పట్టదా? ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో మరమ్మతు చేయడం లేదని ఏప్రిల్ 29న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ సురేంద్రనాయుడు తెలియజేశారు. మే 13న జరిగిన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో మరమ్మతు చేయడం లేదని, అధికారులు వేధిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు పాతర ఉమ్మడి జిల్లాలో రేణిగుంట, పుత్తూరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు , పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఎస్పీఎం(ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) ఉన్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో 2 రోజులు, నగర, పట్టణాల్లో రోజులో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి పంపాలనే నిబంధన ఉంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ లోడింగ్, అన్లోడింగ్, రిపేర్కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వ్యవసాయ సర్వీసుకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు అయితే రైతులు ట్రాక్టర్, టాటా ఏస్ వాహనాల నందు తెచ్చుకొని మరమ్మతులు చేయించుకుంటున్నారు. లోడింగ్, అన్లోడింగ్, మరమ్మతు, బిగింపులకు బేరాలు చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడుతాం కార్వేటినగరం : ౖవెఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతామని అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గంగమాంబాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత చిన్నబ్బరెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు, నాయకులు అంకిత భావంతో కృషి చేసి సర్పంచ్లు, ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఏడాది కాక ముందే కూటమి కోటలు బీటలు వారుతున్నాయని, శాసనసభ ఎన్నికల్లోపే టీడీపీకి జెండా పట్టే కార్యకర్తలు కరువవ్వడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పట్టాభిరెడ్డి, మురాజ్, రామిరెడ్డి, సతీష్, చందురాజు, అమీద్, ,శోభన్బాబు, ప్రేమనాధరెడ్డి, ధనంజయవర్మ, శేషాద్రి, మునిరెడ్డి, మణి (వెదురుకుప్పం పార్టీ కన్వీనర్), కుప్పయ్య, జనార్దన్ఽ, భూపతిరెడ్డి, నందగోపాల్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ శాంతిపురం : కడపల్లి పంచాయతీలోని శివపురం వద్ద నిర్మించిన సొంతింటి గృహ ప్రవేశానికి సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకూ సీఎం కుప్పం పర్యటన సాగనుంది. దీంతో నూతనంగా నిర్మించిన ఇంటిని, ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను సందర్శించారు. వి.కోట నుంచి కుప్పం వరకూ జాతీయ రహదారిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించి, పారిశుద్ధ్య పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్త ఇంటి వద్ద పార్కింగ్, శ్యానిటేషన్, బారికేడ్లు తదితర అంశాలపై మార్గదర్శకం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీపీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కుప్పంరూరల్/శాంతిపురం: రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తమ పాఠశాల అనుమతులు రద్దు చేసిందని కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లా అధికారులు తమ పాఠశాలలో 8, 9, 10 తరగతులు రద్దు చేయడం దారుణమన్నారు. తరగతుల రద్దు విషయం సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న తరువాత శుక్రవారం హఫీజ్ పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు. 2019లో పాఠశాల ప్రారంభించామని, మొత్తం 950 మంది విద్యార్థులు చదువుతున్నారని, 150 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. అధికారులు ఏకపక్షంగా 8, 9, 10 తరగతుల స్టేట్ సిలబస్ రద్దు చేయడం దారుణమన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని, స్టేట్ సిలబస్ అనుమతులు మాత్రమే రద్దు చేశారని, సీబీఎస్ఈ అనుమతులు ఉన్నాయని, తరగతులు యధావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై కోర్టుకు వెళ్తామని హఫీజ్ తెలిపారు. అనుమతుల రద్దుకు అధికారులు చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పాఠశాల డైరెక్టర్ షబ్బీర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. విపక్షాన్ని అణచివేసే కుట్రే విపక్షాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే హాకింగ్ స్కూల్ అనుమతులు రద్దు చేశారని వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తాను, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పార్టీ కూడా హఫీజ్కు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. – 10లో– 10లోన్యూస్రీల్ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా రోజువారీ విద్యుత్ వినియోగం వివరాలు తేది వాడకం (మిలియన్ యూనిట్లు) మే 10 21.20 11 21.54 12 23.13 13 25.16 14 24.95 15 23.17 16 22.63 17 21.80 ఉమ్మడి జిల్లాలో నెలకు 1000 నియంత్రికలు రిపేరు పెరిగిన రోజువారీ విద్యుత్ వినియోగం సకాలంలో పూర్తి కాని పనులు అలసత్వం వహిస్తున్న విద్యుత్ అధికారులు అలంకారప్రాయంగా ఓఆర్ఎం ఎండా కాలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో అధికంగా ఆయిల్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పాత ఆయిల్ను శుద్ధిచేసి బాగుచేసి పంపుతున్నారు. చిత్తూరు కేంద్రంలో ప్రస్తుతం 200 లీటర్లను మాత్రమే శుద్ధి చేసే మిషన్ ఉంది. 2 వేల లీటర్ల ఆయిల్ను శుద్ధిచేసే నూతన ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఇన్స్టాల్ చేయకుండా ఆరు నెలలుగా అలంకారప్రాయంగా అలానే ఉంచేశారు. అధికారుల అలసత్వంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గత ప్రభుత్వ పాలనలో రూ.50 లక్షల వ్యయంతో ఓఆర్ఎంను మంజూరు చేశారు. డిస్కం (రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) పరిధిలో ఇటువంటి మిషన్ ఎక్కడా లేదు. పెండింగ్లో ఉన్న 10 శాతం మొత్తం ఇస్తేగానీ టెక్నీషియన్లు ఇన్స్టాలేషన్ చేయమంటున్నారు. ఆరు నెలలుగా మిషన్ను ఎస్పీఎంలో దిష్టిబొమ్మలాగా దర్శనం ఇస్తోంది. దీంతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. -
23 రోజులు.. 1000 రిజిస్ట్రేషన్లు
● రేషన్కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ తిప్పలు ● అవసరం లేదని ప్రకటించిన అధికారులు ● అవగాహన లేక పెరుగుతున్న రద్దీ ● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీ చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని తొలుత ప్రభుత్వం నిబంధన విధించింది. తర్వాత వీటిపై అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పెళ్లికార్డు ఉంటేనే వివాహ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తారు. దరఖాస్తుకు జత చేసేందుకు మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్ చేయించుకుంటున్నారు. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్ కార్డు, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రశీదు, ఆలయాల్లో జరిగితే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్ రిజిస్ట్రార్కు దరఖాస్తు ఇవ్వాలి. అన్నీ సవ్యంగా ఉంటే గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ అన్నీ ఉన్నా ఏదో ఒక సాకుతో రిజెక్టు చేస్తున్నారు. అదే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లి అడిగినంత ఇస్తే గంటలో పనిచేస్తున్నారనే వాదన ఉంది. అన్నా ఇది సీజన్... ఎంత సేపు మీ (డాక్యుమెంట్ రైటర్లు) సంపాదననే మా గురించి పట్టించుకోండి.. లేదా ఇదేమన్నా అత్తారిళ్లా వచ్చి పనులు చేసుకోనిపోవడానికి అని ఇటీవల జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు అన్న మాటలు.. ఇవే వారి పనితీరుకు తార్కాణం. వివాహ రిజిస్ట్రేషన్ వద్దని ప్రకటన రేషన్కాార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వీటిపై పెద్దగా క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడం, భవిష్యత్తులో పథకాలకు పనికి వస్తుందని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మొత్తం 478 వివాహ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కానీ మే నెలలో 23 రోజులకు 1005 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇందులో ఎక్కువగా చిత్తూరు అర్బన్, రూరల్ కార్యాలయాల నందు జరుగుతున్నాయి. తక్కువ వివాహ రిజిస్ట్రేషన్స్ జరిగే కార్వేటినగరం, బంగారుపాళ్యం, కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరులోనూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్లు జిల్లాలో 19 వేల మంది పైగా రేషన్ కార్డులో చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ కరెక్షన్, సభ్యుల చేర్పు, సభ్యుల తొలగింపు, కొత్తరేషన్ కార్డు, కార్డు విభజన కోసం , రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహం జరిగిన వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వారు అన్ని వివరాలను పరిశీలించి అక్కడే ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. గడువు దాటిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే పొందాల్సి ఉంటుంది. ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల నకళ్లు, పురోహితుడి ధ్రువీకరణ, చలానా చెల్లింపు ఇలా మొత్తంగా రూ.1000 వరకు ఖర్చువుతోంది. అదనంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లు రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ముస్లిం, క్రైస్తవులకు తిప్పలు ముస్లిం, క్రైస్తవులు వివాహ ఽధ్రువీకరణ పత్రం పొందాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుంది. వివాహ పత్రానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు నోటీసు బోర్డులో 30 రోజులు ఉంచుతారు. దీని పై అభ్యంతరాలు రాకుంటే అప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ కొత్త కార్డులకు దరఖాస్తు గడువు జూన్ 7 వరకు మాత్రమే ఉండటతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.. కానీ సమయం పొడిగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు వివాహ రిజిస్ట్రేషన్కు ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుదారులకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పలు అంశాలకు రిజిస్ట్రేషన్ ప్రయోజనకరమని చేసుకుంటున్నారు అది మంచిదే. వేలకు వేలు అడిగితే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకుంటాం. – రమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. నగరానికి చెందిన శోభన్, సుమిత్రలకు వివాహమై సంవత్సరం అయింది. రేషన్ కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదనే అంశంపై ప్రచారం లేకపోవడంతో వివాహ రిజిస్ట్రేషన్ కో సం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించారు. అది లేదు, ఇది సరిగ్గా లేదు, ఆ పత్రం కావాలి అంటూ సవాలక్ష ప్రశ్నలను అధికారుల వేశారు. దీంతో గత్యంతరం లేక డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించగా రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంతా ఎందుకంటే స్లాట్ బుకింగ్కే రూ. 500, అధికారికి రూ.2000 వరకు, డాక్యుమెంట్ స్కానింగ్, నెట్, ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని అంత అవుతుందన్నారు. అతడితో బేరం ఆడి రూ.4 వేలు ఇచ్చారు. వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రం చేతిలో పెట్టారు. -
జిల్లాకు వేరుశనగ సరఫరా
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు శుక్రవారం వేరుశనగ విత్తన కాయలొచ్చాయి. తొలి విడతగా కొన్ని మండలాలకు కాయలను అధికారులు సరఫరా చేశారు. మొత్తం 4108.2 క్వింటాళ్ల విత్తనం రాగా..కుప్పంకు 848.7 క్వింటాళ్లు, వి.కోటకు 424.5 క్వింటాళ్లు, బైరెడ్డిపల్లికి 294 క్వింటాళ్లు, శాంతిపురానికి 357 క్వింటాళ్లు, రామకుప్పంకు 666 క్వింటాళ్లు వచ్చాయి. అయితే ఈ కాయలకు ప్రభుత్వం పూర్తి ధర ప్రకటించింది. కానీ రాయితీ ధర ప్రకటించలేదు. దీంతో కాయల పంపిణీకి ముహూర్తం ఖరారు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధతిరుపతి కల్చరల్ : కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా దామా రాధా నియమితు లయ్యారు. శుక్రవారం ఈమేరకు సమితి జిల్లా అధ్యక్షుడు మధురాయల్ ఆధ్వర్యంలో పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. హరిప్రసాద్ మట్లాడుతూ 200 మంది మహిళలతో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొన్నారు.గంగమ్మ విగ్రహం దొంగ అరెస్టుపాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం గంగమ్మ గుడిలో చోరీకి గురైన అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఆంపిప్లయిర్ను స్వాధీనం చేసుకుని శుక్రవారం నిందితుడిని ఆరెస్టు చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ అజీత్, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వారు మాట్లాడుతూ.. మండలంలోని వెంగళరాజుకుప్పంలోని గంగమ్మగుడిలో ఈనెల 13వ తేదీ దొంగలు అమ్మవారి ఊరేగింపు విగ్రహం, ఆంపిప్లయిర్ను చోరీ చేశారు. దీనిపై పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా రహస్య సమాచారం మేరకు బలిజకండ్రిగ–చిత్తూరు రోడ్డులో నిందితుడు హరీశ్ను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి పంచలోహ ఉత్సవ విగ్రహం, ఆంపిప్లయిర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో పాల్గొన్న దినేష్, చిరంజీవి పరారీలో ఉన్నారని తెలిపారు. -
బదిలీ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్న సర్వర్ శుక్రవారం ఉదయం నుంచి మొరాయిస్తూనే ఉంది. బదిలీలు చేసుకునేందుకు నెట్ సెంటర్ల వద్దకు వెళ్తున్న టీచర్లకు నిరీక్షణ తప్పడంలేదు. గంటల తరబడి సర్వర్ పనిచేయకుండా పోతుండడంతో టీచర్లు విస్తుపోతున్నారు. అదే విధంగా దరఖాస్తులు చేసుకునే సమయంలో చాలా మంది టీచర్లకు ఓటీపీలు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కానరాని హెల్ప్డెస్క్ బదిలీల కసరత్తు సమయంలో టీచర్లకు అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి హెల్ప్డెస్క్ ను ఏర్పాటు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో టీచర్లు అవస్థలు ఎదుర్కుంటున్నారు. దరఖాస్తు గడువు పొడిగించాలి టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు తేదీలను పొడిగించాలి. బదిలీలకు దరఖాస్తు చేసుకుంటుంటే సాంకేతిక సమస్యలు అధికంగా వస్తున్నాయి. టీచర్లు సకాలంలో దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోలేక పోతున్నారు. ఓటీపీలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివిధ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు బదిలీల గడువును పొడిగించాలి. – రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర ట్రెజరర్, చిత్తూరు జిల్లా -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఇద్దరి పరిస్థితి విషమం శ్రీరంగరాజపురం : ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని 50 బసివిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పోన్నైకు చెందిన లావణ్య (12) వేసవి సెలవుల్లో భాగంగా తమ బంధువులు 50 బసివిరెడ్డిపల్లి కాలనీలోని హరి, లత ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం హరి భార్య లత తమ పిల్లలు కార్తీక్ (12), పల్లవి (09)తోపాటు తమ అన్న కూతురు లావణ్య (12)తో పాటు కలిసి గ్రామం సమీపంలో ఉన్న ముక్కల చెరువులో ఈత, చేపల వేట కోసం వెళ్లారు. ఈ క్రమంలో లత చేపలు పడుతుండగా ముగ్గురు పిల్లలు సరదాగా చెరువులో ఈత నేర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు లావణ్య, పల్లవి, కార్తీక్ కాలుజారి చెరువులో మునిగిపోయారు. గమనించిన లత చెరువులో మునిగిపోతున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే లావణ్య మృతి చెందింది. కార్తీక్, పల్లవిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అంజన్న అభయం తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికి అర్చ కులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఉత్పవమూర్తి ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, శాస్త్రోక్తంగా పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించారు. ఉత్సవమూర్తిని పల్లకిలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం చేశారు. భక్తులు స్వామికి వసంతాలు కలిపి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆల య ఈఓ హనుమంతురావు, సిబ్బంది పాల్గొన్నారు. గరుడవాహనంపై వేణుగోపాలుడు కార్వేటినగరం : కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకృతుడైన వేణుగోపాలుడు గరుడ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించారు. డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి తదితరులు పాల్గొన్నారు. -
క్వారీపై కన్ను
● అడ్డుకున్న గ్రామస్తులు హిటాచీని అడ్డుకున్న రెండు పంచాయతీ ప్రజలు సాక్షి టాస్క్ఫోర్స్ : ఐరాల మండలంలోని మఠంపల్లెలో వెలసిన శ్రీ వీరభధ్ర స్వామి ఆలయానికి అనుసంధానమైన దేవుని నల్లగుట్టలోని క్వారీపై పచ్చనేతల కన్ను పడింది. నల్లగుట్ట కింద సొరంగంలో దేవుడి రాతి విగ్రహాలు ఉన్నాయి. ఏటా కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తారు. దీంతో పాటు పొడి స్తంభంపై కార్తీక మాసంలో అఖండ జ్యోతిని ఆనవాయితీగా వెలిగిస్తున్నారు. పురాతన ఆలయం కావడంతో ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ క్రమంలో పచ్చ నేతలు ఈ దేవుని నల్లగుట్టపై క్వారీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం ఉదయం లారీలో హిటాచీని తీసుకుని మాదిగపల్లె మార్గం గుండా రిజ్వర్ ఫారెస్ట్లోకి వెళుతుండగా స్థానికులు గమనించి స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీపీ మోహన్కు సమాచారం ఇచ్చారు. వారు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు, రెండు పంచాయతీల గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. వారందరూ దేవుని నల్లగుట్ట వద్దకు చేరుకొని హిటాచీ డ్రైవర్ను నిలదీశారు. దీంతో డ్రైవర్ మా ఓనర్ పంపితేనే ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చాడు. దీంతో సర్పంచ్, ఎంపీపీ హిటాచీ యజమానికి ఫోన్ చేసి ప్రశ్నించగా ఎమ్మెల్యే, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు గిరిధర్బాబు, పాతపాళ్యం సర్పంచ్ లోకేష్ చెప్పితేనే హిటాచి పంపించామని బదులిచ్చారు. దీంతో వారు స్పందిస్తూ పురాతన ఆలయానికి సంబంధించిన ఈ గుట్టపై ఎవరైనా క్వారీ పనులు చేపడితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో డ్రైవర్ హిటాచీని గుట్ట కింద వదిలి వెళ్లిపోయాడు. ఈ విషయంపై శనివారం తహసీల్దార్, ఎస్ఐకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై తహసీల్దార్ మహేష్కుమార్ను వివరణ కోరగా వీఆర్ఓను నల్లగుట్ట వద్దకు పంపించామన్నారు. రిజ్వర్ ఫారెస్ట్లోకి అనుమతి తప్పనిసరి అటవీశాఖకు సంబంధించిన రిజ్వర్ ఫారెస్ట్లోకి ఎలాంటి వాహనాలకై నా అనుమతులు తప్పనిసరిని స్థానిక అటవీశాఖ అధికారి రాకేష్కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.దేవుని నల్లగుట్ట -
బెల్లం రైతుకు 'బేడీలు'
కూటమి ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెల్లం సాగు చేసే రైతుకు బేడీలు వేస్తోంది. సాక్షాత్తు సీఎం ఇలాకాలో బెల్లం సాగు చేసే రైతులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. వారు దొంగతనం, హత్యలు చేయలేదు. కానీ అలాంటి వారికి వేసే శిక్షలు ఆరుగాలం శ్రమించే అన్నదాతకు పడేలా చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. బెల్లం సాగు చేసే రైతులు బెల్లం అమ్మడం నేరమా? బెల్లం తీసుకొని పోయినవారు సారా కాస్తారా.. కాఫీ చేసుకుంటారా రైతుకు ఎలా తెలుస్తుంది? కానీ సారా కాసే వాళ్లను వదిలేసి.. బెల్లం సాగు చేసే రైతులను జైలుపాలు చేస్తుండడంపై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరుజిల్లా లో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు.ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. నవోదయంలో చీకట్లు నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు.వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. గిట్టుబాటు ధర ఎక్కడ ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తసారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్,ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరు అరెస్టులపై ఉద్యమిస్తాం ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు. – నాగరాజన్, సీపీఐ, చిత్తూరు జిల్లా కార్యదర్శి -
ఉపాధికి నిచ్చెన
● పేద విద్యార్థులకు డెయిరీ టెక్నాలజీ కోర్సు వరం ● కోర్సు పూర్తి కాగానే మెండుగా ఉపాధి అవకాశాలు ● జిల్లాలో రెండు ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు ● ద్వితీయ సంవత్సరంలోనే ప్రాంగణ ఎంపికలు విద్యార్థులకు ప్రయోగాలను నేర్పుతున్న అధ్యాపకులు పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పేద విద్యార్థులకు డెయిరీ టెక్నాలజీ కోర్సు వరంగా మారింది. రెండేళ్ల కోర్సు పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభిస్తుండడం విద్యార్థులను ఆకర్షిస్తోంది. కోర్సులో చేరేందుకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకపోవడం గ్రామీణ విద్యార్థులకు మరింత చేరువ అయింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఇప్పటికే 60 శాతం మంది ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు. పైగా స్వయం ఉపాధి పొందే వీలుంది. సొంతంగా డెయిరీ ఫాం పెట్టుకొని రాణించే అవకాశాలు ఉండడంతో మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సుతో ఉన్నత చదువులకు అవకాశం ఉండడంతో ఈ కోర్సుపై అందరికీ ఆసక్తి నెలకొంది. పలమనేరు : పదో తరగతి కాగానే కార్పొరేట్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదివించి ఆపై నీట్, ఎంసెట్ ద్వారా ఉన్నత చదువులు చదివించలేని పేద తల్లిదండ్రులకు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టిన రెండేళ్ల డెయిరీ టెక్నాలజీ కోర్సుతో వెంటనే ఉద్యోగాలు పొందేందుకు ఓ వరంలా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఈ కోర్సుపై చాలా మందికి అవగాహన లేదు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఎటువంటి పరీక్ష లేకుండానే ప్రవేశం శ్రీపదిశ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే డెయిరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఒక్కో కళాశాలలో 40 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సును పూర్తి చేస్తే వెటర్నరీశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు వెళ్లవచ్చు. ఇక జిల్లాలో పాలపరిశ్రమ జోరందుకుంది. దీంతో పలు ప్రైవేటు పాల డెయిరీలున్నాయి. ఇందులో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం పలు కంపెనీలు ద్వితీయ సంవత్సరంలో ఉండగానే కళాశాలలో ప్రాంగణ ఎంపికలు చేస్తున్నారు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే బీఎస్సీ (డెయిరీ సైన్సు)లోనూ చేరవచ్చు. ఇందులో డిగ్రీ పూర్తయిన వారికి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు దక్కుతాయి. వీటికి వేతనాలు భారీగానే ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారికి పశుసంవర్ధకశాఖలో ఉద్యోగా అవకాశాలుంటాయి. గ్యారెంటీగా ఉపాధి అవకాశాలు పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కోర్సును 2015–16లో ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఈ కోర్సు పూర్తి చేసిన వారిలో 60 శాతం మందికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని పాల డెయిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలిన వారిలో కొందరు ఉన్నత చదువులకెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటులో ఉపాధి లేకున్నా సొంతంగా డెయిరీ ఫాం పెట్టుకొని స్వయం ఉపాధి పొందే అవకాశం ఉన్న కోర్సు కారణంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. కోర్సు చదువుతుండగానే ఎంపికలు గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఈ కోర్సు నిజంగా వరంలాంటిది. కోర్సు చదువుతుండగానే ఉద్యోగాలిస్తామంటూ పాల డెయిరీలు ముందుకొస్తున్నాయి. వెటర్నరీ పాలిటెక్నిక్లో చేరాలంటే ఎంట్రన్స్ రాయాలి. కానీ ఇందులో నేరుగా ప్రవేశం పొందవచ్చు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. – గురుప్రసాద్రెడ్డి, డెయిరీ టెక్నాలజీ కోర్సు ఇన్చార్జి, పలమనేరు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం మాది పలమనే రు మండలంలో ని సముద్రపల్లి గ్రామం. పేద కు టుంబం కావడంతో ఉన్నత చదు వులకు వెళ్లలేదు. దీంతో డెయిరీ టెక్నాల జీ కోర్సులో చేరా. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించా. ఈ గ్రామానికి పక్కనే ఉన్న పరాగ్ డెయిరీలో ప్రసుత్తం ల్యాబ్ లో టెక్నీషియన్గా ఉద్యోగం చేస్తున్నా. – లవకుమార్, టెక్నీషియన్, పరాగ్ డెయిరీ, పలమనేరు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో చేరాను మాది తవణంపల్లి మండలం గాజులపల్లి. మా తండ్రి రవి ట్రాక్టర్ డ్రైవర్, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.డెయిరీ టెక్నాలజీ కోర్సు చేస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుందని తెలుసుకున్నా. డెయిరీ టెక్నాలజీ కోర్సు పూర్తి చేశా. మొన్నటి ఫలితాల్లో 971 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు సాధించా. చదువుతూ ఉండగానే ఉద్యోగాలకు ఎంపిక కావాలన్నదే లక్ష్యం. – హర్షిత, డెయిరీ టెక్నాలజీ కోర్సులో స్టేట్ టాపర్ -
విశ్వం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి కల్చరల్: జాతీయ స్థాయిలో గత నెల ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ 9వ తరగతి విభాగంలో 400 మార్కుల కు 370 మార్కులు సాధించి వి.మోక్షిత్ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కై వశం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అలాగే 6వ తరగతి విభాగంలో 300 మార్కుల కు 281 మార్కులతో హృతిక్ రాయల్, 275 మార్కుతో వి.నిహార్, 270 మార్కులతో సోహిని అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. వీరితో పాటు రస జ్ఞ, జీవన్ సాయిరెడ్డి, ఆర్యన్రెడ్డి, భువనేష్, లోహిత్, మహిదర్, అశ్విన్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. అలాగే గణితంలో 50/50 మార్కులు విశ్వం విద్యాసంస్థల విద్యార్థులు సాధించడం రాష్ట్ర విద్యాశాఖకే గర్వకారణమన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వంచందన్రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే
● తోతాపురి టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్ ● కలెక్టరేట్లో మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులతో సమీక్ష ● పాల్గొన్న రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంపీ, ఎమ్మెల్యేలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర బాధ్యత కూటమి సర్కారుదేనని మామిడి రైతులు పేర్కొన్నారు. జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గురువారం కలెక్టరేట్లో మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జిల్లాలోని మామిడి సంఘాల నాయకులు, రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. మామిడి సంఘం నాయకులు గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. మామిడి కొనుగోళ్లు ఒకేసారి చేయడం వల్ల ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతులు రాత్రింభవళ్లు క్యూలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బంగారుపాళ్యం కు చెందిన రైతు మునీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మామిడి పంటకు టన్నుకు రూ .25 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. తవణంపల్లి మండలానికి చెందిన రైతు పద్మనాభనాయుడు మాట్లాడుతూ.. మామిడికి విపరీతమైన ప్రచారం కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందన్నారు. మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి జిల్లాలో మామిడిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట అధికంగా ఉందన్నారు. మామిడి బోర్డు ప్రతిపాదనలను సంబంధిత శాఖలకు అందజేసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు ఇద్దరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మామిడి గుజ్జు, జ్యూస్లపై జీఎస్టీ ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ.. మామిడి సీజన్లో తోతాపురి రకంకు గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల నిర్వాహకులు సమన్వయం ముఖ్యమన్నారు. పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు కట్ట మంచి బాబి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీల్లో ఎక్కువగా గుజ్జు నిల్వ ఉందన్నారు. మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందన్నారు. సమీక్షలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, భాను ప్రకాష్, చుడా చైర్మన్ హేమలత, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా జేసీలు విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, ఉద్యానవన శాఖ అధికారులు మధుసూదన్రెడ్డి, దశరథరామిరెడ్డి, రవిచంద్రబాబు, రైతులు పాల్గొన్నారు. -
‘డెప్యుటేషన్లను కొనసాగిస్తున్నాం’
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య విధాన పరిషత్లో డెప్యుటేషన్లను కొనసాగిస్తున్నామని డీసీహెచ్ఎస్ పద్మాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో గురువారం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో వర్గపోరు పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై ఆమె స్పందించారు. డెప్యుటేషన్ విషయంపై ఆస్పత్రి అధికారులు, కార్యాలయ అధికారులతో మాట్లాడారు. తప్పిదాలను తెలుసుకున్నారు. డెప్యుటేషన్ల రద్దు చేస్తూ ఇచ్చిన ఆర్డర్లను వెనక్కు తీసుకున్నారు. ఈ డెప్యుటేషన్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని పిలిచి కార్యాలయానికి చెడ్డపేరు రాకుండా చూడాలని, విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆమె హెచ్చరించారు. -
కోవిడ్పై భయం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కోవిడ్ వ్యాప్తికి ప్రజలు భయపడ్డొదని ..అలా అని అజాగ్రత్తగా ఉండకూడదని..తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని డీఎంఅండ్హెచ్ సుధారాణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారిపై దృష్టిపెడుతున్నామన్నారు. వారికి కోవిడ్ పరీక్షలు చేసేలా ఆదేశాలు వచ్చాయన్నారు. కొవిడ్ లక్షణాలుంటే.. ఐసోలేషన్లో ఉండేలా చూడాలని ఆదేశాలుండాయన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులు చేరొద్దన్నారు. మాస్క్లు వాడడం మంచిదన్నారు. చేతుల శుభ్రత, భౌతికదూరం పాటించడం ఉత్తమన్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు ముందు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.కుస్తీ పోటీలకు ఎంపిక యాదమరి : రాష్టస్థ్రాయి అండర్ 17 బాలబాలికల కుస్తీ పోటీలలో యాదమరి ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడాకారిణి జీవనగీత ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు చిత్తూరు మేసానికల్ క్రీడా మైదానంలో జరిగిన కుస్తీ పోటీలలో వివిధ రాష్ట్రాల క్రీడాకారిణిలతో పోటీ పడి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు చండీఘర్లో జరగనున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధించడంతో క్రీడాకారిణి జీవనగీత మన రాష్ట్రం తరఫున ఆడనుంది. ఈ సందర్భంగా జీవనగీతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిరాజా, పీడీలు రవి, హరికృష్ణ, దాము , ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా అభివృద్ధిపై సీఎంకు 27 ప్రతిపాదనలు ● టీడీపీ జిల్లా మహానాడులో నేతల తీర్మానం చిత్తూరు అర్బన్ : చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి 27 అంశాలతో కూడిన ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచనున్నట్లు టీడీపీ నాయకులు తీర్మానించారు. గురువారం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా మహానాడును అధ్యక్షుడు సిఆర్.రాజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళుతోందన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేస్తామన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. విజయపురంలోని కోసల నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ నాయుడు, కలికిరి మురళీమోహన్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, పరిశీలకులు మారుతి చౌదరి, సునీల్కుమార్, టీడీపీ నేతలు దొరబాబు, మనోహన్, చంద్రప్రకాష్, సురేంద్రకుమార్, హేమలత, త్యాగరాజన్, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. -
బాధల బదిలీలు
● మెడికల్ సమస్యలు ఉన్న టీచర్ల పరిస్థితి దారుణం ● అంగవైకల్యం తగ్గించి ఇచ్చిన సర్టిఫికెట్లతో ఆందోళన ● ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న టీచర్లు గతం...ప్రస్తుతానికి పొంతనే లేదు... గతంలో ఉన్న అంగవైకల్యం శాతానికి ఇప్పుడు రుయా మెడికల్ బోర్డు ఇచ్చిన శాతానికి పొంతనే లేకుండా పోయింది. చికిత్సలకు వెళ్లిన టీచర్లలో చాలా మందికి బహిరంగంగానే అంగవైకల్యం కనిపిస్తోంది. అయితే తక్కువ శాతం నమోదు చేసి ఇవ్వడంపై టీచర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మెడికల్ శాతం తక్కువగా నమోదు చేయడంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరోసారి మెడికల్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. బాధిత టీచర్లు పలువురు రుయా అధికారులను కలవగా డీఈఓ ఉత్తర్వులు తెచ్చుకోవాలని తేల్చిచెప్పేశారు. చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో సమస్యలపై గురువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెడికల్ సమస్యలు ఉన్న టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మెడికల్ బోర్డులు అంగవైకల్యం శాతం తక్కువగా నమోదు చేస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లతో బదిలీల్లో మొదటి అవకాశం కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతోందని బాధిత టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ సమస్యలున్న టీచర్లకు అన్యాయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారు, వయస్సు ప్రభావంతో మెడికల్ సమస్యలు ఏర్పడిన వారు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా అంగవైకల్యం ఉన్న టీచర్ల కు బదిలీల్లో మొదటి అవకాశం కల్పిస్తారు. ఇందుకు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా దరఖాస్తు చేసుకుంటారు. టీచర్లకు ఇటీవల తిరుపతి జిల్లా రుయా ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో గతంలో ఉన్న సర్టిఫికెట్లు కాకుండా కొత్తగా మెడికల్ సర్టిఫికెట్లు జారీచేశారు. ఈ ప్రక్రియ రుయా ఆసుపత్రి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆందోళనలో గురువులు గతంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటే అన్ని పాయింట్లు ఏడాదికి మూడు చొప్పున కేటాయించేవారు. ఇప్పుడు పాయింట్లకు ఎనిమిది సంవత్సరాల సీలింగ్ పెట్టారు. అంతకు మించి సర్వీస్ ఉన్నా పాయింట్లు నమోదు లేకుండా చేశారు. దీంతో 2014 డీఎస్సీ, 2016 స్పెషల్ డీఎస్సీ, 2015 లో బదిలీ అయిన టీచర్లకు నష్టం వాటిల్లుతుందని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. న్యాయం చేయాలి జిల్లాలో చాలా మంది టీచర్లు గతంలో పొందిన అంగవైకల్యం శాతంకు ప్రస్తుతం పొందిన అంగవైకల్యం శాతంకు వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో కొంత మంది టీచర్లు తమ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల తిరుపతి జిల్లా రుయాలో చేపట్టిన ఆరోగ్య పరీక్షల్లో అన్యాయం జరిగిందని బాధిత టీచర్లు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు పునఃపరిశీలన చేసి వారికి న్యాయం చేయాలి. – జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా -
రేషన్ బండ్లను కొనసాగించాలని నిరసన
● ఇంటింటా రేషన్కు కూటమి మంగళం ● ఎండీయూ వాహనాలు రద్దు ● చౌక దుకాణాల ద్వారానే ఇక సరుకులు ● అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్డుదారులు కూటమి ప్రభుత్వం బియ్యం పంపిణీ బండికి బ్రేకులు వేసింది. ఇంటింటా రేషన్కు మంగళం పాడింది. రేషన్ వాహనాలను రద్దు చేసింది. ప్రభుత్వం దెబ్బకు అయిదేళ్లుగా సేవలు అందించిన (ఎండీయూ) మొబైల్ డిస్టిబ్యూటరీ యూనిట్లు నిలిచిపోనున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి బతుకులు రోడెక్కనున్నాయి. ఈ నిర్ణయంతో చంద్రబాబు నైజమేంటో మరోసారి ప్రజలకు తేటతెల్లమైంది. దీనిపై కార్డుదారులు, ఎండీయూ వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపునకు వెళ్లాల్సిందే.. హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటే. తాజాగా ఇంటింటికి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలో సరుకులు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 1390 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి కింద 5.40 లక్షల కార్డుదారులు ఉన్నారు. వారందరికీ 9వేల మెట్రిక్ టన్నుల మేర రేషన్ను పంపిణీ చేయాలి. దానికోసం వైఎస్సార్సీపీ 336 ఎండీయూ వాహనాలను పెట్టి ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాహనాల భారాన్ని భరించలేక ఏకంగా రద్దు చేసేసి పాత పద్ధతిలో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుంది. ఇంటింటి సేవలకు మంగళం కూటమి ప్రభుత్వం సంక్షేమాన్నే కాదు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలను కూడా వదిలేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని భావించి.. సామాన్యుడి ఇంటి వద్దకే అనేక సేవలు అందజేసింది. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఏం అవసరమో గుర్తించి, వాటిని నేరుగా అందజేసింది. సంక్షేమ పథకాలతో పాటు అధికారిక సేవలను ఇంటి చెంతకే చేర్చింది. 15 వేల మందికి పైగా వలంటీర్ల ద్వారా ప్రజలకు 539 సేవలు అందించింది. రేషన్ అందించడం కోసం వాహనాలను ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి చూపించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే వలంటీర్ వ్యవస్థను తీసేసింది. ప్రతి పౌర సేవకు వీధివీధితోనూ ఐదేళ్లుగా అనుబంధం పెనవేసుకున్న రేషన్ బండ్లు ఆగిపోనున్నాయి. సామాన్యుడి ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించిన ఈ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక రేషన్ కోసం డిపో ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. రోడ్డున పడిన ఆపరేటర్లు జిల్లాలో ఎండీయూ వాహనాలపై ఆపరేటర్లతో పాటు సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఒక్కో వా హనానికి నెలకు రూ.18 వేల వరకు వచ్చేది. 1500 నుంచి 2000 ఇళ్ల వరకు సరుకులు నేరుగా పంపిణీ చేసేవారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. వాస్తవంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం గడువు ఉంది. కానీ ఉన్న ఫలంగా వాహనాలను ఆపేయడంతో వారి పరిస్థితి దయనీయంగా త యారైంది. వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆపరేటర్లపై పగబట్టి ప్రతికారం తీర్చుకుంటోంది. జీతాల్లో కోతలు పెట్టించి నానా అవస్థలకు గురిచేసింది.రేషన్ పంపిణీ చేస్తున్న ఆపరేటర్ (ఫైల్)ఇంటి నుంచి కాలు కదపకుండా.. కష్టం తెలియకుండా గడప వద్దే రేషన్ అందించిన ఘనత గత ప్రభుత్వ చరిత్ర.. నేటి కూటమి ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పునకు కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి .. గంటల తరబడి చౌక దుకాణం ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నేడు కార్డుదారులు ఎదుర్కోవాల్సి రావడంతో కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం గత వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్కో పథకాన్ని కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వేల మంది ఎండీయూ ఆపరేటర్లు నేడు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. – కాణిపాకం -
బాలుడి మృతి కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడు: బాలుడు వెంకటేష్ మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐ మురళీనాయుడు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బాలుడు వెంకటేష్ మృతికి సంబంధించి సత్యవేడు మండలం నరసరా జు అగ్రహారం చెందిన ముత్తు(60) ధనభాగ్యం(55), రాజశేఖర్(32) అరెస్టు చేశామన్నారు. గూడూరు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన చెంచయ్య, అంకమ్మకు చెంచుకృష్ణయ్య, రామ లక్ష్మమ్మ, వెంకటేష్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో బాలున్ని వదిలి.. అంకమ్మకు ఏడాది కిందట నరసరాజు అగ్రహారానికి చెందిన ముత్తు రూ.10 వేలు ఇచ్చి సత్యవేడుకు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక అంకమ్మ తన పిల్లలతో కలిసి బర్రెలు, బాతులకు కాపలాదారుగా ఉండేది. 3 నెలల కిందట అంకమ్మ భర్త చెంచయ్య చనిపోవడంతో సొంతూరుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి వెళ్లాలని యజమాని ముత్తు పట్టుపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె 9 ఏళ్ల కొడుకు వెంకటేశ్ను వారి వద్దే వదలివెళ్లింది. బాలుడితో ముత్తు వెట్టిచాకిరీ చేయించుకోవడంతో పాటు హింసించేవాడు. కొన్నాళ్లకు బాలుడు వెంకటేష్ను తీసుకొని యజమాని ముత్తు తమిళనాడులోని కంచి ప్రాంతానికి బాతులు మేపడానికి తీసుకెళ్లాడు. అయితే తల్లి అంకమ్మ కుమారుడితో ఫోన్లో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించగా మీ కొడుకు కనిపించడంలేదని ముత్తు తెలిపాడు. దీంతో ఆమె ఈ నెల 19న సత్యవేడుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా గుట్టురట్టయింది. కంచిలో ఉన్న సమయంలో బాలుడు అస్వస్థతకు గురి కావడంతో ఏప్రిల్ 11వ తేదీన కంచి సమీపంలోని లింగ ఆస్పత్రిలో చేర్పించగా.. 12న చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కంచి వద్ద పాలేరు నదిలో పూడ్చి పెట్టినట్లు నిందితుడు ముత్తు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు కంచికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికితీసి అక్కడి అధికారుల సమక్షంలో పంచనామా చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
మళ్లీ ప్రారంభమైన గజ దాడులు
సదుం : కొద్ది రోజుల విరామం అనంతరం మండలంలో పంట పొలాలపై ఏనుగుల దాడులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. చెరకువారిపల్లె పంచాయతీ పరిధిలోని పోతం వారిపల్లె, కుమ్మరిపల్లె సమీపంలోని మామిడి చెట్లపై ఏనుగులు దాడి చేశాయి. సుమారు 15 వరకు ఉన్న ఏనుగుల గుంపు గురువారం ఉద యం మామిడి చెట్లను విరిచి వేయడంతో పా టు, డ్రిప్ పరికరాలు, నీటి సరఫరా పైప్లను ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు వెంటేష్, కామేశ్వర, సోమశేఖర్, లక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మమ్మ, శ్రీనివాసులు, రమేష్, మునుస్వామి వాపోయారు. అటవీ ప్రాంతాల్లో ఏనుగులు సంచారం మళ్లీ ప్రారంభం కావడంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ క్వారీలు నిర్వహిస్తే చర్యలు బంగారుపాళెం : అక్రమ క్వారీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. గురువారం మండలంలోని కొత్తపల్లె, జంబువారిపల్లె వద్ద అక్రమ క్వారీలను పలమనేరు మైనింగ్ అధికారులు జియాలజిస్టు కుమారస్వామి, రాయల్టీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, తహసీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడి క్వారీ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం పెద్దపంజాణి : మండల పరిధిలోని శంకర్రాయలపేట గ్రామ సమీపంలో ని మామిడి తోట లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. శంకర్రాయలపేటకు చెందిన జాన్సీ అనే మహిళకు చెందిన మామిడి తోటలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం పురుషుడిదిగా గుర్తించి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసు లు తెలిపారు. మృతుడు నలుపు రంగు బెల్టు, ప్యాంటు ధరించినట్లు పేర్కొన్నారు. నెల రో జుల క్రితం ఓ వ్యక్తికి కొన్ని వస్తువులు లభ్యం కాగా ఆ వస్తువుల్లోని ఫోన్ నంబరు ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు స మాచారం. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ వేధింపులు
● బ్యాంకు అధికారుల కొర్రీలు ● వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్ కష్టాలు ● పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక ● అవస్థల్లో అన్నదాతలు ● ప్రభుత్వ తీరుపై మండిపాటు వ్యవసాయ రుణం రణంగా మారింది. బ్యాంకర్లు రైతులకు అనేక కొర్రీలు పెడుతున్నారు. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో రైతులు, రుణదారులు తీసుకున్న రుణాలకు రెన్యూవల్ కష్టాలను తెచ్చి పెట్టారు. పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెడుతున్నారు. పూర్తిగా చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని చెబుతుండడంతో రైతులు, రుణదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు అప్పులు చేసి రెన్యూవల్ చేస్తే..మరికొందరు పరేషాన్ అవుతున్నారు. ఈ విధానంపై పలువురు రైతులు మండిపడుతున్నారు. 35 లక్షల ఖాతాలు జిల్లాలో 232 బ్యాంకులున్నాయి.. వీటికి కింద సుమారు రూ.35 లక్షల ఖాతాలున్నట్లు అధికారుల అంచనా. వీరు కొన్ని వేల కోట్లు అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వ్యక్తిగత, వ్యవసాయం, బిజినెస్, గృహ, వాహన సంబంధిత వాటి కోసం బ్యాంకుల్లో రుణాలు పొందారు. వీటి చెల్లింపులో వ్యకిగత రుణాలకు మినహాయింపులు ఇస్తున్నారు. అయితే వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్ పేరుతో వేధిస్తున్నారు. గతంలో రెన్యూవల్ ఇలా.. గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారు విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు. ఇలా రైతులకు ఇబ్బందులు లేకుండా రెన్యూవల్ సదుపాయం కల్పించేవారు. ఈ ఫలితంగా బ్యాంకర్లకు రుణదారుల నుంచి రెన్యూవల్ చేయించే విషయంలో సమస్యలు తల్తెతేవి కావు. ఈ ప్రక్రియ గంట, గంటన్నర వ్యవధిలోనే జరిగిపోయేది. ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయ రైతులు, రుణదారులకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఏటా నష్టాలు.. అప్పులే వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారులు చేసుకుంటున్నవారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకు తెరువు కోసం పట్టాపాసు పుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయ వృద్ధి చేసుకుంటున్నారు. బోరు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, మామిడి మొక్కలు పెట్టించడం, వరి, లేకుంటే ఏటా మామిడికి సాగుకు అవసరమ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి..మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగువేయడంలేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు,..కన్నీళ్లు మిగలడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి రెన్యూవల్ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రానికి విత్తనాల కోసం వచ్చిన రైతులు (ఫైల్) వ్యవసాయ రుణ వివరాలు ఇలా.. సీజన్ రుణ లక్ష్యం ఇచ్చిన రుణం (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) ఖరీఫ్–2024 4,072 4,435 రబీ–2024–25 2,830 3,120 మొత్తం 9,602 7,555 టర్మ్లోన్లు 3,284 3,341 రైతన్నలకు రుణాల రెన్యూవల్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏటా బ్యాంకుల్లో రుణాలకు వడ్డీ చెల్లించుకొని రెన్యూవల్ చేసేవారు. కొత్త నిబంధనల పేరుతో బ్యాంకర్లు రుణాలు మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో రుణాలు మొత్తం ఎలా చెల్లించాలో తెలియక .. ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యం అంటూ తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు. జిల్లాలోని ఏ రైతును కదిలించినా కన్నీటి వెతలే వినిపిస్తున్నాయి. రుణాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. – కాణిపాకంమినహాయింపు ఇవ్వాలి ఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది జీడీ నెల్లూరు మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్కు సంబంధించి మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ బ్యాంకర్లు అసలు, వడ్డీ చెల్లించాలని మొండికేశారు. వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేస్తాను.. అంటే వాళ్లు ఒప్పుకోలేదు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి ఏప్రిల్ 10వ తేదీన రెన్యూవల్ చేశా. ప్రభుత్వం రెన్యూవల్ విషయంలో మినహాయింపు ఇచ్చేలా చూడాలి. – బాబు, జీడీనెల్లూరు కొత్త విధానం అమల్లో ఉంది రెన్యూవల్ కొత్త విధానం 2024 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవ ల్ చేయించుకోవాలి. ఇకపై వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేయించుకునే పద్ధతి లేదు. దీనిపై సమస్యలు వస్తున్నాయి. కొంత మంది మంత్రులు ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇది ఉన్నత స్థాయిలో జరగాల్సిన విషయం. – హరీష్, ఎల్డీఎం, చిత్తూరు చిత్తూరు మండలానికి చెందిన రాజు అనే రైతు 2021లో వ్యవసాయ పనుల నిమిత్తం ఓ బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.60 వేల వరకు రుణం తీసుకున్నాడు. ఏటా రెన్యూవల్ చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల కిందట బ్యాంకు రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లిన రైతు రాజుకు బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని.. ఇప్పుడు కొత్త రూల్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చేసేదీ లేక రాజు అప్పు చేసి రూ.లక్ష చెల్లించి రెన్యూవల్ చేయించుకున్నాడు. ఇలా ఈ రైతు ఒక్కరే పరిస్థితి కాదు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే. 10 శాతం బ్యాంకులు మినహా..మిగిలిన బ్యాంకులన్నీ రెన్యూవల్ విషయంలో రుణదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రెన్యూవల్ పేరుతో వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్లు రావడంతో బ్యాంకులకు రుణదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక బ్యాంకర్లు రెన్యూవల్ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని మెలిక పెడుతున్నారు. వడ్డీ చెల్లింపుతో..రెన్యూవల్ చేయడం ఇకపై కుదరదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దీంతో వడ్డీ భారం పడుతుందని చాలా మంది అష్టకష్టాలు పడి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణదారులను ఇబ్బందులు పెడుతున్నారు. రేపు రమ్మని చెప్పి వాళ్లను తిప్పించుకుంటున్నారు. సీ–బిల్, కేవైసీ, ఇతర వివరాల సాకు చూపి జాప్యం చేస్తున్నారు. గట్టిగా తిరగబడితే ఆర్బీఐ రూల్స్ అంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పోరు పడలేక రెన్యూవల్ చేసుకునేందుకు చాలా మంది ముందుకు రావడంలేదు. -
విశ్వరూపం.. దివ్యతేజం
● అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు ● విచిత్ర వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం కుప్పం : శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం కనులపండుగగా జరిగింది. శిరస్సు ఊరే గింపు ముగించుకుని అమ్మవారి ఆలయంలో విశ్వరూప దర్శనం ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒక్కసా రి మాత్రమే జరిగే విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ లయ ప్రాంగణం కిక్కిరిసింది. పొంగళ్లు, పిండితో తయారు చేసిన దీపాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక దర్శ నం కోసం రూ.100, రూ.200 టికెట్లు పెట్టి వీ ఐపీలకు దర్శన సౌకర్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి బుధవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు 12.30 గంటలకు బెంగళూరు నుంచి కుప్పంలోని ద్రవిడ వర్సిటీ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం 2 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. -
ప్రైవేటు కళాశాలలపై నిఘా
ఎంత కట్టడి చేసినా ఏటా అనుమతులు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరో 11 రోజుల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ కళాశాలల కసరత్తుపై ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులతో సాక్షి ముచ్చటించింది.. వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది కంటే రానున్న విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు పకడ్బందీగా కసరత్తు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, కోర్సులు, మధ్యాహ్న భోజనం, అనుభవం ఉన్న అధ్యాపకులు తదితర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రతి ప్రిన్సిపల్ తమ వంతు బాధ్యతగా అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక ఫోకస్ చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షలకు పోటీ పడేలా ఈ విద్యా సంవత్సరం నీట్, జేఈఈ, ఎంసెట్, తదితర పరీక్షలకు మెటీరియల్, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తొలిరోజే పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉన్న ప్రతి కళాశాలలో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మండలాలకు పాఠ్యపుస్తకాలు, మెటీరియల్లు చేరాయి. కొన్ని కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల చెంత పాఠ్యపుస్తకాలు లేవు అనే మాట రాకుండా పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఏ ప్రభుత్వ కళాశాలలోనూ పాఠ్యపుస్తకాలు నిల్వ పెట్టుకోకుండా నిబంధనల ప్రకారం విద్యార్థులకు పంపిణీ చేసేయాలని ఆదేశాలిచ్చాం. 68 మంది ప్రిన్సిపల్స్, 400 అధ్యాపకులు బదిలీ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు బదిలీల కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నాం. ప్రస్తుతం అంతర్గతంగా కసరత్తు చేపడుతున్నాం. బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఖాళీలు, పోస్టుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 68 మంది ప్రిన్సిపల్స్, 400 మంది అధ్యాపకులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర్వులు జారీ అయ్యాక ఖాళీలను ఆన్లైన్లో పొందుపరుస్తాం. వాటి ప్రకారం ఆన్లైన్ విధానంలో బదిలీలు నిర్వహించడం జరుగుతుంది. అనుమతుల్లేని కళాశాలలుంటే సీజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి పకడ్బందీగా బదిలీల ప్రక్రియ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ జూన్ 2న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం సాక్షి ఇంటర్వ్యూలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులు మేనేజ్మెంట్ల వారీగా కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31 హైస్కూల్ ప్లస్ 24 కేజీబీవీ 08 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 04 బీసీ వెల్ఫేర్ గురుకులాలు 01 ఏపీ మోడల్ స్కూల్స్ 07 ప్రైవేట్ , కార్పొరేట్ 65 మొత్తం కళాశాలలు 140 జూన్ 2న పునఃప్రారంభం జూన్ 2 వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 140 కళాశాలలుండగా, అందులో 65 ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలున్నాయి. కళాశాలలు ప్రారంభం అయ్యాక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఎక్కడైనా కళాశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలను అడ్మిషన్లు చేసే సమయంలో కళాశాలకు అనుమతులున్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కళాశాలల్లో చేర్పించాలి. -
పార్టీలకతీతంగా పనిచేయండి
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సొమ్ముతో చేసే పనులకు పార్టీల ముద్ర వేసి అడ్డుపడవద్దని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల ఏఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండల స్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడంతో గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేయించడం వదిలేసి రాజకీయముద్ర వేసుకోవద్దని హితువు పలికారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలు వచ్చిన వాటిని నమోదు చేయకుండా ఏఓలు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. దీంతో అక్కడ పట్టించుకోవడం లేదని జిల్లా స్థాయిలో ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో కనీసం పరిశీలించడం లేదని తెలుస్తోందన్నారు. ఇంత అధ్వానంగా పనిచేస్తే ఎలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మండలాల్లో దాదాపు 10–15 పనులను పరిశీలిస్తారని వాటిని చూడటానికి మీకు ఓపిక లేదా అని సీఈఓ ప్రశ్నించారు. తూర్పు మండలాల్లో 500 అడుగులు లోతులో బోరు వేస్తున్నట్లు బిల్లులు పెట్టడం చూసి విస్తుపోతున్నామన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద దళితవాడల్లో వసతుల కల్పన పై ఎందుకు శ్రద్ధపెట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 5 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేస్తామని సృష్టం చేశారు. రెండేళ్లు దాటిన వారు రిక్వెస్టు, మ్యూచువల్ మేరకు మార్పు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జుబేదా తదితరులు పాల్గొన్నారు. ● ఏఓలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీ సీఈఓ -
సర్వర్ పరేషాన్
● రేషన్కార్డు దరఖాస్తుకు మొరాయిస్తున్న సర్వర్ ● సచివాలయ సిబ్బంది సతమతం ● గందరగోళంగా దరఖాస్తుల ప్రక్రియ ● మ్యారేజ్ సర్టిఫికెట్ వద్దన్నా..పలుచోట్ల వేధింపులు ● పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్కార్డుకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు రకం సంఖ్య చిరునామా మార్పు 235 ఆధార్ సీడింగ్ కరెక్షన్ 287 సభ్యుల చేర్పు 13769 సభ్యుల తొలగింపు 301 కొత్త రేషన్కార్డు 1939 కార్డు విభజనకు 1528 సరెండర్ కార్డు 41చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కొత్త రేషన్కార్డుల సర్వర్లు పనిచేయకపోవడంతో సచివాలయ సిబ్బంది సతమతం అవుతున్నారు. దరఖాస్తు కోసం కార్డుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షిస్తున్నారు. తొలి నుంచి సర్వర్ సమస్య వెంటాడుతున్నా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. కొత్తగా రేషన్కార్డు కావాలని దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం వద్దన్నా.. పలుచోట్ల సచివాలయ సిబ్బంది మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని నిబంధన పెడుతున్నారు. దీంతో కార్డుదారుల దరఖాస్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. 18,100 దరఖాస్తులు కొత్త రేషన్కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు ఈనెల 7వతేదీ నుంచి ప్రారంభమైంది. ఏడాది కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, రేషన్ కార్డులు చేర్పులు, తొలగింపులు వంటివి పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జీదారులు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. ఈనెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినా..అమల్లోకి రాలేదు. దీంతో రేషన్కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు అవస్థలు పడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటి వరకు 18,100 దరఖాస్తులు వచ్చాయి. ఒంటరి మహిళల దరఖాస్తులపై ఆంక్షలు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో జిల్లాలో అర్జీదారులు సచివాలయాల చుట్టూ తిరగడమే సరిపోతుంది. సర్వర్ సరిగ్గా పనిచేస్తే ఈపాటికి రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి ఉండేది. సర్వర్ సమస్య తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో త్వరపడి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను తీసుకోవద్దని వీఆర్వోలు ఆదేశాలు జారీ చేశారు. జూన్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు. సర్వర్ సమస్యతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతూ ఉండటంతో ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్నా నిరాశే ఎదరువుతోంది. ముఖ్యంగా వివాహమై భర్తకు ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరగడం లేదు. విడాకులకు సంబంధించిన వివరాలు ఉండాలంటూ చెబుతున్న పరిస్థితి నెలకొంది. భర్త నుంచి దూరమమై అనేక మంది మహిళలు ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్నారు. విడాకుల కోసం తిరగలేక ఆర్థిక స్తోమత లేక అలాగే ఉండిపోయారు. ఇలాంటి ఒంటరి మహిళలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించకుండా ఆంక్షలు విధించటం ఏమిటని విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివాహ పత్రానికి మినహాయింపు ఏదీ.. రేషన్కార్డుదారులకు దరఖాస్తు చేసుకుంటున్న కొత్త జంటలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులు కొనసాగుతున్న వారు కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనికి మొదట్లో ప్రభుత్వం ఆధార్, పాతరేషన్కార్డుల నకలు, వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసింది. దీంతో అనేక మంది ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. నోటరీ, పెళ్లి శుభలేక, పెళ్లి సమయంలోని ఫొటోలు, వంటి తదితర వివరాలు కచ్చితంగా ఉండాలని కోరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుభలేఖలు లేనివారు ప్రింటింగ్ ప్రెస్లకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి పత్రాలు రావడానికి ఆలస్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం వివాహ ధ్రువీకరణ పత్రం విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే పలు చోట్ల సచివాలయ సిబ్బంది పెళ్లి పత్రాల తప్పనిసరి అంటూ మెలిక పెడుతున్నారు. ఇబ్బందులు కలిగించొద్దు కొత్తగా వివాహం అయిన జంటలకు వివాహ పత్రం అవసరం లేదు. దీనిపై పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తాం. వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని చెబుతున్నాం. ఎక్కడైనా అలాంటి సమస్యలు వస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చు. రేషన్ కార్డు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దు. అర్హత ఉంటే కచ్చితంగా కార్డులు వస్తాయి. సర్వర్ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. – శంకరన్ డీఎస్ఓ, చిత్తూరు అవగాహన లేక.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభ సమయంలోనే ఆయా సచివాలయాల సిబ్బందికి అవగాహన శిబిరాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అలా జరిగి ఉంటే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చేవి. కొన్ని ప్రాంతాలలో కులం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కోరుతున్నారు. అదే సమయంలో గతంలో రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులను తొలగిస్తేనే, వారు పెళ్లి అనంతరం వారి ప్రత్యేక కుటుంబంతో దరఖాస్తు చేసుకోవటానికి వెసులుబాటు జరుగుతుంది. అలా చేర్పులు, మార్పులు తొలగింపులకు, సర్వర్ల ప్రక్రియ సక్రమంగా పనిచేయక అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయ సిబ్బందికి అర్జీదారులకు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగంలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో ప్రారంభంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొత్తగా సభ్యుల చేరిక మొదలుకుని ఇప్పటికే మృతి చెందిన, వివాహమై వెళ్లిపోయిన సభ్యుల వివరాలను మార్చడం లేదు. దరఖాస్తు దారులకు సమయం పొడిగించాలని, సర్వర్ల సమస్యను పరిష్కరించాలని, దరఖాస్తుకు జత పరచాల్సిన వివరాలను సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు
పలమనేరు : కర్ణాటక ప్రభుత్వం నుంచి పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద నిర్మించిన ఎలిఫెంట్ క్యాంపునకు నాలుగు ఏనుగులు వచ్చినట్లు స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ బుధవారం తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో వీటిని స్వీకరించారు. ఈ కుంకీ ఏనుగుల పేర్లు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు ఉన్నాయి. వీటి సంరక్షణకు ఇక్కడి క్యాంపులో అవసరమైన మేతను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల కర్ణాటక మావటీలు స్థానిక రేంజిలో శిక్షణ పొందిన మావటీలు వీరి పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు. మామిడి దిగుబడిపై నివేదిక ఇవ్వాలి తవణంపల్లె : మామిడి దిగుబడిపై అంచనా వేసి నిర్ధిష్టమైన నివేదిక ఉంచాలని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండలంలోని పుణ్యసముద్రం రైతు సేవా కేంద్రంలో మామిడి దిగుబడి అంచనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవా సిబ్బంది పరిధిలోని రైతులను కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి దిగుబడి ఎన్ని టన్నులు వస్తుందని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని సూచించారు. సీజన్ ప్రారంభం కాక ముందే ప్రణాళిక తయారు చేసే నివేదిక చాలా ఉపయోగపడుతోందని వివరించారు. అనంతరం ఫీల్ ఫ్రెష్ ఫుడ్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న మామిడి కాయలను, ఫ్యాక్టరీని పరిశీలించి ఫల్ప్ తయారీపై ఆరా తీశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సాగరిక, మండల వ్యవసాయాధికారి జి. ప్రవీణ్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ ఏటీజిహెచ్ వద్దకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,000 మంది స్వామివారిని దర్శించుకోగా 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
డీసీహెచ్ఎస్లో వర్గపోరు
● జిల్లా ఆస్పత్రిని తాకిన సెగ ● అంతా తానై వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులు ● ఇష్టానుసారంగా డెప్యూటేషన్లు రద్దు ● కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు బేఖాతరు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : డీఎసీహెచ్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వర్గపోరు పుంజుకుంటోంది. ఈ ప్రభావం డీహెచ్ (జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి) కార్యాలయంపై పడింది. ఆ ఇద్దరు అధికారులు కలిసి అంతా తామై చక్రం తిప్పుతున్నారు. ఇష్టానుసారంగా డెప్యుటేషన్లు రద్దు చేయడం..ఆ తప్పులను డీసీహెచ్ఎస్, కమిషనర్ మీదకు నెట్టేస్తున్నారు. కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ...ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు. భయపడుతున్న అధికారులు, సిబ్బంది.. జిల్లా వైద్యవిధాన పరిఽషత్ పరిధిలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 8 సీహెచ్సీలున్నాయి. ఈ పరిధిలో సుమారు 500 మందికి పైగా పనిచేయగా డెప్యుటేషన్లో 40 మంది ఉన్నారు.. వీరిలో వర్గపోరు తారస్థాయి చేరుకుంది. ప్రధానంగా ఏఓ, ఏడీ పోస్టులు ఖాళీ అయిన దగ్గర నుంచి ఈ వర్గపోరు ఉధృతమైంది. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి అంతా తాను చెప్పినట్లే జరగాలని ఈ పోరుకు ఆజ్యం పోస్తున్నారు. రాష్ట్ర కమిషనర్ శాఖలో పనిచేశానని గొప్పలు చెప్పకుంటూ..రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ తనకు సుపరిచితులే అంటూ భయపెడుతున్నాడని కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు వాపోతున్నారు. ఇటీవల డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఓ పోస్టుకు ఇద్దరు అధికారులు పోటీ పడ్డారు. కానీ ఆ అధికారి పుంగనూరులో పనిచేస్తున్న ఓ అధికారిని ఏఓ పోస్టుకు తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. తొలుత ఏడీ కుర్చీలో కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది ఫలించకపోగా..ఏఓ కుర్చీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇటీవల డీసీహెచ్ఎస్కు అనుకూలమైన ఓ అధికారి ఏఓ బాధ్యతలను చేపట్టారు. ఇది గిట్టక కార్యాలయంలో గందరగోళం సృష్టించాలని, డీసీహెచ్ఎస్కు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ అధికారుల వర్గం పావులు కదుపుతోంది. ఎలాంటి ఆర్డర్లు లేకుండానే.. కుటుంబ, ఆరోగ్య పరమైన కారణాలతో కలెక్టర్, కమిషనర్ అనుమతితో డెప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వారిని పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్ చేయాలన్న రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు ఉండాలి. అయితే డీసీహెచ్ఎస్, డీహెచ్ కార్యాలయంలో అవేవీ చెల్లుబాటు కావడంలేదు. ఓ వర్గం అధికారి చెబితేనే జిల్లాలోని ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లంతా వణుకుతున్నారు. లేకుంటే ఆ అధికారి రాష్ట్ర కమిషనర్కు ఫిర్యాదు చేస్తారనే భయం ప్రతి ఒక్కరిలోనూ వెంటాడుతోంది. కమిషనర్ ఆర్డర్లు లేకపోయినా..జిల్లాలో ఆ అధికారే జిల్లాకు డీసీహెచ్ఎస్, కమిషనర్ లెక్క పనిచేస్తున్నారని కార్యాలయ అధికారులు వాపోతున్నారు. ప్రధానంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యాలయంలోని మరో అధికారితో చేతులు కలిపి ఈ డెప్యుటేషన్లు రద్దుకు పూనుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అది కూడా వాళ్ల వర్గానికి మాత్రమే ఆ డెప్యుటేషన్లను పరిమితం చేశారని పలు విమర్శలకు తావిస్తోంది. వీటిపై విచారణ చేపడితే ఆ అధికారి అక్రమ బాగోతాలు బయట పడుతున్నాయని చెబుతున్నారు. వీరిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు కూడా పలు ిఫిర్యాదులు వెళ్లాయి. డెప్యూటేషన్ల రద్దుపై అధికారులను ప్రశ్నిస్తే మాకేం సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. డీసీహెచ్ఎస్ నోటి మాటగా చెప్పడంతో చేశామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అధికారి బదులిచ్చారు. డెప్యుటేషన్ రద్దు తెలియదు డెప్యుటేషన్ రద్దు ఎప్పడు చేయమన్నాను. నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏవైనా ఆర్డరు పెట్టండి కనుక్కుంటా. ఈ ఆర్డర్తో నాకు సంబంధం లేదు. అది ఆస్పత్రి వాళ్లు ఇచ్చుకున్నారు. విచారిస్తాను. చర్యలు తీసుకుంటా. – పద్మాంజలి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
గుడిపాల : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. బెంగుళూరు నుంచి గుడిపాల మండలంలోని కొత్తకోట గ్రామానికి కారులో అదే గ్రామానికి చెందిన వారు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కుప్పిగానిపల్లె గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
మృగరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్య వేణుగోపాలుడుగా ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరారు. ఉదయం సింహ వాహనంపై వేణుగోపాలుడు భక్తులను అనుగ్రహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు నరసింహ అవతారంలో స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలోని శ్రీవేణుగోపాలుడికి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో టీటీడీ బృందం గాత్ర కచేరి తో కనులపండువగా ఊంజల్సేవ నిర్వహించారు. ఉభయ నాంచార్లుతో వేణుగోపాలుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీవేణుగోపాలుడు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి చిన్నారుల కోలాటాలు, మహిళల చెక్కభజనల, మంగళ వాయిద్యాలు, నడుమ అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో స్వామి వారిని పవళింప జేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబు సురేష్, కంకణభట్టర్ తరుణ్కుమార్, వేద పండితులు నారాయణదాసరథి, గోపాలాచార్యులు, రమేష్, శభరీష్, అలంకార పండితులు మోహన్బట్టాచార్యులు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం కార్వేటినగరంలో జరుగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్నారని సంకెళ్లు ● జిల్లా వ్యాప్తంగా రైతుల అరెస్టులు.. నోటీసులు ● రైతులకు ‘కూటమి సర్కారు’ ఝలక్ ● ట్రేడర్లకే విక్రయించాలంటున్న ఎకై ్సజ్ పోలీసులు
చిత్తూరు అర్బన్ : జిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. నవోదయంలో చీకట్లు నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు. వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. బెల్లం తయారీలో రైతులు‘ఈ చిత్రంలో భార్య, బిడ్డలతో తన చెరకు తోట, ట్రాక్టర్తో కలిసి ఉన్న రైతు పేరు పెరుమాల్. గతేడాది ఆయుధపూజ నేపథ్యంలో చెరకు పంట ఓ మోస్తరుగా వస్తుండడంతో ఇలా ఫొటో తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుమాల్ చిత్తూరు జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.. కారణం.. పెరుమాల్ రైతు కావడం, తన వద్ద నల్లబెల్లం కొన్న వ్యక్తులు సారా తయారు చేశారంట.’ సారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, చిత్తూరు గిట్టుబాటు ధర ఎక్కడ ? జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యింది. అరెస్టులపై ఉద్యమిస్తాం ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు. – నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంిసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, చిత్తూరు -
ద్రవిడ వర్సిటీకి రూ.5.20 కోట్ల రుణం
కుప్పం : ద్రవిడ వర్సిటీకి రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జీఓ విడుదల చేసింది. అయితే ఈ నిధులను వర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించుకోమని గానీ ఎక్కడా చెప్పలేదు. పైగా ఈ నిధులను 10 ఏళ్లలోపు మళ్లీ చెల్లించాలని జీఓలో పొందుపరిచారు. కాగా మూడేళ్లలోపు అదనపు బడ్జెట్ కింద నిధులు మంజూరు చేస్తామని.. వీటిని సైతం 10 ఏళ్లలోపు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిధులను వర్సిటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించేందుకే అని వర్శిటీ అధికారులు స్పష్టం చేశారు. వేతనాలు నేరుగా అందించకుండా అప్పుగా ఇవ్వడంపై ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత సంవత్సర కాలానికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్శిటీని ప్రక్షాళన చేసి వీరి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. మొదట్లో ఆరు నెలల జీతాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏడాదికి పైగా జీతాలు రావాల్సి ఉండగా వర్సిటీ అధికారులు ఉన్నత విద్య శాఖ అధికారులకు నివేదికలు పంపారు. అయితే 235 మందికి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే చేతులెత్తేశారు.ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కుప్పంకు విచ్చేస్తున్న నేపథ్యంలో వర్సిటీలోని హెలీప్యాడ్కు చేరుకుని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. వర్సిటీలో గత సంవత్సర కాలంగా జీతాలు అందక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదన్న భావనతో వర్సిటికీ రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ జీఓను విడుదల చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీస వేతనాలు అందకకూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వర్సిటీని అభివృద్ధి చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరికి ఎలాంటి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో పాటు కనీసం జీతాలను వారికి నేరుగా అందించకుండా వర్సిటీకి అప్పుగా ఇవ్వడంతో ఆందోళనకు గురవుతున్నారు. వర్సిటీ ఏర్పాటుకు భూములు అందించినా కనీస వేతనాలను తమకు అందించకుండా చేస్తుండండంతో తమ భవిష్యత్తు అంధకారం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం సాధించారని వాయిదా!
సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న అశాసీ్త్రయ విధానాలను క్షేత్రస్థాయిలో టీచర్లు ఎండగడుతున్నారు. టీచర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కాకపోయే సరికి ఈనెల 21వ తేదీన ఉమ్మడి చిత్తూరు డీఈఓ కార్యాలయాలు ముట్టడిస్తామంటూ ఇటీవల అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వం తరపున మరోమారు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో డిమాండ్లు ఏ మాత్రం పరిష్కారం కాకపోయినప్పటికీ ముట్టడి వాయిదా వేస్తున్నట్లు సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని టీచర్లు ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం సాధించారని ముట్టడి వాయిదా వేశారంటూ ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలుగులు జిమ్ముతున్న విద్యావ్యవస్థను కారుచీకటిగా మార్చేసింది. తాజాగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో తొమ్మిది రకాల బడులను తెరపైకి తెచ్చింది. ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో విద్యార్థులకు, టీచర్లకు తీరని నష్టం కలుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పేద విద్యార్థులు తమ గ్రామాల నుంచి కి.మీ దూరం నడిచి మరొక పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న వింత ధోరణిపై టీచర్లు, తల్లిదండ్రులు, పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఈడీ చదివిన అభ్యర్థులు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అవకాశం లేదు. అలాంటప్పుడు బీఈడీ చదివి స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న టీచర్లు ప్రాథమిక పాఠశాలల్లో ఎలా బోధిస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ముట్టడి వాయిదాపై తీవ్ర విమర్శలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సంఘం నాయకులు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో నిర్వహించిన చర్చలతో ఒరిగిందేమి లేదు. అయినప్పటికీ బుధవారం నిర్వహించాల్సిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని వెనక్కి తీసుకోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. క్షేత్రస్థాయిలో టీచర్ల సంఘ నాయకుల తీరుపట్ల భగ్గుమంటున్నారు. సంఘం నేతలపై టీచర్ల మండిపాటు చర్చలతో ఒరిగిందేమి లేదంటున్న టీచర్లు మోడల్ ప్రైమరీ హెచ్ఎంలుగా ఎస్ఏల నియామకం అశాసీ్త్రయం డీఈఓ కార్యాలయాల ముట్టడి వాయిదాపై టీచర్ల ఆగ్రహం 19 డిమాండ్లలో కొన్నే పరిష్కారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు 19 రకాల డిమాండ్లను కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. అయితే ఈనెల 20 న నిర్వహించిన చర్చల్లో కొన్ని మాత్రమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి కూడా కపట హామీలే. కీలక డిమాండ్లైన ఇంగ్లీష్ కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి టీచర్ల ను అలాగే కొనసాగించాలన్న డిమాండ్ ను తిరస్కరించారు. ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తిని అమలు చేయాలని, 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటు పైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాసీ్త్రయం. అయితే ఆ డిమాండ్ను పరిష్కరించలేదు. చర్చలు సాగింది వీటిపైనే.. క్షేత్ర స్థాయిలో టీచర్లు మ్యాన్యువల్, వెబ్ కౌన్సిలింగ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ విధానం కొందరికి నష్టం కానుంది. 49 తర్వాత 50 రోల్ ఉంటేనే రెండవ సెక్షన్ అని అన్నారు. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అలాంటి స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఉపయోగమేమి లేదు. 1,2 తరగతులతో ఉండే ఫౌండేషన్ స్కూల్ లో సంఖ్య 20 దాటిన స్కూల్స్ భూతద్దం పెట్టి వెతికితే మండలానికి ఒకటి, రెండు ఉంటాయి. కొన్ని మండలాల్లో అయితే ఒక్కటీ ఉండే అవకాశం లేదు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య ఇప్పట్లో తేలే అంశం కాదు.. దీంతో ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే ప్రసక్తి లేదని టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగోన్నతుల మాట ఎక్కడా ప్రస్తావించ లేదు. ఎస్జీటీలకు మాత్రమే మ్యాన్యువల్ కౌన్సెలింగ్ మిగిలిన వారికి వెబ్ కౌన్సెలింగ్ ఇదెక్కడి న్యాయం. తాత్కాలికంగా వాయిదా ఈనెల 21న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టాల్సిన ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశాం. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన చర్చల్లో కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేశాం. – జీవీ, రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా. ప్రభుత్వం మొండి వైఖరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీచర్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. గత ప్రభు త్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తె లుగు మాధ్యమం, మాతృభాష తప్పనిసరిగా ఉండాలని అప్పట్లో గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం ప్రస్తుతం స్కూల్స్లో తెలుగు మీడియం పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. – రెడ్డిశేఖర్రెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర ట్రెజరర్, చిత్తూరు జిల్లా -
మార్కులు కాదు.. మార్పు తేవాలి!
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 11 అంశాలపై సర్వే ● నాలుగు రోజుల క్రితం రాష్ట్రశాఖ మార్కుల వెల్లడి ● 76.36 మార్కులతో జిల్లా వెనకడుగు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్సీలున్నాయి. ఏడాది క్రితం వరకు రోజువారీగా ఒక్కో పీహెచ్సీకి 100 నుంచి 150 వరకు ఓపీలొచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య సేవలు గాలిలో దీపంలా మారాయి. క్షేత్ర స్థాయిలో తూతూమంత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. వదలని నిర్లక్ష్యపు జబ్బు మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని జిల్లాలోని వైద్యులు, సిబ్బంది పూర్తిగా గాలికొదిలేశారు. గర్భిణుల గుర్తింపులో నిర్లక్ష్యం చేస్తున్నారు. హైరిస్క్ కేసుల విషయంలో చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. పీహెచ్సీలో సుఖ ప్రసవాలు చేయాలనే లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖం చాటేస్తున్నారు పీహెచ్సీకి వచ్చే రోగులపై వైద్యులు, సిబ్బంది ముఖం చాటేస్తున్నారు. మధ్యాహ్నంపైగా పలు చోట్ల డాక్టర్లు ఉండడం లేదు. మీటింగ్ల పేరుతో డుమ్మా కొడుతున్నారు. కొందరు యూనియన్ పేర్లు చెప్పుకుని కాలయాపన చేస్తున్నారు. దీంతో పీహెచ్సీల్లో అరకొర వైద్య సేవలందుతున్నాయి. వచ్చిన వారికి కొన్ని మందు బిల్లలు ఇచ్చి పంపించేస్తున్నారు. చాలా చోట్ల వైద్య సేవలు కనుమరుగవుతున్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు. పనితీరుకు ఒక మార్కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో అందించే సేవలు, పనితీరు ఆధారంగా జిలాల్లకు మార్కులు కేటాయించారు. సీజనల్ వ్యాధుల కట్టడి నుంచి మాతాశిశు ఆరోగ్యం వరకు 11 అంశాల్లో సంతృప్తి స్థాయి, లోటుపాట్లను లెక్కించారు. జిల్లా వారీగా మార్కులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో చిత్తూరు జిల్లా 76.36 మార్కులతో వెనకబడింది. కొన్ని సేవల్లో పర్వాలేదనిపించింది. 11 అంశాల వారీగా కేటాయించిన మార్కులు అంశం మార్కులు గర్భవతుల సేవలు – 12.07 శిశు సంక్షేమం, రొటీన్ టీకాలు – 8.15 కుటుంబ నియంత్రణ – 2.06 విలేజ్ హెల్త్ క్లినిక్లు – 9.87 సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు – 5.70 ఆర్బీఎస్కే – 3.53 జాతీయ ఆరోగ్య మిషన్ – 8.20 ఆస్పత్రుల నాణ్యత, సేవలు – 1.86 అభ(ఆయుష్మాన్ భారత్), అటెండెన్స్ – 4.95 సీజనల్ వ్యాధులు – 9.14 నిధుల కేటాయింపు – 4.35నిర్లక్ష్యమంటే కుదరదు పీహెచ్సీలో వైద్య సేవలు పక్కాగా అమలు చేస్తున్నాం. విధుల్లో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. కచ్చితంగా నిర్ణీ త సమయంలో వైద్యు లు అందుబాటులో ఉండాలి. ఆరోగ్య, వైద్యసేవలను పల్లెల్లో విస్తృతం చేయాలి. గర్భవతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సీజనల్ వ్యాధుల కట్టడికి చ ర్యలు తీసుకుంటాం. అధికారులు, సిబ్బంది మారాలి. సేవల్లో మెరుగైన మార్పులు కనబరచాలి. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు తప్పుల తడక వైద్య, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వీటిని ఫొటోలతో సరిపెట్టేస్తున్నారు. చాలాచోట్ల ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు విదులకు పంగనామాలు పెడుతున్నారు. సర్వేలను సాకుగా చూపించి వైద్య ఆరోగ్య సేవలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్సీడీ సర్వేలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇంట్లోనే కూర్చుని సర్వేలను పూర్తి చేస్తున్నారు. అసంక్రమిత వ్యాధిగ్రస్తులను, అనుమానిత కేసులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. సర్వేలో బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారు. దీంతో ఈ సర్వే తప్పుల తడకగా ఉందని రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటికొచ్చి వైద్య సేవలందిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మార్కులతో సరిపెట్టొద్దని..మార్పు తీసుకోరావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
‘కుంకీల’తో కట్టడయ్యేనా!
● రేపు జిల్లాకు కుంకీ ఏనుగులు ● క్యాంపులో పూర్తిస్థాయిలో జరగని పనులు ● రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ● 22వ తేదీకి పలమనేరు క్యాంపు చేరేలా ఏర్పాట్లు మేతపై తప్పని గుబులు ● సాధారణంగా ఓ కుంకీ ఏనుగు రోజుకి 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరం ఉంది. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5 మైళ్ల దాకా సంచరిస్తుంటాయి. వీటికి మేతగా రావి, మర్రి, జువ్వి, వెదరు, నేపియర్ గడ్డి, చెరుకు, అరటి మేతగా కావాలి. కానీ ఇవన్నీ ఇక్కడ ఇంకా సిద్ధం కాలేదు. మరోవైపు వంద ముద్దల రాగి సంగటి, బెల్లంతో కలిపిన వరిధాన్యం, వరిగడ్డి ఉండలను పొద్దున పెట్టాలి. ఈ నాలుగు ఏనుగుల మేత కోసమే నెలకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ● జిల్లాకు రానున్న కుంకీలను పలమనేరు మొసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో పెట్టనున్నారు. ఇందుకోసం అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎఫ్ఓ భరణి తెలిపారు. కొద్ది రోజులు కర్ణాటక మావటిలు జిల్లా వాతావరణం ఏనుగులు అలవాటు పడే వరకు ఇక్కడ ఉంటారు. ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి తగిన శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపనున్నట్లు డీఎఫ్ఓ భరణి తెలిపారు. పలమనేరు/చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు గురువారం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక రాష్ట్రంతో ఎంఓయూ చేసుకొంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి కుంకీలను అందించనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం అవి ప్రత్యేక వాహనంలో బయలుదేరనున్నాయి. విద్యుత్ లైన్లు తగలకుండా రవాణా సమయంలో సరఫరా ఆపివేయాలని అటవీ అధికారులు ట్రాన్స్కో అధికారులను కోరారు. గురువారం సాయంత్రంలోపు పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్కు వీటిని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. 6 ఏనుగుల పేర్లు ఇలా.. 6 కుంకీ ఏనుగులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు బుధవారం ఏనుగులను అందజేయనున్నారు. మాస్తి, దేవ, రంజన్, కరుణా, కృష్ణ, అభిమన్యు అనే పేర్లు గల కుంకీ ఏనుగులను ఏపీకి పంపనున్నారు. ఏనుగుల గుంపు వచ్చినప్పుడు.. ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని సార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగునే రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
శ్రీరంగరాజపురం : పిడుగుపడి రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు కృష్ణమూర్తి కథనం మేరకు అకాల వర్షం కారణంగా ఇంటి పరిసరాలలో చెట్టుకింద రెండు పాడి ఆవులను కట్టి వేయగా వర్షం కారణంగా పిడుగు పడి ఆవులు మృతి చెందాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.ఐసెట్లో తిరుపతి విద్యార్థుల హవాతిరుపతి సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్కు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,759 మంది విద్యార్థులు హాజరుకాగా 2,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 1296 మంది, 1331 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది జిల్లాలో మహిళలదేపైచేయిగా నిలిచింది.7, 10 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులుఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్టెన్లో 7వ, 10వ ర్యాంకులను తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ఇందులో తిరుపతి నగరం సమీపంలోని వేదాంతపురానికి చెందిన వి అజయ్కుమార్ 7వ ర్యాంకు సాధించారు. ఈయన శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అజయ్కుమార్ తండ్రి వి మదనమోహన్ గాజులమండ్యం పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సూళ్లూరు పేట, మన్నూర్పోలూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మీ కుమారుడు మహేంద్ర సాయి 10వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
మితిమీరిన వేగం.. పోయిందో ప్రాణం
చౌడేపల్లె: ఎవరబ్బా ఈ యువకుడు..!? ఎంత స్పీడుగా పోతున్నాడో చూడు అని అందరూ అలా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఆ యువకుడిని ఆ స్పీడే బలిగొంది. సోమవారం ఈ సంఘటన సోమల మండలం ఇరికిపెంట సమీపంలోని చెన్నపట్నం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. చౌడేపల్లె మండలం లద్దిగంకు చెందిన సందీప్(25) కోళ్లఫారాల వద్ద కోళ్లను టెంపోలకు, లోడింగ్ చేసే పనులకు కూలీగా వెళ్లేవాడు. బైక్లో సోమల వద్దకు కూలీ పనుల నిమిత్తం వెళ్లి స్వగ్రామానికి తిరుగుప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. వేగంగా వెళ్తూ చెన్నపట్నం చెరువు వద్ద మలుపులో అదుపుతప్పి పడ్డారు. తలకు తీవ్రగాయమైంది. 108లో అతడిని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కలచివేశాయి. సోమల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించారు. -
న్యాయం అందేది ఎప్పుడో మరి..?
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల ని‘వేదన’ ● అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రదక్షిణలతో సరి.. చిత్తూరు కలెక్టరేట్ : న్యాయం చేస్తారనే ఆశతో ప్రతి వారం కలెక్టరేట్ లో అర్జీ ఇస్తున్నాం..ఇంకెన్ని సార్లు తిరగాలి సారూ? అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. అర్జీలిస్తున్నా పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 256 అర్జీలు వివిధ సమస్యలపై 256 అర్జీలు అధికారులకు అందాయి. రెవెన్యూ, సర్వే శాఖకు 198, పోలీసు శాఖ 13, డీఆర్డీఏ 11, ట్రాన్స్కో 7, ఆర్అండ్బీ 1, పౌర సరఫరాల శాఖ 7, పశుసంవర్థక శాఖ 2, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, వాటర్ రిసోర్స్ 4, దేవదాయశాఖ 1, విద్యాశాఖ 2, కలెక్టరేట్ ఏఓ 2, డీసీసీ బ్యాంక్ 1, ఎంపీడీఓ పాలసముద్రం 1, హౌసింగ్ 2 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ వెల్లడించారు. మామిడి చెట్లను జేసీబీతో తొక్కించేశారు తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు జేసీబీతో తొక్కించి నాశనం చేశారనిచౌడేపల్లె మండలం దిగువపల్లె మొట్లపల్లె యానాదులు వరలక్ష్మి, శారద, వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 193/5, 193/6 సర్వే నంబర్లో 7 ఎకరాల డీకేటీ భూమి ఉందని, ఆ భూమిని చదును చేసి ఐదేళ్ల నుంచి మామిడి మొక్కలు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అగ్ర కులస్తులు వాటిని జేసీబీతో పూర్తిగా నేలమట్టం చేశారని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.వినతులు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి గ్రామసభకు విలువ లేదా? కాలువలు నిర్మించాలని గ్రామసభలో తీర్మానిస్తే టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని జీడీనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె ఎంపీటీసీ భారతి, సర్పంచ్ పార్థసారథి రెడ్డి జేసీ కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లా డుతూ, తమ గ్రామంలోని ఒక ప్రాంతంలో వర్షపునీరు, మురుగునీరు నిల్వ లేకుండా చేయడానికి కాలువ నిర్మించాలని తీర్మానిస్తే, గ్రామస్తుడు రుషేంద్రరెడ్డి తాను వేలంలో పొందిన గుడిమాన్యం భూమికి సీసీ రోడ్డు వేసుకునేందుకు కాలువ నిర్మించకూడదని అ డ్డుపడుతున్నారని, కొందరు కూటమి నాయకులు సైతం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటు న్నారని నివేదించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. బుగ్గపట్నం సర్పంచ్ మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, గ్రామస్తులు సుధాకర్రెడ్డి, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.నెలలు గడుస్తున్నా ఇవ్వని సదరం సర్టిఫికెట్ నెలలు గడుస్తున్నా సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని యాదమరి మండలం షికారికాలనీకి చెందిన దివ్యాంగురాలు నందిని వాపోయారు. ఆమె మాట్లాడుతూ, సదరన్ సర్టిఫికెట్కు కొన్ని నెలల క్రితం బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి వెళ్లానని చెప్పారు. తల్లిదండ్రులు లేని తనకు జీవనాధారం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం అవసరమైన సదరన్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్..! – కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ రూటే వేరు విజయపురం మండలం కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ బ్యాంకును తన జేబు సంస్థగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు వేలు, కుమార్ తదితరులు జేసీకి వినతి పత్రం ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన సొసైటీలో ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి ఇన్చార్జి సీఈఓ రైతులకు అన్యాయం చేస్తోందని, సొసైటీ బ్యాంకు నిధులను తన సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. సీఈఓగా అర్హత లేకున్నా దొడ్డిదారిలో ఇన్చార్జిగా కొనసాగుతున్నారన్నారు. బ్యాంకు రుణాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని, తన కుటుంబ సభ్యులకు, కావాల్సిన వారికి మాత్రం రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రైతులతో అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని, రిటైర్డ్ సీఈఓ మురుగయ్య, ప్రస్తుత ఇన్చార్జి సీఈఓ రాధ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, సమగ్ర విచారణ చేసి చేయాలని కోరారు. దీనిపై జేసీ వెంటనే విచారణకు ఆదేశించారు. -
పత్రం ఎప్పుడిస్తారు సారూ!
జిల్లాలో పీఎంఏవై 2.0 వివరాలు నియోజకవర్గం పీఎంఏవై గృహాల మంజూరు వివరాలు చిత్తూరు 828 కుప్పం 575 నగరి 516 పలమనేరు 438 పుంగనూరు 115 మొత్తం 2472‘చిత్తూరు అర్బన్లో గిరింపేటకు చెందిన రమణమ్మ సొంతింటి కోసం అర్జీ ఇచ్చారు. పీఎంఏవై– 2.0 కింద మంజూరవుతుందని అధికారులు చెప్పడంతో పునాది వరకు సొంత డబ్బులతో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఇంటి మంజూరు పత్రం ఇవ్వలేదు. ఆందోళనకు గురైన ఆమె నిర్మాణ పనులు ఆపేశారు’. చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందికి సొంతిళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. సొంతిళ్లను, ఇళ్ల పట్టాలనూ మంజూరు చేసింది. ఇళ్లు కాదు; ఊళ్లు నిర్మిస్తామని ఇచ్చిన మాటను సైతం ఆచరణలో సాకారం చేసింది. వందలాది లేఔట్లలో ఇళ్లు నిర్మించి ఊర్లకు ఊర్లనే సృష్టించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పీఎంఏవై 2.0 కింద గృహ నిర్మాణానికి కేంద్రం వాటాలో రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఈ పథకానికి వేలాది మంది అర్జీలు ఇచ్చారు. ఇళ్ల మంజూరుకు అధికారులు డీపీఆర్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అర్హులంతా ఇళ్ల మంజూరు పత్రం కోసం జనవరి నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. హౌసింగ్ శాఖాధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఫలితంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. ముందస్తుగా ఆర్భాట సర్వే జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఐదు నెలల ముందే ఆర్భాటంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 పథకం కింద సర్వే చేసింది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, ఏడాదికి రూ.3 లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి పీఎంఏవై 2.0 పథకం మంజూరు చేసే నిమిత్తం సర్వేకు పూనుకుంది. ముందస్తుగా వార్డు సచివాలయ ఉద్యోగులతో డిమాండ్ సర్వే మాత్రం అట్టహాసంగా చేయించినా ఆపై గృహాలు మంజూరు చేయకుండా చేతులెత్తేసింది. ఈ సర్వేలో ఇంటి స్థలం లేని వారు, ఇంటి నివాస స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని మరికొందరు, పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలున్నాయని..తమకు హౌసింగ్ స్కీమ్లో గృహాలు మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఇలా జిల్లాలో 42,347 దరఖాస్తులు అందాయి. వాటిలో కోతల అనంతరం, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి 2,472 మందిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. మంజూరు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నెలల కాలంగా ప్రదక్షిణలు పట్టించుకోని హౌసింగ్ శాఖ అధికారులు అనుమతుల కోసం నిరీక్షణ పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, హౌసింగ్ స్కీమ్లో మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామనే ఆసక్తితో 2472 మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన హౌసింగ్ శాఖ అధికారులు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వానికి నివేదించారు. పీఎంఏవై 2.0 పథకానికి జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ప్రాంతాల్లో 2,024 డిసెంబర్లో దరఖాస్తులు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇళ్ల మంజూరుపై అతీగతి లేదు. మంజూరు పత్రాలిస్తే పనులు ప్రారంభిస్తామని పలువురు లబ్ధిదారులు నిత్యం హౌసింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొందరైతే బేస్మెంట్ వరకు నిర్మించారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. వర్షాల కారణంగా ఇబ్బందులు తప్ప వని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
కరెంట్ షాక్తో ఒకరి గాయాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరెంట్ షాక్కు గురై ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన సోమవారం చిత్తూరు మండలం తాళంబేడు క్రాస్లో చోటు చేసుకుంది. వివరాలు..కొల్కత్తాకు చెందిన నారాయణదేవ్ తాళంబేడు క్రాస్లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో చేతిలోని కమ్మీ కరెంటు తీగలకు తగిలి ఆ వ్యక్తి కొంత దూరం పడిపోయాడు.అక్కడ పనిచేస్తున్న వారి సాయంతో అతని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణపాయం లేదని పోలీసులు చెప్పారు. స్వీపర్ల పెండింగ్ జీతాల కోసం ఆందోళన చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్ జీతాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. దీనికి నేతృత్వం వహించిన ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లోని స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ, 2018 నుంచి 2021 వరకు ఉమ్మడి జిల్లాలోని 350 మంది స్వీపర్లకు 36 నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. మిగిలిన కొంత మందికి 18 నెలల జీతాలు ఇచ్చి 14 నెలల వరకు పెండింగ్లో పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయకుమారి, సంఘ సభ్యులు కోకిల, లక్ష్మి, హసీనా, తులసి, రోజా, మమత తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్పై కోర్టులో కేసు చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్థారణ చేస్తుండటంపై ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. ఈనెల 14న చిత్తూరులోని భరత్ నగర్లో స్కానింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నిబంధనలను ఉల్లంఘించి లింగ నిర్థారణ చేస్తున్నట్లు ఓ ముఠా గుట్టును రట్టు చేయడం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పూర్తి చేసి పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం కేసు వేశారు. డాక్టర్లు కానివాళ్లు లింగ నిర్థారణ చేస్తున్నారని, కొన్నేళ్లుగా రూ.15వేల ఫీజుతో స్కానింగ్ చేస్తున్నట్లు తేలిందని ఆమె చెప్పారు. -
కన్నీటి సంద్రమే.. ఊరంతా దుఃఖమే
● అశ్రునయనాలతో చిన్నారులకు అంత్యక్రియలు కుప్పం రూరల్: నీటి కుంటలో పడి దుర్మరణం పాలైన ముగ్గురు చిన్నారులకు కుటుంబ సభ్యు లు, బంధువులు అశ్రునయనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు కుప్పం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 10.30 – 11 గంటల మధ్య మృతదేహాలు దేవరాజపురానికి చేరుకున్నాయి. మృతదేహాలు గ్రామ పొలిమేరల్లోకి చేరగానే ఆర్తనాదాలతో.. ‘‘పోయిటియ్యా... కన్నా... ఇనిమే యారికిట్టె పేసిరిదీ... యార్కిట్టె వెలియాడిరిదీ...’’ ( వెళ్లిపోయావా కన్నా! ఇకపై ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఆడుకోవాలి? ) అంటూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కన్నీటి సంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ మధ్యనే ఉన్న అశ్విన్ (7) గౌతమి (6), శాలిని (7)ల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాలను గ్రామ శ్మశాన వాటికకు తరలిస్తుంటే చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు అందరినీ విచలితుల్ని చేశాయి. తీసుకెళ్లొద్దంటూ పిల్లల ముఖాలను ముద్దాడుతూ వారు పడిన వేదన అంతా ఇంతా కాదు. అంత్యక్రియలకు తండోపతండాలుగా హాజరై పిల్లలకు అంతిమ వీడ్కోలు పలికారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష పరిహారం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒకొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసింది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి సోమవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. -
సారా తయారీ.. అన్నదమ్ముల అరెస్ట్
● నల్లబెల్లం విక్రయించిన రైతు కూడా అరెస్ట్ చిత్తూరు అర్బన్: సారా తయారు చేస్తున్న వై.కిషోర్ (36), వై.నవీన్ (41) అనే ఇద్దరు అన్నదమ్ములను చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అర్బన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ శ్రీహరిరెడ్డి కథనం.. గుడిపాల మండలంలో సారా తయారీ ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం పాపిశెట్టి గ్రామ పరిసరాల్లో విస్తృత దాడులు చేశారు. ఇక్కడున్న అడవుల్లో సారా కాస్తున్న కిషోర్, నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. నిందితులకు నల్లబెల్లం విక్రయించాడని కొండేపల్లెకు చెందిన రైతు పెరుమాల్ (54)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 50 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ మోహన్కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుప్పంలో తమిళ పోలీసుల హల్చల్
● అంతర్రాష్ట్ర దొంగల కోసం గాలింపు ● ఓ వ్యక్తిని పట్టుకుపోయిన వైనం కుప్పం రూరల్: కుప్పంలో సోమవారం తమిళ పోలీసులు హల్చల్ చేశారు. తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, ఈరోడ్ తదితర పట్టణాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తుల మూలాలు కుప్పంలో ఉన్నట్లు నిర్థారించుకుని ఇక్కడ వేట ప్రారంభించారు. పట్టణంలోని మర్రిమానువీధికి చెందిన అలిగిరి అనే వ్యక్తిని అనుమానితునిగా గుర్తించి పట్టుకెళ్లారు. తమిళ పోలీసుల చూపంతా కుప్పం వైపే..! తమిళనాడు రాష్ట్రంలో ఏవైనా దొంగతనాలు చోటు చేసుకుంటే అక్కడి పోలీసులు కుప్పం వైపు అనుమానంగా చూడటం కొత్తేమీ కాదు. మూడు దశాబ్దాల క్రితం ఓ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కుప్పం చుట్టుపక్కల స్థిరపడ్డాయి. దొంగతనాలు, దోపిడీలు చేయడమే వారి వృత్తి. స్థానికంగా ఉండటం మూలాన ఇక్కడ మాత్రం దొంగతనాలకు పాల్పడకపోవడం గమనార్హం! అదే తమిళనాడులోని దూర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసి కుప్పంలో వచ్చి దాక్కుకుంటున్నారు. అక్కడ కేసులు నమోదైతే పోలీసులు దొంగల కోసం గాలిస్తూ కుప్పం వస్తారు. ఇప్పటికే పలుమార్లు తమిళ పోలీసులు కుప్పం వచ్చి ఆ తెగకు సంబంధించిన వారిని పట్టుకుని వెళ్లారు కూడా. ఇదే క్రమంలో సోమవారం సైతం వేలూరు ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనం దర్యాప్తు కోసం తమిళ పోలీసులు కుప్పం వచ్చారు. 40 తులాల వరకు చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది కుప్పంలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేక తెగకు చెందిన మహిళలుగా గుర్తించారు. మర్రిమానువీధికి చెందిన వ్యక్తిని తమ వెంట పట్టుకెళ్లారు.కూటమి నేతల రాజీయత్నాలు! ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతలు పోలీసులు, దొంగల నడుమ మధ్యవర్తిత్వం చేస్తూ ప్రతిఫలంగా పెద్దమొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు మూటకట్టుకుంటున్నారు. దొంగలు సైతం కేసులకు భయపడి వారు అడిగినంత సమర్పిస్తున్నారు. దీంతో ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతల పంట పండినట్లేనని ఇక్కడి ఘటనలు చెబుతున్నాయి. -
జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా కారాగారంతో పాటు మొత్తం 10 జైళ్లు ఉండగా ప్రస్తుతం అవి ఆరుకే పరిమితమయ్యాయి. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురంలోని జైళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని శిలాఫలకాలు వేసిన పాలకులు నిర్మాణ పనులను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 10 జైళ్లు ఉండగా ఇందులో తిరుపతి, మదనపల్లె, పీలేరులోని సబ్జైళ్లు మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మించినవి. మిగిలినవన్నీ బ్రిటీష్ కాలంలో నిర్మించినవే. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుతుండడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని భావించిన జైళ్లశాఖ అధికారులు పుత్తూరు, పలమనేరు, వాల్మీకిపురం, చంద్రగిరి సబ్జైళ్లను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జైళ్ల సంఖ్య ఆరుకే పరిమితమయ్యాయి. మూసివేసిన పుత్తూరులో సబ్జైల్ స్థానంలో నూతన భవన నిర్మాణానికి నందిమంగళం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 242/22లో 2 ఎకరాల భూమిని రాష్ట్ర జైళ్ల శాఖకు స్థానిక రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ మేరకు 2010 జూన్ 18న అప్పటి జైళ్ల శాఖ ఐజీ గోపీనాఽథ్రెడ్డి నూతన జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పలమనేరులోని జైలును సైతం మూసివేసిన అధికారులు ఆ స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వాల్మీకిపురంలోని జైలును మూసివేసి తిరుపతి–మదనపల్లె మార్గంలో రూ.4 కోట్ల అంచనాతో జైలు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ భవన నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో కొత్త భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. అలాగే చంద్రగిరిలోని కారాగారం శిథిలావస్థకు చేరడంతో దానినీ మూసివేశారు. ఇలా ఉన్న జైళ్లను తొలగించడంతో పుత్తూరు సబ్కోర్టు ద్వారా శిక్షలు పడిన ఖైదీలను 70 కిలోమీటర్ల దూరంలోని సత్యవేడు సబ్జైలుకు, అలాగే పలమనేరు, వాల్మీకిపురం కోర్టుల్లో శిక్షలు పడిన ఖైదీలను పీలేరులోని సబ్జైలుకు తరలిస్తున్నారు. ఇది పోలీసులతో పాటు ఖైదీలకు, వారి కుటుంబీకులకు వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. అలాగే జైళ్లలోని గదులు చాలక ఖైదీలను ఎక్కువ మందిని ఒకే సెల్లో నిర్బంధించాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి 15 ఏళ్లుగా ఉంటున్నా పాలకులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ప్రతిపాదనలు పంపించాం వాల్మీకిపురంలో జైలు నిర్మాణానికి 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.4 కోట్లు మంజూరైంది. తొలిదశలో రూ.2 కోట్లు విడుదల కాగా అంత వరకు పనులు జరిగి ఆగిపోయాయి. ఇటీవలే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. పలమనేరులోని జైలును 15 ఏళ్ల క్రితమే మూసివేశారు. 40 సెంట్లు మాత్రమే ఉన్న ఆ స్థలంలో నూతన జైలు నిర్మాణానికి అవకాశం లేదు. ఇక్కడ స్థలాన్ని ఐఓసీ పెట్రోల్ బంకుకు కేటాయించాం. పలమనేరులోనే మరోచోట జైలు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కావాలని జిల్లా కలెక్టర్ను నివేదిక సమర్పించాం. అది పరిశీలనలో ఉంది. పుత్తూరులో జైలు నిర్మాణానికి నిధులు మంజూరు కావల్సి ఉంది. వాల్మీకిపురంలో నూతన జైలు భవన నిర్మాణ దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జైళ్ల కేంద్రాలు చిత్తూరు (జిల్లా కారాగారం) పుత్తూరు తిరుపతి పలమనేరు మదనపల్లె చంద్రగిరి మూసివేసిన కేంద్రాలు పీలేరు వాల్మీకిపురం శ్రీకాళహస్తి సత్యవేడు పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురం జైళ్లు మూసివేత దశాబ్దాలు గడుస్తున్నా ఊసేలేని కొత్త జైళ్ల నిర్మాణం పట్టించుకోని పాలకులు ఖైదీలకు మెరుగైన సేవలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 306 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్క చిత్తూరు జిల్లా కారాగారంలోనే 130 మంది ఖైదీలు ఉన్నారు. ఇక్కడ ఓపెన్ స్కూల్ నడుపుతున్నాం. గత ఏడాది 11 మంది, ఈ ఏడాది ఐదుగురు పదవ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్క్లాస్లో పాసయ్యారు. అన్ని జైళ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశాం. శిక్షణ పొందిన వారు జైలు నుంచి విడుదల అయ్యాక బ్యాంకు రుణాలు పొంది కొత్త జీవితం ప్రారంభించవచ్చు. రోజూ అన్ని జైళ్లలో ఖైదీలతో యోగా, వ్యాయామం చేయిస్తున్నాం. మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. – ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా జైలు అధికారి, చిత్తూరు. -
తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం
పోలీస్ గ్రీవెన్స్కు ఫిర్యాదులు పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 36 వినతులు అందాయి.ప్రదక్షిణలతో సరి.. తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు నేలమట్టం చేశారని యానాదులు కన్నీటి పర్యంతమయ్యారు.మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025వైఎస్సార్సీపీకి పూర్వ వైభవంతవణంపల్లె: వైఎస్సార్సీపీకి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పని చేసి పూర్వవైభవం తీసుకురావాలని పూతలపట్టు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ పిలుపునిచ్చారు. రెండవ వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రానికి సునీల్కుమార్ విచ్చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమాలోచనల అనంతరం పార్టీ తరఫున రెండవ వైస్ ఎంపీపీగా ఎంపిక చేసిన అభ్యర్థికి బీ–ఫాం అందజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలసికట్టుగా చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికై న రెండవ వైస్ ఎంపీపీ అనసూయమ్మను సత్కరించారు. రెండవ వైస్ ఎంపీపీగా అవకాశం కల్పించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికీ, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీపీ ప్రతాప్ సుందర్రాయల్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గీతారెడ్డి, ధనంజయరెడ్డి, రవిరెడ్డి, రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, శివాజిరెడ్డి, మణిరాజ్, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు. ● ఎన్నికలకు హాజరైన 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తవణంపల్లె: తవణంపల్లె మండలం రెండో వైఎస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన చెర్లోపల్లె ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ సోమవారం ఏకగ్రీకవంగా ఎన్నికైనట్టు మండల ఎన్నికల అధికారి, డీపీఓ సుధాకర్ ప్రకటించారు. తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ కావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు రిటర్నింగ్ అధికారి సుధాకర్ తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించారు. మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సభ్యులు 14 మంది, టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు ఉన్నారు. ఇందులో వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రం ఎన్నికల హాల్లోకి హాజరుకాగా మిగిలిన వారు హాజరుకాలేదు. ఎన్నికల నియమావళికి మేరకు కోరం ఉన్నందున ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఎంపీటీసీల సభ్యులను రిటర్నింగ్ అధికారి రిజిస్టర్లో సంతకం చేయలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చని స్పష్టం చేశారు. 8 మంది ఎంపీటీసీల్లో ఒకరు చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను మండల రెండో వైస్ ఎంపీపీగా ప్రతిపాదించగా, మరొకరు బలపరచడంతో రిటర్నింగ్ అధికారి సుధాకర్ అనసూయమ్మను రెండో వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలతోపాటు పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్కు, పలువురు నేతలకు అనసూయమ్మ ధన్యవాదాలు తెలిపారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ -
దేశ సేవలో తరిస్తున్న యువత ● సరిహద్దులో పహారా కాస్తున్న పూతలపట్టు వాసులు ● గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ● మళ్లీ యుద్ధమంటే సిద్ధమే అంటున్న మాజీ సైనికులు
కాణిపాకం: సాంకేతిక యుగంలో యువత సాఫ్ట్వేర్ వైపు చూస్తోంది. కొద్దోగొప్పో సంపాదించి జీవితంలో త్వరగా స్థిరపడాలని ఉబలాటపడుతోంది. అయితే పూతలపట్టులోని పలు గ్రామాలకు చెందిన యువకులు దేశ సేవకు అంకితమవుతున్నారు. దేశ రక్షణలో దగ్గరగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డబ్బుకన్నా దేశ రక్షణకు తమ తొలి ప్రాధాన్యమని చాటి చెబుతున్నారు. ఏ ఇంట చూసినా స్వాతంత్య్ర సమరవీరుల చిత్రపటాలే కనిపిస్తాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు భారత సైన్యంలో ఉండటం విశేషం! యాదమరి మండలం, దళవాయిపల్లిలో దాదాపు నలభై కుటుంబాల నుంచి 80 మంది వరకు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. 30 మంది వరకు దేశ సేవలో అలుపెరగని పోరాటం చేసి ఉద్యోగ విరమణ చెందారు. వయస్సు పైపడినా దేశ భక్తి నరనరాన జీర్ణించుకుపోయి.. ఇప్ప టికీ తమలో చేవ తగ్గలేదని చెబుతున్నారు. దేశానికి సేవ చేయడం గర్వకారణమని, అదో గొప్ప అనుభూతి అని అభిప్రాయపడుతున్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశానికి అందించిన సేవ తమతోనే ఆగిపోకూడదనే భావనతో తమ తరువాతి తరం వారిని సైతం భారత సైన్యంలోకి పంపుతున్నారు. యువత కూడా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. హవాల్దార్లుగా, నాయక్, లాన్స్ నాయక్, జేసీఓ, సుబేదార్గా వివిధ హోదాల్లో దేశ రక్షణలో పాలుపంచుకున్నారు. ఇలా యాదమరిలోని పలు గ్రామాల్లో ఉద్యోగ విరమణ పొందిన, ప్రస్తుతం పనిచేస్తున్న వారు 120 మంది వరకు ఉన్నారు. అలాగే పూతలపట్టు మండలం, చిన్నబండపల్లెలో 75 మంది ఆర్మీ ఉద్యోగులున్నారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా వంద మందికిపైగా జవాన్లు ఉంటారని అధికారులు అంచనా వేశారు. అలాగే బంగారుపాళ్యంలో 150 మంది, తవణంపల్లెలో 30 మంది, ఐరాల మండలంలో మాజీ సైనికులతో పాటు 60 మంది ఉన్నారు. నిద్రలేని రాత్రుల్లో... తాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టి న తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హా యిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండడంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొ చ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సె ల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ పూతలపట్టులోని పలు గ్రామాలు నిద్రలేని రాత్రులను గడిపాయి. -
న్యాయం కోసం అంధుడి పోరాటం
● కలెక్టరేట్ ఎదుట ఆందోళన చిత్తూరు కలెక్టరేట్ : మెరిట్ ప్రకారం ఎంపికై నా ఇంటర్వ్యూలో తనకు అన్యాయం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అంధుడైన రమేష్ ప్లకార్డు చేతబట్టి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ ఎంపికలో మెరిట్లో ఎంపికై న విభిన్న ప్రతిభావంతుడైన తనను వైద్య ఆరోగ్య శాఖ నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తాను మెరిట్ ప్రకారం ఎంపికయ్యానని, అయితే ఇంటర్వ్యూ దశలో డీసీహెచ్ఎస్ అధికారులు తనకు కళ్లు కనబడటం లేదనే కారణంతో ఎంపిక ప్రక్రియను రద్దు చేశారన్నారు. దివ్యాంగుల కోటాలో సంబంధిత డిజబులిటీ సర్టిఫికెట్, మెరిట్ ఆధారంగా తనకు ఉద్యోగం రావాల్సి ఉన్నప్పటికీ నిష్కారణంగా తొలగించారని పేర్కొన్నారు. తన సమస్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు న్యాయం చేయలేదని, ఇకనైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వరసిద్ధుని సేవలో జైళ్ల శాఖ డీజీపీ కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంబానీకుమార్ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనాంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ ధరణీధర, సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
● రేపు ప్రసన్న తిరుపతికి గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న కుప్పం పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కుప్పం వరకు రూట్ మ్యాప్ పరిశీలించారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనం పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు బుధవారం సీఎం కుప్పం వస్తున్నట్లు తెలిపారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్లో బ్యారికేడ్లు, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం విజయవాడ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.అనంతరం 2.30 గంటలకు విజయవాడకు తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు. రైఫిల్ షూటింగ్పై క్యాడెట్లకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : క్రమశిక్షణకు మారుపేరు ఎన్సీసీ అని క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ నోయల్ వివేక్ మోనిస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణా కార్యక్రమంలో క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్పై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, లక్ష్యంపై దృష్టి, శ్వాసపై నియంత్రణ, ఆయుధంపై పట్టు మంచి ఫైరర్కు ఉండాల్సిన లక్షణాలు అని అన్నారు. డిప్యూటీ క్యాంప్ కమాండెట్ మేజర్ లోకనాథం మాట్లాడుతూ, ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసి అందుకునే సర్టిఫికెట్లు క్యాడెట్లకు ఉన్నత విద్య, ఉద్యోగాలను సాధించేందుకు ఉపయోగపడుతాయన్నారు. అనంతరం ఎన్సీసీ ఆఫీ సర్ ప్రసాద్రెడ్డి మాట్లాడారు. రైఫిల్ షూటింగ్, డ్రిల్, సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో క్యాడెట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు కార్తీక్, చిరంజీవి, ధనంజయులు, యుగంధర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత లేదా?
● ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు ? ● లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే సమాచారం ఎందుకు చేరలేదు ● శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది ● ఆడ పిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ● వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖలపై కలెక్టర్ ఆగ్రహం సరిహద్దు మండలాల్లో ఎక్కువ జిల్లాలో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న నగరి, పలమనేరు, పుంగనూరు, వి.కోట మండలాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అబార్షన్ల శాతం ఎక్కువగా ఉందన్నారు. డివిజన్ల వారీగా ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలివ్వాలన్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదనే విషయాన్ని తెలియజేయాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అనధికారికంగా స్కానింగ్ మిషన్లు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, డీఎఅండ్హెచ్వో సుధారాణి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఐవో హనుమంత రావు, జిల్లా ప్రధాన వైద్య శాఖ సూపరింటెండెంట్ ఉషశ్రీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్, ఎస్ఐ నాగసౌజన్య పాల్గొన్నారు.చిత్తూరు కలెక్టరేట్ : లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టడంలో అధికారులకు బాధ్యత లేదా..? అంటూ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో శనివారం పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994 జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం ఎందుకు తెలియలేదని మండిపడ్డారు. శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో పీసీపీఎన్డీటీ యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే ఎందుకు తెలుసుకోలేక పోయారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి, రెండు సంతానాలలో ఆడపిల్లలు ఉండి మూడవ సారి గర్భం దాల్చిన విషయం ఎందుకు తెలుసుకోలేక పోతున్నారన్నారు. సమావేశాలు ఎప్పుడైనా నిర్వహించారా? జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు కలసి సీడీపీఓలు, మెడికల్ ఆఫీసర్లతో కలసి గత పదేళ్లలో ఎప్పుడైనా సమన్వయ సమావేశాలు నిర్వహించారా..? అని ప్రశ్నించారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడితే క్షేత్రస్థాయి పరిస్థితులు కొంత వరకు అర్థమవుతాయన్నారు. అబార్షన్లతో ఆడపిల్లలు చనిపోతే, ఆడపిల్లల నిష్పత్తి మరింత తగ్గుతుందన్నారు. జిల్లాలో 2024 నివేదికల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 947 మంది సీ్త్రలు ఉన్నట్లు తెలిపారు. -
పాఠశాల స్థలంలో నిర్మాణాలొద్దు
● అడ్డుకున్న గ్రామస్తులు శ్రీరంగరాజపురం : పాఠశాల స్థలంలో ఆ పాఠశాలతో సంబంధం లేని నిర్మాణాలు చేపట్టరాదంటూ.. స్థానిక సర్పంచ్ విజయ, గ్రామాస్తులు అడ్డుకున్నారు. స్థానుకుల కథనం.. మండలంలోని వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని పోదలపల్లి గ్రామంలో సర్వే నం.213/16లో ఎకరం 13 సెంటు భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తు తం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలను మరింత అభివృద్ధి చేశారు. మిగిలిన ఖాళీ స్థలంలో అప్పటి తహసీల్దార్ షబ్బీర్బాషా 05 సెంటు భుమిని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించారు. పక్కా భవనం కూడా మంజూరైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే శనివారం ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ దాము పొదలపల్లి గ్రామానికి కమిటీ హాలు మంజూరైందంటూ పనులు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ఆ పనులను అడ్డుకున్నారు. పాఠశాల స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొన్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పీఏ ‘నాకు అనుతులు ఉన్నాయి.. ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టిస్తా’నాంటూ రెచ్చిపోయారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందిచి పాఠశాల స్థలాన్ని రక్షించాలని కోరారు. -
అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలు
తవణంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజలకు అరగొండ అపోలో హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో సరసమైన ధరలకు మోకాళ్ల కీళ్లు, తుంటి మార్పిడి (ఆర్థోపెడిక్) శస్త్ర చికిత్సలు చేయడమే లక్ష్యమని ఆర్థోపెడిక్ చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి డైరెక్ట్ యాంటీరియర్ వెల్లడించారు. శనివారం మండలంలోని అరగొండ అపోలో హాస్పిటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక ఇమేజింగ్, స్పెషల్జ్డ్ ఇన్స్ట్రుమెంట్లతో శిక్షణ పొందిన ఆర్థోపెడిక్ సర్జన్లచేత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ), వైద్య నిపుణులచేత చైన్నె అపోలో హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు నిర్వహించి అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అరగొండ అపోలో హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ కోసం డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అనే అత్యాధునిక, మిరిమల్లి ఇన్వేసివ్ టెక్నిక్ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. కండరాలకు(మజిల్స్కు) హాని కాకుండా శస్త్ర చికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉంటుందని వివరించారు. ఆస్టియోఆర్ర్థెటిస్ రుమటాయిడ్ ఆర్ర్థెటిస్, హిమ ప్రాక్చర్ వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇది మంచి అవకాశమన్నారు. అరగొండ అపోలో హాస్పిటల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ)ని జిల్లాలోని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ నిపుణులు డాక్టర్ కార్తీక్రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, అనస్టీయాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాసన్ సోమసుందరమ్, పీఆర్ఓ కమ్రుద్దీన్ పాల్గొన్నారు. -
కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు వచ్చినట్టు ఈఓ పెంచలకిషోర్ తెలిపా రు. గోసంరక్షణ హుండీ ద్వారా రూ.10,569, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,660 వచ్చింది. యూఎస్ఏ 208 డాలర్లు, సింగపూర్ 112 డాలర్స్, మలేషియా 32 రింగిట్స్, యూఏఈ 170 దిర్హామ్స్ వచ్చాయి. బంగారం 49 గ్రాములు, వెండి 1.425 కిలోలు వచ్చింది. ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్బాబు పాల్గొన్నారు. యువకుడి అరెస్ట్ చౌడేపల్లె: బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమినిగుంట పంచాయతీ, నూనెముద్దనపల్లెకు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడన్నారు. ఈ విషయమై గ్రామంలో పంచాయితీ నిర్వహించి విఫలం కావడంతో బాధితురాలు పోలీసులను ఏప్రిల్ 8న ఆశ్రయించిందని, గర్భవతిని చేయడంతోపాటు ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని, కులం పేరుతో దూషించినట్లు పేర్కొందని తెలిపారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్ చేసిన యువకుడిని పుంగనూరు కోర్టుకు తరలించారు. ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం పలమనేరు: మండలంలోని బేలుపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి ఓ కంటైనర్, కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ వైపు వర్షం కురుస్తుండగా తమిళనాడు నుంచి భారీ పరికరంతో కంటైనర్ పలమనేరుకు వస్తోంది. ముందుగా వెళుతున్న కారు ఆగడంతో వెనుకనున్న కంటైనర్ ఉన్నట్టుండి ఆపే ప్రయత్నం చేయగా.. భారీ వాహనం ఆగకుండా కారును ఢీకొంది. కంటైనర్ ముందున్న క్యాబిన్ నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక వైపు భాగం దెబ్బతింది. లారీ డ్రైవర్ కంటైనర్లోంచి దూకి ప్రాణాలను కాపాడుకోగా కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
కార్పొరేషన్ కమిషనర్కు ప్రమాదం
పాకాల : కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కారు ఫల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్తో పాటు సీసీ అమర్నాథ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో కారు మూడు ఫల్టీ లు కొట్టి ప్రయాణిస్తు న్న మెయిన్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు చేరుకుంది. అదే మార్గంలో పూతల పట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దర్నీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మొక్కలు సంరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క లు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్, వివిధ శాఖల కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్లోని ప్రాంగణంలో కలెక్టర్, జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటా రు. కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్, డీఈవో కార్యాల యం ఏడీ–2 వెంకటేశ్వరరావు, సిబ్బంది మురళి, గో పాల్, కుమార్, చైతన్య, జయప్రకాష్, పాల్గొన్నారు.