Chittoor
-
రాజ్యసభ సీట్లు పెత్తందార్లకేనా?
కార్వేటినగరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదలైన బడుగు, బలహీన వర్గాలకు చెందిన మేధావులను రాజ్యసభలో స్థానం కల్పిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం అందుకు బిన్నంగా పెత్తందారులకు కట్టబెడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. పుత్తూరులో సోమవారం ఆయన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో కలసి జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు ఎగుర వేశారు. ఈ సందర్భంగా నరాయణస్వామి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమాలు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డిది అయితే సీఎం చంద్రబాబునాయుడు బడుగు, బలహీన వర్గాలను విస్మరించి పెత్తందార్లకోసం దోచిపెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. అన్ని సామాజికవర్గాలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా పేదలను అణగదొక్కడం, తమ సామాజిక వర్గాలకు దోచిపెట్టడమే లక్ష్యమన్నారు. ఎప్పుడు అధికారానికి వచ్చినా కులాల మధ్య చిచ్చుపెట్టడం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజా దనాన్ని దోచుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. పవన్కళ్యా ణ్, ప్రధాని మోదీ లేకుంటే చంద్రబాబుకు ఓటమి పాలయ్యేవారని నారాయణస్వామి చురకలు అంటించారు. మహిళలకు 35 శా తం రిజర్వేషన్ కల్పిస్తామన్న మంత్రి లోకేష్ రాజ్యసభలో ఒక్క మహిళకు కూడాఅవకాసం కల్పించలేక పోయారన్నారు. కాపుల కోసం నేను ఎప్పుడూ పోరాటం చేస్తానన్న పవన్కళ్యాణ్ రాజ్యసభ సీటు కోసం ఎందు కు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎలా వెళ్లారు..? ఎపుడూ జనసేన కోసం పోరాటం చేసింది లేదు. ఎప్పుడూ జనసేన జెండా మోసింది లేదు. అలాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్కు రాజ్యసభలో ఎలా స్థానం కల్పించారని నారాయణస్వామి ప్రశ్నించారు. కరకట్టను దోచుకున్న లింగమనేని, అదే కరపట్టపై చంద్రబాబుకు ఇల్లుకట్టి బహుమతిగా ఇచ్చినందుకు రాజ్యసభలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలి వైఎస్సార్సీపీలోని ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాల్సిన సమయం ఆసన్నమైయిందని నారాయణస్వామి పిలుపునిచ్చారు. గ్రామాల్లో కూడా నాయకులు కార్యకర్గలను కలుపుకుపోవాలని సూచించారు. నేడు పార్టీకోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పుత్తూరు: మండల పరిధిలోని కేబీఆర్పురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమ వారం గ్రామస్తులు గుర్తించారు. గ్రామంలోని బీసీ కాలనీ వినాయకస్వామి ఆలయ సమీపంలో మృతదేహం ఉన్నట్లు వీఆర్ఓకు సమాచారం అందజేశారు. మృతుడి వయస్సు 55 ఏళ్లు ఉంటుందని, నల్లప్యాంటు, ఆకు పచ్చ చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. గ్రామ వీఆర్ఓ దామోదరం ఫిర్యాదు మేరకు పుత్తూ రు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
గుదిబండ
ఒకవైపు పెట్రోల్, డీజిల్.. మరోవైపు వంట గ్యాస్ ధరలు. వరుస ధరల పెంపులతో ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం తాజాగా మరోసారి గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, పాల ధరలు పెరిగి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను దెబ్బతీస్తుండగా, తాజాగా వంటగ్యాస్ ధరల పెంపు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారింది. 14.2 కిలోల గృహావసరాల గ్యాస్ సిలిండర్పై గత మార్చి నెలలోనే రూ.60 పెరిగింది. తాజాగా రూ.29 పెరగడంతో రూ.978కు చేరింది. మూడు నెలల వ్యవధిలోనే సిలిండర్పై మొత్తం రూ.89 భారం పడింది. మళ్లీ బాదుడు.. గ్యాస్ ధరల పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా నెలవారీ ఆదాయంతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి వర్గాలు, రోజువారీ కూలీలు, పేద కుటుంబా లు ఈ భారం మోయాల్సి వస్తోంది. సిలిండర్ ధర పెరగడమే కాకుండా డోర్ డెలివరీ చార్జీల రూపంలో మరో రూ.50 వరకు అదనపు ఖర్చు అవుతోంది. దీంతో ఒక సిలిండర్ ఇంటి వద్దకు చేరే సరికి వెయ్యి రూపాయలు దాటుతుంది. వాణిజ్య సిలిండర్ల మోత గృహావసరాల సిలిండర్లతో పాటు ఇదివరకే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, స్వీట్స్ తయారీదారులు, ఇతర ఆహార వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులను భరించలేక కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో చిన్న హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ వ్యయం భారీగా పెరగడంతో వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇంటి బడ్జెట్ తలకిందులు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావంతో కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు కూడా తోడవడంతో ప్రతి కుటుంబంపై నెలకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయిన సమయంలో వంటగ్యాస్ ధరను కూడా పెంచడం సరైన నిర్ణయం కాదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలను నియంత్రించి ప్రజలకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. -
అవినీతి ఏడీని సస్పెండ్ చేయాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : తమకు అండగా నిలవాల్సిన నిధులను, సంక్షేమ పథకాలను నిస్సిగ్గుగా నమిలేసిన అవినీతి తిమింగలం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) వినోద్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట మండుటెండలో న్యాయం కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగ బాధితులు తమ హక్కులు, ఆకలి కేకల కోసం, చక్రాల కుర్చీలు, చేతికరల్రతో తరలివచ్చిన దివ్యాంగుల ధర్నాతో కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. అధికారుల కాలయాపనపై, అవినీతి ఏడీపై దివ్యాంగ లోకం రౌద్రరూపం దాల్చింది. దివ్యాంగులకు ఇచ్చే గౌరవం ఇదేనా? న్యాయం కోసం నెలల తరబడి తిరుగుతున్నా విచారణల పేరుతో కాలయాపన చేయడంపై దివ్యాంగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేని అధికారులు అవినీతికి పాల్పడుతుంటే, వ్యవస్థలు వాటిని కాపాడుతున్నాయన్నారు. సమాజంలో దివ్యాంగులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక సాధారణ వ్యక్తి చిన్న తప్పు చేస్తే జైల్లో పెడతారు, మరి కోటి రూపాయలు లూటీ చేసిన అధికారికి ఏసీ గదుల్లో విధులా? అంటూ ధర్నాలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సస్పెన్షన్ వేటు వేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఈ ధర్నాలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నాయకులు లీలాపతినాయుడు, ఏకాంబరం, చిరంజీవి, మాధవి, రమేష్, ప్రశాంతి, మునేష్, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చర్చలు దివ్యాంగులు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనం ముందు మండుటెండల్లో ధర్నా చేపట్టడంతో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రాంతానికి విచ్చేసి దివ్యాంగులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నెల 12 వ తేదీన సమగ్ర విచారణ నిర్వహించి, అదే రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. -
న్యాయం కోసం నిరీక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీదారుల ఆవేదనలు, కన్నీటి గాథలతో పోటెత్తింది. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బాధిత అర్జీదారులు న్యాయం కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. పీజీఆర్ఎస్ భవనం ఎదుట గుంపులు, గుంపులుగా గంటల తరబడి నిరీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్లే తాము ప్రతి వారం ఇంతదూరం వ్యయప్రయాసలకోర్చి రావాల్సి వస్తోందని అర్జీదారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అయితే కార్యాలయాల చుట్టూ తిరగడం మినహా తమ రాతలు మారడం లేదని పలువురు బాధితులు వాపోయారు. పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం కాలనీవాసుల మొర చిత్తూరులోని కట్టమంచి రోడ్డు, రఘురామ్ నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో తాము ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో కొలిచే సత్యమ్మ దేవాలయాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయించారని ఆందోళన వ్యక్తంచేశారు. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి తమ కాలనీలోనే అనువైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరుతున్న కాలనీవాసులుకలెక్టర్కు సమస్య మొరపెట్టుకుంటున్న అర్జీదారులు -
కుప్పం బాధ్యతల నుంచి కంచర్లకు ఉద్వాసన సొంత పార్టీ వారికీ తప్పని బాబు వెన్నుపోటు
● తప్పులతో తనకు సంబంధం లేదని చెప్పే యత్నం ● స్థానిక ఎన్నికల కోసమే డ్రామాలు? సాక్షి టాస్క్ఫోర్స్: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను అకస్మాత్తుగా తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నీ తానై అడ్డగోలుగా కుప్పాన్ని ఏలిన నాయకుడికి ఉద్వాసన పలకడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుప్పంలో తన వ్యవహారాలను చూసేందుకు అనంతపురానికి చెందిన మరో శ్రీకాంత్ను పంపుతున్నట్టు చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అన్ని తప్పులకు స్థానిక నాయకులను బలిపశువులుగా చేసేందుకే ఈ ఎత్తులు వేశారని చెబుతున్నారు. మిస్టర్ క్లీన్గా నిరూపించుకోవాలనే! కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు కుప్పం నియోజకవర్గంలో సహజవనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. టీడీపీలోని మండల స్థాయి నాయకులే అక్రమ క్వారీలు, కృత్రిమ ఇసుక దందా, తమిళనాడు నుంచి కర్ణాటకకు బియ్యం స్మగ్లింగ్ నిరాటంకంగా సాగాయి. ఇవన్నీ కూడా కంచర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తొలి నుంచీ విమర్శలు గుప్పుమన్నాయి. సొంత పార్టీ వారే బహిరంగంగా విమర్శించినా చంద్రబాబు చూడనట్టు వదిలేశారు. దీంతో ప్రభుత్వ భూముల కబ్జాలు, దౌర్జన్యాలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. కుప్పం గంజాయి రవాణాకు కేంద్రంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకోక పోయినా ఒడిశా, తమిళనాడు పోలీసులు కూటమి నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారాలను నిఘా వర్గాలు, సీనియర్లు ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు. సొంత పార్టీలో అంతర్గత విబేధాలు, ఆధిపత్య పోరు నేరుగా బహిరంగ వేదికలపైనే వ్యక్తమైనా చూడనట్టు వదిలేశారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కంచర్లపై వేటు వేశారు. కుప్పం ప్రాంతంలో జరిగిన, జరుతున్న తప్పులు తనకు ఇప్పటి వరకూ తెలియవని చెప్పుకోవడం ద్వారా తాను మిస్టర్ క్లీన్ అని చాటుకునే ఎత్తులో భాగంగా బాబు కొత్త డ్రామాకు తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. నమ్మిన వారికి చేటే కుప్పంలో చంద్రబాబు రాజకీయ ప్రస్తానం ప్రారంభంలో తిరుపతికి చెందిన మనోహర్ను తన పీఏగా కుప్పానికి తెచ్చారు. పార్టీ వ్యవహారాలతో పాటు అధికారం ఉన్న సందర్భాలతో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన ద్వారానే నడిపించారు. పూర్తిగా అంకితమై పని చేసిన మనోహర్ కుప్పంలో టీడీపీకి బలమైన పునాదులు వేశారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్లను కుప్పానికి తెచ్చాక మనోహర్ను పూర్తిగా పక్కన బెట్టేశారు. శాంతిపురం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తొలి నుంచి చంద్రబాబు నమ్మిన బంటుగా వ్యవహరించారు. సొంత పార్టీ క్యాడర్ నుంచే విమర్శలు వచ్చినా అనేక పదవులు కట్టబెట్టారు. చివరకు 2024లో అధికారంలోకి వచ్చాక ఆయనను పూర్తిగా సైడ్ పెట్టేశారు. విపక్షంలో ఉండగా కంచర్లను తీసుకొచ్చి కుప్పం పగ్గాలు ఇచ్చారు. దీంతో ఆయన చంద్రబాబు మెజారిటీ గతం కంటే కొంత వరకూ పెంచగలిగారు. కానీ చివరకు ఆయనను కూడా అవమానకర రీతిలో సాగనంపారు. ఇంత కాలం ఆయనకు సన్నిహితంగా పార్టీలో ఉన్న క్యాడర్ అధినేత నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నా అధికారం ఉండడంతో మౌనం పాటిస్తున్నారు. పాత శ్రీకాంత్ పోతే కొత్త శ్రీకాంత్ వస్తున్నాడే తప్ప నిజాయితీగా పార్టీకి పనిచేసే స్థానికులకు మాత్రం న్యాయం జరగదని నిట్టూర్చుతున్నారు. -
కదలిన జిల్లా యంత్రాంగం
మామిడి రైతులకు సౌకర్యాలు గంగాధర నెల్లూరు : గంగాధర నెల్లూరు మండలంలో మామిడి రైతుల అవస్థలపై సాక్షి దినపత్రికలో గత నాలుగు రోజులుగా వస్తున్న వరుస కథనాలకు జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ యూనిట్–1ను జీడీ నెల్లూరు తహసీల్దార్ సీకే శ్రీనివాసులుకు, యూనిట్–2 ఎంపీడీవో మనోహర్ గౌడ్కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాలు జారీచేశారు. మామిడి రైతులకు భోజన సదుపాయాలు, కూర్చోవడానికి కుర్చీలు, టెంట్ సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో జైన్ గుజ్జు పరిశ్రమలను సోమవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సదుపాయాల కల్పిస్తామని తెలిపారు. మామిడి కాయల సీజన్ ముగిసేంతవరకు సదుపాయాలు కొనసాగిస్తామని తెలిపారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలు సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆ శాఖ అధికారులను ఆదేశించా రు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం తరుచూ వస్తోందని, లైన్మెన్కు ఫోన్చేసినా స్పందించలేదని శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. జీడీనెల్లూరు మండలం నందనూరు గ్రామంలో బిల్లింగ్ సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని రాణి సమస్యను తెలిపారు. విజయపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరొకటి పెట్టలేదని శ్రీరాములు ఫిర్యాదుచేశారు. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఎస్ఈ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చిత్తూరు కలెక్టరేట్ : చాలా సంవత్సరాలుగా రెవెన్యూ సమస్య పరిష్కారం కావడం లేదని వి.కోట మండలం గోనుమాకులపల్లెకు చెందిన బాధిత రైతు రాఘవేంద్ర ఆత్మహత్యకు యత్నించాడు. సోమవారం చిత్తూరులోని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు విచ్చేసిన ఆ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆయనను కాపాడారు. అనంతరం బాధిత రైతు విలేకరులతో మాట్లాడుతూ.. గోనుమాకులపల్లె గ్రామంలో తమకు సర్వే నంబర్ 539/4లో 0.72 సెంట్లు, 539/2 లో 1.03 ఎకరా, 539/3 లో 0.29 సెంట్లు మొత్తం 2 ఎకరాల భూమి ఉందన్నారు. సంబంధిత భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయగా, గత 35 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని తెలిపారు. అయితే తన తండ్రి అన్నదమ్ములు తమకు సంబంధిత భూమిలో వాటా ఉందని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు. తమకు తెలియకుండానే దొంగ సంతకాలతో ఆన్లైన్ చేయించుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు డిమాండ్ చేశాడు. విద్యుత్ షాక్తో యువకుడి మృతి కార్వేటినగరం: విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో ని వత్తులూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వత్తులూరు గ్రామానికి చెందిన రవిరెడ్డి కుమారుడు డి.విక్కీ (32)కి సొంత పాల డెయిరీ ఉంది. అందులో దిన చర్యలో భాగంగా ఆవులను వాటర్ గన్తో శుభ్రం చేస్తున్న తరుణంలో వాటర్ గన్ నుంచి విద్యుత్ సరఫరా జరగడంతో విక్కీ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు అతనిని తమిళనాడులోని కోనాటంపేట వద్ద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విక్కీకి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైందని, అతనికి భార్య, ఒక్క సంవత్సరం కుమారుడు ఉన్న ట్లు తెలిపారు. విక్కీ తిరుపతిలోని మహిళా యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విక్కీ తండ్రి రవిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేదిక్లో ప్రవేశాలకు రేపే ఆఖరు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి శాసీ్త్ర (బీఏ), ఆచార్య (ఎంఏ), విద్యావారధి (పీహెచ్డీ)తో పాటు పలు డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనున్నట్టు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులతో పాటు మరిన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను, లేదా 08772222587, 9701001777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. గడువు పొడిగింపు తిరుపతి సిటీ: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్లు విడుదలచేసింది. దీన్ని సోమవారం చివరి గడువుగా నిర్ణయించింది. అర్హత ఉండి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల కోసం దరఖాస్తుల గుడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్టు ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు ఆయా విశ్వవిద్యాలయాలకు అందించాలని సూచించారు. -
గౌరవ వేతనం ఇవ్వకుంటే సమావేశాలకు రాలేం
– జెడ్పీటీసీ సభ్యుడి ఆవేదన చిత్తూరు కార్పొరేషన్: ‘‘గౌరవ వేతనం ఇవ్వకపోతే సమావేశాలకు రాలేము. మమ్మల్ని దయచేసి పిలవకండి’’ అని కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవణ ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం కోరం లేకపోవడంతో 4వ కమిటీ విద్య, వైద్యం అంశాల చర్చను వాయిదావేశారు. ఆ సమావేశాన్ని సోమవారం జెడ్పీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవణ మాట్లాడుతూ తమకు పలు నెలలుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. తాము ఉత్సవ విగ్రహాలుగా మారామన్నారు. మండల స్థాయిలో జరుగుతున్న పనుల గురించి వివరాలు తెలపడం లేదన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల్లో సరిపడా వైద్య సిబ్బంది లేరన్నారు. దీంతో రోగాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. ఈ సమస్యను అవకాశంగా మార్చు కుని ఆర్ఎంపీలు చేలరేగిపోతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు మరమ్మతు గురయ్యాయని తెలిపారు వాటిని బాగుచేస్తే పిల్లలకు శుద్ధిచేసిన తాగునీరు దొరుకుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వడం లేదని సోమల జెడ్పీటీసీ సభ్యురాలు కుసుమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. మండలానికి రూ.10 లక్షలు అభివృద్ధి పనుల కోసం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ రవికుమార్నాయుడు, సీ్త్ర శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ భారతి పాల్గొన్నారు. -
మింగేసే కుట్ర !
కాయకష్టం జిల్లా మామిడి రైతుల ఆవేదన రోజురోజుకూ పెరుగుతోంది. పళ్లగుజ్జు ఫ్యాక్టరీల వ్యవహారం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకుండా పరిమితంగా కొనుగోళ్లు చేపడుతుండడం, ధరల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం, టోకెన్ల పేరుతో రైతులను రోజుల తరబడి వేచి ఉండేలా చేయడం వెనుక సిండికేట్ వ్యవహారం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గంగాధరనెల్లూరులో పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ వద్ద బారులుతీరిన ట్రాక్టర్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తుంటే, గుజ్జు ఫ్యాక్టరీలు మాత్రం కొనుగోళ్లపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని ధరలను కృత్రిమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభంలో తోతా పురి మామిడికి కిలో రూ.7 వరకు ధర లభిస్తుందని ఫ్యాక్టరీల వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సీజన్ ముందుకు సాగేకొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. తాజాగా ఫ్యాక్టరీలు కేజీ రూ.5లకు నిర్ణయించినట్టు రైతులు రగిలిపోతున్నారు. అలాగే మొదట ర్యాంపుల్లో కిలో రూ.5 చొప్పున కొనుగోలు చేశాయి. ఆదివారం నుంచి ఆ ధరను రూ.4కు తగ్గించాయని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కోసి తీసుకొచ్చిన తర్వాత రైతులకు ప్రత్యా మ్నాయం లేకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అనుమానాలు ఇలా... పలు ఫ్యాక్టరీల్లో ఒకే తరహా ధరలు ఉండడం, ధరలను ఎవరూ బహిరంగంగా ప్రకటించకపోవడం, కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి అంశాలను బట్టి ఫ్యాక్టరీలు సిండికేట్ అయినట్టు రైతుల్లో అనుమానాలను పెంచుతున్నాయి. పంట అధిక దిగుబడిని ఆసరాగా చేసుకుని ధరలు తగ్గించే ప్రయత్నం జరుగుతోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మామిడి సాగు వివరాలు: జిల్లాలో మామిడిసాగు విస్తీర్ణం 59326 హెక్టార్లు తోతాపురి రకం 40024 హెక్టార్లు తోతాపురి దిగుబడి అంచనా 483981 మొత్తం ఫ్యాక్టరీలు 35 ప్రస్తుతం గుజ్జు తయారీ చేస్తున్న ఫ్యాక్టరీల సంఖ్య 5 ధరల పట్టిక ఏదీ? గుజ్జు ఫ్యాక్టరీలపై రైతుల ప్రధాన అభ్యంతరం ధరల విషయంలోనే ఉంది. ఒకవేళ ధరలు పారదర్శకంగా ఉంటే బహిరంగంగా ప్రకటించడంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఫ్యాక్టరీ ఎదుట ఆ రోజు అమల్లో ఉన్న ధరల పట్టిక ఏర్పా టు చేయాలని, కాయకు ఎంత ధర ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చాలాచోట్ల ధరలు మౌఖికంగానే చెబుతున్నారని, బిల్లుల్లో కూడా పూర్తి వివరాలు ఇవ్వ డం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన కాయలకు సంబంధించి ఇచ్చే బిల్లుల్లో కిలో ధర, మొత్తం బరువు, నాణ్యత పేరుతో విధించిన కోతలు, తుది చెల్లింపు వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏడాది పొడవునా శ్రమించి పండించిన పంటను ఇప్పుడు అమ్ముకోలేని పరిస్థితి వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. గుజ్జు కర్మాగారాల వద్ద ధరలు చెప్పరు.. టోకెన్లు ఇవ్వరు.. ఫ్యాక్టరీలు పూర్తి గా పనిచేయవు. చివరకు కిలో రూ.5 నుంచి రూ.4కు కాయలు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభు త్వం వెంటనే జోక్యం చేసుకుని మామిడి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి కొనుగోళ్లలో పారదర్శకత, గిట్టుబాటు ధర, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రూ.5లకు కొంటున్నారు కోతలు ప్రారంభమై వారం కూడా కాలేదు. 5 శాతం కాయలు కూడా కోత కోయలేదు. తొలుత తోతాపురి కేజీ రూ.7లని నోటి మాటగా ప్రకటించారు. ఇప్పుడు రూ. 5లు అంటున్నారు. ఆ ధరను కూడా స్పష్టంగా చెప్పడం లేదు. అసలు ఫ్యాక్టరీల ఎదుట ధరల పట్టిక ఏదీ? అధికారులు, ఈ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది. ఇది ముమ్మాటికీ మోసం. ఫ్యాక్టరీలు సిండికేట్ అయి.. రైతులను దెబ్బతీస్తున్నాయి. పట్టించుకోకుంటే రైతుల ఉద్యమం తప్పదు. – మునీశ్వర్రెడ్డి, మామిడి రైతు సంఘ నాయకులు, చిత్తూరు -
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు.. నేషనల్ టార్చర్ ఏజెన్సీ
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నేషనల్ టార్చర్ ఏజెన్సీగా మారిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి మండిపడ్డారు. ఆ సంఘ నాయకులు సోమవారం చిత్తూరు గాంధీ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలను నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందన్నారు. అది పరీక్షలు నిర్వహించే సంస్థ కాదు.. విద్యార్థులను వేధించే ‘నేషనల్ టార్చర్ ఏజెన్సీ’గా మారిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్నత విద్య ప్రవేశాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎన్టీఏ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. గత కొన్నేళ్లుగా నీట్, యూజీసీ–నెట్, సీయూఈటీ వంటి పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు, అక్రమాలు బయటపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా విద్యార్థులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని మండిపడ్డారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల పొట్టగొట్టి, పేపర్లు అమ్ముకున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. చదువును హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఎన్టీఏ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని, వైఫల్యాలకు బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే దిగిపోవాలని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అక్బర్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు గంగరాజు, ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కన్వినర్ మసూద్, జిల్లా నాయకులు దుర్గ ప్రసాద్, వివేక్, రూపేష్, సలీమ్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుపై మామిడి రైతుల అవస్థలు ప్రభుత్వానికి కనపడలేదా?
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్న అవస్థలు చంద్రబాబు ప్రభుత్వానికి కనబడడం లేదా అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. నారాయణస్వామి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోనే మామిడిని అత్యధికంగా పండించేది చిత్తూరు జిల్లా అని, ఈ జిల్లా సీఎం సొంత జిల్లా అయినా మామిడి రైతుల కష్టాలు చంద్రబాబుకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రోజులకు రోజులు మామిడి లోడ్ల ట్రాక్టర్లతో రోడ్లపై పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా మామిడి కాయలు కేజీ 30, 40 రూపాయల వరకు ధర పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆరు రూపాయలు కూడా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మామిడి బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలను వెంటనే పట్టించుకుని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులను పట్టించుకోకపోతే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. -
సకాలంలో సమస్యలు పరిష్కరించండి
– పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం కుప్పం: సమస్యలపై బాధితులు అందజేసిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 26 వినతులను ఎస్పీ స్వీకరించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించి పలువురు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీని కలసి నినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి వినతి పరిశీలించి పరిష్కారించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారది, సీఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు!
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. 1966 అక్టోబరు 2న ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా త్వరలో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. కొత్త జోన్లోనూ అన్యాయమేనా..? విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ‘కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో నే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్కు రూ.25 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఈ మార్పులతో రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరో వైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. -
పోస్టుకు రూ.15 లక్షలు
డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. స్టోర్స్ కోటాలో టీచర్ పోస్టు రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు వీడియో లు వెలుగు చూశాయి. హైకోర్టు, గవర్నర్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మా అధినేత జగన్మో హన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటాం. – తేజారెడ్డి, వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ యువత అధ్యక్షుడు క్రిమినల్ కేసులు పెట్టాలి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రీడా కోటా, రిజర్వేషరన్, కాల్లెటర్లలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక విచారణ జరపాలి. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి, బాధితులకు న్యాయం చేయాలి. ఉద్యోగాల నియమాకాలంటూ అన్యాయం చేస్తా రా? యువత తిరగబడుతున్నా పట్టించుకోరా..? – కిషోర్కుమార్, జీడీనెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు -
‘బోరు’మంటున్నారు
కుప్పం మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రీఫేజ్ కరెంట్ వచ్చేవరకు వేచి ఉండి వ్యవసాయ బావులు, బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో బోర్లు ఒట్టిపోయాయి. కొన్ని గ్రామాల్లో అధికారులు ట్యాంకర్ల ద్వారా నెట్టుకు వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని నాయకులు చెప్పడమే కానీ ఆచరణలో పెట్టడం లేదని మహిళలు వాపోతున్నారు. కుప్పం రూరల్ : మండల పరిధిలోని సిద్ధప్పనూరు, గొడప్పనూరు, పేటగుట్ట గ్రామాలు శాశ్వత తాగునీటి పరిష్కారానికి నోచుకోవడం లేదు. సిద్ధప్పనూరుకు తాగునీటి సదుపాయం లేకపోడవంతో గ్రామస్తులు సొంత ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. గౌడప్పనూరు విషయానికి వస్తే అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని సరఫరా చేస్తూ నెట్టుకు వస్తున్నారు. గటప్పనాయనపల్లి బండ్ల వద్దా ఇదే సమస్య. వీటిపై అధికారులు దృష్టిసారించక పోవడంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. బోర్లలో నీరు ఉన్నా.. అడవిబూదుగూరు గ్రామంలో రక్షిత బోరులో నీరు ఉన్నా పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో సమస్య నెలకొంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొంత ఖర్చు పెట్టి పైపులైన్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వృథా ఖర్చులు మిగులుతాయని గ్రామస్తులు అంటున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు చాలకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయించక తప్పడం లేదు. అడవిబూదుగూరులో ట్యాంకర్ వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు జాతీయ రహదారిపై నిరసన తెలుపుతున్న సామగుట్టపల్లి మహిళలు(ఫైల్) బోర్లలో నీరు ఉన్నా ఫలితం శూన్యం జాతీయ రహదారిపై మహిళల ధర్నా గత నెలలో తాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని మహిళలు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. అప్పటికేమో అధికారులు నీటి సదుపాయం కల్పిస్తా మని హామీ ఇచ్చారు. నిరసన మిరమింపజేశా రు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. గ్రామానికి వస్తున్న ఒకటి అరా ట్రాక్టర్ నీరు సరిపోవడం లేదని మహిళలు వాపోతున్నారు. అందులోను పనులు వదిలిపెట్టి ట్యాంకర్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులు శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. -
కుళ్లి
రాలికొనుగోళ్లు చేస్తున్నవి ఐదు ఫ్యాక్టరీలే.. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 57 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 40 వేల హెక్టార్లకు పైగా తోతాపురి పంట సాగవుతోంది. జ్యూస్, పల్ప్ పరిశ్రమలకు ప్రధాన ముడిసరుకై న తోతాపురికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడి కూడా భారీగా వచ్చింది. రైతుల అంచనా ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి దిగుబడి వచ్చింది. దిగుబడి పెరగడం రైతుకు శాపంగా మారింది. గంగాధర నెల్లూరులో రైతుల ఆగ్రహం గంగాధర నెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోకె న్లు ఇచ్చినా కాయలు అన్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఐడీ కార్డులు పంచి పెట్టడం, కాయల అన్లోడింగ్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సిఫార్సులు ఉన్న వారి కాయలను రాత్రిళ్లు అన్లోడింగ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సిఫార్సులు ఉంటేనే కొనుగోళ్లు..? గుడిపాల ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ సిబ్బంది సిఫార్సులు ఉన్న రైతుల కాయలనే ముందుగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ‘బుధవారం నుంచి కొనుగోలు ప్రారంభం కానుంది. ముందుగా శాంపిల్ చూపించండి’ అంటూ రైతులను తిప్పలు పెడుతున్నారని వాపోతున్నారు. జోక్యం చేసుకోని ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పల్ప్ ఫ్యాక్టరీలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు. టోకెన్ విధానాన్ని క్రమబద్ధీకరించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిఫార్సులు, వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు జిల్లాలో తోతాపురి ప్రాసెసింగ్ కోసం సుమారు 35 పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతేడాది లాగే ఈ సారి సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా చాలా ఫ్యాక్టరీలు కొనుగోళ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. పేరుకు ప్రారంభోత్సవాలు చేసినా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని వేలాది మంది రైతులు కొద్దిమంది కొనుగోలుదారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీల సంఖ్య తక్కువగా ఉండడంతో టోకెన్ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. టోకెన్ వచ్చినా వెంటనే కాయలు అన్లోడ్ కావడం లేదు. ఫ్యాక్టరీ గేట్ల వద్ద ట్రాక్టర్లు, లారీలు వరుసగా నిలిచిపోతున్నాయి. రైతులు రెండు, మూడు రోజుల వరకు వాహనాల్లోనే ఉండాల్సి వస్తోంది. -
మట్టిని నమ్మాడు.. విజయం సాధించాడు
కుప్పం రూరల్ : కోయంబత్తూరుకు చెందిన ఇక్బా ల్ అలియాస్ డాక్టర్ బాబు 15 ఏళ్ల క్రితం కుప్పం మండలం గుడ్లనాయనపల్లికి వచ్చి స్థిరపడ్డాడు. ఆయన చైన్నెలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించాడు. ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్ డిజైనింగ్, సేఫ్టీ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశాడు. తర్వాత పదేళ్లు ఆస్త్రేలియాలో ఉద్యోగం చేశాడు. అక్కడ ఉన్నప్పుడే అయన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త బిల్ మెలిసన్, జపాన్ శాస్త్రవేత్త మోసానో టుకుకో వ్యవసాయ విధానాలకు ఆకర్షితులయ్యాడు. తాను కూడా సమ గ్ర ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకు న్నాడు. 2010లో కుప్పం మండలం గుడ్లనాయనపల్లి వద్ద 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. గుట్టలతో కలిసి ఉన్న ఆ భూమిని సుమారు రూ.80 లక్షలు వెచ్చించి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు. మొక్కల పెంపకంపైనా దృష్టి బాబు తన వ్యవసాయ క్షేత్రంలో 40 రకాల మొక్కలను పెంచుతున్నాడు. ముఖ్యంగా ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్వుడ్, టేకు, ఔషధ మొక్కలైన కదంబం, మరిడి,, ఉడిలీ, పండ్ల రకాలైన వాటర్ ఆపిల్, బొప్పాయి, జామ, మామిడి, పనస, అల్ల నేరేడు తదితరాలను పెంచుతున్నాడు. పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వరి, రాగి. జొన్న, సజ్జ, మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అమెరికా మేకలు వ్యవసాయ క్షేత్రంలో అడుగు ఎత్తు కూడా లేని మేక ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాబు స్నేహితుడు స్టీఫెన్ అనే వ్యక్తి అమెరికా నుంచి వాటిని పంపించినట్టు బాబు తెలిపాడు. అవి చిన్నగా కనిపించినా పిల్లలను ఈనుతాయని చెబుతున్నాడు. కోళ్లు, గొర్రెలు, పావురాల పెంపకం బాబు తన వ్యవసాయ క్షేత్రంలో కోళ్లు, గొర్రెలు, పావురాల పెంపకాన్ని చేపట్టారు. కోళ్లను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పెంచడం ద్వారా అవి మూడు నెలల్లోనే బాగా బరువు పెరుగుతున్నాయి. రసాయనాలతో కూడిన దాణా కాకుండా గింజలతో కూడిన దాణా వేస్తున్నాడు. దీంతో ఒక్కో కోడి రూ. 650 నుంచి రూ.700 వరకు ధర పలుకుతోంది. అలాగే పావురాలను కూడా పెంచుతున్నాడు. జత పావురాలు రూ.2 వేలకు పైగా అమ్ముడవుతున్నాయి. 50 గొర్రెలను సైతం పెంచుతున్నాడు. ఒక్కో గొర్రెను రూ.6 వేలకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో పెరిగిన చేపలను ఉచితంగా స్థానికులకు పంచిపెడుతున్నాడు. ఆయన ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశాల్లో ఉద్యోగాలు చేశాడు. రూ.లక్షల ఆదాయం వస్తున్నా సంతృప్తి కలుగలేదు. ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలేశాడు. ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా 12 ఎకరాల్లో పంటల సాగు చేపట్టారు. వివిధ పద్ధతులను అనుసరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాడు. పలువురు రైతులకు ఆదర్శంగా మారాడు. మట్టిని నమ్ముకుంటే నష్టపోయే అవకాశం ఉండదని నిరూపిస్తున్నాడు. రైతులకు సలహాలు.. సూచనలు.. బాబు తన క్షేత్రంలో మండలంలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు చేస్తున్నాడు. విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నాడు. పంటల సాగులో మెళకువలను తెలియజేస్తూ వారు కూడా వ్యవసాయంలో రాణించేలా కృషి చేస్తున్నాడు. -
మామిడి రైతులను ఆదుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎంఎల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మామిడి పంట సాగుచేస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీస గిట్టుబాటు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాణిపాకానికి పోటెత్తిన భక్తులు కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు వేసవి సెలవులు కొనసాగుతుండడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపైవినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు చిత్తూరు అర్బన్: ముందస్తు నేరాల నియంత్రంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివా రం తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరంలో నాటు సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 70 మందికి డ్రగస్స్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా చిత్తూరు తాలూకా, యాదమరి ప్రాంతాల్లో ఐదుగురికి మాదకద్రవ్యా ల పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీళ్లకు ప్రత్యేకించి కౌన్సెలింగ్ చర్య లు హెచ్చరించారు. నేడు కుప్పంలో పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్: కుప్పం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. -
యోగా జీవితంలో భాగం కావాలి
చిత్తూరు అర్బన్ : ప్రజల నిత్యజీవితంలో యోగా భాగం కావాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం కూడలి వరకు యోగాంధ్ర ర్యాలీని ఎమ్మెల్యే, జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం నుంచి రైల్వే వంతెన మీదుగా గాంధీ కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్స వం సందర్భంగా రానున్న 15 రోజులు జిల్లా వ్యాప్తంగా గ్రామ– వార్డు సచివాలయం పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 200 మంది మాస్టర్ ట్రైనీలను గుర్తించామని, వారి ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నా రు. ఈ నెల 9న వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాణిపాకం, పులిగుండు వద్ద థీమాటిక్ యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు, యువ త, మహిళలు, విద్యార్థులు యోగా కార్యక్రమాలను విస్తతంగా చేపట్టడం ద్వారా ఆరోగ్య చిత్తూరుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు, నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్ రాజశేఖర్ రాజు, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, డీఎంహెచ్ఓ నాగశశి భూషణ్ రెడ్డి, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధి కారి డాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
గొడ్డలి పార్టీ ఎవరిది.. చంద్రబాబూ?
పాలసముద్రం : ఇప్పడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గజదొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతోందన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వైఎస్ కుటుంబంపై బురద జల్లుతూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఎన్టీఆర్తోనే కాలగర్భంలో కలిసిన టీడీపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయనతోనే కాలగర్భంలో కలిసిపోయిందని నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్ కుటుంబంపై వ్యక్తిగత, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంటే గొడ్డలి పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ రాజకీయాలు నిజమైన గొడ్డలి పార్టీ ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయకత్వంలో నడిచే టీడీపీనేన్నారు. ఇప్పుడున్నది తెలుగు దేశం పార్టీ కాదని, తెలుగు దోపిడీ పార్టీ అని, అసలు గొడ్డలి పార్టీ ఎవరిదో చంద్రబాబూ అంతరాత్మకే తెలుసని నారాయణ స్వామి అన్నారు. 1995లో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ తన పంథాను మార్చుకోలేదన్నారు. 2024లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఆంధ్ర ప్రజ లను నిలువునా ముంచారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైనప్పుడు డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందె వేసిన చెయ్యి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను నిలువునా మోసం చేసి ఆయన మరణానికి కారణం నువ్వు కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తనకే వెన్నుపోటు క్రూరుడు చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ చెప్పిన మాట సత్యం కదా అని నిలదీశారు. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రాబాబు పొత్తు లేకుండా ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే వ్యక్తి ఒక్క ఎన్నికల్లోనైనా మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదన్నారు. ఉమ్మడి అంధ్రప్రదేశ్లో విద్యుత్ కోసం ర్యాలీ చేసిన రైతులపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపి, వారి మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్నా తన ప్రశ్నలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయ శాస్త్రవేత్తల స్ఫూర్తితోనే..
వ్యవసాయ శాస్త్రవేత్తలు బిల్ మెలీసన్, మోసా నో స్ఫూర్తితోనే నేను సేద్యం ప్రారంభించాను. పాలేకర్ సేంద్రియ వ్యవసాయ తరగతులకు హాజరవుతుంటాను. ఈ క్రమంలోనే పలు రకాల కలప, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను. కోళ్లు, గొర్రెలు, పావురాలను పెంచుతున్నా. ఒక దానికి రేటు లేకపోయినా మరో దానిపై ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సమగ్ర విధానాలకే మనుగడ ఉంటుంది. మా పొలంలో ప్రతి అడుగుకి రూ.10 ఆదా యం వచ్చేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఆ మేరకు ప్రయోగాలకు వెరవకుండా సేద్యం చేస్తున్నాం. సాగుపై ఎవరికై నా సలహాలు కావాలంటే సంప్రదించవచ్చు. – బాబు, రైతు గుడ్లనాయనపల్లి, కుప్పం మండలం -
మట్టిని నమ్మాడు..
ఉన్నత విద్యచదివి పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తి వాటిని వదిలేసి మట్టిని నమ్మి వ్యవసా యం చేసి విజయం సాధించాడు.కుళ్లిపోతున్నాయి.. కాయలు కోత దశలో ఉన్నాయి. గాలి వానకు చాలా వరకు రాలిపోయాయి. కొన్ని కాయలు కుళ్లిపోయి రాలిపోతున్నాయి. వారం రోజులు దాటితే కాయలు కోయాల్సిన అవసరం లేదు. రాలిపోయే పడిపోయే పరిస్థితి ఉంది. గతేడాది ప్రభుత్వం తోతాపురి కేజీకి ప్రోత్సాహక నిధిగా రూ.4లు ఇచ్చింది. ఈ సారి నోరు మెదపడం లేదు. – మురళీమోహన్నాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం అన్లోడింగ్కు మూడు రోజులు కాయలు కోత కోసి ట్రాక్టర్కు లోడ్చేసి పెట్టా. ఇప్పుడు గంగాధరనెల్లూరు ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే అన్లోడింగ్కు మూడు రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికి అదేక్కొటే తెరిచి ఉండారు. గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీ మాత్రం సిఫార్సులు ఉంటేనే కాయలు కొంటున్నారు. గట్టిగా అడిగితే బుధవారం నుంచి కొంటామని పంపించేస్తున్నారు. – విజయనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో తెరవాలి.. కాయలు పండిపోతున్నాయి. పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని అధికారు లు చెబుతున్నారు. ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో తెరిచేలా చూడడం లేదు. కాయలు బాగాలేవని, పక్వానికి రాని వాటిని తెచ్చేస్తున్నారని రైతులపై నిందలు వేస్తున్నారు. కాయలను ఒకేసారి కోస్తే రేట్ల విషయంలో గందరగోళం సృష్టించవచ్చని ఫ్యాక్టరీలు మూకుమ్మడిగా కుట్ర పన్నుతున్నాయి.– సాము, పెరుమాళ్ల కండ్రిగ, చిత్తూరు మండలం -
కూటమి ప్రభుత్వం విఫలం
కొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్కు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్కోస్ట్ జోన్లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్ చేయాలన్న డిమాండ్ను నెరవేర్చకుండానే జోన్ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. – పీవీ మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట రాయలసీమ రైల్వేలకు న్యాయం చేయాలి దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపో యి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలి. సీమ రైల్వే పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సీవోఆర్ యాజమాన్యం ఆలోచన చేయాలి. తిరుపతి డివిజన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి. – మేడా రఘునాథరెడ్డి, ఎంపీ -
యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని ప్రశాంత్ నగర్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న యోగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం డీఎంఅండ్హెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా కార్యక్రమం విజయవంతం కావడానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి పెనుమూరు(కార్వేటినగరం): పెనుమూరు మండలం గుట్టకింద హెచ్డబ్ల్యూ సమీపంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన మాట్లాడుతూ మృతుడికి 45 ఏళ్లు ఉంటాయని, చుట్టుపక్కల విచారించినా ఆచూ కీ తెలియలేదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
వివాదంగా ముత్తిరేవుల రోడ్డు పనులు
సాక్షి టాస్క్ పోర్స్ : పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో రహదారి నిర్మాణ పనులు వివాదానికి దారితీశాయి. హైకోర్టులో కేసు కొనసాగుతున్న భూమిలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బెంగళూరు–చిత్తూరు హైవేకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డును సమీప గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. గతంలో పేదల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు అదే ప్రాంతంలో రోడ్డు పనులు చేపడుతుండడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ పనులు చేస్తుండడంపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కూటమి నాయకులు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ప్రశ్నించే వారిని అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విచారణకు డిమాండ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు కేటాయించిన స్థలాలు, ప్రభుత్వ భూముల విషయంలో భవిష్యత్తులో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. -
మళ్లీ గండం..!
తోతాపురికి జిల్లాలోని మామిడి రైతులపై మరోసారి సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తోతాపురి కాయలను కొనుగోలు చేయడానికి పల్ప్ పరిశ్రమలు ముందుకు రావడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చెట్లలో కాయలు మంచి సైజుకు వచ్చినా కొనుగోలుదారులు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా 59,326 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ ఏడాది 6,21,252 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో పల్ప్ తయారీకి వినియోగించే కాదర్ రకం 2,702 హెక్టార్లలో సాగవుతుండగా 18,834 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. తోతాపురి రకం 40,024 హెక్టార్లలో ఉండగా 4,83,981 మెట్రిక్ టన్ను ల దిగుబడి వస్తుందని అధికారిక లెక్కలు చెబుతుండగా తోటల్లో కాయల సైజు, దిగుబడి స్థాయిని బట్టి 6 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని రైతులు పేర్కొంటున్నారు. అప్పుల ఊబిలో పరిశ్రమలు బ్యాంకు రుణాలు, వ్యాపార నష్టాలు, నిలిచిపోయిన ఎగుమతుల కారణంగా పలు ఫ్యాక్టరీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ఈ సారి పెద్దఎత్తున కొనుగోళ్లు చేపట్టే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. గతేడాది కొనుగోలు చేసిన మామిడి కాయలకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదు. పాత బకాయిలు చెల్లించకుండానే కొత్త సీజన్ ప్రారంభం కావడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. తెరుచుకోని ఫ్యాక్టరీలు ఇప్పటికే తోతాపురి కోతలు వేగం పుంజుకున్నాయి. ఫ్యాక్టరీలు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. కొన్ని యూనిట్లు పరిమిత స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో కాయలు తోటల్లోనే నిలిచిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కాయలు చెట్ల పైనే కుళ్లిపోతున్నాయి. వెంటనే కోసి విక్రయిస్తే కొంత ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. క్రిష్ణగిరి ఫ్యాక్టరీలపై ఆశలు జిల్లా రైతులు ప్రత్యామ్నాయంగా తమిళనాడులోని క్రిష్ణగిరి ఫ్యాక్టరీపై ఆశలు పెట్టుకున్నారు. అక్కడి పల్ప్ ఫ్యాక్టరీలు ప్రస్తుతం కిలో తోతాపురిని రూ.6లకే కొనుగోలు చేస్తున్నాయి. ఈ ధర ప్రభావం చిత్తూరు జిల్లా లోని ఫ్యాక్టరీల కొనుగోళ్లపై పడుతోంది. మరోవైపు పల్ప్కు అంతర్జాతీయంగా కొత్త ఆర్డర్లు రావడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని ఫ్యాక్టరీలతో సమీక్షించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. లక్ష్యాలకు.. దిగుబడికి కుదరని పొంతన జిల్లాలో 35 పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో 25 సింగిల్ లైన్, 10 డబుల్ లైన్ యూనిట్లు ఉన్నాయి. ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్కు వెయ్యి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల వరకు మామిడి కాయలు కొనుగోలు చేయాలని ఉద్యానశాఖ లక్ష్యాలు నిర్దేశించింది. ఈ లెక్కన 3.60 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని కేటాయించారు. తోతాపురి దిగుబడి 4.84 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తుండగా, కొనుగోలు లక్ష్యం 3.60 లక్షల టన్నులకే పరిమితం కావడంతో మిగిలిన కాయలను ఏమి చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్లు రావడంలేదు క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు రూ.6లకు కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరులో రూ.7లకే కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ ధరలు ఫ్యాక్టరీలపై ప్రభావం పడుతోంది. ఆర్డర్లు కూడా రావడంలేదు. అందువల్లే చాలా ఫ్యాక్టరీలు తెరుచుకోవడం లేదు. ప్రస్తుతం తెరుచుకున్న ఫ్యాక్టరీలపై రైతులు వందలాది మంది వచ్చి పడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి.. క్రిష్ణగిరి ధరకు.. చిత్తూరు ధరకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తే బాగుటుంది. – రఘురాం చౌదరి, జిల్లా పళ్లగుజ్జు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు, చిత్తూరు -
పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి
ఐరాల: నవచేతన్ యాప్ ద్వారా ఆరేళ్ల లోపు పిల్లల్లో సమగ్రాభివృద్ధి సాధించడానికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా పీడీ వెంకటేశ్వరి ఆదేశించారు. కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో శనివారం అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐ నవచేతన్ యాప్, ఈసీడీ స్క్రీనింగ్పై శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల పిల్లలందరికీ నవచేతన్ యాప్ ద్వారా సంపూర్ణ పోషణ, గ్రోత్ మానిటరింగ్, సలహాలు, మైక్రో న్యూట్రీషియన్స్పై వివరించారు. ప్రతి బిడ్డకూ తల్లుల సమక్షంలోనే స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి 1000 రోజులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఐరాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో నిర్మల, కాణిపాకం పీహెచ్సీ వైద్యాధికారి స్వాతిసింధూర, సూపర్వైజర్ మంజుల, బీసీపీ నజరీన్ పాల్గొన్నారు. -
వరికోత యంత్రం ఢీకొని వ్యక్తి మృతి
బంగారుపాళెం : మండలంలోని శేషాపురం సర్వీసు రోడ్డుపై శనివారం వరికోత యంత్రం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బోడబండ్ల గ్రామానికి చెందిన జయశంకర్(37) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పాలమాకులపల్లెకు బయలుదేరాడు. శేషాపురం సర్వీసు రోడ్డులో మొగిలి వైపు నుంచి బంగారుపాళెం వస్తున్న వరికోత యంత్రం ఢీకొంది. జయశంకర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్జీవో జిల్లా సహ అధ్యక్షుడిగా బాలసుబ్రమణ్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం జిల్లా సహ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిత్తూరు లోని ఏపీ ఎన్జీవో భవనంలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశీలకులు కిరణ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సంఘంలో ఖాళీగా ఉన్న పలు కీలక పదవులను భర్తీ చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై చర్చించి పలు తీర్మానా లు చేశారు. సంఘం జిల్లా సహ అధ్యక్షుడిగా బాలసుబ్రమణ్యం, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సురేష్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా చిత్తూరు తాలూకా సంయుక్త కార్యదర్శిగా ఉన్న పవన్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర పరిశీలకులు కే.కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. -
వీఆర్వో ఆత్మహత్య బాధాకరం
చిత్తూరు కలెక్టరేట్ : అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షుడు బాలాజీరెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు బీఎల్వో విధులకు 14 ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బంది, వీఆర్వోలను మాత్రమే వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినకుండా బెదిరిస్తున్నారని విమర్శించారు. బలవంతంగా ఓటీపీలు తీసుకుని డ్యూటీలు వేయడం అధికారుల నిరంకుశత్వానికి అద్దం పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క వీఆర్వో కూడా అధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి, మనస్తాపంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడుదామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారుల వేధింపులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముగిసిన గ్రంథాలయ శిబిరాలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వ్యాప్తంగా నిర్వ హించిన గ్రంథాలయ వేసవి శిక్షణ శిబి రాలు శనివారం ముగిశాయి. చిత్తూరులో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారిగురవారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడు తూ గ్రంథాలయాల్లో నిర్వహించిన శిబిరాల్లో పుస్తక పఠనం, వ్యాసరచన, చిత్ర లేఖనం, క్విజ్, పజిల్స్, చెస్, క్యార మ్స్, మ్యూజికల్ చైర్స్, లెమన్– స్పూన్ వంటి పోటీలు నిర్వహించామన్నారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వేసవి శిబిరాలతో జ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత పెంపొదటానికి గ్రంథాలయాలకు వస్తుందలన్నారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శర్మ, గ్రంథాలయ అధికారి లావణ్య, విశ్రాంత ఉద్యోగులు లలిత, గజేంద్రబాబు, విజయ్కుమార్ పాల్గొన్నారు. 2,400 మొక్కల పంపిణీ పూతలపట్టు(యాదమరి): ప్రకృతిని కాపాడుకోవడం, రైతన్నలను ఆదుకోవడమే ధ్యేయంగా బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు గంగాధర్ మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం పి.కొత్తకోట సమీపంలో పూతలపట్టు, గంగాధరనెల్లూరు మండలాలకు చెందిన రైతులకు రూ.5 లక్షల విలువైన వంద రకాల 2,400 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ నినాదాలకే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి సంరక్షించాలని పిలుపునిచ్చారు. విలువైన మొక్కలను ఉచితంగా అందజేసిన గంగాధర్ను రైతులు అభినందించారు. -
నేరాల నియంత్రణకే ‘సురక్షిత చిత్తూరు’
చిత్తూరు అర్బన్: నేరాలు జరిగిన తర్వాత వెంటనే స్పందించడంతో పాటు నేరాలు జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉందని, ఇందుకోసం ‘సురక్షిత చిత్తూరు’ పేరిట చిత్తూరు పోలీసు శాఖ తీసుకొచ్చిన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో శనివారం సురక్షిత చిత్తూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాలకు అడ్డుకట్ట, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘సురక్షిత చిత్తూరు’ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ప్రజల భద్రత విషయంలో పోలీసులతోపాటు ప్రతి పౌరుడూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు, ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీ వెంకటనారాయణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
తూతూమంత్రం
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో మంజూరు చేయడం లేదని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశపు హాలులో శనివారం జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి సకాలంలో రైతులకు ఇవ్వకపోతే పంటలకు నీరు ఎలా పెడతారని నిలదీశారు. ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, రెండు రోజులు నీరు పెట్టకపోతే పంటలు ఎండిపోతాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేస్తే గ్రామీణ ప్రాంతాలకు త్రీఫేస్ విద్యుత్ వస్తుందన్నారు. వి.కోట–కేజీఎఫ్ మార్గంలో మార్కెట్ యార్డు ప్రాంతం వద్ద నిర్మించిన సీసీ రోడ్డుకు కనెక్టివిటీ ఏర్పాటు చేయలేదన్నారు అలాగే ఈ ప్రాంతంలో రోడ్డులో అన్ని గుంతలు పడ్డా ఆర్అండ్బీ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడుపల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీలంటే లెక్కలేదా జెడ్పీటీసీలంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని నారాయణవరం జెడ్పీటీసీ సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశాలకు తిరుపతి జిల్లా అధికారులు ఎప్పుడు హాజరుకావడం లేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారాన్ని సభ్యులకు తెలపడం లేదన్నారు. ఆర్డబ్ల్యూఎస్లో రూ.2.30 లక్షలతో పనులు చేస్తే రూ.1.90 లక్షలు మాత్రమే బిల్లులు మంజూరు చేశారని పేర్కొన్నారు. పనులు చేస్తే రూ.40 వేలు నష్టపోవాలా అని నిలదీశారు. ఇలాగే ఉంటే తిరుపతి జిల్లా సభ్యులు సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పీలేరు రోడ్డు అధ్వానంగా ఉందని ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ కరుణాకర్రెడ్డి తెలిపారు. తిరుపతి డీపీఓ సమావేశాలకు రావడం లేదని ఫిర్యాదు చేశారు. వేరుశనగ విత్తనాలు ఎప్పుడు ఇస్తారని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు గ్రూప్గా ఇచ్చే లోన్ కాకుండా వ్యక్తిగతంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే ఎన్టీఆర్ నైపుణ్య అభివృద్ధి సంస్థ పరంగా శిక్షణ ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పశుసంవర్థక శాఖ పరంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ లోన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని నగరి జెడ్పీటీసీ గాంధీ ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఐరాలలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యక్రమాలకు పిలవడం లేదని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్ భారతి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి, సీఈఓ రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం తూతూమంత్రంగా జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటలోపే ముగించారు. ఇందులో 4వ కమిటీ అయిన విద్య, వైద్య అంశాల చర్చకు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఎప్పటిలాగే పలు శాఖల ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. మిగిలిన అధికారులు వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లు వ్యవహరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. రెండుగంటల్లోనే ముగిసిన జెడ్పీ సమావేశం పర్సంటేజ్లు ఇస్తేనే బిల్లులు పంచాయతీరాజ్లో జరిగిన అభివృద్ధి పనుల పరంగా బిల్లులు పెట్టాలంటే క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పర్సంటేజ్ అడుగుతున్నారని సదుం జెడ్పీటీసీ సోమశేఖర్రెడ్డి ఆరోపించారు. ఇందులో ఉన్నతాధికారులకు సైతం వాటా ఇవ్వాలని బహిరంగంగానే చెబుతున్నారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పనితీరు అధ్వానంగా ఉందని వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్రెడ్డి ఆరోపించారు. ఏ పనులూ సక్రమంగా జరగడం లేదన్నారు. కనీసం బిల్లులు కూడా పెట్టడం లేదన్నారు. పక్క జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లా వెనుకబడి ఉందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. -
పక్వానికి వచ్చాకే కాయలు కోయాలి
గంగాధర నెల్లూరు: మామిడికాయలు పక్వానికి వచ్చిన తర్వాతే కోయాలని జిల్లా ఉద్యానవన అధికారి సతీష్, ఉద్యానవన సహాయ సంచాలకులు శ్రీ కోటేశ్వరరావు తెలిపారు. వారు శనివారం 100 గొల్లపల్లి జైన్ ఫ్యాక్టరీ, తూగుండ్రం రూట్లో ఉన్న జైన్ ఫ్యాక్టరీని సందర్శించారు. జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతులతో మాట్లాడారు. మామిడి రూ.7 కంటే తగ్గే అవకాశం లేదన్నారు. కోడిపందెం రాయుళ్ల అరెస్ట్ ఐరాల: మండలంలోని మొరంపల్లె సమీపంలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ జయశ్రీ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో మండలంలోని తోటివారిపల్లె, మొరంపల్లె చెందిన ఈ.గుణశేఖర్, జీ.శ్రీనివాసులు, పూతలపట్టు మండలం అలగానిపల్లెకు చెందిన టీ.భరత్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి మూడు పందెం కోళ్లు, రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమో దు చేసినట్లు వెల్లడించారు. -
ఉపాధి పనుల్లేవ్.. వెళ్లిపోండి
కూలీల నిరసనవిజయపురం (నగరి): ఉపాధి పనుల కోసం ఉదయాన్నే ఆశగా వెళ్లిన కూలీలకు నిరాశే ఎదురైంది. పనులు లేవంటూ వారిని వెన క్కు పంపించడంతో కూలీలు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం విజయపురం మండలం పన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ప్రతిరోజులాగే ఆలపాకం, ఆలపాకం కండ్రిగ, ముత్తప్పరెడ్డి కండ్రిగ, గొల్లకండ్రిగ, గొల్లకండ్రిగ హెచ్డబ్ల్యూ, సామిరెడ్డి కండ్రిగ, ఒడ్డిల్లు, పీఆర్ కండ్రిగ, తెల్లగుంట, బూచివానత్తం, కళియంబాకం, మిట్టకండ్రిగ తదితర గ్రామాల నుంచి వందలాది కూలీలు ట్రాక్టర్లు, ఆటోల్లో ఉపాధి పనులకు పన్నూరు గుట్టల ప్రాంతానికి చేరుకున్నారు. పన్నూరు చర్చి వద్దే స్థానిక కూలీలు వారిని అడ్డుకుని, తమ గ్రామంలోనే కూలీలకు సరిపడా కూలీలు గిట్టుబాటు కావ డం లేదని బయటి గ్రామాల వారు రావద్దని చెప్పి వెనక్కు పంపించారు. ఈ వ్యవహారంపై ఉపాధి హామీ అధికారులు స్పందించకపోవడంతో కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధి కూలీలు ట్రాక్టర్లు, ఆటోల్లో వచ్చిన కూలీలను అడ్డుకుంటున్న స్థానిక కూలీలు కూలీలు పనుల వద్దే నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ ‘‘పని కోసం వచ్చాం.. ఇప్పుడు పనిలేదని పంపిస్తే మా కుటుంబాలను ఎలా పోషించాలి?’’ ఒక రోజు పనిలేకపోతే పస్తులు ఉండాలి అంటూ వాపోయారు. గత 15 ఏళ్లుగా పన్నూరు గుట్టల్లో ఉపాధి పనులు చేస్తున్నామని, ఇప్పుడు పనులు లేవని చెప్పడం వెనుక కారణాలు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్థానిక కూలీలను రెచ్చగొట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఈ పరిస్థితిని సృష్టించాడని ఆరోపించారు. తక్కువ మంది పనిచేసినా మస్టర్లో ఎక్కువ మంది పనిచేసినట్లు నమోదు చేయడం వల్లే కూలీలు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కూలీ చెల్లింపుల్లో సమస్యలు ఉంటే అధికారులు చర్చించి పరిష్కారం చూపాల్సిందిపోయి, కూలీల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ఆయా ఊర్లలోనే ఉపాధి పనులు పెడితే ఈ సమస్య ఎదురవదన్నారు. మస్టర్లో హాజరైన కూలీల పేర్లను గ్రామసభలో చదివి, ఆ వారంలో చేసిన పనికి ఎందుకు తక్కువ కూలీ వచ్చిందో ప్రజలకు వివరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పుపై ఉన్న ఆసక్తి కూలీలకు పని కల్పించడంలో ప్రభుత్వానికి లేదన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిని ట్రాక్టర్తో గుద్ది హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన గంగవరం మండలంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం సామనేరు పంచాయతీ బండకుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు అభిలాష్(18) గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అదే కళాశాలలో గంగవరం మండలం రామాపురం ఒడ్డిండ్లు గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు నందకుమార్ చదివేవాడు. ఈ క్రమంలో నందకుమార్ తరచూ సుబ్రమణ్యం కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బస్సులో వేధించేవాడు. దీనిపై ఆమె తన అన్న అభిలాష్తో పాటు ఇంట్లో చెప్పింది. ఆమె తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు నందకుమార్ను, అతని తల్లిదండ్రులను మందలించారు. దీంతో నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసి చంపేస్తానని బెదిరించాడు. అభిలాష్ పలమనేరులో కంప్యూటర్ క్లాస్కు వెళ్తున్నాడని తెలుసుకున్న నందకుమార్ అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత గురువారం స్నేహితుడు అజయ్తో కలిసి బైక్లో పలమనేరుకు వెళుతున్న అభిలాష్పై ట్రాక్టర్ ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనాన్ని పొదల్లోకి లాక్కెళ్లాడు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం చెందిన నందకుమార్ ట్రాక్టర్తో ఢీకొన్నాడు. దీంతో అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నందకుమార్ అక్కడి నుంచి ఉడాయించాడు. స్నేహితుడు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి జరిగిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేయకుండా పెద్దపంజాణికి చెందిన టీడీపీ బడా నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, లేకుంటే మీపైనే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరించినట్టు చెబుతున్నారు. సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. యువకుడు మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై సీఐ రాంభూపాల్ను వివరణ కోసం ఫోన్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన లీవ్లో ఉన్నట్టు తెలిసింది. -
10 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఐఈవో రఘుపతి తెలిపా రు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడు తూ జిల్లాలో సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆహార భద్రత చట్టంపై అవగాహన అవసరం చిత్తూరు అర్బన్: ఆహార భద్రత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని సోమవారం జరు పుకోనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చిత్తూ రు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆహార కల్తీ చట్టం–2006పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ, కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలుషిత ఆహారం తిని మృతి చెందిన, అనారోగ్యం పాలైన వారికి నష్టపరిహారం ఇప్పి స్తామన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికలపై లైంగిక వేధింపులు – చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించారు. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించడంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, ప్రజారోగ్యశాఖ అధికారి లోకేష్, మెప్మా సీఎంఎం గోపి పాల్గొన్నారు. గురుకులాల్లో 5వ తరగతి స్పాట్ అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్టు ఏపీఎస్డబ్ల్యూఆర్ జిల్లా కో ఆర్డినేటర్ పద్మజ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏపీఎస్డబ్ల్యూఆర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులతో పాటు పరీక్ష రాయని వారు కూడా స్పాట్ అడ్మిషన్లకు రావొచ్చన్నారు. రామకుప్పం బాలురు గురుకులంలో 46 సీట్లు, విజిలాపురంలో 29, చిత్తూరు బాలికల పాఠశాలలో 15, జీడీ నెల్లూరు బాలికల పాఠశాలలో 10, పలమనేరు బాలికలు 12, కుప్పం పరమసముద్రం బాలికల పాఠశాలలో 35 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 8న చిత్తూరులోని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, ఆధార్కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతోపాటు ఒరిజనల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని తెలిపారు. -
సీనియర్లకు మొండిచేయి
సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా రెవెన్యూ శాఖలో చేపట్టిన బదిలీలు, ఉద్యోగోన్నతుల పోస్టింగుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సాకుగా చూ పిస్తూ శుక్రవారం కలెక్టరేట్ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సీనియారి టీని పక్కనపెట్టి జూనియర్లకు అయాచితంగా అందలం దక్కే లా చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన సీనియర్లకు మొండిచేయి ఎదురుకాగా, జూనియర్ల కింద సీనియర్లు తలవంచుకుని పనిచేయాల్సిన దుస్థితి సీఎం చంద్రబాబు జిల్లాలో దాపురించింది. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ లేదని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. నిబంధనలు బేఖాతర్ ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో జిల్లాలో ఏ ఒక్క తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండకూడదనే నిబంధనను తెరపైకి తెచ్చి న కలెక్టరేట్ అధికారులు పోస్టింగుల్లో పక్షపాత ధోరణి ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సుదీర్ఘ కాలంగా డిప్యూటీ తహసీల్డార్లుగా పనిచేస్తూ, ప్రమోషన్కు అన్ని అర్హత లు ఉన్న సీనియర్లను విస్మరించారనే వాదనలు వినిపిస్తున్నా యి. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తీవ్ర గందరగోళం అధికారులు గంటల వ్యవధిలోనే డబుల్ పోస్టింగులు ఇచ్చి తీవ్ర గందరగోళానికి తెరలేపారు. రమేష్ బాబు, రేఖ, షేక్ ఖాజావలి, కళ్యాణి, రామకృష్ణ, తనూజ తదితరులకు తొలుత ఒక చోట ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మళ్లీ వెంటనే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు డెప్యుటేషన్ బదిలీ చేశారు. అలాగే కుప్పం నుంచి తహసీల్దార్ చిట్టిబాబును ఉన్నఫళంగా కలెక్టరేట్లో రిపోర్ట్ చేయమనడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. వెల్లువెత్తుతున్న అసంతృప్తి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ జారీ చేసిన తహసీల్దార్ల బదిలీ ల ఉత్తర్వులపై రెవెన్యూ శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అర్హత, సీనియారిటీ ఉన్న ఎంతో మందిని కాదని జూనియర్లకు కీలక స్థానాలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రెవెన్యూ సంఘం నాయకులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తహసీల్దార్ల పోస్టింగ్స్లో గందరగోళం రెగ్యులర్లు ఉన్నా...డిప్యూటీలకే అందలం జిల్లాలోని పలు మండలాల్లో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టుల భర్తీలో అధికారులు అనుసరించిన తీరు విడ్డూరంగా ఉంది. కీలక మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లను కాదని డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నగరి ఆర్డీవో కార్యాలయంలో డీటీగా ఉన్న మునిశైలజను విజయపురం తహసీల్దార్గా, కుప్పం డీటీ సూర్యప్రకాష్నాయక్ను వి.కోటకు, కుప్పం ఆర్డీవో ఆఫీస్ డీటీ రామ్మూర్తిని పెద్దపంజాణి తహసీల్దార్గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తాము జూనియర్ల కింద పనిచేయాల్సిన దుస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
నగరి: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె శనివారం తన నివాస కార్యాలయంలో నగరి మున్సిపాలిటీకి చెందిన ముఖ్య నాయకులు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ ఎస్ఐఆర్పై ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి బూత్కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కోఆర్డినేటర్లు కార్యకర్తలను గుర్తించి వారి ఓటును కాపాడుకోవాలన్నారు. సరైన నివేదికలు సిద్ధం చేసి, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అలాగే ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీకి నష్టం కలిగించే తప్పుడు ప్రచారాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేస్తే నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. -
చిత్తూరులో దారుణం.. లుంగీలు, టవల్స్లో మద్యం బాటిల్స్..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఇదే అదునుగా సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిల్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. కొందరు మద్యం బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవల్స్లో బాటిల్స్ వేసుకొని దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం తరలిస్తున్న వ్యాన్ శనివారం ఉదయం బోల్తా పడింది. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం వెళ్తున్న వ్యాన్ టైర్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ కింద పడిపోయిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వ్యాన్లోని మద్యం సీసాలు రోడ్డుపై పడిపోవడంతో అటుగా వెళ్తున్న వారు, స్థానికులు దోచుకెళ్లిపోయారు.కొందరు బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవల్స్లో వేసుకొని దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడినవారిలో మహిళలు సైతం పోటీపడ్డారు. రోడ్డుపై పడిన వాటిలో సగానికిపైగా బాటిళ్లను ఖాళీ చేశారు. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిల్లను తీసుకెళ్లిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికి కొన్ని బాటిల్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
పూతలపట్టు(యాదమరి): వైఎస్సార్సీపీ బలోపేతం కోసం నాయకులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. శుక్రవారం మండల కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు శాంతియుత నిరసన కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. వెణూతనపల్లి పంచయతీకి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్ను సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యి పేదలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. -
కరెంటు షాక్తో వ్యక్తి మృతి
తవణంపల్లె: మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి షాక్కు గురై వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. కట్టకిందపల్లెకు చెందిన వడ్డె గుర్రప్ప(55) శుక్రవారం జయచంద్ర మామిడి తోటలో మామిడి కాయలు కోస్తుండగా పక్కన కరెంటు తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్కు గురై చెట్టు నుంచి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం అర గొండ అపోలో హాస్పిటల్కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందిన ట్లు నిర్ధారించారు. అదే సమయంలో మామిడి కాయలు కోస్తున్న రమేష్కు కూడా చెట్టుపై నుంచి కిందపడడంతో గాయపడ్డాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చంద్రగిరి: మంగళం క్వార్టర్స్ పంచాయతీ పద్మావతి నగర్లో టీటీడీకి చెందిన నిరుపయోగ భవన సముదాయంలో భవన నిర్మాణ కార్మికుడు శివయ్య (70) శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిరుపయోగంగా ఉన్న భవనంలో శివయ్య నుదుటిపై పెద్ద గాయమై విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. మృతుడు పచ్చికాపల్లం సమీపంలోని బలసలగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాలుగా మంగళం ప్రాంతంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడు శివ య్య మృతిపై హత్య కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జూన్ 10 వరకు గడువు చిత్తూరు కలెక్టరేట్ : మార్చి 2026 పది పబ్లిక్ పరీక్షల షార్ట్ మెమోలలో మార్పులకు పాఠశాలల లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ గడువును జూన్ 10 వరకు పొడగించినట్లు డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ వంటి వివరాలలో ఏవైనా తప్పు లు ఉంటే, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులతో ధ్రువీకరించుకుని గడువులోగా సవరణలు పూర్తి చేయాలన్నారు. ఇత ర వివరాలకు అధికారిక వెబ్సైట్ bre.ap.gov.in లో సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ భూమి అక్రమ మార్పిడి –విశ్రాంత వీఆర్వో పై చర్యలకు ఆదేశం చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగవరం మండలం, గుండుగల్లు గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో శేషాచలపతిరావు పై శాఖ పరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ వీఆర్వో అక్రమ మ్యూటేషనులు చేయడమే కారణమని పేర్కొంది. శేషాచలపతిరావు తన పదవీ కాలంలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుండుగల్లు గ్రామంలోని ప్రభుత్వ పోరంబోకు భూమికి (శంకరయాలపేట చెరువు భూమి) నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ చేయడమే కాకుండా, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22ఏ(1) (బి) కింద నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించాలని ఆయన సిఫార్సు చేసినట్లు తేలిందన్నారు. ఈ మేరకు శాఖా పరమైన విచారణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు.. దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఇన్చార్జి డీఈఓ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ కోర్సులు పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ నెల 12వ తేదీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. ఆన్లైన్లో జూలై 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయం లోని ఏపీ ఓపెన్ స్కూల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. లడ్డూ నాణ్యతపై ఈవో తనిఖీ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన లడ్డూ పోటును శుక్రవారం ఈవో పెంచలకిషోర్ తనిఖీ చేశారు. లడ్డూ తయారీలో వినియోగిస్తున్న పదార్థాలు, తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బంది, కాంట్రాక్టర్ను ఆదేశించారు. చైర్మన్ మణినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నట్టేట ముంచారు
అధికారంలోకి రాకముందు 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. అప్పటివరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ఆ హామీలను పూర్తిగా బుట్టదాఖలు చేశారు. ప్రతిభతో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సైతం ఈ డీఎస్సీలో తీవ్ర అన్యాయం జరిగింది. స్వలాభం కోసం ఇన్ని కుతంత్రాలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. – రూపేష్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, యువత విభాగం ఉద్యోగాలను అమ్ముకున్నారు మెరిట్ లిస్ట్ డేటాను సైతం మాయం చేసిన ఈ ప్రభుత్వం పై సీబీఐ విచారణ జరిపించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనంతటి భారీ కుంభకోణం లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎన్నికల సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటూ అదరగొట్టిన తండ్రీకొడుకులు.. ఇప్పుడు ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే విషయం పై శ్వేతపత్రం విడుదల చేయాలి. – కిషోర్, రాష్ట్ర కార్యదర్శి, యువత విభాగం -
జిల్లా ఉద్యానశాఖ అధికారి బాధ్యతల స్వీకరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా ఉద్యానశాఖ అధికారిగా సతీష్ శుక్రవారం చిత్తూరులోని జిల్లా ఉద్యాన శాఖ కా ర్యాలయంలో బాధ్యత లు స్వీకరించారు. ఈయ న వైఎస్సార్ కడప జిల్లా నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో మామిడి కోత దశలో ఉందన్నారు. దీనిపై కలెక్టర్ ఇచ్చిన సూచనల మేరకు మామి డి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ప్రకృతి సమతుల్యత అందరి బాధ్యత చిత్తూరు కలెక్టరేట్ : ప్రకృతి సమతుల్యత అందరి బాధ్యత అని మైభారత్ శాఖ యువజన అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి సమతులత్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్భాస్కర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళి, మైభారత్ సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ కేంద్రాల తనిఖీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా టీచర్లకు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణలను అబ్జర్వర్ రాము తనిఖీ చేశారు. ఎఫ్ఎల్ఎన్ శిక్షణ నిర్వహణపై ‘అస్తవ్యస్తంగా ఎఫ్ఎల్ఎన్ శిక్షణ’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్ర అబ్జర్వర్ రాము శుక్రవారం జిల్లాలోని పలు శిక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు. శిక్షణ పొందుతున్న టీచర్లకు కల్పించిన మౌలిక వసతులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తనిఖీలో గమనించిన అంశాలను నివేదిక రూపంలో రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ అధికారులకు అందజేయనున్నారు. ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ల నియామకం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పలువురు ఆర్డీవోలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు కుప్పం ఆర్డీవోగా షేక్ మొహమ్మద్ హుస్సేన్, స్పెష ల్ డిప్యూటీ కలెక్టర్ కేడర్లో పుల్లారెడ్డి (ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్)గా, మధుసూదన్రావు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా నియమితులయ్యారు. నేడు స్థాయి సంఘాల సమావేశం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. శనివారం ఉదయం పది గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఆర్థిక, ప్ర ణాళిక, పనులు, గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘికసంక్షేమ శాఖ పరంగా చర్చ జరుగుతుందన్నారు. -
త్వరలో నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నిండ్ర (నగరి) : త్వరలో ఆయిల్పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఆయిల్పామ్ సంస్థ జనరల్ మేనేజర్ విజయప్రసాద్ తెలిపారు. శుక్రవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆయిల్ పామ్ తోటల క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణవనం, నాగలాపురం, నిండ్ర, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు, పుత్తూరు, పిచ్చాటూరు, రామచంద్రపురం, ఏర్పేడు, తొట్టెంబేడు, బీఎన్ కండ్రిగ మండలాలకు చెందిన ఆయిల్ పామ్ సాగుకు సుముఖంగా ఉన్న రైతులకు ఆయన అవగాహన కల్పించారు. సాగులో మెలకువలు, ప్రభుత్వ సబ్సిడీలు, సంస్థ అందించే ప్రోత్సాహాలను తెలియజేశారు. ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాలుగు గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం గెలల ధర టన్ను రూ.24 వేలు పలుకుతోందన్నారు. 62కు పెంపుపై చర్చ చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60–62కు పెంచుతూ కేబినెట్ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఉద్యోగ విరమణ వయస్సు పెరగనుంది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సంస్థలో ఉద్యోగుల వీటి పై చర్చకు తేరలేపారు. వయో పెంపునకు వారికి వర్తిస్తే ఏ సంవత్సరం నుంచి అది అమల్లోకి వస్తుందని ఆరా తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏఈ, డీఈ, ఈఈ, ఎస్ఈ, ఆపై స్థాయి అధికారులు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం రెండేళ్ల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. వయో పెంపు సంవత్సరాన్ని బట్టి అర్హత ఉన్నవారు తిరిగి వారి స్థానాల్లోకి వస్తే ప్రస్తుతం ఆ స్థానాల్లో ఉన్నవారు పాత స్థానానికి వెళ్లాలా..? ప్రమోషన్ వచ్చిన ఉద్యోగి తిరిగి పాత స్థానానికి పనిచేయడానికి అంగీకరిస్తారా?.. దీంతో పాటు రెండేళ్లు సంబంధిత శాఖల్లో ఉద్యోగాల భర్తీ ఉండదా..? అని చర్చకు తెరలేసింది. భారీ మొత్తంలో జీతాలు తీసుకొని పదవీ విరమణ చేసిన వారు తిరిగి సంస్థలో వస్తే ఆర్థిక భారం పడదా..? వారికిచ్చే జీతాలతో కొత్తగా ఆరుగురు వరకు ఉద్యోగులను నియమించుకోవచ్చు. వీరికి రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.కోట్లల్లో ఇచ్చారు.. తిరిగి వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలా..? అనే సందేహాలు ఉద్యోగులు వెల్లబుచ్చుతున్నారు. -
ప్రజల విశ్వాసాన్ని పొందడమే లక్ష్యం
ప్రజల విశ్వాసాన్ని పొందడమే ఆటోడ్రైవర్ల లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగాలని ఎస్సీ తుషార్ డూడి సూచించారు. ఏంది సామీ ఈ బాధలు రైతులను ఈ రకంగా ఇబ్బంది పెట్టిస్తే ఎలా..? కాయలు పండించేది...కాపుకాసేది ఒక ఎత్తు అయితే..వాటిని ఫ్యాక్టరీలో అమ్మడం చానా కష్టంగా ఉంది. ఐడీ కార్డులు అంటారు...టోకన్లు అంటారు.. రెండు రోజుల తర్వాత రా అంటున్నారు. కాయలు అన్లోడ్ చేయాలంటే మూడు రోజులు అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే..రాను..రాను మా పరిస్థితిఏంటి?. ఏందీ సామీ ఈ బాధలు మాకు. –సుధాకర్, అగరమంగళం, జీడీనెల్లూరు వర్షం పడితే పూర్తిగా నష్టం రుతుపవనాల రాకతో మామిడి పూర్తి స్థాయి కోతకు కాక ముందే వర్షాలు పడుతున్నా యి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నా సకాలంలో అన్లోడ్ కావడం లేదు. మూడు నాలుగు రోజుల పాటు రోడ్డు మీదే గడపాల్సి వస్తోంది. వర్షంలో మామిడికాయలు తడిస్తే పురుగులు పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా మామిడిని కొనుగోలు చేసి రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వాలు చర్యలు చేయాలి. – మురళి, కోత్తూరు గ్రామం, వెదురుకుప్పం మండలం సిబ్బంది చేతివాటం ఏడాది పాటు కన్నబిడ్డలా సాకిన మామిడి పంట కోతకు వచ్చి రోజులు తరబడి జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ గేట్ల ముందర పడి కాపులు కాస్తుంటే సెక్యూరిటీ గార్డులు మాయాజాలం చేస్తున్నారు. తమకు నచ్చిన వారికి సీరియల్ నెంబర్లు కేటాయిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. సీరియల్ నంబర్లో ఒక రైతు వెళితే కొందరు మాత్రం దర్జాగా దొంగ దారిన వెళ్లిపోతున్నారు. – వెంకటాద్రి, పద్మాపురం -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని శుక్రవారం కలిశారు. పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు శివయ్య, నాయకులు రఘురాం, నరేష్ బాబు, సురేంద్రనాథరెడ్డి, శైలజ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
దిక్కులేని విద్య!
చిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో రెగ్యులర్ డీఈవో లేక అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాకు అత్యంత కీలకమైన రెగ్యులర్ డీఈవో నియామకంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి సమయం ఆసన్నమవుతున్నా, జిల్లా కు పూర్తి స్థాయి డీఈవోను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికి ఎవరు భరోసా? ప్రస్తుతం జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న ఈ పరీక్షల నిర్వహణను, కేంద్రాల పర్యవేక్షణను సమన్వయం చేయాల్సిన ముఖ్యఅధికారి (డీఈవో) లేకపోవడం విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చింది. పరీక్షల స్క్వాడ్ల ఏర్పాటు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల తనిఖీ వంటి కీలక బాధ్యతలను చూసే పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో గందరగోళం ఏర్పడుతోంది. ముందస్తు ప్రణాళిక శూన్యం గత డీఈవో మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన రిటైర్ అవుతున్నారనే విషయం ప్రభుత్వా నికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ముందే తెలిసినప్పటికీ కొత్త డీఈవోను నియమించే ఏర్పాట్లు చేయలేకపోయారు. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్, బడుల నిర్వహణ పనులను పర్యవేక్షించాల్సిన తరుణంలో ఈ ఖాళీ ఏర్పడడం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజకీయ లాబీయింగ్ జిల్లాలో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడుతుంటే ఆశావహులు మాత్రం డీఈవో కుర్చీని దక్కించుకునేందుకు రాజకీయ లాబీయింగ్ల్లో మునిగిపోయారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డీఈవో కుర్చీ కోసం అమ్యామ్యాలు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు సమర్పించి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకుంటే పట్టు సాధించవచ్చనే ఆశతో సిఫార్సు లేఖలకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జిల్లాలో డీఈవోలుగా పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులు అధికంగా పోటీపడుతున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో డీఈవోగా పనిచేసిన ఓ అధికారి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా డీఈవో, ఇద్దరు డైట్ లెక్చరర్లు కుర్చీ కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారని విశ్వసనీయ సమాచారం. -
రీ సర్వే గ్రీవెన్స్లపై ప్రత్యేక దృష్టి
గుడిపాల: ప్రజాసమస్యలను త్వరగా పరిష్కరించడం, రెవెన్యూశాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటి సారిగా గుడిపాల జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డీఎఫ్ఓ సుబ్బరాజు, ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కరుణ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైతే ఫీల్డ్ సందర్శనలు నిర్వహించి ప్రజలకు సరైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. రీ సర్వేకు సంబంధించిన ఫిర్యాదులు కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నాయనప్నారు. రీసర్వే జరగబోయే గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని ఆర్ఐలు, డీటీలు, వీఆర్ఓల వద్దకు వచ్చిన ఫిర్యాదులను సమీక్షించి ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను వారంలోపు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో 15 రోజుల తర్వాత మళ్లీ మండల స్థాయిలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జేసీ రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీషా, ఎంపీపీ హరిప్రసాద్ పాల్గొన్నారు. -
టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఇన్ సర్వీస్ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని వైఎస్ఆర్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యా యులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ భయాన్ని పోగొట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు ప్రత్యేకంగా టెట్ పరీక్షలను నిర్వహించాలన్నారు. -
డీఎస్సీ భూటకం
బాబు నాటకం..చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయ కొలువుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ నిరుద్యోగుల పాలిట మెగా స్కామ్గా మారిందని బాధిత డీఎస్సీ అభ్య ర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. పారదర్శకతను పూర్తిగా పక్కనబెట్టి, అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన దగ్గర నుంచి రిజర్వేషన్ల అమలు వరకు ప్రతి అడుగులోనూ అవకతవకలు స్పష్టంగా కనిపిస్తుండడంతో.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీఎస్సీ బాధిత అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల అమలులో తప్పుల తడకలు సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలులో ఈ డీఎస్సీలో ఘోరమైన తప్పిదాలు జరిగాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థుల హక్కులను కాలరాస్తూ.. రోస్టర్ పాయింట్ల విధానాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు. మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానానికి మంగళం పాడేశారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉండగా.. వారిని కూడా రిజర్వేషన్ కోటాలోనే నెట్టేసి, జనరల్ పోస్టులను ఇతరులకు కట్టబెట్టేలా అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అర్హులైన ఎంతోమంది ప్రతిభావంతులు జాబితా నుంచి కనుమరుగయ్యారు. డీఎస్సీ అధికారాలన్నీ రాష్ట్ర స్థాయిలోనే! నిజానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పేరులోనే జిల్లా స్థాయి అధికారాలు ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో జిల్లాల కలెక్టర్లు, స్థానిక విద్యాశాఖ అధికారుల అధికారాలన్నింటినీ రాష్ట్ర స్థాయిలోనే కేంద్రీకృతం చేసేశారు. జిల్లా కమిటీలను కేవలం రబ్బర్ స్టాంపులుగా మార్చేశారు. స్థానిక కోటా (లోకల్ స్టేటస్), అభ్యర్థుల స్థానికతను నిర్ధారించడంలో జిల్లా కమిటీల అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అవి ఏ ఒక్కటీ అనుసరించలేదు పారదర్శకతకు మారుపేరైన ఏపీపీఎస్సీ (ఏపీపీఎస్సీ) నిబంధనలను, గైడ్లైన్స్ను అనుసరించడం కనీస ధర్మం. కానీ ఈ డీఎస్సీలో వాటిని తుంగలో తొక్కారు. అభ్యర్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియలో కానీ, కట్–ఆఫ్ మార్కుల ప్రకటనలో కానీ ఎలాంటి పారదర్శకత లేదు. ఒకే పోస్టుకు విభిన్న పరీక్షల షిఫ్టుల నిర్వహణలో వచ్చిన మార్కుల వ్యత్యాసాలను సరిదిద్దే శాసీ్త్రయ విధానాన్ని పాటించకపోవడంతో వేలాది మంది నష్టపోయారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అలివిగాని అక్రమాలు! సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ పూర్తిగా ప్రహసనంగా మార్చేశారు. అర్హులైన మెరిట్ అభ్యర్థులను పక్కనబెట్టి, వెనుకబడిన వారికి, అనర్హులకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు తెర వెనుక పెద్ద నాటకమే నడిపించింది. ఓపెన్ కట్ ఆఫ్ వివరాలను, పూర్తి స్థాయి సెలక్షన్ లిస్టులను అధికారికంగా వెల్లడించకుండా.. కేవలం కొద్ది మందికి మాత్రమే రహస్యంగా సమాచారం పంపుతూ ఈ ప్రక్రియను కానిచ్చేశారు. -
ప్రజల విశ్వాసాన్ని పొందడమే లక్ష్యం
పలమనేరు: ఆటోల్లో ప్రయాణిస్తే మనకు ఎలాంటి భయం లేదని జనం నమ్మితేనే వారికి డ్రైవర్లపై సంపూర్ణ విశ్వాసం ఉంటుందని, అందుకే జన విశ్వాస్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. ఆ మేరకు పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లతో జన విశ్వాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాజాత బృందం ఇందుకు సంబంధించిన చిన్న వయసులో పారిపోయి పెళ్లి చేసుకునే అమ్మాయి కథ థీమ్ను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం ఆయన సేఫర్ త్రీవీలర్ రైడర్స్ క్యూఆర్కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తాము ఆటో డ్రైవర్లకు ఇచ్చే యూనిట్ ఐడీ ప్రత్యేక కోడ్ను కలిగి ఉంటుందన్నారు. దీన్ని ప్రయాణికులు స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ వివరాలన్నీ డిస్ప్లే అవుతాయన్నారు. ఆటోలో ఏదేని ఇబ్బంది కలిగితే వెంటనే ప్రయాణికుల భద్రతకు పోలీసులు గ్యారెంటీగా ఉంటారన్నారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ వ్యవస్థతో ఆటో డ్రైవర్లపై సమాజంలో నమ్మకం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తాము నిర్వహించే డ్రంక్అండ్ డ్రైవ్ టెస్ట్లలో ఏ ఆటో డ్రైవర్ దొరకలేదన్నారు. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ తురుణ్పవ్హా, సీఐ మోహన్రెడ్డి, సబ్ డివిజన్లోని ఎస్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా ఎఫ్ఎల్ఎన్ శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఉపాధ్యాయ శిక్షణ తరగతులు క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ శిక్షణ నిర్వహణ తీరుపై ఉపాధ్యాయ లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 శిక్షణా కేంద్రాల్లో కనీస వసతులు కరువై, ఉపాధ్యాయులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉక్కపోతలో అయ్యోర్లు.. కరువైన తాగునీరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,886 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం భానుడి భగభగలకు తోడు శిక్షణా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. ఉపాధ్యాయులు ఉక్కపోత భరించలేక ఇబ్బంది పడుతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి బయటి నుంచి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఆరు రోజులు జరిగే శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యంగా లేదు. దీనిపై ఉపాధ్యాయులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నాణ్యతగా అందించాల్సిన భోజనం రాష్ట్ర స్థాయి వెండర్ల పుణ్యమా అని నాసిరకం బియ్యం, చల్లారిన వంటకాలతో మమ అనిపిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ఆరు రోజుల శిక్షణా కాలానికి గానూ ప్రభుత్వం రూ.20 వేల చొప్పున బడ్జెట్ కేటాయించినప్పటికీ, ఆ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.3 లక్షల స్టేషనరీలో భారీ గోల్మాల్ ఈ శిక్షణలో స్టేషనరీ కేటాయింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉపాధ్యాయులకు పంపిణీ చేయాల్సిన స్టేషనరీ కిట్లను ఏకపక్షంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.3 లక్షల విలువైన స్టేషనరీ పంపిణీలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువ నాణ్యత కలిగిన మెటీరియల్ను సరఫరా చేసి, బిల్లులను భారీగా క్లెయిమ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్టేషనరీని కేంద్రాలకు తరలించే ప్రక్రియలో కూడా సెక్టోరల్ అధికారులు చేతివాటం చూపించినట్టు సమాచారం. కొందరు అధికారులు సొంత కార్లలోనే స్టేషనరీని తరలించి బిల్లులు పెట్టుకున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే విద్యాశాఖ పర్యవేక్షణ ఈ స్థాయిలో పడకేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు శిక్షణా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి, వసతులు మెరుగుపరచడంతో పాటు స్టేషనరీ అవినీతిపై విచారణ జరపాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ అనుమతి ఏదీ..? జిల్లాలో సాగుతున్న ఈ శిక్షణా తరగతులకు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. సాధారంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ కార్యక్రమం, బడ్జెట్ కేటాయింపులకు కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. సమగ్రశిక్ష శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. కలెక్టర్ అనుమతి లేకపోవడంతో శిక్షణా కేంద్రాల బడ్జెట్ ఖర్చు, స్టేషనరీ కొనుగోళ్లల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాతృ మరణాలపై అప్రమత్తంగా ఉండాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో చోటుచేసుకుంటున్న మాతృమరణాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నాగశశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం చిత్తూరులోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మాతృమరణాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులు, బాలింతల సమస్యలను గుర్తించి వారి ని సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఎఫ్డీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లినప్పుడు అన్ని ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని సూ చించారు. పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో పరిశుభ్రత, ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ, రోగుల సంతృప్తి ద్వారా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 శాతానికి పైగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి వైద్యాధికారి నెలకు ఒకసారి గ్రామ ఆరోగ్య క్లినిక్లను తనిఖీ చేసి నివేదికను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సంజీవిని కార్యక్రమంలో ఓపీకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఏబీహెచ్ఏ ఐడీని కేఎంసీ లింక్తో అనుసంధానం చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఆర్బీఎస్కే కింద అంగన్వాడీ, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను పూర్తి చేసి వివరాలను అప్లోడ్ చేయాలని తెలిపారు. త్వరలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో వెంకటప్రసాద్, హనుమంతరావు, అనిల్కుమార్, ప్రవీణ, అనూష, జార్జ్, రామ్మోహన్ తో పాటు పీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
కార్వేటినగరం: కార్వేటినగరంలో ఉన్న ప్రసిద్ధ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం అంకురార్పణ పూజలు చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఆలయ అధికారి చెంగల్రాయులు తెలిపారు. స్వామి వారు రోజుకో అవతారంలో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అంకురార్పణ, శనివారం ఉదయం 8.10 నుంచి 8.45 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాత్రికి పెద్ద శేషవాహనం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 8వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి, 9వ తేదీ కల్పవృక్ష వాహనం, ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ ఉదయం మోహనీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 11వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలు ఉంటాయని తెలిపారు. 12వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ, 13వ తేదీ ఉద యం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 14వ తేదీ ఉదయం పల్లకి సేవ, చక్రస్నానం, ఽసాయంత్రం ధ్వజాఅవరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. సంతాన ప్రదాత వేణుగోపాలుడు ఇక్కడ కొలువైన వేణుగోపాల స్వామి సంతాన ప్రదాతగా విరాజిల్లుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకుంటున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవతా మూర్తులను ఇక్కడికి తెప్పించి ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు తర్వాతి వంశానికి సంతానం కలగక పోవడంతో నారాయణరాజు వెంకటాచలమున తపస్సు చేసి స్వామి వారి అనుగ్రహం పొందినట్లు శాసనాలు చెబుతున్నాయి. అందువల్లే ఆయన వంశానికి చెందిన వెంకటపెరుమాళ్రాజు 1610–1719 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 1936 నుంచి ఈ ఆలయ నిర్వాహణ దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. 1989 ఏప్రిల్ 10 నుంచి టీటీడీ పరిధిలోకి చేరింది. ఆలయంలో మకరతోరణం, గోమాతతో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. ఆలయ ఆవరణంలో శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న సుమారు వంద అడుగులకు పైగా ఏక శిల ధ్వజస్థంభం భక్తులను ఆకట్టుకుంటోంది. 14 ఎకరాల్లో అతిపెద్ద స్కంధ పుష్కరిణి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన స్కంధ పుష్కరిణి ఆసియాలోనే అతిపెద్దది. దీన్ని 19వ శతాబ్దంలో కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు అప్పటి కార్వేటినగరం సంస్థానాధీశుడైన వెంకటపెరుమాళ్ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. పుష్కరిణి మెట్లపై దేవతా మూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలను చెక్కించారు. నీటి మట్టం ఏ వైపు చూసినా సమాతంరంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీవేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం, తెప్పోత్సవాలను ఈ పుష్కరిణిలో వైభవంగా నిర్వహిస్తారు. -
పోటాపోటీగా జిల్లా స్థాయి చెస్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని చెస్ శిక్షణ కేంద్రంలో గురువారం అండర్ 14 క్రీడాకారులకు నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి 65 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. నలుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్పి ప్రసాద్ తెలిపారు. బాలుర విభాగంలో ద్వారక అర్జున్, సిద్ధార్థ్, బాలికల విభాగంలో హితశ్రీ, అనంతనిత్య ఉన్నారని పేర్కొన్నారు. వారు ఈ నెల 13, 14 తేదీల్లో గుడివాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. పోటీలు ముగిసిన అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్, అడ్వకేట్ గోపి, స్కూల్ ఆఫ్ చెస్ చైర్మన్ దినేష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి – ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను వేగంగా చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. ఆయన గురువారం నిర్మాణ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం చేపట్టిన 11 కేవీ విద్యుత్ పనులతోపాటు ఎల్టీ లైన్ పనులను కూడా చేయాలన్నారు. సెప్టెంబర్లోపు పనులు పూర్తి చేయాలన్నారు. కుప్పంలో 3, పలమనేరులో 2, చిత్తూరులో 1, పూతలపట్టులో 2, జీడీనెల్లూరులో 2, నగరిలో 2 కలిపి మొత్తం 12 సబ్స్టేషన్లు రానున్నాయని వెల్లడించారు. స్థలాలను ఎంపిక చేసి త్వరలో పనులు ప్రారంభించే విధంగా చూడా లన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులు 60 శాతం పూర్తయ్యాయని, 63 బ్యాచ్ల ద్వారా 720 మంది పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. బ్యాచ్లను పెంచి పనులు వేగంగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ భాస్కర్నాయుడు, డీఈ మాధవ్రావు, రెడ్డికుమార్, ఏఈ రాజా, వసంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లుగా ప్రమోషన్ చిత్తూరు కలెక్టరేట్: రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తహసీల్దారు ఉద్యోగోన్నతులు సాకారమయ్యాయి. జోన్–4 పరిధిలో పనిచేస్తున్న డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూ రు జిల్లాలో 18 మందికి ఉద్యోగోన్నతులు లభించాయి. వీరిలో 15 మందిని చిత్తూరు జిల్లాకు కేటాయించగా తిరుపతికి 2, శ్రీసత్యసాయి జిల్లాకు ఒకరిని కేటాయించారు. -
చోరీ కేసులో తండ్రీకొడుకుల అరెస్టు
– రూ.38 లక్షల విలువైన ఆభరణాలు సీజ్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో జరిగిన చోరీ కేసులో తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు పెరుమాళ్ల క్రిష్ణ (54), ఇతని కుమారుడు కృష్ణ సంతోష్ కుమార్ (26)ను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వారు గురువారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. చిత్తూరు నాయుడు బిల్డింగ్స్కు చెందిన ఎన్పి.గౌతంకిరణ్ గతవారం ఇంటికి తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లాడు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చోరీకి పాల్పడినట్టు అంగీకరించారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన పెరుమాళ్ల క్రిష్ణ, అతని కుమారుడు కృష్ణ సంతోష్ కుమార్గా గుర్తించారు. వారి నుంచి 186 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.75 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.38 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరిపైనా కర్ణాటకలో 17 కేసులు, తిరుపతిలో మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. కేసును ఛేదించడంతో ప్రతిభ చూపించిన వన్టౌన్ ఎస్ఐ శివశంకర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పరిశోధన అంశాలపై చర్చ చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి సంబంధించిన పరిశోధన అంశాలపై మూడు రోజులపాటు జరగనున్న చర్చా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన విత్తన రకాల రూపకల్పనపై దృష్టిసారించాలన్నారు. వర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీన్ డాక్టర్ పి.మునిరత్నం మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధన నైతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, వర్సిటీ జెనెటిక్స్ విభాగపు అధిపతి డాక్టర్ ఎస్.వసుంధర, ప్లాంట్ బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్వి.సుబ్బారావు పాల్గొన్నారు. -
ముగిసిన వేసవి శిక్షణా శిబిరం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో స్థానిక కణ్ణన్ పాఠశాల ప్రాంగణంలో ఏప్రిల్ 25న ప్రారంభమైన వేసవి చిత్రలేఖన శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. ఈ శిక్షణలో విద్యార్థులు లైన్ డ్రాయింగ్స్, పెన్సిల్ షేడ్స్, కలరింగ్ విధానాలు, పేపర్ కటింగ్స్, పేపర్ బొమ్మల తయారీ (క్రాఫ్ట్ వర్క్), రంగులు వేయడం తదితర అంశాలపై నైపుణ్యం సాధించారు. ఈ క్రమంలో పిల్లలు అద్భుతమైన చిత్రాలను గీసి ప్రదర్శనలో ఉంచారు. చిత్తూరు జిల్లా డీవైఈవో ఇందిర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు తమ మనస్సును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఇలాంటి లలిత కళలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకతను పెంచే ఇలాంటి కోర్సుల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలభవన్ నిర్వాహకులు రామచంద్రారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీ!
గొంతు నొక్కేశారు! సాధారణంగా నియామకాల్లో అభ్యర్థుల పరిశీలన కోసం 1:2 లేదా 1:3 నిష్పత్తిలో జాబితాలు విడుదల చేస్తారు. కానీ, ఈ డీఎస్సీలో వింతగా 1:1 నిష్పత్తిలోనే మెరిట్ లిస్టులను విడుదల చేయడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు ప్రత్యామ్నాయ అవకాశం లేకుండా పోయింది. మరొక విచిత్రమేమిటంటే 1:1 లిస్టులో పేర్లున్న అభ్యర్థులకు సైతం ఉద్యోగం రాకపోవడం. ఆ ఎంపిక జాబితాలో పేర్లుండి సర్టిఫికెట్ పరిశీలనకు హాజరైన సమయంలో అనర్హులని తిప్పి పంపారు. అన్ని అర్హతలున్నా అనర్హులని ముద్ర వేసి తెరవెనుక అనుకూలమైన వారికి పోస్టులు అమ్ముకున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడింది. ఎంతో కాలంగా ఎదురుచూసి, రాత్రింబగళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేస్తూ అర్హులకు మొండిచేయి చూపించింది. బాధిత డీఎస్సీ అభ్యర్థులను నిలువునా ముంచేసింది. పరీక్షల నిర్వహణ నుంచి ఎంపిక ప్రక్రియ వరకు ప్రతి అడుగులోనూ అంతులేని అక్రమాలు చోటుచేసుకోవడంతో.. ‘ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ’ అంటూ అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. రూల్స్ మార్చేశారు పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకలా.. ఎంపిక ప్రక్రియకు వచ్చేసరికి మరోలా నిబంధనలను మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు రావాల్సిన చోట, తెరవెనుక జరిగిన మార్పుల వల్ల టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సైతం నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి, తమకు నచ్చిన వారికి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు సర్కారు ఈ విధమైన మార్పులకు పాల్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అర్హుల పొట్టగొట్టారు! డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పెద్ద వివాదంగా మారింది. క్రీడల్లో ఎలాంటి ప్రవేశం లేని వారికి, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టేశారు. నిజమైన క్రీడాకారులు, అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. లిస్టులో పేరున్నా.. అనర్హులే! అధికారిక మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నా చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. మెరిట్ లిస్టులో టాప్లో ఉన్న అభ్యర్థులను సైతం ఏదో ఒక చిన్న సాంకేతిక కారణం చూపించి అనర్హులు అంటూ ముద్ర వేసింది. అర్హులను పక్కనబెట్టి, వెనుక వరుసలో ఉన్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ అనర్హత డ్రామా ఆడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సీబీఐతో విచారణ జరపాల్సిందే పరీక్షల నిర్వహణ, కీ విడుదల, మెరిట్ లిస్టుల ప్రకటన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని నిరుద్యోగ యువత మండిపడుతోంది. విద్యాశాఖ అధికారుల తీరుపై నమ్మకం పోయిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని యువత, నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. -
అమ్ముకునేశారు
డీఎస్సీ మోసాలపై సీబీఐతో విచారణ చేయించాలి. రాష్ట్రంలో 13 లక్షల మంది పరీక్షలు రాస్తే అందులో 16,465 మందికి మెరిట్లో వచ్చారన్నారు. వారి వివరాలు ప్రకటించాలి. అలాగే క్రీడా కోటాలో 421 పోస్టులను మార్కెట్లో సరుకుల్లా అమ్ముకున్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచారు. – హేమంత్రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, యువత విభాగం లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహరంతోనే అవుట్స్సోరింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. – మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు -
వెన్నుపోటులో చంద్రబాబు దిట్ట
ప్రజలను ఏమార్చి గెలుపొందడానికి చంద్రబాబు ఇచ్చిన 420 మేనిఫెస్టోకు రెండేళ్లు పూర్తయింది. జగనన్నకంటే రెండింతల సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారు. అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. ఎంతమంది ఉంటే అందరికీ పథకమని చెప్పి కొర్రీలు పెట్టారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని మహిళలకు మోసం చేశారు. సంక్రాంతి కానుకలు, షాదీ తోఫాలు ఏమయ్యాయో తెలియదు. రెండేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. సూపర్ సిక్స్ సూపర్ హీట్ అని చంద్రబాబు అంటే లోకేష్ తానా అని పవన్ తందానా అని అంటున్నారు. ఒక పాఠశాల కట్టలేదు. ఇక్కడ సంపాదించి హైదరాబాద్లో దాచుకుంటున్నారు. వెన్నుపోటులో చంద్రబాబు కట్టప్పను మించిపోయారు. కూటమి నేతలు పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వల్ల ఆ శాఖ ప్రతిష్ట దెబ్బతింటోంది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కుప్పం రూరల్ : కుప్పం మండలం ఎర్రగుట్టచేను వద్ద గురువారం అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఎర్రగుట్టచేనుకు చెందిన జ్ఞానశేఖర్ (26)ను గుర్తు తెలియని ముగ్గురు యువకులు వదిలిపెట్టి వెళ్లారు. అప్పటికే జ్ఞానశేఖర్ మృతి చెంది ఉన్నాడని, చేతులు, కాళ్లపై గాయాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. జ్ఞానశేఖర్ మృతిపై అనుమానం ఉన్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్వరమాంత్రికుడు బాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంగీత జగతి లో విశ్వస్వర మాంత్రికుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రజల మనసును చూరగొన్నారని జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.వెంకటరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలో గురువారం భారతీయ తెలుగు రచయితల సమాఖ్య, ఎం.వి. కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్తంగా ప్రముఖ సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో ప్రఖ్యా త గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ తన మధురమైన స్వరంతో, శ్రావ్యమైన సంగీతంతో ఐదున్నర దశాబ్దాలుగా శ్రోతలను రంజింపజేశారని కీర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీ మాజీ ఉపాధ్యక్షుడు మిద్దెల హరి మాట్లాడుతూ 16 బాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో ఎస్పీబాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణ స్వామి, ఎం.వి.కేశవరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.వి.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ గాన గంధర్వుడు బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం 150 మంది గాయకులు, తెలుగు భాషాభిమానులకు సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాలు 2026ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తోటగోవిందన్, ఎస్.మునీంద్ర, ఎం.జగదీష్కుమార్, నాగరాజ, శ్రీరాజు, ఆర్.షాజహాన్, జి.గోవిందయ్య, కొఠారి వెంకటరత్నం, జి.శాంతకుమారి, పాడి రాధ, యువన్య, రాజరత్నం రెడ్డి, లీలమనోహర్ రెడ్డి, సంధ్యాశర్మ, నాట్యాచార్యులు శ్రీరాంబాబు, నృత్య కళాకారిణి జ్ఞాశ్రిత పాల్గొన్నారు. -
హోరెత్తిన నిరసనలు
వెన్నుపోటుకు రెండేళ్లు చిత్తూరు కార్పొరేషన్: అధికారం కోసం అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక అప్పు లు చేయడం తప్ప హామీలను విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా వాటిని అమలు చేయలేకపోయారని ఆరోపించారు. హామీల పేరిట ప్రజలను వెన్ను పోటు పొడిచారని విమర్శించారు. హామీలు ఇవ్వ డం.. వాటిని విస్మరించడం ప్రజా ద్రోహం కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గురువారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. దగాకోరు చంద్రబాబు జీడీనెల్లూరు: నియోజకవర్గంలోని కార్వేటినగరం, ఎస్ఆర్పురం మండలాల్లో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అలాగే పెనుమూరు, పాలసముద్రం, జీడీనెల్లూరు, వెదురుకుప్పం మండల కేంద్రాల్లో నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దగాకోరు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబువి 420 హామీలు నగరి: నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా నాయకత్వంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే పుత్తూరు, విజయపురం, వడమాలపేట మండలాల్లోనూ నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబువి 420 హామీలని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడం బాబు నైజంపూతలపట్టు: నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త సునీల్కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యాద మరి మండలంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి నాయకత్వంలో నిరసన తెలిపారు. అలాగే పూతలపట్టు, తవణంపల్లె, ఐరాల మండలాల్లోనూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారం కోసం అబద్దాలు చెప్పడం బాబు నైజమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయంపలమనేరు: నియోజకవర్గంలోని వి.కోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. అలాగే పలమనేరు, బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మోసం చేసిన చంద్రబాబు కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు మోసగాళ్లు కుప్పం: కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తండ్రీకొడుకులైన చంద్రబాబునా యుడు, లోకేష్ మోసగాళ్లని మండిపడ్డారు. సూపర్ సిక్స్కు కత్తెర ప్రజలకు చంద్రబాబు మోసం చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలంలో వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ర్యాలీ చేశారు. చంద్రబాబు హామీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. అలాగే చిత్తూరు మండలం తాళంబేడులో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. సంపద సృష్టి ఎక్కడ బాబూ..? నేను ఆర్థిక సంస్కర్తను, సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అని గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ మాటలు గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ పేరిట అనేక అబద్దపు హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు. అధికారం కోసం ఎన్నో హామీలిచ్చి అమలు చేయని ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు సూపర్ సిక్స్ .. సూపర్ సక్సెస్ పేరిట సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. నేడు కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలకే పథకాలు ఇస్తోంది. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు ప్రకృతి సంపద తమిళనాడుకు చేరవేసి దండుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారులు నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలి. కూటమి నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారకూడదు. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం -
ట్యాగ్ ఉంటేనే మందులు
కూటమి ప్రభుత్వం రైతులపై పగపట్టినట్టు కనిపిస్తోంది. సంక్షేమాన్ని పక్కన పెట్టి రోజుకో కొత్త నిబంధనను తీసుకువస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. పాడి పశువులకు చికిత్సలు అందించడంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ పశుధన్ యాప్ అమలులో భాగంగా ప్రతి పశువుకూ ఇయర్ ట్యాగ్ (కమ్మ) తప్పనిసరిని చేసింది. ట్యాగ్ ఉంటేనే పశువులకు చూలు పరీక్షలు, కృత్రిమ గర్భధారణ, చికిత్సలు చేస్తామని, మందులు అందజేస్తామని పేర్కొంది. ఈ విధానం జిల్లాలో ఈ నెల ప్రారంభం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమపై ఆధారపడి ఎక్కువ మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. పశుసంపదను కాపాడేందుకు ఒక జిల్లా పశువైద్యశాల, 14 ఏరియా పశువైద్యశాలలు, 68 వెటర్నరీ డిస్పెన్సరీలు, 75 రూరల్ లైవ్స్టాక్ యూనిట్లు, 297 రైతు భరోసా కేంద్రాల్లోని ఆరోగ్య సెంటర్లు సేవలందిస్తున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షల పాడి ఆవులు, 13.80 లక్షల మేకలు, లక్షలాది పశువులు ఉన్నాయి. వాటికి ట్యాగింగ్ ఏర్పాటు, వివరాల నమోదు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని ఈ నెల ప్రారంభం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. పశువులకు ట్యాగ్ ఉంటేనే చికిత్స అందించాలని, మందులు పంపిణీ చేయాలని ఆదేశించింది. జిల్లాలో ఉన్న లక్షలాది పశువులు, మూగజీవులకు ట్యాగ్ ఏర్పాటుచేయడం సిబ్బందికి సవాల్గా మారింది. ఒకవైపు సేవలు అందిస్తూ, మరోవైపు డిజిటల్ నమోదు బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వృద్ధ రైతులకు మరింత ఇబ్బంది జిల్లాలో పెద్ద సంఖ్యలో వృద్ధ రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్ఫోన్లు లేవు. మొబైల్ నంబర్లు, ఆధార్ అనుసంధానం, డిజిటల్ నమోదు ప్రక్రియపై అవగాహన లేదు. వారికి యాప్ ఆధారిత వ్యవస్థ తలనొప్పిగా మారింది. ‘ఆవు అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యుడు వచ్చి చికిత్స చేయాలి. ముందుగా కమ్మ, ఆధార్, ఫోన్ నంబర్ అడుగుతుండడంతో ఏమి చేయాలో తెలియడం లేదు. పశువు అనారోగ్యంతో మృత్యువాత పడితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు భారత్ పశుధన్ యాప్లో వివరాల నమోదు పూర్తిగా ఆన్లైన్ ఆధారంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడంతో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో యాప్ నెమ్మదిగా పనిచేయడం, హ్యాంగ్ కావడం, డేటా సేవ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఫీల్డ్ సిబ్బంది చెబుతున్నారు. షరతులతో ఇబ్బంది పశువులకు అత్యవసర వైద్య సేవలు, చూలు పరీక్షలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలను ఎలాంటి షరతులు లేకుండా అందించాలని రైతులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, సేవలు నిలిపివేయడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ట్యాగ్ లేకుంటే సేవలు లేవ్..? గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు వెళ్లే సిబ్బంది ముందుగా పశువుకు ఇయర్ ట్యాగ్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ట్యాగ్ లేకపోతే ట్యాగింగ్ చేసుకోవాలని, రైతు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సేవలు అందిస్తామని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుగా నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పడం వల్ల పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులకు కొత్త కష్టాలు -
మొదలైన మామిడి పోరు
కాణిపాకం/గంగాధర నెల్లూరు : చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన తోతాపురి మామిడి పంట ప్రస్తుతం మార్కెట్కు వస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం కిలోకు రూ.7లు మాత్రమే చెల్లిస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, ఫ్యాక్టరీ ఇచ్చే ధర కాయలు కోసేందుకు అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ వారు ఈ సారి కొత్తగా గేట్ పాస్, రైతు ఐడీ కార్డు తప్పనిసరి చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గేట్ పాస్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ద్వారం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం దాదాపు 200 వరకు ట్రాక్టర్లు క్యూలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కాయలను ఆలస్యంగా దించుతుండడంతో నాణ్యత దెబ్బతింటోందని, బరువు కూడా తగ్గుతోందని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం లేఖ..? ఫ్యాక్టరీ వద్ద పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతులను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు జైన్ యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాంపుల వద్ద మరింత దారుణం ఫ్యాక్టరీ వద్ద గంటల తరబడి వేచి ఉండలేని రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. రాంపుల వద్ద కొందరు వ్యాపారులు కిలో రూ.6లకే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలు మొదలయ్యాయి. మామిడి సీజన్ ప్రారంభం కావడంతో జీడీ నెల్లూరు మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ఫ్యాక్టరీలో కొత్తగా అమలు చేస్తున్న రైతు ఐడీ కార్డు, గేట్ పాస్ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఫ్యాక్టరీ గేటు వద్ద ట్రాక్టర్ల క్యూలు కనిపిస్తుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. జైన్ ఫ్యాక్టరీ గేటు వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు -
తేలని గజ లెక్క
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఏనుగుల లెక్క ఇంకా తేలనంటోంది. గజగణనలో భాగంగా అటవీ శాఖ వైల్డ్ లైఫ్, ప్రాజెక్టు ఎలిఫెంట్ విభాగాలు మే 27, 29, 30 తేదీల్లో మూడు దశల్లో జిల్లాలో ఏనుగుల గనణ చేపట్టారు. జిల్లా అటవీశాఖ పరిధిలోని చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు, కార్వేటినగరం రేంజ్ల పరిధిలో సిబ్బంది ఏనుగుల గణన నిర్వహించారు. అయినా ఇంతవరకు ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పలేకపోతున్నారు. దీనిపై డీఎఫ్ఓ సుబ్బరాజు స్పందిస్తూ సాంకేతికంగా వివరాలు తెలిశాక, ఉన్నతాధికారులకు పంపి తర్వాత చెబుతామని పేర్కొన్నారు. -
దగా పాలనకు రెండేళ్లు.. హామీల అమలుకు ఇంకెన్నేళ్లు?
చేసింది శూన్యం నగరి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచిందని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. పుత్తూరు పట్టణంలోని ఏడీకే కల్యాణ మండపంలో మాజీ మంత్రి ఆర్కేరోజా ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు అడుగుతుంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పు కోవడంతో ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశాం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలు నేడు బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్రంలో అందడం లేదన్నారు. రైతు భరోసాకు, అమ్మ ఒడికి మొదటి ఏడాది పంగనామాలు పెట్టారన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. 30 లక్షల తల్లులకు అమ్మఒడి దూరం చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను, గద్దర్కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారన్నారు. ఆయన్ను నమ్ముకున్న వలంటీర్లుకు ఉద్యోగాలు పీకేస్తే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్ముకుని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్కే దక్కిందన్నారు. సుగాలీ ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవడానికి రాజీయాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా టాస్క్ఫోర్స్ టీం వజ్రభాస్కర్రెడ్డి, జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు భరత్కుమార్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ఎంపీపీలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బుధవారం సంకటహరచతుర్థి గణపత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతానిన జరిపించారు. స్వర్ణరథంపై గణనాథుడు స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఏఈఓ రవీంద్ర పాల్గొన్నారు. -
క్షయ నివారణే లక్ష్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో క్షయ (టీబీ) నివారణ కార్యక్రమాలను మరింత పటిష్టపరిచే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగశిభూషణరెడ్డి గురువారం చిత్తూరు జిల్లా టీబీ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. సందర్శనలో భాగంగా ఎక్స్రే గది, ల్యాబొరేటరీ, సీబీ–నాట్ విభాగం, డ్రగ్ స్టోర్లను పరిశీలించారు. టీబీ అనుమానితులకు రోగ నిర్ధారణ వేగవంతంగా జరిగేలా ఎక్స్రే, సీబీ–నాట్ పరీక్షలను సకాలంలో పూర్తి చేయాలని, ల్యాబ్ నివేదికలు ఆలస్యం కాకుండా అందించాలని సిబ్బందికి సూచించారు. డ్రగ్ స్టోర్లో క్షయ వ్యాధి నివారణ మందుల నిల్వలు, గడువు తేదీలు, పంపిణీ రికార్డులను పరిశీలించిన డీఎంహెచ్వో, మందుల కొరత తలెత్తకుండా తగిన నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రిజిస్టర్ల నిర్వహణ క్రమబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకప్రసాద్తో పాటు డీఎల్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
చిత్తూరు కార్పొరేషన్: పరిశ్రమలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తామని ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. బుధవారం పారిశ్రామిక విద్యుత్ సదస్సు సందర్భంగా డిస్కం పరిధిలోని వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గంగవరం మండలం గండ్రాజుపల్లి పారిశ్రామికవాడ నుంచి అల్లూరయ్య మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. డీపీఓకు జాతీయ స్థాయి అవార్డు చిత్తూరు కార్పొరేషన్: జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అవార్డును డీపీఓ సుధాకర్రావ్, కుప్పం ఎంపీడీఓ వెంకటేశులు ఢిల్లీలో అందుకున్నారు. ఇటీవల కేంద్ర బృందం జిల్లాలో పర్యటించగా కుప్పంలోని నాయనూరు పంచాయతీను బ్లాక్గా గుర్తించి జాతీయ అవార్డును ప్రకటించింది. కుప్పం మండల ఖాతాకు రూ.1.5 కోట్ల నిధులు జమచేశారు. ఏప్రిల్ 23న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డును అందజేయాల్సి ఉండగా తమిళనాడు, వెస్ట్బెంగాల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ కార్యక్రమం జరగలేదు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పీఆర్ మంత్రి రాజీవ్రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును డీపీఓ, ఎంపీడీఓలకు ప్రదానం చేశారు. చిత్తూరు అర్బన్: చిత్తూరు మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దీక్షిత్ సుక్రిత్ (22), మురళీధర్ బురడీ (33) నుంచి 39.60 కిలోల గంజాయి బస్తాలు, ఓ కారు, రెండు నకిలీ నంబరు ప్లేట్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు, చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఇతర పోలీసు అధికారులతో మీడియా సమావేశం నిర్వహించారు. వీరు మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిలోని యాదమరి మండలం వరిగిపల్లె కూడలి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఓ కారులో ప్రత్యేకంగా రూపొందించిన అరల్లో చిన్నపాటి బస్తాలుగా చుట్టిపెట్టిన గంజాయి కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నట్లు.. బెంగళూరులో కిలో రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు పశ్చిమ సీఐ శ్రీధర్ నాయుడు, యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు. పక్కాగా ‘ఎస్ఐఆర్’ సర్వే చిత్తూరు అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను క్షేత్ర స్థాయిలో పక్కాగా నిర్వహించాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు, కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ కులశేఖర్తో కలిసి బూత్ లెవెల్ ఆఫీసర్లు, పర్యవేక్షకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల తనిఖీ జరగాలన్నారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే ఉపేక్షించేదిలేదన్నారు. -
హామీల డాబు.. అమలేవి బాబూ?
కార్వేటినగరం: కూటమి రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డివిరిచారని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం పుత్తూరులోని తన నివాసంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్ విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోగా 6 లక్షలకుపైగా పింఛన్లు తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.3 వేలు లాంటి హామీలను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం ఏమైందని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీ సూపర్గా ఫెయిల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జీడీనెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి విమర్శించారు. మెడికల్ కళాశాలలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న తీసుకొస్తే, నేడు చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అన్నదాతలకు ఏటా రూ.20 వేలని చెప్పి పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో నేటి నుంచి 12వ తేదీవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు శేఖర్రాజు, తులసీయాదవ్, మణి, జెడ్పీటీసీ సభ్యులు సుకుమార్, చందురాజు, కిషోర్రెడ్డి, కాళప్ప, ధనశేఖర్యాదవ్, ఆకుల గోపి, రాజారాం మందడి, ధన్రాజ్,శివాజీ, జనార్దన్, కోలార్ప్రకాష్, రామయ్య, వెంకటేష్రెడ్డి, ధనంజయవర్మ, మదివాణన్, పట్నం ప్రభాకర్రెడ్డి, హరిరెడ్డి, కుప్పయ్య, శ్యామ్, దినేష్, మహేష్ పాల్గొన్నారు. -
మా పొట్ట కొట్టొద్దు సారూ!
నేటి నుంచి టీచర్లకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ టీచర్లకు నేటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వల్ల 500 కుటుంబాలు వీధిన పడుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. బుధవారం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శాంతిపురం మండలం దండికుప్పం, సోన్నేగానిపల్లి, అమ్మవారిపేట, రామకుప్పం మండలం మణీంద్రం గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కాంట్రాక్టర్ కేంద్ర ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పదం ప్రకారం 150 కి.మీ దూరంలో 2033 వరుకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాంచరాదన్నారు. 2024లో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, దీన్ని ప్రకారం 2033 వరుకు ఎయిర్ పోర్టు నిర్మాణం జరగకూడదన్నారు. స్థానిక రైతులు వ్యవ సాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, ఈ పొలాలు ఎయిర్పోర్టుకు వెళితే తాము తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. -
బ్యానర్ చించాడని యువకుడిపై థర్డ్ డిగ్రీ
సాక్షి టాస్క్ ఫోర్స్: బ్యానర్ చించాడన్న కారణంతో బీసీ వర్గానికి చెందిన యువకుడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట గ్రామంలో బుధవారం కలకలం రేపింది. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన ఓ హెడ్ కానిస్టేబుల్ అమానుషంగా వ్యవహరించాడని, లాఠీలతో చితకబాదారని బాధితుడు రాము కన్నీరుమున్నీరవుతున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేటలో మంగళవారం గంగజాతర జరిగింది. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లో తన ఫొటో ఉండడం నచ్చక యువకుడు రాము ఆ బ్యానర్ను చించేశాడు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అతడిని ఎన్ఆర్పేట పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ కిరణ్ లాఠీతో రామును విచక్షణారహితంగా కొట్టాడుత. ఒళ్లంతా రక్తం గడ్డకట్టేలా వాతలు పెట్టడంతో పాటు చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు చేశారు. స్టేషన్లో ఎస్ఐ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా చెప్పుకుంటున్న ఓ టీడీపీ నేత అనుచరుడు శ్రీను ప్రోద్బలంతోనే తనపై ఈ దాడి జరిగిందని రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు రామును బంధువులు బుధవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య విచారణ చేపట్టారు. బాధితుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి బాధితుడిని ఫోన్లో పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా పోరాడతామని హామీ ఇచ్చారు. వీఆర్కు హెడ్ కానిస్టేబుల్ రామును లాఠీతో చితకబాదిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ కిరణ్ను వీఆర్కు పంపినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.వీఆర్కు పంపడం మాత్రమే కాకుండా, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘సర్’ వస్తున్నారు!
చిత్తూరు అర్బన్: ప్రభుత్వాల ఏర్పాటు, నాయకులను ఎంచుకోవడంలో ఓటుకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదే సమయంలో ఓటరుగా సజీవంగా ఉన్న వ్యక్తికి ఓటుహక్కు లేకపోతే పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరిట నూతన సంస్కరణను తీసుకొచ్చింది. జిల్లాలో ఈనెల నుంచి ప్రారంభంకానున్న ‘సర్’ను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హుల ఓటర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నాయి. వారి సమ్మతే ప్రధానం ‘సర్’ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లదే (బీఎస్ఏ) కీలక పాత్ర. బీఎల్ఎలు చేపట్టే ఇంటింటా సర్వేలో వారి సమ్మతే ప్రధానం. ఈ క్రమంలో ప్రతి రాజ కీయ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ఓటరు జాబితాలోని తమ సానుభూతిపరులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో 1,762 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో బూత్కు ఒకరిని గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు ఏజెంట్లుగా నియమించుకొని జాబితాను ఎన్నికల కమిన్కు అందజేయాలి. వీరికి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సర్ సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వసున్నారు. చిన్న తేడా.., నష్టం పెద్దదే! భారత ఎన్నికల కమిషన్ ప్రతి సంవత్సరం ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తుంది. దీన్నే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) అంటారు. ఇందులో భాగంగా ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ చనిపోయిన వారిని తొలగించడం, 18 ఏళ్లు నిండిన వాళ్లను కొత్త ఓటరుగా చేర్చడం, ఓటరు ఓ చోటి నుంచి మరో చోటికి బదలాయిండం, అచ్చు తప్పులు సరిచేసుకోవడం, చిరునామాలు, నియోజకవర్గాల మార్పులకు ఎస్ఎస్ఆర్లో అవకాశం కల్పిస్తారు. ఇదే సమయంలో ఎస్ఐఆర్(సర్) జాబితాలోని ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫాం–2ను ఎన్నికల కమిషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. తద్వారా చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్ ఓటర్లు(రెండు చోట్లా ఓటు ఉన్న వ్యక్తులు), కనిపించకుండాపోయిన ఓటర్లు, ఇంటి అడ్రస్సులు లేని వ్యక్తులు, భారత పౌరసత్వం లేని వ్యక్తులు పూర్తిగా ఓటరు జాబితాలో పేరును కోల్పోతారు. ఇలా ఉన్నజాబితాలో కనీసం 10 శాతం ఓటర్లు తొలగిపోయే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఎల్ఏలను నియమించుకుని శిక్షణ కూడా ప్రారంభించింది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరికీ అన్యాయం జరగకూడదని, ఫారం–2ను పూరించడంపై పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు ప్రారంభించింది. ‘ఏజెంట్ల’తో బిజీబిజీ జాతీయ ఎన్నికల కమిషన్ మూడో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ‘ఎస్ఐఆర్’కు శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా యంత్రాంగం సర్ను పారదర్శకంగా అమలు చేయడా నికి చర్యలు చేపట్టింది. ఈక్రమంలో జిల్లాలో గుర్తింపు కలిగిన పార్టీలతో పలుమార్లు భేటీలు నిర్వహించి సూచనలు చేస్తోంది. ఇందులో వైఎస్ఆర్సీపీతో పాటు అధికార పార్టీలు ఇప్పటికే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించేసుకుంది. మిగిలిన పార్టీలు వారికి పట్టున్న ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుంటూ సానుభూతి ఓటర్లు చేజారకుండా చూసుకుంటున్నాయి. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణ రాజకీయ పార్టీలు బూతల వారీగా ఎంపిక చేసిన బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఎస్ఎస్ఆర్ ప్రకారం ఓటర్లు ఇలా.. నియోజకవర్గం ఓటర్లు మొత్తం పురుషులు సీ్త్రలు ఇతరులు పుంగనూరు 117130 121882 5 239017 నగరి 98442 104044 8 202494 జీడీ నెల్లూరు 102069 103307 4 205380 చిత్తూరు 98808 104312 31 203151 పూతలపట్టు 109027 112410 6 221443 పలమనేరు 132924 135611 1 268536 కుప్పం 112864 113599 18 226481 మొత్తం 771264 795165 73 1566502 -
ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతగా పనిచేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతగా పనిచేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి జి. వెంకటప్రసాద్ సూచించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా రెండు వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న వారి నుంచి తప్పనిసరిగా కఫం నమూనాలు సేకరించి స్పుటం పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారిని వెంటనే ఎస్టీఎస్కు నివేదించి డాట్స్ చికిత్సకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షల విషయంలో ఐసీటీసీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు ముందస్తు కౌన్సెలింగ్ అందించి, గోప్యత పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పాజిటివ్ కేసులను వెంటనే ఏఆర్టీ కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు. గర్భిణులకు పీపీటీసీటీ కార్యక్రమం కింద హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెల మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించి విస్తృత స్థాయిలో రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి నవీన్ తేజ్రాయల్, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ముగిసిన పినాకా ఉచిత శిక్షణ నగరి : మున్సిపల్ పరిధి, పుదుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 21 రోజుల పాటు నిర్వహించిన ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. తిరుపతి ఎకై ్సజ్ సీఐ లీలారాణి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి ఉన్నతికి, లక్ష్య నిర్దేశానికి చక్కగా వినియోగించుకోవాలన్నారు. క్విజ్, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందజేశారు. ఎంఈవో నమఃశ్శివాయం, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, కోర్సు డైరెక్టర్ మునస్వామి, ఫ్యాకల్టీ మధుసూదన్, బాలాజి పాల్గొన్నారు. -
ఏఐ యాప్తో చిన్నారుల్లో లోపాల గుర్తింపు
చిత్తూరు కలెక్టరేట్ : నవచేతన ఏఐ యాప్తో చిన్నారుల్లో లోపాలను గుర్తించవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు నవచేతన ఏఐ యాప్ ఆవిష్కరించారన్నారు. క్షేత్ర స్థాయిలో సీడీపీవోలు, సూపర్వైజర్లు నిరంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఆరేళ్లు వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలురాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ నూతనంగా ఆవిష్కరించిన యాప్లో మూడు పద్ధతుల్లో స్క్రీనింగ్ చేసి 21 రకాల లోపాలను గుర్తించవచ్చని తెలిపారు. సమావేశంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజేష్, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం ఒక వరం జిల్లాలోని గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం ఒక వరమని కలెక్టర్ తెలిపారు. గిరిజన, అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల మేలు కోసం పార్లమెంట్లో తీసుకొచ్చిన ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) 2006 గొప్ప చట్టమన్నారు. బంగారుపాళ్యం మండలం పరిధిలో రోడ్ల నిర్మాణానికి అటవీ భూములు కేటాయింపు ప్రతిపాదనలు పరిశీలించి, జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తుంబపాళ్యం నుంచి చెట్టువారిపల్లి కాలనీ వరకు 0.972 హెక్టార్లు, గొర్రెలనగరి నుంచి వేపనపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి 0.970 హెక్టార్లు, రాగిమానుపెంట నుంచి కేఎం కండ్రిగ వరకు 0.675 హెక్టార్ల అటవీ భూమికి ఆమోదం తెలిపామన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఎఫ్వో సుబ్బురాజ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు. -
ఏమార్చేశారు!
డీఎస్సీ నియామకాల్లో నిలువునా మునిగిన ప్రతిభావంతులు మెరిట్ లేని వారికి ఉద్యోగాలు కుప్పం మండలానికి చెందిన రాధాకృష్ణ (పేరు మార్చాం) ఐదేళ్లుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. డీఎస్సీ కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో అధికారిక కీ ప్రకారం అతనికి అత్యుత్తమ మార్కులు వచ్చాయి. విద్యాశాఖ మొదట విడుదల చేసిన సెలెక్షన్ లిస్టులో ఎంపికయ్యారు. కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. తీరా సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే సమయానికి, అధికారులు సాంకేతిక కారణాలతో సవరించిన రెండో జాబితాలో రాధాకృష్ణ పేరు లేదు. అతనికంటే 8 మార్కులు తక్కువ వచ్చిన ఓ అభ్యర్థి పేరు ఆ స్థానంలో ప్రత్యక్షమైంది. అధికారులను నిలదీస్తే అది పై నుంచి వచ్చిన ఆర్డర్స్ .. మాకేం తెలియదని సమాధానం ఇచ్చారు. ఇక ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. మెరిట్ లేని వారికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1,478 మందికి గాను 1,099 మందికి కాల్లెటర్లు పంపారు. సర్టిఫికెట్లు పూర్తి చేసుకున్న మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదనే మెలిక పెట్టారు. ప్రతిభను నమ్ముకున్న అభ్యర్థులకు అన్యా యం చేశారు. ప్రతిభ కనబరచిన వారు న్యాయం కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగు తుంటే, కనీస అర్హత మార్కులు (కట్ ఆఫ్) సాధించని వారు, అసలు మెరిట్ జాబితా ఆఖరి పేజీల్లో ఉన్నవారు అనూహ్యంగా నియామకపత్రాలు అందుకోవడం అర్హులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇది ఒక్క కుప్పంలోని రాధాకృష్ణ పరిస్థితే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది డీఎస్సీ రాసిన నిరుద్యోగుల దుస్థితి. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినా ఉద్యోగం సంపాధించలేకపోయారు. కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చిన వారు అనూహ్యంగా నియామక పత్రాలు అందుకుని ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ గోల్మాల్ వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వేలాది మంది అర్హులకు మెగా డీఎస్సీలో అన్యాయం జరిగింది. పారదర్శకతకు నిలువుటద్దంగా నిలవాల్సిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతర్గత అవకతవకల కారణంగా నిరుద్యోగులకు అన్యాయం చేకూర్చింది. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ఉద్యోగం ఖాయమనుకున్న ప్రతిభావంతుల పేర్లు రాత్రికి రాత్రే మాయం చేశారు. అసలు క్వాలిఫైయింగ్ మార్కులు సైతం రాని వారు నియామక పత్రాలతో పాఠశాలల్లో అడుగుపెట్టడం విద్యాశాఖ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మారింది. లిస్ట్లన్నీ తారుమారు చంద్రబాబు సర్కారు చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ అక్రమాలకు, అవకతవకలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. విడతల వారీగా మారుతూ వచ్చిన ఫలితాల జాబితా, మెరిట్ లిస్ట్లు పలు అనుమానాలకు తావిచ్చింది. సాధారణంగా ఏ పరీక్షలైనా అత్యంత పకడ్బందీగా ఒకేసారి తుది మెరిట్, సెలెక్షన్ లిస్టులను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మెగా డీఎస్సీలో వింత పోకడలకు తెరలేపారు. అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ, అనుమానాలకు తావిచ్చేలా ఒక్కోసారి ఒక్కొక్క రకమైన జాబితాను తెరపైకి తీసుకొచ్చారు. మొదటి సారి విడుదల చేసిన ప్రాథమిక మెరిట్ జాబితాలో చాలామంది అభ్యర్థులు టాప్ ర్యాంకుల్లో కనిపించారు. ఉద్యోగం ఖాయమని ధీమాగా ఉన్న అభ్యర్థుల పేర్లు.. మరుసటి రోజు వచ్చే సరికి మాయమైపోయాయి. వారి స్థానంలో వెనుకబడిన ర్యాంకర్ల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒకే కేటగిరీ, ఒకే పోస్టుకు సంబంధించి మూడు నుంచి నాలుగు సార్లు సవరించిన జాబితాలను విడుదల చేశారు. ఏ జాబితా ఫైనల్? ఏ జాబితా ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారో తెలియని అయోమయ స్థితిని కల్పించారు. అసలు మతలబు ఇదే చంద్రబాబు సర్కారు సృష్టించిన ఈ సాంకేతిక సాకుల వెనుకే అసలు మాయాజాలం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కావాలనే మొదట ఒక లిస్ట్ వదిలి, అభ్యర్థుల స్పందనను చూసి, ఆ తర్వాత తెరవెనుక జరిగిన చర్చలు, పైరవీల ఆధారంగా లూప్ హోల్స్ వెతుక్కుంటూ అనర్హులను జాబితాల్లోకి చొప్పించడానికి లిస్టుల మార్పిడి ప్రక్రియను ఆయుధంగా వాడుకున్నట్లు బాధిత డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పారదర్శకతను సమాధి చేస్తూ సాగిన జాబితాల మెగా డీఎస్సీ గోల్మాల్ పై తక్షణమే సీఐడీ విచారణ చేయించాలని బాధితులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతా మా ఇష్టం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు జిల్లా కేంద్రంగా గత ఏడాది ఆగస్టులో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్క విడతలో ఒక్కో రకమైన జాబితాను విడుదల చేశారు. బాధిత నిరుద్యోగులు తమకు అన్యాయం జరిగిందని అడిగితే, సాంకేతిక లోపం అంటూ సాకులు చెప్పారు. ఈ సాకులు చెప్పడం వెనుక వందల కోట్ల అవినీతి జరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పలు రకాల కొత్త పేర్లను సృష్టించి మార్కులను తారుమారు చేయడం, రోస్టర్ పాయింట్లను ఇష్టానుసారంగా మార్చేయడం, నకిలీ స్పోర్ట్స్, పీహెచ్ సర్టిఫికెట్లు సమర్పించడం వల్ల అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగినట్టు స్పష్టమవుతోంది. -
గ్యాస్ సరఫరాలో అంతరాయం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఇండియన ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) కంపెనీకి చెందిన ట్రానన్స్పోర్టర్లతో నెలకొన్న వివాదం గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాకు గ్యాస్ సిలిండర్ల రవాణా నిలిచిపోవడంతో డీలర్లు, వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఐఓసీఎల్ కంపెనీ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల మధ్య టెండర్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై వివాదం నెలకొన్నట్లు డీలర్లు చెబుతున్నారు. రవాణా చార్జీలు, అన్లోడింగ్ వ్యయాలు, చెల్లింపుల విధానం తదితర అంశాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో గ్యాస్ రవాణా నిలిచిపోయినట్లు డీలర్లు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ఏజెన్సీలకు సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు సమాచారం. ఏజెన్సీల వద్ద ప్రస్తుతం ఉన్న నిల్వలు ఒకటి, రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, బుధవారం నుంచి గ్యాస్ కొరత మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఐఓసీఎల్కు చెందిన సుమారు 27 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజువారీగా సుమారు 20 వేల గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సంబంధిత అధికారులు సైతం చేతులెత్తేస్తున్నట్టు సమాచారం. వర్సిటీలో యోగా పరీక్షలు కుప్పం: ద్రవిడ వర్సిటీలో డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను వర్సిటీ వీసీ మల్లయ్య మంగళవారం ప్రారంభించారు. మంగళవారం నుంచి 6వ తేదీ వరకు వరుకు జరుగునున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భాష భవనంలో యెగా పరీక్షలు విజయవంతం కావడానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ప్రాక్ట్రికల్స్కు కావాల్సిన సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. భూ సర్వేకు ఆరు నెలలే గడువు చిత్తూరు కలెక్టరేట్ : రాబోయే ఆరు నెలల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. రీ సర్వే ఆఖరులో తప్పు లు చేయకూడదని కలెక్టరేట్ అధికారులు సూచిస్తున్నారు. రీ సర్వేలో నమోదయ్యే ఫిర్యాదుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రీ సర్వే డీటీలను ఆదేశించారు. మా జీతాల్లో కోత వద్దు చిత్తూరు కార్పొరేషన్: ఉద్యోగుల అనుమతి లేకుండా హాఫ్–డే జీతం మినహాయించే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ట్రాన్స్కో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇది చట్ట, రాజ్యాంగపరంగా తప్పని పేర్కొంది. ‘విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం‘ అనే సొసైటీ నిర్వహణ కోసం ప్రతి ఉద్యోగి జీతం నుంచి అర్ధరోజు జీతాన్ని ఇవ్వాలని యాజమాన్యం కోరడం సరికాదన్నారు. అందుకు కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రావలసిన మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. వీటి సాధన కోసం పోరాడాలన్నారు. బెల్టుషాపు పై దాడి బంగారుపాళెం: మండలంలోని తుంబకుప్పం గ్రామంలో మంగళవారం బెల్ట్షాప్పై దాడిచేసి మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తుంబకుప్పం గ్రామంలో శ్రీధర్ అనే వ్యక్తి అక్రమంగా ఆంధ్ర మద్యం విక్రయిస్తున్నాడని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటి విలువ రూ.8,920 ఉంటుందన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. ఆటో బోల్తా – ముగ్గురికి గాయాలు వి.కోట : ఆటో బోల్తా పడడంతో డ్రైవర్తో పాటు మరో ముగ్గురుకి స్వల్ప గాయాలైన ఘటన మండలంలో మంగళవారం చోటు చెసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం నుంచి వి.కోట వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో కుప్పం– వి.కోట జాతీయ రహదారిలోని పొంతనపల్లి క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పోతనపల్లికి చెందిన అణమ్మ, కృష్ణప్పతోపాటు డ్రైవర్ అరుణ్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. -
చిత్తూరు కలెక్టరేట్లో దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం దక్కకపోవడం.. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగురాలు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు మనెమ్మకు కొన్నేళ్ల కిందట చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అయినా చిన్నచిన్న పనులు చేస్తూ ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయని తెలుసుకొని.. దరఖాస్తు చేసుకుంది. అన్ని అర్హతలున్నా నాన్ లోకల్ పేరుతో తనకు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) అలసత్వం వల్లే తనకు అన్యాయం జరిగిందని మనెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నాన్ లోకల్ కేటగిరి గురించి స్పష్టం చేయకుండా దరఖాస్తు స్వీకరించారని వాపోయింది. తీరా ప్రక్రియ ముగిశాక అసలు విషయం చెప్పారని కన్నీటిపర్యంతమైంది.ఈ నిబంధన ముందే చెప్పి ఉంటే తన సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకునేదానినని వాపోయింది. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. సోమవారం నాలుగేళ్ల కుమార్తెతో వచ్చి కలెక్టర్ సుమిత్ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని కలెక్టర్ చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. కొంత పెట్రోల్ను తాగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పోలీసులు, స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధి లో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్ బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకొనున్నట్టు వెల్లడించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి చిత్తూరు కలెక్టరేట్: బ్యాక్లాగ్ ఉద్యోగాలు పొందిన విభిన్న ప్రతిభావంతులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు. జ్యూస్ తాగి వంద మందికి పైగా అస్వస్థత బైరెడ్డిపల్లె: బైరెడ్డిపల్లె మండలం పాతపేటలో సోమవారం జ్యూస్ తాగి వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. పాతపేటలో బాట గంగమ్మ జాతర జరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలకు నీళల్లో జ్యూస్ పౌడర్ కలిపి పంపిణీ చేశారు. ఆ జ్యూస్ తాగిన వారిలో 100 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ బైరెడ్డిపల్లె, పలమనేరు ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప బైరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి చేరుకొని.. వారిని పరామర్శించారు. అందుబాటులో లేని మందులను ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి తీసుకువచ్చి అందించారు. గడువు ముగిసిన జ్యూస్ పౌడర్ వల్లే అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సకాలంలో విద్యుత్ సమస్యల పరిష్కారం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిండ్ర మండలం నుంచి వ్యవసాయ సర్వీసు పరంగా ఉన్న ఫిర్యాదును పరిష్కారించి సర్వీసు ఇవ్వాలని సుబ్బారామిరెడ్డి, బంగారుపాళ్యం నుంచి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన వాటికి కనెక్షన్ ఇవ్వలేదని ప్రభాకర్రెడ్డి సమస్యలను తెలియజేశారు. అలాగే వెదురుకుప్పం వ్యవసాయ సర్వీసుకు డబ్బులు కట్టి ఏడాది అవుతున్నా కనెక్షన్ ఇవ్వలేదని పట్టాభి పేర్కొన్నారు. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఎస్ఈ అధికారులను ఆదేశించారు. షెడ్డు కూలి రెండు పాడి ఆవులు మృతి పెనుమూరు(కార్వేటినగరం): గాలీవానకు ఆవుల షెడ్డు కూలి రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన సోమవారం పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం.. పెనుమూరు మండల పరిఽధిలోని మఠంపల్లి గ్రామానికి చెందిన సురేష్నాయుడు ఏర్పాటు చేసిన ఆవులు షెడ్డు గాలివానకు నేలకొరిగింది. అందులో ఉన్న పాడి ఆవులు రెండు షెడ్డు శిథిలాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాయి. షెడ్డుకు ఏర్పాటు చేసిన రేకులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మేరకు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. -
లీకుల డీఎస్సీపై..
నిరసన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డిచిత్తూరు కలెక్టరేట్ /చిత్తూరు కార్పొరేషన్: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీకి తెరలేపిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించగా.. ఆయనతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు రజనీకాంత్ పాల్గొన్నారు. యువత విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు, నిరుద్యోగులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా యువత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మిన్నటించారు. లోకేష్కి ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి ఫిట్ సర్టిఫికెట్లా? అంటూ విరుచుకుపడ్డారు. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉరే గతి అంటూ కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీకి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు దొరబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్రమణ్యంనాయుడు, ధనరాజ్, నాయకులు చంద్రారెడ్డి, స్టాండ్లీ పాల్గొన్నారు. పోస్టులు అమ్ముకున్నారు చంద్రబాబు సర్కారులో మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను అమ్ముకున్నారని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. డీఎస్సీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించి డిమాండ్ చేశారు. పేపర్ లీక్..డేటా డిలీట్.. మెరిట్లిస్ట్ మాయంపై మండిపాటు ఎన్నికల్లో బీఎల్ఏలే కీలకం కుప్పం రూరల్ : ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఏలే కీలకమని ఎమ్మెల్సీ భరత్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఐఆర్ ట్రైనర్ వజ్ర భాస్కర్రెడ్డి తెలిపారు. కుప్పం పట్టణంలోని కేవీఆర్ కల్యాణ మండపంలో సోమవారం కుప్పం నియోజకవర్గంలోని బీఎల్ఏ, క్లస్టర్ ఇన్చార్జిలకు శిక్షణ నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల్లో 38 వేల ఓట్ల తొలగింపు కారణంగా స్టాలిన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేశారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ క్రేజీవాల్ సైతం తొలగించిన ఓట్లు కారణంగానే ఓడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అన్నదానం విరాళాల లెక్కలేవి సారూ?
కుప్పం : కుప్పం పట్టణంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో జాతరను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేయడానికి విరాళాలు ఇచ్చారు. వాటిని పాలక వర్గం పెద్దలు అన్నా క్యాంటీన్ ఖాతాలకు తరలించారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ముగిసి వారం రోజులు అవుతున్నా అన్నా క్యాంటీన్కు చేరిన అమ్మవారి అన్నదానం విరాళాల వివరాలను బయట పెట్టకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 15వ తేదీన తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఈ క్రమంలో అన్నదానం కోసం విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించారు. బ్యానర్ ఏర్పాటు చేసి అందులో ఒక బ్యాంకుకు సంబందించిన క్యూర్ కోడ్ను ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే అన్యా క్యాంటీన్ ఖాతాలో నగదు జమ అయినట్టు చూపించింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో పాలక వర్గం నాయకులు స్పందించారు. ప్రతి పైసాకూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. జాతర ముగిసి వారం రోజులు అవుతున్నా లెక్కలను బయట పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన హుండీల్లో కానుకలను సమర్పించారు. ఆ లెక్కలను బయటపెట్టిన పాలక వర్గం అన్నదానం కోసం వచ్చిన విరాళాల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. -
కొత్త పింఛన్లు ఎప్పుడో..?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్ల జాడ కనిపించని పరిస్థితి. అర్హత ఉండి పింఛన్లు అందక వేలాది మంది బాధితులు జిల్లాలో అవస్థలు పడుతున్నారు. నిత్యం అధికారులు, సచివాలయాల చుట్టూ తిరుగుతూ అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు మహా ప్రభు అంటూ మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి జాలి కలగడం లేదు. కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నా రు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లోనూ పింఛన్లు ఇవ్వాలన్న అర్జీలు అధికమవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త పింఛన్లకు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఇప్ప టి వరకు దాదాపు 1,879 వరకు అర్జీలు పీజీఆర్ఎస్లో నమోదైనట్లు సమాచారం. సచివాలయాల్లో 25,487 వరకు అర్జీలు నమోదయ్యా యి. జిల్లాలో వేల సంఖ్యలో కొత్త పింఛన్ల మంజూరుకు అర్హులు ఎదురుచూస్తూనే ఉన్నారు. 25 చోట్ల కార్డెన్ సెర్చ్ చిత్తూరు అర్బన్ : ‘ధైర్య స్పర్శ – ఆపరేషన్ ప్లష్ అవుట్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆదివారం 25 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులు ఐరాల మండలం గుండ్లపల్లెలో గన్పౌడర్, పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా 110 మందికి పరీక్షలు చేశారు. పూతలపట్టు, గంగవరం, విజయపురం, పాలసముద్రం ప్రాంతాల్లోని నలుగురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. లింగ నిర్ధారణ కేసులో నలుగురి అరెస్టు బంగారుపాళెం : మండలంలోని చంద్రశేఖరపురం గ్రామంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కేసులో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. చంద్రశేఖరపురం సమీపంలో రోమన్కుమార్ మామిడితోటలో నిర్మాణంలో ఉన్న భవనంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తుంబకుప్పం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లోహిత్చెంగల్రాయన్కు సమాచారం అందిందన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు వైద్యశాఖ అధికారులతో కలిసి దాడి చేశామన్నారు. పోలీసులను చూసి కొందరు వ్యక్తులు పారిపోగా, మరి కొందరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి గర్భిణులను పోన్ ద్వారా సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని చెబుతున్నట్టు తేలిందన్నారు. ఒక్కొక్క గర్భిణి నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో చిత్తూరు పట్టణం మిట్టూరుకు చెందిన పద్మ, పోలీస్ కాలనీకి చెందిన జ్యోతి, బంగారుపాళెం మండలం చీకూరుపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ జ్యోతీష్, చంద్రశేఖరపురానికి చెందిన రోమన్కుమార్ను అరెస్టు చేసి స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేజీ సత్రానికి చెందిన నాగరాజు, చిత్తూరుకు చెందిన సుధాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎస్ఐ ప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు. బధిరుల నూతన కార్యవర్గం ఎన్నిక చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ బధిరుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం పారదర్శకంగా ముగిశాయి. 2026– 2029 కాలానికి కొత్త నాయకత్వం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా హేమంత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రుకేష్, ప్రధాన కార్యదర్శిగా వంశీకృష్ణ్ణ, సంయుక్త కార్యదర్శిగా బాబు, కోశాధికారిగా గుణశేఖర రెడ్డి, మహిళా కార్యదర్శిగా మానస, కార్యవర్గ సభ్యులుగా విజయకుమార్, బాలచంద్ర ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ లో రిటర్నింగ్ ఆఫీసర్గా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శశికుమార్ వ్యవహరించారు. ఆయన ఎన్నికై న సభ్యులకు అభినందనలు తెలిపారు. జిల్లాలోని బధిరుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల మెరుగు, సామాజిక సమగ్రత కోసం కొత్త కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆకాంక్షించారు. -
కూల్లిప్ మత్తు
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు నగరి : ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన డ్రగ్స్ నేడు గ్రామాలకు వ్యాపించాయి. అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది డ్రగ్స్ను వివిధ రూపాలు మార్చి యువత చెంతకు చేరుస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా పౌడర్ ప్యాకెట్లు, సిగరెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవల పొగలేని ఫిల్టర్ పొగాకు ప్యాకెట్లయిన కూల్లిప్ పిల్లోస్ రూపంలో విద్యార్థులకు చేరవేస్తున్నారు. వాటిని ఒక్కసారి వాడిన విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ను నిరోధించడానికి పోలీసు శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండడం లేదు. పాఠశాలల బయట ఉన్న బంకుల్లో ఈ పిల్లోస్ లభిస్తున్నాయి. విద్యార్థుల బ్యాగుల్లో ఆటవస్తువులు, పెన్సిళ్లు, పుస్తకాలు, చాక్లెట్లకు బదులుగా కూల్లిప్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తీసుకున్న విద్యార్థుల ప్రవర్తనలో తీవ్ర మార్పులు గమనిస్తున్నామని చెబుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడం, వాటిని వాడినప్పుడు ఎదోలా ఉండడంతో ఒకరిని చూసి మరొకరు వాడుతున్నట్టు పేర్కొంటున్నారు. కూల్లిప్ పాకెట్లలో ఉండే మత్తు పదార్థాల ప్రభావంతో యువత ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండెనొప్పి, దంతాలు పాడైపోవడం తదితరాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. మత్తుకు బానిసలవుతున్న కొంతమంది యువకులు చదువులపై ఆసక్తి కోల్పోయి అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల మైదానాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరిహద్దు నుంచి సరఫరా నగరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి కూల్లిప్ ప్యాకెట్లు సరఫరా అవుతున్నట్టు సమాచారం. హర్యానాలో తయారుచేసే ఈ నిషేధిక గంజాయి కూల్లిప్స్ గతంలో తమిళనాడు, కేరళకు సరఫరా అయ్యేవి. అక్కడి ప్రభుత్వాలు పూర్తిగా నిషేధం విధించడంతో మన రాష్ట్రానికి చేరవేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం వాటిని కట్టడి చేయడంలో విఫలం కావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సమేతంగా రవాణా కొంతమంది ఎవ్వరికీ సందేహం రాకుండా కుటుంబ సమేతంగా మత్తుపదార్థాల విక్రయాన్ని నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు, తండ్రీకూతురు అంటూ ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్నట్టు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. కొన్నిసార్లు వాహనాల తనిఖీలో బయటపడుతుండగా, ఇంటి వద్ద నిల్వచేసిన గంజాయిని కార్డెన్ సెర్చ్లో గుర్తిస్తున్నారు. ఇలా నగరి మండలం ఓజీ కుప్పం, గ్రామానికి వెళ్లే దారిలోను గంజాయి పలుమార్లు పట్టుబడింది. ఇలాగే కూల్ లిప్ ప్యాకెట్లను గుట్కా ప్యాకెట్లతో కలిసి బంకులకు సరఫరా చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు కేంద్రంగా కూల్లిప్ సరఫరా జరుగుతున్నట్టు సమాచారం. బూస్ట్ పేరిట విక్రయాలు కూల్లిప్అమ్మకాలపై నిషేధం ఉండడంతో వీటి ని కొనుగోలు చేసుకునే విద్యార్థులు, యువకులు దుకాణదారుల వద్ద బూస్ట్ ప్యాకెట్ ఉందా అని అడుగుతున్నారు. దుకాణదారు ఆ ప్యాకెట్లను బహిరంగంగా ఇవ్వకుండా న్యూస్ పేపర్లో పొట్లం చుట్టి ఇస్తున్నాడు. ఒక సాచెట్లో 40 పిల్లోస్ ఉంటాయి. పరిమాణాన్ని అనుసరించి రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. టెస్టుల్లో బయటపడుతున్న పాజిటివ్ కేసులు ఎస్పీ తుషార్డూడీ అందించిన కిట్ల ఆధారంగా ఆదివారం నగరి సబ్ డివిజన్ పరిధిలోని నగరి, నిండ్ర, విజయపురం, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మండల్లాలో 13 మందిని పరీక్షించారు. విజయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల పరిధిలో ఒక్కొక్కరికి పాజిటివ్గా నమోదైంది. గంజాయి అమ్మినా.. వాడినా జైలుకే నగరి : గంజాయిని అమ్మినా, ఎవరైనా వినియోగించినా జైలుకెళ్లడం ఖాయమని నగరి అర్బన్, రూరల్ సీఐలు మల్లికార్జునరావు, భాస్కర్ హెచ్చరించారు. వారు ఆదివారం జిల్లా ఎస్పీ తషార్ డూడి ఆదేశాల మేరకు నగరి మండలం ఓజీ కుప్పం, నిండ్ర మండలం మిట్టకండ్రిగ ఎస్టీ కాలనీ, విజయపురం మండలం కాళికాపురం గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేసి అందులో ఉంటున్న వారి వివరాలు, వాహనాల రికార్డులను పరిశీలించారు. యువతకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరి, నిండ్ర, విజయపురం ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అనుబంధ శ్రీదేవి, భూ దేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వ్రతంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని ద ర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రత్యే క ప్రార్థనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముగిసిన రెసిడెన్షియల్ ఖో–ఖో శిక్షణ శిబిరం చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నెల రోజుల రెసిడెన్షియల్ ఖో–ఖో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది బాలబాలికలు శిక్షణ పొందారు. మెసానికల్ మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్ భాస్కర్, జిల్లా ఖో–ఖో అసోసియేషన్ సెక్రటరీ బాలాజి, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కనుమరుగైన ఎడ్ల బండ్లు
పెద్దపంజాణి: ఒకప్పుడు పల్లెల్లో ఎడ్ల బండ్లు జీవన విధానంలో విడదీయరాని భాగంగా ఉండేవి. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి, ప్రయాణాలకు, వివాహాలు వంటి శుభకార్యాలకు ఎడ్ల బండ్లనే ఉపయోగించేవారు. వాటిని రవాణా సాధనాలు మా త్రమే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. సంక్రాంతి పండుగల సందర్భంగా నిర్వహించే ఎడ్ల బండ్ల పోటీలు, ఊరేగింపులు గ్రామీణ జీవితంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు కూడా చాలా చోట్ల తగ్గుముఖం పట్టాయి. నేడు ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, లారీలు, మోటారు వాహనాల రాకతో ఎడ్ల బండ్ల వినియోగం క్రమంగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు కనిపించే ఎడ్ల బండ్లు నేడు అరుదుగా దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరగడం, సమయం ఆదా కావడం, తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తి చేయగలగడం తదితర కారణాలతో రైతులు ఆధునిక పరికరాలు, వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎడ్ల బండ్లకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఇప్పుడు వృద్ధ రైతులు ఎడ్ల బండ్లతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎడ్ల బండి తమ జీవితంలో ఒక భాగమని, ఇప్పుడు పిల్లలు వాటిని దగ్గరగా కూడా చూడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ వారసత్వానికి ప్రతీకలైన ఎడ్ల బండ్లను సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ఎడ్ల బండ్ల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని సంస్కృతి ప్రేమికులు కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్ద కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 92,010 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,346 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
ఇసుక లారీ సీజ్
నిండ్ర (నగరి) : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు నిండ్ర ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ నగరి– ఊత్తుకోట రోడ్డులోని ఒరూరుపేట గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. నగరి నుంచి ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఆపామన్నారు. పోలీసులను చూసిన డ్రైవర్, మరొక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. లారీలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి సీజ్ చేశామన్నారు. -
వేరుశనగపైనే ఆశలు!
పలమనేరు: పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఏడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 14,388 వేల హెక్టార్లు. గతేడాది సకాలంలో వర్షాలు కురవలేదు. దీనికితోడు ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలతోపాటు అన్నదాత సుఖీభవ సాయాన్ని సకాలంలో అందజేయలేదు. దీంతో పది శాతం కూడా సాగు కాలేదు. ఈ దఫా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు పొలాలను దుక్కులు చేసుకున్నారు. చాలామంది ఇంకా దుక్కులు చేసుకోవాల్సి ఉంది. అంతేగాక రైతులు వేరుశనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో 40 శాతం సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేయనున్నట్టు స్థానిక ఏడీ గీతాకుమారి తెలిపారు. గతంలో కదిరి–6, నారాయణి రకాలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా విత్తనాలు 5,660 క్వింటాళ్ల పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో పలమనేరు మండలానికి 720 క్వింటాళ్లు, బైరెడ్డిపల్లికి 1160, వీకోటకు 1290, రామకుప్పం 1410, శాంతిపురం 1050, కుప్పం 1020, గుడుపల్లి 4630 క్వింటాళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. బస్తా (30 కేజీలు) పూర్తి ధర రూ.3060 కాగా 40 శాతం సబ్సిడీ రూ.1224 పోనూ రైతు రూ.1.836 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే ఆయా మండలాల్లోని ట్రైబల్స్ ఉండే ఏరియాల్లో 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు విత్తన కాయలు స్థానిక గోడౌన్లకు చేరలేదు. ఎప్పుడు పంపిణీ చేస్తారో స్పష్టత లేదు. జిల్లాలోనే వేరుశనగ సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతం పలమనేరు. ఇక్కడ మెట్టభూములు ఎక్కువగా ఉండడం, ఇవి పూర్తిగా వర్షాధారితం కావడంతో రైతులు ఖరీఫ్లో వేరుశనగను ఎక్కువగా సాగు చేస్తుంటారు. గతేడాది అదునులో వర్షాలు కురవకపోవడంతో సాధారణ వేరుశనగ విస్తీర్ణంలో పదిశాతం కూడా సాగు కాలేదు. ఈదఫానైనా వేరుశనగ ఆదుకుంటుందా అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడికి తప్పని కష్టాలు... ఎకరా పొలంలో వేరుశనగ సాగు చేయాలంటే ఇప్పుడు పెరిగిన ధరలతో రూ.25 వేలు ఉండాల్సిందే. ఎరువులు, విత్తనాలు, కూలీలు, దున్నకానికి ట్రాక్టర్ ధరలు భారీగా పెరిగాయి. అప్పులు చేసి వేరుశనగను సాగు చేసినా సకాలంలో వర్షాలు కురుస్తాయనే నమ్మకం లేదు. ఆఖరుకు పంట చేతికొచ్చేదాకా రైతులకు దీనిపై గ్యారెంటీ లేదు. -
పాతుకుపోయారు!
సాక్షి టాస్క్ఫోర్స్: కాణిపాకం వరసిద్ధుడి సన్నిధిలో ప్రభుత్వ నిబంధనలు, దేవాదాయ శాఖ మార్గదర్శకాలు పాటించడం లేదు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ టికెట్ల విక్రయాల గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. వీటి వెనుక ఉన్న బలమేంటి? ఆ శక్తి ఎవరు అన్న ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నా యి. బదిలీలు, అంతర్గత బదిలీలు సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవా అన్న చర్చ ఆలయ వర్గాల్లోనూ నడుస్తోంది. నిబంధనలు ఒకలా.. అమలు మరోలా.. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులను మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర సిబ్బందికి కూడా అంతర్గత బదిలీలు చేస్తూ ఒకే విభాగంలో ఎక్కువకాలం ఉండకుండా చూడాలి. కాణిపాకంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఉద్యోగులు సంవత్సరాలుగా అదే విభాగాల్లో కొనసాగుతున్నారని పలువురు ఉద్యోగులు, ఉభయదారులు, కూటమిలోని ఒక వర్గం నేతలు మండిపడుతున్నారు. రిటైర్డ్ అయినా రిలీవ్ కాని ఉద్యోగి? ఒక ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసినప్పటికీ కార్యాలయ పరిసరాల్లో చురుగ్గా కనిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సమావేశాలకు కూడా హాజరైనట్లు సమాచారం. అధికారిక బాధ్యతలు లేకపోయినా కార్యాలయ వ్యవహారాల్లో ఆయన జోక్యం కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలోని కుర్చీల్లో అతుక్కుపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై కూటమికి చెందిన ఒక వర్గం నేతలు, ఉభయదారులు, ఉద్యోగులు భగ్గుమంటున్నారు. టికెట్ల విక్రయంలో గోల్మాల్..? ఇటీవల ఆన్లైన్ టికెట్ల విక్రయాలకు సంబంధించిన అవకతవకలు బట్టబయలయ్యాయి. ఈ విషయంపై ఒక ఉన్నతాధికారి సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వాస్తవాలు బట్టబయలు కావడంతో సిబ్బందిపై వేటు వేసినట్టు సమాచారం. ఈ బాగోతాన్ని ఆ ఉన్నతాధికారి పసిగట్టేంత వరకు సంబంధిత ఏఈవోలు, పర్యవేక్షకులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే బాధ్యతలో ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల వ్యవస్థలో పట్టు పెరిగి, పర్యవేక్షణ బలహీనపడే ప్రమాదం ఉందని పలువురు ఉద్యోగులు, ఉభయదారులు అభిప్రాయపడుతున్నారు. -
స్కానింగ్.. కన్నింగ్!
ఒకప్పుడు అమ్మాయి పుడితే ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందనేవారు. అపురూపంగా చూసుకునేవారు. కన్యాదానం చేయడం ద్వారా పుణ్యం పొందవచ్చని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అమ్మాయిలను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఈ క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించినా కొంతమంది అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. కాణిపాకం/బంగారుపాళ్యం: ‘కూతురు పుడితే వద్దు.. అబ్బాయి ముద్దు అన్న మధ్యతరగతి వర్గాల ప్రజల కోరికను కొందరు అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు. తల్లి గర్భంలోని పిండాన్ని చిది మేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ లింగ నిర్ధారణ–అబార్షన్ల దందాను విస్తరిస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఒకచోట స్కానింగ్, మరోచోట గర్భస్రావం, ఇంకోచోట మందుల సరఫరా, మరొకచోట మధ్యవర్తుల ద్వారా గర్భిణుల రవాణా... ఇలా మొత్తం వ్యవస్థ ఒక గొలుసుకట్టులా పనిచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయపడిన బండారం.. బంగారుపాళ్యంలో శనివారం వెలుగుచూసిన అక్రమ స్కానింగ్ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టించింది. దీని వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటపడింది ఒక్క ఘటన మాత్రమేనని, వాస్తవానికి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మధ్యవర్తులు, ప్రైవేట్ క్లినిక్లు, మెడికల్ షాపులు, స్కానింగ్ కేంద్రాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలమనేరు, కాణిపాకంలోనూ అక్రమ స్కానింగ్..? బంగారుపాళ్యం ఘటన తర్వాత కాణిపాకం ప్రాంతంలోనూ అక్రమ స్కానింగ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పలమనేరు పారిశ్రామిక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ స్కానింగ్ కేంద్రం పనిచేస్తోందన్న ఫిర్యాదులు అధికారులకు చేరినట్లు సమాచారం. అబార్షన్ కిట్ల విక్రయాలపై ప్రశ్నలు చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడి వీధిలోని ఓ మెడికల్ షాపులో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కిట్లు బహిరంగంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వైద్యుల సలహా, ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఇవ్వాల్సిన మందులను కొందరికి నేరుగా ఇస్తున్నట్టు సమాచారం. ఒక్కో కిట్ను రూ.2 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలితే.. బంగారుపాళ్యంలో పట్టుబడ్డ ముఠా సభ్యులు గర్భిణులను ముందుగా రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తారు. ఆడశిశువు అని తేలితే మధ్యవర్తులు రంగంలోకి దిగుతారు. కుటుంబ సభ్యులను ఒప్పించి గర్భస్రావం చేయించేందుకు మార్గం చూపిస్తారు. ఇందుకోసం పలమనేరు, తిరుపతిలోని గైనిక్ డాక్లర్లతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. గర్భం మూడు నెలల లోపు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేలు, నాలుగు నుంచి ఐదు నెలల వరకు రూ.20 వేలు, ఆరు నెలలు సమీపిస్తే రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల దాడులు ఎప్పుడు? బంగారుపాళ్యం ఘటనతో బయటపడిన అంశాలను ఒక కేసుగా పరిమితం చేయకుండా జిల్లావ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగారుపాళ్యం, పలమనేరు, కాణిపాకం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో పనిచేస్తున్న స్కానింగ్ కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్లు, మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరుతున్నాయి. ఆరోగ్య, పోలీసు, ఔషధ నియంత్రణ శాఖలతోపాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి అక్రమ లింగ నిర్ధారణ–గర్భస్రావాల నెట్వర్క్ను ఛేదించాలని మహిళా సంఘాలు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
రూ.పది కోట్ల భూమి కబ్జా!
పలమనేరు: బైరెడ్డిపల్లి మండలం బురిశెట్టిపల్లి వద్ద పలమనేరు–కుప్పం రహదారికి ఆనుకుని ఉన్న రూ.10 కోట్ల విలువజేసే డీకేటీ భూమిని కూటమి నేతల అండతో 20 మంది కబ్జా చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. బేలుపల్లి రెవెన్యూ లెక్క దాఖలాలో బురిశెట్టిపల్లి వద్ద 7.50 ఎకరాల డీకేటీ భూమి బురిశెట్టిపల్లికి చెందిన చాకల గంగప్ప ఆధీనంలో ఉంది. ఇందులో సర్వే నంబర్ 935/2ఏ, 2బీలలో 2.63 ఎకరాలు రికార్డుల్లో నమోదు కాగా మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. ఆయన మరణాంతరం ఈ భూమి ఆయన సోదరులైన చాకల వెంకటేశు, చాకల వెంకటక్రిష్టప్ప పేరు మీద రికార్డులు మారాయి. తన తండ్రికి కొడు కులు లేనందున కుమార్తెగా ఆ భూమికి హక్కు తనదేనని గంగప్ప కుమార్తె విమలమ్మ పట్టా మార్పుకోసం 2003 నుంచి అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉంది. ఇలా ఉండగా ఇటీవల అదే గ్రామానికి వెందిన బొంగోళ్ల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు 20 మంది కూటమి నేత అండతో ఆ భూమి తమదేనంటూ ఆక్రమించి జేసీబీలతో చదును చేశారు. బాధితురాలు విమలమ్మ మే 25న గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన బైరెడ్డిపల్లి తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఈ భూమిలో ఎవరి అనుభవం లేదని పిటిషనర్కు ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆక్రమణదారు లు తాము రెవెన్యూ అధికారులకు డబ్బులిచ్చామంటూ భూమిలోకి ప్రవేశించి గుంతలు తవ్వి మామిడి మొక్కలు నాటేశారు. దీనిపై బాధితురాలు మరో మారు జిల్లా అధికారులను కలిసింది. పూర్తి స్థాయిలో విచారించాలని కలెక్టర్ ఇక్కడి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆక్రమణదారులు మాత్రం అధికారముందనే సాకుతో భూమిని కబ్జా చేసేశారు. ఇలా ఉండగా బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా టీడీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం. వారి భూములనే అదే పార్టీ వారు ఆక్రమించడం కొసమెరుపు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు న్యాయం చేయాలని బాధితురాలు మీడియాను కలిసి విన్నవించింది. -
మామిడి రైతులపై కూటమి కక్ష
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నరకం చూపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఆయన ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు మామిడి సాగు చేపట్టారని తెలిపారు. ప్రతి ఏటా వారికి గిట్టుబాటు ధర అందక నష్టాల బారిన పడుతున్నారని, వారి ఆవేదన కూటమి పాలకులకు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలోనే రైతులు రోడ్డున పడితే స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మామిడి టన్ను రూ.27 వేలు పలికిందని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.5 వేలకు కూడా వ్యాపారులు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులపై జరుగుతున్న ఆర్థిక దాడి కాదా అని ప్రశ్నించారు. రైతులకు కులం, పార్టీ లేదని, భూమే వారి జీవనాధారమని పేర్కొన్నారు. అలాంటి రైతుల కడుపు కొట్టే ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోతాయన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే సింహాసనాలు కూలిపోతాయని హెచ్చరించారు. రైతు కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులను అష్టకష్టాలు పెట్టడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. రెండేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మొద్దని మామిడి రైతులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు. -
నేడు కలెక్టరేట్ వద్ద నిరసన
చిత్తూరు కార్పొరేషన్: డీఎస్సీ మోసాలపై సోమ వారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా యువత, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి అక్కడ నిరసన తెలుపనున్నట్టు వెల్లడించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమానికి యువత రీజనల్ కోఆర్డినేట్ హేమంత్రెడ్డితో పాటు జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు హాజరవుతారని, యువకులు, డీఎస్సీ అభ్యర్థులు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయపద్రం చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ విధానం తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూ రు, తిరుపతి, చిత్తూ రు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో 4,735 సర్వీసులకు రూ.1.19 కోట్లు, తిరుపతి జిల్లాలో 4,942 సర్వీసులకు రూ.2.29 కోట్లు, చిత్తూరు జిల్లాలో 4,193 సర్వీసులకు రూ.1.63 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 4,324 సర్వీసులకు రూ.1.68 కోట్లు, కడప జిల్లాలో 4,520 సర్వీసులకు రూ.1.98 కోట్లు, అనంతపురం జిల్లాలో 2,829 సర్వీసులకు రూ.1.41 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,432 సర్వీసులకు రూ.88.81 లక్షలు, కర్నూలు జిల్లాలో 3,243 సర్వీసులకు రూ.1.63 కోట్లు, నంద్యాల జిల్లాలో 3,278 సర్వీసులకు రూ.1.54 కోట్లతో సంస్థ రీచార్జ్ చేసింది. -
ఇంజిన్ వేడెక్కడంతో లారీ దగ్ధం
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– కుప్పం రహదారిలో బురిశెట్టిపల్లి క్రాస్ వద్ద ఓ లారీ శనివారం దగ్ధమైంది. లారీతోపాటు అందులోని స్టీల్ పౌడర్ పూర్తిగా కాలి బూడిదైంది. డ్రైవర్ కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. స్టీల్ పౌడర్తో లారీ తమిళనాడులోని తూత్తుకూడి నుంచి తాడిపత్రికి బయలుదేరింది.వి.కోట వద్ద కర్ణాటక పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకొని వస్తుండగా బురిశెట్టిపల్లి వద్ద లారీలోంచి వాసన రావడంతో డ్రైవర్ ఆపాడు. ఇంతలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా దగ్ధమైంది. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రూ.40 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆదినారాయణ తెలిపాడు. -
యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
బంగారుపాళ్యం/కాణిపాకం: కడుపులో ఉన్న శిశు వు ఆడామగా.. తెలుసుకోవాలన్న ప్రజల ఆసక్తిని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా రెచ్చిపోతున్నారు. శనివారం బంగారుపాళ్యం మండలం చంద్రశేఖర్పురంలో పోలీసులు దాడి చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకోవడంతో గతంలో పట్టుబడిన ముఠా లే మళ్లీ దందా చేస్తున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు గర్భిణులే టార్గెట్ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన గర్భిణు లు ఈ ముఠాలకు ప్రధాన ఆదాయ వనరుగా మా రినట్లు తెలుస్తోంది. మొదట్లో తమిళనాడు జిల్లాల నుంచి గర్భిణులను రప్పించి అక్రమ లింగ నిర్ధారణ చేయించేవారు. రానురాను కర్ణాటక, చిత్తూ రు జిల్లాకు చెందిన మహిళలను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో స్థానికంగా ఏజెంట్ల నెట్వర్క్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో గర్భిణుల వివరాలను సేకరించి ముఠాకు చేరవేయడం, తర్వాత వారిని ఒప్పించి పరీక్షలకు తీసుకెళుతు న్నట్టు సమాచారం. గత ఏడాది మే నెలలో చిత్తూరులోని లక్ష్మీనగర్లో అక్రమ లింగ నిర్ధారణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దాడులతో బట్టబయలు చేశారు. ఆ సమయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ముఠా సభ్యులు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తిరుపతి ఘటనతో బయటపడిన గుట్టు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఒక గర్భిణికి తిరుపతిలో స్కానింగ్ చేసి కడుపులో ఆడబిడ్డ ఉందని చెప్పడంతో ఆమె అబార్షన్కు సిద్ధపడింది. దీనిపై కుటుంబంలో తీవ్ర వివాదం చోటుచేసుకోవడంతో ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసు విచారణ ద్వారా తిరుపతిలో కొనసాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ నెట్వర్క్ బయటపడింది. ఇక గర్భిణి మృతికి కారకులైన ముఠాను తమిళనాడు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తాజాగా బంగారుపాళ్యంలో... బంగారుపాళ్యం మండలం చంద్రశేఖర్పురంలో వెలుగులోకి వచ్చిన ఘటనతో అదే ముఠా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు సూత్రధారులు ఎవరు? వారికి సహకరిస్తున్న వారు? స్కానింగ్ మిషన్లు ఎక్కడ కొనుగోలు చేశారు..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలేవీ? వైద్యశాఖ వర్గాల సమాచారం ప్రకారం గతంలో వెలుగులోకి వచ్చిన కేసుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వారిపై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అందువల్లే ముఠాలకు ధైర్యం వచ్చిందన్న విమర్శలు న్నాయి. అక్రమ లింగ నిర్ధారణ కేసుల్లో స్కానింగ్ చేసే వారిపైనే కాకుండా గర్భిణులను తీసుకొచ్చి న ఏజెంట్లు, సహకరించిన వారు, కుటుంబ సభ్యులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. పోలీసుల అదుపులో లింగనిర్ధారణ పరీక్షల ముఠా బంగారుపాళెం: అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ గర్భిణులు ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు శనివారం పట్టుకున్నారు. బంగారుపాళెం మండలంలోని మారుమూల గ్రామమైన చంద్రశేఖరపురంలో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు గత మూడు వారాలుగా చేస్తున్నట్టు సమాచారం. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారానికి ఒక్కసారి గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు శనివారం ఎస్ఆర్పురం నుంచి ఒకరు, తమిళనాడు నుంచి 12 మంది, కర్ణాటక నుంచి ఇద్దరు గర్భిణులు వచ్చినట్లు తెలిసింది. పోలీసులు నిఘా పెట్టి ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో గర్భిణి నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డాక్టర్లు, సిబ్బంది కొంతమంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా గర్భిణులను తీసుకువచ్చి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. -
ప్రతి ఓటునూ కాపాడుకోవాలి
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్క బీఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్ట దీపికా కల్యాణ మండపంలో శనివారం బూత్లెవల్ ఏజెంట్ల కు సర్పై అవగాహన కల్పించారు. ఇందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏలు బీఎల్వోలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లను నిశితంగా పరిశీలించాలన్నారు. కొత్త ఓటర్లను విధిగా చేర్పించాలన్నారు. ప్రతి ఓటూ మనకు ముఖ్యమన్నారు. ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పంచాయతీలోనూ మన పార్టీ అభ్యర్థిని గెలిపించి వైఎస్సార్ సీపీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వైఎస్.జగన్మోహన్రెడ్డికి అభిమానులు ఉన్నారని, జగనన్న విజయాన్ని చంద్రబాబు ఆపలేరని అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మిని గెలిపించే బాధ్యత బీఎల్ఏలు, కార్యకర్తలు, నాయకులపై ఉందని గుర్తు చేశారు. ఒకే పార్టీ, ఒకే వర్గం, ఒకే జెండా అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించి, దొంగ ఓట్లను నమోదు చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయం కోసం దైర్యంగా పోరాడండి. మీ వెనుక దన్నుగా మేము న్నామని కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఐకమత్యంగా పోరాటం చేద్దాం రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఐకమత్యంగా పోరాటం చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవున్నా సంక్షేమం, అభివృద్ధి ఏకోశానా లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహాలో కులం, మతం, ప్రాంతం, మద్యం, జాతి, డబ్బులేని ఎన్నికలు రావాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రతి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండి తమ పరిధిలోని వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించకుండా చూడాలన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. జగనన్న సైనికులను తయారు చేయండి ప్రతి గ్రామంలోనూ జగనన్న సైనికులను తయారు చేసే బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. పేదలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు జగనన్న పథకాలకు పేర్లు మార్చి తూతూమంత్రంగా అమలుచేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని ఆరోపించారు. -
చీకటి దందా
ఇసుకారులపై కేసు నమోదు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హిటాచీ, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. నష్టం మిగిల్చిన గాలీవాన జిల్లాలో శనివారం కురిసిన గాలీవాన రైతుల కు నష్టం మిగిల్చింది. చెట్ల నుంచి పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలిపోయాయి. ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా లోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డుల దందా కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైసలిస్తే చాలు ఇక్కడ ఎలాంటి రికార్డయినా మారిపోతుందని, అవసరమైతే రికార్డులను పూర్తిగా తొలగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక సిబ్బందితో పాటు ప్రైవేట్ దళారులు కుమ్మకై ్క రికార్డుల గదులను తమ అడ్డాగా మార్చుకున్నారు. రికార్డుల్లో అర్హులైన పేదల పేర్లను కొట్టేస్తూ, పాత తేదీలతో ఫోర్జరీ సంతకాలు సృష్టిస్తూ ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారు. వాటాలు వెళ్తుండడంతో అధికారులు మిన్నకుండిపోతున్నట్లు చర్చ నడుస్తోంది. పాత రికార్డులకు భలే డిమాండ్! కొత్త ఫైళ్ల కంటే, గతంలో ఉన్న పాత రికార్డుల మార్పిడికే ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పితే పాత భూ ము ల వివరాలు, యాజమాన్య హక్కులను రాత్రికి రాత్రే మార్చేస్తున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రికార్డుల అవసరాలున్న బాధితులను, కోర్టు కేసుల్లో ఉన్న రెవెన్యూ సమస్యల రికార్డులను అధికా రుల అనుమతి లేకుండానే బయటకు పంపుతున్నారు. ముడుపులను బట్టి రికార్డులను చేరవేస్తున్నారు. పైసలిస్తే ప్రభుత్వ భూములకూ స్కెచ్! చిత్తూరు శివారుతోపాటు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ భూములు, వంక పోరంబోకు భూములకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది సిబ్బంది డబ్బులు తీసుకుని ఇళ్ల పట్టాలకు సంబంధించిన రికార్డులను మార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన అధికారులతో సంతకాలు చేయించి ఇళ్ల స్థలాల రిజిస్టర్లలో లబ్ధిదారుల పేర్లను కొట్టేసి ఇతరుల పేర్లు ఎక్కిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ, అసైన్డ్ భూములకు పెరిగిన డిమాండ్ను కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఆసరాగా తీసుకుంటున్నారు. భూములకు రక్షణగా, సామాన్యుడి ఆస్తికి భరోసాగా ఉండే రికార్డులను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. నిరుపేదల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు. రికార్డుల మాయాజాలంపై ఉన్నతాధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టకపోవడంతో వల్లే రికార్డులు చేతులు మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డు గదుల్లో దళారులు వాస్తవానికి కార్యాలయంలోని రికార్డు గదిలోకి సెక్షన్ ఉద్యోగులు తప్ప మరెవరూ వెళ్లడానికి వీలు లేదు. ఆర్ఐలు, తహసీల్దార్లు, ఇతరత్రా అధికారులు, ఉద్యోగుల ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు రికార్డు గదుల్లోకి దూరిపోతున్నారు. తద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. తహసీల్ధార్ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేట్ వారికి ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. -
ప్రయాణికుల భద్రతే జన విశ్వాస్ లక్ష్యం
– ఎస్పీ తుషార్ డూడి నగరి : ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘‘జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు అనే వినూత్న కార్యక్రమాన్ని శనివారం నగరి పట్టణంలో శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, శిక్షణా ఐపీఎస్ తరుణ్పహ్వాతో కలిసి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య, క్యూర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను అతికించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్ర తే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ప్రతి ఆటోను ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి, అవసరమైనప్పుడు వివరాలను తక్షణమే గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆటో, డ్రైవర్, యజమాని, వాహనం వివరాలు తెలుస్తాయన్నారు. తద్వారా ప్రయాణికులకు భద్రత పెరగడంతో పాటు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ అందించడం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్, ఎంపీడీవో వాణి, సీఐ మల్లికార్జునరావ్ తదితరులు పాల్గొన్నారు. రేపు దగా డీఎస్సీపై నిరసన చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలోని నిరుద్యోగులను ప్రభుత్వం డీఎస్సీ పేరుతో దగా చేసిందని, ఇందుకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉదయం 9 గంటలకు నిరుద్యోగులతోపాటు డీఎస్సీ అభ్యర్థులందరూ అమూల్ డెయిరీ వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి యువత రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు, యువత హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. డెయిరీ నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకుని అక్కడ నిరసన తెలియజేస్తామని వివరించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నామన్నారు. డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
పుత్తూరు : మండలంలోని చిన్నరాజుకుప్పుం వద్ద ఈ నెల 28న టీడీపీ నాయకుడు వై.ప్రసాద్నాయుడి(56) పై హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ చిన్నరాజుకుప్పానికి చెందిన ప్రసాద్నాయుడు గత గురువా రం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో గంగాధరం ప్లాట్స్ వద్ద వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బైక్పై కూర్చున్నాడని తెలిపారు. అదే సమయంలో చిన్నరాజుకుప్పానికి చెందిన పి.రాజేంద్ర(38), పి.రవి(36), పి.సంతోష్(20), పి.నరేష్(39) ఆటోలో వచ్చి బైక్ను ఢీకొట్టారని తెలిపారు. కిందపడిపోయిన ప్రసాద్నాయుడిపై రాజేంద్ర కత్తితో దాడి చేశాడన్నా రు. మిగిలిన ముగ్గురు ప్రసాద్నాయుడిని పైకి లేవనీయకుండా కాళ్లతో తన్నుతూ నిన్ను చంపకుండా వదలిపెట్టమంటూ బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో బాధితుడి కేకలు విన్న సమీపంలోని వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితులు ఆటోలో పరారయ్యారని తెలిపారు. పాత కక్షలతోనే తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడి భార్య ఆర్.సరళాదేవి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులు శనివారం వడమాలపేట మండలం అబ్బికండ్రిగ గ్రామంలోని మామిడి తోట వద్ద ఉండగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
డీఈవో సేవలు మరువలేనివి
చిత్తూరు కలెక్టరేట్ : డీఈవో రాజేంద్రప్రసా ద్ సేవలు మరువలేనివని డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం డీఈవో ఉద్యో గ విరమణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఎంతో మంది ఆర్జేడీ స్థాయి అధికారులకే రాజేంద్రప్రసాద్ గురువుగా నిలిచారని పేర్కొన్నారు. జిల్లాలో అతితక్కువ కాలం డీఈవోగా పనిచేసినా విద్యాశాఖలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. సమగ్రశిక్ష శాఖ ఏపీ సీ వెంకటరమణ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ వివాదాల జోలికి పోకుండా విధులను నిర్వహించి అందరి మన్ననలు పొందారని తెలిపారు. అనంతరం డీఈఓ రాజేంద్రప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. డీవైఈవో ఇందిర, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వరరావు, సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, వయోజన విద్య శాఖ డీడీ ఆజాద్, సంఘం నాయకులు జీవీ రమణ, గంటామోహన్, మురళీమోహన్, డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్లు స్వర్ణకుమారి, రవిశేఖర్, గోపాల్, చైతన్య, రమేష్, కుమార్ పాల్గొన్నారు. ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య తవణంపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చారాల ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్బాబు కథనం మేరకు.. చారాల ఎస్సీ కాలనీకి చెందిన త్యాగరాజ్ కుమారుడు విక్కీ, కావ్య(24) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కావ్య పలుమార్లు ఒత్తిడి తెచ్చినా విక్కీ అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటిలో ఉరివేసుకుంది. స్థానికులు గమనించి తలుపులు పగులగొట్టి అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రేపు ఎస్ఐఆర్పై శిక్షణ
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు నియోజకవర్గంలోని బీఎల్ఏలకు సోమవారం ఎస్ఐఆర్పై శిక్షణ ఇస్తున్నట్టు వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు సంతపేటలోని ఆర్ఆర్గార్డెన్స్లో సమావేశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని బీఎల్ఏలు, డివిజన్, పంచాయతీ ఇన్చార్జిలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే శిక్షకులు వజ్రా భాస్కర్రెడ్డి, భరత్కుమార్రెడ్డి ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్రెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమ పనులను పార్టీ నగర అధ్యక్షుడు కేపీశ్రీధర్, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్, మాజీ కార్పొరేటర్ మధురెడ్డి, మండలాల బూత్ కమిటీ కన్వీనర్లు విజయ్, అరవింద్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. అందరూ కార్యక్రమానికి హాజరై అవగాహన పెంచుకోవాలని వివరించారు. -
పోలీసులకు శారీరక, మానసిక దృఢత్వం అవసరం
చిత్తూరు అర్బన్ : నిత్యం ఒత్తిళ్ల మధ్య పనిచేసే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరముందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆయన శనివారం చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో పునరుద్ధరించిన పోలీసు వ్యాయామశాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా లోని పోలీసులు ఈ వ్యాయామశాలను ఉపయోగించుకోవాలన్నారు. పోలీసులు ఫిట్గా ఉన్నప్పుడే పనులను సులభంగా పూర్తి చేస్తార ని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్రాజు, శిక్షణా ఐపీఎస్ తరుణ్ పహ్వ, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్కుమార్, ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. బావిలో పడి బాలుడి మృతి ఐరాల: మండలంలోని వీఎస్.అగ్రహారంలో శనివారం వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు పట్టణం శంకరాయగుట్టకు చెందిన ఖాదర్బాషా కుమారుడు షరీఫ్(16) వీఎస్.అగ్రహారంలో తమ బంధువుల ఇంటిలో పుట్టిన రోజు వేడుకులకు వచ్చాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన మామతో కలిసి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. మామ సమాచారం ఇవ్వడంతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాతాళభైరవి సాయంతో షరీఫ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని చిత్తూరులోని వారి నివాసానికి తరలించారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
విశ్వం విద్యాసంస్థలకు ప్రశంస
తిరుపతి అర్బన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ప్రశంసించారు. ఆయన శనివారం విశ్వం స్కూల్లో విశ్వం సైనిక్– నవోదయ 2026 బ్రోచర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకు లు, శాసీ్త్రయ బోధనా విధానం, సమగ్ర కోచింగ్ ద్వారానే ఈ స్థాయి విజయాలు సాధ్యమని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్, నవోదయ, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. విశ్వచందన్రెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. ఇసుకారులపై కేసు నమోదు తవణంపల్లె: మండలంలోని గోవిందరెడ్డిపల్లె సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి మూడు టిప్పర్లు, ఒక హిటాచీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పానికి చెందిన హరిప్రసాద్నాయుడు, శెట్టేరికి చెందిన బి.బాబు(43), వి.గిరి(31), ఎగువ రాగిమానుపెంటకు చెందిని ఆర్.మధునాయుడు(41), బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్కుమార్(31)పై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. హరిప్రసాద్ నాయుడుకు చెందిన మూడు టిప్పర్లు, ఒక హిటాచీని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
4న జిల్లా స్థాయి అండర్–15 చెస్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని వేపమాను వీధిలో ఉన్న స్కూల్ ఆఫ్ చెస్లో జూన్ 4వ తేదీన ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–15 చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఏసీసీడీఏ ప్రెసిడెంట్ ఎస్.ఆర్.బి. ప్రసాద్ తెలిపారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడా రు. 4వ తేదీ ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ టోర్నమెంట్లో చిత్తూరు జిల్లా కు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు జూన్ 13, 14 తేదీల్లో గుడివాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అండర్–15 క్రీడాకారులు తమ పేర్లను జూన్ 3వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేరుగా రాలేని వారు తమ పు ట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని వాట్సాప్ నంబర్ 9849313676కు పంపాలన్నారు. వివరాలకు 90004 75799లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో చెస్ అసోషియేషన్ సభ్యులు ఎస్.ఆర్.దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టం మిగిల్చిన గాలీవాన
బంగారుపాళెం : మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన గాలీవాన మామిడి రైతులకు తీరని నష్టం మిగి ల్చింది. ముఖ్యంగా రాగిమానుపెంట, వెలుతురుచేను, కీరమంద, బండ్లదొడ్డి తదితర గ్రామాల్లో మా మిడి తోటల్లో పెద్ద ఎత్తున కాయలు నేలరాలాయి. పంట చేతికి వచ్చే సమయంలో పెనుగాలులకు కాయ లు రాలిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. రాలిన మామిడి కాయలను శనివారం బంగారుపాళెం మామిడి మార్కెట్కు తీసుకువచ్చారు. వ్యాపారులు కిలో రూ.2లకు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆ మొత్తం తోటల్లో కాయలు ఏరేందుకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చులకు కూడా రావడంలేదని అంటున్నారు. ఈ ఏడాది మామిడికి మంచి ధర పలుకుతుందని ఆశలు పెట్టుకున్నామని, పెనుగాలులకు తీవ్రంగా నష్టపోయినట్టు ఆవే దన వ్యక్తంచేస్తున్నారు. నేలకూలిన విద్యుత్ స్తంభాలు చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో చిత్తూరు రూరల్ డివిజన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలీవానకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని ఈఈ సురేష్ తెలిపారు. కార్వేటినగరం సెక్షన్లో 12, ఎస్ఆర్పురంలో 6, వెదురుకుప్పంలో 10, ఆవులకొండలో 1 స్తంభం మొత్తం డివిజన్ పరిధిలో 29 స్తంభాలు కూలిపోయినట్టు పేర్కొన్నారు. అలాగే 6 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ట్రాన్స్కోకు రూ.2 లక్షల నష్టం వాటిందని తెలిపారు. సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జూన్లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. -
మాతా–శిశు మరణాల నివారణకు పక్కా ప్రణాళిక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మాతా–శిశు మరణాల నివారణకు అన్ని శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం మాతాశిశు మరణాలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, 11 శిశు మరణాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెఫరల్ కేసులను ఆలస్యం చేయకుండా ఉన్నత ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను సీ్త్ర వ్యాధి నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. సమస్యలు ఉన్న గర్భిణులను సమీప ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి తగిన వైద్యసేవలు అందించాలన్నారు. సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని, మూఢనమ్మకాలు, ముహూర్తాల పేరుతో అనవసర సిజేరియన్లు చేయరాదని స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం, వైద్య పర్యవేక్షణ, తగిన జాగ్రత్తలు పాటిస్తే శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి, ఎంసీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ హనుమంతరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, పీహెచ్సీల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న కారు
– నలుగురికి తీవ్ర గాయాలు గంగాధర నెల్లూరు : మండలంలోని జైన్ కర్మగారం సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పాలసముద్రం మండలం ఆముదాల గ్రామంలో జాతర జరిగింది. ఇందులో పాల్గొన్న మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ కర్మగారం సమీపంలో కారు అదుపుతప్పి చింత చెట్టును ఢీకొంది. కారులోని నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యా యి. మోహన్ నాయుడు, ఆయన సతీమణి వాణికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐరాల: మండలంలోని బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపుతప్పి ఇనుప సైన్ బోర్డును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. కాణిపాకం పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడకు చెందిన టీ.సుధ(38) కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని చూడడానికి సుధ శుక్రవారం ఉదయం బీ.హేమాద్రి అలియాస్ చంటి(22)తో కలిసి ద్విచక్ర వాహనంలో చిత్తూరు బయలుదేరారు. బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహ నం అదుపుతప్పి ఇనుప సైన్ బోర్డును బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. హేమాద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సుధను 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కూడా మృతి చెందింది. మృతుడి తండ్రి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎగువ పాలకూర దళితవాడలో విషాదం పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతదేహాలు ఇళ్లకు చేరుకోగానే ఎగువ పాలకూరు దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. మా ఇంటి దీపాలు ఆరిపోయాయి. మేం ఎవరి కోసం బతకాలి అంటూ హేమాద్రి తల్లిదండ్రులు శివాజీ, కమలమ్మ, సుధ భర్త మహేష్, కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరయ్యారు. వారిని చూసి అక్కడినున్న వారు కంటతడి పెట్టారు. హేమాద్రి, సుధ బంధువులు. శివాజీ, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు హేమాద్రి. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చేతికి వచ్చిన కొడుకు 22 ఏళ్లకే మృతిచెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దేవుడా మాకు ఎందుకు ఈ శిక్ష వేశావు.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చల్లించిపోయారు. సుధ (ఫైల్)హేమాద్రి (ఫైల్) -
వి.కోటలో గాలీవాన బీభత్సం
వి.కోట: మండలంలో శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు, ట్రాన్ఫార్మర్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపొయింది. స్థానికులు, విద్యుత్ అధికారులు, పంచాయతీ సిబ్బంది తక్షణం స్పందించి నెలకొరిగిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు పనులు చేపట్టారు. డీసీసీబీ పక్కన వీధిలోని ట్రాన్స్ఫార్మర్, ఎన్నో ఏళ్లనాటి భారీ వృక్షాలు నెలకొరిగాయి. కుప్పం– వి.కోట జాతీయ రహదారిలోని యునియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు కూలిపోయింది. చెట్టు పడడంతో కారు దెబ్బతినింది. గాలీవాన బీభత్సంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వడగండ్ల వాన కురవడంతో టమాట, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. -
● జిల్లాలో వంటగ్యాస్ కోసం వినియోగదారుల అవస్థలు ● బుక్ చేసి వారం రోజులైనా అందని సిలిండర్లు ● డీలర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు ● చిత్తూరు, కార్వేటినగరంలో ఎక్కువగా సమస్యలు
బండ కష్టాలు..! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో వంటగ్యాస్ సమస్య తీవ్రమైంది. సాధారణంగా గ్యాస్ బుక్ చేసిన రెండు రోజుల్లోనే సిలిండర్ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం వారం రోజులైనా అందడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు నగర పరిసరాలు, కార్వేటినగరం ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. సిలిండర్ బుక్ చేసిన వెంటనే ‘డెలివరీలో ఉంది’ అనే సందేశాలు వస్తున్నప్పటికీ, ఇంటి వద్దకు మాత్రం చేరడం లేదని మహిళలు చెబుతున్నారు. డీలర్లకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొన్నిసార్లు ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో చిన్నపిల్లలున్న కుటుంబాలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే త్వరగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు స్వయంగా ఏజెన్సీల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి చూసినా సరైన సమాధానం లభించడం లేదని అంటున్నారు. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కట్టెల పొయ్యిల వద్ద వంట చేయడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, గ్యాస్ ఏజెన్సీలు, అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు డీలర్ల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వినియోగదారులకు సమయానికి గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేరుశనగ విత్తనాలు అందేదెన్నడో..? కాణిపాకం: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు ఏప్రిల్ నెలలోనే 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినప్పటికీ సరఫరాపై స్పష్టత లేదు. దీంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట కావడంతో రైతులు ముందుగానే విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాల సరఫరాపై సీడ్స్ సంస్థ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతుల్లో అనిశ్చితి నెలకొంది. అధికార వర్గాలు మాత్రం కాయలు రావడానికి ఇంకో పదిరోజుల సమయం పడుతుందని చెబుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత విత్తనాలు అందితే సాగు ఆలస్యమై ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందనే భయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పొలాలను దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, విత్తనాలు లేక ముందడుగు వేయలేకపోతున్నారు. మార్కెట్లో ప్రైవేట్ విత్తనాల ధరలు అధికంగా ఉండడంతో ప్రభుత్వ సరఫరాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
వివాదాల స్టేషన్..!
ఆ స్మగ్లర్కు సరుకు ఇవ్వడానికే..? చిత్తూరులోని అధికార పార్టీకి చెందిన ఒక మహిళా గంజాయి స్మగ్లర్కు సరుకును అప్పగించడానికే ఈ ఇద్దరు యువకులు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గంజాయి విక్రయించడంలో ఆరితేరి, సెటిల్మెంట్ల వైపు అడుగులు వేస్తున్న ఆ మహిళ భారీగా గంజాయిని చిత్తూరుకు తెప్పించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. కళాశాల యువకులను తన చేతుల్లో పెట్టుకుని ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్మడం, బస్టాండు, రైల్వే స్టేషన్లకు గంజాయిని సరఫరా చేయడం ఆమె ప్రవృత్తి. పైకి మాత్రం టీడీపీ నేతలకు ఫ్లెక్సీలు కట్టడం, మహిళా నాయకురాలిగా చెలామణి అవుతోంది. ఆ మహిళ గుట్టును ఖాకీలు రట్టు చేస్తారో? లేదో చూడాలి. చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇక్కడ పనిచేసే అధికారుల్లో కొందరు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం.. మరికొందరు విధుల్లో నిర్లక్ష్యం చూపడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక గంజాయి స్మగ్లర్ తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ డూడీ సీరియస్గా తీసుకున్నారు. ‘హద్దు’లు దాటి.. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేయడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇటీవల యాదమరికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో గంజాయి నిర్మూలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రాంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో ఈ మార్గంలో గంజాయి విచ్ఛలవిడిగా దిగుమతి అవుతోంది. పైగా ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి బెంగళూరుకు చిత్తూరు, పలమనేరు, కుప్పం మీదుగానే తరలిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి విక్రయాలపై చిన్నపాటి సమాచారం వచ్చినా అప్రమత్తమయ్యే పోలీసులు చిత్తూరులో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకోవడంలో ఏమరపాటుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిత్తూరు వన్టౌన్ నుంచి గంజాయి స్మగ్లర్ పరారీ -
పలమనేరు వాసికి ఏఎస్పీగా పదోన్నతి
పలమనేరు: పలమనేరు పట్టణానికి చెందిన మహేష్ అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. 2016 బ్యాచ్కు చెందిన మహేష్ ప్రస్తుతం హిందూపూర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇది వరకు కర్నూలు, నరసారావుపేట, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. పలు కేసులను ఛేదించి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపొంది హిందూపురంలోనే నియమితులయ్యారు. ఆయనను పట్టణానికి చెందిన పలువురు అధికారులు, పలమనేరు రచయితల సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. నిరాశ పరుస్తున్న మామిడి ధరలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని మామిడి కాయల మార్కెట్లో శుక్రవారం ఉన్న మామిడి ధరలు రైతులను నిరాశపరిచాయి. తోతాపురి (టేబుల్ రకం) కిలో రూ.14 నుంచి రూ.15 వరకు పలుకుతోంది. పులేరా రూ.8 నుంచి రూ.15, బేనీషా రూ.20 నుంచి రూ.30, కాదర్ రూ.20 నుంచి రూ.30, కాలేపాడు రూ.20 నుంచి రూ.30, ఇమామ్ పసంద్ రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముడుతున్నట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. -
బెల్టు తీసేదెన్నడో..?
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలంలో ప్రతి గ్రామంలోనూ సందుకో మద్యం బెల్టు షాపు ఉంది. మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండడంతో పల్లెల్లో ప్రశాంతత కరువవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఉదయం మొదలైన అమ్మకాలు అర్ధరాత్రి దాటినా ఆగడం లేదని చెబుతున్నారు. కూలి పనికి వెళ్లే యువకుల నుంచి మధ్య వయస్కుల వరకు మద్యం బారిన పడుతుండడంతో కుటుంబాలు కుదేలవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మింద గ్రామంలో మూడు బెల్టు షాపులపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. తాళంబేడు క్రాస్లో రెండు షాపులపై ఇటీవల చర్యలు తీసుకున్నారు. దాడులు జరిగిన చోట్లే మరిన్ని షాపులు తెరుచుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొందరు బెల్టుషాపుల నిర్వాహకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్భయంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలన్నీ మద్యం కేంద్రాలే.. తుమ్మిందతో పాటు తాళంబేడు క్రాస్, బంగారెడ్డిపల్లి, గువ్వకల్లు, నల్లవెంకటయ్యగారిపల్లి, ముత్తుకూరు, తాళంబేడు, శెట్టిగారిపల్లి తదితర గ్రామాల్లో బెల్టుషాపులు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. పూతలపట్టు, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో చిన్న చిన్న గుడిసెలు, కిరాణా దుకాణాలు, టీ షాపుల వెనుక భాగాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్ల నుంచే బెల్టు వ్యాపారం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. యువత భవిష్యత్తు అంధకారంలోకి.. సాయంత్రం అయ్యిందంటే చాలామంది యువకులు బెల్టుషాపుల వద్ద గుమిగూడుతున్న దృశ్యాలు గ్రామాల్లో సాధారణంగా మారిపోయాయి. రోజువారీ కూలి పనులు చేసుకునే వారు తమ సంపాదనలో అధిక మొత్తం మద్యానికే ఖర్చు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తు లో గొడవలు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కొన్నిచోట్ల మహిళలు రాత్రిళ్లు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. గ్రామాల్లో బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో కిరాణా షాపులేమోగాని బెల్టు షాపులు మాత్రం రాత్రంతా తెరిచే ఉంటున్నాయి. అక్రమార్కులు అధికారం అండతో యథేచ్చగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అధికారిక మద్యం దుకాణాల కంటే బెల్టుషాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు -
పోలీసులకు చిక్కిన దొంగ..?
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని నాయుడు బిల్డింగ్స్లో జరిగిన చోరీ కేసులో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం కిరణ్ అనే వ్యక్తి ఇంటి తలుపులు పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తి 200 గ్రాముల బంగారు, 3.500 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. గొర్రెల దొంగకు దేహశుద్ధి కుప్పం రూరల్ : కుప్పం మండలం మల్లానూరు గ్రామస్తులు శుక్రవారం గొర్రెల దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. కుప్పం మండలం మల్లానూరు గ్రామం చుట్టు పక్కల ఇటీవల పదుల సంఖ్యంలో గొర్రెలు మాయమవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారు బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలు మల్లానూరు పీహెచ్సీ ఎదురుగా గొర్రెలను అపహరిస్తుండగా గ్రామస్తులు గమనించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఒక దొంగ తప్పించుకున్నాడు. మరో దొంగ మురుగేష్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 74,569 మంది స్వామిని దర్శించుకున్నారు. 46,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 20 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఎస్వీయూలో నకిలీ రసీదుల కుంభకోణం తిరుపతి క్రైమ్: ఎస్వీయూలో పరీక్ష ఫీజుల వ్యవహారంలో నకిలీ రసీదుల కుంభకోణం వెలుగుచూసింది. ఈ ఘటనలో రూ.65,686 మేర అవకతవకలు జరిగినట్లు తేలింది. ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ పి.రామకృష్ణ మాట్లాడుతూ ఎస్వీయూ రిజిస్ట్రార్ ఎం.భూపతినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 2026 జనవరి నుంచి మే 27 వరకు పరీక్షా సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన ఫీజుల విషయంలో మొత్తం 27 నకిలీ రసీదులు సృష్టించినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు. ఎంకై ్వరీ కౌంటర్లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని, జియాలజీ విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న శంకర్కు పరోక్షంగా సంబంధం ఉన్నట్లు తెలిపారు. -
సారా రహిత జిల్లాయే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాను నాటుసారా రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సారా తయారీ, విక్రయాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 42 గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడంతో పాటు, ఈ వ్యాపారాన్ని మానుకున్న 119 మంది సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇందుకు బాధ్యత తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. ఎక్సైజ్ అధికారులు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ వారికి ఉపాధి మార్గాలు దొరికేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారి ఎస్.శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు ఎం.రవి, పురుషోత్తం, శిరీషదేవి, కె.సురేష్రెడ్డి, ఎ.నాగరాజు పాల్గొన్నారు. -
మహానాడు కాదు.. దగానాడు
పాలసముద్రం : ప్రభుత్వం ప్రజల సొమ్ముతో మహానాడును ఆర్భాటంగా నిర్వహించిందని, అది ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశించిన దగానాడు అని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఆయన శుక్రవారం పాలసముద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిర్వహించిన మహానాడుకు ప్రజల సొమ్మును వినియోగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే మొహం చాటేశారని పేర్కొన్నారు. సభలో నాయకులను కూర్చోబెట్టడానికి రికార్డింగ్ డ్యాన్సులు చేయించారని విమర్శించారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పకుండా వైఎస్సార్ సీపీపై బురదజల్లడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు భృతి గురించి చెప్పలేదన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నెలలోనే నాలుగైదు సార్లు పెట్రోల్ ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని పేర్కొన్నారు. రెడ్బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మహానాడు వేదికగా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే దళితులకు దగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే హక్కు, అర్హత టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రాతినిధ్యం మహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే అప్పు చెల్లించలేదని ఓ దళిత మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమ మంత్రివర్గంలో ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.60 వేల కోట్ల సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నాడు. టీడీపీ నాయకులు చంద్రబాబు మెప్పుకోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్బలగన్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మదివానన్, ఎంపీటీసీ గోవిందరాజ్, మాజీ సర్పంచ్ అయ్యప్ప, నాయకులు ఆనందన్, గోపాల్, మాజీ మండల కన్వీనర్ సుందరరాజు, మనోహర్, ప్రకాష్, ప్రేమ్కుమార్, అరుల్, ధనపాల్, చల్లయ్య పాల్గొన్నారు. -
వరసిద్ధుడి క్షేత్రంలో ‘రవితేజం’..!
సాక్షి టాస్క్ఫోర్స్: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఓ ద్వితీయశ్రేణి అధికారి పెత్తనం పెచ్చుమీరింది. ఉన్నతాధికారులను కాదని అన్నింటా రవితేజమై ప్రకాశిస్తున్నారు. ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ అసలు నిర్ణయాధికారం మాత్రం ఆ అధికారిదేనన్న అభిప్రాయం ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి అదే స్థానంలో కొనసాగుతున్న ఆ అధికారి ఆలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల నియామకాలు, అంతర్గత బదిలీలు, కీలక బాధ్యతల కేటాయింపు, టెండర్లు, దర్శనాల ప్రాధాన్యతలు, కాంట్రాక్టుల ఎంపిక.. ఇలా ఏ ఫైలు అయినా అతని అనుమతి లేకుండా ముందుకు కదలదన్న చర్చ సాగుతోంది. సిఫార్సులు లేకుండా పనులు దక్కడం కష్టమైందని కొంతమంది కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు సమాచారం. ఆలయంలోని చిన్నపాటి సరఫరాల నుంచి పెద్ద కాంట్రాక్టుల వరకు ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షకులకు ‘పవర్ కట్’..? ఆలయంలో విధులు నిర్వహించే పర్యవేక్షకుల అధికారాలను తగ్గించారని కొందరు వాపోతున్నారు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఆ అధికారినే సంప్రదించాల్సిన పరి స్థితి ఏర్పడిందని మదనపడుతున్నా రు. దీంతో స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నామని అంటున్నారు. తద్వారా పరిపాలనలో సమన్వయం దెబ్బతింటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో ఉన్న ఓ ఉన్నతాధికారిని నామమాత్రంగా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ వేడి ఆలయ వ్యవహారాల్లో కూటమిలోని ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా పాతుకు పోయిన ఆ అధికారిని వెంటనే వేరేచోటికి బదిలీ చేయాలని కొంతమంది నేతలు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆలయ పరిపాలనలో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమిలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి జిల్లాలో పలువురు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 శాతం కోటాలో జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందారు. వారిలో రాధిక ప్రియా, భువనేశ్వరి, వెంకటరమణ నాయక్, రియాజ్లు ఉన్నారు. వీరిని నాన్టీచింగ్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. ప్రమోషన్ ఇచ్చిన ఇంటర్ బోర్డు కమిషనర్ రంజిత్బాషా, ఆర్జేడీ సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పెత్తనం చెలాయిస్తున్న ద్వితీయశ్రేణి అధికారి? బదిలీల్లోనూ హవా..? ఆలయ సిబ్బందిలో అంతర్గత బదిలీలు, స్థానచలనాల్లో కూడా ఆ అధికారిదే చివరి మాటగా మారిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలంగా పనిచేసే వారిని కీలక స్థానాల్లో ఉంచుతూ, విభేదించే వారిని ప్రాధాన్యతలేని విభాగాలకు పంపిస్తున్నారనే అసంతృప్తి పెరుగుతోంది. ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు మంచి పోస్టింగులు, దర్శన విభాగాలు, ఆదాయ వనరులు ఉన్న బాధ్యతలు అప్పగిస్తున్నారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. -
వినాయకుడి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశా రు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’ చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రత కోసం ‘‘ఆపరేషన్ దండాయన’’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా త్వరితగతిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. పునరావృత నేరస్తులపై ‘‘సెక్సువల్ అఫెండర్ షీట్లు‘ తెరుస్తామని, జియో ట్యాగింగ్, నైబర్హుడ్ వాచ్ విధానాల ద్వారా నిఘా పెడతామని చెప్పారు. ఇప్పటికే 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. టెట్పై పార్లమెంట్లో సవరణ చేయాలి చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ ఉపాధ్యాయలకు టెట్ మినహాయింపుపై పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడెంట్ రెడ్డిశేఖర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లు మూడేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం టెట్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని ఇప్పుడు విస్మరించిందని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళనలో పడ్డారని వెల్లడించారు. పిల్లలకు పాఠాలు చెప్పాలా? లేక పరీక్షకు సిద్ధమవ్వాలా అన్న సందిగ్ధంలో పడ్డారని తెలిపారు. అంతేగాక టెట్ ఉత్తీర్ణులు కాని వారికి పదోన్నతులు లభించవని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో చట్ట సవరణ చేయడానికి చొరవ చూపాలని కోరారు. -
ఆదాయవనరుగా డీఎస్సీ
భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీపై తొలి సంతకం పెటిటినా ఆ ప్రక్రియను ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మహానాడులో వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం కంటే డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇప్పటికే ఉన్న స్పోర్ట్స్ కోటాను కాదని అదనపు క్రీడలను అందులో చేర్చి అర్హత లేని వారికి పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. డీఎస్సీ కోసం 3.5 లక్షల మంది పరీక్షలు రాసినా తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసుకునేలా మొత్తం ప్రక్రియను నడిపించారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టే బాధ్యతను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగానికి అప్పగించారన్నారు. -
దగా డీఎస్సీ
●మెగా డీఎస్సీ పేరుతో కుచ్చుటోపీ చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం డీఎస్సీపై తొలి సంతకం అంటూ అంతులేని అక్రమాలకు పాల్పడిందని, మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచిందని వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజకవర్గ అధ్యక్షుడు సద్దాం మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని దర్గా సర్కిల్లో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శశిదీప్, సద్దాం మాట్లాడుతూ.. ఇది మెగా డీఎస్సీ కాదని, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన దగా డీఎస్సీ అని మండిపడ్డారు. డీఎస్సీ–2025లో మెరిట్ జాబితాను విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆడియోలు, ఆరోపణలు స్పష్టంగా వినబడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. సీఎం బంధువునని చెప్పుకుంటూ పోస్టులను సంతలో సరుకులా అమ్మే సిన మాస్టర్ మైండ్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చినబాబు (లోకేష్) వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులా?.. అక్రమాలపై సోషల్ మీడియాలో ప్రశ్నించినా, పత్రికల్లో రాసినా క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశా ఖ బెదిరించడం అత్యంత హేయమన్నారు. ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, కృష్ణా జిల్లా టాపర్ వివరాలను రాత్రికి రాత్రే డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం లెక్కచేయలేదని ధ్వజమెత్తారు. డీఎస్సీ బాధితుడు ఏకాంబరం మాట్లాడుతూ మైదానంలో అడుగు పెట్టని వాళ్లకు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు నాలుగింట మూడొంతుల పోస్టులను భారీగా అమ్ముకున్నట్టు తెలుస్తోందని తెలిపారు. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వకుండా తొక్కి పెడుతున్నారని చెప్పారు. ఈ స్కామ్పై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు జెస్టిన్, సంతోష్, ప్రతాప్, నిర్మల, అంజలి, అమ్ము, అజిత్ పాల్గొన్నారు. ఎస్ఎంఎస్లతో మాయాజాలం ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకై నా తుది ఫలితాల తర్వాత పూర్తి మెరిట్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టడం ఆనవాయితీ. ఈ డీఎస్సీలో లిస్టును మాయం చేశారు. 3.36 లక్షల మంది పరీక్ష రాశారు. ఎంపికయ్యావు అంటూ కొందరికి సీక్రెట్గా ఎస్ఎంఎస్లు పంపారు. సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మార్కులు మార్చేయడం, డేటా డిలీట్ చేయడం చూస్తుంటే లోపల ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అర్థమవుతోంది. నిరుద్యోగుల జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుంటారా? బాధితులకు కచ్చితంగా న్యాయం చేసి తీరాలి. – శశిదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయరా..? కూటమి ప్రభుత్వ అవినీతి వల్ల దాదాపు 4 వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. దీనిపై 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చేసినది దుర్మార్గమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. అర్హులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. కేసులు విత్డ్రా చేసుకోవాలని అభ్యర్థులను బెదిరిస్తున్నారు. కోర్టులంటే కూడా ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? – ప్రతాప్, విద్యార్థి సంఘ నాయకుడు రూ.15 లక్షలు ఇస్తేనే ఉద్యోగమా? కష్టానికి విలువ లేదా..? ఎవరితోనూ చెప్పొద్దు.. సీక్రెట్గా రండి అంటూ ఉపాధ్యాయ పోస్టులను రూ.15 లక్షలకు బేరసారాలు చేసుకున్న ఆడియోలు రాష్ట్రమంతా వినబడుతున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు కట్టి సంతలో సరుకులా అమ్మేస్తుంటే, కోచింగ్ సెంటర్లలో రూ.వేలు ఖర్చు పెట్టి చదువుకున్న పేద నిరుద్యోగులు ఏమైపోవాలి? సీఎం బంధువులమని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ మాస్టర్ మైండ్స్ని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. – జెస్టిన్, విద్యార్థి సంఘ నాయకుడుప్రశ్నపత్రాల తయారీదారుడే టాపర్ అవ్వడం విచిత్రం! ఎస్సీఈఆర్టీ డిజిటల్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ, ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తే ఈ పరీక్షలో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2 టీజీటీలో ర్యాంకర్గా నిలవడం అత్యంత దారుణం. నిబంధనలను ఉల్లంఘించి పరీక్ష రాసే వ్యక్తికి ఆ బాధ్యతలు ఎలా ఇచ్చారు? అవినీతి బయటపడగానే రాత్రికి రాత్రే ఆ డేటాను ఎందుకు డిలీట్ చేశారు? పారదర్శకత అంటే ఇదేనా చంద్రబాబు గారూ? – సంతోష్, విద్యార్థి సంఘ నాయకుడు -
కలెక్టర్ నిబంధనలు అమలు చేస్తారా ?
2024లో సెక్టోరల్ అధికారులుగా పనిచేస్తూ డెప్యుటేషన్ ముగియడంతో మాతృసంస్థకు వెళ్లారు. అప్పట్లో నిబంధనల ప్రకారం వారు గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనే పోస్టింగ్స్ ఇచ్చి పారదర్శకత పాటించారు. ఇప్పుడు ముగ్గురు సెక్టోరల్ అధికారుల రీ ప్యాట్రేషన్ నియామకాల ఫైల్ కలెక్టర్కు పంపేలా చర్యలు చేపడుతున్నారు. రాజకీయ జోక్యంతో కలెక్టర్ను బురిడి కొట్టించేలా నివేదికలు తయారుచేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ పోస్టింగ్స్కు చెక్ పెడతారా? లేదా అని ఉపాధ్యాయ సంఘం నాయకు లు ఎదురు చూస్తున్నారు. -
పోస్టింగ్స్ మాయాజాలం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష శాఖ, విద్యా శాఖ కార్యాలయాల వేదికగా వింత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సెక్టోరల్ అధికారులుగా సేవలందిస్తూ డెప్యుటేషన్ గడువు ముగిసిన ముగ్గురు టీచర్లను రీ ప్యాట్రేషన్(గతంలో పనిచేసిన పాఠశాలకు) పంపే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిబంధనలను పక్కనబెట్టి తెరవెనుక కుతంత్రాలతో అనుకూలమైన చోట పోస్టింగ్స్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. స్పష్టమైన ఉత్తర్వులు ఇవే! సమగ్రశిక్ష శాఖలో డెప్యుటేషన్ ముగించుకుని తిరిగి మాతృసంస్థ (విద్యాశాఖ)కు వచ్చే టీచర్ల నియామకాలపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. ఆ అధికారి గతంలో ఏ పాఠశా ల నుంచి వచ్చారో ఆ పాఠశాలలో ఖాళీ ఉంటే అక్కడే పోస్టింగ్ ఇవ్వాలి. అక్కడ ఖాళీ లేకపోతే అదే మండలంలోని ఇతర పాఠశాలల్లో ఖాళీలను పరిశీలించాలి. మండలంలో సైతం ఖాళీలు లేకపోతే పక్క మండలంలో టీచర్లు గతంలో పనిచేసిన హెచ్ఆర్ఏ ప్రకారం నియామకాలు చేపట్టాలి. సమగ్రశిక్ష శాఖ, విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తూ వారిని పాత పాఠశాలలకు కాకుండా పట్టణ, హెచ్ఆర్ఏ ఎక్కువ ఉన్న, అనుకూలమైన ప్రాంతాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఒక అధికారి సహకరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు జోక్యం కూడా ఉన్నట్టు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఘోరంగా తయా రైంది. ఈ పరిస్థితుల్లో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో (గతంలో పనిచేసిన) ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇవ్వకుండా కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నాయీబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్
చిత్తూరు అర్బన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ నాయీబ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా టి.వెంకటేష్ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు నగరరంలోని పాత మార్కెట్కు చెందిన వెంకటేష్ను నాయీబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా నియమించాలన్న నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రతిపాదనపై జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పార్టీ హైకమాండ్కు రెకమెండ్ చేశారు. పరికరాలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో యంత్ర పరికరాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి గురువారం తెలిపారు. కొన్ని రోజులుగా రాయితీతో యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు స్వీకరించామన్నారు. ట్రాక్టర్ల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. 2 వేల వరకు రాగా పలు దరఖాస్తులు అనర్హులవిగా తేల్చామన్నారు. 1,544 దరఖాస్తులు యంత్ర పరికరాలను అర్హమైనవిగా నిర్ధారించమన్నారు. త్వరలో లక్కీడిప్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
వరసిద్ధి.. బుద్ధినివ్వు..!
కాణిపాకం: కాణిపాకం ఆలయానికి రోజువారీగా 10 వేల మందికి పైగా భక్తులు వస్తుండగా.. సెల వు లు,పండుగల సమయంలో ఈ సంఖ్య 30 వేల వర కు చేరుతోంది. ఇంతటి ప్రముఖ క్షేత్రంలో పలువు రు అధికారులు, ఆలయ సిబ్బంది తీరు భక్తుల్లో అసహనానికి కారణమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని కొందరు దళారులు అవకాశంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెల్లచొక్కా, పంచెలు ధరించిన కొందరు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ ప్రత్యేక దర్శనాల పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వారికి కొందరు ఆలయ సిబ్బంది సహకరిస్తున్నట్టు సమాచారం. బ్రేక్ సమయాల్లోనూ దర్శనాలు సాధారణ భక్తులు స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దళారులు కొందరిని చెక్కడోర్, వీఐపీ మార్గాల ద్వారా నేరుగా ఆలయంలోకి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్రేక్ దర్శనాల సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వారు, సిఫార్సు ఉన్న వారికి ప్రత్యే క దారి చూపుతున్నారని ఉభయదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. కాణిపాకం ఆలయంలో ఇష్టారాజ్యం భక్తుల పట్ల అమర్యాద కొంతమంది సిబ్బంది భక్తులతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. ‘‘గణేశా’’ అని సంభోదించాలని ఆలయ అధికారులు ఆదేశిస్తు న్నా కొందరి తీరు మాత్రం మారడం లేదని భక్తు లు అంటున్నారు. దర్శనం కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల యంలో దళారుల వ్యవస్థను పూర్తిగా అరికట్టాలని, ప్రత్యేక దర్శనాల పేరుతో జరుగుతున్న అక్రమాలను నిలువరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపదలు తొలగించే విఘ్నేశ్వరుడి సన్నిధిలోనే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారులతో చేతులు కలిపి బ్రేక్ సమయంలోనూ అడ్డదారుల్లో స్వామి దర్శనం చేయిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. స్వామి దర్శనానికీ పలుకుబడి కావాలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఖాతా ఉంటేనే తల్లికి వందనం
చిత్తూరు కలెక్టరేట్: 2026–27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం పొందే ఇంటర్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు కచ్చి తంగా బ్యాంక్ లేదా పోస్టల్ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం జూన్లో తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీలోగా ఖాతా ప్రారంభించి ఎన్పీసీఐ లింకు పూర్తి చేసుకోవాలని తెలిపా రు. కళాశాల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగా హన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా ఫుట్బాల్ బాలుర జట్ల ఎంపిక పలమనేరు: పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం చిత్తూరు జిల్లా ఫూట్బాల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్లను ఎంపిక చేశా రు. జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు హాజరుకాగా 65 మందిని ఎంపిక చేసినట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హేమంత్రెడ్డి తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆపై పోటీలకు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి విక్రమ్రాజ్, ఉపాధ్యక్షుడు కిశోర్, కోశాధికారి సుబ్రమణ్యం నాయుడు, నవీన్కుమార్, కిరణ్, రాకేష్, హరీష్ పాల్గొన్నారు. ఆన్లైన్లో టెన్త్ మార్కుల జాబితాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదో తర గతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాలు www. bre.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు. హెచ్ఎంలు విద్యా ర్థుల మార్కుల జాబితాలను డౌన్లోడ్ చేసి అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థి వివరాల్లో అవసరమైన సవ రణలు చేసేందుకు వెబ్సైట్లో ఈ నెల 29 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నారు. నేడు డీఎస్సీ అక్రమాలపై ధర్నా తిరుపతి మంగళం : డీఎస్సీ–2025 అక్రమాలపై శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు రావాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని ఆహ్వానించా రు. ఈ మేరకు గురువారం చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ విద్యాశాఖా మంత్రిగా ఉండి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో పాటు విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్రెడ్డి ఉన్నారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తప్పు చేసిన వారికే పదోన్నతులా? విజిలెన్స్ నివేదికలో పేర్లు వచ్చిన కొందరు అధికారులకు వరుసగా పదోన్నతులు లభించడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. స్క్రాప్ స్కాంకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఎస్ఈలకు ప్రమోషన్లు కల్పించి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక సంస్థలోని ఓ డైరెక్టర్ అండదండలు ఉన్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కనబెట్టి, అక్రమాలకు సహకరించిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విద్యుత్ ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. -
విద్యాపథంలో రాజేంద్ర ప్రస్థానం
చిత్తూరు కలెక్టరేట్ : సామాన్య ఉపాధ్యాయుడిగా చాక్పీస్ పట్టి కెరీర్ ప్రారంభించిన రాజేంద్రప్రసాద్ నిరంతర శ్రమ, నిబద్ధతతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి డీఈవో స్థాయికి చేరుకున్నారు. డైట్ లెక్చరర్, ప్రిన్సిపాల్గా ఎంతో మంది యువ టీచర్లను తీర్చిదిద్దారు. టీచర్ల బదిలీలు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, టీచర్ల సర్వీస్ సమస్యల పరిష్కారంలో వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించి ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. జిల్లాలో డీఈవోగా ఆయన పదవీకాలం ఆదర్శవంతంగా సాగింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ టీచర్లకు తగిన దిశా నిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. అంతేగాక ఆయన ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విశేష కృషి చేశారు. నిరంతరం తనిఖీలు చేస్తూ మౌలిక వసతుల కల్పనతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికార దర్పం ప్రదర్శించకుండా స్నేహితుడిగా, ఆత్మీయుడిగా టీచర్లతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్ వీడ్కోలు సభ నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ సమావేశమందిరంలో డీఈవో ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆయన జిల్లా అధికారిగా ఉపాధ్యాయులపై ఏనాడు అధికారాన్ని చెలాయించలేదు. జిల్లా విద్యారంగాన్ని సమర్థవంతంగా నడిపించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేశారు. విధుల్లో అంకితభావం చూపుతూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. డీఈవో కేడర్లో సేవలందించిన రాజేంద్రప్రసాద్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. -
గురజాలకు చేదు అనుభవం?
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు నగరంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుకు చేదు అనుభవం ఎదురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. సంతపేటలో రెండు రోజుల క్రితం జరిగిన మినీ మహానాడు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు పార్టీలో 40 ఏళ్లుగా ఉన్నామని చెప్పుకుంటున్నా రు. ఏదైనా పార్టీ కార్యక్రమం జరిగితే దాన్ని విజయవంతం చేయడంలో వాళ్ల పాత్ర ఏమిటనేది కూడా చూస్తున్నా.. అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా గురువారం పార్టీ కార్యాయలంలో జరిగిన టీడీపీ జెండా ఆవిష్కరణలో సీనియర్లంతా ముందుకు వచ్చి నిలబడడంతో ఎమ్మెల్యే వెను క్కు వెళ్లి నిలబడ్డారు. తమపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే సీనియర్లు ఇలా చేశారని, పార్టీ కా ర్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. -
నో పర్మిట్.. రైట్రైట్!
నమ్మదు కేఎస్ఆర్టీసీ.. ‘‘మాది కర్ణాటక ఆర్టీసీ.. మాకు పర్మిట్ అవసరం లేదు. మా ఇష్టం వచ్చినట్టు వెళతాం. అడిగేదానికి మీరు ఎవరు..’’ అంటూ కేఎస్ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. పర్మిట్ లేకపోయినా యథేచ్ఛగా ఏపీలో బస్సులను తిప్పుతున్నారు. రద్దీని బట్టి తిరుపతి, చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. ఫలితంగా మన రాష్ట్రానికి రావాల్సిన రవాణా సుంకాలు, ప్రయాణికుల చార్టీలను పొరుగు రాష్ట్రం వారు తన్నుకుపోతున్నారు. పలమనేరు: గత కొన్నేళ్లుగా కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఎలాంటి పర్మిట్లు లేకుండా మన రాష్ట్రంలోని తిరుపతి, పలమనేరు, చిత్తూరు, పుత్తూరుకు నడుస్తున్నా యి. ముఖ్యంగా కోలారు, ముళబాగిళు, శ్రీనివాసపుర డిపోల నుంచి రిజర్వులో ఉన్న బస్సులను సైతం అంతర్రాష్ట్ర పర్మిట్లు లేకపోయినా అక్కడ తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటే స్పెషల్ బస్సులుగా పంపిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న కర్ణాటక బస్సులను చూసి ఇక్కడి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మనోవేదన చెందడం మినహా వాటిని అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. స్పెషల్ బస్సులు సైతం ఇస్టారాజ్యం కర్ణాటక రాష్ట్రంలోని పలు డిపోలకు చెందిన బస్సులను రద్దీని బట్టి తిరుపతి, బోయకొండ, తమిళనాడులోని మేళ్మరువత్తూర్, తిరువణ్ణామళై తదితర పుణ్య క్షేత్రాలకు అనుమతుల లేకుండానే నడుపుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన ఏ బస్సు అయి నా చిన్నపాటి ఇబ్బంది ఉంటే దాన్ని సీజ్ చేస్తు న్నారు అక్కడి ట్రాన్స్ఫోర్ట్ అధికారులు. రాత్రిళ్లు అడిగే దిక్కులేదు పలమనేరు, చిత్తూరుకు పొరుగునే ఉన్న ముళబాగిళు, కోలార, చింతామణి, శ్రీనివాసపుర నుంచి రాత్రి సర్వీసులు పదికి పైగా బస్సులు పర్మిట్ లేకుండానే పలమనేరు మీదుగా నడుస్తున్నాయి. ఫలితంగా మనరాష్ట్ర రవాణాశాఖ కంటే వారికి భారీగా ఆదాయాలు లభిస్తోంది. ఈ విషయం తెలి సినా మన ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అడ్డుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఇష్ట్రాాజ్యంగా కర్ణాటక నుంచి జిల్లాలోకి వస్తున్న బస్సులను పలమనేరు, చిత్తూరు డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా వారు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వ్యవహారంలో కేఎస్ఆర్టీసీకి ఎవరి అండ ఉండో తెలియడం లేదని కొంతమంది ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై జిల్లా రవాణా శాఖ దృష్టి సారించాలని కోరుతున్నారు. మన బస్సులకేమో రూల్స్ మీద రూల్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, మంగళం, తిరుమల, చిత్తూరు తదితర డిపోల నుంచి సుమా రు 125 బస్సులు కర్ణాటకలోని బెంగళూరుకు అంతర్రాష్ట్ర సర్వీసుల కింద నడుస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో పక్కాగా పర్మిట్లు ఉన్న వాహనాలు. అదే విధంగా కర్ణాటకలోని పలు డిపోల నుంచి మన రాష్ట్రంలోకి పర్మిట్లున్న అక్కడి బస్సులు 70 వరకు ఉన్నాయి. పర్మిట్లు లేని బస్సులు పదుల సంఖ్యలో తిరుపతికి వచ్చి వెళుతూనే ఉన్నాయి. ఈ మార్గాల్లోని రవాణాశాఖ అధికారులు వాటి గురించి పట్టించుకోకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పెద్దచెరువులో దూకి మహిళ ఆత్మహత్య
పలమనేరు: పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో దూకి మహి ళ ఆత్మహత్య చేసుకు న్న ఘటన గురువారం వెలుగుచూసింది. చెరువు లో మహిళ శవం తేలిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. విచారణలో ఆమె పట్టణంలోని పోలీస్ లైన్కు చెందిన లేట్ షేక్ బాబు భార్య షావర్(56)గా తేలింది. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లుగా కుమార్తె ఇంట్లో ఉంటోంది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పో యింది. గురువారం చెరువులో శవమై తేలింది. ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతరులకు డబ్బు ఇప్పించిందని తెలిసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి రతలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం
పుత్తూరు: మండలంలోని పుత్తూరు–చిత్తూరు ప్రధాన రహదారిపై చిన్నరాజుకుప్పుం సమీపంలో గురువారం ఉదయం స్థానిక టీడీపీ నాయకుడు టీవీఎస్ ప్రసాద్పై హత్యాయత్నం జరిగింది. ఎస్ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. పుత్తూరులో నివాసం ఉంటున్న ప్రసాద్ ప్రతి రోజూ స్వగ్రామమైన చిన్నరాజుకుప్పంలోని తన పొలం వద్దకు బైక్పై వెళ్లి వస్తుంటాడు. గురువారం కూడా వెళ్లి ఉదయం 7.30 గంటల సమయంలో పుత్తూరుకు తిరిగి వస్తుండగా చినరాజుకుప్పం గ్రామానికే చెందిన పి.రాజేంద్ర, పి.రవి, పి.సంతోష్, పి.నరేష్ ఆటోలో వచ్చి బైక్ను ఢీకొన్నారు. కింద పడిపోయిన ప్రసాద్పై కత్తులతో దాడి చేశారు. బాధితుడు కేకలు వేయడంతో సమీపంలోని వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రసాద్ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ప్రసాద్ కుడి చేతిపై బలమైన రక్త గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. పాత కక్షలతోనే తన భర్తపై హత్యా యత్నానికి పాల్పడ్డారని బాధితుడి భార్య శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ ఫైనల్స్కు బంగారుపాళ్యం తవణంపల్లె: మండలంలోని అరగొండ బాలుర హైస్కూల్లో ఈ నెల 9వ తేదీ నుంచి ఏబీకే క్రికెట్ టోర్నమెంట్ ఓపెన్టు ఆల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్కు పలు ప్రాంతాల నుంచి సుమారు 20 టీములు పాల్గొన్నట్లు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ హరీష్ తెలిపారు. సెమీఫైనల్లో బంగారుపాళ్యం అనిల్–11 టీం, బెంగుళూరు టీం హోరాహోరీగా తలపడి గట్టి పోటీ ఇచ్చా రు. కానీ సెమీఫైనల్ పోటీల్లో బంగారుపాళ్యం అనిల్–11 టీం గెలుపొంది ఫైనల్కు చేరుకుంది. ఫైనల్స్ పోటీలు ఆదివారంతో ముగుస్తుందని వివరించారు. ఫైనల్స్లో గెలుపొందిన విన్నర్స్కు రూ.40 వేలతోపాటు కప్ అందజేస్తామన్నారు. ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు చొప్పున అందజేస్తామని వివరించారు. -
ఆన్లైన్లో వస్త్రాల ఈ – వేలం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి 147 లాట్ల వస్త్రాలు, న్యూ ఆర్ట్ సిల్క్ శారీస్ జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో ఇఏ ఐడీ నెంబరు 25918 టూ 25923 ద్వారా ఈ – వేలం వేయనున్నారు. ఈ మేరకు గురువారం టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కలిగిన బిడ్డర్లు వస్త్రాల ఆన్లైన్ వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలం), ఏఈఓ టీటీడీ హరేకృష్ణమార్గ్ , తిరుపతి లేదా టీటీడీ వెబ్సైట్, లేదా 0877 – 2264429 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది. నాన్–కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు చిత్తూరు అర్బన్: చిత్తూ రు ఏఎస్పీగా పనిచేస్తూ నాన్–కేడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన ఎస్ఆర్.రాజశేఖర్ రాజు గురువారం బాధ్యతలు తీసుకున్నా రు. ప్రభుత్వం ఆయనకు ఇటీవల ఉద్యోగో న్నతి కల్పిస్తూ మంగళగిరికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా ఆయనను నాన్–కేడర్ ఎస్పీగా చిత్తూరులోనే నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
మహానాడులో కూడా వైఎస్ జగన్ నామస్మరణే: రోజా
సాక్షి, నగరి: మహానాడులో టీడీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కాలిగోటికి సరిపోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడును టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు తెలిసిపోయింది. మహానాడులో టీడీపీ నేతలవి బోగస్ మాటలేనని మాటలకు అర్థమైంది. మహానాడులో వైఎస్ జగన్ నామస్మరణే ఎక్కువ చేశారు. వైఎస్ జగన్ అంటే టీడీపీ నేత వెన్నులో వణుకుపుడుతుంది. మహానాడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టి సభకు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు డిన్నర్ చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని కలిసిన మీరు మహిళా ద్రోహులు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. దేశంలో ఏపీ పోలీసుల ర్యాంక్ అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు కనాలని చంద్రబాబు చెబుతున్నారు. మహిళలు పిల్లల్ని కనాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?. కాంగ్రెస్తో టీడీపీకి హాట్లైన్ బంధం ఉందని వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు. దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండి. మహానాడులో వైఎస్ జగన్ గురించి నీచంగా మాట్లాడారు. సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు?. హరికృష్ణ శవం దగ్గర పొత్తులపై కేటీఆర్తో మాట్లాడిన మీరు సైకో కాదా?. నారా లోకేష్ బిల్డప్ మాటలు ఎందుకు?. జగన్ దెబ్బకు లోకేష్ ఢిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. ఓటమి ఎరుగని ధీరుడు జగనన్న. నువ్వు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు. వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ప్రజ సమస్యలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తుల్లో తల్లీ, చెల్లికి ఎంతిచ్చారో చెబుతారా?. మోసాలు, వెన్నుపోటుతో చంద్రబాబు సీఎం స్థాయి ఎదిగారు. తన చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు. అసలు గొడ్డలి పార్టీ మీది. హెరిటేజ్ ఆస్తుల్లో మీ నాయకుడు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్తారా?. తల్లితో ఉన్న ఫోటో గానీ, చెల్లితో ఉన్న ఫోటో ఒక్కటైనా బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన మీరు సైకోలు కాదా?. వివేకా హత్య చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు సునీత, షర్మిల అడగలేదు. హత్య చేసిన దస్తగిరికి కొమ్ము కాస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి అనిత.. సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఆమెకు న్యాయం చేయాలి. మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు, మహిళలు కు ముందు రక్షణ కల్పించాలి. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. వెన్నుపోటు రెండేళ్లు పేరుతో విడుదల చేసిన బుక్ లెట్ ప్రతి గడప గడపకు అందిస్తాం’ అని అన్నారు. -
పేదల బతుకులతో చెలగాటం
● వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీడీపీకి చెందిన శాప్ చైర్మన్ రవినాయుడు తన స్వలాభం కోసం పెదల బతుకులతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసూయాదవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్క్లబ్లో బాధితులతో కలసి మీడియాతో మాట్లాడారు. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద రవినాయుడు తనకు సంబంధించిన అరకు వ్యాలీ కాఫీ షాప్ను మరింతగా విస్తరించే క్రమంలో తోపుడు బండ్ల చిరు వ్యాపారులను నాలుగు రోజుల కిందట తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. తిరుపతి అలిపిరి జూపార్కు రోడ్డులో తోపుడుబండ్ల వ్యాపారస్తులు గత పదేళ్లుగా వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, ఉన్న ఫలంగా తోపుడుబండ్లను తొలగించడంతో వారు జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తోపుడుబండ్ల వ్యాపారస్తులకు అక్కడే షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మల్లం రవికుమార్రెడ్డి, పార్టీ జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు అనిల్రెడ్డి, అలిపిరి తోపుడుబండ్ల బాధితులు పాల్గొన్నారు. ‘చిరుతపులి సంచారం లేదు’ గంగవరం: ఏదో జంతువు కాలి అడుగులను చూసి చిరుత పులి సంచారం అంటూ మండల ప్రజలు బుధవారం భయాందోళనకు గురయ్యారు. మండలంలోని నల్లసానిపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో జంతువు కాలి అడుగులు ఉన్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. అవి చిరుతపులివి అని పుకార్లు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్లు సుకుమార్, రమేష్, అటవీ శాఖ సిబ్బంది నల్లసానిపల్లి వద్దనున్న మామిడితోపులో ఉన్న జంతువు కాలి అడుగులను పరిశీలించారు. అడుగులు పడిన చోట నేలపై గోర్లు కిందికి దిగినట్టు గుర్తించారు. సాధారణంగా పులి అడుగులైతే కాలి గోర్లు కిందికి దిగవని, అవి అడవి కుక్క అడుగులు అని నిర్ధారించారు. భయాందోళన చెందొద్దని, ఈ ప్రదేశంలో ఎక్కడా పులి సంచారం లేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
నెలాఖరులోపు జనగణన పూర్తి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జనగణన ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 89.4 శాతం జనాభా గణన పూర్తయిందని తెలిపారు. కొన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాల్లో 2011 జనాభా లెక్కల సంఖ్యను దాటకపోవడం, జనన మరణాల రేటు ప్రకారం పెరగాల్సిన జనాభా తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నగరాలకు తాళం వేసి ఉన్న ఇళ్లను మరోసారి తనిఖీ చేసి పొరుగువారి ద్వారా పూర్తి వివరాలను సేకరించాలన్నారు. తహసీల్దార్లు తమ లాగిన్లను నిరంతరం పరిశీలిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు.పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన దరఖాస్తులకు సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్ఎం సుబ్బారావు, ఎల్డీఎం హరీష్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
12 కేజీల గంజాయి స్వాధీనం
నగరి : జిల్లాలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట గంజాయి వ్యాపారం జరుగుతూనే ఉంది. అక్రమా ర్కులు తెలివిగా గంజాయిని తరలిస్తున్నారు. తాజాగా ఓజీకుప్పం వద్ద బంధువుల ఇంటికి వెళ్లి బ్యాగులో దుస్తులు తీసుకుని వస్తున్నట్టు అనుమానం రాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లికార్జున రావు కథనం మేరకు.. జిల్లా ఎస్పీ తుషార్డూడీ ఆదేశాలతో పోలీసులు బుధవారం ఓజీకుప్పం మారెమ్మ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్లో వచ్చిన ఇద్దరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగు లో పరిశీలించగా 12 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. విచారణలో వారు ఓజీ కుప్పానికి చెందిన హనుమంతు (46), ఊర్మిళ (26)గా తేలింది. వారు బంధువులు. వారు బైక్లో బంధువుల ఇంటికి వెళ్లి దుస్తులు తీసుకువస్తున్నట్టు బ్యాగు పట్టుకు వస్తారు. వీరిని చూస్తే ఎవరికీ సందేహం రాదు. హనుమంతుకు ఊర్మిళ అన్న కుమార్తె కావడంతో ఎవరికీ వేరే ఆలోచన రాదు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. వీరి వ్యవహారంపై సందేహం వచ్చిన పోలీసులు కాపుకాశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారు రేణిగుంటలోని గుర్తుతెలియని వ్యక్తి నుంచి కేజీ గంజాయి రూ.5 వేలకు కొనుగోలు చేసి ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముగ్గురు వ్యక్తులు వీరి నుంచి గంజాయి కోనుగోలుకు సిద్ధంగా ఉన్న విషయం బయటపడింది. ఒక్కో ప్యాకెట్ రెండు కేజీలు ఉంటుంది. వారికి కేజీకి రూ.8 వేల ఆదాయం వస్తున్నట్టు తేలింది. నిందితులపై క్రైమ్ నెంబరు 44/2026 మేరకు కేసు నమోదుచేశారు. డీటీ మేఘవర్ణం సమక్షంలో వారి నుంచి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారు ఎవరు, వీరి నుంచి కొనుగోలు చేస్తున్నది ఎవరు, ఎక్కడ విక్రయిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జీవో 223తో టీచర్లకు తీవ్ర అన్యాయం
పక్వానికి వచ్చాకే మామిడి కోత కాయలు పక్వానికి వచ్చాకే కోత కోయాలని జిల్లా ఇన్చార్జి హార్టికల్చర్ అధికారి శివకుమారి తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ విద్యాశాఖలో అనుభవం లేని సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించడం దారుణమని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అర్హతలు, ఏళ్ల తరబడి బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులను పక్కనబెట్టి అనుభవం లేని సిబ్బందికి ఉద్యోగోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో పాఠశాల విద్యాశాఖలో అమలులో ఉన్న జీవో 302 ప్రకారం టీచర్లకు 40 శాతం జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు కల్పించేవారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన జీవో 223 వల్ల టీచర్లకు జేఎల్ ఉద్యోగోన్నతులు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వంటి బోధనేతర సిబ్బందికి జేఎల్ ఉద్యోగోన్నతులు ఇవ్వడం సబబు కాదన్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తరగతి గది బోధనలో ప్రత్యక్ష అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తేనే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వివాదాస్పద జీవో 223ను రద్దు చేసి, గతంలోలా 40 శాతాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
29న ధర్నా విజయవంతం చేయండి
తిరుపతి రూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలతో కలిసి ఈ నెల 29న ధర్నా చేపడు తున్నట్టు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాల వల్ల డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, గవర్నర్ ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాలికపై అఘాయిత్యం వరదయ్యపాళెం: మండలంలోని రాచకండ్రిగలో బాలిక(16)పై అదే ఊరికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాతరి వెంకటరమణయ్య (46) మేకల మందతో అడవికి వెళ్తుండేవాడు. బాలిక కూడా మేకలు మేపుకునేందుకు వెళ్లేది. ఒంటరిగా ఉన్న ఆమెకు వెంకటరమణయ్య మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీసిటీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి సత్యవేడు కోర్టులో హాజరుపరికి రిమాండ్కు తరలించారు. బాలికను శ్రీసిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. -
పరిశ్రమలేవీ బాబూ..?
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తే వస్తువులను వేగంగా రవాణా చేయవచ్చు. కూటమి నేతలు, ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కక్షసాధింపు చర్యలకు దిగడంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావడం లేదు. ’కొత్త పారిశ్రామిక పాలసీ తెచ్చాం, పెట్టుబడులు పెట్టండి’ అంటూ అధికారులు ఎంత బతిమాలినా ’మాకొద్దు బాబూ’ అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా గండం ఏర్పడింది. ఎంఎస్ఎంఈలే అధికం జిల్లాలో 2019–2020 ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లతో 1,682 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించారు. 9,291 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2020–21లో 2,086 పరిశ్రమలకు రూ.131 కోట్ల పెట్టుబడులు పెట్టగా 9,710 జాబ్స్ వచ్చాయి. 2021–22 సంవత్సరంలో 1,360 పరిశ్రమలను రూ.83.52 కోట్లతో ఏర్పాటు చేయగా 8,648 మందికి ఉపాధి లభించింది. అలాగే 2022–23లో రూ.132.5 కోట్లతో 2,526 పరిశ్రమలను స్థాపించగా 9,263 మందికి ఉద్యోగాలు లభించి వారి జీవన ప్రమాణం మెరుగుపడింది. 2023–24లో 3,062 పరిశ్రమలను రూ.128.57 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేయగా 10,652 మంది ఉద్యోగాలు లభించాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఏర్పడింది. తర్వాత కూడా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఐదేళ్లలో మొత్తం 10,716 ఎంఎస్ఎంఈలను రూ.604.59 కోట్లతో ఏర్పాటుచేయగా 47,564 మందికి ఉద్యోగాలు లభించాయి. కూటమి ప్రభత్వుం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జిరాక్స్ సెంటర్లు, పంక్చర్ దుకాణాలు, ఆటోలు ఇలా ప్రతి చిన్నచిన్న వ్యాపారాలను పరిశ్రమల పేరుతో ఎంఎస్ఎంఈల కింద నమోదు చేశారు. తద్వారా రూ.126 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ● పీఎంఈజీపీ పరంగా 2019–2024 మధ్య జిల్లాలో 665 పరిశ్రమలు స్థాపించగా సబ్సిడీ కింద రూ.23.22 కోట్లు వచ్చాయి. 1,597 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరంగా గతంలో 1,720 పరిశ్రమలకు గాను రూ.107.48 కోట్లు ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో గత రెండేళ్లుగా 243 పరిశ్రమలకు రూ.14 కోట్లు ఇన్సెంటివ్స్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఇవి కాకుండా గత రెండేళ్లలో రూ.351 కోట్ల పెట్టుబడులు రాగా 435 మందికి ఉద్యోగాలు వచ్చాయి.‘‘మేము అధికారంలో వస్తే సంపద సృష్టిస్తాం. దాన్ని ప్రజలకు పంచుతాం. మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం. ఇంటింటికీ ఉద్యోగమిస్తాం. అలా కాకుంటే నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తాం’’ అని ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. జిల్లాలో చిన్న, సూక్ష్మ, భారీ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈలు తప్ప భారీ స్థాయి పరిశ్రమలు రావడం లేదు. -
ఇదేనా పొదుపు బాబూ!
టీడీపీ చేపట్టిన వర్చువల్ మహానాడు ఖర్చులు తడిసి మోపెడయ్యాయని తమ్ముళ్లు లబోదిబో మంటున్నారు. ఈ ఖర్చులు ఎమ్మెల్యేలు భరించాల్సి ఉన్నా.. కొందరు మండల పార్టీ నాయకులు, వ్యాపార వేత్తలకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన పొదుపు పేరుతో చేపట్టిన వర్చువల్ మహానాడు తమ జేబులకు చిల్లుపడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ మహానాడు కాకుండా.. ముందుగా అనుకున్నట్లు నెల్లూరులో నిర్వహించి ఉంటే తమపై ఖర్చుల భారం పడేది కాదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి, చిత్తూరు జిల్లాలో బుధవారం అన్ని మండల కేంద్రాలతో పాటు సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు, తిరుపతి నగరాల్లో నాలుగు డివిజన్లకు ఒక చోట వర్చవల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో 12 చోట్ల, చిత్తూరులో ఐదు చోట్ల మినీ మహానాడు నిర్వహించారు. ప్రతి క్లస్టర్లో నాయకులు, కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా మహానాడుకు హాజరైన వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల చికెన్ బిరియాని ఏర్పాటు చేశారు. శ్రీరంగరాజపురంలో.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయికట్టు ఆరిమాకులపల్లిలో వెలసిన శ్రీఆరిమానిగంగమ్మ ఆలయం వద్ద బుధవారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే వేదిక ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణ చుట్టూ, గాలి గోపురం వద్ద, ఆలయం ఎదురుగా రోడ్డుపై టీడీపీ జెండాలు, తోరణాలు ఏర్పాటుచేశారు. దొరవారిసత్రంలో.. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని సింగనాలత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో మినీ మహానాడు నిర్వహించారు. స్పందన కరువు ద్వితీయ శ్రేణి నాయకులపైనే భారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలే వర్చువల్ మహానాడు ఖర్చులు భరించారు. ఎక్కువ శాతం మండల పార్టీ నాయకుల మహానాడు ఖర్చును భరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో కొందరు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు ఖర్చులు భరించారు. అదే విధంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా మహానాడు నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చుచేసినట్లు తెలిసింది. కార్యకర్తల తరలింపునకు కూడా జేబులో నుంచి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదువులు పొందిన వారు, సంపాదించుకున్నోళ్లు పెట్టినా ఇబ్బంది లేదు కానీ, ఎటువంటి ప్రయోజనం పొందని వారి నుంచి కూడా వసూళ్లు చేయడం, ఖర్చు చేయించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వర్చువల్ మహానాడు కార్యక్రమానికి కొందరు రూ.లక్ష ఖర్చు చేస్తే.. మరి కొందరు రూ.5 లక్షలు ఖర్చు చేసిన నాయకులు ఉన్నారు. అధికారమా.. మజాకా? వర్చువల్ మహనాడు కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమమే. అయితే కొందరు నాయకులు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణిలో ప్రభుత్వ మండల పరిషత్ కార్యాలయంలో మహానాడు నిర్వహించి ఔరా అనిపించారు. అదే విధంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాలలో టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించడం గమనార్హం. వర్చువల్ మహానాడు కార్యక్రమానికి అనేక మండలాల్లో స్పందన కరువైంది. అధిష్టానం ఆదేశా లని చెప్పి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మండల పార్టీ నాయకులపై ఒత్తిడి చేసి నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులందరూ హాజరుకాలేదు. అందుబాటులో ఉన్న వారిని మాత్రం పిలిపించుకుని మమ అనిపించిన కార్యక్రమాలు ఉన్నాయి. భారీగా చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాలు ఉన్నాయి. -
పేలుతున్నాయ్!
తిరుపతి రూరల్ : మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు టపాకాయల్లా పేలుతున్నాయి. విద్యుత్ వాడకం పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లపై అధికలోడ్ పడి డీటీఆర్లు కాలిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 585 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా.. సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి విద్యుత్ సరఫరా అవుతోంది. ఇటీవల గృహ విద్యుత్ వినియోగదారు లు విద్యుత్ వాడకాన్ని పెంచేశారు. వ్యవసాయానికి కూడా వాడకం పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పది రోజుల క్రితం రేణిగుంట వద్దనున్న 220కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. వాటితోనే ప్రమాదం లైఫ్టైమ్ పూర్తయిన ట్రాన్స్ఫార్మర్లు పేలుడుకు గురవతున్నాయని, వాటివల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా డీటీఆర్లు కాలిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒకే నెలలో 500కుపైగా..! ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 1,600 విద్యుత్ సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా 7,38,780 ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా డీటీఆర్ల సామర్థ్యం పెంచినప్పటికీ వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో వాడకం పెరిగిపోయింది. దీంతో లోడ్ బ్యాలెన్స్ చేయకలేక ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక నెల వ్యవధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధిక లోడ్ కారణంగా 500కు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) కాలినట్టు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 180, అన్నమయ్య జిల్లాలో 110 వరకు కాలిపోయినట్టు సమాచారం. ఇటీవల తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో మీటర్ బాక్సులు పేలిపోయి మంటలు వ్యాపించాయి.రేణిగుంట 220కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలి భారీగా ఎగసిపడుతున్న మంటలు -
నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!
● నెల క్రితం జరిగిన ఘటన ● ఛేదించిన పోలీసులు ● నిందితుడికి రిమాండ్ దొరవారిసత్రం: మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడే పెట్రోలు పోసి నిప్పంటించి చంపేశాడని తేల్చారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ సంఘమేశ్వరరావు, ఎస్ఐ జీవీ చౌదరి దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని చందనముడి గ్రామ పరిధి, ఎస్సీ కాలనీకి చెందిన అంబూరు సుజాత (37) గత నెల 25న అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు అప్పట్లో కేసు నమోదు చేశారు. తల్లిపై పెట్రోల్ పోసి! సుజాతకు, ఆమె పెద్ద కుమారుడు సుధీర్కు మధ్య కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తల్లిపై కక్ష పెంచుకున్న సుధీర్ గత నెల 25వ తేదీన రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి అర్ధరాత్రి సమయంలో మేడపై నిద్రసిస్తున్న తల్లిపై పోసి నిప్పటించాడు. ఆపై ఏమీ తెలియనట్లు కిందకు వచ్చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సుజాత కేకలు వేసింది. పక్కనే నిద్రిస్తున్న రెండో కుమారుడు విష్ణు అరవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే శరీరం అంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. పొంతన లేని సమాధానాలతో.. తల్లి మృతి విషయంలో పెద్ద కుమారుడు అన్ని ఆధారాలు దాచి పెట్టడడంతో పాటు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించాడు. తల్లిని చికిత్స కోసం తరలించి పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే క్లూస్ టీమ్ సేకరించిన ఆధారులను బట్టి సుజాతది హత్యగా పరిగణనలోకి తీసుకున్నారు. చివరిగా సుఽఽధీర్ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు సుధీర్ను బుధవారం సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు డిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
చిత్తూరులో చైన్ స్నాచింగ్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో బుధవారం పట్టపగలే దుండగుడు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. కట్టమంచిలోని ద్వారకానగర్కు చెందిన నిర్మల అనే మహిళ ఇంటి బయట ముగ్గు వేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంలో వచ్చి ఆమెను అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. ఆమె ఆలోచిస్తుండగా మెడలో ఉన్న బంగారు చైనును లాక్కుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు దాదాపు 40 గ్రాములకు పైగా ఉంటుందని వెల్లడించింది. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట మునిగి వ్యక్తి మృతి శాంతిపురం: మండలంలో బుధవారం మిత్రులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అబకలదొడ్డికి చెందిన మురుగేష్(38) మరో ఆరుగురు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని తోపు చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. మురుగేష్ గతంలో ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసేవాడు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం వదులుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడవిలో వృద్ధురాలి అస్థిపంజరం లభ్యం యాదమరి: మండలంలోని డీకే చెరువు గ్రామ సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో ఒక వృద్ధురాలి అస్థిపంజరం లభించింది. పోలీసుల కథనం మేరకు.. గుడ్డివాని చెరువు అటవీ ప్రాంతంలో పాండవుల బండ వద్ద వేప చెట్టు కింద ఎముకలు గూడుతో ఉన్న మానవ అస్థిపంజరాన్ని రాజాపతి అనే స్థానికుడు బుధవారం గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అస్థిపంజరం తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలూకా డీపీపాలెం గ్రామానికి చెందిన మునెమ్మ(90) అనే వృద్ధురాలిదిగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు, చేతి గాజుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వయోభారంతో పాటు నీరు, ఆహారం లేకపోవడంతోనే అడవిలో మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్ఐ ఈశ్వర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు ఆలయం వద్ద కుప్పకూలిన భక్తురాలు చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న భక్తురాలు కుప్పకూలి పడిపోయింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడ భవానీపురానికి చెందిన కృష్ణవేణి(28) కుటుంబ సభ్యులతో కలసి బుధవారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు. దర్శనార్థం 3వ గేటు వద్ద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన అధికారులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎండ తీవ్రత అధికమై వడదెబ్బ తగిలి భక్తురాలు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. భక్తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం అని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఏఐఆర్ బైపాస్ రోడ్డులో ఉన్న హోటల్ ఇష్టా వేదికగా ఏర్పా టు చేసిన ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్ కోర్సులు వారానికి మూడు రోజులు నిర్వహిస్తారని, ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచి మెదడు చురుగ్గా ఉండేందుకు మరో ఐదు రకాల చిట్కాలను వివరించారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 50 పైగా క్యాంపస్లతో విజయవంతంగా దూసుకుపోతోందన్నారు. వివరాలకు 9959154371, 9985310069 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
గజగణన ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో బుధవారం నుంచి గజగణన ప్రారంభమైంది. చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్ల పరిధిలో ఎఫ్ఆర్వోల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 87 బీట్లలో ఎఫ్బీఓ, ఏబీఓలు ప్రతి బీట్కు 15 కిలోమీటర్ల చొప్పున అటవీ ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు. గురువారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో శుక్రవారం, శనివారాలు బీట్ల పరిధిలో తిరిగి ఏనుగుల పేడ సేకరించి, నీటి కుంటలు వద్ద ఉన్న వాటి వివరాలు సేకరించనున్నారు. జూన్ మొదటి వారంలో వివరాలను ప్రకటించనున్నట్లు డీఎఫ్ఓ సుబ్బరాజు వివరించారు. చిత్తూరు ఏఏస్పీ రాజశేఖర్ రాజుకు ప్రమోషన్ చిత్తూరు అర్బన్: చిత్తూరు ఏఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ఎస్ఆర్.రాజశేఖర్ రాజు ఉద్యోగోన్నతిపై ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనకు ఎస్పీ (నాన్–క్యాడర్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి చిత్తూరు అర్బన్: జిల్లాలోని ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎక్కడా ఆవులు, దూడలను వధించవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే డయల్ 112, పోలీసు వాట్సాప్ 9440900006 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీల్లో ఉద్యోగాల భర్తీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కేజీబీవీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ 1, సీఆర్టీ ఫిజికల్ సైన్స్ 2, సీఆర్టీ సోషల్ 1, పీఈటీ 1 పోస్టులు ఉన్నాయని తెలిపారు. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. సీఆర్టీ పోస్టులకు టెట్ తప్పనిసరి అని, పీఈటీ పోస్టుకు టెట్ అవసరం లేదన్నారు. అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 45 ఏళ్లు ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు (50 ఏళ్ల వరకు) ఉంటుందని, దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. జూన్ 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్కు దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏటా ప్రతిష్టాత్మకంగా అందజేసే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ –2027 అవార్డులకు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే బాలలను ప్రోత్సహించేందుకు ఈ జాతీయ పురస్కారాలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు–సంస్కృతి, విజ్ఞానం – సాంకేతికత విభాగాల్లో ప్రతిభ చాటిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలలు భారతీయ పౌరులై ఉండాలని, 2026 జూలై 31 నాటికి 5 నుంచి 18 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. అర్హత గల బాలలు స్వయంగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అధికారిక పోర్టల్ www.award.gov.inలో జూలై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ అధికారులను కోరారు. -
పక్వానికి వచ్చాకే మామిడి కోత
పుత్తూరు: మార్కెట్లో అపోహలను నమ్మి మామిడి రైతులు పక్వానికి రాకముందే కాయలు కోయవద్దని ఇన్చార్జి జిల్లా ఉద్యానవన అధికారిణి పి.శివకుమారి విజ్ఞప్తి చేశారు. ఆమె బుధవారం పుత్తూరు మార్కెట్ యార్డ్ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కాయలను పక్వానికి రాకముందే కోసి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్లడం వల్ల ధరలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. పక్వానికి వచ్చిన కాయలకే ధరలు స్థిరంగా ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించి కొలుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మండీ యజమానులను హెచ్చరించారు. జ్యూస్ ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతుల వినతి పుత్తూరు, నారాయణవనం, వడమాలపేట మండలాల్లో తోతాపూరి కాయలు పక్వానికి వచ్చాయని, జ్యూస్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని రైతులు శివకుమారిని కోరారు. అకాల వర్షాలకు నేలరాలిన పంటను కొనుగోలు చేసే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలను ఆదేశించాలని కోరారు. మూడు నాలుగు రోజుల్లో అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు తెరుస్తారని, అధైర్యపడవద్దని ఆమె ప్రతిస్పందించారు. కార్యక్రమంలో పుత్తూరు హార్టికల్చర్ ఆఫీసర్ వెంకట సౌజన్య, రైతులు పాల్గొన్నారు. -
సైన్స్ ఆవిష్కరణలో ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం
● తాడేపల్లె సమావేశంలో జిల్లా నేతలు శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 89,403 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. ఏర్పేడు: సైన్స్ రంగంలో నూతన ఆష్కరణలు, పరిశోధనలకు ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం ఎంతైనా అవసరమని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అన్నారు. పరిశోధన, స్టార్టప్లు, ఆవిష్కరణ, పరిశ్రమ భాగస్వామ్యాలలో భారత్–కెనడా సహకారం మరింత పెంచే వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఐసర్, కెనడా దేశం హాలీఫాక్సలోని డల్హౌసీ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలో క్రియేటీవ్ డిస్ట్రక్షన్ ల్యాబ్–అట్లాంటిక్ ఆవిష్కరణ సెషన్లలో పాల్గొన్నారు. ఐసర్ డైరెక్టర్, డల్హౌసీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నోని మెక్డొనాల్డ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలి తిరుపతి–డాల్హౌసీ ఇన్నోవేషన్ రీసెర్చ్ రౌండ్ టేబుల్ను ప్రారంభించారు. తిరుపతిలోని ట్రినిస్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్పై చర్చించారు. ఏఐ, డిజిటల్ సిస్టమ్లు, ఆరోగ్య సాంకేతికతలు, అధునాతన మెటీరియల్స్, వ్యవసాయం, కీలకమైన ఖనిజాలతో భారతదేశం, కెనడా దేశాల సైన్స్ ప్రగతి, నూతన ఆవిష్కరణలకు సరికొత్త అధ్యాయానికి ఈ ఒప్పందం బీజం వేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
రెండేళ్ల జైలు శిక్ష
చిత్తూరు అర్బన్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో ఎం.మేఘనాథనాయుడు (42) అనే ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. మదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన మేఘనాథనాయుడుకు సుధా అనే మహిళతో 2014లో పెళ్లయ్యింది. వివాహ సమయంలో భారీ కట్న కానుకలు, బంగారు ఆభరణాలు వధువు తరఫున తల్లిదండ్రులు అల్లుడికి ఇచ్చారు. అయితే ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న నిందితుడు అదనపు కట్నం కోసం తరచూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీనిపై బాధితురాలు 2020లో చిత్తూరులోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు అందజేశారు. నేరం ఋజువు కావడంతో మేఘనాథనాయుడుకు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పునిచ్చింది. బంగారు గొలుసు లాగేశారు! పలమనేరు: తన మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొన్నారని ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో గంగమ్మ జాతరకు తమిళనాడుకు చెందిన ఉష అనే మహిళ తన బంధువుల ఇంటికొచ్చింది. అయితే ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ అనే మరో మహిళ ఉషపై గొడవకు దిగి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తనకు ఉష రూ.5 లక్షలు బాకీ ఉన్నందునే తాను ఇలా చేశానని నాగరత్నమ్మ చెబుతోంది. ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు విచారిస్తున్నారు. టమాట మార్కెట్లో అగ్ని ప్రమాదం పలమనేరు: పట్టణంలోని టమాట మార్కెట్ కమిటీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్లోని వ్యర్థాలు, టమాట బాక్సులున్న చోట మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కుని మంటలను అదుపు చేశారు. పిడుగుపాటుకు మేకల కాపరి మృతి కార్వేటినగరం: పిడుగు పాటుకు మేకల కాపరి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పద్మసరస్సు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన దేశయ్య కుమారుడు జీ.వెంకటస్వామి (60) రోజూమాదిరిగానే మంగళవారం మేతకోసం అడవికి మేకలు తోలుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అటవీ ప్రాంతంలోనే ఉన్న వెంకటస్వామిపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో వెంకటస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్రం పొద్దుపోతున్నా మేకల వద్దకు వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అతన్ని వెదుక్కుంటూ కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ వెంకటస్వామి విగతజీవిగా పడి ఉండడంతో బోరున విలపించారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. త్వరలో దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషనన్తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్ సమ్మిట్లో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు.


