breaking news
Chittoor
-
మామిడికి ‘తమిళ’ సెగ
● జిల్లాలోని మామిడిని కొనలేమంటున్న ర్యాంపు నిర్వాహకులు ● తమిళనాడు కాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్డెక్కిన అక్కడి రైతులు ● క్రిష్ణగిరిలో ఫ్యాక్టరీల ఎదుట క్యూకట్టిన వాహనాలు ● జిల్లాలోని మామిడి కాయలకు తమిళ రైతుల సెగ ● కాయలు వద్దంటున్న క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు ● కొనుగోలుకు విరామం ప్రకటించిన ర్యాంపులు కాణిపాకం : మామిడి కొనుగోలు ర్యాంపులకు తమిళనాడు రైతుల సెగ తగులుతోంది. అక్కడి తోతాపురి కాయలు రోడ్డు పాలు కావడంతో తమిళ రైతులు రోడ్డెక్కుతున్నారు. స్థానికంగా పండిన పంటకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలపై దండ యాత్రకు దిగుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాక్టరీలు ఆంధ్రా కాయలను వెనక్కు నెట్టుతున్నారు. ఈ దెబ్బతో జిల్లాలోని ర్యాంపులు కాయలు కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఆరు రోజుల వరకు కొనుగోలుకు విరామం పలకనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 ర్యాంపులున్నాయి. ఈ ర్యాంపులు తోతాపురి కాయలను కొనుగోలు చేసి జిల్లాలోని పలు ఫ్యాక్టరీలకు తరలించడంతో పాటు అధికంగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలోని పండ్ల గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నాయి. 30 నుంచి 40 శాతం కాయలు జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే..మిగిలిన 60 నుంచి 70 శాతం పంటను తమిళనాడులోని క్రిష్ణగిరికి పంపుతున్నాయి. ఈ క్రమంలో ర్యాంపు నిర్వాహకులకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. క్రిష్టగిరిలో పరిస్థితి ఇదీ.. తమిళనాడులోని క్రిష్ణగిరిలో గుజ్జు పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు తోతాపురి కాయలు భారీగా క్యూ కడుతున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద వందల లారీలు, ట్రాక్టర్లు కిక్కిరిస్తున్నాయి. ఇవీ అన్ లోడింగ్ కావాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ఈ కారణంగా పలు వాహనాల్లోని కాయలు మాగిపోతున్నాయి. దీంతో అక్కడి రైతులు కాయలను రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతున్నారు. ఈ సమస్య ఉధృతం కావడంతో అక్కడి రైతులు రోడ్డెక్కారు. తమిళనాడు రైతులను ముందు వరుసలో పెట్టాలని ఫ్యాక్టరీని ముట్టడించారు. దీని దెబ్బకు అక్కడి ఫ్యాక్టరీలు తలొగ్గాయి. జిల్లా అధికారులు చెప్పే ధరకు కొనలేం తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50 అమ్ముడవుతోంది. ఇక్కడ రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయమంటున్నారు. ఇదీ సాధ్యం కాదు. తమిళనాడులోని ఫ్యాక్టరీలు కిలో రూ.4కు కొంటున్నాయి. మేము అదే రేటుకు కొంటే..చేతులు కాల్చుకోవాల్సిందే. ఒక్కో లారీలో 20 వేల టన్నుల కాయలు పంపుతున్నాం. టన్నుకు రూ.1300 నుంచి రూ.1500 వరకు ఇస్తున్నాం. ఇలా ఒక్క లోడ్ పంపించాలంటే లారీకి మొత్తం రూ.30 వేల వరకు ఖర్చువుతోంది. అక్కడి రైతుల సెగతో ఇక్కడి కాయలు వద్దని చెప్పారు. కాయలు కొనుగోలు ఆపేస్తున్నాం. ఈ రోజే కొనుగోలు ఆఖరు. – విజయన్, ర్యాంపు నిర్వాహకులు, చిత్తూరు కాయలు వద్దంటున్న నిర్వాహకులు తమిళళనాడులో తలెత్తిన సెగతో క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలు జిల్లా కాయలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అక్కడి కాయలు రోడ్డుపాలు కావడం, రైతుల నిరసనలు, ధర్నాలతో జిల్లా కాయలను వద్దంటున్నారని ర్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంగా కాయల కొనుగోలు వారం రోజుల పాటు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు రోజుకు 15 లక్షల టన్నుల కాయలు జిల్లా నుంచి క్రిష్ణగిరికి ఎగుమతి చేస్తున్నారు. తోతాపురి కిలో రూ.2 నుంచి రూ.2.50కు కొనుగోలు చేసి..అక్కడి ఫ్యాక్టరీలో రూ.4 వరకు విక్రయిస్తున్నారు. ఇక జిల్లా యంత్రాంగం రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ధరకు తాము కొనలేమని ర్యాంపు నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. జిల్లా నుంచి క్రిష్ణగిరికి కాయలు తరలించాలంటే లారీ బాడుగలే రూ. 30 వేలు వ్యయమవుతోందని వారు వివరిస్తున్నారు. దీనికి తోడు తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లోని మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50కు పలకడంతో జిల్లాలోని ర్యాంపు నిర్వాహకులు అదే రేటును ఫిక్స్ చేశారు. ఇవన్నీ కూడా సిండికేట్ దెబ్బ అంటూ...రైతులు మండిపడుతున్నారు. -
యువతకు తీరని ద్రోహం
● ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు ● కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహం ● యువత పోరును విజయవంతం చేయాలని పిలుపుతిరుపతి మంగళం : అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తామంటూ మాయమాటలు చెప్పి యువతకు మొండిచెయ్యి చూపించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం విద్యార్థులకు అందించలేదని విమర్శించారు. దీంతో కళాశాలల యాజమాన్యాల వేధింపులతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సైతం అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలహీనపరచి అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులపై పెడుతున్న శ్రద్ధలో పావు వంతు కూడా యువత, ప్రజా సంక్షేమంపై చూపడం లేదని మండిపడ్డారు. ఇది ఉద్యమ సమయం కూటమి ప్రభుత్వం చేసిన మోసం, ద్రోహంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యువత పోరుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలిరావాలని కోరారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అందరితో సమన్వయం చేసుకుంటూ తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ల వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని సూచించారు. అనంతరం యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వానికి హడలు పుట్టేలా భారీ సంఖ్యలో యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పుంగనూరు (చౌడేపల్లె) : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయన పర్యటించిన అనంతరం పుంగనూరులో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ మరుగున పడేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారన్నారు. అలాగే పత్తి, మిర్చి, పొగాకు, షుగర్కెన్ (చెరకు) పంటలు సాగుచేసిన రైతులు, చిత్తూరు జిల్లాలో కోట్లు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పల్ప్ ప్యాక్టరీ కూడా మ్యాంగో తోతాపూరి కొనే పరిస్థితి లేదన్నారు. కొద్దో గొప్పో కొనుగోలు చేసినా రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేస్తే రైతు ఏ విధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేరుకు మాత్రం రూ.8 ఇచ్చి కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు చెప్పడం, ప్రభుత్వం ఏమో రూ.4 సబ్సిడీ ఇస్తామని చెబితే రూ.12 గిట్టుబాటు ధర అవుతుందని అనుకుంటే బూటకపు మాటలు చెప్పి రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేయడం పరిస్థితి దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిందన్నారు. ప్రతిపక్ష నేత వెళ్లకుండా అడ్డంకులు రెతులను పలకరించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వెళ్తుంటే రకరకాల అడ్డంకులు, కేసులు పెట్టడం, రైతులను, పార్టీ నేతలను వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టమాటాకు ధరలు లేని సమయంలో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్న ఘటనను గుర్తుచేశారు. ఇప్పుడు టమాటా, మామిడి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. నాలుగేళ్ల పాటు రైతులందరూ క్రాప్ హాలిడే ప్రకటించి సెలవుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, నాయకులు ఫకృద్దీన్ షరీఫ్, రాజేష్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్లు రైతులకు క్రాప్ హాలీడేనే చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -
‘తెల్ల’బోయే దోపిడీ
● తమ్ముళ్ల అక్రమ గ్రానైట్ దందా ● రైతుల భూముల్లో దౌర్జన్యంగా పనులు ● యథేచ్ఛగా పేలుళ్లు ● నిలదీసిన వారికి బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు చంద్రన్నే కాపాడాలి మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులం. మా అందరికీ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. మా తాతగారి నుంచి వచ్చిన భూమిలో గుట్టలు ఉన్న ప్రాంతంలో నీలగిరి చెట్లు పెట్టుకుని, మరికొంత విస్తీర్ణం చదును చేసి సేద్యం చేసుకుని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉండి కూడా మా భూముల్లో దౌర్జన్యంగా రాళ్లు తవ్వుతుంటే ఏమీ చేయలేకపోతున్నాం. రాత్రింభవళ్లు జరుపుతున్న పేలుళ్లతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. మా పొలంలోకి వెళ్లాలంటే భయంగా ఉంటోంది.మా చంద్రన్నే (సీఎం) స్పందించి మమ్మల్ని కాపాడాలి. – మురుగేష్, బాధిత రైతు, జేబి కొత్తూరు అక్రమంగా రాళ్లను ఎత్తుకుపోతున్నారు మా అనుమతి లేకుండా, మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో రాళ్లను బ్లాకులుగా కత్తిరించి ఎత్తుకుపోతున్నారు. శాంతిపురంలో ఉన్న పెద్ద నాయకుడు వెనుక ఉండి పెద్దూరులో ఉన్న చిన్న నాయకుడితో ఈ పని చేయిస్తున్నాడు. అడిగితే కేసులు పెడతామని, ఆఫీసర్లకు చెప్పి మాకు ఉన్న భూములను కూడా పీకేసుకుంటామని అంటున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకునే వారు లేకపోయారు. మా పార్టీ అధికారంలో ఉన్నా మా బతుకులకు దిక్కు లేకుండా పోయింది. – మునిరాజు, బాధిత రైతు, జేబీ కొత్తూరుశాంతిపురం : అధికార అండతో కొందరు తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యంలోని ప్రాంతంలో సొంత పార్టీలోని వారే వద్దని వారించినా అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. విలువైన గ్రానైట్ (తెల్లరాయి)ను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు దోచేస్తున్నారు. దీనికి అడ్డు చెప్పిన వారికి నరకం చూపుతున్నారు. తమ భూముల్లో రాళ్ల తవ్వకం పనులు చేయొద్దన్న పాపానికి ఓ కుటుంబాన్ని వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విపక్షంలో ఉండగా అక్రమ క్వారీలను ఆపాలని పోరాటం చేసిన చంద్రబాబు పాలనలోనే కుప్పంలో కుప్పలు తెప్పలుగా అక్రమ క్వారీలు సాగుతున్నాయి. 121 పెద్దూరు పంచాయతీలోని జేబీ కొత్తూరు వద్ద ఉన్న పులిగుండ్లపల్లి ప్రాంతంలో రెండు నెలలుగా అక్రమ క్వారీ పనులు చేస్తున్నారు. రైతుల అధీనంలోని అసైన్డ్ భూముల్లో ఉన్న భారీ రాళ్లను కత్తిరించి బ్లాకులుగా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనికి అభ్యంతరం చెప్పిన రైతు కుటుంబాలను బెదిరింపులతో నోరు నొక్కుతున్నారు. గుట్టలపై కన్నేసి చెట్ల తొలగింపు జేబీ కొత్తూరుకు చెందిన మునెప్ప కుమారులైన వెంకటరాజు, మునిరాజు, నారాయణస్వామికి అసైన్డ్ భూములు ఉన్నాయి. భాగ పరిష్కారాల్లో అన్నదమ్ములు వీటిని పంచుకున్నారు. అవకాశం ఉన్న మేర భూములు చదును చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగతా భూమి గుట్టలు ఎక్కువగా ఉండటంతో వాటి మధ్య నీలగిరి చెట్లు నాటుకుని వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. కానీ ఆ గుట్టలపై కన్నేసిన టీడీపీ నాయకులు నీలగిరి చెట్లను పెకిలించి వేసి క్వారీ పనులకు పూనుకున్నారు. కంప్రెషర్లు, హిటాచీలతో బ్లాకులను సిద్ధం చేసి కర్ణాటక మీదుగా తెల్లరాయిని తరలిస్తున్నారు. తమ నీలగిరి చెట్లను ధ్వంసం చేయడంపై రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మొత్తం భూములను లాక్కుంటామని, ఓవరాక్షన్ చేస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తే జన్మలో బయటకు రాలేరని దబాయింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు వారు గత్యంతరం లేక మీడియాకు సమాచారం ఇచ్చారు. తమ గోడును వెలుగులోకి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని, సీఎం చంద్రబాబు స్పందించి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అధికార పార్టీలో పట్టున్న నాయకులు సాగిస్తున్న ఈ అక్రమ బాగోతంపై అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. -
మృత్యువులోనూ వీడని బంధం
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్లకు కవల పిల్లలు జన్మించారు. భర్త ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ప్రైవేటు గన్మెన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ కలల రూపాలైన కవలలను ఉన్నతంగా చదివించాలని ఆరాట పడ్డారు. ఈ నేపథ్యంలో సొంతూరి నుంచి చిత్తూరుకు మకాం మార్చారు. ఆ దంపతులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నారు. కానీ ఆ కలలను దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దంపతులిద్దరినీ మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో కుమారుడు, కుమార్తె గాయపడి స్పృహ కోల్పోయారు. గాయపడిన ఆ కుటుంబ ఆశాదీపాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఏం జరిగింది.. ఎలా ఉన్నారో..ఎక్కడ ఉన్నారో ఆ పసి హృదయాలకు పాపం తెలియదు. గుడిపాల : గుడిపాల మండలంలోని కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికుడు సిద్దయ్య(47), అతడి భార్య జ్యోతిలక్ష్మి (43) మృతి చెందగా, కొడుకు, కుమార్తె గాయపడ్డారు. దీంతో కుప్పిగానిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల దైవదర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లి వస్తుండగా పనపాకం సమీపంలోని గడ్డకిందపల్లె వద్ద ఆవును తప్పించబోయి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. దంపతుల ఇద్దరిదీ కుప్పిగానిపల్లె గ్రామమే. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పిల్లల చదువు కోసం చిత్తూరులో నివాసం ఉంటున్నారు. గిరి(13), గాయత్రి(13) బివిరెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. తండ్రి అడుగుజాడలోనే ఆర్మీలో చేరి.. కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నాగరత్నం, సరస్వతీలకు 1978లో సిద్దయ్య జన్మించాడు. నాగర త్నం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి టీటీడీలో పనిచే శాడు. నాగరత్నం చొరవతో కుమారుడు సిద్దయ్య 1998లో ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు, జగద కుమార్తె జ్యోతి లక్ష్మిని 2002లో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వరకు పిల్లలు కలగలేదు. అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. పిల్లలను ఉన్నతంగా చదివించాలని.. పిల్లలు జన్మించిన అయిదు సంవత్సరాలకు వారి చదువు కోసం చిత్తూరులో కాపురం పెట్టారు. సిద్దయ్య 2020 సంవత్సరంలో ఆర్మీ నుంచి ఉద్యోగ విరమణ పొందారు.ఈక్రమంలో చిత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నారు. పుట్టిన రోజే మృత్యుఒడిలోకి సిద్దయ్య పుట్టిన రోజుకి ఎప్పుడూ తిరుమల దైవ ద ర్శనానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరు మలలో స్వామిని దర్శించుకొని పిల్లలు, భార్యతో కలిసి కారులో తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిని మృత్యువు వెంటాడడంతో దంపతులు మృత్యుఒడికి చేరుకోగా పిల్లలు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సైనికుడిగా ఉన్న సిద్దయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ప్రైవేట్ గన్మెన్గా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహిత్రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దైవదర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి దంపతుల మృతితో విషాదం కుప్పిగానిపల్లెలో విషాదఛాయలు -
మామిడి రైతులను ఆదుకోవాలి
గంగాధర నెల్లూరు : మామిడి రైతుల కన్నీళ్లు చూస్తుంటే కడుపు కాలిపోతోందని రైతు ఉద్యమ నేత ఈదర వెంకటాచలం నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు పూత్తూరు మార్గంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మామిడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతుల పడుతున్న కష్టాలను గమనిస్తున్నామన్నారు. ఏడాది పొడువునా కన్న బిడ్డల్లా మామిడి పంటను సాగు చేస్తే నేడు గిట్టుబాటు ధర లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కుటుంబాన్ని వదిలి వారాల పొడవున ఫ్యాక్టరీ గేట్లు ఎదుట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో తిండి నిద్రలేక రోడ్లపై రైతులు అగచాట్లు పడుతున్నా ఆదుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మామిడికి కనీసం మద్దతు ధర 50 రూపాయలు ఇచ్చి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు. -
ఎంటీఎస్ టీచర్లపై కుట్ర
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) టీచర్ల బదిలీల ప్రక్రియలో ఖాళీలన్నీ చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభించారు. ఆ రెండు డీఎస్సీల టీచర్లకు టీడీపీ ప్రభుత్వం పాలనలో అన్యాయం జరిగితే గత వైఎస్సార్సీపీ సర్కారు మేలు జరిగేలా చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ టీచర్గా పనిచేయాలని కలలు కన్న ఆ టీచర్ల కోరికను వైఎస్సార్సీపీ సర్కారు నెరవేర్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లపై కక్ష సాధింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఖాళీలు బ్లాక్ చేసి.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీలన్నీ చూపించకుండా తక్కువ ఖాళీలను చూపించి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎంటీఎస్ టీచర్లు తమకు అన్యాయం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యాశాఖ అధికారులకు హెచ్చరించారు. దీంతో ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.15 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల నుంచి హాజరైన ఎంటీఎస్ టీచర్లు పడిగాపులు కాశారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఎంటీఎస్ టీచర్ల డిమాండ్లను పరిశీలించిన జిల్లా వి ద్యాశాఖ అధికారులు సమస్యలను ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించిన తర్వాత 3.15 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షించారు. వైఎస్సార్ 98 డీఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు స్వామి కణ్ణన్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు ఎంటీఎస్ టీచర్ల సమస్యలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 పోస్టులకు మొదటి విడతగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 369 పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 1664 పోస్టులను ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్లో చూపించారు. ఇందులో 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లాలో 1115 టీచర్ల పోస్టులు మిగులు ఉంటాయి. ఆ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. -
యువతను నమ్మించి వంచించింది
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగాల కల్పనలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఇంత వరకు యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం యువత పోరుకు పిలుపునిచ్చింది. సోమవారం ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు చర్యలు చేపట్టాం. యువత అధిక సంఖ్యలో హాజరై తమ గళాన్ని వినిపించాలి. – హేమంత్రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం హామీల అమలులో విఫలం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందింది. యువతకు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు పలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాకా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించారు. కూటమి ప్రభుత్వం మోసానికి నిరసనగా నేడు యువత పోరు ర్యాలీ నిర్వహించనున్నాం. డిమాండ్లు పరిష్కరించకపోతో ఆందోళనలు ఉధృతం చేస్తాం. – మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు ● -
యువతకు కూటమి దగా
● నేడు జిల్లా కేంద్రంలో ‘యువతపోరు’ నిరసనలు ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్కు ర్యాలీ ● హామీలు అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్ : సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మాట తప్పింది. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో యువత పోరు నిరసన చేపట్టనున్నారు. అగమ్య గోచరంగా చదువులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయని దుస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు ఊసే లేకుండా పోయాయి. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ గతంలో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లో పెట్టారు. జిల్లాలో 183 ఉన్నత కళాశాలల్లో చదువుతున్న 24,149 మంది విద్యార్థులకు రూ.44.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఉన్నత చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నిరసన కార్యక్రమం ఇలా.... జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న అమూల్ డెయిరీ వద్ద యువత పోరు నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి యువత విచ్చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్కు డిమాండ్ల వినతిపత్రం అందజేయనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి పలు శాఖల్లో ఉద్యోగుల తొలగింపును వెంటనే ఆపాలి. ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి పోస్టులను భర్తీ చేయాలి గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి నిరుద్యోగ భృతి అమలు చేసి నిధులు కేటాయించాలి. నిరుద్యోగ భృతి విడుదల చేయాలి. -
శ్మశానంలో పూడ్చనివ్వం..!
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోజుకో ఆటవిక చర్య వెలుగు చూస్తూనే ఉంది. మొన్న శాంతిపురం మండలంలో ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంలో మహిళలను కొట్టడం, నిన్న కుప్పం మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదని భార్యను చెట్టుకు కట్టేసి కొట్టడం, జరుగు పంచాయతీలో మగదిక్కు లేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే... కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజుకు శివానంద, మంజునాథ్, శివశంకర్ (35) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెంట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు.. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు (క్రతువు) నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించ లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కు తగ్గారు. పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’
సాక్షి, చిత్తూరు జిల్లా: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కాయలు కిలో 2,3 రూపాయలు ధరలు ఉంటే రైతులు ఎలా బతకాలి? చంద్రబాబు చెప్పేటివి బూటకపు మాటలు’’ అంటూ మండిపడ్డారు.‘‘ఎన్నిసార్లు చంద్రబాబు సీఎం అయిన రైతులను పట్టించుకున్నది లేదు. వ్యవసాయం దండగ అని స్వయనా ఒక సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి?. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలవాల్సిందిపోయి అందరి రైతుల ఉసురుతీస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ జగన్ వెళ్తుంటే.. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురిచేస్తోంది. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు ఈ ప్రభుత్వంలో సెలవులో ఉండాల్సిందే. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. -
తిరుపతి: కారులో చెలరేగిన మంటలు.. దంపతులు మృతి
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి రోడ్డు ప్రమాదంలో ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్దయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చిత్తూరుకు వెళుతుండగా కారు చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద డివైడర్ను వేగంగా డీకొంది.ఈ ఘటనలో సిద్దయ్య (40), ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రా‘నైట్’..రైట్రైట్!
చిత్తూరు అర్బన్: భూగర్భ గనులశాఖ (మైన్స్) పరిపాలన చిత్తూరు జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పారీ్టకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీ మామూళ్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్ రాళ్లను తవి్వ, వాటిని ఫ్యాక్టరీల్లో కట్ చేయించి, పాలిష్ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్ మీటరు గ్రానైట్కు వాటి రంగు ఆధారంగా స్లాబ్ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్ రుసుములను చెల్లించాలి.రాఘవ కన్స్ట్రక్చన్స్ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యం కొందరు క్వారీ యజమానులు గ్రానైట్ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. భారీ మొత్తంలో గ్రానైట్ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్ స్మగ్లింగ్ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
భృతి ఎగ్గొట్టారు
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ మాయమాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగభృతి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచేసింది. మోసం చేయడం సబబుకాదు. – మున్నా, చిత్తూరు మోసం చేశారు 2014–2019 సంవత్సరాల్లో రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీనిచ్చారు. తూతూమంత్రంగా ఆ భృతిని కొందరికే ఇచ్చి మోసం చేశారు. ఈ సారి కూడా అలాగే మోసం చేస్తున్నారు. నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఉచ్చులో పడి అల్లాడుతున్నారు. ఉద్యోగాలు ఏమైన ఇస్తార అంటే అది కూడ లేదు. – సంజయ్, చిత్తూరు -
ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మంజూరు చేయాలి. – మన్సూర్, పుంగనూరు ఇస్తారో.. ఇవ్వరో కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇప్పుడు ఆ నిధుల గురించి ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. ఇలా చేస్తే ఎలా..? – రుషి, పలమనేరు -
ఇటు కోతలు.. అటు దాడులు!
నేలరాలుతున్న మామిడి సీజన్ ఆఖర్లోనైనా ధరలు పలుకుతాయేమోనని చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలేశారు. మాగిన కాయలు రాలి నేలపాలవుతున్నాయి. ఎంత ధర దక్కినా అమ్ముదామునుకొని కాయలు దింపిన రైతులు గుజ్జు ఫ్యాక్టరీల వద్దకెళితే టోకెన్లు దొరకడం లేదు. ఫ్యాక్టరీల వద్ద బండ్లు పెట్టుకొని వేచి చూడాల్సి వస్తోంది. దీంతో కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లిన మామిడి కాయలను చేలల్లో పారబోసి వచ్చేస్తున్నారు. మరికొందరు తోటల్లో కాయలు కోయకుండానే వదిలిపెట్టేస్తున్నారు. టమాటాలకంటే తోతాపురి మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సకాలంలో అన్లోడ్ చేసుకోక ట్రాక్టర్ల ట్రక్కుల్లోనే కాయలు కుళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు కాయలను తోటల్లోనే వదిలేయడంతో అవి మాగి వాసన వెదజల్లుతున్నాయి. ఇదే అదునుగా ఏనుగుల మంద తోటలపై పడి ఉన్న కాయలను ఊడ్చేస్తుండడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. పలమనేరు: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడాది మామిడి నట్టేన ముంచేసింది. తోతాపురి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. వీటికి ధరల్లేక గుజ్జు పరిశ్రమల్లో టోకెన్లు చిక్కక, స్థానిక మండీల్లో అడిగేవారు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులేమో తోటల్లోని కాయలను పలు దఫాలుగా కోయాలని ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు తోటల్లోనే కాయలు మాగి నేలరాలుతున్నాయి. మాగిన మామిడి వాసనతో కౌండిన్య అడవిలోంచి ఏనుగుల గుంపు మామిడి తోటలపై పడి కాయలను ఆరగిస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో మరీ ఘోరం... జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడితోటలున్నాయి. ఏటా ఈ సీజన్లో 7 లక్షల టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. ఇందులో 45 వేల ఎకరాల్లో తోతాపురి రకమే ఉంది. మూడున్నర లక్షల టన్నుల దాకా తోతాపురి దిగుబడి ఉంటుంది. కాగా ఏనుగుల సంచారం ఉన్న పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాల్లో మామిడి ఉండగా.. ఇందులో 22వేల ఎకరాలు తోతాపురి రకంగా ఉంది. వీటికి ధరల్లేక రైతులు తోటల్లోనే మామిడిని వదిలేశారు. ఇదే అదునుగా ఏనుగులు మామిడి తోటలనే టార్గెట్ చేస్తున్నాయి. పలమనేరు, బంగారుపాళెం, పెద్దపంజాణి, గంగవరం, సోమల, గుడిపాల తదితర మండలాలు కౌండిన్య అడవికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా రెండు విధాలుగా మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. లోకల్ ర్యాంపుల్లో మొదలుకాని వ్యాపారం తోతాపురికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోనే ఏటా వ్యాపారులు ర్యాంపులు పెట్టి సరుకును కొనేవారు. దీంతో ఫ్యాక్టరీలకు వెళ్లే సరుకు తగ్గేది. ఈ దఫా ధరలు లేనందున బయటి వ్యాపారులు చాలా చోట్ల ర్యాంపుల వద్ద మామిడి కాయల వ్యాపారాలు మొదలు పెట్టలేదు. బంగారుపాళెం సమీపంలో మామిడిని చేలల్లో అన్లోడ్ చేస్తున్న రైతుఏనుగులు తినేస్తున్నాయి మాకు 2.5 ఎకరాల్లో మామిడితోట ఉంది. ఈ మధ్య రెండు సార్లు ఏనుగుల మంద తోటపై పడి కాయలను తిని, కొమ్మలను విరిచేశాయి. పోనీ కాయలు దించి అమ్ముదామంటే కిలో రూ.3 కూడా కొనేవారు లేరు. సంతవ్సరానికోపంట.. దీన్ని నమ్ముకుని బతికేటోళ్లం. అందుకే మామిడితోటే వద్దనుకుంటున్నాం. – నాగరత్మమ్మ, తిప్పిరెడ్డిపల్లి భారీగా నష్టపోయాం ఈ దఫా మామిడితోటలుకొని లక్షల్లో నష్టపోయాం. తోటకు కొట్టిన మందుల ఖ ర్చు, తోటమాలి డబ్బు కూడా మిగల్లేదు. పలమనేరులో ర్యాంపు లేదు. బంగారుపాళెంకు పోవాలంటే టన్నుకు ట్రాక్టర్ బాడుగ, కూలీలకే రూ.2,500 అవుతోంది. అక్కడ టన్నుకు దక్కేది రూ.3 వేలు. మాకు మిగిలేది రూ.500. – నయాజ్, మామిడితోటల కొనుగోలుదారు, పలమనేరు పలు దఫాలుగా కోతలు కోయాలి రైతులు తోటల్లోని కాయల ను మాగినవి మాత్రమే పలు దఫాలుగా కోయాలి. అప్పుడు సీజన్ ఆఖర్ దాకా కోతలుంటాయి. ఒకేసారి కాయలన్నీ దించేసి వాటిని అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంకా ర్యాంపులు ప్రారంభం కానిచోట్ల ర్యాంపులు ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
మామిడి రైతులకు న్యాయం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి నేలరాలుతోందని, న్యాయం చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. శనివారం కలెక్టరేట్ వద్ద రైతు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వ అలసత్వ వైఖరిని ఎండగట్టారు. రైతు సంఘం నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మామిడి కిలో రూ.12 పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అనేక ఫ్యాక్టరీలు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. చాలా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాల్సింది పోయి రూ.5 ఇస్తున్నాయన్నారు. వారిని చూసి ర్యాంపుల నిర్వాహకులు రూ.3 ఇస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీని రూ.6గా అందజేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ రూ.5 ఇచ్చేలా ప్రతిపాదనలు అనంతరం రైతు సంఘ నాయకులతో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా గుజ్జు పరిశ్రమల యజమానులు రూ.6 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీ రూ.4కు బదులు రూ.5 ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ర్యాంపుల ఆగడాలను అరికడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో నిబంధనలు పాటించని నాలుగు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ర్యాంప్లను సైతం క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రైతు సంఘ నాయకులు రామానాయుడు, ఉమాపతి, మునీశ్వర్రెడ్డి, ఆనంద్నాయుడు, మునిరత్నం, హేమలత, భారతి, రాజేందర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ● గిట్టుబాటు ధరపై కలెక్టరేట్ వద్ద ధర్నా ● రైతులతో కలెక్టర్ చర్చలు ● ప్రభుత్వ సబ్సిడీ పెంపునకు ప్రతిపాదనలు -
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయంలో రద్దీ చోటుచేసుకుంది. క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. రాత్రి వరకు కూడా రద్దీ తగ్గలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ (ఎంటీఎస్, మినిమం టైం స్కేల్) టీచర్లకు ఆదివారం బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల సీనియారిటీ జాబితా సంబంధిత మండలాలకు పంపినట్లు చెప్పారు. ఆ జాబితా ప్రకారం ఆదివారం చిత్తూరులోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 2008 ఎంటీఎస్ టీచర్లకు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. నేడు గురుకులాల్లో సీట్ల కేటాయింపు తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆదివారం సీట్లు కేటాయించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాలికలకు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సమీపంలోని సంజయ్ గాంధీ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే బాలురకు చిత్తూరులోని వేము ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని పూతలపట్టు బాలుర గురుకుల పాఠశాలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి హాజరు కావాలని ఆమె కోరారు. గిన్నిస్ రికార్డు కోసం గిరిజన పిల్లలకు కష్టాలా? చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ రికార్డు, ప్రధాని మోదీ మెప్పు కోసం గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన హాస్టల్స్ నుంచి యోగాంధ్ర కార్యక్రమానికి అర్ధరాత్రి 2 గంటలకు బస్సులో తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులు నిద్రించడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇదే రీతిలో ప్రజాప్రతినిధుల పిల్లలను తరలిస్తారా..? అని ప్రశ్నించారు. వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పౌష్టికహారం పెట్టడానికి, జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించడం చేతకాదని, యోగాంధ్ర కార్యక్రమానికి మాత్రం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు శనివారం హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ 2,300 డాలర్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈవో పెంచలకిషోర్కు ఆ నగదును అందజేయగా.. ఆయన దాత కుంటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. గుర్తుతెలియని వాహనం ఢీ : ఒకరికి తీవ్ర గాయాలు రొంపిచర్ల: గుర్తుతెలియ వివాహం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారి, రొంపిచర్ల మండలం, పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. తూర్పు దళిత వాడకు చెందిన వెంకటరమణ 42 బండికింద పల్లె పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొంది. వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రొంపిచర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వెంకటరమణను చికిత్స నిమిత్తం అన్నమయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యూటీలో గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్ చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుతో మురళీకృష్ణ (61) అనే హెడ్ కానిస్టేబుల్ శనివారం మృతి చెందారు. చిత్తూరులోని గంగనపల్లికు చెందిన మురళీకృష్ణ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రికి 8.30 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో అక్కడే డ్యూటీలోనే ఇబ్బంది పడ్డారు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. హెడ్కానిస్టేబుల్ మృతిపై ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ
చిత్తూరు కార్పొరేషన్: పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజ అనా రోగ్యం కారణంగా చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో బంధువుల నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆమెను శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పారు. తొలుత నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్రెడ్డి, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, ప్రసన్న, మనోజ్రెడ్డి, శేఖర్, అల్తాఫ్, స్టాండ్లీ పాల్గొన్నారు. కళ్యాణ్పై పీడీ యాక్టు పలమనేరు: పట్టణంలోని మొండోళ్ల కాలనీకి చెందిన ఎం.కళ్యాణ్(30)పై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్టు పలమనేరు డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ శనివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసుతోపాటు మరో పది నేరాలు కళ్యాణ్పై ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ చట్టాన్ని నమోదు చేశామన్నారు. -
గ్రానైట్ రాయి పడి..
గుడిపాల: గ్రానైట్ రాయి పడి కాళ్లు నుజ్జునుజ్జు అయిన ఘటన గుడిపాల మండలంలో చోటుచేసుకుంది. గుడిపాల క్రాస్ సమీపంలో ఉన్న రాధిక గ్రానైట్లో అస్సాం రాష్ట్రానికి చెందిన రంజన్వల్లి(32) పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రానైట్ రాయిని కోసేందుకు మిషన్పై ఎక్కించి తోస్తుండగా అదుపుతప్పి రాయి కాళ్లపై పడింది. దీంతో అతని కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. 108 సిబ్బంది శివ అతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
హెడ్ కానిస్టేబుల్పై కేసు
పుత్తూరు: గత ఏడాది మే 13న జరిగిన అసెంబ్లీ, లోకసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు పుత్తూరు హెడ్ కానిస్టేబుల్పై శుక్రవారం రాత్రి పోలీసు కేసు నమోదైంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన కె.మురగారెడ్డి(59) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.మాధవ (హెచ్.సి.2727)పై పుత్తూరు జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. మురగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో గత ఏడాది మే 13వ తేదీన తాను ఓటు వేయడానికి తిమ్మాపురంలోని పోలింగ్ బూత్ నం.40 వద్దకు వెళ్లిన సమయంలో మొబైల్ పార్టీ ఇన్చార్జ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మాధవ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలు కేసు నమోదు చేయలేని (నాన్–కాగ్నిజబుల్) స్వభావం కలిగి ఉన్నందున స్థానిక జేఎఫ్సీఎం కోర్టు అనుమతితో ఏఎస్ఐ పొన్నుస్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును పుత్తూరు డీఎస్పీ ఆదేశాల మేరకు మరో స్టేసన్కు బదిలీ చేసే అవకాశం ఉంది. -
వేతనాలు పెంచాలని నిరసన
చిత్తూరు అర్బన్: మున్సిపల్ ఇంజినీరింగ్, కార్మికులు జీతాలు పెంచాలని మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షుడు యం.శరవణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్ రూ.29,200, సెమీ స్కిల్డ్ రూ.24,600 చెల్లించాలన్నారు. మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచాలన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద కార్మికులకు గ్రాట్యూటీ రూ.10 లక్షలు మంజూరు చేస్తూ.. కార్మికునికి నెలకు పింఛను రూ.10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఅసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శరవణ, ప్రధాన కార్యదర్శి డీ.శివకుమార్, కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు పీ.వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఎం.హరికృష్ణ, ఎన్.వెంకటేష్, జాయింట్ సెక్రెటరీ టీ.గోపాలాచారి, ఏ.ఉషా యూనియన్ సభ్యులు కే.వీ.సునీల్కుమార్, డీఎపీ.శంకర్, ఎస్.పీరుల్లా, ఎం.వేలు, కే.సుజాత పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని పులిగుండు, బోయకొండ, కంగుంది, కాణిపాకం, బోయకొండలో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన గుర్తుచేశారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చన్నారు. అనంతరం యోగా ట్రైనర్స్ ఉన్న విశాల్, రెడ్డిమస్తాన్, రాధిక, సునీత, ప్రేమ్సాయి, శ్రీనివాస్, బాబుకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, టూరిజం అధికారి గౌరీ, అర్బన్ తహసీల్దార్ కులశేఖర్ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ -
పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు
● అప్పు చేసి చదువుకుంటున్న పేద విద్యార్థులు ● బకాయిలు విడుదల చేయకుండా మొండికేస్తున్న కూటమి నేతలు ● ఏడాదిగా భృతి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ● రేపు కలెక్టరేట్ ఎదుట యువత పోరుకు వైఎస్సార్సీపీ సన్నద్ధం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ కళాశాలల్లో 2,30,456 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 90 వేల మందికి పైగా ఉన్నారు. ఉన్నత చదువులు చదివి అరకొర జీతంపై ఆధారపడి స్థానికంగా, ఇతర రాష్టాలకు వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. హామీలిచ్చి..తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 147 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఏడాదిగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అటకెక్కించింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి చేతులు పైకెత్తేసింది. ఏటా 20 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా.. ఎన్నో హామీలను తుంగలో తొక్కేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,85,458 మంది నిరుద్యోగులు భృతికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. 2014లో ఇదే తరహా మోసం 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 600కు పైగా హామీలిచ్చి గద్దెనెక్కారు. ఆపై ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జాబు రావాలంటే..బాబు రావాలి.. అంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కపట ప్రేమ కురిపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం పేరుతో ముందుకొచ్చి సవాలక్ష ఆంక్షలు విధించారు. భృతిని రూ.వెయ్యికి కుదించేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలో లక్షకు పైగా నిరుద్యోగులు ఉండగా ప్రభుత్వం విధించిన నిబంధనలతో పథకానికి 12 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఊసేలేని ఫీజు రీయింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. విద్యాదీవెన, వసతిదీవెన నిధుల కోసం విద్యార్థులు ఏడాదిగా ఎదురుచూడాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ‘నేను మారాను.. మిమ్మల్ని మారుస్తాను. నన్ను నమ్మండి. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తాం. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఫీజురీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు బాటలు వేస్తాం. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం. పేద విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తాం’ అంటూ గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ అంటూ యువతరాన్ని బుట్టలో వేసుకున్నారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించేసి నిరుద్యోగులను రోడ్డున పడేశారు. ఫీజురీయింబర్స్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువతపోరుకు సన్నద్ధమవుతోంది. యువతపోరుపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్ట్..జిల్లా సమాచారం డిగ్రీ కళాశాలలు 116 ఇంజినీరింగ్ కళాశాలలు 14 ఐటీఐ కళాశాలలు 18 నర్సింగ్ కళాశాలలు 07 పాలిటెక్నిక్ కళాశాలలు 08 మెడికల్ 02 బీఈడీ 07 ఎంబీఏ, ఎంసీఏ 11 మొత్తం కళాశాలలు 183 ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు నియోజకవర్గం విద్యార్థులు పెండింగ్ మొత్తం (రూ.కోట్లల్లో) చిత్తూరు 2,517 4,82,02,359 నగరి 3,444 6,20,96,235 పుంగనూరు 4,694 8,76,63,867 పూతలపట్టు 3,006 6,28,15,905 పలమనేరు 4,252 6,99,16,920 కుప్పం 3,049 5,04,42,063 గంగాధరనెల్లూరు 3,187 6,64,84,512 మొత్తం 24,149 44,76,21,861 భృతి ఇవ్వాల్సిందే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి యువత, విద్యార్థులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి. – మనోజ్రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు వలసలే గతి జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీయువకులు వలసబాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, తదితర చదువులు చదివిన యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వందలాది మంది నిరుద్యోగులు స్థానికంగానే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలకు వయస్సు దాటి పోతుండడంతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. రేపు కలెక్టరేట్ వద్ద యువత పోరు పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, జాబ్క్యాలెండర్ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరుద్యోగుల పక్షాన యువత పోరుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి యువత, ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు సిద్ధమవుతున్నారు. -
మరో నాలుగేళ్లు రైతులకు ఇబ్బందులు తప్పవు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు.వైఎస్ జగన్ పాలనలో మామిడి రైతులకు మేలు జరిగింది. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి రూ.25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలుపైనే అమ్మకం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో కిలో మూడు రూపాయలకు అమ్మకం చేద్దామన్న కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఈరోజు రైతులకు ఏవిధం మేలు చేస్తాడు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు ఈ పాలనలో ఇబ్బందులు తప్పవు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం: మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మామిడి, పాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో రూ.3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4-5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తాం’’ అని మిథున్రెడ్డి చెప్పారు. -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
నిండ్ర: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మండలంలోని శ్రీరామపురం పంచాయతీ శ్రీరామాపురం గ్రామానికి చెందిన యవరైతు హేమాద్రి(29) భార్య దీప, కుమారుడు ఉన్నాడు. తనకున్న పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో కొంత వరకు బ్యాంక్లోను, ఇతరుల వద్ద అప్పు చేశాడు. ఇలా సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు భరించలేక బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హేమాద్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా కోహ్లీ ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ నియమితులయ్యారు. విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని ఐజర్లో ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆయనను ఇన్చార్జి రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఐజర్ పాలనా చట్రాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి చౌడేపల్లె: బైక్పై నుంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం... చారాల పంచాయతీ, జంగాలపల్లెకు చెందిన రాజమ్మ(65) చౌడేపల్లెకు వచ్చింది. ఆమె సమీప బంధువైన శ్రీరాములుతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె సమీపంలోని డౌన్లో కుక్క ఎదురుగా రావడంతో బైక్ అదుపుతప్పింది. ఈ క్రమంలో బైక్పై నుంచి రాజమ్మ జారిపడింది. వెంటనే ఆమెను మదనపల్లెలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది. -
బండి దొరక్క బేజారు!
● జిల్లాలో ట్రాక్టర్లకు భలే డిమాండ్ ● మామిడికాయల ఎఫెక్ట్తో ట్రాక్టర్ల కొరత ● మామిడి కాయల తరలింపునకు రాని లారీలు కాణిపాకం: మామిడి రైతులు ఆలస్యంగా వచ్చిన పూతతో పులకరించిపోయారు. కాయలొచ్చాక మీసం తిప్పారు. కోత కొచ్చాక కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాయలు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలో నలిగిపోయారు. టోకన్లు చేతికొచ్చాక కోత కోసి తీసుకెళితే ఫ్యాక్టరీ వద్ద పడిగావులు కాస్తున్నాయి. ట్రాక్టర్ చార్జీలు, వెయిటింగ్ చార్జీలు, డ్రైవర్ కూలీలు పట్టిపీడిస్తున్నాయి. దీనికితోడు లారీలు మామిడి కాయల తరలింపునకు పంపలేమంటూ ఓనర్లు మొండికేస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది. నిరీక్షిస్తూ.. నీరసిస్తూ! జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి వేగంగా మామిడి కోతలు ప్రారంభయ్యాయి. అష్టకష్టాలు పడి టోకన్లు సంపాధించిన రైతులు వారికి ఇచ్చిన తేదీ ప్రకారం కాయలు కోసి ట్రాక్టర్లలో ఫ్యాక్టరీలకు తీసుకెళుతున్నారు. అయితే అక్కడ రైతులు అనుభవిస్తున్న కష్టాలు అన్నీఇన్నీకావు. కాయలు అన్లోడింగ్కు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఫ్యాక్టరీల్లో సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వడంతో సామాన్య రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద 200 నుంచి 800 ట్రాక్టర్లు నిరీక్షిస్తున్నాయి. ఒక్కలోడయ్యా..రావయ్యా! ట్రాక్టర్లన్నీ కూడా ఫ్యాక్టరీల వద్దే నిలబడి పోయాయి. రోజులు తరబడి అక్కడే ఉండిపోతున్నాయి. ముందుకు..వెనక్కు వెళ్లడం తప్ప ఫ్యాక్టరీలో కాయలు దింపాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ట్రాక్టర్ యజమానులకు వారి..వారి గిరాకీలే సరిపోతున్నాయి. కొంతమంది సొంత పంటను తరలించుకునేందుకు పరిమితం చేశారు. మిగిలిన ట్రాక్టర్లు బాడుగలకు పంపుతున్నారు. ఈ బండ్లు చాలక రైతులు అల్లాడి పోతున్నారు. ఫ్యాక్టరీలో లోడ్ దింపిన బండ్లు అట్టే బుక్ అవుతున్నాయి. చాలా మంది రైతులు టోకన్లు ఉన్నా ట్రాక్టర్లు దోరకక కోతలు కోయలేకపోతున్నారు. ఒక్క లోడే రండి అని బతిమిలాడుకున్నా ట్రాక్టర్ల యజమానులు ఖాతరు చేయడం లేదు. తడిసిమోపుడవుతున్న ట్రాక్టర్ బాడుగలు ఈసారి మామిడి రైతులకు దిగుబడి బాగున్నా...అందుకు తగ్గ ప్రతిఫలం లేదు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోగా..చేతిలోని పైసలు ఖాళీ అవుతున్నాయి. కోత కూలీలు రైతులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీనికితోడు ట్రాక్టర్ బాడుగలు భారమయ్యాయి. కి.మీను బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు ట్రాక్టర్ బాడుగలు అడుగుతున్నారు. మళ్లీ వెయిటింగ్ చార్జీ రోజుకు రూ.500 నుంచి రూ.1000 ఫిక్స్ చేస్తున్నారు. డ్రైవర్ కూలీ రూ.500, కొంత మంది డ్రైవర్లకు రాత్రి అయితే లిక్కర్ బాటిల్ కూడా ఇవ్వాల్సి ఉంది. లారీలు రావు మామిడి తరలింపునకు లారీలు రానంటూ మొండికేస్తున్నాయి. జిల్లా రవాణా శాఖ అధికారులు లారీ యజమానులతో మాట్లాడినా ఫలితం లేకపోతోంది. కాయలకు వెళితే లారీలకు గిట్టబాటు కాదని సమాచారం. అలాగే తమిళనాడు లారీలను కూడా జిల్లాలోకి అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లను సమకూర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ట్రాక్టర్ దొరకడం లేదు ట్రాక్టర్ కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. ట్రాక్టర్లు దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను శనివారానికి ఫ్యాక్టరీకి తోలేలా టోకన్ ఇచ్చారు. ఇప్పుడు టోకన్ ఉంది కానీ ట్రాక్టర్ దొరకడం లేదు. కోతకోయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. – బాలాజీ, అనుపల్లి, చిత్తూరు -
సిఫారసులు అనుమతించొద్దు
కార్వేటినగరం: మామిడి కాయల రవాణాలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ కర్మాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మామిడి రవాణాలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాయలను దిగుమతి చేసుకోవాలని, మామిడి కొనుగోళ్లలో సిఫార్సులకు తావు లేకుండా చూడాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, సీఐ హనుమంతప్ప, వ్యవసాయశాఖ అధికారిణి హేమలత, ఏబీసీ జ్యూస్ పరిశ్రమ మేనేజర్ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరాజు, యుగంధర్ ఉన్నారు. రిక్వెస్ట్, మ్యూచువల్కే అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్ష శాఖ పరిధిలో నిర్వహిస్తున్న బదిలీల్లో రిక్వెస్ట్, మ్యూచువల్కు మాత్రమే అవకాశం ఉన్నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ మొదలైందన్నారు. జిల్లాలోని కేజీబీవీల్లోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, మండల స్థాయిలో పనిచేస్తున్న ఐఈఆర్పీ, పీటీ, సీఆర్ఎంటీలు, అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజిర్లకు బదిలీలు నిర్వహిస్తామన్నారు. బదిలీలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21న చివరి తేదీ అని తెలిపారు. అభ్యర్థుల స్టేషన్ సీనియారిటీ, స్పెషల్ సర్వీస్, సీనియారిటీ పాయింట్లను ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాలనుకునేవారు దరఖాస్తులను రాష్ట్ర కార్యలయానికి పంపించాల్సి ఉంటుందని ఏపీసీ వెల్లడించారు. -
నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన 2వ జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అర్హత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.హృతిక్ రాయల్, సలాడీ భువనేష్, ఎం.నిహాంత్ కుమార్, డి.మహిదర్తో పాటు మొత్తం 54 మంది విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో సీట్లు సాధించారని తెలిపారు. గత 35 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ తదితర పోటీ పరీక్షలకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో తమ విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశం సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు. వచ్చే ఏడాదికి నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: ‘విలీనం మాకొద్దు. మా గ్రామంలోనే పాఠశాలను పునరుద్ధరించాలి. ఇతర గ్రామాలకు మా విద్యార్థులను పంపించేది లేదు’ అని బైరెడ్డిపల్లె సచివాలయ పరిధిలోని మిట్టపల్లె గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లితండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 36 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను పక్క గ్రామమైన నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. పక్క గ్రామానికి వెళ్లే టప్పుడు వ్యవసాయ పొలాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉన్నతాదికారులు స్పందించి తమ గ్రామంలోనే పాఠశాలను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న బైరెడ్డిపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లితండ్రులతో సంప్రదించారు. సుమారు అర్ధగంటపాటు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుక్కలతో తీవ్ర ఇబ్బందులు మండలంలోని ఆకులకొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను చలగానిపల్లెలో విలీనం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఎంఈఓ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. గురువారం విద్యార్థులు పాఠశాల నుంచి తమ గ్రామానికి వస్తుండగా కుక్కల బెడదతో భయాందోళనకు గురయ్యారని వాపోయారు. పిల్లల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని విలీనం ఆపాలని కోరారు. -
రోడ్డున పడ్డ మామిడి!
● టన్నుల కొద్దీ రోడ్డుపైనే ● అయోమయంలో అన్నదాతలు కాణిపాకం: మామిడి రోడ్డున పడింది. టన్నుల కొద్దీ తోతాపురి రోడ్డుకే అంకితమవుతోంది. ఫ్యాక్టరీలో అన్లోడింగ్ కష్టాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90శాతం కాయలు పక్వానికి వచ్చేశాయి. ఇకపై కోతలు ఇబ్బముబ్బడిగా ప్రారంభం కానున్నాయి. ఫ్యాక్టరీలు గుజ్జు తయారీ విషయంలో తప్పుడు లెక్కలు చూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీనికితోడు విదేశాల్లో యుద్ధాలు ఫ్యాక్టరీలను భయపెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 56 హెక్టార్ల మేర మామిడి పంట సాగవుతోంది. తద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారుల అంచనా. ఇందులో టేబుల్ రకాలు 16,105 హెక్టార్లకు గాను 1,45,960 మెట్రిక్ టన్నులు, తోతాపురి 39,895 హెక్టార్లకు 4.9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టు ఈసారి పంట దిగుబడి వచ్చింది. అయితే పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గత ఏడాది నిల్వలతో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 పళ్లగుజ్జు పరిశ్రమలున్నాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం 35 ఫ్యాక్టరీలున్నాయి. వీటిలో 12 ఫ్యాక్టరీలు మామిడి గుజ్జు తయారీకి దూరమయ్యాయి. ఇందులో కొన్ని టమాటా వంటి వాటిని గుజ్జు చేసి అమ్ముకుంటున్నాయి. గత ఏడాది యూరఫ్ దేశాల్లో జరిగిన యుద్ధాల ప్రభావం వల్ల ఫ్రిబవరి వరకు 2.5 లక్షలక్ష టన్నుల గుజ్జు నిల్వలు పేరుకుపోయాయి. ఆ తర్వాత కొద్దికొద్దిగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 80 వేల టన్నుల వరకు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఈ భయంతో ఫ్యాక్టరీలు మామిడిపై చిన్న చూపుచూస్తున్నాయి. ఈ ఏడాది అధికారులు బలవంతం చేయడంతో 23 ఫ్యాక్టరీలు తోతాపురి కాయలు కొనుగోలు చేస్తున్నాయి. గుజ్జు తయారీ ఎక్కువ.. లెక్కలు తక్కువ ఉమ్మడి జిల్లాలోని 43 ఫ్యాక్టరీలో 90 లైన్ (మామిడిగుజ్జు తయారీకి అవసరమైన యంత్రపరికరాలు)లు ఉన్నాయి. చిత్తూరులో జిల్లా విషయానికి వస్తే 35 పళ్లగుజ్జు పరిశ్రమలుంటే అందులో 60 లైన్లు ఉన్నాయి. వీటిలో 23 ఫ్యాక్టరీలకు గాను 54 లైన్లు పనిచేస్తున్నాయి. ఒక లైన్లో రోజుకూ 10 టన్నుల కాయల వరకు గుజ్జు తయారీ చేయొచ్చు. కానీ లైన్ క్లీనింగ్ కారణంగా 6 నుంచి 8 టన్నుల కాయల వరకు గుజ్జు చేస్తున్నాయి. ఇలా రోజువారీగా ఒక్కో ఫ్యాక్టరీ 200 నుంచి 250 టన్నుల కాయలను గుజ్జు తయారీ చేస్తున్నాయి. ఈ లెక్కన్న మొత్తం ఫ్యాక్టరీలు 10 వేల నుంచి 11వేల టన్నుల కాయల వరకు గుజ్జు తయారీకి వాడుతున్నాయి. తద్వారా గుజ్జు రూపంలో 5 నుంచి 6 టన్నులకు ఫ్యాకింగ్ అవుతున్నాయి. అయితే అధికారులు వద్ద ఉన్న లెక్కలకు, ఫ్యాక్టరీ నిర్వాహకులు చెప్పే లెక్కలకు పొంతన ఉండడం లేదు. తమిళనాడు నుంచి వస్తున్న కాయలకు ఫ్యాక్టరీలు ఈ లెక్కల్లోకి ఎక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిల్వలు, గుజ్జు తయారీని అధికంగా చూపించి తోతాపురి కొనుగోలును నిలుపుదల చేయాలని ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్ధమైనట్టు రైతులు చెబుతున్నారు. యుద్ధాలతో మళ్లీ వణుకు జిల్లాలో తయారైన పళ్లగుజ్జును గల్ఫ్, యూరఫ్ దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తారు. అయితే ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాలు, ఉక్రెన్–రష్యా యుద్ధాలు పళ్లగుజ్జు పరిశ్రమదారులను గడగడలాడిస్తున్నాయి. ఈ భయంతో మధ్యలో కూడా తోతాపురి గుజ్జును నిలుపుదల చేసే అవకాశాలున్నాయని పరిశ్రమదారుల చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో తోతాపురి అమ్మకాలు మూగబోయే అవకాశాలున్నాయి. తద్వారా 60శాతం పంట తోటలకు పరిమతం కానున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాం కాయలు తెచ్చి మూడు రోజులు అవుతా ఉండాది. ఈ మూడు రోజులు తిండీలేదు.. ఏమీలేదు. తిండి లేకపోయిన పర్వాలేదు. కాయలు దింపుకుంటే చాలు. కానీ ఇంత వరకు దింపుకోలేదు. ఈడ నుంచి ఆడ వరకు 800ట్రాక్టర్లు బారులు తీరాయి. ఇంకో రోజు ఉంటే బండిలో ఉండే కాయలు దేనికీ పనికి రావు. ఈసారి నిండా మునిగిపోయాం. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి స్వామీ. – సుందరయ్య, చిత్తూరు మండలం దమ్మిడీకి పనికిరావ్ మూడు రోజులు, నాలుగు రోజులు ట్రాక్టర్లోనే కాయలుంటే ఎందుకూ పనికిరావు. ఫ్యాక్టరీకి పనికి రావు. రోడ్డు మీద పారేసి రావాల్సిందే. ఫ్యాక్టరీ వద్ద అవస్థలు పడుతున్నాం. బండికి రాత్రంతా కాపాల కాస్తున్నాం. ఇలా అయితే రైతులు ఏమైపోవాలి. ఫ్యాక్టరీ వాళ్లు మాత్రం వాళ్ల సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో పక్క యుద్ధాలు అని చెబుతున్నారు. దాని వల్ల మాకు నష్టమే అంటున్నారు. – కిరణ్కుమార్, పెనుమూరు 41,005 టన్నులు మాత్రమే ఫ్యాక్టరీకి ఈ నెల 6వ తేదీ నుంచి కాయలు కొనుగోలు చేయగా.. అధికారుల వద్ద 8వ తేదీ నుంచి కాయలు కొనుగోలు వివరాలున్నాయి. ఫ్యాక్టరీ నిర్వాహకులు 12 వేలకు పైగా టోకన్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 5,993 మంది రైతులు 41,005 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి వద్ద గణాంకాలున్నాయి. రోడ్డుపైనే గత మూడు రోజులుగా 80 వేల టన్నుల వరకు ట్రాక్టర్లల్లోనే మూలుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జీడీ నెల్లూరు మండలం ఎట్టేరిలోని ఫ్యాక్టరీ వద్ద 800 ట్రాక్టర్లు బారులు తీరగా.. 4వేల టన్నుల కాయలు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. గుడిపాలలోని పానటూరు వద్ద ఉన్న మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద 650పైగా ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇందులో 3,800 టన్నుల మేర ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే గుడిపాల మండలంలోని కొత్తపల్లి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద 850 ట్రాక్టర్లు, లారీల్లో 5 వేల టన్నుల కాయలు రోడ్డుపైనే కాపలాకాస్తున్నాయి. మరిన్ని ఫ్యాక్టరీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. -
ప్రతిశాఖలోనూ మహిళా కమిటీలు
– రెండో రోజు కలెక్టరేట్లో మహిళా కమిషన్ సమీక్ష తిరుపతి అర్బన్ : ప్రతి శాఖలోనూ అంతర్గత మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ ఆదేశించారు. రెండో రోజు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రాథమిక దశలోనే శాఖల సమన్వయంతో పనిచేస్తే మహిళా సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లుకు సంబంధించిన యాక్ట్ను పటిష్టం చేయాలన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యకు జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తుందని తెలిపారు. మహిళలపై నేరాలు ఎక్కువ కావడానికి కారణం సరైన అవగాహన లేకపోవడం, భద్రత కలిగించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. మరోవైపు రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరగడంతో యుక్త వయసులోనే గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి అరికట్టే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనలు క్రమం తప్పకుండా పాటించి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాలో మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా కృషి చేస్తామని తెలిపారు. మహిళల్లో ఆర్థిక సాధికారత సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వీరందరూ కూడా మహిళలపై జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనల మేరకు జిల్లాలోని మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మెంబర్ రోఖాయా బేగం, మహిళా పోలీస్ డిఎస్పి శ్రీలత, కృష్ణకుమారి జాయింట్ డైరెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంత భాయి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
23న యువత పోరు
● వాల్పోస్టర్ విడుదల చేసిన విజయానందరెడ్డి ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చిత్తూరు కార్పొరేషన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువతపోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో యువతపోరు వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరులోని అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలిసి ర్యాలీగా బయలుదేరుతామన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేసి, సమస్యల పై కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. అస్తవ్యస్తంగా చదువులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాల ఉసేలేవన్నారు. పేద కుటుంబాల్లో పిల్లలు చదవులు అగమ్యగోచరంగా మారినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఫీజులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.18,663 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించిందన్నారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ నిర్వహణ ఖర్చుల కింద రూ.7,800 కోట్లు చెల్లించినట్టు గుర్తుచేశారు. కాగా కూటమి ప్రభుత్వం ఫీజుల కింద రూ.700 కోట్లు ఇచ్చామని చెబుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఈ విద్యా సంవత్సరం రూ.3,900 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. జాబ్క్యాలెండర్ ఎక్కడ? చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి మాట్లాడుతూ మీకు రూ.15వేలు... అంటూ ఉకదంపుడు ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు రూ.13వేలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అదేఽ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేతులు పైకెత్తేశారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నోటీఫికేషన్ ఇచ్చినా నిబంధనల పేరుతో అభ్యర్థులకు నష్టం కలిగించారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. భృతి ద్వారా అందాల్సిన వేలకోట్లు నిరుద్యోగులు నష్టపోయారన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ.శ్రీధర్, చిత్తూరు రూరల్ యువత అధ్యక్షుడు స్లాండ్లీ, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ సద్దాం, నాయకులు రెడ్డిసాయి, శబరీష్, హితీష్, ప్రవీన్, తరుణ్, సచిన్ పాల్గొన్నారు. -
పుత్తూరు సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్ను, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించడానికి సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంకుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామని అన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్స్లర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నోవేటివ్ విద్యపై శ్రద్ద చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25లో విద్యా సంవత్సరానికి సంబందించి 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్ధనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. మేం బాగా బతికినోళ్లమే‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.వికలాంగ పెన్షన్ను కాజేశారుమా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు. -
గౌరవం లేనప్పుడు.. కుర్చీలెందుకు?
నగరి: ప్రజా ప్రతినిధులైన తమను అడుగడుగునా అధికారులు అవమానపరుస్తున్నారని, గౌరవం లేనపుడు సర్వసభ్య సమావేశంలో కుర్చీలపై ఎందుకు కూర్చోవాలంటూ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో–ఆప్షన్ సభ్యులు నేలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులు నేలపై కూర్చోవడంతో విస్తుపోయిన అధికారులు అలాగే నిలబడ్డారు. ఎంపీడీఓ కృష్ణయ్య సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అధికారుల వ్యవహార శైలిపై సభ్యులు నిప్పులు చెరిగారు. ఎంపీపీ భార్గవి, జడ్పీటీసీ సభ్యుడు గాంధీ మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పనులు జరుగుతున్నాయో, అవి ఎవరు చేస్తున్నారో, ఏ అధికారులు వస్తున్నారో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, చివరకు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు కూడా తెలియని ప రిస్థితి ఉందన్నారు. పథకాలకు ఎవరు అర్హులవుతు న్నారో, ఎవరు అనర్హులవుతున్నారో ఇదివరలో జా బితాను ప్రజాప్రతినిధులకు ఇచ్చేవారని ప్రస్తుతం అలా జరగడం లేదన్నారు. చెరువు ఆయకట్టు కమి టీని ఎన్నుకున్న విషయం కూడా ప్రజాప్రతినిదుల దృష్టికి రాలేదన్నారు. పాస్ ఆర్డరు అయిన రూ.45 లక్షల బిల్లులు చెల్లించకుండా ఆపి ఉంచారని, ఏవే వో కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం లేదు.. గౌరవ వేతనం కూడా లేదు ఏడాది కాలంగా గౌరవంతోపాటు గౌరవ వేతనం కూడా ఆగిపోయిందన్నారు. దీనిపై ఎంపీడీఓ వారి కి సమాధానమిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానని, రెండు రోజుల్లో పాస్ఆర్డరు అయిన బిల్లుల చెల్లింపు జరిగేలా చూస్తానని సభ్యులకు హా మీ ఇచ్చారు. అందరూ కుర్చీల్లో కూర్చోవాలంటూ కోరారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ రెండు రో జుల వరకు సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తామని ఆలోపు పరిష్కరించకుంటే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రోడ్డెక్కుతామన్నారు. ఆ పై అందరూ కుర్చీలపై కూర్చోగా సమావేశం ప్రా రంభమైంది. అధికారులు వారి రంగాల్లో జరుగుతు న్న పనులను సభ్యులకు వివరించారు. మామిడి త రలింపునకు ఇక్కడే టోకెన్లు ఇవ్వాలని, 108 వాహనం మునుపటిలా రావడంలేదని, గ్రావెల్ తరలింపు ఆపాలని సభ్యులు అధికారులను కోరారు. వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్ప పాల్గొన్నారు. -
అవి పచ్చ పార్టీకి కొత్తేమీ కాదు
నగరి : యువకుల జీవితాలతో చెలగా టాలు పచ్చపార్టీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రప్పారప్పా కోస్తాం అంటూ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఒక యువకుడు ప్లకార్డు చూపడంతో వచ్చిన వివాదాలపై ఆమె గురువారం స్పందించారు. ప్లకార్డు ప్రదర్శించిన రవితేజను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారని, నిజానికి రవితేజ టీడీపీకి చెందిన వ్యక్తి అన్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించడానికి టీడీపీ చేసిన కుట్ర అని తేటతెల్లమైందన్నారు. తమ బిడ్డ టీడీపీలో ఉన్నాడని స్వయంగా వారి కుటుంబ సభ్యులు చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రవితేజ టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును కూడా వారు చూపెట్టినట్టు గుర్తుచేశారు. రవితేజను బలవంతంగా తీసుకువెళ్లడంతోనే ప్లకార్డులు పట్టుకున్నాడని తెలిపారు. -
దళితులకు అడుగడుగునా అవమానాలే!
వెదురుకుప్పం: కూటమి ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో దళిత గ్రామాలకు వెళ్లి నేను పెద్ద మాదిగ అని చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో మాదిగపల్లె సామాజిక బహిష్కరణకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యల్లేవన్నారు. దళిత సర్పంచ్ని సైతం అగౌరపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తే ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రశ్నించారు. గురువారం వెదురుకుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత జాతి పట్ల ఘోర అవమానాలు జరుగుతున్నా హోం మంత్రి చర్యలు తీసుకోలేదన్నారు. -
ముసలిమడుగుకు మరో కుంకీ ఏనుగు
పలమనేరు: మండలంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు మరో కుంకీ ఏనుగు చేరింది. స్థానిక అటవిశాఖ అధికారులు తిరుపతి జూ నుంచి గనేణ్ అనే కుంకీ ఏనుగును ప్రత్యేక వాహనంణంలో గురువారం ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, ఆపై రామకుప్పం మండలంలోని ననియాల నుంచి రెండు కుంకీ ఏనుగులకు ఇక్కడికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఇక్కడ ఏడు కంకీ ఏనుగులు క్యాంపులో ఉన్నాయి. కుంకీ ఏనుగుల ద్వారా కౌండిన్యలోని ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చి వాటిని అడవిలోంచి పంటపొలాల వైపునకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్టు స్థానిక అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
మూలకోనలో వ్యక్తి మృతి
పుత్తూరు: మండలంలోని మూలకోనలో తిరుపతికి చెందిన ధర్మ (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. బుధవారం తిరుపతికి చెందిన ఆరుగురు ద్విచక్ర వాహనాల్లో పుత్తూరు మండలంలోని మూలకోనలో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో ఽతిరుపతి బాలాజీ నగర్కు చెందిన ధర్మ అతిగా మద్యం సేవించడంతో అపస్మారక స్థితికి వెళ్లి మృతిచెందాడు. సహచరుల ఫిర్యాదుతో పుత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మంజు, కుమారుడు హేమంత్ ఉన్నారు. గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు పెద్దపంజాణి/పలమనేరు: పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, కొళత్తూరు పంచాయతీ గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు సాగుతున్నాయి. గురువారం జరిగిన పోటీలకు ఆ ప్రాంతం వారే కాకుండా పుంగనూరు, పలమనేరు, సదుం, సోమల, ఉప్పరపల్లి ప్రాంతాలకు చెందిన పందెం కోళ్లు, నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని పాఠశాల వద్ద పందేలు సాగాయి. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక నియోజకవర్గంలో ఎలా ఉంటుందోనని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. 11 మంది జూదరుల అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 11 మందిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇన్చార్జ్ సీఐ మహేశ్వర ఆధ్వర్యంలో దాడులు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టుచేసి, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకుడు శ్యామ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. మరో ఐదుగురి అరెస్ట్ పలమనేరు: కనకదుర్గ గోల్డ్లోన్ ఫైనాన్స్లో అందులో పనిచేసే సిబ్బంది చేసిన మోసం కేసులో పలమనేరు పోలీసులు గురువారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు బ్రాంచ్ల్లో సిబ్బందే నకిలీ బంగారాన్ని పెట్టి రూ.8 కోట్ల రుణాలు పొందిన మోసం కేసులో వందలాది మందిని విచారించామన్నారు. ఇందులో భాగంగా ముందు ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో పలమనేరుకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బొమ్మిదొడ్డి శంకరప్ప, బోసురెడ్డి, గణేష్, నరేష్కుమార్, భానుప్రకాష్ ఉన్నట్టు తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బుధారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాంనగర్ కాలనీ బీ–క్రాస్ వీధిలో ఓ మహిళ అద్దె ఇంటిని తీసుకుని, వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెతో పాటు ఇద్దరు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మహేశ్వర తెలిపారు. -
గ్రా‘నైట్’..రైట్రైట్!
ఫ్యాక్టరీల వద్ద కూటమి నేతల రౌడీ మామూళ్లు ● ఒక్కో బ్లేడ్కు రూ.35 వేల చొప్పున.. నెలకు రూ.10 కోట్లు వసూలు ● కప్పం కట్టకుంటే.. మైన్స్, విజిలెన్స్ దాడులు ● అంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం చిత్తూరు అర్బన్: భూగర్భ గనులశాఖ (మైన్స్) పరిపాలన జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీ మామూళ్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్ రాళ్లను తవ్వి, వాటిని ఫ్యాక్టరీల్లో కట్ చేయించి, పాలిష్ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్ మీటరు గ్రానైట్కు వాటి రంగు ఆధారంగా స్లాబ్ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్ రుసుములను చెల్లించాలి. రాఘవ కన్స్ట్రక్చన్స్ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యం కొందరు క్వారీ యజమానులు గ్రానైట్ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. నిర్ణయించిన దానికంటే భారీ మొత్తంలో గ్రానైట్ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్ స్మగ్లింగ్ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బ్లేడ్కు ఒక్కో రేటు క్వారీల్లో తవ్విన గ్రానైట్ రాయిని ఫ్యాక్టరీలను తీసుకెళ్లి, అక్కడ పెద్దపాటి బ్లేడు ద్వారా కటింగ్ చేసి, వాటిని విక్రయిస్తుంటారు. కొన్ని ఫ్యాక్టరీల్లో సింగిల్ బ్లేడు ఉంటే, మరికొన్ని వాటిల్లో తొమ్మిది వరకు మల్టీబ్లేళ్లు ఉంటాయి. ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన టెండరు గడువు ముగియడంతో రంగంలోకి దిగిన కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజా ప్రతినిధులు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో భేటీ అయ్యారు. ఒక్కో బ్లేడుకు నెలకు రూ.35 వేల చొప్పున.. ఎన్ని బ్లేళ్లు ఉంటే అంత మొత్తం నెలవారీగా మామూళ్లు వసూళ్లుచేస్తున్నారు. జిల్లాలో దాదాపు 3 వేల గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే, 1500 ఫ్యాక్టరీల వరకు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ లెక్కన సగటున ఒక్కో ఫ్యాక్టరీలో రెండు బ్లేళ్లు ఉన్నాయకున్నా.. నెలకు రూ.70 వేల చొప్పున ఏకంగా రూ.10 కోట్ల మేర అక్రమంగా దిగమింగుతున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఈ మొత్తం ఎందుకు చెల్లించాలి..? అని ప్రశ్నిస్తే వెంటనే మైన్స్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఆ ఫ్యాక్టరీతో పాటు గ్రానైట్ వచ్చిన క్వారీపై దాడులకు దిగుతున్నారు. భారీ మొత్తంలో అపరాధ రుసుములు విధిస్తున్నారు. రాయల్టీ ఇన్స్పెక్టర్గా చెప్పుకునే ఓ అధికారి జిల్లా మొత్తం చక్రం తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నాడనే ఆరోపణలున్నాయి. -
మహిళల రక్షణకు అండగా నిలుస్తాం
● కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ ● జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ తిరుపతి అర్బన్ : మహిళల రక్షణకు.. వారి హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ కృషి చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్, మహిళా జన్ సున్వై అనే కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్ పలువురు మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటికి పరిష్కారం చూపలేకపోవడానికి కారణాలను అధికారులు వెల్లడించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని...వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. తిరుపతి జిల్లాలోను కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని వెల్లడించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు హెల్ప్లైన్, మెయిల్ అందుబాటులో ఉందని...వాటి ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం, వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకొని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. తిరుపతి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తీవ్ర అసంతృప్తిలో మహిళలు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యులు డాక్టర్ అర్చన మజుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఆయా శాఖల సమక్షంలో విచారించే కార్యక్రమంపై పలువురు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపకపోగా తిరిగి కొత్తగా ఫిర్యాదు చేయాలనే సమాధానమే చెప్పడంతో నిరాశ చెందారు. పోలీసులు మహిళలను వేధిస్తున్న సమస్యలే అధికంగా వచ్చాయి. అయితే వీటి పరిష్కారానికి మళ్లీ పోలీసులనే కలవమని చెప్పడంపై అసంతృప్తికి గురయ్యారు. అధిక సంఖ్యలో వయోవృద్ధులు చిన్నపిల్లలతో మహిళలు హాజరై మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా నిరీక్షించినప్పటికీ సమస్యలు అపరిష్కతంగా మిగిలిపోవడంతో అనేక మంది మహిళలు నిరాశతో వెనుదిరిగారు. -
‘మద్దతు’గా నిలవాల్సిందే!
● రేపు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల నిరసన ● ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.12 అమలు చేయాల్సిందే ● లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం ● హెచ్చరించిన రైతు సంఘాల నాయకులు జ్యూస్ ఫ్యాక్టరీని సందర్శించిన జేసీ మండలంలోని నలగాంపల్లెలోని సన్గోల్డ్ జూస్ ఫ్యాక్టరీని గురువారం జేసీ విద్యాధరి సందర్శించారు. తోతాపుర మామిడి కాయలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారా లేదా, కాయల కొతలకు సంబంధించి తీసుకుంటున్న నియమ నిబంధనలు, జూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తోతాపురి కొనుగోలు చేయాలని సూచించారు. తహసీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఏఓ భారతి పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి మాటలకు కూడా విలువ లేకుండా పోయిందని రైతులు ధ్వజమెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద శనివారం సత్యాగ్రహం నిర్వహించనున్నట్టు మామిడి రైతుల సంక్షేమ సంఘ నాయకులు జనార్దన్, ఎస్.ఆనంద నాయుడు ప్రకటించారు. జిల్లాలో గురువారం మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇంకోపక్క జిల్లా యంత్రాంగం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలు చేయాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేయడం దారుణమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు ధరల పట్టిక ప్రదర్శించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరుచేయని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో సీఎం జరిపిన సమీక్ష సమావేశంలో సైతం కిలోకు రూ.12 మద్దతు ధర కచ్చితంగా కల్పిస్తామని స్పష్టం చేసినా.. జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మామిడి ఫ్యాక్టరీల వద్ద అన్లోడింగ్ సైతం పూర్తిగా రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పల్ఫ్ నిల్వలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో హరిబాబు, ఉమాపతినాయుడు, సంజీవరెడ్డి, భారతి పాల్గొన్నారు. రైతులకు నష్టం కలగకుండా చూస్తాం బంగారుపాళెం: మామిడి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బంగారుపాళెం మామిడి మార్కెట్ ఆవరణలో మామిడి మండీ యజమానులు, రైతులతో మద్దతు ధరపై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి(బెంగళూర)మామిడి కాయలను చివర కేజీ వరకు కొనుగోలు చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపటిందన్నారు. ప్రభుత్వం అందించే రూ.4 మద్దతు ధర సబ్సిడీ రూపంలో రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమచేస్తామాన్నరు. కాయలు పక్వానికి రాకముందే జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించొద్దని సూచించారు. జేసీ విద్యాధరి, మార్కెట్శాఖ ఏడీ పరమేశ్వర్, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్రెడ్డి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ గంగాధరనెల్లూరు: జైన్ మామిడి గుజ్జు పరిశ్రమను గురువారం రాత్రి కలెక్టర్ సుముత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్మాగారం వద్ద ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మామిడి కొనుగోలుపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. జిల్లా హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి, డీఆర్డీవో పీడీ శ్రీదేవి, జైన్ మేనేజర్ దీలీప్ శర్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీవో కృష్ణమహేష్రెడ్డి పాల్గొన్నారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తోతాపురి మామిడికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్కుమార్ హెచ్చరించారు. గురువారం జీడీనెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. మామిడి కాయల కొనుగోలుపై పరిశ్రమ యాజమాన్యం, రైతులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు తోతాపురికి మద్దతు ధర చెల్లించాలన్నారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుజు పరిశ్రమలకు మామిడికాయలను తెచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో మామిడి దిగుబడి ఎక్కువగా ఉండడంతో ప్యాకింగ్ మెటీరియల్ను సమకూర్చుకుని ప్రాసెసింగ్ యూనిట్ల కెపాసిటీని పెంచుకోవాలని సూచించారు. డీఆర్డీఓ పీడీ శ్రీదేవి, మండల ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, జైన్ మేనేజర్ పాల్గొన్నారు. పక్వానికి వచ్చిన కాయలనే కోయండి తవణంపల్లె: మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. మండలంలోని టి.పుత్తూరు, ఎగువ తవణంపల్లె గ్రామాల్లో మామిడి పంట కోత కోయడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధర చిట్టచివరి పంట వరకు ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేసిందన్నారు. రూ.4 మద్దతు ధర ఆగిపోతుందని అపోహలు వద్దన్నారు. అనంతరం ఎఫ్–3 ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. రైతులకు నష్టం జరగకుండా ఫ్యాక్టరీ యజమానులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఇన్చార్జ్ వ్యవసాయాధికారి వందన పాల్గొన్నారు.మామిడి రైతుల గోడు కూటమికి పట్టదా? బంగారుపాళెం: మామిడి రైతుల గోడు కూటమికి పట్టనట్టుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలప ట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమా ర్ ధ్వజమెత్తారు. మామిడి పంటకు కనీస గిట్టుబాటు ధర లేక గత 15 రోజులుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. జిల్లాలో అత్యధికంగా బెంగళూర(తోతాపురి)రకం పంటను రైతులు సాగుచేస్తున్నారన్నారు. పండిన పంటను అమ్ముకునేందుకు మండీలు, జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండీలు, ర్యాంప్లలో కిలో రూ.3 నుంచి రూ.4కు కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8కు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల వ ద్ద పర్మిట్ల కోసం వారాల తరబడి తిరగాల్సివస్తోంద న్నారు. పర్మిట్లు పొంది కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తే అక్కడ రోజుల తరబడి ఉండాల్సి వస్తోందని చె ప్పారు. రైతులు పండించిన పంటకు వేరొక్కరు మద్ద తు ధర ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. -
మామిడి కాయలు అన్లోడ్ చేసి వెళ్తూ..!
బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ట్రాక్టర్ను కారు ఢీ కొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమా రుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు రూరల్ మండలం, కొడిగుట్ట గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్నాయుడు, ఆయన కుమారుడు యుగేష్ మామిడి కాయలను ట్రాక్టర్లో బంగారుపాళెంకు తీసుకొచ్చారు. కాయలను మార్కెట్లో దింపి తిరి గి స్వగ్రామానికి ట్రాక్టర్పై బయలుదేరారు. యుగే ష్ డ్రైవింగ్ చేస్తుండగా, చంద్రశేఖర్నాయుడు పక్కన కూర్చున్నాడు. మార్గమధ్యంలో కాటప్పగారిపల్లె వద్ద ట్రాక్టర్ను పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్నాయుడు (62)పై ట్రాక్ట ర్ ట్రాలీ చాసిన్ పడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. యుగేష్(32) తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన యుగేష్ను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో అన్లోడింగ్ దందా! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పలు ఫ్యాక్టరీల్లో అన్లోడింగ్ దందా నడుస్తోంది. కొన్ని ఫాక్యరీల్లో లోడ్ దింపే వారికి రూ.50 నుంచి రూ.200 వరకు టీ, కాఫీ ఖర్చుల పేరుతో టిప్పు ఇస్తుంటారు. అప్పోసస్పో చేసి రైతులు కాయలను ఫ్యాక్టరీకి తీసుకొస్తుంటే ట్రాక్టర్ అన్లోడింగ్కు రూ.500 నుంచి రూ.800 వరకు గుంజుకుంటున్నారు. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని హయాత్ ఫుడ్స్లో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పు మంటున్నాయి. జేసీ విద్యాధరి గురువారం ఫ్యాక్టరీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. -
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్ జగన్ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చదువు‘కొన’లేం!
● ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ● ఖాళీ అవుతున్న సామాన్యుల జేబులు ● నోటీసు బోర్డుల్లో ప్రదర్శించని ఫీజుల వివరాలు ● కూటమి పాలనలో జాడలేని ఫీజు నియంత్రణ కమిటీలు ● పర్యవేక్షణలో విద్యాశాఖ అధికారులు విఫలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు 31,922 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 11,750 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు 29,303 ప్రాథమిక, హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో విద్యార్థులు 5,929చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో రూ.10 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు చొప్పున ఫీజులు నిర్ధారించారు. అయితే 4, 5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9 వేలు, పట్టణాల్లో రూ.11 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు, ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేలు, మండల కేంద్రాల్లో 15 వేలు, పట్టణాల్లో రూ.17 వేలు సంబంధిత పాఠశాలల స్టార్ రేటింగ్ మేరకు ఫీజులను నిర్ణయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై అధ్యయం చేసేందుకు ఐఏఎస్ అధికారులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీలను నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందిం ప్రభుత్వానికి అందజేసేది. ఆ నివేదికల ఆధారంగా అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేవారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రామాలు, పట్టణాల్లో పాఠశాలలను ఐదు కేటగిరీలుగా విభజించారు. స్టార్ రేటింగ్ స్కూల్స్కు 1 నుంచి 10 వ తరగతి వరకు ఫీజులు సైతం ఫీజు నియంత్రణ కమిటీ సిఫార్సు చేసింది. నిబంధనలకు తూట్లు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఫీజు వసూళ్లు, సౌకర్యాల వంటి వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. అయితే ఈ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. సిలబస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే పుస్తకాలను బోధించాలి. కానీ కొన్ని పాఠశాలల్లో ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియెంటెడ్ పేరుతో విక్రయిస్తూ వాటినే బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఇంటర్ స్థాయిలో ఉండే సిలబస్ను జోడించి సొంతంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు 166 ప్రాథమికోన్నత పాఠశాలలు 79 ఉన్నత పాఠశాలలు 159 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 18 ప్రాథమిక, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 06 మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు ఫీజుల నియంత్రణపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. తనిఖీలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఫలితంగా కూటమి ప్రభుత్వంలో సామాన్యులు నష్టపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజుల దందాను అరికట్టాలి. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పంటను అమ్ముకోవడానికి ఫలరాజు పాట్లు
కాణిపాకం : జిల్లాలో మామిడి విపత్తు ఎదురవుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పంట పక్వానికి వచ్చినా కోతలు కోయలేక కన్నీళ్లు పెడుతున్నారు. ఫ్యాక్టరీలు ముఖం చాటేస్తున్నాయి. ర్యాంపులు ఇదే దారిలో పయనిస్తూ... కాయలను కొనలేమని చేతులెత్తేస్తున్నాయి. టోకెన్లు గడువు ఉన్నంత వరకు కాయలకు గడువులేదని... ప్రభుత్వం ప్రోత్సాహక నిధి ప్రకటించి రైతుల గోసను గాలికొదిలేసిందని రైతులు ఆక్రోశానికి గురవుతున్నారు.టోకెన్ ఉన్న రైతుల పరిస్థితి ఇదీ..మామిడి రైతులు పండించిన పంట విక్రయానికి జిల్లాలోని ఫ్యాక్టరీల వద్దకు పోటెత్తుతున్నారు. వేల మంది రైతులు ఒక్కసారిగా ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. ఈపోరు పడలేక ఫ్యాక్టరీలు, అధికారులు కలిసి వచ్చిన వారి అందరికీ టోకెన్లు పంచిపెట్టేస్తున్నారు. ఈ టోకెన్ల జారీ జూన్ నెల దాటింది. పలు ఫ్యాక్టరీలు జులై నెల ఆఖరు వరకు కొనుగోలు చేస్తామని టోకెన్లు ఇచ్చేసింది. మరో వారం..పది రోజుల్లో మామిడి పంట పూర్తిగా నేల మట్టమయ్యే అవకాశం ఉందని రైతులు కంట తడి పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో జులై నెల ఆఖరు వరకు పంట ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయ పండై...పురుగు పట్టి రాలిపోవడం ఖాయమని కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వరకు మాత్రమే పంట అమ్ముడుబోయినట్లు రైతులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలకు వచ్చిన సగం కాయలు తమిళనాడు కాయలని, వాటిని కూడా అధికారులు ఈ లెక్కల్లోనే కలిపేస్తున్నారని రైతులు వాపోతున్నారు.నష్టపరిహారం ఇవ్వాల్సిందే...మామిడి పంటను కోసి అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. ఫ్యాక్టరీలు జిల్లా మామిడిని తోసి పుచ్చుతున్నాయంటూ గోల చేస్తున్నారు. సిఫార్సులకు పెద్దపీట వేస్తూ...సామాన్య రైతు కష్టాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీల వద్ద ఇబ్బంది పడుతోంది... సామాన్య రైతులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనాలంటే..మాకేమి లాభమని..ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాల కాయలపై మొగ్గు చూపుతున్నాయంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5, రూ.6ను కూడా తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రోత్సాహక నిధిని పక్కన పెట్టి మామిడి కష్టాలను విపత్తుగా గుర్తించి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.2018 నష్టాలు గుర్తుకొస్తున్నాయి..ప్రస్తుతం మామిడి పరిస్థితి చూసి రైతులు 2018 మామిడి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 శాతం పంట మాత్రమే వచ్చింది. ఆ పంటను విక్రయించుకోవడానికి అప్పటి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలు మామిడి పంటను కొనలేని పరిస్థితి ఏర్పడితే రైతులు పండిన తోతాపురి కాయలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోసి నిరసనకు దిగారు. చివరకు కేజీ తోతాపురి రూ.2 వరకు పలికింది. అప్పటి కూడా కొనలేని పరిస్థితులు ఉంటే 30శాతం నుంచి 40శాతం పంట చెట్లల్లోనే రాలిపోయాయి. కాగా అప్పట్లో ఫ్యాక్టరీలకు 20,053 మంది రైతులు 1,04,777 టన్నుల కాయలను విక్రయించారు. ఇందుకు గాను ఫ్యాక్టరీలు రూ.78.58 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 8 నెలల తర్వాత బిల్లులు చెల్లించాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధి రూ.2.50 చొప్పున రూ.2.19 కోట్ల నిధులు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రైతులు అప్పులు చేసి తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రైతుల్లో గుబులు పట్టుకుంటోంది.నష్ట పరిహారం ఇవ్వాలిఈసారి మామిడి రైతు నిండా నష్టపోయాడు. మామిడి సా గు ఖర్చులు, కూలీల ఖర్చు లు, ట్రాక్టర్ ఖర్చులు కలిసి రై తులను ముంచేస్తున్నాయి. కా యలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్కు ఒక్క రోజుకు రూ.1000 బాడుగ ఇస్తున్నాం. బండి మూడు రోజు లు ఇక్కడే ఉంది. రోజుకు రూ.1000 చొప్పున మూ డు రోజులకు రూ.3 వేలు ఇవ్వాలి. కోసి తీసుకొచ్చింది కొంత వరకు మాత్రమే. మిగిలిన కాయలు చెట్లల్లో అలానే ఉన్నాయి. జులై వరకు టోకెన్లు ఇస్తున్నా. అ ప్పటి వరకు చెట్లల్లో కాయలు ఉండవు. నష్టపరిహా రం ఇచ్చి ఆదుకోవాలి. – వెంకటేష్, పెనుమూరుచేతులెత్తేసిన ర్యాంపులుజిల్లాలో ఇప్పటి వరకు 23 ర్యాంపులు నడుస్తున్నాయి. ఈ ర్యాంపులకు రోజువారీగా ఒక్క లారీ నుంచి రెండు లారీలా వరకు ఫ్యాక్టరీలకు అమ్ముకోవడానికి అనుమతులున్నాయి. ఈ ర్యాంపును నిర్వర్తించే వ్యాపారులు సొంత కాయలు, బంధువులు, తెలిసినా వాళ్ల మామిడి కాయలు అమ్ముకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన రైతుల మామిడిని కొనలేమని, ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదని తలుపులు వేసేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లిన రైతులకు వారం తర్వాతే కాయలు కొంటామని చెప్పేస్తున్నారు. అధికారులు చెప్పిన రేటు (రూ.3.50) కుదరదని, రూ.3 నని, మరో వారం తర్వాత ఆ రేటు చెప్పలేమని రైతులకు సమాధానమిస్తున్నారు. దీంతో మామిడి రైతులు తల్లడిల్లిపోతున్నారు.ఒక్క టోకెన్ స్వామీ !జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఫలంపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తోటలోని కాయలు మట్టిపాలవుతున్నాయి. రైతులు ఫలం పరిస్థితి చూసి కన్నీళ్లు కారుస్తున్నారు. చాలా మంది కాయలను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారి అనుమతి కోసం బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, పెనుమూరు, పూతలపట్టు, తవణంపల్లి, జీడీ నెల్లూరు తదితర ప్రాంతాలకు తిరిగేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, కూటమి నేతలు, పలుశాఖ అధికారుల ద్వారా టోకెన్ల కోసం బతిమిలాడుకుంటున్నారు. ఒక్క టోకెన్ అయినా తీసి ఇవ్వు స్వామీ అంటూ రైతులు వారిని ప్రాధేయపడుతున్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్పై కొరడా
● ఆర్కే గార్డెన్స్కు జరిమానా విధింపు ● జిల్లా రిజిస్ట్రార్ విచారణలో అక్రమాలు బహిర్గతం ● రూ.10.80 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించాలంటూ ఆదేశం ● ఫలించిన సమాచార హక్కుల వేదిక పోరాటం పుత్తూరు : మండల పరిధిలోని ఆర్కే గార్డెన్స్ ఫంక్షన్ హాల్ యజమాని రవీంద్రన్కు రూ.10.80 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అపరాధ రుసుం చెల్లించాలంటూ తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ జి.శ్రీరామ్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆర్డర్ కాఫీని గత మే నెల 29వ తేదీన జారీ చేశారు. ఆర్డర్ కాఫీ అందుకున్న 15 రోజుల్లోపు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో ఇండియన్ స్టాంప్స్ సెక్షన్ 1899 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నివాస ఖాళీ స్థలంగా చూపడంతో.. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.రవీంద్రన్ పుత్తూరు మండల పరిధిలోని ఉత్తరపుకండ్రిగ పంచాయతీ చిన్నబ్బనాయుడు కండ్రిగ వద్ద ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఆయన 2023 డిసెంబర్ 13, 14 తేదీలలో పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన కుమార్తె ప్రత్యూష పేరిట సదరు ఆస్తిని రిజిస్ట్రర్ చేయించారు. ఈ సందర్భంగా సదరు ఆస్తిని నివాస ఖాళీ స్థలంగా చూపుతూ డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తి మొత్తం విలువ రూ.1,08,96,604గా పేర్కొన్నారు. సమాచార హక్కుల వేదిక ఫిర్యాదు పుత్తూరు మండలంలోని ఆర్కే గార్డెన్స్ నిర్మాణానికి పంచాయతీ నుంచి, తుడా కార్యాలయం నుంచి పొందిన అనుమతులను కోరుతూ స్థానిక సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరడంతో అసలు విషయం బయట పడింది. కేవలం రూ.2.18 లక్షలు చెల్లించి.. స్టాంప్ డ్యూటీ రూ.12.94 లక్షలు కాగా, రవీంద్రన్ ఇచ్చిన తప్పుడు డిక్లరేషన్ ద్వారా కేవలం రూ.2.18 లక్షలు మాత్రం చెల్లించినట్లు విచారణలో తేటతెల్లం అయింది. దీంతో డెఫిసిట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.4,720తో కలిపి మొత్తం రూ.10,80,520 చెల్లించాలంటూ రవీంద్రన్ను ఆదేశించారు. ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం ఆర్కే గార్డెన్స్ క్రయ విక్రయాలపై వచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం. విచారణలో పుత్తూరు ఎంపీడీఓ 2023 డిసెంబర్కు ముందే ఆ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో జరిగిన ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ చట్టం సెక్షన్ 27కి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. దీంతో పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ చెల్లించాలని ఆదేశించాం. – జి.శ్రీరామ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ విచారణ ఇలా.. ● సమాచార హక్కుల వేదిక వారు ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాల మేరకు తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ చేపట్టిన విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. ● జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పుత్తూరు ఎంపీడీఓ స్థల పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో సర్వే నంబర్ 145–1ఏ2, 145–2సి2లో 2023 డిసెంబర్ నాటికే ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాలు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ● పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ సైతం స్థల పరిశీలన చేసి శాశ్వత భవనాలు ఉన్నట్లు గుర్తించి, మార్కెట్ విలువను దాచిపెట్టి రిజిస్ట్రేషన్ జరిగినట్లు నివేదిక ఇచ్చారు. ● ఆర్సీసీ నిర్మాణం 2,591 చదరపు అడుగుల్లో జరిగిందని, ఏసీసీ నిర్మాణం 17,361 చదరపు అడుగులుగా నివేదికలో పొందుపరిచారు. ● రవీంద్రన్ తెలిపిన ఆస్తి విలువ రూ.1.8 కోట్లు కాగా విచారణలో మొత్తం ఆస్తి విలువ రూ.6.47 కోట్లుగా లెక్కగట్టారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కుప్పం రూరల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. నూలుకుంట గ్రామానికి చెందిన నాగప్ప (64) జీవనోపాధి కోసం చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం కోళ్లను కోసి బాయిలర్లో వేసి క్లీన్ చేసే సమయంలో బాయిలర్కు వచ్చే విద్యుత్ తీగకు ఎలుకలు కొరికి ఉన్న విషయం గుర్తించలేదు. దీంతో బాయిలర్ స్విచ్ వేయగానే నాగప్ప విద్యుత్ షాక్కు గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న నాగప్పను కుటుంబ సభ్యులు కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకోగానే నాగప్ప మృతి చెందినట్లు తెలిపారు. కాగా నాగప్పకు భార్య , నలుగురు పిల్లలు ఉన్నారు. పొలానికి రాకుండా దౌర్జన్యం – బాధిత మహిళా రైతు ఆవేదన పలమనేరు : తమ పొలాన్ని ఆక్రమించుకొనేందుకు ఓ టీడీపీ నేత ప్రమేయంతో కొందరు ప్రయత్నిస్తున్నారని తమ పొలం వద్దకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని బైరెడ్డిపల్లి మండలం చిక్కనపల్లికి చెందిన బాధితులు రమాదేవి కుటుంబీకులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ తమకు శెట్టిపల్లి రెవెన్యూలో 2.72 సెంట్ల డీకేటీ భూమి ఉందని దాన్ని 20 ఏళ్లుగా సాగుచేస్తున్నామని తెలిపారు. ఇదే భూమిపై బ్యాంకులో రుణం కూడా పొందామన్నారు.అయితే బేలుపల్లికి చెందిన ఓ టీడీపీ నేత ప్రోద్భలంతో తమ పొలాన్ని పక్కనున్న భూమి వారికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి జేసీబీతో తమ పొలాన్ని వారి పొలంలో కలిపేలా పనులు చేశారన్నారు. దీనిపై తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు టీడీపీ నాయకులను కలసి పరిష్కరించుకోవాలని తామేమీ చేయలేమని చెప్పారన్నారు. దీంతో బేలుపల్లికి చెందిన టీడీపీ నేతవద్దకెళితే తాను చెప్పినంత డబ్బులిస్తే మీ భూమి మీకు దక్కుతుందని లేదంటే మీభూమి పక్కనున్న వాళ్లకి చేసేస్తామని బెదిరిస్తున్నాడని వాపోయారు. గోల్డ్ లోన్ కేసులో పోలీసుల అదుపులో మరికొందరు పలమనేరు : పట్టణంలోని కనకదుర్గ గోల్డ్లోన్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన మోసం కేసులో మరికొందరిని పలమనేరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలో ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంబంధం ఉన్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా మరికొందరిని విచారిస్తున్నామని తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధిస్తున్న ప్రభుత్వం
వైఎస్సార్సీపీలో క్రి యాశీలకంగా వ్యవహరించే నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో కుట్రలకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కీలక నాయకులపై కక్షగట్టింది. వైఎస్ జగన్ వెంట నడిచేవారిని వేధించేందుకు పన్నాగాలు పన్నుతోంది. వెంటాడి మరీ అరెస్ట్లు చేయించి పైశాచికానందం పొందుతోంది. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సర్కారు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేయించింది. అన్యాయంగా అపనిందలు మోపి అప్రతిష్టపాలు చేసేందుకు.. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాదరణను అణచి వేసేందుకు యత్నిస్తోంది.సాక్షి, టాస్క్ఫోర్స్ : జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం కుట్రలు పరాకాష్టకు చేరాయి. మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్లో అధికారులు పని చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇప్పుడు తప్పులు కేసులు పెడుతున్న అధికారులు.. రేపనేది ఒకటి ఉంటుందని.. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటనేది ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జిల్లాలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్టు చేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెవిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొందరు కుట్రలు పన్నుతూ వచ్చారు. అయితే నిత్యం ప్రజల మధ్య ఉండే చెవిరెడ్డి ఎటువంటి తప్పులు చేయరని అందరికీ తెలుసు. అయితే ఇటీవల ఎర్రావారిపాళెం మండలంలో ఓ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఆమె తండ్రి చెవిరెడ్డికి ఫోన్ చేసి సాయం చేయమని అడిగితే.. ఆయన అక్కడకు వెళ్లి ఆడబిడ్డకు సాయం చేసినందుకు పోక్సో కేసు పెట్టారు.. ఆ కేసులో అరెస్టు చేయాలని చూసినా ఆ బిడ్డ తల్లిదండ్రులే మీడియా ముందుకు వచ్చి చెవిరెడ్డిపై తాము ఫిర్యాదు చేయలేదని చెప్పడంతో పోలీసులు వెనకడుగు వేశారు.లిక్కర్ కేసులో ఎలా ఇరికించారంటే..!ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రూ.8 కోట్లు పోలీసులకు పట్టుబడితే దానిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఆ నగదుకు సంబంధించిన వారు వ్యాపార నిమిత్తం తరలిస్తుండగా పట్టుబడినట్టు చెబుతూ అందుకు తగిన ఆధారాలను కోర్టుకు, విజయవాడ పోలీసు కమిషనర్కు, ఎన్నికల అధికారులకు కూడా అందించారు. దానిపై కోర్టులో కేసు నడుస్తుండగానే చెవిరెడ్డి దగ్గర గతంలో పనిచేసిన గన్మెన్ గిరిని సిట్ అధికారులు తీసుకువెళ్లి బెదిరించి ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుతో పాటు రూ.200 నుంచి రూ.250కోట్లు చెవిరెడ్డి తరలించినట్టుగా తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని అరెస్టుకు ముందు చెవిరెడ్డి మీడియాకు వివరించారు. గన్మెన్ గిరి ఇచ్చిన వివరాల మేరకు మరో గన్మెన్ మదన్రెడ్డి, గతంలో చెవిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన బాలాజీ, నవీన్ పేర్లను కూడా ఆ కేసులో ఇరికించారని, వారందరినీ భయపెట్టి చెవిరెడ్డి తీసుకురమ్మంటేనే ఆ డబ్బులు తరలించినట్టుగా స్టేట్మెంట్లు రికార్డు చేశారని మీడియా ముందు చెవిరెడ్డి స్వయంగా వెల్లడించారు.ఇంతమందిని వేధించి, నరకం చూపించడం కన్నా తనను నేరుగా అరెస్టు చేసుకోవచ్చని కూడా చెప్పారు. అయితే సిట్ అధికారులు మాత్రం చెవిరెడ్డికి బెయిల్ లభించకుండా చేయడానికి అన్ని విధాలుగా స్టేట్మెంట్లు తయారు చేసుకున్న తరువాతే ఆ పనిచేశారు. మదన్రెడ్డి డీజీపీకి రాసిన లేఖతో ఖంగుతిన్న సిట్ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెవిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో ఆయన విజయవాడలోనే ఉన్నట్టు తెలిసినా సిట్ అధికారులు ఎందుకు అరెస్టు చేయలేదనేది ప్రశ్నార్థకం.ఎల్లో నేతల పైసాచిక ఆనందంఏపీ లిక్కర్ స్కాం కింద సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేయడంతో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పైసాచిక ఆనందం పొందుతున్నారని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడంతో పాటు ఎవరినీ ఇబ్బంది పెట్టని చెవిరెడ్డికి ఇన్ని కష్టాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని గ్రామస్తులు, బంధువులు స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డి అరెస్టుపై కూటమి ప్రభుత్వం కక్షకట్టిందని ఈ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టమైంది.నేరుగా అరెస్టు చేసుకోండని సవాల్ చేసినా..ఏ తప్పు జరగని లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డిని అక్రమంగా ఇరికించారు. అంతేకాదు.. అరెస్టు చేసిన తరువాత బెయిల్ రాకుండా చేయడానికి ఆయన దగ్గర గతంలో పనిచేసిన వారందరినీ వేధించి మరీ స్టేట్మెంట్లు తీసుకున్నట్టు స్వయంగా చెవిరెడ్డి మీడియాకు తెలిపారు. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన వారందరికీ సిట్ అధికారుల వేధింపులు మాత్రం తప్పలేదు. ఇంతమందిని వేధించడం వెనుక తప్పుడు కేసుల్లో చెవిరెడ్డిని ఇరికించడానికి చేసిన ప్రయత్నమే అనేది ఆయన దగ్గర గన్మెన్గా పని చేసిన మదన్రెడ్డి ఇటీవల డీజీపీకి రాసిన లేఖతో తేటతెల్లమైంది. ఆ లేఖతో అప్పటి వరకు సిట్ అధికారులు చేసిన టార్చర్ను సోషల్ మీడియా వేదికగా చెవిరెడ్డి స్వయంగా బయటకు తేవడంతో మీడియాలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. సిట్ అధికారులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి సామాన్యులను నరకం చూపుతున్నారనే విషయం బహిర్గతం కావడంతో చేసిన తప్పు కప్పి పుచ్చుకునేందుకు, ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు చెవిరెడ్డిని అరెస్టు చేయడం ఒక్కటే మార్గమని సిట్ అధికారులు భావించారు. అందుకే ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీని చెవిరెడ్డికి ఇవ్వకుండా, కేసు పెట్టినట్టు చెప్పకుండా విజయవాడలోనే తిరుగుతున్న చెవిరెడ్డిని పట్టుకోకుండా.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు వెళ్తుంటే బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నట్టు సిట్ అధికారులు కలరింగ్ ఇచ్చారనే విమర్శలు వైఎస్సార్సీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఏడాదిగా ఏపీలో అరాచక పాలనజరగని స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరు చేర్చి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. ఏడాది నుంచి రాష్ట్రంలో కూటమి అరాచక పాలనకు అంతులేకుండాపోతోంది. ప్రజాప్రతినిధుల వద్ద గన్మెన్లుగా పనిచేసిన పోలీసులను సైతం లాక్కెళ్లి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వమని చిత్రహింసలకు గురిచేయడం ఏపీలోని కూటమి పాలనకే చెల్లింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు పర్యటన కార్యక్రమం నుంచి జనం దృష్టి మరల్చడానికే చెవిరెడ్డిని రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. అక్రమ కేసులు, అరెస్ట్లతో భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనం. ప్రజల నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి భయపడి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.– భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు -
నేడు అగ్నివీర్పై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రంలో 19న అగ్నివీర్ వాయు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో యువతకు అగ్నివీర్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి 12వ ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు విచ్చేస్తారన్నారు. భారత వైమానిక దళంలో ఉండే వివిధ ఉద్యోగ అవకాశాలు, అగ్నివీర్ పథకం విషయాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు. వాయిదా వేసిన డీఎస్సీ పరీక్షలు జులైలో నిర్వహణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున 20, 21 తేదీల్లో నిర్వహించే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేశారన్నారు. వాయిదా వేసిన పరీక్షలను తిరిగీ జులై 1, 2 తేదీల్లో నిర్వహిస్తారన్నారు. మారిన పరీక్ష కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25వ తేదీ నుంచి https://apdsc.apcfsc.in వెబ్సైట్లో అందు బాటులో ఉంటాయని డీఈఓ వెల్లడించారు. డీపీటీఓగా రాము చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండులోని కార్యాలయంలో బుధవా రం డీపీటీఓగా రాము బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జగదీష్ తిరుపతి డీపీటీఓగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాము బాధ్యతలను స్వీకరించారు. అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ రవాణా శాఖలో ఏడాది పాటు అప్రెంటీస్ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్/కన్వీనర్ పి.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అప్రెంటీస్కు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లలో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పది, ఐటీఐ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల 30వ తేదీలోపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని అప్రెంటీస్షిప్ అడ్వైజర్ సి.గంగాధరానికి దరఖాస్తులను సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 94416 47174, 95507 22922 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఈఓకు డైట్ ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు కార్వేటినగరం : చిత్తూరు డీఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.వరలక్ష్మికి జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో డైట్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శేఖర్ గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఇక ఏకై క సీనియర్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సుబ్రమణ్యం అన్నమయ్య జిల్లా డీఈఓగా వెళ్లడంతో కార్వేటినగరం డైట్ ప్రిన్సిపల్గా చిత్తూరు డీఈఓ వరలక్ష్మికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందని, త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. -
తల్లులకు బాబు ఎగనామం
● చంద్రబాబు పాలనపై మాజీ ఉప ముఖ్యమంత్రి మండిపాటు కార్వేటినగరం : నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నేడు తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులకు ఎగనామం పెట్టారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మండల పరిధిలోని అల్లాగుంట ఇందిరా కాలనీ వద్ద కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా 84 లక్షల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అందరికీ తల్లికి వందనం అందిస్తానని చెప్పిన నేడు సాంకేతిక సమస్యల పేరుతో లక్షల మందికి మోసం చేశారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారన్నారు. పాఠశాలల విలీనం పేరుతో పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగనన్న ప్రభుత్వంలో మామిడి రైతులకు రూ.30 అందిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం రూ.5 కూడా చెల్లించక పోవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మండల మాజీ కన్వీనర్ ధనంజయవర్మ, ఎంపీటీ మురగయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు లోకనాధరెడ్డి, మాజీ సర్పంచ్ఽలు అమీద్, కుప్పారెడ్డి, మునికృష్ణ, నందగోపాల్, దేవరాజ్, స్టీఫెన్, దనశేఖర్యాదవు,గాంధీ,ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతుల ముట్టడి
– సిఫార్సులకు టోకెన్లు ఇస్తున్నారని మండిపాటు పూతలపట్టు(కాణిపాకం) : పూతలపట్టు మండలం పోలవరంలోని పళ్ల గుజ్జు పరిశ్రమను బుధవారం మామిడి రైతులు ముట్టడించారు. స్థానిక రైతులకు టోకెన్లు ఇవ్వకుండా సిఫార్సులతో టోకెన్లు ఇచ్చేస్తున్నారని ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సిఫార్సులతో వచ్చే వారికి ఎలా టోకెన్లు ఇస్తారని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడారు. దీంతో వాగ్వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో మామిడి కాయలు లోడింగ్ చేసుకొచ్చిన ట్రాక్టర్లు క్యూ కట్టాయి. -
వీరు రూ. 8 అంటారు.. వారు రూ. 3కి కొంటారు
తోతాపురి మామిడి రైతుకు మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కిలోకు రూ. 8 మేర కొనాల్సిందే అని కంపెనీలకు చెబుతున్నా, పక్కాగా దాన్ని అమలు చేయడంలేదు. మరోవైపు చిత్తూరు జిల్లా ర్యాంపుల్లో కిలో కాయ ధర రూ. 3 మించి పలకని దైన్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తోతాపురి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో తోతాపురి ధరలు పాతాళానికి పడిపోయాయి. ర్యాంపుల్లో కేజీ రూ.3కు మించి కొనుగోలు చేయడంలేదు. ఫ్యాక్టరీలో రూ.5, రూ.6కు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తోతాపురికి మద్దతు ధర కేజీ రూ.8గా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 ఇస్తామని ప్రకటించింది. ఈనెల 14వ తేదీన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించి, కచి్చతంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ఫ్యాక్టరీలు తోతాపురిని కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మద్దతు ధర ఎక్కడా అమలుకావడం లేదు. రైతుకు కనీస ధర ఇప్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.కిలో రూ.6 కు తగ్గకుండా చూస్తాంః జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కిలో మామిడికాయల ధర రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి మీడియా సమావేశంలో వెల్లడించారు. ర్యాంపుల్లో రూ.3.50కి కొంటున్నారని తెలిపారు. కిలో రూ. 6లు చెల్లించేలా టాస్్కఫోర్స్ కమిటీ వేస్తామన్నారు. తద్వారా «రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు. ఉద్యానశాఖ కుంటిసాకులు జిల్లాలో మామిడి రైతుల ఆందోళనల నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాయలు పక్వానికి రాకుండా కోత కోయడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని కుంటిసాకులు చెబుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. అధికారుల తీరుపై జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. మద్ధతు ధర రూ. 8 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టోకెన్ల కోసం తోపులాటలు..తొక్కిసలాటలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఓ పరిశ్రమ వద్ద టోకెన్ల కోసం మామిడి రైతులు పడరాని పాట్లు పడ్డారు.మంగళవారం సుమారు మూడు గంటల పాటు టోకెన్ల కోసం అవస్థలు పడ్డారు. రద్దీని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని నియంత్రించి టోకెన్లు జారీ చేశారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీ వద్ద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. టోకెన్ల కోసం గేటు తీసే క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఫ్యాక్టరీల ఆవరణలో వందలాది వాహనాలు మామిడి కాయలను విక్రయించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు ఫ్యాక్టరీలకు వచ్చారు. అయితే సరైన మద్దతు ధర లభించని కారణంగా తెచ్చిన కాయలను ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక, అయినకాడికి తెగనమ్ముకోలేక వచ్చిన వాహనాల్లో రోజులుగా వేచిచూస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆవరణలో వందలాది ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా ఆ వాహనాలు ముందుకు, వెనక్కు కదలకుండా అలానే నిలిచిపోయాయి. -
విలీనం పేరుతో కూటమి నాటకాలు
‘ఈ ప్రభుత్వం(గత వైఎస్సార్సీపీ) బడులను కూడా వదల్లేదు. ఊర్లోనే చిన్న పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకే కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అంతదూరం పిల్లలు ఎలావెళ్తారో కూడా ఆలోచించడం లేదు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విలీన ప్రక్రియకు ఫుల్స్టాప్ పెడుతుంది. ఎక్కడ బడి ఉంటే అక్కడే పిల్లలు చదువుకునేలా అవకాశం కల్పిస్తుంది’ అంటూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ బడులకు ఉరివేశారు. తమ సొంత గ్రామాల్లోనే పేద పిల్లలు చదువుకుంటున్న బడులను సుదూర ప్రాంతాల్లోకి విలీనం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర పిల్లలు నడిచి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. తమ పిల్లల బాధలు తీర్చాలంటూ తల్లిదండ్రులు ఆందోళన బాట పడుతున్నారు.చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పేద విద్యార్థులకు గుదిబండగా మారుతున్నాయి. గ్రామంలోనే చదువుకోవచ్చన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. విలీనం పేరుతో వేధింపులకు దిగడం.. సుదూర ప్రాంతాలకు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ బడులను విలీనం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. పాఠశాలలు యథావిధిగా తమ గ్రామాల్లోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. వినతిపత్రాలు అందించి తమ పిల్లల కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.ప్రభుత్వ బడులపై కూటమి కక్షకూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జిల్లాలోని సర్కారు బడులపై కక్షగట్టింది. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సింది పోయి విలీనం పేరుతో కత్తి దూసింది. అసంబద్ధత నిర్ణయాలు తీసుకుని పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలను నెలకొల్పడంతో చాలా గ్రామాల్లో ప్రభుత్వ బడులు విలీనం అయ్యాయి. పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను దూరాభారం పంపించలేక అష్టకష్టాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు పిల్లలను బడికి పంపడం మాన్పిస్తున్నారు. మరికొందరు ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్నారు.బడికి దూరంజిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విలీన ప్రక్రియ వల్ల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది విద్యార్థులు బడికి దూరం కావాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,436 పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి 64,519, 1 నుంచి 8వ తరగతి 45,800, 6 నుంచి 10వ తరగతి వరకు 30,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు) పేరుతో మార్పు చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ఆఘమేఘాల మీద దొంగ సంతకాలు చేయించుకుని బడులను విలీనం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండానే తామనుకున్నది నెరవేర్చారు. ప్రస్తుతం బడులు పున:ప్రారంభమయ్యాక తల్లిదండ్రులకు కూటమి చేసిన అసలు విషయం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో విలీన ప్రక్రియ చేపట్టి 498 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో వేల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు.జిల్లాలో 545 ప్రభుత్వ బడులు విలీనంకూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 545 ప్రభుత్వ బడులను విలీనం చేసింది. ఆ బడులను దూర ప్రాంతాల్లో విలీనం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపడుతున్నారు. విలీనం చేసిన బడులను తిరిగి యథాతధంగా కొనసాగించాలని ధర్నాలకు దిగుతున్నారు. ప్రస్తుతం విలీనం చేసిన 545 బడులను మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో 498 పాఠశాలల్లోకి 3,4,5 తరగతులను విలీనం చేశారు. -
గుట్టలనే మింగేస్తున్నారు
పాలసముద్రం: మండలంలోని బాలక్రిష్ణాపురం సమీపంలోని గుట్ట నుంచి తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి ఎర్రమట్టి గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నదని గ్రామస్తులు రెవె న్యూ, పోలీస్ యంత్రాంగానికి తెలిపినా ప ట్టించుకోవడం లేదు. మండలంలో ప్రజలు, రైతులు చెరువులో మట్టి, ఇంటి పక్కన ఉన్న గుంతలను పూడ్చేందుకు ట్రాక్టర్లో మట్టి తీసుకెళ్లుతుంటే మాత్రం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జేసీబీని సీజ్ చేస్తున్నారు. నెల రోజులుగా టిప్పర్లో కొండను తవ్వేస్తుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూసినవారు లేరని రైతులు అంటున్నారు. టిప్పర్లు తమిళనాడువే, పని చేసేవారు కూడా తమిళనాడు వారే. గ్రామస్తులు కొండలోని మట్టిని ఎందుకు తీసుకెళ్లుతున్నారని అడిగితే వారి బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా గుట్టలోని ఎర్రమట్టి రవాణా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. పుత్తూరు విద్యార్థి ముంబయిలో ఆత్మహత్య ● మంగళవారం పుత్తూరుకు చేరిన మృతదేహం పుత్తూరు: ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్), ఎన్ఐఈఎల్టీ ఫలితాలు రద్దయ్యాయన్న మనస్తాపంతో పుత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన ఎన్ఎస్ జార్జ్, స్వర్ణలత దంపతులకు శ్రీమధుర్, హాషిక ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీమధుర్ బీటెక్ పూర్తి చేసి బ్యాంకు కాంపిటీషన్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ముంబయి ఎస్బీఐలో ఐటీ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే ఎన్ఐసీ, ఎన్ఐఈఎల్టీ పరీక్షలో సత్తా చాటాడు. అహర్నిశలు శ్రమించి 5వ ర్యాంకు సాధించాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ఏడాది రద్దు చేశారు. తన లక్ష్యానికి అవరోధంగా నిలిచినందుకు మనస్తాపానికి గురైన శ్రీమధుర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, తోబుట్టువు కుప్పకూలిపోయారు. తల్లిదండ్రులు ముంబయికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని తీసుకొని మంగళవారం పుత్తూరుకు చేరుకున్నారు. సాయంత్రం అశ్రునయనాల మధ్య శ్రీమాధుర్ అంత్యక్రియలు ముగించారు. శ్రీమధుర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తన బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకూ జరగకూడదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐసీ పరీక్షల నిర్వాహుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో దిగజారిన మామిడి ధర
● ర్యాంపుల్లో కేజీ రూ.3లే ● ఫ్యాక్టరీల వద్ద రైతుల పడిగాపులు ● టోకన్ల కోసం గుడిపాలలో తొక్కిసలాట ● సొమ్ముసిల్లిన రైతులు ● అడ్డగోలుగా దళారీ వ్యవస్థ ● పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో మామిడి ధర పతనమవుతోంది. తోతాపురి ధర దిగజారుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మూలనపడింది. ర్యాంపుల్లోనే కేజీ రూ.3కే అమ్ముడవుతోంది. దీనికితోడు దళారీ వ్యవస్థ అడ్డగోలుగా తయారైంది. తమిళనాడు కాయలను కొని.. ప్రభుత్వ ప్రోత్సాహక నిధి రూ.4 కోసం దందా సాగిస్తోంది. ఈ ప్రభావం జిల్లా రైతులపై పడుతోంది. ఫ్యాక్టరీల వద్ద రైతాంగం పడిగాపులు కాస్తోంది. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలతో సొమ్మసిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కాణిపాకం: జిల్లాలో తోతాపురి అవస్థలు తార స్థాయికి చేరాయి. అధిక దిగుబడిని సాకుగా చూపి అందినకాడికి దోచుకునేందుకు ర్యాంపులు తళుక్కుమంటున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 23కి పైగా ర్యాంపులు తెరపైకి వచ్చాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మరికొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని అధికారులే చెబుతున్నారు. కోతలు పెరిగే కొద్దీ ర్యాంపులు తొతాపురి కేజీ రూ.4 నుంచి రూ.3కు తగ్గిపోయింది. జిల్లా కేంద్రంలో అది కూడా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న ఓ ర్యాంపులో కేజీ రూ.3కే కొనుగోలు చేస్తున్నారు. అలాగే చిత్తూరు రూరల్ మండలం, బంగారుపాళ్యం, పలమనేరు, పులిచెర్ల, జీడీనెల్లూరు, పెనుమూరు తదితర ప్రాంతాల్లోని ర్యాంపుల్లో కేజీ రూ.3కే ఫిక్స్ అయ్యారు. ర్యాంపుల్లో ఈ రకమైన దోపిడీ అధికమవుతున్నా సంబంధిత అధికారులుగానీ, కూటమి నేతలు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దళారుల దోపిడీ ఇలా..! మామిడి పంట విషయంలో తమిళనాడు రాష్ట్రం చేతులెత్తేసింది. ఈ కారణంగా అక్కడ మామిడి ధరలు పూర్తిగా క్షీణించాయి. ప్రస్తుతం అక్కడి రైతులు తోతాపురి కేజీ.3కి విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలు దళారులకు కలిసొస్తోంది. వీరు గ్యాంగ్గా ఏర్పడి ఫ్యాక్టరీ నిర్వాహకులతో కుమ్మకై తమిళనాడు కాయలను రూ.3కు కొనుగోలు చేసి జిల్లాలోని ఫ్యాక్టరీలకు తీసుకొచ్చేస్తున్నారు. తమిళనాడు కాయలను ఇక్కడ కేజీ రూ.4, రూ.5కు విక్రయించి దళారులు దండుకునేపనిలో పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధి రూ4ను దోచుకోవడానికి కొత్తదారిని ఎంచుకున్నారు. దళారులకు మామిడి పంట లేకున్నా.. రూ.4 కోసం కొత్త దోపిడీని మొదలుపెట్టారు. ఏదో ఒక పట్టా పాసుపుస్తకాన్ని చూపిస్తున్నారు. ఇలా గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం తదితర మండల సరిహద్దు ప్రాంతాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. సమయం లేదు మిత్రమా మేలో సంవృద్ధిగా వర్షాలు కురిశాయి. ఈ వర్షానికి మామిడి పంట పక్వానికి వచ్చింది. రెండు వారాల్లో కోతలు కోయకుంటే ..మామిడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే తోటలోని కాయలు రాలిపోతున్నాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తే.. అంతవరకు చెట్లోని కాయలు ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. టోకన్ల కోసం గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ ఎదుట గుమికూడిన రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు రైతులకు గుజ్జు పరిశ్రమల వద్ద అవస్థలు తప్పడం లేదు. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. టోకన్లు తీసుకున్న రైతులు మామిడి పంటను కోతలు కోసి విక్రయానికి తెచ్చుకున్నారు. వీరి రాకతో కిలో మీటరు మేర ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇలా రెండు, మూడు రోజులు కాయలు ట్రా క్టర్లలోనే ఉండిపోవడంతో కాయలు నల్లగా మారిపోతున్నాయి. గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి 20 ట్రాక్టర్లను ఎలాంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ వాళ్లను బెదిరించి స్థానిక కూటమి నాయకులు బలవంతంగా ఫ్యాక్టరీకి అంటగట్టారని నిర్వాహకులు వాపోయారు. వారి వల్ల ఇక్కడున్న వందలాది వాహనాలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా బతుకులు దారుణం మామిడి రైతుల బతుకులు దారుణంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా రైతు ఈసారి అవస్థలు పడుతున్నాడు. మామిడి కాయలు అమ్ముకోవడానికి ఇలా క్యూలో పడి నలిగిపోతున్నాము. కేవలం టోకన్ల కోసమే ఈ పరిస్థితి ఉంటే.. వచ్చిన కాయలు అక్కడికక్కడికి అలానే నిలిచిపోయాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తున్నారు. అంత వరకు చెట్లల్లో కాయలు ఉంటాయా..? ప్రభుత్వమే ఆలోచించాలి. –జ్యోతీశ్వర్రెడ్డి, బంగారుపాళ్యం తొక్కిసలాట.. తోపులాట గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ వద్దకు రైతులు మంగళవారం టోకన్ల కోసం వేలా ది మంది తరలివచ్చారు. చిత్తూరు, గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, యాదమరి, రాష్ట్ర సరిహద్దులోని తమిళనాడు రైతులు సైతం వేకువజామున 5 గంటలకే ఫ్యాక్టరీ ఎదుట భారీగా క్యూకట్టారు. వచ్చిన రైతులను కట్టడి చేయలేక ఫ్యాక్టరీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుడిపాల పోలీసులు అదనంగా ఎస్టీఎఫ్ సిబ్బందిని రప్పించారు. ఒక్కసారిగా రైతులు ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోకన్ల కోసం ముందు వరుసలో నిలవాలని పోటీ పడ్డారు. ఇలా మూడు గంటలపాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తో పులాట, తొక్కిసలాటలు జరిగాయి. ఓ వ్యక్తి తొ క్కిసలాటలో నలిగిపోయాడు. మరో వ్యక్తి సొమ్మ సిల్లి పడిపోయాడు. ఓ మహిళ కూడా గేటు తీసి టోకన్ల కోసం లోపలికి అనుమతించే క్రమంలో సొమ్మసిల్లింది. పోలీసులు తక్షణం స్పందించాల్సి వచ్చింది. -
వివాహిత ఆత్మహత్య!
పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలో ని గంటావూరు బీసీ కాలనీకి చెందిన విన్సీప్రియ(34) అనే మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడింది. ఈ ఘటన మంగళవారం పలమనేరులో వెలుగులోకి వచ్చింది. స్థానిక సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలి భర్త పసుపతి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో భార్య, ఏడేళ్ల కుమారుడు ఉంటున్నారు. ఇలా ఉండగా డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న భర్త సోమవారం రాత్రి భార్యతో మాట్లాడినట్టు సమాచారం. అయితే మంగళవారం పొద్దున నుంచి తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిప్ట్ చేయలేదు. దీంతో తమ ఇంటి పక్కనున్న వారికి చెప్పగా వారు వెళ్లి చూడగా ఉరేసుకుని ఉండడంతో అదే వీధిలో ఉంటున్న మృతురాలి తల్లికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో మృతురాలి కొడుకు అమ్మమ్మవద్దే ఉన్నాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి ఆమె భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. మరోవైపు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చిరు దుకాణంలో అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న చిరుదుకాణంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తినుబండారాలు తయారు చేసే ఆ చిరుదుకాణంలో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బేకరిలోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.10 వేల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. -
మామిడి రైతుకు కూటమి శఠగోపం
కార్వేటినగరం: మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టేసిందని, మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం ఉడమలకృత్తి గ్రా మంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఉ మ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు ఎక్కడా సంతోషం లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పరిశ్రమలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. గత జగనన్న ప్రభుత్వంలో కిలో మామిడి రూ.30 వరకు చెల్లించినట్టు ఆయన గు ర్తుచేశారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కిలో రూ.4కు పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలు ఇచ్చే టోకన్లలోనూ రాజకీయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేసి వేధించడం పనిగా పెట్టుకున్నట్టు విమర్శించారు. మామిడి రైతుల నుంచి దళారులు అతి తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వెంటనే మామిడి రైతు కన్నీళ్లు తుడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇలాక కుప్పం నియోజకవర్గంలో భర్త చేసిన అప్పు చెల్లించలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టి దాడి చేసిన పచ్చనేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బాలికపై 14 మంది టీడీపీ కామాంధులు అత్యాచారానికి ఒడిగడితే వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. -
తోతాపురి కిలో రూ.6
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తోతాపురి కిలో రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఆమె తోతాపురి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 98 వేల ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి పండిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 35 ప్రొసెసింగ్ యూనిట్లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేస్తున్నాయన్నారు. గుజ్జు పరిశ్రమల ద్వారా రోజూ దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మామిడి ప్రొసెసింగ్ జరుగుతోందన్నారు. మామిడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో తోతాపురి మామిడి కిలో రూ.12గా మద్దతు ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో గుజ్జు పరిశ్రమలు రూ.8 చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.4 మద్దతు ధరను రైతుల ఖాతాలకు నేరుగా జమచేస్తుందన్నారు. 38 ర్యాంపులు, 2 మండీల వద్ద అమ్ముకునే రైతులకు కూడా ప్రభుత్వం రూ.4 మద్దతు ధరను అందిస్తుందన్నారు. మామిడి కాయల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి ప్రొసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంప్ వద్ద హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక వీఆర్వోతో కూడిన టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు సమస్యలుంటే 08572–242777, 9491077325 హెల్ప్లైన్లోకు సంప్రదించాలని కోరారు. గత ఎనిమిది రోజుల నుంచి తోతాపూరి మామిడికాయలు 38 వేల టన్నులు ఫ్యాక్టరీలకు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. -
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
తోతాపురి మూడు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసింది. ఆయా రాష్ట్రాల నుంచి మామిడి దిగుమతి కాకుండా చేస్తోంది.ధరలు వి‘ఫలం’! జిల్లాలో మామిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ర్యాంపుల్లో కిలో రూ.3 లెక్కన పలుకుతోంది. బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025● మాది చిత్తూరు రూరల్ మండలం, అనంతాపురం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 16 కి.మీ దూరంలో ఉన్న బీఎన్ఆర్.పేట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారు. బీఎన్ఆర్ పేటకు వెళ్లాలంటే నాలుగు చెరువులు దారిలో ఉన్నాయి. చిత్తూరు–తిరుత్తణి హైవే ఉంది. ఇలాంటి ప్రమాదపు దారుల్లో పిల్లల్ని ఎలా పంపాలి. ● గంగాధరనెల్లూరు మండలం, నెల్లేపల్లి పంచాయతీ, కొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాలను కూట మి ప్రభుత్వం సమీపంలో ని నెల్లేపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలోకి విలీ నం చేసింది. చాలా దూరంలో ఉన్న ఈ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలంటే కష్టంగా ఉంది. కూటమి వింత నిర్ణయం వల్ల పిల్లల కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. ● మాది గంగాధరనెల్లూరు మండలం, అగ్రహారం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల పిల్లలను కే.వీ.పురం పాఠశాలలో విలీనం చేశారు. దీని వల్ల 40 మంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉన్న కేవీ పురానికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలను మార్చకూడదని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో మూడు సార్లు నిర్ణయం తీసుకుని ఎంఈవోకు ఇచ్చినా ఫలితం లేకపోయింది.● మాది వెదురుకుప్పం మండలం, యనమల మంద గ్రామం. మా గ్రామంలో దాదాపు 520 కుటుంబాలు ఉన్నాయి. 50 మంది పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు పాఠశాలను దూర ప్రాంతంలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేశారు. విలీనం వల్ల మా పిల్లలు నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి వస్తోంది. ఇది న్యాయమేనా?. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ -
అదే పట్టుగూళ్లు, టమాటాలకు ఏడాదంతా సీజనే
జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో ఎక్కువగా పట్టుగూళ్లు, టమాటా సాగవుతోంది. ప్రస్తుతం 36వేల ఎకరాల్లో 22 వేలమంది రైతులు మల్బరీని సాగుచేస్తున్నారు. ఏటా 1500 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ పండించిన పట్టుగూళ్లను పలమనేరు, కుప్పం, మదనపల్లి పట్టుగూళ్ల విక్రయకేంద్రాలకు తీసుకెళ్లాలి. కానీ ఇక్కడికంటే కర్ణాటకలోని కోలారు, విజయపుర, సిడ్లగట్ట, రామనగరలలో ధర ఎక్కువగా పలుకుతుంది. దీంతో ఇక్కడ ఉత్పత్తయ్యే గూళ్లలో 20 శాతానికి పైగా అక్కడికే చేరుతోంది. ఇక టమాటాలు ఇక్కడి నుంచి కర్ణాటకలోని కోలారు, తమిళనాడులోని కోయంబేడు( చైన్నె) మార్కెట్లకు నిత్యం వందలాది టన్నుల సరుకు వెళుతోంది. -
అల్లుడి అరెస్ట్
పుత్తూరు: పట్టణ పరిధిలో ని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సురేంద్రనాయుడు కథ నం మేరకు.. గ్రామానికి చె ందిన చెంచయ్య భార్య ఎన్.నరసమ్మ(53) ఈనెల 4వ తేదీన హత్యకు గురైంది. నరసమ్మ పెద్ద కుమార్తె ఎన్.కళ్యాణిని జీ.మోహన్కు ఇచ్చి 2019లో వివాహం చేసింది. పెద్ద అల్లుడు మోహన్ వివాహం అయినప్పటి నుంచి తాగుడికి బానిసై భార్యాబిడ్డలను పట్టించుకునేవాడు కాదు. దీంతో విసుగు చెందిన కళ్యాణి బిడ్డలతో నెల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మోహన్ అత్త ఇంటికి వచ్చి తన భార్యను కాపురానికి పంపా లని నరసమ్మను అడిగాడు. వీరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి లోనైన మోహన్ కర్రతో నరసమ్మ తలపై బలంగా కొట్టాడు. ఆమె కు మార్తె కళ్యాణి తల్లి నరసమ్మను మొదట పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీన నరసమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు మోహన్ను మంగళవారం తడుకు బస్ స్టాప్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
పీఎం శ్రీకి షాక్
చిత్తూరు కలెక్టరేట్/ తిరుపతి ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకుండా నాన్చుతోంది. ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ మేనిఫెస్టోకు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు పథకాలు ఇవ్వకుండా మినహాయించింది. ఫలితంగా వేలాది మంది పేద విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందలేకపోయారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకత్వం ఈ నెల 21న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పీఎంకు ఈ మెయిల్స్ పంపిస్తున్నా రు. అయితే పీఎం కార్యాలయం నుంచి విద్యార్థులకు, ఆ పాఠశాలలకు ఇంకా ఎలాంటి సమా ధానం రాలేదు. ఈ సమాచారం అందుకున్న కూటమి ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను, తల్లిదండ్రులను సచివాలయాల్లో ఫిర్యా దు చేసుకోవాలని సూచించింది. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం తల్లికి వందనం దరఖాస్తులను ఆయా బడుల్లోనే చేసుకోవాలని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలకు సమాచారం చేరవేశారు. ఈ సమయంలో ఈ పథకం వర్తింపుపై బీజేపీ శ్రేణులే చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.వేల మందికి నష్టంతిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఒక్క విద్యార్థికి సైతం తల్లికి వందనం నగదు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.లోలోపలే కక్ష సాధింపులుపైకేమో కూటమి సర్కారు అంటూ ఆర్భాటాలు...లోపలేమో కక్ష సాధింపులు. తాజాగా విడుదలైన తల్లికి వందనం పథకంలో సెంట్రల్ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలల విద్యార్థులకు తల్లికి వందనం పథకం మంజూరు చేయని దుస్థితి. గత వైఎస్సార్సీపీ సర్కారులో ఎలాంటి తారతమ్యం లేకుండా అన్ని యాజమాన్యాల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు తమతో పాటే ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల టీడీపీ కక్ష సాధింపు ధోరణి చేస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం మంజూరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోను బీజేపీ విస్మరించడంతోనే ఇలా కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
9న ఆశావర్కర్ల సమ్మె
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిని కలిసి సమ్మె నోటీసును అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఆశవర్కర్లకు కనీస వేతనం అమలు చేయాని, సమస్యలపై స్పందించి పరిష్కరించేలా చూడాలన్నారు. ఆశా వర్కర్లకు అదనపు పనులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిరసనలకు అనుమతి తప్పనిసరి చిత్తూరు అర్బన్: బహిరంగ ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలంటే తప్పనిసరిగా డీఎస్పీ స్థాయి అధికారి నుంచి అను మతి తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతియుత ర్యాలీ లు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు సంబంధిత వ్యక్తులు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. డీఎస్పీకి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే, ఆయన పరిస్థితిని సమీక్షించి అనుమతలిస్తేనే కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు బాబోయ్! చిత్తూరు కార్పొరేషన్: నివాసాలకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడారు. ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ విధానంతో భవిష్యత్లో పలు ఇబ్బందులు రావడం ఖాయమన్నారు. ఇందులో బిల్లులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జవాబుదారీ తనం కూడా ఉండదన్నారు. వీటిని దశలవారీగా ప్రీపెయిడ్ మీటర్లకు మారుస్తారన్నారు. అప్పుడు ముందుగానే వాటికి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాత్రుల్లో కరెంటు పోతే రీచార్జ్ చేస్తే గానీ విద్యుత్ సరఫరా కాదన్నారు. నాయ కులు సురేంద్రనాథ్, శ్రీనివాసమూర్తి, సౌక త్, మునస్వామి, రషీద్, సురేంద్రనాథ్, రో జా, కోమల, విజయగౌరి, రవి, విజయభాస్కర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలు వెల్లడించింది. నగరి నియోజకవర్గానికి చెందిన చిరంజీవిని రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా, పలమనేరు నియోజకవర్గానికి చెందిన నాగరాజును రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూ రుపేట నియోజకవర్గాలకు చెందిన రాజచంద్రశేఖర్గౌండర్, వెంకటరమణయ్య, జయరామయ్యను రాష్ట్ర కల్చరల్ వింగ్ కార్యదర్శులుగా నియమించినట్టు పేర్కొంది. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,681 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
కర్ణాటకలో ధర ఎక్కువ మేం ఎన్నో ఏళ్లుగా పట్టు గూళ్లను కర్ణాటకలోని మార్కెట్లకు తీసుకెళుతున్నాం. ఎందుకంటే ఇక్కడి మార్కెట్లలో కంటే అక్కడ కేజీపై రూ.40 నుంచి రూ.50 ఎక్కువగా పలుకుతోంది. ఇక్కడ తక్కువ ధరలకు అమ్మి ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటీవ్ కంటే అక్కడ అమ్మితే ఎక్కువగా దక్కుతుంది. అందుకే కర్ణాటక మార్కెట్లకు గూళ్లను అమ్ముతున్నాం. – రెడ్డెప్ప రెడ్డి, పట్టు రైతు, టీఎస్ అగ్రహారం, పలమనేరు కోలారు మార్కెట్లో అమ్మేస్తా నేను ఏటా సీజన్తో సంబంధం లేకుండా పదెకరాల్లో టమాటా సాగుచేస్తా. ఎక్కువ పె ట్టుబడి పెట్టి కేవలం హైబ్రిడ్ సీడ్స్మాత్రమే ఎంచుకుంటా. ఈ సరుకు ఇక్కడి మార్కెట్లో ఆశించిన ధరతో అమ్ముడుపోదు. అందుకు క ర్ణాటకలోకి కోలారు టమాటా మార్కెట్కు తీ సుకెళ్తాం. అక్కడికి ఇక్కడికి ధరలో వ్యత్యాసం ఉంటుంది. – గోవిందురెడ్డి, టమాటా రైతు, బేరుపల్లి, పలమనేరు మండలం జిల్లాలో మామిడి సీజన్ నడుస్తున్న నేపథ్యంలో మామిడి ధరలు నిలకడగా ఉండాలని పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి కాయలు జిల్లాలోకి రాకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆంక్షలను విధించింది. ఇటీవల చిత్తూరుకొచ్చిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతం పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి ఇక్కడికి రాకూడదని దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేలా ఉంది. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీజన్తో సంబంధం లేకుండా పట్టుగూళ్లు కర్ణాటకలోని పలు మార్కెట్లకు ఇక్కడి రైతులు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అదే విధంగా టమాటాలు అటు కర్ణాటకలోని కోలారు ఇటు తమిళనాడులోని చైన్నై కోయంబేడు మార్కెట్కు నిత్యం వెళుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలనుంచి జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు వచ్చే తోతాపురిని మనం అడ్డుకుంటే వారు అదే విధంగా కట్టడి చేస్తే ఇక్కడి టమాటా, పట్టుగూళ్ల రైతుల పరిస్థితి ఏంటనే మాట రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం? కర్నాటక, తమిళనాడునుంచి జిల్లాలోకి మామిడి కాయలు రాకుండా ఆంక్షలు విధించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద రెవెన్యూ యంత్రాంగం కాపాలా కాస్తోంది. దీనికి కారణం జిల్లాలో ఈ దఫా మామిడికి గిట్టుబాటు ధర లేదు. కలెక్టర్ చెప్పినా కిలోకు రూ.8 ఇవ్వలేమని గుజ్జుపరిశ్రమల నిర్వాహకులు మొండికేస్తున్నారు. కనీసం రూ.6 కూ కొనడంలేదు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి రాకుంటే జిల్లాలోని మామిడికి ధర పెరుగుతుందని అధికారులు ఆంక్షలను పెట్టారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఘాటుగా స్పందించి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీసేలా ఉంది. మామిడి సీజన్ కొన్నాళ్లే జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడి తోటలుంటే ఏటా సీజన్లో 7లక్షల టన్నుల దిగుబడి వస్తున్నట్టు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మామిడి సీజన్ ప్రధానంగా మే నుంచి జూలై ఆఖరుదాకా సాగుతుంది. జిల్లాలో సాగయ్యే మామిడిలో తోతాపురి 55శాతం ఉంది. జిల్లాలో 15కుపైగా గుజ్జుపరిశ్రమలున్నాయి. తోతాపురిని పల్ప్ ఫ్యాక్టరీలకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రాలు వీటిపై మెలిక పెడితే... చిత్తూరు జిల్లానుంచి పట్టుగూళ్లు, టమాటాలను కర్ణాటకలో కొన మని ఆ రాష్ట్రం ఆంక్షలు పెడితే ఇక్కడి రైతుల పరిస్థితేంటనే మాట వినిపిస్తోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి టమాటాలను వద్దంటే అప్పుడు టమాటా ధరలు మరింత పతనం కావడం తథ్యం. ఇప్పటికే టమాటా ధరలు తగ్గుముఖం పట్టి జిల్లాలోని రైతులు తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఇదే పరిస్థితి రేపు పట్టుగూళ్ల రైతులకు వస్తే రైతులకు కష్టాలు మొదలై పొరుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల తోతాపురిపై కూటమి ఆంక్షలు జిల్లా నుంచి కర్ణాటకకు మన పట్టుగూళ్లు తమిళనాడుకు ఇక్కడి టమాటాలు వెళుతున్నాయి వీటికి ఆ రాష్ట్రాలు అడ్డుకట్ట వేస్తే పరిస్థితేంటి? -
అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నా
కుప్పం రూరల్: ‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే.మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది. నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు. మా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించింది.నలుగురికి రిమాండ్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ప్రసాద్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆదేశించారు. కాగా.. శిరీషపై దాడిచేసిన మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అండగా ఉంటాం: ఎమ్మెల్సీ భరత్ కూటమి ప్రభుత్వం రాగానే సామాన్యులపైనా దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఎయిర్పోర్ట్ భూముల విషయంలో టీడీపీ కార్యకర్తలు మగ దిక్కులేని కుటుంబంపై దాడిచేసిన ఘటన మరువక ముందే కుప్పం మండలం నారాయణపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. భర్త అప్పులు చేస్తే భార్యను చెట్టుకు కట్టేసి బట్టలు చించేందుకు ప్రయత్నించడం చాలా దారుణమన్నారు. విడతల వారీగా అప్పు తీరుస్తానని మహిళ మొర పెట్టుకుంటున్నా చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత హేయమైన చర్య అన్నారు. కొడుకు చూస్తుండగా, తల్లిని కొడుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం మరింత దారుణమన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరత్ చెప్పారు. -
కడుపు మండిన మామిడి రైతులు
కాణిపాకం: కడుపు మండిన తోతాపురి మామిడి రైతులు సోమవారం కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనలేమంటూ కంపెనీలు చేతులెత్తేయడంతో చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులపై నిరసన తెలిపారు. చిత్తూరు, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. చిత్తూరు గంగసాగరం ఫ్యాక్టరీలో మామిడి కొనుగోలుకు టోకెన్లు జారీ చేస్తున్నారని ప్రకటించడంతో మామిడి రైతులు ఆదివారం అర్థరాత్రి నుంచే అక్కడ పడిగాపులు పడ్డారు.సోమవారం ఉదయం 5 గంటల సమయానికి వందలాది రైతులు టోకెన్ల కోసం గుమిగూడారు. టోకెన్లు పంపిణీ చేయకపోగా గేట్లు మూసివేయడంతో రైతులు కర్మాగారాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఇద్దరు మహిళా రైతులు స్పృహతప్పేలా ఉండడంతో రైతులంతా హాహాకారాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది మహిళా రైతులను లోపలకు అనుమతించారు. పోలీసులు రైతులను అదుపు చేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అరకొరగా టోకెన్లు పంపిణీ చేసి మళ్లీ వచ్చేనెల 5న ఇస్తామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం బోర్డు పెట్టింది. దీంతో రైతులు ఉసూరు మన్నారు.గంగాధర నెల్లూరు మండలంలోని ఫ్యాక్టరీ వద్ద కూడా టోకెన్లు ఇస్తారంటూ ప్రచారం చేయడంతో రెండు, మూడు రోజులుగా రైతులు మామిడి కాయలతో పడిగాపులు పడ్డారు. సోమవారం ఉదయానికీ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. బంగారుపాళ్యం మండలంలోనూ ఫ్యాక్టరీ టోకెన్లు ఇవ్వలేదని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. తవణంపల్లి మండలంలోనూ ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి కొనలేమని బోర్డు పెట్టేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించినట్టు రూ.8కి మామిడి కాయలు కొనలేమని, రూ.5కూ కష్టమేనని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. -
ఆటో దొంగల అరెస్టు
చిత్తూరు అర్బన్: ఆటోలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను వన్టౌన్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పట్టుబడిన ఆ ఇద్దరినీ చిత్తూరు నగరంలోని పోలీసుల అతిథి గృహంలో సీఐ మహేశ్వర అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు, ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు చోరీకి గురవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో దొంగలు తిరుపతివాసులుగా తేలడంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, చిత్తూరు కట్టమంచి వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ తిరుపతి జీవకోనకు చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగంగా గుర్తించారు. వారి నుంచి రూ.10.50లక్షలు విలువ చేసే మూడు ఆటోలు, ఒక ఆటో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశామని, రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
ఇంత నీచ రాజకీయం తగదు బాబూ..
పుంగనూరు(చౌడేపల్లె): ఇలాంటి నీచ రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప అన్నారు. ఆయన సోమవారం పుంగనూరులో పార్టీ నాయకులతో కలిసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, మహిళలకు రక్షణలేదని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, రాష్ట్ర జానపద కళల మాజీ చైర్మన్ కొండేటి నాగభూషణం, రాయలసీమ మైనారిటీ విభాగం నాయకుడు ఫకృద్దీన్ షరీఫ్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా చర్యలు చౌడేపల్లె: ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దైవ దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ రాష్ట్ర కమి షనర్ రామచంద్రమోహన్ తెలిపారు.షాయన సోమవారం బోయకొండలో పర్యటించగా, ఈఓ ఏకాంబరం స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంయుక్త కమిషనరేట్ పరిధిలో ఉన్న 7 ఆలయాలు, ఉపకమిషనరేట్ పరిధిలో ఉన్న 17 ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● వారం క్రితం నగల దుకాణంలో చోరీ ● ఎట్టకేలకు పట్టుబడిన నిందితుడు ● ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు అర్బన్: అంతర్రాష్ట్ర దొంగకు సినిమాలంటే మోజు. ఆ మోజుతో సినిమా తీసి అప్పుల్లో కూరుకుపోయాడు. బాలనేరస్తుడిగా మొదలై ప్రస్తుతం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల చిత్తూరులోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసి పోలీ సుల చేతికి చిక్కాడు. నగరంలోని పోలీసుల అతిథి గృహంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సమక్షంలో పోలీసులు అతడిని అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరం జెండామానువీధిలోని శరవణ బంగారు దుకాణంలో ఈనెల 4వ తేదీన చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తలుపులు పగలగొట్టి 126 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. షాపు యజమాని శరవణ ఆచారి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దొంగ ను పట్టుకోవడానికి కసరత్తులు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగ జాడలను పసిగట్టారు. కర్ణాటక రాష్ట్రం ఎంఆర్ఎస్ పాళ్యకు చెందిన ఆనంద్గా నిర్ధారణకు వచ్చారు. చాకచక్యంగా అతడిని పట్టుకుని, రూ.11.80 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. సినిమా మీద పిచ్చితోనే దొంగతనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కీచకుడు అనే కన్నడ సినిమాను తెరకెక్కించాడని..అయితే అది రిలీజ్కు నోచుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సినిమా పిచ్చి వల్ల చోరీలకు అలవాటు పడ్డాడని పోలీసులు వివరించారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో బాలనేరస్తుడిగా మద్రవేసుకుని, మొత్తం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య, ఇతర పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ సాయినాథ్ అభినందించారు. బైక్ దొంగతనాలను అరికడుతామని, త్వరలో అరెస్టులు ఉంటాయని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. -
ఇంకెన్ని సార్లు తిరగాలో..?
● వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు విచ్చేసిన ప్రజలు ● వినతులు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ● పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలు 254 చిత్తూరు కలెక్టరేట్ : ‘‘మా సమస్యలు ఇంకెన్ని సార్లు విన్నవించుకోవాలి, ఇంకెన్ని సార్లు తిరగాలో ఏమో..’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు మార్లు అర్జీలిస్తున్నప్పటికీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు దిగులు చెందుతున్నారు. కలెక్టరేట్లో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలను ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి స్వీకరించారు. పలు సమస్యలపై 254 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయండి అన్ని అర్హతలున్నప్పటికీ తనకు దివ్యాంగ పింఛన్ ఇవ్వడం లేదని పలమనేరుకు చెందిన దివ్యాంగుడు నాగం ఆవేదన వ్య క్తం చేశారు. తనకు 100 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగ పింఛన్ కోసం పలు మార్లు అధికారులకు అర్జీ ఇచ్చినప్పటికీ ఎవరూ న్యాయం చేయడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. దివ్యాంగులపై కనికరం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనమైనా ఇవ్వండి... పథకాలైనా వర్తింపచేయండి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ వేతనమైనా ఇవ్వాలి లేదా సంక్షేమ పథకాలైనా వర్తింప చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ మేరకు అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, షకీల మాట్లాడుతూ సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పుచేశారన్నారు. వితంతువులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గిరిధర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ, సుజని, ధనకోటి, ప్రమీల, సరళ, కస్తూరి, లీలా పాల్గొన్నారు. దళితులను వెలివేయాలని చూస్తున్నారు దళితులను గ్రామం నుంచి వెలివేయాలని అగ్రకులస్తులు చూస్తున్నట్లు చిత్తూరు నగరం మాపాక్షి రెవెన్యూ ఉయ్యాలచింత గ్రామస్తులు జయ, పార్వతి, జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చిత్తూరు నగరం 13వ వార్డు లో సర్వే నెంబర్ 123 లో 30 ఏళ్ల నుంచి జీవిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం రాస్తా పోరంబోకు స్థలంలో ఇంటి స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇటీవల కొందరు అగ్రకులస్తులు వచ్చి వెలివేయాలని చూస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు రాష్ట్ర ప్రభుత్వం అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లా డుతూ పేదలకు నష్టం జరిగే స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆ సంఘం నాయకులు శ్రీనివాసమూర్తి, షౌకత్, మునస్వామి, రషీద్, రాజేంద్రన్ పాల్గొన్నారు. -
ఇది ముంచే ప్రభుత్వం
● నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ● ఆయనకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య ● ‘5 కోట్ల మందికి వెన్నుపోటు’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి రోజా నగరి : ‘కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వం అంటూ డప్పు కొట్టుకుంటుంటే.. ప్రజలు మాత్రం ఇది ముంచే ప్రభుత్వం అంటున్నారు’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఎద్దేవా చేశారు. నగరి పట్టణంలోని తన నివాసంలో సోమవారం ‘5 కోట్లమందికి వెన్నుపోటు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని ముక్త కంఠంతో జనం చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇస్తామని ఏడాదైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు లేదన్నారు. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదు, ఉచిత బస్సు లేదు. 18 యేళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 లేదు, ఇప్పటి వరకు ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో జన తాకిడి చూసిన తర్వాత భయపడి తల్లికి వందనం హడావుడిగా విడుదల చేశారన్నారు. అది కూడా 87 లక్షల మందికి అందాల్సిన పథకం కేవలం 57 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకే ఆధార్ నెంబర్తో 349 మందికి, 54 మందికి, 92 మందికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులను అనర్హత కింద పరిగణించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి తీసుకుంటే రాద్ధాంతం చేసిన చంద్రబాబు, నేడు రెండు వేలు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూలన ఉండే ముసలమ్మ కూడా బలన్ నొక్కుతుందన్న చంద్రబాబు ఒక్క బటన్ నొక్కడం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి..ఎల్లో మేనిఫెస్టో అమలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయని వాటిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, దీప, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి
చిత్తూరు అర్బన్: ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలిగించకుండా, వచ్చిన ఫిర్యాదులను త్వ రితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూ రు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వేధింపులు, కుటుంబ సభ్యులు, దారి సమస్యలకు సంబంధించి మొత్తం 14 అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించి ఫిర్యాదులకు న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు. మామిడి తోటల్లో గజ దాడులు పలమనేరు: మండలంలోని ఎలిఫెంట్ క్యాంపు పక్కనే ఉన్న ముసలిమడుగు సమీపంలోని మామిడి తోటల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. కాయలను తిని, కొమ్మలను విరిచేసినట్టు గ్రామస్తులు తెలిపా రు. పంటనష్టాన్ని స్థానిక ఫారెస్ట్ సిబ్బంది సోమవా రం పరిశీలించి పరిహారానికి నివేదికలు సిద్ధం చేశారు. అడవిలోంచి వచ్చి రైతుల పంటలను రుచిమరిగిన మదపుటేనుగులను కుంకీ ఏనుగులు అదుపు చేయడం చాలా కష్టమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అయితే ఇక్కడి ఏనుగుల సమస్యను కుంకీ ఏనుగుల ద్వారా అటవీశాఖ ఎలా కట్టడి చేస్తారో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తండ్రి మరణానికి కారణమైన కుమారుడు అరెస్టు చౌడేపల్లె: కన్నతండ్రి మరణానికి కారణమైన కుమారుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ నాగేశ్వరరావు సోమవా రం తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు, చౌడేపల్లె మండలం అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి, రాజమ్మ దంపతుల కుమారుడు మనోహర్రెడ్డి ఆస్తి విషయమై మార్చి 30వ తేదీ తండ్రితో గొడవకు దిగాడు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. మనోహర్రెడ్డి చేసిన దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మార్చి 31న ‘కడుపున పుట్టికోళ్ళా... తోడేళ్లా అనే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనలపై స్పందించిన జిల్లా ఎీస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందిన అనంతరం చిన్నప్పరెడ్డిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఏప్రిల్ 21వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతికి కారణమైన కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ పరారయ్యారు. ఈ క్రమంలో పోలీసులు సోమవారం మనోహర్రెడ్డిని అరె్స్ట్ చేసి రిమాండుకు తరలించారు. పరారీలో ఉన్న సరస్వతమ్మను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
మామిడి రైతుకు అండగా ఉంటాం
● రైతుల ఆందోళనపై తక్షణం ప్రభుత్వం స్పందించాలి ● కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలి ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని సోమవారం పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరించడం లేదని మండిపడ్డారు. రైతుల గోడుపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా మామిడి కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయించాలని, లేకుంటే వైఎస్సార్సీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. మామిడి రైతుకు న్యాయ జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే.. ● మామిడికి కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకడం లేదు. ఫ్యాక్టరీలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ● మామిడి రైతులు తమ పంటలను ట్రాక్టర్లో తీసుకువచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, పొ రుగు రాష్ట్రాల మామిడి నేరుగా ఫ్యాక్టరీల్లోకి వెళ్లి పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? సరిహద్దుల్లో చెక్పోస్టు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో మామిడి ఎలా వస్తోంది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి నేతలు కుమ్మకై ్క రైతులను నాశనం చేస్తున్నారు. ● తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ మామిడి రైతులు రోడ్డెక్కారు. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ● గుజ్జు ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు టోకెన్ విధానం తీసుకువచ్చాయి. ఈ టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నాయి. మిగిలినవి కూటమి నేతలు చెప్పిన వారికే గంపగుత్తగా ఇచ్చేస్తున్నాయి. ● ప్రభుత్వం సైతం జిల్లా రైతులను దగా చేస్తోంది. కూటమి నేతల కోసం ఫ్యాక్టరీలకే కొమ్ముకాస్తోంది. మామిడి కిలోకి రూ.12 గిట్టుబాటు అవుతుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు కేవలం రూ.6 మాత్రమే రైతులకు చెల్లిస్తున్నాయి. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుజ్జు ఫ్యాక్టరీల వారు పంట కొనుగోలు చేసిన వారానికే రైతులకు నగదు అందించేవారు. ఇప్పుడు 3 నెలలకు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. కాదంటే సరుకు కొనం.. వెళ్లిపోండి అని తరిమేస్తున్నారు. ● గతంలో తోతాపురి రకం కోత సమయంలో పండు కాయలు తక్కువ ధరకు కొనేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్నా గ్రేడింగ్లో పారేస్తున్నారు. ● మామిడి కొనుగోలు విషయంలో రైతుల గోడును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ధర పడిపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేయించింది. ● కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్పమామిడి రైతుల కష్టాలు కనిపించడంలేదు. మామిడి రైతులకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ● వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యాచరణతో రైతులకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మెడలు వంచి, గిట్టుబాటు రేటుకు మామిడిని కొనుగోలు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తుంది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎక్కడైనా కిలో మామిడి రూ.8కు కొనుగోలు చేస్తున్నారా? నిరూపించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? రైతులతో ఈ మాట చెప్పించగలరా? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. రైతుల ఆగ్రహం చూసిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించి చేతులు దులుపుకుంది. ప్రభు త్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక నిధి ఇస్తామని గొప్పగా ప్రకటించింది. అయితే ఎక్కడా అమలు జరగడం లేదు. ఎకరా మామిడి సాగు చేయాలంటే కనీసం రూ.45వేలు ఖర్చవుతోంది. ఫ్యాక్టరీల వారు చిన్న మచ్చ ఉంటే కూడా కాయలు కొనడం లేదు. దీంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
వేతనాలు పెంచాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. టోకెన్ల కోసం ధర్నా చేశాం టోకెన్లు ఇస్తారని గంగాసాగరంలోని ఫ్యాక్ట రీ వద్దకు వేకు వజామున 4 గంటలకు వచ్చాం. టోకె న్లు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగాం. ఆ తర్వాత టోకెన్లు ఇస్తా రని చెప్పడంతో పొలోమని ఫ్యాక్టరీ గేటు వద్దకు వెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. –కస్తూరి, అనుపల్లి, చిత్తూరు నగరం రైతుల వద్దకే టోకెన్లు ఇవ్వాలి అర్ధరాత్రి వచ్చా మండి. వీళ్లు తెల్లారి 7 గంటలవుతున్నా టోకెన్లు ఇవ్వలేదు. అంతకు ముందే ఇ చ్చుంటే ఈ గోల ఉండి ఉండదు. ఒక్క టోకెన్ కోసం ఈ దుస్థితి ఏమిటో మాకు అర్థకావడంలేదు. రైతుల పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. టోకెన్లు సక్రమంగా ఇస్తే బాగుంటుంది. లేకుంటే మేమంతా కలిసి రోడ్డెక్కాల్సిందే. –ధనంజయ్యనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం ఎందుకీ మీనమేషాలు? ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఈ సంవత్స రం మామిడి ఆర్డర్లు ఉన్నప్పటికీ కొనటానికి మీనమేషాలు లె క్కిస్తున్నాయి? కూ టమి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మామిడి రైతులు గుజ్జు పరిశ్రమలకు లాభాలు అందిస్తుంటే ... నిర్వాహకులు మాత్రం రైతును ముప్పుతిప్పలు పెట్టి నష్టాల్లో ముంచేస్తున్నారు. – ప్రవీణ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు – 8లో -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
గత వారం చిత్తూరులో నగల దుకాణంలో చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025జిల్లాలోని మామిడి రైతులకు దిక్కులేకుండా పోయింది. అధికారులు, పాలకుల మాటలను ఫ్యాక్టరీ యజమానులు లెక్క చేయడం లేదు. దీంతో మామిడి కాయలు అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సి వస్తోంది. చిత్తూరు, జీడీ నెల్లూరు, తవణంపల్లె, బంగారుపాళ్యం మండలాల్లో సోమవారం టోకెన్లు ఇవ్వలేమని ఫ్యాక్టరీలు బోర్డులు పెట్టేశాయి. దీంతో ఫ్యాక్టరీల ఎదుట రైతుల ఆందోళనకు దిగి రోడ్లపై బైఠాయించారు. రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొన్ని ఫ్యాక్టరీలు నామమాత్రంగా టోకెన్లు ఇచ్చాయి. అయినా రైతుల గోడును పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం. – కాణిపాకం జిల్లాలో ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కాయలు పక్వానికి రావడంతో కోతలు జోరందుకు న్నాయి. ఈ కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు కొన డం లేదు. ఏదో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం బయట రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి కాయలను కొనుగోలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీలు వాటిని లెక్కచేయడంలేదు. చిత్తూరులో ఏం జరిగిందంటే... చిత్తూరు నగరం గంగాసాగరంలోని ఓ గుజ్జు పరిశ్రమ సోమవారం టోకెన్లు ఇస్తున్నట్లు వారం రోజుల ముందే బోర్డు పెట్టింది. టోకెన్లు ఇస్తారని మామిడి రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడే కునుకు తీస్తూ.. ఆధార్, పట్టా పాసు పుస్తకం జెరాక్స్ నకలను క్యూలో పెట్టారు. ఉదయం 7గంటలకు రైతు లు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసికట్టుగా చిత్తూరు–వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడారు. టోకెన్లు ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటును రైతులు చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అక్కడ రైతుల అరుపులు, కేకలతో ఫ్యాక్టరీ ఆవరణ దద్ధరిల్లింది. అక్కడే ఉన్న వృద్ధురాలికి ఊపిరి ఆడలేదు. వెంటనే రైతులు ఆ వృద్ధురాలిని ఫ్యాక్టరీ లోపలికి పంపారు. ఆపై అరకొరగా టోకెన్లు ఇచ్చిన ఫ్యాక్టరీ నిర్వాహకులు వచ్చేనెల 5వ తేదీ టోకెన్లు ఇస్తామంటూ మరో బోర్డు పెట్టారు. దీంతో టోకెన్లు అందని రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పలుచోట్ల ఇదే పరిస్థితి గంగాధర నెల్లూరు మండలంలో మూడు రోజులుగా మామిడి కాయలను ట్రాక్టర్ల నుంచి అన్లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. ఇప్పటివకే ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు భారీ సంఖ్యలో క్యూకట్టాయి. బంగారుపాళ్యం మండలంలో కూడా ఫ్యాక్టరీలు టోకెన్లు ఇవ్వకుండా తలుపులు వేసేశాయి. వచ్చే నెల టోకెన్లు ఇస్తామని ముఖం చాటేశాయి. ఒక చేసేది లేక రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి, చివరికి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. తవణంపల్లె మండలంలోని ఫ్యాక్టరీలు కూడా మామిడి రైతులకు టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. చిత్తూరు: గంగాసాగరం ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగిన రైతులు– 8లో– 8లో పంట అమ్ముకోవడానికి తంటాలు పడిగాపులు కాసి కాసి సహనం కోల్పోయిన వైనం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన ట్రాఫిక్ జీడీనెల్లూరు, బంగారుపాళెం, తవణంపల్లెలోనూ అదే తంతు! పట్టించుకోని కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టని ప్రభుత్వం రైతులు తాము పండించిన మామిడి కాయలు అమ్ముకోవడానికి చావో రేవో అని పోరాడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. కూటమి నేతల సిఫార్సులకే టోకెన్లు కూటమి నేతల సిఫార్సులకు మామిడి టోకెన్లు అమ్ముడుబోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, కలెక్టరేట్, ఇతరత్రా అధికారుల పేర్లు చెబుతూ టోకెన్లను దండుకుంటున్నారని ఫ్యాక్టరీ నిర్వాహకులు బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య రైతులు నిండా మునిగిపోతున్నారు. జిల్లాల్లో కొద్ది రోజులుగా హల్చల్ చేసిన రైతు సంఘం నాయకులు ఫ్యాక్టరీల ఎదుట కనిపించడం లేదు. వారి పంటను మాత్రం అమ్ముకుని వెళ్లిపోయారని రైతులు మండిపడుతున్నారు. -
సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్పఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్దమొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి.సోమవారం శిరీష రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేపచెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకుని బీఎన్ఎస్ సెక్షన్లు 341/323/324/506/34 కింద కేసు నమోదు చేశారు.కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం: ఎమ్మెల్సీ భరత్కుప్పంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ‘‘కుప్పంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నా కూడా కనికరించలేదు. నారాయణపురంలో ఈ అనాగరిక ఘటన జరిగింది. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యం చేస్తోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. కుప్పంలో మహిళా అధికారులకు కూడా భద్రత లేదు’’ అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి వెల్లడించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. నేడు పోలీస్ గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కనున్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పేద విద్యార్థినికి మాజీ మంత్రి చేయూత – మెడిసిన్ చదివిస్తానంటూ హామీ నగరి : నీట్ ప్రవేశ పరీక్షలో 95.86 శాతంతో 471 మార్కులు సాధించి సత్తా చాటిన విద్యార్థిని జయశ్రీని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశంసించడంతో పాటు తన ఖర్చులతో మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి కుమార్తె జయశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి ఆదివారం నగరిలో రోజాను కలిశారు. ఈ సందర్భంగా రోజా జయశ్రీకి స్వీట్ తినిపించి అభినందించారు. మెడిసిన్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. కాగా జయశ్రీ రెండేళ్లుగా తిరుపతిలోని చైతన్య జూనియర్ కళాశాలలో చదివినా ఇంటర్ చదువుకు సైతం మాజీ మంత్రి రోజానే ఖర్చులు భరించడం విశేషం. పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారి ఉన్నత విద్యకు చేయూతనిస్తున్న మాజీ మంత్రి ఉదారతను పలువురు ప్రశంసిస్తున్నారు. బదిలీ అయిన టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరాలి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు పరిధిలో బదిలీ అయిన ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్, పీటీలు, ఉద్యోగోన్నతులు పొందిన టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరాలని డీఈఓ వరలక్ష్మి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా బదిలీ, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఆదివారంతో ముగిసిందన్నారు. బదిలీలు పొందిన టీచర్లు వెంటనే పాత స్థానాల్లో రిలీవ్ అయ్యి కొత్త స్థానాల్లో చేరాలని డీఈఓ ఆదేశించారు. -
అబద్ధాలతో అరాచక పాలన
● ఏడాదిగా ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు, పవన్కల్యాణ్ ● తల్లికి వందనం అంటూ 30లక్షల మందికి మోసం ● ఆలయాలు కూల్చేసి మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి నేతలు ● భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో కూటమి ఏడాది పాలనలో మోసాలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చావా రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, భరత్, తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, వెంకటేగౌడ్, సునీల్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని నోటికొచ్చిన అబద్దపు హామీల చంద్రబాబు, పవన్కల్యాణ్ గుప్పించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పథకాల కంటే రెండింతలు ఇస్తానని చెప్పి, అందరినీ వంచించిన ప్రజాద్రోహి చంద్రబాబు అని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.2.80లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అమ్మ ఒడి పథకం కింద రాష్ట్రంలో ఎంతమంది లబ్దిదారులు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లోకి రూ. 15వేలు చొప్పున జమచేసిన మొనగాడు జగనన్న అని కొనియాడారు. అయితే తల్లికి వందనం అంటూ చంద్రబాబు 30లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 చొప్పున అందిస్తామని మోసం చేశారని చెప్పారు. యాభై ఏళ్లు నిండిన ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 4వేలు, నిరుద్యోగులకు రూ. 3వేలు భృతి, అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ. 20వేల చొప్పు ఇస్తానంటూ చెప్పిన హామీలన్నీ ఏమైయ్యాయి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో మోసాలు, అభూతకల్పనలతోనే పాలన సాగించారే కానీ, రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోరు పారేసుకోవడం, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరగబడే రోజులు వచ్చాయి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలతో లోకేష్ రెడ్బుక్ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను అందించకుండా వైఎస్సార్సీపీ నేతలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొడుతున్నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. అలాగే గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబుపై మామిడి రైతులు భగ్గుమంటున్నారని తెలిపారు. రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు రూ. 40 గిట్టుబాటు ధరను కల్పించారని గుర్తుచేశారు.అదే కూటమి ప్రభుత్వంలో రూ.4లు కూడా గిట్టుబాటు ధర పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు, సంక్షేమాన్ని పవన్కల్యాణ్ గాలికి వదిలేశారన్నారు. సనాతనధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఊదరగొట్టి, రాష్ట్రంలోని పలు ఆలయాలను కూటమి నేతలు కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండతో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా ఆలయాలను కూలుస్తూ హిందువులు మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు. ప్రభుత్వ అకృత్యాలను ఎండగట్టేలా వైఎస్సార్సీపీ పోరాటం ఉంటాయని స్పష్టం చేశారు. -
తహసీల్దార్ బదిలీల్లో అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన తహసీల్దార్ బదిలీల్లో వివక్ష జరిగిందని పలువురు బాధిత తహసీల్దార్లు వాపోతున్నారు. బదిలీల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన రెగ్యులర్ తహసీల్దార్లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా అన్యాయం చేశా రని చెబుతున్నారు. రెగ్యులర్ తహసీల్దార్లు జిల్లా లో ఉన్నప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వివక్ష చూపడం బాధాకరమని చెబుతున్నారు. రెగ్యుల ర్ తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా లూప్లైన్లో పెట్టి అర్హత లేని డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇచ్చారని చెబుతున్నారు. క్రమశిక్షణ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పోస్టింగ్ ఇవ్వడం అ న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూ టీ తహసీల్దార్లకు కూటమి నాయకుల అండ ఉండటంతో అడ్డదారుల్లో పోస్టింగ్లు ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రెగ్యులర్ తహసీల్దార్లు ఎలాంటి అండదండలు లేక సీనియర్లు అయినప్పటికీ పోస్టింగ్లు లేక కలెక్టరేట్లో ఖాళీ కుర్చీలకు పరిమితం అయినట్లు వెల్లడిస్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని బాధిత సీనియర్ తహసీల్దార్లు కోరుతున్నారు. కాణిపాకంలో కమిషనర్ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ఈవో పెంచలకిషోర్ స్వామివారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. తొలుత కమిషనర్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో, ఈఈతో చర్చించారు. తర్వాత నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనం, వినాయక సదన్, గణేష్ సదన్, నిత్యాన్నదాన భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, తిరుపతి దేవదాయశాఖ సహాయ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
బంగారుపాళెం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళెం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని వేపనపల్లెకు చెందిన రవి(52) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై రాగిమానుపెంట గ్రామ సమీపంలోని ఓ మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మంత్రివర్యా..
కాణిపాకం : కూటమి ప్రభుత్వం మామిడి రైతుల కొంప ముంచుతోంది. మద్దతు ధర పేరుతో రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ర్యాంపుల్లో రూ.4కే పాట పాడుతోంది. ఫ్యాక్టరీలు రూ.5, 6కే ఫిక్స్ అయ్యాయి. మద్దతు ధరను ఫ్యాక్టరీలు మడతబెట్టాయి. రూ.8కే కొనలేమంటున్నాయి. తమిళనాడు కాయలకు గేట్లు తీస్తున్నాయి. తమిళనాడు కాయలు టన్నుల టన్నులుగా తరలి వచ్చేస్తున్నాయి. దీని దెబ్బకు చిత్తూరు కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు చెత్తలో తీసి పారేస్తున్నారు. ఇది ఇలా ఉంటే... మద్దతు ధరపై మండి పడుతున్నారు. అధికారులు రైతుల కంటికి కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారు. చెక్పోస్టులు ఉత్తిమాటేనా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అయినా మామిడి కాయలు యథేచ్ఛగా జిల్లాకు వచ్చేస్తున్నాయి. జిల్లాలో పండిన కాయలకు మాత్రం ఒక్క టోకెన్కు ఒక్క ట్రాక్టర్ మాత్రమే అనుమతిస్తున్నాయి. అయినా ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. కాయలు ఫ్యాక్టరీలో అన్లోడింగ్ కాగా వాహనాలు ఫ్యాక్టరీల ఎదుట క్యూ కడుతున్నాయి. బండి ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళితే రెండు రోజుల పాటు అక్కడే కునుకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాక్టర్లల్లోనే కాయలు ఆవిరవుతున్నాయి. ఫ్యాక్టరీలు కక్ష పూరితంగా కాయలను అన్లోడింగ్ చేయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలకు టోకెన్లు లేకపోగా నేరుగా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి అన్ లోడింగ్ చేసి వెళ్లిపోతున్నాయి. అది కూడా లారీల్లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంతో జిల్లాలోని మామిడి రైతులు మండిపడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సరిహద్దులో చెక్పోస్టులు పెట్టి జిల్లా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తే..పట్టింపు ఏదని మామిడి రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. కనిపించని అధికారులు మామిడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా అధికారులు ఫ్యాక్టరీల వద్ద వివిధ శాఖల సిబ్బందికి డ్యూటీలు వేశారు. అయితే వారి ఆ చూకీ అంతు చిక్కడం లేదు. ఫ్యాక్టరీల వద్ద వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దరిదాపులో కనిపించకుండా పోతున్నారు. రైతుల దగ్గర నుంచి ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ తీసుకోవడానికి ఫ్యాక్టరీ సెక్యూరిటీలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. చాలా వరకు ఫ్యాక్టరీల వద్ద శాఖ సిబ్బంది కనిపించడం లేదని, తమ అవస్థలను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం మామిడి పంట అమ్మకాలు..కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తుతోంది. చిత్తూరులో మామిడి కొనుగోలుపై ఆంక్షలు ఏమిటని మండిపడింది. ఏకంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపింది. ఇదీ రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం నంగలిలోని మామిడి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరులో కాయలు అమ్మడానికి ఆంక్షలు పెట్టారని అక్కడి రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి కర్టాటక రాష్ట్రానికి వచ్చే ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం..ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఫ్యాక్టరీ వద్ద క్యూకట్టిన ట్రాక్టర్లు, లారీలు తోతాపురి రూ.8కి కొనాలని మంత్రి ఆదేశం క్షేత్రస్థాయిలో అమలు కాని ఆదేశాలు ర్యాంపుల్లో కిలో రూ. 4... ఫ్యాక్టరీలో రూ.5, రూ.6 రూ.8కి కొనుగోలు చేయలేమంటున్న ఫ్యాక్టరీలు ప్రభుత్వ మద్దతు ధరపై రైతుల మండిపాటు పట్టించుకోని ఉన్నతాధికారులు జిల్లా మామిడి సాగు వివరాలు జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం 56 వేల హెక్టార్లు టేబుల్రకం సాగు విస్తీర్ణం 16,105 హెక్టార్లు తోతాపురి రకం సాగు విస్తీర్ణం 39,895 హెక్టార్లు పళ్లగుజ్జు పరిశ్రమల సంఖ్య 47 ర్యాంపుల్లో తోతాపురి కేజీ ధర రూ.4 ఫ్యాక్టరీల్లో కిలో ధర రూ. 5 నుంచి రూ.6 వరకు ‘‘జిల్లాలోని కొన్ని మ్యాంగో ఫ్యాక్టరీలను తిరిగాను. ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడాను. ఈ రోజు తోతాపురి ధర కిలో రూ.7 అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచే రూ.8కి కొనుగోలు చేయాలని చెప్పాను. ఆ ఒక్క ఫ్యాక్టరీయే కాదు.... జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు ప్రభుత్వం ప్రకటించిన రూ. 8కే కొంటారు. చివరి వరకూ ఇదే రేటు ఉంటుంది. ఎక్కడ కానీ రూ.5,రూ.6 రూ.7 అనే మాటే ఉండదు. దీనికి ప్రభుత్వం ప్రోత్సాహ నిధిగా కిలో రూ.4 ఇస్తుంది. రైతులు తొందర పడొద్దు. స్వేచ్ఛగా కాయలు అమ్మండి. సరిహద్దులో చెక్పోస్టులు పెట్టి..జిల్లా రైతులకు న్యాయం చేస్తాం. మామిడికి మద్దతు ధర ఇప్పించే బాధ్యత మాది.’’ ఇలా చిత్తూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఇవీ. రెండు రోజులుగా పడిగాపులు శనివారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలకు కాయలు తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చింది ట్రాక్టర్లలోనే. ఇక్కడకు లారీల్లో తమిళనాడు కాయలు ఫుల్గా వస్తున్నాయి. ఏం చేయాలి. సిఫార్సులుంటే అన్లోడింగ్ ఉంటే ముందు పంపిస్తున్నారు. అన్లోడింగ్ కాక రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాం. – మదన్ మోహన్నాయుడు, చిత్తూరు మండలం అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం వారం రోజులుగా కాయలు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం. టోకెన్లు అందడం లేదు. క్యూలో నిలబడే లోపే టోకెన్లు అమ్ముడుబోతున్నాయి. తమిళనాడు కాయలన్నీ వచ్చి దూకేస్తున్నాయి. మా కాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అక్కడ రూ. 4, రూ.5కే కొనుగోలు చేసి.. జిల్లా రైతులను చిన్న చూపు చూస్తే ఎలా. కాయలు అమ్ముకోవడానికి మాకు అవకాశం కల్పించండి. – జయచంద్రారెడ్డి, చిత్తూరు మండలం ఆ రేటుకు కొనలేం కూటమి ప్రభుత్వం 10 రోజుల కిందట మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించింది. తోతాపురి కిలో రూ.8కే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని ప్రకటించింది. అయితే మద్దతు ధరను ఫ్యాక్టరీలు మడతబెడుతున్నాయి. రూ. 8కి కొనలేమని తేల్చి చెబుతున్నాయి. మంత్రి చెబితే...తమ చేతుల్లో డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నాయి. శనివారం చిత్తూరు సభలో తోతాపురిని అన్ని ఫ్యాక్టరీలు రూ. 8కే కొంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ సాక్షిగా వెల్లడించారు. అయితే ఆదివారం చూస్తే మామిడి వ్యాపారం ఇందుకు భిన్నంగా ఉంది. ర్యాంపులో కిలో రూ.4, ఫ్యాక్టరీలు కిలో రూ.5, రూ.6 కొనసాగిస్తున్నాయి. మంత్రి చెప్పినా కిలో రూ.8 రేటు ఎక్కడా అమలు కావడం లేదు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్కు కన్నీటి వీడ్కోలు
గంగాధర నెల్లూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మీ కరుణాకుమార్ రెడ్డికి తూగుండ్రంలో కుటుంబ సభ్యు లు, బంధువుల అశ్రునయనాలతో అంత్యక్రియ లు నిర్వహించారు. తూగుండ్రం గ్రామానికి చెంది న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మీ కరుణాకుమార్ రెడ్డి శు క్రవారం ఉదయం చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సును ప్రయాణికులతో తీసుకెళుతుండగా మార్గమధ్యలో హోస్కోట వద్ద శుక్రవారం తెల్లవా రుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర గా యాల పాలైన డ్రైవర్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ హించి పోలీసులు బంధువులకు అప్పగించారు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి మృతదేహం చేరింది. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు డిపో మేనేజర్ రూపశ్రీ కలిసి డ్రైవర్ మృతదేహానికి నివాళులర్పించారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, తక్షణ సాయం కింద 25 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందించారు. తూగుండ్రం సర్పంచ్ శ్రీ బాబు, ఎంపీటీసీ వాణిశ్రీ, పలు పార్టీ నేతలు నివాళులర్పించారు. -
వేరుశనగపై వెనుకడుగు
పలమనేరు : ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా జిల్లాలో వేరుశనగ ఎక్కువ మంది సాగు చేస్తారు. కానీ ఏటా వేరుశనగ సాగుపై జిల్లాలోని రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇందుకు ప్రధాన కారణం పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కడం లేదు. అతివృష్టి, అనావృష్టితో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట దిగుబడులు ఎకరానికి నాలుగైదు బస్తాలు కావడం లేదు. ఎకరా పొలంలో పంట సాగుకు రూ.15 వేల దాకా పెట్టుబడి అయితే దిగుబడి రూ.5 వేలు కూడా దక్కడం లేదు. దీంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ● అధికారులేమో విత్తనాలిచ్చేటప్పుడు తప్పకుండా సాగుచేస్తామని ధ్రువీకరణ తీసుకొని రైతులకు పంపిణీ చేస్తున్నారు. కానీ సగం మంది రైతులు విత్తనాలను సాగు చేయకుండా ఇంటి అవసరాలకు వాడుకోవడం జరుగుతోంది. దీంతో జిల్లాలో ఏటా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. తగ్గుముఖం పట్టిన సాగు పదేళ్ల కిందట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా ఉండేది. ఏటా పంటల సాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా విభజన జరిగాక పంట సాధారణ సాగు 55 వేల హెక్టార్లకుగా ఉండేది. ప్రస్తుతం సాధారణ సాగు 35 వేల హెక్టార్లకు పడిపోయింది. దీంతో ఈ విడత పంటల సాగు 20 వేల హెక్టార్లు కూడా అనుమానంగానే మారింది. విత్తనకాయలు తీసుకుంటున్నారు.. బహిరంగ మార్కెట్లో వేరుశనగ కిలో ధర రూ.93 దాకా ఉంది. ప్రభుత్వం 40శాతం సబ్సిడీతో ( రాయితీ రూ.37.20 పైసలు)పోనూ రైతు వాటాగా రూ. 55.80 చెల్లించాలి. దీంతో కేజీకి రైతుకు రూ.37 మిగులుతుంది. బస్తా(30 కేజీలకు) రూ. 1116 దక్కినట్టే. ఇలా వచ్చే డబ్బును ఎందుకు వదులుకోవాలని రైతులు ఎగబడి విత్తనాలను కొంటున్నారు. సాగుపై అన్నదాతల సంకటం తగ్గనున్న వేరుశనగ సాగు విస్తీర్ణం విత్తనాలు తీసుకున్నా సాగుకు కదలని రైతన్న కచ్చితంగా సాగు చేయాలని చెబుతున్న అధికారులు వేరుశనగ విత్తనకాయలకు సంబంధించిన వివరాలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం : 35,228 హెక్టార్లు ఖరీఫ్లో పంటను సాగు చేసే రైతులు : 90 వేల మంది అవసరమైన విత్తనకాయలు : 40 వేల క్వింటాళ్లు కూటమి ప్రభుత్వంలో అందినవి : 26,349 క్వింటాళ్లు త్వరలో జిల్లాకు రానున్న విత్తనాలు : 13 వేల క్వింటాళ్లు విత్తనాలు తీసుకున్న వారు సాగు చేయాలి పట్టాపాసు పుస్తకం ఉండి ఆధార్ లింకై న రైతులు మొబైల్ నంబరు ఓటీపీ ఆధారంగా విత్తన కాయలను పంపిణీ చేశాం. పొందిన విత్తనాలకు తప్పకుండా సాగు చేయాలని రైతుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకున్నాం. ఇప్పటి దాకా పంపిణీ చేసిన విత్తనాల మేరకు ఎంత మేర పంట సాగు కావాలో లెక్కలు కట్టి క్షేత్ర స్థాయిలో రైతులు పంటను సాగు చేసేలా చర్యలు తీసుకుంటాం. – మురళీ కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి పంట పెట్టుబడి దక్కితే కదా.. ఇంతకు ముందు వేరుశనగ సాగు చేసినోళ్లమే. రాను రాను పంటకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కక నష్టాలు చవిచూశాం. అందుకే వేరుశనగకు బదులు చిరు ధాన్యా లు, అక్టోబరులో ఉలవ సాగు చేస్తున్నాం. ప్రభుత్వం వేరుశనగకు కనీస మద్దతు ధర పెట్టి రైతులకు నష్టం రాకుండే చూస్తే సాగు పెరుగుతుంది. నష్టాలు ఎందుకని రైతులు విత్తనాలు తీసుకొని ఇంట్లో అవసరాలకు వాడుకోవాల్సి వస్తోంది. – సుబ్బన్న, రైతు, కల్లాడు -
వీఆర్వోపై దాడి
ఐరాల: భూ తగాదా విషయమై వీఆర్వోపై దాడి చేసిన ఘటన మండలంలోని తెల్లగుండ్లపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని తెల్లగుండ్లపల్లెకు చెందిన వీఆర్వో రాధయ్యకు మల్లారపల్లెలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో ఉన్న చింత చెట్లను కోస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తమ భూమి అంటూ అడ్డుకుంది. ఆపై ఆమె పోలీసులను ఆశ్రమించడంతో వారు ఇరువురినీ పిలిచి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వీఆర్వో ఇంటి దగ్గర ఉండగా మల్లారపల్లెకు చెందిన కొంతమంది ఆయనపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వీఆర్వోను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ భూమిలో చింత చెట్లు కోసి విక్రయిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు, మల్లారపల్లెకు చెందిన ఏడుగురు అకారణంగా దాడి చేసి గాయపరిచినట్లు వీఆర్వో వాపోయారు. ఈ విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో పుత్తూరు జాతీయ రహదారి చిన్నతయ్యూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిన్నతయ్యూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ (60) రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా, మండలంలోని శెట్టివనత్తం గ్రామానికి చెందిన బాబు కుమారుడు వినోద్(25) పుల్లూరు క్రాస్ రోడ్డు నుంచి వారి స్వగ్రామానకి బైక్పై వస్తుండగా చంద్రమ్మను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమ్మ మృతి చెందింది. వినోద్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉపాధ్యాయుల బదిలీలు ● వింత నిబంధనలతో నష్టపోయిన ఎస్జీటీ, భాషా పండితులు ● గత వైఎస్సార్సీపీ పాలనలో సాఫీగా సాగిన బదిలీల కౌన్సెలింగ్ ● కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్న బాధిత ఉపాధ్
● ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధ్యాయురాలు పేరు సుధారాణి. ఆమె 9 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే డీఈవో పూల్ లో ఉండే భాషా పండితుల బదిలీల్లో ఆమెకు అన్యాయం జరిగింది. కూటమి పాలనలో వెబ్ విచిత్ర బదిలీలతో ఉద్యోగ విరమణ పొందే సమయంలో ఆమె సీనియర్ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 120 కి.మీ దూరంలో బదిలీ చేశారు. తిరుపతి సమీపంలో ఆప్షన్ నమోదు చేసినప్పటికీ దూరప్రాంతంలో బదిలీ చేయడంతో ఆమె నష్టపోయింది. ● ఈ టీచర్ పేరు కస్తూరీ. ఈమెకు స్పౌజ్ నిబంధనను నమోదు చేసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 90 కి.మీ దూరంలో బదిలీ చేశారు. దీంతో ఈమె ప్రస్తుత బదిలీల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● ఈ టీచర్ పేరు కనకదుర్గ. ఈమె న్యాయపరంగా భర్తతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఫ్రిపరెన్షియల్ కేటగిరీలో పాయింట్స్ పొంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని అర్హతలున్నా నిబంధనలకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలానికి బదిలీ చేశారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలు
చిత్తూరు కార్పొరేషన్: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా సిబ్బంది, అధికారు లు పనిచేయాలని ట్రాన్స్కో టెక్నికల్ డైరెక్టర్ గురవ య్య తెలిపారు. ఆయన ఆదివారం ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 శాతం మంది వినియోగదారులు సంతృప్తి స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. సిబ్బంది, అధికారులు సకాలంలో వినియోగదారులకు ఫోన్ల లో సమాధానం ఇవ్వడంతోపాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే 90 శాతానికి పైగా సంతృప్తి చెందుతారని వెల్లడించారు. అధికారులు తప్పనిసరిగా మండల, జిల్లా కేంద్రాల్లో అందు బాటులో ఉండాలన్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ల సమస్యలతో అల్లాడుతున్నట్టు తెలిపా రు. స్టోర్స్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, అనుబంధ సామగ్రి ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్ర శ్నించారు. అందటం లేదన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులు ట్రాక్టర్లు పెట్టుకొని ఎస్పీఎంకు రా వడం ఆగలేదన్నారు. ఎన్ని రోజులు వర్క్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్టు నోటీసులు అందుకుంటారని, వాటి ని క్లోజ్ చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలని మండిపడ్డారు. ఎంతో ఉపయోగమైన ఆర్డీఎస్ఎస్ పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీఎంలో నూతన ఓఆర్ఎం మెషిన్ ఇన్స్టలేషన్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈ సురేష్, జగదీష్, అమర్బాబు, పీవో రెడ్డెప్ప, ఏవో ప్రసన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన బోయకొండ
– గంగమ్మ దీవెనల కోసం తరలివచ్చిన జనం చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ దీవెనల కోసం భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వివిధ వాహనాల్లో రావడంతో బోయకొండ జన సంద్రంగా మారింది. ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
చంద్రబాబూ.. అంత మోసమా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పంట వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 8 రూపాయలు కిలో కొనుగోలు చేయమని చెప్తే 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా రైతులను ఎలా గిట్టుబాటు ధర కల్పిస్తారు?. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద 100 టోకెన్లు వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చి, మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కిలో 15 రూపాయలు యావరేజ్కు మామిడి కొనుగోలు చేశారు. గత మూడేళ్లుగా దాదాపు రూ.22 రూపాయలు గిట్టుబాటు ధర పలికింది. ఇప్పుడు మరి దారుణంగా చంద్రబాబు పాలనలో కిలో 4 రూపాయలకు ఫ్యాక్టరీలు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు.ఏలూరు జిల్లా, నూజివీడు, కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రైతులపై కేసులు పెట్టారు. ఏ పంటకు మీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు పాలనలో రైతులు గురించి పట్టించుకున్నది ఎన్నడు లేదు. వ్యవసాయం చేయడం దండగ అని చంద్రబాబే అన్నారు’’ అని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.ఏ ఫ్యాక్టరీలో 4 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు జీడి నెల్లూరులో రైతులు ఆందోళన చేశారు. రైతులు సరైన వివరాలు లేకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర వ్యాపారంగా ఉన్న మామిడి రైతులను గిట్టుబాటు ధర 8 రూపాయలు కల్పించి ఆదుకోవాలి’’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
చివరి దశకు అయ్యోర్ల బదిలీలు
● బదిలీల్లో పలువురు టీచర్లకు అన్యాయం ● సమస్యల పరిష్కారానికి కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్లు ● నేటితో ప్రక్రియ ముగించేలా విద్యాశాఖ కసరత్తు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు చివరి అంకానికి చేరింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ అయ్యోర్లకు చుక్కలు చూపించింది. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు నిబంధనలను బదిలీల ప్రక్రియలో అమలు చేశారు. స్పౌజ్ల విషయంలో అనేక ఇబ్బందులు సృష్టించారు. నేటితో ముగియనున్న ప్రక్రియ జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఈ నెల 14వ తేదీన సీరియల్ నం.2000 నుంచి 3000 వరకు కౌన్సెలింగ్ చేపట్టారు. అనంతరం మైనర్ మీడియా ఎస్జీటీల కౌన్సెలింగ్కు తక్కువ మంది ఉండడంతో ఆదివారంతో ప్రక్రియ ముగించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలు, వింత నిబంధనల వల్ల మెజారిటీ శాతం ఉపాధ్యాయులు బదిలీల్లో నష్టపోయారు. కూటమి సర్కారు పాలనలో నష్టపోయామంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు మండిపడుతున్నారు. కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్ బదిలీల ప్రక్రియలో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బాధిత టీచర్ల నుంచి గ్రీవెన్స్ తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో దాదాపు 180 ఎస్జీటీ, 75 దాకా స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రీవెన్స్కొచ్చాయి. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి. -
భాషా పండితుల బదిలీల్లో చిత్ర విచిత్రాలు
– నేడు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : చాలా సంవత్సరాలుగా డీఈవో పూల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఈ బదిలీల్లో అయినా దరఖాస్తు చేసుకుని అనుకూలమైన ప్రాంతాలకు వెల్దామని ఆశపడ్డారు. విద్యాశాఖ అధికారులు జారీ చేసిన సీనియారిటీ జాబితా ప్రకారం ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న భాషా పండితుల బదిలీల ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం విడుదల చేశారు. ఆ ఉత్తర్వులను చూసిన భాషాపండితులు నివ్వెరపోయారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బదిలీలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని భాషాపండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ ఉత్తర్వులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని డీఈవో పూల్లో ఉన్న తెలుగు 123, హిందీ 30 మంది భాషాపండితుల ఉత్తర్వులు నిబంధనలకు వ్యతిరేకంగా విడుదల చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫైనల్ సీనియారిటీ జాబితాలో సీరియల్ నెంబర్ 15లో ఉన్న వ్యక్తి తన స్పౌజ్ తిరుపతిలో పనిచేస్తున్నారు. ఆన్లైన్ బదిలీల్లో ఆ టీచర్ తిరుపతిని ఆప్షన్గా పెట్టుకున్నారు. అయితే ఆ టీచర్ తన ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 30వ ప్లేస్ పెనుమూరుకు పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా సీరియల్ నెంబర్ 17లో ఉన్న మరో భాషాపండితుని స్పౌజ్ తిరుపతిలో పనిచేస్తుండగా ప్రాధాన్యత క్రమంలో తిరుపతిని రెండవ ప్లేస్లో పెడితే చివరగా పెట్టిన వరదయ్యపాళ్యంకు బదిలీ చేశారు. దారుణం తుది సీనియారిటీ జాబితాలో 79వ నెంబర్లో ఉన్నటువంటి భాషాపండితునికి తన ప్రాధాన్యత క్రమం ప్రకారం కాకుండా ఇంటికి దగ్గరలో ఉన్న తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు. ఇదేవిధంగా చాలా మందికి తుది సీనియారిటీ జాబితాల్లో కింద ఉన్న వారికి దగ్గరలో, మొదట్లో ఉన్న వారికి దూరంగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ సమస్యలపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నష్టపోయిన భాషాపండితులు కూటమి టీడీపీ నిలువునా ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణం అంటూ సామాజిక మాధ్యమాల్లో తమ వ్యతిరేకతను వెల్లడిస్తున్నారు. సీనియారిటీ జాబితాల్లో 1, 2 స్థానాల్లో ఉన్న వారికి 30, 40వ ప్లేసుల్లో బదిలీ చేయడం వింతగా ఉందని మండిపడుతున్నారు. న్యాయం కోసం ఆదివారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు భాషా పండితులు సిద్ధపడ్డారు. -
పరామర్శిస్తూ..భరోసానిస్తూ..
వెదురుకుప్పం: కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో విషాద ఛాయలు అలముకున్నాయి. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ, గంగాధరనెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామాల్లో బాధిత కుటుబాలు పుట్టెడు దుఃకంలో మునిగిపోయారు. మృతదేహాలు శుక్రవారం ఆయా గ్రామాలకు చేరుకోగా.. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా బాధిత కుటుంబాలను మాజీ డెప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పరామర్శించారు. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన కేశవులురెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే గ్రామంలో జనార్దన్కు గాయాలయ్యాయి. ఆయన కుమారుడు (45 రోజులు) చనిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగలో పర్యటించి తలసీ మృతదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. జీడీ నెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామంలో శారద పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అదేవిదంగా గాయాలైన వారిని కూడా పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి(వెదురుకుప్పం), ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్, మాజీ ఎంపీటీసీలు ధనంజయరెడ్డి, ఎర్రయ్య, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ లోకనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దేవరాజారెడ్డి, హరినాఽథ్ ఉన్నారు. మాజీ సీఎం దృష్టికి తీసుకెళతా! బస్సు ప్రమాద ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్సార్సీపీ నాయకులతో మాట్లాడి బాధిత కుటుంబాల పరిస్థితి, ఇతరత్రా విషయాలపై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్ మధుసూదన్రావు, రాష్ట్ర సీబీఐ డీఐజీ మురళిరంభ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేయగా ఈవో పెంచలకిషోర్ వారికి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. వెండి దీపం.. నైవేద్య పాత్రల వితరణ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి శనివారం ఓ దాత కుటుంబీకులు వెండి పాత్రలు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన చంద్రశేఖర్ కుటుంబీకులు రూ.3.80 లక్షల విలువ చేసే 3.5 కిలోల వెండి దీపం, నైవేద్య పాత్రలు విరాళంగా ఈవో పెంచల కిషోర్కు అందజేశారు. అనంతరం వారికి దర్శన భాగ్యం కల్పించారు. మెకానిక్ ఆత్మహత్యాయత్నం చౌడేపల్లె: మండలంలోని గోసులకురప్పల్లె గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్(36) మెకానిక్షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పుల వారి వేధింపులు అధికం కావడంతో శనివారం పంట పొలాలకు ఉపయోగించే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కుటుంబీకులు అతన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం పుంగనూరు(చౌడేపల్లె) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘట న పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లె గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అగస్తీ కుమారుడు కుమార్(30) శనివా రం పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపటి నుంచి డిగ్రీ, పీజీ తరగతులు తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఆయా కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కళాశాలలతో పాటు అదే రోజు వసతి గృహాలు సైతం తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పద్మావతి మహిళా వర్సిటీలో సైతం తరగతులు ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్జీఎస్, ఎస్వీ ఆర్ట్స్, ఎస్వీ ఓరియంటల్ కళాశాలలు సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. -
రోడ్డెక్కిన మామిడి రైతులు
గంగాధర నెల్లూరు: గిట్టుబాటు ధర కోసం మామిడి రైతులు రోడ్డెక్కారు. కర్మాగారాల యాజమాన్యాల తీరుపై శనివారం నిరసనకు దిగారు. చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ తీరుపై విరుచుకుపడ్డారు. తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించానా ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.6 కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టోకెన్ వ్యవస్థను రద్దుచేసి సీరియల్గా ముందు వచ్చే రైతుల మామిడి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిఫారసుల టోకన్లే అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. కాయ కుళ్లిపోక ముందే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల స్పందిస్తూ సోమవారం నుంచి సీరియల్గా ఎవరు ముందు వస్తే వారి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
ప్రాణం తీసిన మురుగు నీటి గుంత
– మురికి గుంతలో పడి చిన్నారి మృతి రొంపిచెర్ల: మురుగు నీటి గుంత ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణ కాలనీలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన ఆసిఫ్, ఉస్మా కుమార్తె ఆజూమిర్హ(3) పిల్లలతో వీధిలో అడుకుంటున్నారు. వీరు ఆడుకుంటున్న రోడ్డు పక్కనే మురుగు నీటి గుంత ఉంది. ప్రమాదవశాత్తు ఆ గుంతలో చిన్నారి పడింది. పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్తులు హుటాహుటిన గుంత వద్దకు చేరుకున్నారు. అప్పటికే చిన్నారు ప్రాణాలు వదిలింది. గుంత ఆరు అడుగుల లోతు ఉండడంతో ఊపిరాడక మృతిచెందింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలాన్ని రొంపిచెర్ల పోలీసులు సందర్శించి వివరాలను సేకరించారు. ఇదిలావుండగా వారం క్రితమే ఈ గుంతను జేసీబీతో మరింత పెద్దది చేశారు. అయినా పూడ్చకపోవడంతో చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. -
కారు ఢీ – మహిళ మృతి
రొంపిచెర్ల: కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం, బోనంవారిపల్లె వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రాం, చింతమణి నరిసింగపేటకు చెందిన ఎన్వీ. సవిత (56), చందర్ (38) ద్విచక్ర వాహనంలో తిరుపతికి బయల్దేరారు. అక్కడ శనివారం రాత్రి జరగనున్న శుభాకార్యంలో పాటల కచ్చేరి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో తిరుపతి వైపు నుంచి కారు పీలేరు వైపు వెళ్తూ బోనంవారిపల్లె వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సవిత(56) అక్కడికక్కడే మృతి చెందగా.. చందర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పోటెత్తారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనాలతో ఆలయమంతా భక్త జన సందడి కనిపించింది. క్యూలైన్లు నిండి ఆలయ ఆవరణలో భక్తులు బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయ ఆవరణలో స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ చర్యలు చేపట్టారు. -
భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శనివారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆల య అధికారులు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రత్రాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఈవో పెంచలకిషోర్ పాల్గొన్నారు. స్వర్ణరథంపై ఊరేగింపు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథం ఊరేగారు. తొలుత అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి స్వర్ణ రథం ఆలయ మాడవీధుల్లో దిగ్విజయంగా ఊరేగుతూ కనువిందు చేసింది. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. -
అమ్మానాన్న లేని వాళ్లం!
‘మేం ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశామో అర్థం కావడంలేదు. చిన్న తనంలోనే ఆ దేవుడు తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయాడు. అనాథలుగా రోడ్డున పడేశాడు. ఎలా ఉండాలో.. ఏం చేయాలో తెలియడం లేదు. అమ్మానాన్న లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదు..’ అన్నట్టు ఆ చిన్నారులు వచ్చిపోయేవారిని దీనంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కలచి వేసింది. ఈ ఘటన మండలంలోని మామిడిగుట్టపల్లెలో శనివారం చోటు చేసుకుంది. ఐరాల: చిత్తూరు– అరగొండ రోడ్డు బ్యాన్స్ హోటల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు మృత్యువాత పడ్డారు. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. బంధువుల కథనం మేరకు.. మండలంలోని మామిడిగుట్టపల్లెకు చెందిన రాజేష్(37)కు, తవణంపల్లె మండలం, తడకరకు చెందిన పూర్ణిమ(27)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి హేమాన్(5), నిషాంత్(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తన స్వగ్రామం మామిడిగుట్టపల్లె నుంచి రాజేష్, పూర్ణి మ, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో చిత్తూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో బ్యాన్స్ హోటల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దంపతులతో పాటు చిన్నారులకు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన రాజేష్ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉండడంతో రాణిపేట సీఎంసీకి తరలించారు. చిన్నారులుకు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో రాజేష్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పూర్ణిమ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. పెద్ద కుమారుడు హేమాన్ష్కు ఎడమ భుజం ఎముక విరగడంతో శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తేల్చారు. చిన్న కుమారుడు నిషాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కంటతడి పెట్టిన గ్రామస్తులు రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. అమ్మానాన్న లేరని తెలిసి విలవిల్లాడిపోయారు. గుక్కపట్టి ఏడ్చుతున్న ఆ చిన్నారుల పరిస్థితిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. దంపతుల రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ ఇద్దరు కలిసినా వారిగురించే చర్చించుకోవడం కనిపించింది. పోస్టుమార్టం అనంతరం పూర్ణిమ మృతదేహాన్ని మామిడిగుట్టపల్లెకు తరలించి శనివారం అంత్యక్రియులు ముగించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతులు మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరైన బంధువులు -
సెలవులో కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : వ్యక్తిగత పనుల నిమిత్తం కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఈనెల 20వ తేదీ వర కు సెలవు పెట్టారు. ఈ మేరకు ఇన్చార్జ్ కలెక్టర్ గా జేసీ విద్యాధరికి అద నపు బాధ్యతలు అప్పజెప్పారు. సెలవులు పూర్త య్యి తిరిగి విధుల్లో చేరే వరకు జాయింట్ కలెక్టర్ అధనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మామిడి కిలో రూ.8కే కొనాలి కాణిపాకం: జిల్లాకు నేనొచ్చాను..ఇకపై కేజీ మామిడి రూ.5,6,7 అంటే కుదరదు...కచ్చితంగా రూ.8కు కొనాల్సిందేనన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చిత్తూరు నగరం మంగసముద్రం ప్రాంతంలోని ఎంఎల్ఎస్ పాయింట్ ఆవరణలో శనివారం సాయంత్రం మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ దారులతో ముఖాముఖి నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఫ్యాక్టరీ యజమానులతో చర్చించామన్నారు. అన్ని కంపెనీలు కూడా కేజీ రూ.8కు కొనాల్సిందేనన్నారు. చెక్పోస్టులు పెట్టి జిల్లా రైతులకు న్యాయం చేస్తామన్నారు. మామిడి రైతులకు రూ.168 కోట్లు సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామన్నారు. తొలుత మా జీ ఎమ్మెల్సీ దొరబాబు మంగసముద్రం యార్డు పరిస్థితిని మంత్రికి వివరించారు. చిత్తూరు నడిబొడ్డున్న ఉన్న కూరగాలయ మార్కెట్ వల్ల ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేసేందుకు రూ.7.50 కోట్లు మంజూరు చేయాలని వినతి చేశారు. మామిడిలో దళారీ వ్యవస్థ వల్ల కేజీ రూ.5,6 పలుకుతోందని, రూ. 8కి కొనుగోలు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీ డీ.ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, ఎక్స్ సర్వీస్ హర్ట్ కల్చర్ సెక్రటరీ రాజశేఖర్ బాబు, ఆర్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులురెడ్డి, జాయింట్ కలెక్టర్ జీ.విద్యాధరి పాల్గొన్నారు. శ్రీ సిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు సత్యవేడు : ఏపీ దర్శన్ సీడీ టూర్లో భాగంగా 2– 24బ్యాచ్కు చెందిన ఏడుగురు ట్రైనీ ఐఏఎస్లు శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శివశంకర్ వీరికి స్వాగతం పలికారు. శ్రీ సిటీ ప్రణాళిక, అత్యాధునిక మౌలిక సదుపాయాలు , సుస్థిర అభివృద్ధిపై వారికి ప్రదర్శన ఇచ్చారు. మేక్–ఇన్– ఇండియా మిషన్లో శ్రీసిటీ పాత్ర, భారీ ఉపాధి కల్పన, ఈ ప్రాత ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమిచ్చారనే అంశాలను వివరించారు. పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్లు శ్రీసిటీ పరిసరాలు సందర్శించారు. మెండెలెస్ ( క్యాడ్బరీస్) డైకిన్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలను సందర్శించారు. ఇక్కడి ఉత్పత్తులు, పనితీరును తెలుసుకున్నారు. శ్రీ సిటీ ప్రణాళిక, అమలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశ్నించిన ట్రైనీ ఐఏఎస్లు, ఇతరులు అనుసరించాల్సిన అద్భుత మోడల్గా దీనిని అభివర్ణించారు. ట్రైనీ ఐఏఎస్లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తమకు గర్వకారణమని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. -
అన‘కొండ’లు!
● నాయనిచెరువు కొండపై కూటమి నేతల కన్ను ● విలువైన గ్రానైట్ కొట్టేసే యత్నం ● గ్రానైట్ బండలు తమిళనాడుకు తరలింపు సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం, నాయనిచెరు వు గ్రామ సమీపంలోని ఓ కొండను కూటమి నేతలు కూల్చేస్తున్నారు. విలువైన గ్రానైట్ను కాజేస్తున్నారు. కొండను బద్ధలు కొట్టి యథేచ్ఛగా తమిళనాడుకు తరలిస్తున్నారు. బ్లాక్ బండ మీటరు రూ.24 నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.5 లక్షల వరకు దండుకుంటున్నారు. గ్రానైట్ వాహన రాకపోకల వల్ల రాత్రి పూట ఇబ్బందికరంగా మారింది. నాటు బాంబులు పేల్చి నిద్రలేకుండా చేస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కుల ధాటికి అడవి జంతువులు కూడా ఊళ్ల మీదకు వస్తున్నాయని వాపోతున్నారు. ఇదేమని ప్రశ్ని స్తే ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అక్రమార్కులు బయపెడుతున్నట్టు వారు పేర్కొంటున్నారు. వారానికి రూ.50 వేలు సంబంధిత శాఖ అధికారులకు వారం వారం రూ.50 వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే కొండను తవ్వేస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని, లేనిపక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు. దీనిపై మైనింగ్ శాఖ అధికారి ఏడీ సత్యనారాయణను వివరణ కోరగా పెద్దిశెట్టిపల్లిది కూడా ఫిర్యాదు వచ్చింది.. నాయని చెరువులో జరుగుతున్న క్వారీని కూడా పరిశీలిస్తాం.. అనుమతి లేదని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చివరి దశకు అయ్యోర్ల బదిలీలు
ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు చివరి దశకు చేరాయి. నేటితో ఈ ప్రక్రియను ముగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025దాసరపల్లె పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో రోడ్డుపై మురుగు నీరుకూటమి నేతలు పల్లైపె పగబట్టారు. మౌలిక వసతులు కల్పించకుండా నాన్చుతున్నారు. మెజారిటీ సర్పంచ్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉండడంతో ఆ క్రెడిట్ వారికి ఎక్కడ వెళ్తుందోనని కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం విడుదలైన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.30.32 కోట్లు ఖర్చుచేయకుండా మోకాలడ్డుతున్నారు. పల్లెల్లో వసతులు కల్పించకుండా జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలన్నీ కలిపి 697 దాకా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గత మార్చి లోనే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమచేసింది. పల్లెల్లో వసతులు కల్పించేందుకు మొత్తం రూ.30.32 కోట్లు దాకా సర్దుబాటు చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం నిధులు విదల్చకుండా కాలయాపన చేస్తోంది. ఆర్థిక సంఘం నిధులు టైడ్, ఆన్టైడ్ విభాగాలుగా కేటాయిస్తారు. టైడ్ విభాగంలో పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు, ఆన్టైడ్ విభాగంలో రోడ్లు, మురుగు కాలువలు, శ్మశాన వాటికల అభివృద్ధి, విద్యుత్ మోటారు మరమ్మతులు, చెత్త సేకరించే కార్మికుల వేతనాల వంటి వాటికి ఖర్చు చేస్తారు. మేజర్ పంచాయతీలకు ఇంటి పన్నులు, చేపల చెరువుల వేలం, వారపు సంతలు, కాలువ గట్లు, ఏటిగట్ల పై కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. వీటితో పాటు మైనర్ పంచాయతీలకు సాధారణ నిధులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచి తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సంఘం నిధులే దిక్కుగా మారాయి. ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వకపోవడంతో మైనర్ పంచాయతీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. నిధులెప్పుడిస్తారో రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అనేక సమస్యలతో సర్పంచ్లు సతమతమవుతున్నారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ దయ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ నిధులిస్తే గ్రామాల్లోని దళితవాడల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి, తాగునీటి సదుపాయాల కల్పనకు, చెల్లింపులకు అవకాశం దక్కేదని చెబుతున్నారు. రాజకీయాలు తగునా బాబు? గ్రామాల అభివృద్ధికి ఇబ్బందులు రానివ్వమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్కల్యాణ్ చెబుతుంటారు. కానీ, ఆర్థిక సంఘం నిధుల విడుదలకు వచ్చే సరికి రాజకీయం చేస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దోమల వ్యాప్తి అధికం వర్షాకాలం మొదలయ్యింది. పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోతే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే పైపులైన్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. అప్పులు చేసి ఖర్చు చేయాల్సి వస్తోంది. – పద్మనాభరెడ్డి, సర్పంచ్ కృష్ణంపల్లె పంచాయతీ నెలలో రావచ్చు పంచాయతీ నిధులు నెల రోజుల్లోపు వచ్చే అవకా శం ఉంది. వీటి పై రాష్ట్ర పంచాయతీ అధికారులను సంప్రదించాం. నెల.. నెలన్నర లోపు రావొచ్చని చె ప్పారు. సాధారణ నిధుల నుంచి అత్యవసర పను లకు అవసరమైతే వాడుకోవాలని తెలియజేశాం. – సుధాకర్రావు, డీపీఓ – IIలో– IIలోన్యూస్రీల్మూడు నెలలు ముందే వచ్చిన 15వ ఆరిక్థ సంఘం నిధులు జిల్లాకు మొత్తం రూ.30.32 కోట్లు ఖర్చుచేయని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్పంచ్లకు క్రెడిట్ వస్తుందని నాన్చుతున్న వైనం మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పల్లె జనం ఎదురు చూస్తున్నాం 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చిలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ నిధుల కోసం మూడు నెలలుగా వేచి చూస్తున్నాం. – రజనీకాంత్, సర్పంచ్ వసంతాపురం కంపు కొడుతున్న పల్లెలు ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో పల్లెలు కంపుకొడుతున్నాయి. ఎక్కడ చూసినా పరిసరాలు అధ్వాన్నంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. అత్యవసర పనుల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. – రవికుమార్, సర్పంచ్, బుగ్గ అగ్రహారం -
తల్లులను మోసగించిన మిమ్మల్ని ఏమనాలి బాబూ?: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు...పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు. -
తోతాపురి తిప్పలు!
గిట్టుబాటు కాని ధర ● పలుచోట్ల కిలో రూ.4 ● కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం రూ.5, రూ.6 ఇస్తున్న వైనం ● ఆరు నెలల తర్వాతే నగదు చెల్లింపు ● టోకన్ల కోసం అవస్థలు ● చోద్యం చూస్తున్న అధికారులు కాణిపాకం: తోతాపురి మామిడి రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాయల విక్రయానికి అవసరమైన టోకెన్ల కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు అధికారుల ఒత్తిడిమీద కొనుగోలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మామిడి వ్యాపారులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో రూ.4 అని పాట పాడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే నగదు చెల్లింపులు ఆరు నెలల తర్వాతేనని తేల్చిచెబుతున్నాయి. దిగుబడి అధికమే కారణమా? జిల్లాలో మామిడి సాగు 56 వేల హెక్టార్లలో విస్తరించింది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్ల వరకు ఉండగా.. ఈ సారి 49,9274 వరకు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు దిగుబడి కూడా ఆశాజనకంగానే వచ్చింది. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంబరపడిపోయారు. తీరా ధరలు పతనమవడంతో డీలాపడ్డారు. టేబుల్ రకాల ధరలు కూడా ఈ సారి ఆశాజనకంగా లేవు. తోతాపురి రూ.4 జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించేస్తున్నారు. తోతాపురి కేజీ రూ.4కే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వరుసగా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ తొలుత కేజీ రూ.5కే కొనుగోలు చేసింది. అధికారులు ఆ ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవడంతో రూ.6కు ఫిక్స్ చేసింది. మిగిలిన ఫ్యాక్టరీలన్నీ అదేబాట పట్టాయి. దీనికితోడు తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తోతాపురి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలు అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ కేజీ రూ.4కే కొనుగోలు చేసి రూ.5కు ఫ్యాక్టరీకి అన్లోడ్ చేస్తున్నాయి. ఆరు నెలల తర్వాతే బిల్లులు తమిళనాడు నుంచి దిగుమతవుతున్న కాయలకు మాత్రం ఫ్యాక్టరీలు అప్పటికప్పుడు నగదు చెల్లిస్తుండగా.. తెలిసిన వ్యాపారులకు వారం, నెల రోజుల వ్యవధిలో పేమెంట్ చేస్తామని చెబుతున్నాయి. జిల్లాలోని రైతులకు మాత్రం కాయలు తరలించిన ఆరు నెలల తర్వాతే బిల్లులు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. కూటమి వెన్నుపోటు మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు గిట్టుబాటు ధర కల్పించిందని సంబరపడిపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఫ్యాక్టరీలు కచ్చితంగా కొనాల్సిందేనని ఊదరగొట్టారు. కొనలేదంటే చర్యలతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. అది కూడా కేజీ రూ.8కే కొనాలని, ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తుందని సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే వారంలోనే గిట్టుబాటు ధర ఫల్టీ కొట్టింది. ప్రస్తుతం రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తున్నారు. సిఫార్సులకే టోకన్లు తోతాపురి విక్రయానికి మామిడి రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. టోకన్ల కోసం ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టోకన్ కోసం నిరీక్షిస్తున్నారు. టోకన్లు జారీచేసే సమయానికి నీకా..నాకా అంటూ పోటీపడుతున్నారు. కొన్ని టోకన్లు మాత్రమే రైతులకు ఇచ్చినట్టే ఇచ్చి..మిగిలిన టోకన్లు అన్నీ కూడా సిఫార్సుల మేరకు వెళ్లిపోతున్నాయి. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే టోకన్లను ఇచ్చుకుంటున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి ప్రాంతాల్లో ఈ రకమైన సమస్యలు అధికంగా ఉన్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం టోకన్ల కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరుపులు, కేకలతో దద్దరిలింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకుని తోతాపురి కేజీ రూ.8కే కొనుగోలు చేయించేయాల చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దారుణం ఇంత దారుణం ఎప్పుడూ లేదు. మామిడి పంట బాగా వచ్చిందని అనుకుంటే ధరలు లేవు. ఫ్యాక్టరీ కాడికి వస్తే కొనేవాళ్లు లేరు. టోకన్లు ఉంటేనే కొనుక్కుంటున్నారు. ఈ బాధాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఏజూస్, ఆవలకొండ, జీడీనెల్లూరు ఆరు నెలల తర్వాత బిల్లులా? కాయలు అమ్ముకోవడానికి టోకన్ల కోసం వచ్చాం. టోకన్లు తీసుకోవ డానికి నానా పాట్లు పడుతున్నాం. టోకన్లు ఇవ్వడానికి ముందే ఆరు నె లల తర్వాతే డబ్బులు ఇస్తామంటున్నారు. తోతాపురి రూ.8 అన్నారు. ఇప్పుడు రూ.6 అంటున్నారు. – బాబునాయుడు, రంగాపురం, జీడీనెల్లూరు -
ప్రశాంతంగా ఎస్జీటీల బదిలీలు
చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు పరిధిలోని ఎస్జీటీల బదిలీలు శుక్రవారం ప్రశాంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో సీరియల్ నం.1001 నుంచి 2000 వరకు ఎస్జీటీల బదిలీల కసరత్తు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు చిత్తూరు అబ్జర్వర్గా విచ్చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో పలువురు టీచర్ల అర్జీలను స్వీకరించి పరిష్కరించదగ్గ వాటిని పరిష్కరించారు. ఈ కౌన్సెలింగ్ కసరత్తులో చిత్తూరు డీఈవో వరలక్ష్మి, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్, డీవైఈవోలు పాల్గొన్నారు. నోషనల్ తేదీ బాధితులు ఫిర్యాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2008 డీఎస్సీలో ఉద్యోగాల్లో చేరిన టీచర్లు హామీ పత్రాల ప్రకారం పాఠశాలలో చేరారు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వేర్వేరు తేదీల్లో పాఠశాలల్లో చేరినప్పటికీ సీనియారిటీ, మానిటరీ బెనిఫిట్స్ అందరికీ ఒకే తేదీ రోజు వర్తించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సంబంధిత టీచర్లు నోషనల్ తేదీని, పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని టీఐఎస్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం)లో నమోదు చేశారు. అయితే బదిలీలకు దరఖాస్తు చేసుకునే సమయంలో పాఠశాల విద్యాశాఖ సూచనల ప్రకారం నోషనల్ తేదీ కేవలం ఉద్యోగోన్నతులకు మాత్రమేనని, పాఠశాలల్లో విధుల్లో చేరిన రోజునే బదిలీలకు పరిగణిస్తామని స్పష్టంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు సైతం ఇచ్చారు. బదిలీల్లో నోషనల్ తేదీ విషయంలో నష్టపోయిన పలువురు టీచర్లు ఆర్జేడీ శామ్యూల్ను కలిసి న్యాయం చేయాలని అర్జీ అందజేశారు. ఇష్టానుసారంగా దరఖాస్తుల్లో నమోదు 2008 డీఎస్సీ టీచర్లు తమకు ఇష్టానుసారంగా నోషనల్ తేదీని బదిలీల దరఖాస్తుల్లో నమోదు చేసుకున్నారు. మరికొంత మంది పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని నమోదు చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పదే పదే స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొంత ఎంఈవోలు అమలులో అలసత్వం వహించారు. దీని వల్ల కొంతమంది టీచర్లు బదిలీల్లో లబ్ధిపొందేందుకు ఉద్దేశపూర్వకంగా నోషనల్ తేదీనే కొనసాగించుకున్నారు. దీంతో నోషనల్ తేదీని నమోదు చేసుకున్న టీచర్లు బదిలీల సీనియారిటీ జాబితాల్లో ముందుకు వెళ్లిపోయారు. నిజంగా పాఠశాలల్లో విధుల్లో చేరిన తేదీని నమోదు చేసుకున్న టీచర్లు జాబితాలో వెనుకకు వచ్చేసి తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యను డీఈవోకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోని దుస్థితి. సీనియారిటీ జాబితాలో ఇక మార్పులు చేయడం జరగదని డీఈవో స్పష్టం చేశారు. నష్టపోయిన బాధిత 2008 డీఎస్సీ టీచర్ల సమస్యలను ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ ఆర్జేడీ శామ్యూల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై ప్రత్యేక అధికారితో విచారణ చేయిస్తామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 150 మంది టీచర్లు లబ్ధిపొందారని ఆర్జేడీకి జాబితా సమర్పించగా, ఆ జాబితా ప్రకారం విచారణకు ఆదేశించారు. -
పిల్లల్ని అపహరించడానికి వచ్చిన వ్యక్తిపై దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద టమాటాలు విక్రయిస్తున్న వ్యాపారికి, ఛత్తీస్ఘడ్కు చెందిన మరో వ్యక్తికి శుక్రవారం గొడవలు జరిగాయి. కట్టమంచి వద్ద టమాటాలు విక్రయిస్తున్న వ్యక్తికి, అటుగా వెళుతున్న ఛత్తీస్ఘడ్కు చెందిన మహేంద్రకు చిన్నపాటి వాగ్వా దం జరిగింది. దీంతో టమాటాలు విక్రయించే వ్యక్తి తన స్నేహితులను పిలిపించి మహేంద్రపై దాడి చేయగా, అతను కూడా తిరగబడి దాడి చేశాడు. కొందరు స్థానికులు ఇతడిని వెంబడించగా.. మల్లికార్జున వీధిలోకి వెళ్లి.. అక్కడున్న చిన్నపాపను పట్టుకున్నాడు. పిల్లిల్ని కిడ్నాప్ చేస్తు న్నాడని భావించి స్థానికులు మహేంద్రను చావబాధారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకో గా, అప్పటికే మహేంద్రకు రక్త గాయాలయ్యాయి. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడడంతో భయపడ్డ మహేంద్ర చికిత్సకు నిరాకరించి కుర్చీలు విసిరాడు. వైద్యులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని మహేంద్రకు సర్ది చెప్పి వైద్యం చేయించారు. అనంతరం భోజనం పెట్టించి, మహేంద్ర ఛత్తీస్ఘడ్కు వెళ్లడానికి రైలు టికెట్టు కొనిచి, రైలెక్కించారు. నాలుగు టిప్పర్ల సీజ్ పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ, వనదుర్గాపురం నుంచి అక్రమంగా తమిళనాడుకు మట్టి తరలిస్తున్న టిప్పర్లను తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. సీఐ రవి మాట్లాడుతూ కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా సమీపంలోని గుట్టనుంచి ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో దాడులు చేశామన్నారు. ఈ మేరకు నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో టిప్పర్లో 40 టన్నుల మట్టి ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీలో ఆకలి కేకలు పాలసముద్రం : మండలంలోని టీవీఎన్ఆర్ పురం అంగన్వాడీ కేంద్రంలో వంట గ్యాస్ లేదని శుక్రవారం పిల్లలకు భోజనం పెట్టకుండా పస్తులుంచారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహించి అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, మధ్యాహ్న భోజనం పెడతారని పిల్లలను పంపించామన్నారు. కూలి పనులకు వెళ్లి వచ్చేసరికి పిల్లలు ఆకలిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే గ్యాస్ లేకపోవడంతో ఆహారం తయారు చేయలేదన్న్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 69,609 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.11 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 16 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
జీతాల్లేవ్
తోతాపురి తిప్పలు! జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తోతాపురి విక్రయానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గజరాజుల విధ్వంసం పులిచెర్ల మండలంలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు. డాక్టర్ల కొరత వేధిస్తోంది. పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా.. పలు చోట్ల ఒక్కో డాక్టర్తోనే నెట్టుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం 2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త పుంతాలు తొక్కింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 3,250 ఇబ్బులకు చికిత్స అందించేవారు. అయితే చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పడిన నాటి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. కుయ్యే..మొర్రో అంటున్న 108, 104 ఆపత్కాలంలో ఆదుకునే 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ షెడ్డులో పడ్డాయి. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. కిడ్నీ బాధితులు..డయాలసిస్ కోసం 108 వాహన సేవలను వినియోగించుకునే వారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలో ఈ సేవలకు స్వస్తి పలికారు. ఇక 104 అంబులెన్సులను కూటమి ప్రభుత్వం రాగానే మూలనపడేసింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసే వారు. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. గతంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టేవి. ఇప్పుడు అవి కూడా మూగబోతున్నాయి. కంటికి కనిపించని వెలుగు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈఐ కేంద్రాల ద్వారా జిల్లా ఆస్పత్రి, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే ఏర్పాట్లు చేపట్టారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ, శస్త్ర చికిత్సలు చేసేవారు. ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థతో మమో రాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ గడువు గతేడాది ముగియడం.. కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం పేదలు రూ.వేలల్లో వెచ్చించి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరమ్మతులకు గురైన 108 వాహనాలు ఈ తీర్పు జర్నలిస్టులకు వజ్రాయుధం నగరి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయితీపరులైన జర్నలిస్టులకు వజ్రాయుధం లాంటిదని మాజీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. కొమ్మినేని అరెస్టు అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తేల్చి చెప్పడంపై శుక్రవారం స్పందించారు. ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొమ్మినేని తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలివ్వడం, ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం జర్నలిస్టు విజయమన్నారు. సాక్షి టీవీపై విషప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిదన్నారు. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు చిత్తూరు అర్బన్ : ఏపీలో భారత రాజ్యాంగం అమ లు కావడం లేదు. సగటు పౌరుడు తన భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితులు తీసుకొచ్చా రని వైఎస్సా ర్సీపీ చిత్తూరు పార్లమెంట్ లీగల్ విభాగం అధ్యక్షుడు సూర్యప్రతాపరెడ్డి తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టే దీనికి నిదర్శన మన్నారు. ఇలాంటి చర్యలపై సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించిదని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. 17న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభం చిత్తూరు రూరల్: బంగారుపాళ్య మండలం, నలగాంపల్లి వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయినట్లు డీటీసీ నిరంజన్రెడ్డి తెలిపారు. ఈనెల 17న ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇకపై వాహన ఫిట్నెస్ పరీక్షలు అక్కడే జరుగుతాయన్నారు. మాన్యువల్గా కార్యాలయంలో ఫిట్నెస్ పరీక్షలు జరగవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బదిలీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బాలక్రిష్ణను తిరుపతికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడకు గుంటూరులో పనిచేస్తున్న లక్ష్మీని నియమించింది. ఈమేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. టీచర్ల శిక్షణ వాయిదా వేయండి చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల శిక్షణా తరగతులు వాయిదా వే యాలని రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న శిక్షణలను వాయిదా వేయాలన్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు టీచర్లు కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో శిక్షణలు ఇవ్వడం సరికాదని సూచించారు. అరొకర వైద్యం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామానికి వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం వచ్చారంటే మధ్యాహ్నం 2–3 గంటల వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. – జ్యోతీశ్వర్,యాదమరి ప్రైవేటు ఆస్పత్రే దిక్కు గతంలో ఇంటికాడికి వచ్చి వైద్యం చే సేవారు. మంచిగా చూసి మందులు, మాత్రలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ వి ధంగా లేదు. జ్వరం వచ్చినా ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నాం. పేదలు వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది మోయలేని భారంగా మారుతోంది. – కుమార్, గుడిపాల గతంలో ఫోన్ చేస్తే చాలు.. శ్రీరంగరాజుపురం మండలం మెదవాడ వద్ద టాటాఏసీ బోల్తా పడితే అంబులెన్స్కు ఫోన్ చేశాం. సమయానికి రాలేదు. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించి కొంత మంది క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించాం. మరికొంత మందికి పీహెచ్సీ వైద్యులు రోడ్డుపైనే వైద్యం అందించారు. గతంలో ఇలా లేదు. ఫోన్ చేస్తే 108 కుయ్..కుయ్ మంటూ నిమిషాల్లో వచ్చేసేది. – కరుణకర్, పాతపాళ్యం గ్రామం వైద్యం అందించే వారే లేరు గత ప్రభుత్వంలో మా గ్రామంలోకి వచ్చి 104 వాహనం ద్వారా వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు చికిత్సలు అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనం వచ్చేది దేవుడెరుగు కనీసం గ్రామాలకు వైద్య సిబ్బంది కూడా రావడంలేదు. ప్రమాద సమయాలలో 108 వాహనం కోసం ఫోన్ చేస్తే ఎప్పుడో స్పందిస్తే ఏం లాభం. – లక్ష్మీదేవి, చౌడేపల్లి – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం పల్లెల్లో పడకేసిన వైద్యసేవలు అవస్థల్లో పేద రోగులు పట్టించుకోని కూటమి నేతలు గత ప్రభుత్వంలో ఇంటిముంగిటకే వైద్యం ఈ ఏడాది ఫ్రిబవరి 3వ తేదీన శ్రీరంగరాజుపురం మండలం, పాతపాళ్యం దళితవాడ గ్రామస్తులు 30 మంది ఎట్టేరి గ్రామంలో జరిగే ఓ పెళ్లి కార్యక్రమానికి టాటా ఏసీ వాహనంలో బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో మెదవాడ ఎస్టీ కాలనీ వద్ద వాహనం బోల్తాపడి ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. అంబులెన్స్ సకాలంలో రాక వైద్యం కోసం నానాతిప్పలు పడ్డారు. పీహెచ్సీ వైద్య బృందం ప్రాథమిక వైద్యం అందించింది. పాలసముద్రం మండల కేంద్రానికి చెందిన దేవానందంను గతనెల 10వ తేదీన ఇంట్లోనే పాము కాటు వేసింది. బంధువులు పాలసముద్రం పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది పాము కాటుకు మందులేదని చెప్పడానికి రెండు గంటల సమయం తీసుకుని టీటీ ఇంజక్షన్ ఇచ్చి చిత్తూరుకు రెఫర్చేశారు. వెంటనే అతన్ని 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దేవానందం మృతి చెందినట్లు జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. ఇవి మచ్చుకు రెండు ఘటనలు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్షలా మారాయి. జబ్బున పడితే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా దాపురించాయి. 108, 104 సేవలు గాల్లో దీపంలా మారాయి. ఆరోగ్యశ్రీ సేవలు తూతూమంత్రంగా అందుతున్నాయి. మందులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. పేద రోగులు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రభుత్వ వైద్యసేవలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్టు.. 108 సేవల వివరాలు 108 వాహనాల సంఖ్య – 33 2024 మూడు నెలల్లో – 12,275 కేసులు 2025 మూడు నెలల్లో – 10,012 కేసులు ఆరోగ్య శ్రీ వివరాలు.. (2024 మే వరకు) ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సంఖ్య జిల్లా ఆస్పత్రి – 1 సీహెచ్సీలు – 5 ప్రైవేటు ఆస్పత్రులు – 12 ఏరియా ఆస్పత్రి – 3 పీహెచ్సీలు – 49 వైద్యులు – 49 సిబ్బంది – 246 కార్డుల వివరాలు డాక్టర్ ఆరోగ్యశ్రీ – 4,96,715 ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీం – 1,935 వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్స్కీం – 1,935 అమృత హెల్త్స్కీం – 1,044 ఆయుష్మాన్ భారత్ – 1,400 జిల్లా సమాచారం జిల్లా ఆస్పత్రి – 1 ఏరియా ఆస్పత్రి – 4 సీహెచ్సీ – 8 పీహెచ్సీ – 50 అర్బన్ హెల్త్ సెంటర్లు – 15 కూటమి ప్రభుత్వంలో వైద్య సిబ్బందికీ ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతాలు అందించడంలేదు. టీడీపీ హయాంలో వీరికి నెలకు రూ.7,200 చొప్పున వేతనం చెల్లించేవారు. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాన్ని రూ.8,800కు పెంచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు. 108 వాహన సిబ్బందికి కూడా సకాలంలో వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సర్జరీ వివరాలు సంవత్సరం సర్జరీల జమ చేసిన సంఖ్య మొత్తం రూ.కోట్లల్లో 2019–20 43,898 3.62 2020–21 51,173 90.01 2021–22 75,941 13,99 2022–23 83,816 20.01 2023–24 97,945 24.55 2024–25 131263 25.24 ఆరోగ్య శ్రీ ఆసరా సంవత్సరం లబ్ధిదారుల ఖర్చు రూ.కోట్లల్లో సంఖ్య 2019–20 5,282 2.95 2020–21 14,439 7.42 2021–22 25,247 11.60 2022–23 22,456 10.41ఆరోగ్య ఆసరాకు ఎసరు ఆరోగ్యశ్రీలో శ్రస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో గత ప్రభుత్వం జీవన భృతి అందజేసింది. రోజుకు రూ.275 చొప్పున లెక్కగట్టి అందిచేవారు. సాధారణ డెలివరీ, సిజేరియన్లకు రూ.5 వేలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విరిగిన ఎముకల సర్జరీకి రూ.10 వేలు, కాళ్లకు ఇన్ఫెక్షన్కు సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575.. ఇలా చికిత్సను బట్టి సాయాన్ని అందించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపును నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
విలీనం..వ్యతిరేక స్వరం!
– రోడ్డెక్కుతున్న కూటమి నేతలు యాదమరి: పాఠశాల విలీనంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే పెదవి విరిచేవారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాదమరి మండలం, చిన్నంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకుంటున్న 3, 4, 5 తరగతులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీనాటంపల్లి ఆదర్శ పాఠశాలలో విలీనం చేశారు. దీనిపై యాదమరి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు వినాయకం గౌండర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నపళంగా లోకజ్ఞానం ఎరుగని పసిబిడ్డలను వేరే పాఠశాలకు పంపాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడం సబబుకాదన్నారు. చిన్నంపల్లి నుంచి కీనాటంపల్లి మార్గ మధ్యంలో చెరువులు, వాగులు, బావులు ఉన్నాయని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. వీరికి సంఘీభావంగా వచ్చిన వినాయకంగౌండర్ ప్రజలకు ఆమోద యోగ్యం కాని నిర్ణయం తీసుకున్న తమ కూటమి ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానిక శాసనసభ్యులు ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా ఉండడం సమంజసం కాదని హితవు పలికారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ రుక్మిణి తెలిపారు. వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ అమలనాథన్ పాల్గొన్నారు. -
గజరాజుల విధ్వంసం
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగులదాడులు ఆగడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున కమ్మపల్లె పంచాయతీకి చెందిన రైతు రవీంద్రనాథరెడ్డి మామిడి తోటను ధ్వంసం చేశాయి. డ్రిప్ పైపులను సైతం తొక్కి నాశనం చేశాయి. దాదాపు నాలుగు టన్నుల కాయలు ఆరగించాయి. పంటకు నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు. చిత్తూరులో చైన్ స్నాచింగ్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కును పారిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని కట్టమంచి మల్లికార్జున వీధికి చెందిన స్వర్ణలత ప్రతీ రోజూ పక్కనే ఉన్న చెరువుకట్టపై వాకింగ్ చేస్తుంటారు. శుక్రవారం ఉదయం 5.15 గంటల ప్రాంతంలో చెరువుకట్టపై వాకింగ్ చేస్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అడ్రస్ అడిగినట్టు అడుగుతూ.. ఆమె మెడలో ఉన్న దాదాపు 35 గ్రాముల బరువు ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. మహిళ కేకలు పెట్టినా, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దొంగ దొరకలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్ చిత్తూరు అర్బన్: మద్యం మత్తులో తన తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు సోమశేఖర్రెడ్డి (21)ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టూటౌన్ ఇన్చార్జ్ సీఐ మహేశ్వర వివరాలను వెల్లడించారు. నగరంలోని ఓబనపల్లె లెనిన్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ వెంకటరెడ్డి తరచూ మద్యం తాగి వచ్చి తన భార్య సరస్వతిను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గురువారం కూడా సరస్వతిని ఇబ్బంది పెడుతుంటే, కుమారుడు సోమశేఖర్రెడ్డి మందలించాడు. దీంతో కత్తి తీసుకున్న కుమారుడిపై దాడికి ప్రయత్నించగా, అదే కత్తి లాక్కుని వెంకటరెడ్డిను నరికి చంపేశాడు. సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన పోలీసులు, సోమశేఖర్రెడ్డిని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచారు. నిందితుడికి 14 రోజుల రిమాండు విధించడంతో, చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ గుడుపల్లె : కర్ణాట మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 కేసుల టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని కనమనపల్లెకు చెందిన సత్యవేలు శుక్రవారం కర్ణాటకలోని కెంపాపురం నుంచి గుడుపల్లెకు బైర్ మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
విమాన ప్రమాద మృతులకు నివాళి
చిత్తూరు కార్పొరేషన్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు నివాళులర్పించారు. ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి నాయకులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులు చేతబట్టి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరగడం బాధకరమన్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నవారు, మెడికల్ కళాశాలలో ఉన్నవారు 265 మందికి పైగా దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కేశవులురెడ్డి, కుటుంబ సభ్యులు మృతిచెందడం కలచివేసిందన్నారు. ఈ మేరకు వారికి సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ.శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సరళమేరీ, ట్రేడ్యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాన్బాషా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అంజలిరెడ్డి, జెడ్పీటీసీ బాబునాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆను, రజనీకాంత్, మనోహర్రెడ్డి, మనోజ్రెడ్డి, ప్రకా ష్, కుమార్, త్యాగ, గిరిధర్రెడ్డి, స్లాండ్లీ, భాగ్యలక్ష్మి, మధురెడ్డి, లక్ష్మణస్వామి, చల్లాముత్తు, నారాయణ, ఉన్నికృష్ణ, అల్తాఫ్, పూంగొడి, జయగణేష్, కౌసర్, సెల్వ పాల్గొన్నారు. -
వయోవృద్ధులను పట్టించుకోకుంటే కేసులే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని కుమారుడు, కుమార్తెల నుంచి సెక్షన్ 125 కింద భరణం వసూలు చేయనున్నట్టు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యం.ఎస్.భారతి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక తపోవనం వద్ద ఉన్న వయోవృద్ధుల ఆశ్రమాన్ని పరిశీలించారు. వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సంపాదించిన ఆస్తిని దానపత్రంతో కొడుకులు, కూతుళ్లుకు అప్పగించిన తర్వాత వారు తల్లిదండ్రుల బాగోగులను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా పట్టించుకోని పక్షంలో 144 కింద కోర్టును ఆశ్రయిస్తే దాన పత్రాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ సమస్యపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో కేసు వేస్తే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందన్నారు. చోరీ కేసులో పురోగతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల ఓ బంగారు దుకాణంలో ఆభరణాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. జెండామాను వీధిలోని ఓ బంగారు దుకాణంలో 180 గ్రాముల నగలు, అయిదున్నర కిలోల వెండి వస్తువులు, పక్కనే ఉన్న స్టీల్ సామాన్ల దుకాణంలో రూ.3.50 లక్షల నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు టెక్నాలజీ వినియోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో నిందితుడి అరెస్టు చూపించే అవకాశాలున్నట్లు తెలిసింది. -
వలస జీవులపై మృత్యుపంజా!
మృతుల కుటుంబాలను ఆదుకోండి శ్రీరంగరాజపురం : కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సా యంగా రూ.50 లక్షలు అందించా లని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు అందించాలన్నారు. శుక్రవారం పుత్తూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మృతిచెందిన కుటుంబాలకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కార్వేటినగరం: బెంగుళూరులో ఉపాధి కోసం వెళుతూ కాన రాని లోకాలకు చేరుకున్నారు. మరో 20 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే లోపే లారీ రూపంలో మృత్యువు కబళించింది. గాఢ నిద్రలోనే అనంతలోకాలకు పంపేసింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట్ వద్ద గురువారం వేకువ జాము 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. చిత్తూరు డిపోకు చెందిన బస్సును లారీ ఢీకొట్టడంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 45 రోజుల చిన్నారితో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. స్థానికుల కథనం.. గంగాధరనెల్లూరు మండలం, పాపిరెడ్డిపల్లె పంచాయతీ, మారేడుపల్లె గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి భార్య శారద(40) బెంగళూరులో నివాసముంటోంది. తన చిన్నాన్న కర్మక్రియల కోసం స్వగ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో అశువులు బాసింది. అలాగే తూంగుండ్రం గ్రామానికి చెందిన లక్ష్మీకరుణాకర్కుమార్ చిత్తూరు డిపో–2లో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత పనిమీద బెంగళూరు వెళ్తూ తీవ్రంగా గాయపడ్డారు. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కే.కేశవులురెడ్డి, అతని తమ్ముడు జానర్ధన్రెడ్డి, తల్లి పాపమ్మ, భార్య గిరిజ, ఇద్దరు పిల్లలు కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. సొంత పనిమీద స్వగ్రామానికి వచ్చి తిరుగుపయనమయ్యారు. హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో కేశవులురెడ్డి(45) మృతి చెందగా అతని తమ్ముడు జనార్ధన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి మృత్యువాతపడ్డాడు. మిగిలిన క్షతగాత్రులు హోస్కోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నచ్చుకూరు గ్రామానికి చెందిన మదన్మోహన్రెడ్డి, భార్య ధనలక్ష్మి, కుమారుడు జస్వంత్ సొంత పనిమీద బెంగళూరుకు వెళ్తూ గాయపడ్డారు. ఇందులో ధనలక్ష్మికి రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీరంగరాజపురం మండలం, కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసీ(22) ఉద్యోగాన్వేషణలో భాగంగా బెంగళూరులో శిక్షణ తీసుకుంటూ.. గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ‘ప్రణతి’ రోదన! అలాగే తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతులు కుమార్తె ప్రణతి(4) మృతి చెందింది. హరిబాబు బెంగళూరులోని ఆర్మీలో పనిచేస్తున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అమ్మానాన్న పిలుపే కరువైంది గంగాధరనెల్లూరు మండలం, ఆళ్లమడుగు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన 45 రోజుల చిన్నారితో సహా వారి పెద్ద నాన్న కేశవులురెడ్డి మృతి చెందారు. ఎన్నో నోములు నోసి.. పుట్టిన పురిటి బిడ్డను ఆ దేవుడు అమ్మానాన్న అని పిలవకముందే దూరం చేశాడంటూ.. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆశల దీపం ఆరిపోయింది కొడుకులు లేరన్న బెంగలేకుండా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచి పోషించిన మా ఇంటి దీపం ఆరిపోయిందని మృతురాలు తులసీ తల్లిదండ్రులు విలపించడం కలచివేసింది. ఉష్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన తులసీ, ఉద్యోగాన్వేషణలో భాగంగా బెంగళూరు వెళ్లి శిక్షణ తీసుకుంటోంది. హోస్కోట వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. చిన్నాన్న కర్మక్రియల కోసం వచ్చి.. జీడీనెల్లూరు మండలం, మారేడుపల్లె గ్రామంలో గురువారం జరిగిన చిన్నాన్న సుబ్రమణ్యంరెడ్డి కర్మక్రియలకు శారద హాజరైంది. తర్వాత బెంగళూరుకు బయలు దేరింది. ఆమె భర్త విశ్వనాథరెడ్డి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శారద ఇంట్లో పనులతో పాటు పిల్లల సంరక్షణ చూసుకుంటోంది. హోస్కోట్ ఘటనలో శారద మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాలు హోస్కోట్ ప్రమాదంలో మృతి చెందిన ఆళ్లమడుగు గ్రామానికి చెందన కేశవులురెడ్డి(45), ఆయన తమ్ముడి కుమారుడు 45 రోజుల చిన్నారి మృత దేహాలు శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాయి. చిన్నారిని చూసిన గ్రామస్తులు బరువెక్కిన గుండెతో రోదించారు. కర్ణాటక రాష్ట్రం హోస్కోట్ వద్ద ఘోర ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి మృతులు తిరుపతి, చిత్తూరు జిల్లా వాసులు కన్నీరుమున్నీరైన కుటుంబీకులు వలస జీవులపై మృతువు పంజా విసిరింది. అభంశుభం తెలియని పురిటిబిడ్డను పొట్టనబెట్టుకుంది. మాటలు కూడా రాని మరో చిన్నారిని చిదిమేసింది. కుటుంబానికి ఆదరువుగా ఉంటుందనుకున్న చదువుల తల్లిని దూరం చేసింది. చిన్నాన్న కర్మక్రియలకు వచ్చి వెళ్తున్న ఓ అభాగ్యురాలిని అనంతలోకాలకు పంపేసింది. ఆమె ఇద్దరు బిడ్డలను అనాథలను చేసింది. మరొకరు సొంత పనిమీద బెంగళూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే మింగేసింది. గురువారం రాత్రి కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
డయేరియా నివారణపై అవగాహన
చిత్తూరు రూరల్(కాణిపాకం): డయేరియా నివారణ కార్యక్రమ ఉద్దేశంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. ఆమె గురువారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శిశుమరణాల నివారణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలోని వైద్యబృందం ఇంటింటా సర్వే చేపట్టి 0–5 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సర్వేను ఈ నెల 16 నుంచి జూలై 31వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. డయేరియా నివారణకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఓ హనుమంతరావు, డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.మద్యం వ్యాన్ బోల్తావడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తడుకు ఆర్ఎస్ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడింది. రేణిగుంట నుంచి మద్యం లోడుతో వడమాలపేట మీదుగా విజయపురం వెళ్తున్న సమయంలో తడుకు ఆర్ఎస్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్లోని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.గంగజాతరకు రానీయకుండా దాడులుపలమనేరు: తమ గ్రామంలో బుధవారం జరిగిన గంగ జాతరలో భాగంగా ఆలయంలో జరిగే పూజలకు తమను రావద్దని గ్రామ పెద్దలు అభ్యతరం తెలిపారని, దీనిపై ప్రశ్నించగా తమపై దాడులు చేసి గాయపరిచారని గంగవరం మండలం, గుండుగల్లు దళితులు వాపోయారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక డీఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో జాతరను అన్ని కులాలు కలిసి చేసుకుందామని చెప్పి తీరా ఆలయంలోకి తమను ప్రవేశించకుండా అడ్డుకున్నారన్నారు. దీనిపై అడిగినందుకే దాడి చేశారని తెలిపారు. డీఎస్పీకి విన్నవించిన వారిలో ఆ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, వెంకటరమణ, మునిరత్నం తదితరులున్నారు. -
కూటమి పాలనలో ఆలయాల విధ్వంసం
● హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆలయ ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సాక్షి, టాస్క్ ఫోర్స్ : ‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు.. దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది.. అమ్మవారి విగ్రహానికి కాళ్లు, చేతులు నరకడం సనాతన ధర్మమా..? హిందువుల మనోభావాలను కూటమి సర్కారు దెబ్బతీస్తోంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన శిథిలాలను గురువారం ఆయన పార్టీ నాయకులు, హిందూ సంఘాలతో కలసి పరిశీలించారు. ఆలయం ధ్వంసం చేయడంతో పాటు విగ్రహాలను, శిథిలాలను కాలువలో పడేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల దాడుల్లో గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. అనంతరం అమ్మవారి ఆలయ ఉపచారకులు శ్రీ మహారుద్ర వారాహి స్వామివారిని ఓదార్చారు. అనంతరం కూటమి నేతలు చేసిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణం శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ఇసుక, మట్టి మాఫియా ముఠాలు నేలమట్టడం చేయడం దారుణమైన ఘటన అని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. శిథిలాలను ఒక మురుగు కుంటలో పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం వెనుక ఏ కుట్ర దాగుందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అరాచకాలు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రోత్సాహంతోనే టీడీపీ నాయకులు ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని నేలమట్టం చేసిన వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదంటే దాని వెనుక కూటమి నాయకుల హస్తం లేదంటారా అని మండిపడ్డారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
– చెరువులో మునిగి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి గంగవరం: ఈత సరదా సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ ఘటన మండలంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. బైరెడ్డిపల్లి మండలం, ఇళ్లూరిండ్లు గ్రామానికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి(26) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను బుధవారం గంగవరం మండలం, పత్తికొండ పంచాయతీ, అటుకురాళ్లపల్లి గ్రామంలో జరిగే గంగ జాతరకు అమ్మమ్మ ఇంటికి కుటుంబ సమేతంగా వచ్చాడు. పండుగలో అమ్మవారికి మొక్కులు చెల్లించిన అనంతరం శ్రీనివాసులురెడ్డి, అతని మిత్రులతో కలిసి అదే గ్రామంలోని ఈతల కుంటలో సరదాగా ఈత కొడదామని వెళ్లారు. అలా వెళ్లిన నలుగురిలో ముగ్గురు చెరువులోంచి బయటకు వచ్చేయగా శ్రీనివాసులురెడ్డి వెలుపలికి రాలేదు. చెరువు అడుగున బురదలో కూరుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులో ఎంత ఎదికినా కనిపించలేదు. మరుసటి రోజున మళ్లీ చెరువులో గాలింపు చేపట్టగా మృతుడి ఆచూకీ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి పది రోజుల క్రితమే పాప జన్మించింది. దీంతో అమ్మమ్మ గారి ఊరితో పాటు సొంత గ్రామం ఇళ్లూరిండ్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బలవంతపు బదిలీలు..!
ఇచ్చిన మాట ప్రకారం మాన్యువల్ విధానంలో ఎస్జీటీల బదిలీలు నిర్వహించాలని అయ్యోర్లు ఇటీవల రొడ్డెక్కి ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు బండారం బయటపడుతుందని భావించిన కూటమి సర్కారు ఒక మెట్టు దిగింది. మాన్యువల్ బదిలీలకు అంగీకారం తెలిపింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని షర్మన్ పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. అధికారులు ఏదో ఒక సమస్యను చూపి అయ్యోర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి టీడీపీని నమ్మిన పాపానికి తగిన శాస్తి జరుగుతోందని అయ్యోర్లు లోలోపలే మదనపడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆపడం.. కొనసాగించడం చేస్తున్నారు. తాజాగా ఈ నెల 12వ తేదీన స్పౌజ్ కోటా విషయంలో అన్యాయం జరుగుతోందని బాధిత ఎస్జీటీ టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించారు. కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. స్పౌజ్ విషయంలో జీవో 22కు వ్యతిరేకంగా విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు పైగాకౌన్సెలింగ్ను ఆపేసారు. టీచర్ల ధోరణితో విస్తుపోయిన డీఈవో వరలక్ష్మి ఆగ్రహంతో కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఆర్వో మోహన్కుమార్, పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత టీచర్లతో చర్చలు జరిపారు. రోజుకొక వింత ధోరణి వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు న్యాయం చేయాలని మొరపెట్టు కుంటున్నా పట్టించుకోని వైనం గురువారం మూడు గంటలకు పైగా ఆగిన కౌన్సెలింగ్ ప్రక్రియ కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా చేసిన బాధిత ఎస్జీటీ టీచర్లు స్పౌజ్ సమస్యలే అధికం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్జీటీల కౌన్సిలింగ్ ప్రక్రియలో స్పౌజ్ సమస్య టీచర్లను నష్టపోయేలా చేస్తోంది. సీనియారిటీ నంబర్ 703కు ప్రక్రియ వచ్చేసరికి స్పౌజ్ సమస్యతో బాధిత మహిళా టీచర్ దీపిక న్యాయం చేయాలంటూ కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. మరికొందరు స్పౌజ్ బాధితులు ఆమెకు మద్దతు తెలిపారు. బాధిత టీచర్ దీపిక, ఆమె భర్త ఇద్దరూ ఎస్జీటీలే. ఆమె బుచ్చినాయుడుకండ్రిగలోను, ఆమె భర్త కేవీబీపురంలో పనిచేస్తున్నారు. వారు తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. బదిలీ జీవో ప్రకారం ఆమె ఉమ్మడి చిత్తూరులో ఎక్కడైనా కోరుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు కేవీబీపురం మండలంలోనే కోరుకోవాలంటూ ఆమైపె తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో జీవో 22ను అమలుచేసి న్యాయం చేయాలని బాధిత టీచర్ పట్టుబట్టి మరికొంత మంది బాధిత టీచర్లతో ధర్నా చేపట్టింది. చివరికి డీఆర్వో మోహన్ కుమార్, పోలీసులు కౌన్సిలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. బాధిత టీచర్లతో చర్చలు జరిపారు. జీవో ప్రకారం బాధిత టీచర్ దీపికకు శ్రీకాళహాస్తి కోరుకునేలా అవకాశం కల్పించారు. సమస్య పరిష్కారం అయ్యాక విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించారు. -
జిల్లాలో మామిడి రైతుల తంటాలు
● పండిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు ● అమ్ముడుపోని తోతాపురి ● టోకన్ల పేరుతో నిబంధనలు ● అరకొరగా ఇస్తున్న ఫ్యాక్టరీలు ● పత్తా లేని అధికారులు కాణిపాకం: జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగులో ఉంది. వీటిని కోత కోసి రైతులు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలిస్తున్నారు. టేబుల్ రకం కాయల కోతలు చివరి దశకు చేరాయి. ప్రస్తుతం తోతాపురి కోతలు ఆరంభమయ్యాయి. గందరగోళం అధికారుల ఒత్తిడి మేరకు కొన్ని ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు టోకన్లు పంపిణీ చేస్తున్నాయి. అవి కూడా అరకొరగా ఇస్తున్నాయి. చాలా వరకు టోకన్లు కూటమి నేతల సిఫార్సులతో అమ్ముడుబోతున్నాయి. కొన్ని చోట్ల అసలు టోకన్లే ఇవ్వడం లేదు. టోకన్ల పంపిణీని వాయిదా వేస్తూ బోర్డులు పెట్టేస్తున్నాయి. గుడిపాల మండలంలోని ఫ్యాక్టరీల వద్ద రైతులు గురువారం బారులు తీరారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొంతవరకు టోకన్లు ఇచ్చి నిలుపుదల చేశారు. చిత్తూరు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో టమాట గుజ్జు తయారీని కొనసాగిస్తున్నారు. మరో ఫ్యాక్టరీ టోకన్ల జారీని వాయిదా వేస్తూ బోర్డు పెట్టేసింది. టోకన్ల పంపిణీలో సరైనా స్పష్టత లేక రైతులను ఫ్యాక్టరీలు తిప్పించుకుంటున్నాయి. తోతాపురికి టోకన్లు జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్, ఫ్యాక్టరీలకు తరలించారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో రైతులు రోడెక్కారు. స్పందించిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించింది. ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున్న ప్రోత్సాహక నిధి ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారుల పోరు పడకలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. టోకన్ల సిస్టమ్ను తీసుకొచ్చాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి లోడేత్తేస్తున్నాయి తమిళనాడులోని క్రిష్ణగిరి, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తమిళనాడు కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ తోతాపురి కిలో రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నాయి. అక్కడి వ్యాపారులు రూ.5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. రూ.8 కాదు.. రూ.6కే! తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇది అమల్లోకి రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతికష్టం మీద ఫ్యాక్టరీలు రూ.6కు కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. ఇదీ కూడా కొన్ని రోజుల ముచ్చటేనన్ని రైతులు దిగాలు చెందుతున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా టోకన్లు ఎప్పుడు ఇచ్చారో తెలియడం లేదు. నాలుగు రోజులుగా ఫ్యాక్టరీల చుట్టూ తిరుతున్నా. గురువారం టోకన్ల కోసం ఫ్యాక్టరీ కాడికి వస్తే.. టోకన్లు ఇప్పుడు ఇచ్చేది లేదంటున్నారు. సోమవారం రమ్మని బోర్డు పెట్టేశారు. నేను 3.5 ఎకరాల్లో మామిడి సాగు చేశా. కాయలు రాలిపోతున్నాయి. – దశరథన్, మాపాక్షి, చిత్తూరు దొంగతనంగా తీసుకొచ్చేస్తున్నారు చిత్తూరు కాయలను వద్దని..దొంగతనంగా బయట కాయలను తీసుకొచ్చేస్తున్నారు. క్రిష్ణగిరి కాయలు దించుకుంటున్నారు. రాత్రికి...రాత్రి..ఆ కాయలను తీసుకొస్తుంటే అడ్డుకునే వారులేరు. అందుకే జిల్లా కాయలను వద్దంటున్నారు. ఈ టోకన్ల సిస్టం తీసేసి...కాయలు కొనుగోలు చేసేలా చూడాలి. – నాగరాజు, ఎల్బీపురం, చిత్తూరు పర్మిట్ల కోసం పడిగాపులు గుడిపాల: పర్మిట్ల కోసం మామిడి రైతులు తెల్లవారు జాము నుంచే పడిగాపులు కాశారు. గురువారం గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్, తాసా జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. ఎవ్వరూ స్పందించకపోవడంతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. గుడిపాల తహసీల్దార్ జయంతి, ఎస్ఐ రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. 200 మందికి టోకెన్లు 200 మందికి టోకన్లు అందజేశారు. దీంతో వివాదం సర్దుమణిగింది. 17వ తేదీ వరకు టోకన్లు ఇవ్వడం కుదరదని ఫ్యాక్టరీ నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకే అధికంగా ఫ్యాక్టరీ వారు ప్రాధాన్యత చూపుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. లారీల ద్వారా లోడ్లు వచ్చిన వెంటనే టోకన్లు లేకుండానే అన్లోడ్ చేస్తున్నారని తెలిపారు. జిల్లా సమాచారం మామిడి రకం హెక్టార్లు దిగుబడి అంచనా తోతాపురి 39,895 49,9274 నీలం 5,818 64,991 అల్పోన్సో 3,127 26,404 బేనీషా 3,895 28,867 మల్లిక 1,740 13,919 ఇతర రకాలు 1,526 11,779జిల్లాలో మామిడి రైతులు నానాతంటాలు పడుతున్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి నరకం అనుభవిస్తున్నారు. తోతాపురి అమ్ముడుపోక విలవిల్లాడుతున్నారు. టోకన్ల పేరుతో ఫ్యాక్టరీ యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. దీనికితోడు తోతాపురి కిలో రూ.6కే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.8కే కొనుగోలు చేయాలని నిర్ణయించినా అవేవీ పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఇటు ఫ్యాక్టరీ యజమానులను ఒప్పించలేక.. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడి ధరలు రకం ధర(కిలో) చందూర రూ.4 బేనీషా రూ.10–రూ.20 మల్లిక రూ.7–రూ.20 కాలేపాడు రూ.20– రూ.30 ఇమామ్ పసంద్ రూ.40–రూ.70 తోతాపురి (టేబుల్ రకం) రూ.10–రూ.13 అల్పోన్సో రూ.20– రూ.30ముఖం చాటేస్తున్న ఫ్యాక్టరీలు జిల్లాలో సాగయ్యే మామిడి ఫలాల్లో టేబుల్ రకాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. తోతాపురి కాయలు గుజ్జు తయారీకి తరలుతుంటాయి. ఈ కాయలన్నీ కూడా జిల్లాలోని 47 గుజ్జు పరిశ్రమలకు చేరుతుంటాయి. గతేడాది తయారీ చేసిన గుజ్జు నిల్వలు అలాగే ఉండడంతో ఈ సారి మామిడి కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా ఫ్యాక్టరీ యజమానులు ముఖం చాటేస్తున్నారు. -
ఆ జాబితా సమర్పించండి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకం జాబితాలను సమర్పించాలని డీఆర్వో మోహన్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర కై ్లములకు సకాలంలో స్పందించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా మరణించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వారి పేర్లను జాబితాలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు పేర్లు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్స్ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్లెవల్ ఏజెంట్ల నియామకానికి ఫారం 2 సమర్పించాలన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు 15,497 దరఖాస్తులు అందగా వాటిలో 1,598 పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో పలు పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్ర, గంగరాజు, పరదేశి పాల్గొన్నారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకి తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చారు. ఆలయ సిబ్బంది దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. వ్యవసాయశాఖా మంత్రి జిల్లా పర్యటన వాయిదా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేయాల్సిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెంనాయుడు పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఆయన తదుపరి పర్యటన వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం చౌడేపల్లె( పుంగనూరు): పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండలో వివాహిత అత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. నక్కబండకు చెందిన షాహీదా(28) తన అవసరాల కోసం కొంతమంది వద్ద అప్పు చేసింది. వారి నుంచి వేధింపులు అఽధికం కావడంతో ఇంట్లో నిద్ర మాత్రలు మింగి అపస్మార ిస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు ఆమెను పుంగనూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కాణిపాకం–తిరుపతి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో చెర్లోపల్లె నుంచి చిత్తూరు వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ, స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాజేష్, అతని భార్య పూర్ణిమ ఇద్దరి పరిస్థితి విషమించడంలో తమిళనాడు రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో రాజేష్ చనిపోయాడు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉంది. పందెం రాయుళ్ల అరెస్ట్ చౌడేపల్లె(పుంగనూరు): పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులో గురువారం కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఎస్ఐ కథనం.. పుంగమ్మ చెరువు సమీపంలోని పాములకుంట వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి పది కోడి పుంజులు, రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మద్యం వ్యాన్ బోల్తా..
వడమాలపేట మండలం తడుకు ఆర్ఎస్ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. టోకన్ల గోల అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా తయారైంది జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సర్కారు బడులు సమస్యలతో స్వాగతం పలికాయి. గత ఐదేళ్ల పాటు అధునాతన హంగులతో ఓ వెలుగు వెలిగిన బడులు ప్రస్తుతం ధీన స్థితికి చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,462 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,48,430 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందని విద్యార్థి మిత్ర కిట్లు తొలి రోజే ప్రతి విద్యార్థికీ డా.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ కిట్లను అందజేయాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లను అందజేలేదు. ఈ కిట్లలో విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్, డిక్షనరీ, వర్క్ బుక్స్ అందజేయాల్సి ఉంది. కానీ షూలు, బ్యాగులు, యూనిఫాం జిల్లాకు రాకపోవడంతో కేవలం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పత్తాలేని బడిబాట అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రతి ఏటా వేసవి సెలవుల్లో, బడులు తెరిచిన సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. జిల్లాలోని ప్రతి మండలంలో క్షేత్ర స్థాయిలో టీచర్లు ప్రచారం చేసి బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బడిబాటకు ఫుల్స్టాప్ పెట్టేశారు. మౌలిక వసతుల కల్పన, విద్యార్థి కిట్లుకు మంగళం పాడేశారు. ఈ క్రమంలోనే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పుస్తకాలు మాత్రమే ఇచ్చారని చూపుతున్న యాదమరి మండలం పి.గొల్లపల్లి పాఠశాల విద్యార్థులు – 8లో– 8లో– 8లోన్యూస్రీల్విద్యార్థికి ‘మిత్ర ద్రోహం’! సమస్యల్లో సర్కారు బడులు పునఃప్రారంభమైనా పూర్తి స్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు జాడలేని నూతన అడ్మిషన్లు పెదవి విరుస్తున్న తల్లిదండ్రులు గత ప్రభుత్వంలో పాఠశాల ప్రారంభం రోజే సకల వసతులు పేద పిల్లలు ఉన్నత చదువులు చదవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మరోసారి నిరూపితమైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమైనా విద్యార్థులకు అందించాల్సిన కిట్లను సైతం సక్రమంగా అందించక చేతులెత్తేసింది. ఉండలు కట్టిన నాసిరకం మధ్యాహ్న భోజనం వడ్డించి హాజరైన అరకొర విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందించకుండా గొంతు నొక్కేసింది. నూతన అడ్మిషన్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో కళకళలాడాల్సిన పాఠశాలలను నిర్వీర్యం చేసింది. దీంతో విధిలేక పలువురు పేద పిల్లలు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేయడం కనిపించింది. జిల్లాలో తొలిరోజు పాఠశాలల పునఃప్రారంభంపై ‘సాక్షి’గౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ బడులు వెలవెల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిరోజు నూతన అడ్మిషన్ల జాడ కనిపించలేదు. గత ఐదేళ్లలో అమలు చేసిన నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద, ట్యాబుల పంపిణీ, సీబీఎస్ఈ సిలబస్తో కొత్త పుంతలు తొక్కించారు. దీంతో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యారు. కానీ నేడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఆయా పథకాలను నీరుగార్చడంతో విద్యార్థులు ప్రయివేటు బడుల వైపు అడుగులు వేస్తున్నారు. తొలి రోజే ప్రభుత్వ బడులన్నీ వెలవెలబోవడం కనిపించింది. జిల్లా సమాచారం పాఠశాలల పాఠశాలల విద్యార్థుల కేటగిరీ సంఖ్య సంఖ్య ప్రాథమిక 1,949 52,469 ప్రాథమికోన్నత 158 10,293 ఉన్నత 355 85,668 మొత్తం 2,462 1,48,430 నాసిరకం బియ్యంతో అన్నం నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారు. గతంలో గోరుముద్ద పథకాన్ని చాలాబాగా అమలు చేసేవారు. రోజుకొక మెనూ వడ్డించేవారు. ప్రస్తుతం తొలి రోజు నాసిరకం బియ్యంతో అన్నం పెట్టారు. ఇలాంటి మగ్గిన అన్నం పెడితే ఎలా..?. – సుజమ్మ, విద్యార్థి తల్లి, శ్రీరంగరాజపురం యూనిఫాం ఇవ్వలేదు ఇంతకుముందు బడి తెరిచిన తొలి రోజే యూనిఫాం, పుస్తకాలు, నోటుపుస్తకాలు, షూ లు, డిక్షనరీ, బ్యాగు ఒకేసారి ఇచ్చేవారు. ఇప్పుడు మా పా ఠశాలలో యూనిఫాం ఇవ్వనే లేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. పుస్తకాలు కొ న్నే ఇచ్చారు. – పౌర్ణమి, విద్యార్థిని, శ్రీరంగరాజపురం మండలం -
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను విలీనం చేస్తూ పక్క గ్రామానికి తరలించడం స మంజసం కాదని మండలంలోని మూగనపల్లె గ్రామస్తులు గురువారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. విద్యార్థుల శాతం తక్కువగా ఉందని సుమారు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచుకుప్పం పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం భావ్యం కాదన్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు ప్రమాదాలు సంభవించడం ఖాయమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి విలీనాన్ని రద్దు చేయాలని కోరారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం కుప్పంరూరల్: ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలం, బలమందకొట్టం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి విలీనం చేస్తారనే సమాచారంతో గురువారం స్థానికులు ఆందోళనకు దిగారు. తరగతులు తొలగిస్తే పిల్లలు బైరప్పకొటాలుకు వెళ్లి రావాల్సి ఉంటుందని, అంతదూరం వెళ్లిరావడం కష్టతరమని వాపోయారు. విదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే వినీనాన్ని రద్దు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నేటి ‘ఫీజుపోరు’ వాయిదా
చిత్తూరు కార్పొరేషన్: అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న ఫీజుపోరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న ఆ పార్టీ చిత్తూరు ని యోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి, వి ద్యార్థి విభాగం మాజీ చిత్తూరు నియోజకవర్గ అ ధ్యక్షుడు శశిదీప్రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ నిర్ణ యం మేరకు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వా యిదా వేసినట్టు వెల్లడించారు. తదుపరి కార్యక్ర మ తేదీని త్వరలో పార్టీ ప్రకటిస్తుందన్నారు. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి నగరి : అహ్మదాబాద్ వి మాన ప్రమాదంపై మాజీ మంత్రి ఆర్కేరోజా ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. గు రువారం ఆమె విలేకరు లతో మాట్లాడుతూ ప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నా రు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆ త్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్న ట్టు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరగాల్సిన నిరుద్యోగభృతి, ఫీజు పోరు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు మరో 13 వేల క్వింటాళ్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు మరో 13వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు వస్తాయని జిల్లా వ్యవసాయశాఖఅధికారి మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు 26,349 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, మళ్లీ ప్రతిపాదనలు పంపగా త్వరలో మరో 13వేల క్వింటాళ్ల కాయలు పంపిణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాణిపాకం హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.2,18,93,556 ఆదాయం వచ్చింది. బంగారం 29 గ్రాములు, వెండి 2.350 కిలోలుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.17,107, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,877 వచ్చింది. కార్యక్రమంలో ఏఈవోలు ఎస్వీ కష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరిట ఫోన్ కాల్స్ – పోలీసులకు ఫిర్యాదు చిత్తూరు అర్బన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి ఫోన్ చేసి మోసం చేసి వ్యక్తిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ వ్యక్తి వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టులు ఉన్నాయని లక్షల్లో ముట్ట చెబితే ఆ పోస్టులు ఇప్పిస్తామని ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లు చేయడంతో విషయం డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి దృష్టికి వెళ్లిది. దీంతో ఆ వ్యక్తి చేసిన ఫోన్ నెంబర్(9062823086)ను పోలీసులకు తెలియజేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా వైద్యఆరోగ్య శాఖలో ఎటువంటి నోటిపికేషన్లు విడుదల చేయలేదన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్ను నమ్మొద్దని సూచించారు. నేడు 1001 నుంచి ఎస్జీటీల బదిలీలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీలకు 1001 సీరియల్ నెంబర్ నుంచి బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని షర్మన్ పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు సీరియల్ నెంబర్ 1001 నుంచి 1500 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సీరియల్ నెంబర్ 1501 నుంచి 2000 వరకు బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పది సప్లిమెంటరీ ఫలితాల్లో 24వ స్థానం చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా బాలురు 4,080, బాలికలు 2,533 మొత్తం 6,613 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,275 మంది, బాలికలు 1,643 మొతం 3,918 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 55.76, బాలికలు 64.86 శాతం సాధించగా జిల్లా ఉత్తీర్ణత శాతం 59.25 నమోదైంది. -
చిత్తూరులో కుండపోత వర్షం
చిత్తూరులోని మామిడి కాయల మార్కెట్లో నిలిచిన వర్షపు నీరు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన బలమైన వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకాలకు ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా కట్టమంచిలోని మామిడికాయల మార్కెట్ వర్షపు నీటితో నిండిపోయింది. మార్కెట్ లోపలి భాగం మొత్తం చెరువును తలపించింది. వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధికారులు స్పందించి మార్కెట్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అయ్యోర్లపై కక్ష సాధింపు
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో ఎస్జీటీలు బదిలీల బాధలతో నష్టపోతున్నారు. గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు పలు సమస్యలు ఎస్జీటీ టీచర్లను వేధిస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లపై ఉన్నతాధికారులు, రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపు ధోరణితో అన్యాయం చేస్తున్నారని బాధిత టీచర్లు వాపోతున్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరుకానివ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి భయాందోళనలు సృష్టించి తరిమేశారు. ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ల విషయంలో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఎస్జీటీ టీచర్లు వాపోతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్న టీచర్ల పై చులకన భావనతో జిల్లా విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నా స్పౌజ్ విషయంలో జీవో నెంబర్ 22 కు వ్యతిరేకంగా బదిలీలు నిర్వహిస్తూ అన్యాయం చేస్తుండడంతో బాధిత టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించి కేంద్రంలో ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మ్యాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించాలని చెప్పినందుకు విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపులకు పాల్పడి అన్యాయం చేస్తున్నారని పలువురు బాధిత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బదిలీల నిర్వహణకు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారిని అబ్జర్వర్ గా నియమించాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జిల్లాలో బదిలీల బాధలు కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా జీవోకు వ్యతిరేకంగా బదిలీలు ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా చిత్తూరు విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారు. జీవో ప్రకారం స్పౌజ్ నమోదు చేసుకున్న టీచర్లు జిల్లాలో ఎక్కడైనా బదిలీ కోరుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పనిచేస్తున్న మండలంలోనే కోరుకోవాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం అన్యాయం. ఎప్పుడూ ఒకే మండలంలో విధులు నిర్వహించాలా?. గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకతవకల బదిలీలు జరగలేదు. కొత్త మండలాలకు వెళ్లాలని నిరీక్షించాం. కానీ ఫలితం లేకుండా పోతోంది. – దీపిక, ఎస్జీటీ ఉపాధ్యాయురాలు -
కుప్పం విమానాశ్రయానికి భూములు ఇవ్వం
‘‘మా ప్రాణాలైనా వదులుకుంటాం గానీ భూములు ఇచ్చేది లేదు’’ అంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో ‘విమానాశ్రయం నిర్మాణ భూ సేకరణకు సంబంధించిన అంశంతో సంబంధమున్న’ రైతులు తేల్చి చెప్పారు. జాయింట్ కలెక్టర్ (జేసీ) విద్యాధరి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట్సాయి తదితర అధికారులు గురువారం శాంతిపురం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం కోసం ఉద్దేశించిన మూడు (దండికుప్పుం, తర్టీసొన్నేగానిపల్లి, అమ్మవారిపేట) రెవెన్యూ గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా 23 మందిలో 17 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. భూములు ఇవ్వాలని అధికారులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని జేసీ దృష్టికి తెచ్చారు. – శాంతిపురంవివిధ గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..వేధిస్తున్నారు..మర్యాదగా భూమి ఇస్తే ఎకరాకు రూ 16 లక్షల పరిహారం ఇస్తామని, కోర్టుకు పోతే రూ.10 లక్షలు మాత్రమే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారు. మాకు ఉన్న 85 సెంట్లలో వ్యవసాయం, పశుపోషణతో ముగ్గురు ఆడబిడ్డలను చదివిస్తున్నాం. ప్రాణం పోయినా భూములు ఇవ్వం. మమ్మల్ని వదిలేయండి. – పద్మమ్మ, సిద్దారెడ్లపల్లిఎలా బతకాలి?మా అన్నదమ్ముల రెండు కుటుంబాలకు ఉన్న ఏడు ఎకరాలను పూర్తిగా విమానాశ్రయానికి ఇచ్చి ఎలా బతకాలి. భూములు ఇవ్వటానికి మాతోసహా రైతులు ఎవరూ సిద్ధంగా లేరు. – కుమార్, సిద్దారెడ్లపల్లిఇచ్చేదే లేదు..ఏమి చేసినా, ఎంత పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేది లేదు. – వెంకటేష్, దండికుప్పంకూలీలుగా వలస పోవాలా?ఉన్న భూములను పోగొట్టుకుని రైతులు వలస కూలీలుగా వెళ్లాల్సిందేనా? వ్యవసాయంపై ఆధారపడ్డ మా కుటుంబంలోని 11 మంది భూములను కోల్పోయి బతకలేము. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే మేము ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోవటం లేదు. – జయప్పగౌడు, సిద్దారెడ్లపల్లిఎక్కడికి వెళ్లాలి..?వ్యవసాయం, మామిడి తోటలతో కుటుంబాన్ని లాక్కొస్తూ కొడుకును చదివిస్తున్నా మా భూమిని వదిలి ఎక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం డబ్బుల రూపంలో ఇచ్చే పరిహారం ఖర్చయిపోతే, లేదా పిల్లలు లాక్కుంటే తల్లిదండ్రులు దిక్కులేని వారిగా మారతారు. – లక్ష్మి, దండికుప్పం -
సాక్షిని అణగదొక్కాలని కుట్ర
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాను అణగదొక్కాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కేఎన్ఆర్పై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమన్నారు. ఎక్కడైన షో నిర్వహించిన జర్నలిస్టును అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సాకుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. మాజీ సీఎం భార్యపై సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేసిన పోస్టుల పై చర్య లేదన్నారు..? జగనన్న పాలనలో పార్టీలకతీతంగా పథకాలు అందించారన్నారు. అప్పుడు లబ్ధి పొందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేత వైఎస్సార్సీపీ వారి మీద కూటమి నాయకత్వం దాడుల చేయిస్తోందన్నారు. బాబు ఏడాది పాలనలో విచ్చలవిడిగా మద్యం ఎరులై పారుతోందన్నారు. టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు వెళుతోందన్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ మహిళపై చులకనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. -
మద్దతు ధరతోనే మామిడిని కొనాలి
– పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశాలు తవణంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను విధిగా రైతులకు అందించేలా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు పనిచేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలోని జీసీఆర్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఎంఓఎఫ్పీఐ, ఫీల్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజ్జు ఫ్యాక్టరీని, సిద్ధార్ధ, ఎఫ్3 గుజ్జు ఫ్యాక్టరీలను కలెక్టర్ తనిఖీ చేశారు. బంగారుపాళ్యం హార్టికల్చర్ అధికారి సాగరిక ఫ్యాక్టరీ యజమానులు ధరను నిర్ణయించడంలేదని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ.. తోతాపురి రకానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను విధిగా అమలు చేయాలని ఫ్యాక్టరీ యజమానులకు దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్టరీ యజమానులు మామిడికి మద్దతు ధరను అమలు చేసి రైతులు, అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద విధులకు కేటాయించిన సిబ్బంది తోతాపురి మామిడి రైతుల పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్తో పాటు తవణంపల్లె తహసీల్దార్ సుధాకర్, అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతల అగచాట్లు
గంగాధర నెల్లూరు : మండలంలోని మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ గేట్ల వద్ద ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు వేచి చూసినా టోకెన్లు దక్కని రైతుల ఆవేదన పట్టించుకునే వారేలేరు. కనీస సదుపాయాలు కూడా కల్పించని యాజమాన్యం ఎరట్రి ఎండలోనే నడి రోడ్లపైన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే లైన్లో ఉండగా 10 గంటల సమయంలో కొందరు సెక్యూరిటీ గార్డులు వచ్చి ఈ రోజు టోకెన్లు ఇవ్వడం కుదరదు అందరూ వెళ్లిపోండి అంటూ అక్కడ నుంచి పంపేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తర్వాత 80 మందికి టోకెన్లు ఇచ్చి మిగతా వారిని తరిమేశారు. కాగా ప్రభుత్వం తోతాపూరి రకం మామిడిని ఎనిమిది రూపాయలకు కొనమని మార్గదర్శకాలు విడుదల చేయగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం 6, 7 రూపాయలకే కొంటున్నారని సమాచారం. వే బ్రిడ్జి వద్ద తూకం అవ్వగానే ఆరు ,ఏడు రూపాయలకే కొంటున్నట్లు సంతకాలు సేకరించి ఆ తర్వాత రైతు పేరు మామిడి కాయల బరువు మాత్రం రసీదు ఇచ్చి పంపించడం పై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని రైతులు నిలదీశారు. కర్మాగారం యాజమాన్యం స్పందిస్తూ ఫాక్టరీ రోజుకు 70, 80 టోకెన్లు మాత్రం ఇవ్వగల సామర్థ్యం కలదని, వందలాది రైతులు వస్తుంటే తామేంచేయ్యాలిఅని అన్నారు. జిల్లా అధికారులు యాజమాన్యాలతో చర్చలు జరిపి మామిడి రైతులను ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. -
తోతాపురి కొనుగోలు
గుడిపాల : తోతాపు రి కాయలు మాకొద్ద ని మండలంలోని తాసా జ్యూస్ ఫ్యాక్ట రీ యాజమాన్యం చె ప్పడంతో బుధవా రం అధికారులు స్పందించారు. దీంతో రెవెన్యూ డివిజి నల్ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ జయంతి ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించి వారితో సంప్ర దింపులు జరిపారు. తోతాపురి మామిడి కాయల ను కొనుగోలు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో ప్రతి రోజు 50 పర్మిట్లు తీసుకుంటామని వారికి తెలియజేశారు. వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఫ్యాక్టరీలో నియమించి టోకెన్ల ప్రక్రియను ప్రారంభించారు. దశల వారీగా ఎక్కువగా పర్మిట్లు అందజేయనున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలియజేసింది. -
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
కూటమి పాలనలో సర్కారు బడుల్లో చదువు గాల్లో దీపంలా మారింది. వేసవి సెలవులు అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత, బదిలీలు పూర్తి కాకపోవడంతో గందరగోళ పరిస్థితి, పునఃప్రారంభం రోజు అందజేసే విద్యా మిత్ర కిట్లు అరకొరగా చేరడం, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో వెలుగు వెలిగిన సర్కారు బడులు ప్రస్తుతం కూటమి పాలనలో అస్తవ్యస్తంగా మారాయి. నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం.చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడులు కూటమి పాలనలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ సర్కారులో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత కూటమి పాలనలో ప్రశ్నార్థకంగా మారింది. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటాడుతున్న సమస్యలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.ఆరుబయటే చదువులుజిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో నాడు–నేడు పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలోని వేలాది పాఠశాలల్లో మౌలిక వసతులు కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో మొదటి విడత నాడు–నేడులో 1533 పాఠశాలల్లో రూ.354 కోట్లతో, రెండో విడతలో 1183 పాఠశాలలు, 30 జూనియర్ కళాశాలల్లో రూ.424 కోట్లతో పనులు చేపట్టారు. రెండో విడతలో నిర్వహిస్తున్న పనులను కూటమి సర్కారు నిలిపివేయడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రమే పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పలు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేక ఆరుబయట చదువులకు స్వాగతం పలికే పరిస్థితి నెలకొంది.బదిలీలు పూర్తికాకముందే..ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత నెల రోజులుగా టీచర్లలో అన్ని కేడర్లకు బదిలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజుకు టీచర్ల కొరత లేకుండా చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆర్భాటంగా గొప్పలు చెప్పారు. అయితే ఆ మాటలు ఒట్టిమాటలేనని తేలిపోయింది. ఇప్పటి వరకు డీఎస్సీ పరీక్షలు, బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. జిల్లాలో ఇంకా 3 వేలకు పైగా ఎస్జీటీ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ టీచర్లు బదిలీ అయినప్పటికీ వారిని రిలీవ్ చేయని పరిస్థితి. మరికొన్ని పాఠశాలల్లో టీచర్లు బదిలీలు అయినప్పటికీ రిలీవర్ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని దుస్థితి. అదే విధంగా వేల మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభం రోజున పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక బోసిపోవాల్సిన దుర్భర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.పబ్లిసిటీ ఫుల్..సరఫరా అంతంతే..జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తొలిరోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో స్టూడెంట్స్ కిట్లు అందజేస్తామని కూటమి గొప్పలు చెప్పింది. అందుకు అవసరమైన పబ్లిసిటీని చేసుకుంది. అయితే ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆ కిట్లను చేర్చలేక విఫలం అయ్యింది. జిల్లాలోని 2462 పాఠశాలల్లో చదువుతున్న 148430 విద్యార్థులకు, నూతనంగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో కిట్లను సరఫరా చేయకుండా అరకొరగా పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, బ్యాగులు, యూనిఫాం అరకొరగా వచ్చాయి. షూలు ఒక్కటీ అందలేదు.విద్యార్థులకు అందించే కిట్ వివరాలుకిట్లోని వస్తువులు పంపిణీ చేయాల్సినవి ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవిపాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ 1587618 1571868 15750బ్యాగులు 144400 126604 17796యూనిఫాం 144400 67800 76600బెల్టులు 103563 103563 –షూస్ 144189 00 1441896 వ తరగతి డిక్షనరీలు 12771 12771 –1వ తరగతి డిక్షనరీలు 24728 24728 –నోటు పుస్తకాలు 836872 836872 –కార్పొరేట్కు అనుకూలంగా కూటమికూటమి సర్కారు సర్కారు బడులను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. గత ప్రభుత్వం సర్కారు బడులకు అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేట్ బడులను బలోపేతం చేస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజున పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఇవ్వకపోవడం సర్కారు వైఫల్యమే. అదే విధంగా గత సర్కారు నిర్వహిస్తున్న నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. – సద్ధాం,స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్, చిత్తూరు జిల్లా -
ప్రతి మండలానికి పీఎం ‘సూర్యఘర్’
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ప్రతి మండలానికి 500 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, పీఎం సూర్యఘర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అర్బన్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెక్షన్ పరిధిలో రోజు 20 మంది వియోగదారులకు వీటిపై ప్రచారం చేయాలన్నారు. నెలకు 300 యూనిట్లు దాటిన ఓసీ, బీసీ వినియోగదారులపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. బీసీలకు ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు సబ్సీడీ ఇస్తోందని వీటిపై అవగాహన కల్పించాలన్నారు. సూర్యఘర్ నమోదును ఆన్లైన్లో చేయించి వెండర్లతో అనుసంధానం చేయించాలన్నారు. జిల్లాలో 3,200 వ్యవసాయ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, టెక్నికల్ ఈఈ జగదీష్, ఏఓ ప్రసన్న ఆంజనేయులు డీఈలు ప్రసాద్, ఆనంద్ పాల్గొన్నారు. -
ఎస్జీటీ బదిలీల్లో రగడ
● స్పౌజ్ పాయింట్లపై రచ్చ ● అధికారుల ఎదుట ఓ టీచర్ ఆత్మహత్యాయత్నం ● డీఆర్ఓను చుట్టుముట్టిన టీచర్లు ● బందోబస్తు నడుమ కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్జీటీ కౌన్సెలింగ్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో కొందరికి న్యాయం..మరికొందరికి అన్యాయం చేశారు. విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ టీచర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఎస్జీటీ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ల విషయంలో వివాదం తలెత్తింది. మంగళవారం రాత్రి, బుధవారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో 204 సీరియల్ నంబర్ లోపు ఉన్న చాలా మంది టీచర్లకు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో స్పౌజ్ పాయింట్ల విషయంలో నష్టం జరుగుతోందని ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటానని భయాందోళన సృష్టించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ఆపివేశారు. ఇష్టానుసారం మార్పులు బదిలీల్లో స్పౌజ్ పాయింట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఇద్దరు భార్యభర్తలు ఎస్జీటీలుగా ఉండి తప్పనిసరి బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే స్పౌజ్ నిబంధనల కింద సీనియారిటీ జాబితాలో ముందు ఉన్న వ్యక్తి స్పౌజ్ కు అర్హులైతే తరువాత ఉన్న స్పౌజ్ ఎక్కడికి బదిలీ అవుతారో తెలియదు కాబట్టి జిల్లాలో ఎక్కడైనా కోరుకునే అవకాశం కల్పించాలి. అయితే 8 ఏళ్లు పూర్తి అయిన స్థానంనే పరిగణలోకి తీసుకుని తిరిగి అక్కడే కోరుకోవాలనే వింత నిబంధనను అమలు చేశారు. ఈ నిబంధనతో చాలా మంది టీచర్లు నిరాశ, ఆవేదనకు గురవుతున్నారు. కుప్పంలో పనిచేస్తున్న ఇద్దరు భార్యభర్తలను తిరిగీ కుప్పంలోనే కోరుకోవాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సబబు అని బాధితులు ప్రశ్నించారు. స్పౌజ్ పాయింట్లు తీసేయాలని.. ఎస్జీటీల కౌన్సెలింగ్ కేంద్రంలోకి ఉపాధ్యాయ సంఘం నేతలను అనుమతించకుండా పోలీసు బందోబస్తును పెట్టి భయాందోళన సృష్టిస్తున్నారు. జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే గొంతును నొక్కేసి బదిలీల ప్రక్రియను ఇష్టానుసారంగా, ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల తతంగంలో స్పౌజ్ పాయింట్లు రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని ఎస్జీటీలు మొరపెట్టుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఇష్టముంటే బదిలీ కోరుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చాలా మంది టీచర్లు బదిలీలు కోరకుండానే వెనుదిరిగారు. కూటమి పాలనలో వింత ధోరణిలో నిర్వహిస్తున్న బదిలీల తతంగంపై టీచర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఓను చుట్టుముట్టిన నేతలు బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరిగీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఘటన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో డీఆర్వో మోహన్ కుమార్ ను కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు పంపించారు. డీఆర్వో కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగానే యూటీఎఫ్, వైఎస్సార్టీఎఫ్, ఎస్టీయూ సంఘాల నేతలు, పలువురు బాధిత టీచర్లు న్యాయం చేయాలంటూ డీఆర్వోను చుట్టుముట్టారు. ఆ సమయంలో సంబంధిత టీచర్ల సమస్యలను డీఆర్వో స్పష్టంగా విన్న తర్వాత కలెక్టర్, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాసేపు చర్చలు జరిపిన అనంతరం డీఆర్వో టీచర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
పర్మిట్లకు అగచాట్లు
గుడిపాల : పర్మిట్ల కోసం రైతన్నలు పడిగాపులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా రైతులకు మాత్రం పర్మిట్లు అందడం లేదు. గుడిపాల మండలంలోని తాసా, పుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీలలో రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. మంగళవారం ఏకంగా కలెక్టర్ తనిఖీలు నిర్వహించగా రైతుల పర్మిట్లను కొంతసేపు ఇచ్చి ఆపేశారు. ఆ తరువాత ఇవ్వడానికి కుదరదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన పర్మిట్లకు మాత్రమే తీసుకొని తరువాత పర్మిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. తమిళనాడు ప్రాంతం వారికి ప్రాధాన్యం తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకు ఫ్యాక్టరీ యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడి నుంచి తక్కువ రేటుకు మామిడి దిగుబడి చేసుకోవడంతో ఇక్కడ రైతులను పట్టించుకోవడం లేదు. ఇక్కడ కొనుగోలు చేస్తే రైతుల వద్ద నుంచి రూ.8 కి కొనుగోలు చేయాలి. తమిళనాడు నుంచి వచ్చినట్లయితే రూ. 6కే తమకు వస్తుందని ఫ్యాక్టరీ వారు చెబుతున్నారు. – రైతుల వద్ద నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని ఉద్యానవనశాఖ ఏడీ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం గుడిపాలలోని పుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. యాజమాన్యంతో చర్చించి అధికంగా పర్మిట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందొద్దని ఆయన హామీ ఇచ్చారు. -
సోషల్ వెల్ఫేర్ డీడీగా విక్రమ్కుమార్రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులైన విక్రమ్కుమార్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం డీడీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో అడ్మిషన్ల పెంపు, ఎస్సీ వసతి గృహాల బలోపేతానికి పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. అనంతరం నూతన డీడీని ఆ శాఖ సూపరింటెండెంట్ మురుగేశ్, సూర్యప్రకాష్, అశోక్, గౌతమ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
మండీల్లో మామిడి కొనుగోళ్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ర్యాంప్, మండీల నిర్వాహకులు ఇకపై మామిడిని కొనుగోలు చేసుకోవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ర్యాంప్, మండీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ర్యాంప్, మండీల నిర్వాహకులు తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ ఏడీ వద్ద ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే మామిడిని కొనుగోలు చేయాలన్నారు. రైతుల నుంచి ఎన్ని టన్నులు కొనుగోలు చేశారు..రైతుల పేర్లు, మామిడీ లారీలు ఏ కంపెనీకి, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనే అంశాలను తప్పనిసరిగా సేకరించాలన్నారు. ప్రాసెసింగ్ కంపెనీలు రూ.8 ప్రభుత్వం తరఫున రైతులకు ప్రోత్సాహకంగా రూ.4 తప్పనిసరిగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాంప్, మండీల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. సమావేశంలో జేసీ విద్యాధరి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి అల్ట్రాపాస్ట్ సిమెంట్
గుడిపాల : నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రాపాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్ధ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. బుధవారం గుడిపాల మండలంలోని బొమ్మసముద్రంలో కనక మహాలక్ష్మి ట్రేడర్స్ మనోజ్కుమార్, సునీల్, సుధీర్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి మాట్లాడుతూ.. జర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి అల్ట్రా పాస్ట్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంఫర్ ఫ్రూప్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంట్కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా పాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాఫీ మేస్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
చౌడేపల్లె : ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకొస్తే ఎవరూ ఉండరెందుకు ? ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోండి అంటూ మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు , సిబ్బంది తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ గాజుల రామ్మూర్తి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. గత నెల 16 వతేదీ పి.రెడ్డి ప్రసాద్ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొస్తే వైద్య సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో మదనపల్లెకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలించారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెల్త్ కార్డుల కోసం ప్రజల నుంచి ఎంత మంది వద్ద ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి జారీ చేయించారో చెప్పాలని నిలదీశారు. వేరుశనగ విత్తన కాయలు ఒక్కో రైతుకు ఒక బస్తా ఇస్తే ఏమి చేయాలి , కొన్ని గ్రామాల్లో రైతులకు ఒక్కరికీ విత్తన కాయలు ఇవ్వకుండా పంపిణీ చేయడం ఏమిటని వ్యవసాయ శాఖ సిబ్బందిపై సభ్యులు మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు చూస్తే గుండె జల్లు మంటోందని ట్రాన్స్కో అధికారులకు సభ్యులు మొరపెట్టుకొన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆచరణలో పాటించడంలేదని, గత ప్రభుత్వంలో పంచాయతీల వారీగా కేటాయించిన చెత్త బుట్టలు, తడి పొడి చెత్త సేకరణకు వీలుగా మండలానికి సుమారు 16 వేలు బుట్టలు వచ్చాయని వాటిని పంపిణీ చేయకుండా కార్యాలయాల్లో నిల్వ ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. పందిళ్లపల్లె పంచాయతీలో ఒక్కరికీ కూడా బుట్టలు పంపిణీ చేయలేదని నిలదీశారు. కాగా సమావేశానికి ఇరిగేషన్, హార్టికల్చర్ , ఆర్టీసీ, సిరికల్చర్, మత్స్యశాఖ అధికారులు డుమ్మాకొట్టారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నివేదిచాలని ఎంపీడీఓను సభ్యులు కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, ఎంపీడీఓ లీలామాధవి, తహసీల్దార్ హనుమంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
– దంపతులకు గాయాలు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ నిత్య బాబు కథనం మేరకు... ఐరాల మండలం మామిడి గుంట పల్లెకు చెందిన రాజేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూర్ణిమ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలకు పుస్తకాలు యూనిఫాం కొనడానికి చెర్లోపల్లి నుంచి చిత్తూరు వైపు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటర్ను ఢీకొట్టగా రాజేష్ పూర్ణిమతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో రాజేష్ దంపతుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని రాణి పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లలకు స్వల్ప గాయాలు తగలగా వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే స్కూటర్ పై నలుగురు ప్రయాణించడం డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. గ్రానైట్ లారీలు సీజ్ చౌడేపల్లె: అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా గ్రానైట్ను తరలిస్తున్న రెండు లారీలను రీజినల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ బుధవారం సీజ్ చేశారు. చౌడేపల్లె వైపు నుంచి పుంగనూరు వైపునకు గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఇసుక లారీని సీజ్ చేసి జరిమానా విధించినట్లు సమాచారం. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీ్స్ స్టేషన్కు అప్పగించారు. గ్రానైట్, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న ఐచర్
– రైతు మృతి, మరో వ్యక్తికి గాయాలుబంగారుపాళెం : మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ట్రాక్టర్ను ఐచర్ వాహనం ఢీకొన్న సంఘటనలో యాదమరి మండలానికి చెందిన ఓ రైతు మృతి చెందగా, మరోవ్యక్తి గాయపడినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలం సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు మణిరెడ్డి తన సొంత ట్రాక్టర్లో మామిడి కాయలను బంగారుపాళెం మామిడి మార్కెట్కు తీసుకొచ్చాడు. మండిలో కాయలను అన్లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్పై బలిజపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డితో కలసి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను నలగాంపల్లె అండర్ బ్రిడ్జి సమీపంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మణిరెడ్డి (60) రోడ్డుపై పడిపోవడంతో ఐచర్ వాహనం తలపై దూసుకుపోయింది. ఈ ఘటనలో మణిరెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంకటేశ్వర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సర్వర్ పరేషన్
● పది రోజులుగా పనిచేయని సర్వర్ ● రేషన్కార్డు దరఖాస్తుకు బ్రేకులు ● లక్షల్లో దరఖాస్తులు..అరకొరగా నమోదు ● విమర్శలతో కదిలిన ప్రభుత్వం ● దరఖాస్తుకు మళ్లీ అవకాశం పనిచేయని సర్వర్రేషన్కార్డు దరఖాస్తుకు వేచి ఉన్న లబ్ధిదారులు (ఫైల్) కాణిపాకం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను ఊరిస్తూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దరఖాస్తు ప్రక్రియలో ఎదురువుతున్న ఇబ్బందులు చుక్కలు చూపుతున్నాయి. రేషన్ కార్డు దరఖాస్తు గడువు ఈనెల 9వ తేదీతో ముగిసింది. అయితే గడువును పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ నేటికీ సాఫ్ట్వేర్లో నిబంధనలు మార్చకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సాఫ్ట్వేర్లో నిబంధనలు సరళతరం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.అతికష్టం మీదుగా దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన కొద్ది రోజులకే సర్వర్ డౌన్తో అగచాట్లు తప్పలేదు. మళ్లీ రేషన్కార్డు దరఖాస్తుకు ప్రభుత్వం గడువు పొడిగించినా క్షేత్రస్థాయిలో సర్వర్ పనిచేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడంలేదు. గత నెల వరకు రేషన్ కార్డుల వివిధ సమస్యల నిమిత్తం మొత్తం 39791 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డులో చిరునామా మార్పునకు 841, ఆధార్ అనుసంధానం సరి చేసుకునేందుకు 532, షాపు రెన్యూవల్ 14, సభ్యుల చేర్పునకు 30464, సభ్యుల తొలగింపు 672, కొత్త రేషన్ కార్డుకు 3926, స్ప్లిట్ కార్డు దరఖాస్తుకు 3301, సరెండర్ రేషన్కార్డు 41 దాకా వచ్చాయి. అయితే దరఖాస్తు ప్రక్రియలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సాఫ్ట్వేర్లో మార్చాల్సిన అవసరం ఉందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్యలు ఇవీ.. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు ఉన్నప్పుడు కొడుకుకు పెళ్లయి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మొదట భార్య పేరును ఈ కార్డులోకి మార్పించుకోవాలి. తరువాత 21 రోజులకు కొడుకు, కోడలకు ప్రత్యేకంగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరికి పిల్లలు పుడితే ఆ పిల్లలను వీరి కార్డులోకి ఎక్కించుకోవాలంటే మరో 21 రోజులు గడువు ఉంటుంది. ఈ విధంగా ఒక పేరు కార్డులో నమోదు కావాలంటే రోజుల తరబడి గడువు ఉంటే ఈ లోగా దరఖాస్తు గడువు ముగుస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉంటే కూతురుకు పెళ్లయి వారికి వేరే కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నప్పుడు ఈ కార్డులో కార్డుదారుని కూతురు స్థానంలో కోడలు అని నమోదు అయినా, కోడలు స్థానంలో కూతురు అని నమోదైనా.. కార్డుదారుడికి సంబంధించి బంధుత్వంలో తేడాలు ఉంటే వారి పేరు తొలగించడానికి కుదరటం లేదు. ● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉన్నప్పుడు ఉదాహరణకు రేషన్కార్డులో కార్డుదారుని కోడలుకు సంబంధించి కోడలు అని కాకుండా ఎన్ఏ అని ఉంటే కోడలు పేరు కార్డులో నుంచి తొలగించలేకపోతున్నారు. ● భార్యాభర్తకు కొత్త రేషన్కార్డు కావాలన్నప్పుడు వారి ఆధార్ కార్డులో స్థానికంగా కాకుండా వేరే అడ్రసు ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతేకాక ఇంటి మ్యాపింగ్ జరగడం లేదని లబ్ధిదారులు వాపో తున్నారు. ఆధార్ కార్డులో చిరునామాలు సక్రమంగా ఉంటేనే ఇంటి మ్యాపింగ్ అవుతుందని, ఇంటి మ్యాపింగ్ అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. ఆధార్లో చిరునామాల తేడా కారణంగా పాత కార్డు నుంచి వీరి పేర్లు తొలగించినా ఇంటి మ్యాపింగ్ కావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ● రేషన్కార్డు దరఖాస్తులో కరెంటు బిల్లు అధికంగా వచ్చినా కొత్త కార్డుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ కరెంటు బిల్లులు తప్పులు వచ్చి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా తప్పులు సరిచే సుకున్నా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు నెలరోజుల సమయం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● రేషన్ కార్డు ఎవరిపేరు మీద ఉంటుందో ఆ కార్డుదారుడు మళ్లీ కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. వీఆర్ఓల అందుబాటులో లేకపోవడం రేషన్ కార్డులు మంజూరులో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చాలా మండలాల్లో రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక రెవెన్యూ అధికారి ఉండటంతో అతని కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారి దరఖాస్తుపై సంతకం చేస్తేనే డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్లో మార్పులు చేయకపోవడం సాఫ్ట్వేర్ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి ఎటువంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాక కొత్త రేషన్కార్డుల నమో దుపై గ్రామ సచివాలయ అధికారులకు అవగాహన కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో చాలామంది దరఖాస్తు నమోదులో సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇతర అధికారులపై ఆధార పడాల్సి వస్తోంది. రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు.. సైట్లో కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అందుకే సర్వర్ డౌన్ అయింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు అనేది లేదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆందోళన వద్దు – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు -
అక్రమ గ్రా‘నైట్’ ..రైట్ రైట్
● పెద్దిశెట్టిపల్లిలో అక్రమ క్వారీ ● రోజుకు రూ.3 లక్షలు విలువ చేసే గ్రానైట్ తరలింపు ● యథేచ్ఛగా తమిళనాడుకు రవాణా ● అక్రమార్కులతో కుమ్మకై ్కన అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీ తవ్వకాలు జోరందుకున్నాయి. కూటమి నేతలు విలువైన గ్రానైట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం మాదే..అడ్డుకునేది ఎవరంటూ..యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టారు. రెండు నెలలుగా ఈ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో జోగుతూ...అక్రమ గ్రానైట్కు రైట్..రైట్ చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకూ రూ. 3 లక్షలు విలువ చేసే గ్రానైట్ బండలు యథేచ్ఛగా పెద్దిశెట్టిపల్లి నుంచి గుడిపాల మీదుగా తమిళనాడుకు తరలుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అనుమతి లేకుండా ఎలా క్వారీ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే..నోరు మెదపడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నియంత్రించాలని వారు కోరుతున్నారు. -
‘అయ్యో’ర్ల పడిగాపులు
● రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్ ● ఉదయం నుంచి ఎదురుచూస్తున్న టీచర్లు ● రాత్రి 9.20 గంటలకు సీనియారిటీ జాబితా విడుదల ● కౌన్సెలింగ్ కేంద్రంలోకి సంఘం నేతలకు నో ఎంట్రీ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల నుంచి విచ్చేసిన ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రా త్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌ న్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకా రం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారు లు చర్యలు చేపట్టారు. పలు మండలాల నుంచి హాజరైన టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితా ను విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో సమగ్ర సీ నియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు 350 వరకు మాత్ర మే జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోవడంతో ఎస్జీటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు. సంఘం నాయకులకు నో ఎంట్రీ కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా సంఘం నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన సంఘం నాయకులు ఉద్దేశపూర్వకంగా అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
● కొనేలేమంటున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు ● అధికారులకు ఫిర్యాదుల వెల్లువ ● రూ.8కు కొనుగోలు చేయాలని అధికారుల ఆదేశం
చిత్తూరు రూరల్(కాణిపాకం) : కూటమి ప్రభుత్వం తోతాపురికి గిట్టుబాటు ధర కల్పించామని ఊదరగొడుతోంది. తోతాపురి కిలోల రూ.8కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పుకుంది. అయితే ఆచరణలో తోతాపురి నిర్ణయ ధర అమలుకు నోచుకోవడం లేదు. రూ. 8కే కొనుగోలు చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు తోతాపురి కిలో రూ. 8కే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కిలోకు రూ.4 ఇస్తామని వెల్లడించింది. దీంతో కూటమికి చెందిన రైతు నాయకులు సంబరపడిపోయారు. మంగళవారం తోతాపురి కిలో రూ.5కు కొనుగోలు చేయడంతో రైతులు మండిపడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ. 5 కంటే ఎక్కువ కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తోంది. దీంతో కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఫ్యాక్టరీలు సిండికేట్? జిల్లాలోని ఫ్యాక్టరీలు సిండికేట్ అయిందనే వాదనలు గట్టిగా వినిపిస్తోంది. దీంతో తోతాపురి కాయలను ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ, విద్యాశాఖ మంత్రుల దృష్టికి ఈ వారంలో తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ఏకమయ్యారు. మార్కెట్కు 300 టన్నుల కాయలు చిత్తూరు నగరంలో మార్కెట్కు 300 టన్నుల మామిడి కాయలు వచ్చాయి. 200 బేనీషా రాగా మిగిలిన 100 టన్నులు వివిధ రకాల టేబుల్ రకాలు వచ్చినట్లు ట్రేడర్లు అంచనా వేశారు. అయితే బేనీషా ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. తోతాపురి (టేబుల్ రకం), చందూర, ఇమామ్ పసంద్, కాలేపాడు తదితర రకాల ధరలు సాధారణంగానే ఉన్నాయి. చిత్తూరు మామిడి కాయల మార్కెట్లో కాయలను ప్యాకింగ్చేస్తున్న కూలీలు మామిడి ధరలు ఇలా రకం కిలో ధర (రూ.లలో) తోతాపురి 5 బేనీషా 13–23 మల్లిక 12–25 తోతాపురి (టేబుల్రకం) 11–14 రకం కిలో ధర (రూ.లలో) అల్పోన్సో 20–25 కాలేపాడు 20–40 చందూర 5–13 చక్కెర గుత్తి 60–70 ఇమామ్ పసంద్ 40–70 -
అలమటించిన అన్నదాత
గంగాధర నెల్లూరు : మామిడిని రైతుల నుంచి కిలో రూ.12లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు బేఖాతర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జీడీనెల్లూరులోని జైన్ కంపెనీ ఎదుట మండుటెండలో కడపు మాడ్చుకుని మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి టోకెన్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు పట్టించుకోలేదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని వందలాది మంది మామిడి రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. మొత్తం 1,100 మంది రైతులు పంట విక్రయానికి దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే టోకెన్లు మంజూరు మిగిలిన వారిని వెనక్కి పంపించేశారు. ట్రాక్టర్లలో మామిడి లోడ్తో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొందరు సిఫార్సులతో టోకెన్ పొందారని, మండటెండలో ఎదురు చూసిన వారికి పక్కనపెట్టేశారని పలువురు ఆరోపించారు. అవస్థలు పడిన మామిడి రైతులు పట్టించుకోని ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు టోకెన్ల కోసం తప్పని సిఫార్సులు -
కూటమి సేవలో పోలీసులు
పలమనేరు : రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని కూటమి నేతల కోసం పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారని మంగళవారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆరోపించారు. సాక్షి టీవీలో అమరావతి అంశంపై డిబేట్లో మాట్లాడిన వారిని కాదని అక్కడున్న జర్నలిస్ట్పై నిందలు మోపి అరెస్ట్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఛానెళ్లు మరీ ఘోరంగా మాట్లాడినా అప్పట్లో ఇలాంటి అక్రమ అరెస్టులు జరిగాయా అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్సిక్స్తో పాటు 147 హామీలను అమలు చేయాల్సిందిపోయి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను ఏ మార్చడం కుదరదన్నారు. జర్నలిస్ట్ కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని సాక్షాత్తు న్యాయస్థానమే తప్పు బట్టిదంటే పోలీసులు ఎంత అత్యుత్సాహంతో రెడ్బుక్ కోసం పాటు పడుతున్నారో సామాన్య ప్రజలకు సైతం బాగా అర్థమవుతోందన్నారు. -
పర్మిట్లకు పడిగాపులు
●తవణంపల్లె : మండలంలోని మామిడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి కాయలు తరలించడానికి పర్మిట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. మండలంలో ఐదు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉండగా ఇప్పటి వరకు రెండు జ్యూస్ ఫ్యాక్టరీలు మాత్రం క్రషింగ్ ప్రారంభించారు. ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి ఫ్యాక్టరీ యజమానులు రైతులకు పర్మిట్లు ఇచ్చి మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నారు. తోతాపురి (బెంగుళూరు రకం) ఫ్యాక్టరీ యజమానులు కిలో రూ.6 ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మామిడి రైతులకు రూ.4 ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న మామిడి రైతులకు ప్రభుత్వం కిలోకు రూ.4 పరిహారం అందిస్తుంది. దీంతో రైతులు జ్యూస్ ప్యాక్టరీల దగ్గర మామిడి కాయలు తోలడానికి పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. -
‘తోతాపురి మామిడి మాకొద్దు’
గుడిపాల : తోతాపురి మామిడి కాయలు తమకు వద్దని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం తెగేసి చెప్పింది. గుడిపాల మండలంలోని తాసా జ్యూస్ ఫ్యాక్టరీకి వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించి అధికారులను మంగళవారం నియమించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8, ప్రభుత్వం రూ.4 మామిడికి ధర ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. దీంతో అధికారులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి తోతాపురి మామిడి కాయలు మాకొద్దని అధికారులకే తెగేసి చెప్పారు. తమిళనాడు నుంచి రూ.6 కే డెలివరీ చేస్తున్నారని ఇక్కడ మామిడి కాయలు ఇంకా పక్వానికి రాలేదని అధికారులకు వివరించారు. యాజమాన్యం మాత్రం ప్రస్తుతానికి మేము తీసుకోలేమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతన్నలు ఫ్యాక్టరీ యాజమాన్య నిర్ణయాలపై మండిపడ్డారు.