Chittoor
-
మత్తు మందు చల్లి చైను లాక్కెళ్లారు!
పుంగనూరు: కూరగాయల సంతకు వచ్చిన ఓ వృద్ధురాలిపై మత్తుమందు చల్లి చైను లాక్కెళ్లిన సంఘటన సోమవారం పట్టణంలోని కూరగాయల సంతలో జరిగింది. సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. రామసముద్రం మండలం కొండూరు గ్రామానికి చెందిన సరోజమ్మ సొంత పనుల నిమిత్తం పుంగనూరుకు వచ్చి సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమైపె మత్తుమందు చల్లారు. ఆమె ఏమి తెలియని స్థితికి వెళ్లిపోవడంతో చైనులాకెళ్లి పరారయ్యారు. ఆమె స్పృహలోనికి వచ్చి లబోదిబో మంటు కేకలు వేయడంతో స్థానికులు ఆమెను తీసుకెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. సుమారు 34 గ్రాములు బంగారు చైనును లాకెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ నిందితుల ఆచూకీ కోసం సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పుంగనూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పుంగనూరు మండలంలోని చిన్నతాండా గ్రామానికి చెందిన బుక్యా విశ్వనాథనాయక్(37) గత వారం శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణ –ఇద్దరికి గాయాలు వెదురుకుప్పం: మండలంలోని వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామంలో సోమవారం జరిగిన పరస్పర దాడుల్లో ఇరువురికి గాయాలైనట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామానికి చెందిన రాజవేలు అదే గ్రామానికి చెందిన కన్నయ్య వద్ద రూ.3.50 లక్షలు అప్పు చేశాడు. సోమవారం అప్పు ఇస్తానని ఇవ్వలేని పక్షంలో ప్లాట్ రాసిస్తానని గతంలో పంచాయితీ చేశారు. సోమవారం కన్నయ్య వెళ్లి రాజవేలును అప్పు తీర్చమని అడిగాడు. లేని పక్షంలో ప్లాట్ రాసివ్వాలని కోరాడు. దీంతో రాజవేలు అయన అల్లుడు లోకేష్ కలిసి డబ్బుల్లేవు, ప్లాట్ ఇచ్చేది లేదంటూ దూషించారు. దీంతో మాటమాట పెరిగిన ఇరువర్గాల వారు తాటి మట్టలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలై తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయూబ్ఖాన్కు నేషనల్ ఎక్స్లెన్సీ అవార్డు పుంగనూరు: సామాజిక సేవకుడు, అబ్దుల్ కలామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పి.అయూబ్ఖాన్కు సోమవారం నేషనల్ ఎక్స్లెన్నీ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. నూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ బాలకృష్ణన్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అగర్వాల్ చేతులు మీదుగా అవార్డును ఆయన అందుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనందుకు భారత్ మన్చ్ ట్రస్ట్, ఇండియన్ గెలాక్సీ వారు సంయుక్తంగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు అయూబ్ఖాన్ను అభినందించారు. -
ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్బాబు
చిత్తూరు కలెక్టరేట్ : ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.నరేష్బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నరేష్బాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన చిత్తూరు జిల్లా ఖజానా సంఘం ఉపాధ్యక్షుడిగా 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంఘ అడహాక్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన్ని జిల్లా అధ్యక్షుడు చెంగల్రాయుడు, కార్యదర్శి పయణి, కోశాధికారి చలపతి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు. -
డీసీసీబీ చైర్మన్గా అమాస రాజశేఖర్రెడ్డి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు డీసీసీబీ చైర్మన్గా అమాస రాజశేఖర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో కూడా డీసీసీబీగా చైర్మన్గా పదవి అనుభవించారు. ఈ పదవిలో 13ఏళ్లుగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీసీసీబీ చైర్మన్ పదవిని మళ్లీ అమాస రాజశేఖర్రెడ్డే సొంతం చేసుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే చిర్రెత్తిపోతున్నారు. అమాస రాజశేఖర్రెడ్డికి పదవి కట్టబెట్టడంపై భగ్గుమంటున్నారు. ఈ చైర్మన్ పదవి చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత దొరబాబుకే ఇస్తారని తొలి నుంచి కూటమి నేతలు జోరుగా ప్రచారం చేశారు. పక్కాగా దొరబాబుకే ఇస్తారని ఆపార్టీ నేతలు బల్లగుద్ది చెప్పారు. గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఆ ఆశలంతా ఇప్పుడు అడియాశలయ్యాయి. కూటమి ప్రభుత్వం వారి ఆశలపై ఊహించని దెబ్బకొట్టింది. ఊహించని వ్యక్తి..అందులో గతంలో పనిచేసిన అమాసకు ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదాలపై పెదవి విరుస్తున్నారు. బీరు బాటిల్తో దాడి..వ్యక్తి తీవ్రగాయాలు కార్వేటినగరం: బీరు బాటిల్తో దాడి చేయడంతో వ్యక్తి గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొల్లాగుంట వద్ద ఉన్న మద్యం షాపులో మద్యం తాగడానికి కొటార్వేడు దళితవాడకు చెందిన భారత్రాజ్, అదే గ్రామానికి చెందిన జీవరత్నం, రాజ కలసి ద్విచక్రవాహనంలో వెళ్లి మద్యం కొనుగోలు చేసి, ముగ్గురు కలసి మద్యం తాగడానికి సమీపంలోని కొబ్బరి తోటకు వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో మద్యం తాగుతున్న కొటార్వేడు దళితవాడకు చెందిన వెంకటేష్కు భారత్రాజ్కు మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భారత్రాజ్పై వెంకటేష్ బీరుబాటిల్తో దాడి చేశాడు. దీంతో భారత్రాజ్కు గాయాలయ్యాయి. అలాగే భారత్రాజ్తోపాటు ద్విచక్రవాహనంలో వచ్చి జీవరత్న, రాజ కూడా వెంకటేష్తో కలసి భారత్రాజ్పై దాడికి దిగి గాయపరిచారు. స్థానికులు గుర్తించి అతనిని కార్వేటినగరం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భారత్రాజ్ భార్య కోకిల సోమవారం పోలీసులక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి చిత్తూరు కలెక్టరేట్ : బధిరులు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో బదిరులకు టచ్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బదిరులు (మూగ, చెవిటి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైకల్యం ఉందని నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం రూ.15 వేలు విలువ చేసే 30 టచ్ ఫోన్లను జేసీ చేతుల మీదుగా బదిరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి చిత్తూరు అర్బన్: నగర శివారుల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జె.ధనంజయులు (39), ఆసీఫ్ (35) అనే ఇద్దరు మృతి చెందారు. తాలూక ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. పెనుమూరు మండలం పూనేపల్లెకు చెందిన ఆసీఫ్ కత్తులను గీటురాయి ద్వారా సానా పట్టే వృత్తి చేస్తున్నాడు. నగర శివారుల్లోని మురకంబట్టు వద్ద ఆదివారం తన ద్విచక్రవాహనంలో వెళుతూ, ముందు వెళుతున్న లారీను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్కూటరిస్టు ఆదివారం అర్థరాత్రి తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా సోమవారం చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారిపై అనుప్పల్లె సమీపంలో జె.ధనంజయులు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయం కావడంతో ధనంజయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గ్రానైట్ రాళ్లను లోడ్ చేసే వృత్తి చేస్తున్నాడు. ఈ రెండు కేసులపై ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ కలెక్టర్గా నరేంద్ర పడాల్
– సివిల్స్లో ఆల్ ఇండియా స్థాయి 545 ర్యాంక్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ట్రైనీ కలెక్టర్గా చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన ఆయన రెండో ప్రయత్నంలో సివిల్స్లో ఆల్ ఇండియా 545 ర్యాంక్ సాధించారు. ఆయన సోమవారం ట్రైనీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించారు. -
ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర
బంగారుపాళెం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు. సోమవారం మండలంలోని తగ్గువారిపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిరుపేదలకు వరమన్నారు. ఈ పథకంలోని పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. పేదలకడుపు కొట్టి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం రూ.600 ఇచ్చేలా పోరాటం సాగిస్తామన్నారు. 15 రోజులకు వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో 2 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హక్కులను కాపాడాలని మే నెల 20వ తేదీ చేపట్టనున్న సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మే ఒకటి నుంచి అమలు చేసే ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్కార్డు ఉన్న వారందరికీ అమలయ్యేలా అధికారులు చరలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకరన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పలమనేరు: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఉదయం 10 గంటల నుంచే కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో నిండిపోయింది. రీసర్వే, భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వచ్చాయి. సమస్యలను శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, జేసీ విధ్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, పలమనేరు ఆర్డీఓ భవానీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపాడల్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 436 సమస్యలు గ్రీవెన్స్డేకి మొత్తం 436 వినతులందాయి. వీటిలో భూ ఆక్రమణలు 71, ఆర్ఓఆర్ 53, పట్టాదారు పాసు పుస్తకాలు 41, అసెన్మైంట్లు 14, ముటేషన్లు 10, దారి సమస్యలు 20, సామాజిక పింఛన్లు 39 అర్జీలు అందాయి. మిగిలివన్నీ పలు శాఖలు, వ్యక్తిగత సమస్యలే ఉన్నాయి. కొందరి సమస్యలివీ.. పెద్దపంజాణి మండలం పెనుగొలకలకు చెందిన గుర్రమ్మ తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరింది. పలమనేరు మున్సిపాలిటీకి చెందిన చెంగమ్మ(75) వృధ్యాప్య పింఛన్ కోసం పలుమార్లు అర్జీలిచ్చిన ఎవరూ పట్టించుకోలేదని విన్నవించింది. స్థానిక 17వార్డు ఏప్రిల్ నెల కోటా రేషన్ ఇవ్వలేదని పలువరు మహిళలు అర్జీ ఇచ్చారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. రీసర్వేలో పట్టాభూమి డీకేటీగా నమోదు చేశారని సమస్యను పరిష్కరించాలని తొమ్మిదినెలలుగా గంగవరం రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదని గంగవరం మండలం పత్తికొండకు చెందిన మంజునాథ్ తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోపు సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలమనేరులోని గాంధీనగర్ నుంచి గంటావూరుకు వెళ్లే మెయిన్రోడ్డు ఆక్రమణలకు గురైందని పట్టణానికి చెందిన వెంకట రెడ్డిప్రసాద్ అర్జీ ఇచ్చారు. దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కరెంట్ షాక్ కొట్టడంతో వెన్నుముఖ దెబ్బతిని సగం శరీరం స్పర్శ లేకుండాపోయిందని సదరంలో 91శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చినా వికలాంగ పింఛను రాలేదని ఓ ట్రాన్స్కోలో పనిచేసే కూలి తెలిపారు. ఎక్స్ప్రెస్హైవేకు భూములిచ్చినా ఇంకా అవార్డు పాసు చేయలేదని వి.కోట మండలం తోటకనుమకు చెందిన నవమోహన్రెడ్డి అర్జీ ఇచ్చారు. ఎస్సీలమైన తమ ఇంటిస్థలాల్లోకి రానీయకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారని జగమర్ల వాసులు విన్నవించారు. పలమనేరు నుంచి ఉదయం 4నుంచి 6 దాకా చిత్తూరు వైపు బస్సులేవని దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా చెప్పించినా ఆర్టీసీ నిర్లక్ష్యం చూపుతోందని పలమనేరు పరిరక్షణ సమితి నిర్వాహకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రవికుమార్నాయుడు, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, డీపీఓ సుధాకర్రావు పాల్గొన్నారు. -
ఆశగా వచ్చారు.. నిరాశతో వెళ్లారు!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆశతో వచ్చా రు. అయితే కలెక్టరేట్లో కార్యక్రమం రద్దు కావడంతో ఏమీ చేయలేక నిరాశతో వెనుదిరిగారు. జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు సమస్యల పరిష్కార కోసం సోమవారం కలెక్టరేట్కు విచ్చేశారు. కాగా, కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసి పలమనేరులో నిర్వహించిన విషయం విదితమే. దీంతో మధ్యాహ్నం వరకు పలువురు అర్జీదారులు కలెక్టరేట్లో నిరీక్షించి చేసేదేమి లేక నిరాశగా ఇళ్లకు వెనుదిరిగారు. ఎంఎల్హెచ్పీల సమస్యలు పరిష్కరించాలి కూటమి టీడీపీ ప్రభుత్వం ఎంఎల్హెచ్పీ (మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోషియేషన్) జిల్లా అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం నిమిత్తం ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరవదిక సమ్మె నిర్వహించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సమ్మెలో ఆ సంఘ నాయకులు మమత, రాజేష్, గణేష్, శ్రీవాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. పొలానికి దారి లేకుండా చేస్తున్నారు తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని గంగాధరనెల్లూరు మండలం ముకల్తూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 478/28 లో ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. తాను సైనికుడిగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆ భూమిలోనే పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తన సమస్యను గంగాధరనెల్లూరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా వీఆర్వో, ఎంఆర్ఐ వచ్చి సమస్యను పరిశీలించారన్నారు. అయినప్పటికీ తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడిగా గోవిందస్వామి
చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎం.గోవిందస్వామి (ఎస్జీటీ)ని ప్రకటించారు. సోమ వారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్కుమార్రెడ్డి, సుధీర్ ఈ విషయం వెల్లడించారు. నూతన జిల్లా అధ్యక్షుడు గోవిందస్వామి మాట్లాడుతూ జిల్లాలోని టీచర్లకు ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఏపీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థ ఉపాధ్యక్షులు కండ్లగుంటి బాబు, తదితర ఉపాధ్యాయులు నూతన జిల్లా అధ్యక్షుడిని అభినందించారు. హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మూడు రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు మణితేజ, చంద్రను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో శనివారం పాత కలెక్టరేట్ సమీపంలో చామంతిపురానికి చెందిన మనోజ్పై మణితేజ, చంద్ర కత్తితో దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసు లు నిందితులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. రైలు నుంచి పడి గుర్తు తెలియని మహిళ మృతి కుప్పంరూరల్: బెంగళూరు – చైన్నె రైల్వే మార్గంలో కుప్పం పట్టణానికి సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద సుమారు 55 ఏళ్ల మహిళ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు కుప్పం రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, గళ్లచీర కట్టుకుందని చెప్పారు. ఈమె ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసుస్టేషన్ 9000716436, 9494228854 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
ప్రజాస్వామ్యం..అపహాస్యం
డబ్బు, పదవులకు లొంగని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ● అడ్డదారిలో కుప్పం చైర్మన్గిరి టీడీపీ కై వశం ● ఎదురొడ్డి నిలిచిన తొమ్మిది మంది సభ్యులు ● కొనియాడుతున్న కుప్పం జనం ● నైతిక విజయం వైఎస్సార్ సీపీదే కుప్పంరూరల్: హ్యాట్సాప్ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అని కుప్పం జనం మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రలోభాలు, బెదిరింపులు, దాడులకు వెరవకుండా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప క్షాన నిలిచిన కౌన్సిలర్లకు వందనం..శత వందనం.. మీరే నిజమైన మా నాయకులు అని కుప్పం జనం కొనియాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాగైనా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరిని దక్కించుకోవాలని అధికార పార్టీ మదిలో పడింది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. కుప్పం కౌన్సిల్లో ఉన్న సభ్యులకు బెదిరింపులు, వేధింపులు మొదలు పెట్టింది. మొదటగా నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి సరెండర్ అయ్యారు. తరువాత 2024 నవంబర్లో డాక్టర్ సుధీర్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. అప్పటివరకు ఉన్న కౌన్సిల్ల్లో మార్పులు వచ్చాయి. చైర్మన్ రాజీనామా చేసి వెళ్లిపోగా, సభ్యుల సంఖ్య 24కు చేరింది. నలుగురు టీడీపీ వైపు వెళ్లిపోవడంతో వైఎస్సార్ సీపీకి ఉన్న బలం 19 నుంచి 14కు చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 28న ఎన్నికలు ఖరారు చేసింది. ఖరారు చేసినప్పటి నుంచి అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసింది. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఆశ చూపింది. మరి కొంత మందికి ఉద్యోగం, మరొకరికి ఏకంగా చైర్మన్ పదవే ఆశ చూపారు. వీరి ప్రలోభాలకు నలుగురు ఆకర్షితులు కాగా, మరో ఇద్దరు ఓటింగ్కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ భరత్ పాటు 9 మంది సభ్యులు మాత్రం రూ.లక్షల డబ్బు, ఉద్యోగాలు, పదవులు దేన్నీ లెక్క చేయక వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటమి దరిదాపుల్లోకి వచ్చినా ఎక్కడా వెరవక తమను ఎన్నుకున్న ప్రజలు, పార్టీ తరుఫున నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ దొడ్డిదారి కొంత మంది కౌన్సిలర్లను కొని చైర్మన్ గిరి దక్కించుకోగా, వైఎస్సార్ సీపీ సభ్యులు మాత్రం నైతిక విజయం మాదే అంటు వెనుతిరిగి, కుప్పం జనం మనస్సు గెలుచుకున్నారు. మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ కుప్పం: మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ ఎన్నికయ్యారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీని వాసులరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎ న్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ ఎన్నికల ఓటింగ్లో 22 మంది కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థిగా సెల్వరాజ్ను ప్రతిపాదించగా ఆయనకు 19 వార్డు కౌన్సిలర్ దాము, 20 వ వార్డు కౌన్సిలర్ సోములు సహకరించారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ పార్టీ ప్రకటించగా ఆయనకు 2వ వార్డు సభ్యులు మునిరాజ్, 11వ వార్డు సభ్యురాలు మాధవి ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు సెల్వరాజ్కు 14 మంది చేతులెత్తి తమ మద్దతును పలికారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హఫీజ్కు 9 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. మెజారిటీ టీడీపీకే ఉండడంతో కుప్పం మున్సిపల్ చైర్మన్గా 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ఎన్నికయ్యారు. సోమవారం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేమండల సచివాలయం వద్ద చైర్మన్ ఎన్నిక సందర్భంగా బందోబస్తు సోమవారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, అడ్డదారుల్లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడాన్ని కుప్పం ప్రజలు జీర్ణించుకోవడం లేదు. సోమవారం ఒక ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నారు. 18 మంది కౌన్సిలర్ల బలం స్పష్టంగా ఉన్నా ఓడి పోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మరికొంత మంది అంటున్నారు. దమ్ముంటే తమవైపునకు తిప్పుకున్న కౌన్సిలర్లను రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించుకుని చైర్మన్ ఎన్నికలకు వెళ్లాల్సిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. అధికారాన్ని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలుచుకునే బదులు ఎన్నిక లేకుండా వారే చైర్మన్ను ప్రకటించుకుంటే సరిపోయేదంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, నియంతల పాలనలో జరిగినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. కుప్పంలో 144 సెక్షన్తో బోసిపోయిన రోడ్లువీళ్లే మా నేతలు అంటున్న జనం ఎలాంటి ప్రలోభాలకు లొంగక చివరి వరకు పోరాడిన వీరే తమ నాయకులని ఆయా వార్డు జనం అంటున్నారు. తమ విలువైన ఓటు వేసి గెలిపించినందుకు తమకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు. ఇతరుల మాదిరిగా వ్యక్తిగత ప్రయోజనాలకు పోకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నడుచుకున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల వెంటనే తాము ఉంటామని జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి వీరిని నాయకులుగా ఎన్నుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దుర్మార్గం ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీని బలహీనపరచాలన్న దురాలోచనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తు న్నారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉపఎన్నికపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేకపోయినా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఆరుగురు కౌన్సలర్లతో కు ప్పం మున్సిపాలిటీని ఎలా కై వసం చేసుకోగలదని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవుతారన్న భయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిని రూ.50లక్షలతో కొనుగోలు చేసినట్టు ఆరోపించారు. కేవలం పది నెలల పదవీ కాలం మాత్రమే ఉన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబు ఇంతటి అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వంలో చేరడానికి వస్తే చేర్చుకునే ప్రసక్తేలేదని చంద్రబాబు నీతులు ఒలకబోశారని గుర్తుచేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ వైపు తిప్పుకుని ఉంటే తమ పార్టీనే చైర్మన్ పదవి చేపట్టి ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీకి మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనేసి గెలుచుకున్నామంటూ గొప్పలు చెప్పు కోవడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అరాచకాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చర్చ నామ మాత్రమే ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సమస్యల తాండవం ● నేడు జెడ్పీలో మూడో సర్వ సభ్య సమావేశం
ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామన్న కూటమి నేతలు అభివృద్ధిని మరిచారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాను సమస్యలు వేధిస్తున్నాయి. స్థానిక సంస్థల ను నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో జనం పాలకా.. ఏమిటీ ఏలిక అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న 3వ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనైనా వీటిపై దృష్టి సారిస్తారోలేదో చూడాల్సి ఉంది.నియోజకవర్గాల్లో సమస్యలిలా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కుప్పం: నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువయ్యా యి. శాంతిపురం మండలంలో 15 ఎకరాలు, కుప్పం మండలం పెద్దవంక సరిహద్దులో అటవీ భూములు, ఇదే మండలంలోని బొగ్గుపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తిరుపతి: నియోజకవర్గంలో 8 చెరువులు, 395.71 ఎకరాల్లో 20 శాతం భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. నగరి: నియోజకవర్గంలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎక్కువగా అంతరాయం కలుగుతోంది. నిండ్ర నేటమ్స్ షుగర్స్ మూతపడటంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సువర్ణముఖి నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున 800 నుంచి 900 ట్రాక్టర్లు, 150 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గంగాధరనెల్లూరు : నియోజకవర్గంలో అధికార పార్టీ భూ కబ్జాలు ఎక్కువయ్యాయి. పేదలందరికీ ఇళ్ల పురోగతికి కూటమి సర్కారు నిధులు ఇవ్వడం లేదు. పూతలపట్టు : నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. సత్యవేడు : నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు రాకపోకలకు అవస్థ పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం పడకేసింది. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పురోగతికి నోచుకోని పక్కా గృహాలు చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్:ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా వాటిని పరిష్కరించడంలో కూటమి సర్కారు అలసత్వం వహిస్తోంది. దీనికితోడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 14 నియోజకవర్గాల్లోని 66 మండలాల్లో గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే వారికి కూటమి ప్రభుత్వం అధికారాలు లేకుండా నిర్వీర్యం చేసింది. దీంతో అభివృద్ధి కుంటుపడింది. అద్భుతాలు చేస్తామన్నారు...అభివృద్ధి మరిచారు మా పాలన వస్తే అద్బుతాలు చేస్తాం.. ప్రతి రంగంలోని సమస్యలను పరిష్కరిస్తామం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామంటూ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాన్లు చెప్పిన మాటలివి. వారు చెప్పిన మాటలు 11 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కటీ నెరవేరలేదు. పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.300 కోట్లుకు పైగా పేరుకుపోయాయి. గడిచిన 11 నెలలుగా బకాయిలను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం విడుదల చేయకపోవడంతో ఆరోగ్య సేవలు దూరమయ్యాయి. కరువు పరిహారం శూన్యం గతేడాది వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 43,174 హెకార్టులు కాగా, సాగు విస్తీర్ణం 13,044 హెక్టార్లు ఉంది. ఇందులో 9 వేల హెక్టార్లలో పంట నష్టం కలిగింది. ఇందుకు రూ.15.42 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అందలేదు. జెడ్పీటీసీ సభ్యుల వేతనాలు లేవ్ జెడ్పీటీసీ సభ్యులకు వేతనాలు మంజూరు చేయడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. దీంతో కూటమి సర్కారు వారికి వేతనాలను మంజూరు చేయకుండా కుట్రలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ సభ్యులకు దాదాపు రూ.43 లక్షల వరకు జీతాలు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ట్రాన్స్కో సేవలు తిరుపతి నుంచే.. జిల్లా విద్యుత్శాఖ కార్యాలయం చిత్తూరులో ఏర్పాటు చేసినా ఇంకా తిరుపతి జిల్లా నుంచే సేవలు అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటై 6 నెలలవుతున్నా తిరుపతి నుంచి ఇంకా 15 మంది ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంది. కష్టాల ఆస్పత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి కష్టాల ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడికి చికిత్స కోసం వెళ్లే ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోగా ఆరోగ్యం మరింతగా క్షీణించి అనారోగ్యం పాలవుతున్నారు. వందల సంఖ్యలో ఓపీలు వస్తున్నా సేవలు మాత్రం శూన్యం. వైద్యుల పోస్టులు ఖాళీ, ఉన్న సీనియర్ వైద్యులు సమయపాలన లేమితో రోగులు ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే జంకుతున్నారు.పెండింగ్లో రహదారుల బిల్లులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.84 కోట్లకు పనులు చేపట్టారు. అందులో రూ.26 కోట్లు మాత్రమే ఇచ్చారు, మిగిలిన రూ.61 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అలాగే ఆర్అండ్బీ పరిధిలో రూ.23 కోట్లతో ప్యాచ్వర్క్లు చేపట్టారు వీటి బిల్లులు సైతం పెండింగ్లో ఉన్నాయి.23 మండలాల్లో తాగునీటి సమస్య ప్రస్తుత వేసవిలో చిత్తూరు జిల్లాలోని 23 మండలాల్లో తాగునీటి సమస్యలున్నాయి. జిల్లాలోని 23 మండలాల్లో 923 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ప్రేమ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు మండుతున్నాయని తెలిపారు. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన బాల సంజీవని, 2.0.0 యాప్, ఈకేవైసీ ఓటీపీ ప్రక్రియలు ఎత్తివేయాలన్నారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ చిన్నారులకు మే నెల మొత్తం టేక్ హోం రేషన్తో సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు సైతం లేవన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారని, అంగన్వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా అధ్యక్షులు ప్రభావతి, నాయకులు అరుణ, హైమావతి, కాంచన, రాజేంద్ర, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీ సు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 41 వినతులు అందాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీ కరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కు టుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ త గాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాల న్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శిబి రంలో స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్యారమ్స్, కథలు చెప్పడం, వినడం, క్విజ్, పేపర్ క్రాఫ్ట్లలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో–2 మోహన్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల ఏఓ రాజగోపాల్, జన విజ్ఞాన వేదిక మాజీ కోఆర్డినేటర్ రంగనాథన్, డిప్యూటీ లైబ్రేరియన్ లలిత తదితరులు పాల్గొన్నారు. -
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
కుప్పం మున్సిపల్ చైర్సన్ ఎన్నికల అప్డేట్స్..చిత్తూరు..కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీసీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీసంఖ్య బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్న టీడీపీకుప్పం మున్సిపల్ చైర్మన్గా సెల్వ రాజ్ ఎన్నిక5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికటీడీపీ చైర్మన్ అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతువైఎస్సార్సీపీ అభ్యర్ధి హఫీజ్కు తొమ్మిది మంది మద్దతు, ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరుకుప్పంలో 144 సెక్షన్నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికబెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లుఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంబెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..పోలీసుల కనుసన్నల్లోనే కుప్పంమున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులుఅడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్, 92 మందితో మున్సిపల్ ఎన్నికలు గుంటూరు..నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికబలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వంగుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లువైఎస్సార్సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయంవైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులుఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలువైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులుకార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలుమేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్సీపీ..అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 👉ఏపీలో కూటమి సర్కార్ పాలనలో దౌర్జన్యం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.👉వైఎస్సార్సీపీకి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్పర్సన్ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ప్రమాదాలపై ఫోకస్
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్ధేశం చేస్తున్నారు... మృతదేహంతో ఆందోళన గంగవరం మండలంలో విద్యార్థి మృతదేహంతో ఆదివారం కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కుప్పం రూరల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సమయం ఆసన్నమైంది. సోమవారం జరగనున్న ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, అబ్జర్వర్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని ప్రభుత్వం నియమించింది. చైర్మన్ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం వైఎస్సార్సీపీకి ఉన్నా.. అధికార బలంతో ఎలాగైనా చైర్మన్ కుర్చీని దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. సమాయత్తమైన ఇరుపార్టీలు సంఖ్యా పరంగా చూసుకుంటే వైఎస్సార్సీపీనే గెలవాలి. కానీ అధికార పార్టీ కుతంత్రాలకు దిగింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 19 మంది కౌన్సిలర్లతో విజయఢంకా మోగించింది. టీడీపీ ఆరుగురు కౌన్సిలర్లకే పరిమితమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ సుధీర్ కొనసాగారు. కుటమి ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అలాగే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ బలం పదికి పెరిగింది. ప్రస్తుతం గెలవాలంటే మరో నలుగురు అభ్యర్థులు అవసరం. బలం లేకపోయినా టీడీపీ బరితెగిస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అంగడి సరుకులా కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీరి వలలో నలుగురు కౌన్సిలర్లు చిక్కుకోగా, మరో ఇద్దరు ఓటింగ్లో పాల్గొనకుండా భయపెట్టినట్టు తెలిసింది. ఇలా జరిగితే టీడీపీ గెలుపు ఖాయమనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజాస్వామ్యపై నమ్మకంతో ఎన్నికల బరిలో దిగుతోంది. సంప్రదాయాన్ని పాటించరా? వైఎస్సార్ సీపీ 2019లో అధికారం చేపట్టగానే టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు సుముఖత చూపారు. అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాత్రం వారిని తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. ఇదే సంప్రదాయాన్ని కుప్పం మున్సిపల్ కౌన్సిలర్ల విషయంలోనూ టీడీపీ అధిష్టానం పాటించాలని కుప్పం జనం సూచిస్తున్నారు. తమ వైపునకు తిప్పుకున్న కౌన్సిలర్ల చేత రాజీనామాలు చేయించి, గెలిచిన తరువాత చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణం ఏరియల్ వ్యూ – 8లో– 8లో– 8లోన్యూస్రీల్నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు వన్టౌన్ పక్కన ఉన్న ఆర్మ్డు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నేడు పలమనేరులో గ్రీవెన్స్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న డీఆర్సీ వాయిదా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సిన డీఆర్సీ (జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం)వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని పలు కారణాల చేత వాయిదా వేసినట్లు కలెక్టరేట్ అధికారులు చెప్పారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ – మరొకరిపై కేసు నమోదుకు ఆదేశం చిత్తూరు కార్పొరేషన్ : వి.కోట పంచాయతీలో రూ.50 లక్షలు నిధులు దుర్వినియోగమయ్యా యి. అందుకు కారకులైన ఇద్దరు పంచాయతీ సి బ్బందిని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాల మేరకు డీపీఓ సుధాకర్రావు సస్పెండ్ చేశారు. ప్రస్తుత పొలకల పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ యా దవపతి గతంలో డిప్యూటేషన్పై వి.కోట పంచా యతీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వహించారు. అ తడితో పాటు ఆ పంచాయతీ బిల్లు కలెక్టర్ ఫృథ్వీ, మరొక కాంట్రాక్ట్ ఉద్యోగితో కలిసి ప్రజలు చెల్లించిన పన్నులు, పన్నేతర నిధులను పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా రూ.1.50 కోట్లు దుర్వినియోగం చేసినట్లు స్థానికులు అధికారులకు ఫి ర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీఓ స్థాయి అధికారి విచారణ చేయించారు. రూ.50 లక్షలు పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఇందులో యాదవపతి రూ.16 లక్షలు, ఫృథ్వీ రూ.34 లక్షలు వారి సొంతానికి వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ని ధుల దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా వా రిని సస్పెండ్ చేసినట్లు డీపీఓ తెలిపారు. ఈ విషయంలో బాధ్యుడిగా గుర్తించిన కాంట్రాక్ట్ ఉద్యోగి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శికి డీపీఓ ఆదేశించారు. నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంపూర్ణ మెజారిటీతో ఊపుమీదున్న వైఎస్సార్సీపీ బలం లేకపోయినా బరితెగించేందుకు సిద్ధమైన టీడీపీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఓటింగ్కు రానీయకుండా కుయుక్తులు ఇప్పటికే ఆరుగురిని తమవైపు తిప్పకున్న కూటమి ఎలాగైనా చైర్మన్ గిరి దక్కించుకోవాలని కుట్రలు ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ప్రజానీకం మొత్తం కుప్పం వైపే చూస్తోంది. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్సీపీ పోరాడుతుండగా.. బలం లేకపోయినా బరితెగించేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు తెరలేపుతోంది. నేడు జరగనున్న చైర్మన్ గిరి ఎన్నికలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాల్గొనకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం 9వ వార్డు కౌన్సిలర్ ఎస్డీ.హఫీజ్ను ఎంపిక చేసింది. ప్రత్యామ్నాయంగా 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.మునిరాజును కూడా నియమించింది. ఇందుకు సంబంధించిన విప్ను అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేశారు. ఆయన కౌన్సిల్లోని 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.మునిరాజుకు విప్ జారీ అధికారాన్ని కట్టబెట్టారు. రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సర్వం సిద్ధం కుప్పం చైర్మన్ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరం ప్రకారం 14 మంది సభ్యులు హాజరైతే అధికారులు ఎన్నిక జరిపే అవకాశం ఉంది. కోరం లేని పక్షంలో అధికారులు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయొచ్చని సమాచారం. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక తరహాలో ప్రత్యేక జీఓ పాచిక ప్రయోగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. బలం లేకపోయినా బరితెగింపే! 5 నవంబర్, 2024 వరకు మున్సిపల్ చైర్మన్గా కొనసాగిన 16వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ సుధీర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉంది. ఎన్నికల సంఘం ఏప్రిల్ 28న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించింది. 25 వార్డులు ఉన్న కుప్పం మున్సిపాలిటీలో డాక్టర్ సుధీర్ రాజీనామాతో ఆ సంఖ్య 24కు చేరింది. వీరికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్, భరత్కు ఓటు హక్కు ఉంది. దీంతో సభ్యుల సంఖ్యా బలం 27కు చే రింది. ఇందులో చంద్రబాబు వచ్చే అవకాశాలు త క్కువగా ఉండడంతో 26 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించనుంది. 14 మంది అభ్యర్థులు ఎవరికి మ ద్దతు ఇస్తే వారే చైర్మన్ గిరిని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు పూర్తి చేశారు. చైర్మన్ గిరి కోసం కుమ్ములాట! కుప్పం: ‘ఆలూలేదు.. శూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టు తయారైంది కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి. వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉండడంతో ఆ పార్టీకి విజయావకాశాలు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బలం లేకపోయినా.. బరితెగించి కుప్పం చైర్మన్ గిరిని తన్నుకుపోవాలని టీడీపీ కాచుకు కూర్చొంది. ఈ క్రమంలోనే 19, 20, 5 వార్డుల కౌన్సిలర్లు దామోదరం, సోమశేఖర్, సెల్వరాజు చైర్మన్ కుర్చీ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి హొసూరు సమీపంలో క్యాంప్లో ఉన్న టీడీపీ మద్దతుదారుల మధ్య వివాదం రేగి, కుమ్ములాటలకు దారితీసినట్టు సమాచారం. -
నాబిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదు
● జిల్లా ఆస్పత్రిలో అందని వైద్యం ● వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండి ● న్యాయం జరిగేంత వరకు రాజీలేని పోరాటం చేస్తా ● బీసీ నాయకుడు షణ్ముగం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ‘చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిన్న జబ్బు అయినా ఆ ఆస్పత్రికి వెళ్లొద్దు’ అని బీసీ సంఘం, టీడీపీ నాయకుడు షణ్ముగం తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ శ్రీదుర్గ మృతి చెందిందని ఆరోపించారు. బిడ్డ మృతికి అక్కడి వైద్యులే కారకులన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, మెడికల్ కౌన్సిల్, రాష్ట్ర వైద్యఽశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కానీ పక్షంలో ప్రాణత్యాగానికై నా సిద్ధమన్నారు. నా బిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదని వివరించారు. సోమవారం నుంచి ప్రజాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి ఆశయం నీరుగారిందన్నారు. చిన్న జబ్బు వచ్చినా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ నాయకులు రవీంద్రరాజు, రుద్రయ్య ప్రతాప్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు శోభారాణి, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర
పుత్తూరు : గోసంరక్షణ నిమిత్తం ఉడిపి పీఠాధిపతి శ్రీఈషాప్రియ తీర్థ స్వామిజీ నిర్వహిస్తున్న పాదయాత్ర ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు పుత్తూరు చేరుకుంటుంది. స్వామిజీకి స్థానిక ఆర్డీఎం గేటు వద్ద హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి శివాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 8 గంటలకు స్వామి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. రాత్రి తడుకు గ్రామంలో బసచేసి, 30 తేదీ ఉదయం 8 గంటలకు అనుగ్రహ భాషణం అనంతరం 10 గంటలకు పాదయాత్ర రేణిగుంట వైపు కొనసాగుతుందని చెప్పారు.నాటుసారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతిరొంపిచెర్ల : నాటు సారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల–పీలేరు మండలాల సరిహద్దులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బండకిందపల్లె పంచాయతీలోని బడబళ్ల వంక వద్ద రోడ్డు పక్కన సుమారు (45) ఏళ్ల వయస్సున్న వ్యక్తి మూడు రోజులుగా కమోళ్లపల్లె పక్కన ఉన్న రామానాయక్ తండా– యర్రగుంటపల్లె మధ్య తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. దుస్తులు లేకుండా డ్రాయర్ మాత్రమే వేసుకొని తిరుగుతున్నాడని చెప్పారు. పీలేరు మండలం రామానాయక్ తండాలో నాటుసారా తాగి అక్కడ నుంచి రోడ్డు పక్కకు వచ్చి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోడ్డు మీద వెళ్తున్న వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహం ఎడమ చేతిపైన మన్మద్రాజ్ అనే పచ్చ బొట్టుతో పేరు రాసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తమిళనాడు రాష్టానికి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సుబ్బారెడ్డి కోరారు.రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంగంగవరం : సొంత పని మీద పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కూర్నిపల్లి గ్రామానికి చెందిన గిరిజమ్మ (57) గ్రామం నుంచి పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో కూర్నిపల్లి క్రాస్ ఓం శక్తి గుడి వద్ద హైవేలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చిత్తూరుకు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థిని అదృశ్యం : కేసు నమోదుతవణంపల్లె : మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మండలంలోని విద్యార్థిని (14) పదో తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉండేదని వివరించారు. ఈనెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ కనిపించలేదన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.పేకాటరాయుళ్ల అరెస్టుబంగారుపాళెం : మండలంలోని తగ్గువారిపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తగ్గువారిపల్లెకు చెందిన రాజన్న మామిడి తోపు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 3,940 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.రూ.1.75 కోట్ల విద్యుత్ బిల్లుల వసూలుచిత్తూరు కార్పొరేషన్ : ఆదివారం విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాలు పనిచేశాయి. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలను తెరిచారు. మొత్తం 12,200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా తద్వారా రూ.1.75 కోట్లు వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వివరించారు.శ్రీవారి దర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,811 మంది స్వామివారిని దర్శించుకోగా 34,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
దళితుల దాడులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్రంలో దళితుల దాడులపై హోం మంత్రి, డీజీపీకి చిత్తశుద్ధిలేదని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు మండి పడ్డారు. చిత్తూరులోని ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గుట్టు చప్పుడు కాకుండా 98 మంది ఎస్సీ, ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీ పోస్టింగ్లను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి, ఎస్సీ, ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా 2014వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమస్యను పరిష్కారం చేయకుండా, చట్టాన్ని నీరు గార్చేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మే 5వ తేదీన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షులు కుమార్, హరివర్ధన్, బాలు, భాస్కర్ పాల్గొన్నారు. -
సంక్రాంతిపల్లెలో దొంగల బీభత్సం
● అయిదు ఇళ్లలో చోరీలు ● రెండు ఇళ్లల్లో బీరువాలను దర్జాగా తీసుకెళ్లి దోచుకున్న వైనం ● 81 గ్రాముల బంగారం, రూ .1.80 లక్షల నగదు అపహరణ బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడి గ్రామంలోని 5 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 లక్షల విలువైన నగలు, నగదు అపహరించుకుపోయారు. రెండిళ్లల్లోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ధ్వంసం చేసి నగలు, నగదు దోచుకుపోవడం గమనార్హం. జాతీయ రహదారికి కూత వేటు దూరంలో గల గ్రామంలో నిందితులు దర్జాగా చోరీకి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, గ్రా మస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతిపల్లెలో అర్ధరాత్రి సమయం గుర్తుతెలియని వ్య క్తులు గ్రామానికి చెందిన ఉమేష్, మునిరత్నం, శాంతమ్మ, ఇళ్లతో పాటు దళితవాడలోని మునెయ్య, చిట్టిబాబు ఇళ్లల్లో ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికు ప్రవేశించారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లలోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ పగులగొట్టా రు. ఉమేష్ బీరువాలో రూ. 2 లక్షల నగదు, 60 గ్రా ముల బంగారు ఆభరణాలు, మునిరత్నంకు చెందిన బీరువాలో రూ.15 వేల రూపాయలు నగదు, 16 గ్రా ముల బంగారు నగలు అపహరించారు. శాంతమ్మ ఇంటిలో పెట్టెలను పగులగొట్టి చూశారు. ఏమీ లేకపో వడంతో వెళ్లిపోయారు. దళితవాడలో మునెయ్య ఇంటిలో రూ.2 వేల రూపాయల నగదు, బంగారు కమ్మలు(జత) రెండు గ్రాములు, చిట్టిబాబు ఇంట్లో మూడు గ్రాముల విలువైన మూడు జతల కమ్మలు, 2,500 రూపాయల నగదు దోచుకుపోయారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన మోహన్ టిఫిన్ దుకాణం నిర్వహించేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో నలుగురు వ్యక్తులు ఉ మేష్ ఇంటి వద్ద ఉండడంతో కేకలు వేయడంతో దొంగలు పారిపోయినట్లు తెలిపారు. చోరీ సమాచారం అందుకున్న బంగారుపాళెం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, సిబ్బంది సంక్రాంతిపల్లె గ్రామానికి చేరుకున్నారు. చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. బాధితు లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిట్టపల్లె గ్రామంలో మహాభారత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హరికథకు స్థానికులు వెళ్లినట్లు తెలిపారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లకు తాళాలు వేసు కుని మిద్దైపెన నిద్రపోయినట్లు తెలిపారన్నారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ సందర్శించారు. చిత్తూరు నుంచి క్లూస్టీమ్ సభ్యులు చోరీ జరిగిన ఇళ్లలో వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు రోడ్డు ముత్తుకూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల క థనం మేరకు.. మండలంలోని కొళత్తూరు పంచా యతీ గళ్లావారిపల్లికి చెందిన వెంకటరమణ కు మారుడు జ్యోతీశ్వర్ మదనపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్వగ్రామం నుంచి మదనపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముత్తుకూరు క్రాస్ వద్ద పుంగనూరు నుంచి పలమనేరు వెళుతున్న కారు ఢీకొంది. తీ వ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న జ్యోతీశ్వర్ను స్థానికులు 108లో పుంగనూరు ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మదనపల్లి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.ఈతకెళ్లిన విద్యార్థి మృతిబైరెడ్డిపల్లె: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల సమీపంలోని కర్ణాటక రాష్ట్రం సనిగపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని గంగినాయనపల్లెకు చెందిన వెంకటరమణరెడ్డి కుమారుడు తేజేష్రెడ్డి (10) బైరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ గ్రామమైన సనిగపల్లెకు వెళ్లాడు. అక్కడ గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ● ప్రమాదాల నివారణకు కార్యాచరణ ● జిల్లాలో 25 బ్లాక్స్పాట్ల గుర్తింపు ● క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
మొగిలి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన స్పీడ్బ్రేకర్లు బ్లాక్స్పాట్గా చిత్తూరుకు సమీపంలోని మురకంబట్టు కూడలి బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద 2024 సెప్టెంబర్ 13వ తేదీన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఒక్క ఘటనే కాదు.. నిత్యం జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, రవాణా, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ప్రతివారం సమీక్షలు, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై లోతుగా చర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైనది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాలు కావడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందే వ్యక్తుల కుటుంబాలు చీకటిమయం అవుతున్నాయి. డ్రైవింగ్ అలసత్వం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల బతుకులు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిర్ధిష్ట ప్రణాళిక అమలుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. సహాయం ముఖ్యం ఒక కుటుంబంలో ఎవరైనా ప్రమాదాల బారినపడి మృతి చెందితే ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి, కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే అలసత్వాన్ని వీడాలి. మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేలా అధికారులు, 108 వాహనాలు, డాక్టర్లు, పోలీసుల నంబర్లను తెలుసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సహాయం నిమిత్తం 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా.. జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించారు. ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 25 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్లైట్లు, హైవేలపై వేగ నియంత్రణకు లేజర్ స్పీడ్ గన్స్, వేగాన్ని నియంత్రించేందుకు బ్లాక్స్పాట్స్ సమీపంలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలం వాహనదారులకు తెలిసేలా పవర్ బ్లంకర్స్,సైన్ బోర్డులు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, సోలార్ స్టెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్లు ఇవే.. ● ఎన్ హెచ్– 69 రోడ్డులో.. : ఎంఎస్ఆర్ క్రాస్, చీలాపల్లి క్రాస్, గంగాసాగరం వద్ద ఉన్న ఆర్ఎంఎం ఫ్యాక్టరీ , యాదమరి జంక్షన్, వరిగపల్లి జంక్షన్, కేజీ సత్రం, మొగిలి ఘాట్ (శ్రీనీఫ్యాక్టరీ వద్ద), దొర చెరువు (మొగలి ఘాట్), జగమర్లక్రాస్, దండపల్లి (వి.ఎస్.ఆర్) జంక్షన్, పొన్నమాకులపల్లి క్రాస్, అలకుప్పం (కుక్కలదొడ్డి క్రాస్). ● ఎన్హెచ్ 42 రోడ్డు : గొల్లపల్లి క్రాస్, దేవదొడ్డి, కుమ్మరమడుగు క్రాస్, జువనిపల్లి క్రాస్, నాయనపల్లి పెట్రోల్ బంక్, విజలపురం క్రాస్, కె.సి హాస్పిటల్. ● ఎన్హెచ్ 40 రోడ్డు : మురకంబట్టు జంక్షన్, ఎన్ హెచ్ 140 లో తెల్లగుండ్ల పల్లి క్రాస్, పి.కొత్తకోట రైల్వే అండర్ బ్రిడ్జి, ● ఎన్హెచ్ 716 లో హెచ్పీ పెట్రోల్ బంక్, గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా, మిట్ట ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. 25 బ్లాక్స్పాట్స్లో 2024 సంవత్సరంలో ప్రమాదాలు ఇలా... లైట్వెయిట్ వాహన ప్రమాదాలు 249 ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 209 గాయపడినవారు 510 మంది మృతిచెందిన వారు 228 మంది ద్విచక్రవాహన ప్రమాదాల్లో మృతులు 128 2025 మార్చి నెల వరకు ప్రమాదాలు ఇలా.. లైట్ వెయిట్ వాహనాల ప్రమాదాలు 53 ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 63 గాయపడిన వారు 153 మంది ప్రమాదాల్లో మృతి చెందినవారు 51 మంది పాటించాల్సిన నియమాలు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు. మూల, మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలి. వాహనం నడుపుతున్న సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పెద్ద వాహనాలకు దూరంగా ఉండాలి. కార్లల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు వినియోగించాలి. జిల్లాలో డివిజన్ల వారిగా గుర్తించిన బ్లాక్స్పాట్లు డివిజన్ ఎన్హెచ్–69 ఎన్హెచ్–42 ఎన్హెచ్–140 ఎన్హెచ్–40 ఎన్హెచ్–716 మొత్తం చిత్తూరు 7 0 2 2 0 11 పలమనేరు 6 3 0 0 0 09 కుప్పం 0 2 0 0 0 02 నగరి 0 0 0 0 3 03 మొత్తం 13 5 2 2 3 25 -
విద్యార్థి మృతదేహంతో ఆందోళన
● కళాశాల వద్ద కుటుంబీకుల ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● కళాశాల యాజమాన్యమే చంపేసిందని ఆరోపణ ● రాత్రి వరకూ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం గంగవరం : మా బిడ్డ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపేశారా.. కళాశాల యాజమాన్యమే సమాధానం చెప్పాలి.. లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కళాశాలలో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థి కుటుంబికులు, బంధువులు కలిసి కళాశాల ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం వద్ద శాంతీపురం మండలం గెసికపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు యోగేష్(16) గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ మధ్య వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే గత 23వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం అతన్ని తల్లిదండ్రులు కళాశాలలో విడిచి వెళ్లారు. శనివారం రోజున కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నట్లుగా శవమై కనిపించడంపై పలు అనుమానాలకు దారి తీసింది. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 6 కి.మీ మృతదేహాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ.. పోస్టుమార్టం ముగిసిన తరువాత ఆదివారం విద్యార్థి మృతదేహాన్ని చేతుల్లో మోసుకుంటూ దాదాపు 6 కిలోమీటర్లు రోడ్డు మార్గాన నడుచుకుని కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, గంగవరం, పలమనేరు సీఐలు ప్రసాద్, నరసింహరాజు, భాస్కర్ అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబికులకు సర్ది చెప్పాలని చూసినా వారు వినలేదు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యం చంపేసి నిజాలను దాచిపెడుతున్నారని వాపోయారు. పదుల సంఖ్యలో పోలీసులు , బెటాలియన్తో కలిసి అక్కడ గుమికూడిన విద్యార్థి కుటుంబికులను కళాశాలలోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కళాశాల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలాసేపు తరువాత మృతుడి కుటుంబికులకు, కళాశాల యాజమాన్యానికి మధ్యన పోలీసులు రాజీ కుదర్చడంతో మృతదేహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలు
● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ● కౌన్సిలర్లను అంగడి సరుకులా కొనేందుకు యత్నం ● ఒకరిద్దరు టీడీపీకి మద్దతు తెలిపే అవకాశం ● పార్టీలు మారే కౌన్సిలర్లు తమకొద్దంటున్న ప్రజానీకం ● ఓటింగ్కు అడ్డుపడే అవకాశం ఉండడంతో రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ● కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నికను తలపించనుందా..? కుప్పం రూరల్: సంఖ్యా బలం లేకపోయినా ఎలాగైనా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరి దక్కించుకోవాలని అధికార టీడీపీ బరితెగింపులకు పాల్పడుతోంది. ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను అంగడి సరుకుల్లా కొనేందుకు బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు టీడీపీతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు లొంగని పక్షంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను సమావేశానికి రానివ్వకుండా అడ్డుకుని, ప్రత్యేక జీఓల ద్వారా అడ్డదారుల్లో గెలిచే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ఆలోచనలు పసిగట్టిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యం గెలుస్తుందా..? అధికార పార్టీ కుతంత్రాలు గెలుస్తాయా? అనేది కుప్పం జనంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఒకరిద్దరు వైఎస్సార్ సీపీ వారు టీడీపీకి మద్దతు ఇస్తారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఫార్టీ ఫిర్యాయిస్తారనే కౌన్సిలర్ల పరిధిలోని ప్రజలు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. తాము మంచి చేస్తారని ఓట్లు గెలిపిస్తే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తే వారికి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు. మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా? కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా? అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. గత నెలలో రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కోరం లేకపోయినా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. మండలంలో 16 ఎంపీటీసీ సభ్యులుండగా, ఎంపీపీ అభ్యర్థి శాంతకుమారి అకాలమరణం పొందింది. దీంతో సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎన్నిక నిర్వహించాలంటే కోరం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎన్నికలకు హాజరు కాకుండా అడుగడుగునా అడ్డుకుని, హాజరైన ఆరుగురు టీడీపీ సభ్యులతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులే గెలిచినట్లు అధికారులు ప్రత్యేక జీఓ అనే అస్త్రాన్ని ఉపయోగించుకుని గెలుపును నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లుఅధికార పార్టీ నుంచి తమకు ఇబ్బందులున్నాయని, రక్షణ కల్పించాలని కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సభ్యులకు రక్షణ కల్పించాలని కోర్టు జిల్లా, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. కౌన్సిలర్లు ప్రయాణించే వాహనాల నంబర్లు, ఆధార్కార్డులు పోలీసులకు అందజేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు స్థానిక పోలీసు స్టేషన్లో ఇందుకు సంబంధించి పత్రాలు అందజేశారు. సర్వత్రా ఉత్కంఠ కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా చైర్మన్ ఎన్నికపైనే చర్చలు సాగుతున్నా యి. టీ షాపులు వద్ద నలుగురు గుమికూడిన ప్రతి చోట చైర్మన్ అభ్యర్థిత్వంపైనే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరు ఒకరికి వస్తుందని, లేదు లేదు మరోకరికి వస్తుందనే వాదనలు నడుమ మాటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సోమవారం ఏ పార్టీ వారికి మంచి రోజు అవుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షీల్డు కవరే శరణ్యమా? చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా సాగితే వైఎస్సా ర్ సీపీ గెలుపు ఖాయం. వైఎస్సార్ సీపీలో ఇప్పటికే చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం స్పష్టమైన నిర్ణ యం తీసుకుంది. చిక్కల్లా టీడీపీలోనే ఉంది. అడ్డదారుల్లో టీడీపీ చైర్మన్ గిరి దక్కించుకుంటే అభ్యర్థి విషయంలో స్పష్టత లేదు. ఎవరికి వారు తామే చైర్మన్ అ ని ప్రచారాలు చేసుకుంటున్నారు. 19 వార్డు కౌన్సిలర్ దాము తనకే దక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా డు. 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్ అయితే అధిష్టానం ఆశీర్వాదం తనకే ఉందని దీమాగా ఉన్నాడు. 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం కుప్పంలో 60 శాతం ఓ టర్లు తమ సామాజిక వర్గం వారే ఉన్నారని, తనకు ఇస్తేనే సముచితమని, ఇప్పటికే పలుసార్లు మద్దతు కోసం సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించారు. మరో వ్యక్తి కూడా చైర్మన్ గిరిపై ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. నలుగురైదుగురు పోటీ ఉన్న నేపథ్యంలో నిర్ణయం అధిష్టానానికి వదిలే స్తారనే వాదన లేకపోలేదు. పైనుంచి వచ్చే షీల్డు కవర్లో ఎవరు పేరు ఉంటే వారే చైర్మన్ అన్న అభిప్రాయం లేకపోలేదు. -
నూతన సంస్కరణలపై అవగాహన తప్పనిసరి
చిత్తూరు అర్బన్: న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యా యస్థానాలు ఇచ్చే తీర్పు లు, నూతన సంస్కరణలపై న్యాయమూర్తులు తప్పనిసరిగా అవగాహ న కలిగి ఉండాలని ఉ మ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు ‘లా ఆఫ్ రెపుటేషన్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. రిటైర్డు జిల్లా జడ్జిలు కెపి.బాలజీ, ఎస్.జగన్నాథం రీసోర్స్ పర్సన్గా వ్యవహరించి పలు విషయాలపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించారు. న్యాయమూర్తులు రమేష్, భారతి తదితరులు పాల్గొన్నారు. 12 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతులుచిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో 12 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు, రామకుప్పం, వెదురుకుప్పం, పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో డిప్యూ టీ ఎంపీడీఓలుగా ఉన్న హరిప్రసాద్రెడ్డి, రాధాకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్బాబును చిత్తూరు జి ల్లాకు కేటాయించారు. అలాగే కడప, అనకాపల్లె లో పనిచేస్తున్న హరిప్రసాద్రెడ్డి, శిరీషను చిత్తూ రు జిల్లాకు ఇచ్చారు. ఎర్రవారిపాళెం, నాగలాపురంలో విధులు నిర్వహిస్తున్న మాలతి, వెంకటరమణను తిరుపతి జిల్లాకు కేటాయించారు. నగరి, గంగవరం, బైరెడ్డిపల్లె ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏఓలుగా పనిచేస్తున్న సతీష్, భాస్కర్, మహేష్ కు ఉద్యోగోన్నతి కల్పించి, చిత్తూరు జిల్లాకు కేటాయించగా, రామసముద్రం ఏఓ గౌస్బాషాను కడప జిల్లాకు ఇచ్చారు. వీరికి త్వరలో మండలాలను కేటాయించనున్నారు. -
ఆధునిక నేర పోకడపై అవగాహన తప్పనిసరి
చిత్తూరు అర్బన్: ఆధునిక సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు, ప్రజలు ఎలా మోసాలకు గురవుతున్నారనే విషయాలపై అవగాహన తప్పనిస రని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ సాంకేతిక నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ర కాల నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నా రు. సైబర్క్రైమ్పై నిర్లక్ష్యం చేయకుండా ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధితులు స్టేషన్కు వస్తే వెంటనే స్పందించాలన్నారు. పెండింగ్ కేసుల ద ర్యాప్తు సకాలంలో పూర్తి చేయాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. ఇక నేరస్తుల కదలికలను గుర్తించడానికి రూపొందించిన సీసీటీఎన్ఎస్ యాప్ను ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలన్నారు. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలన్నారు. మూడు రోజులు పాటు డ్రోన్ శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన సిబ్బందికి మెలకువలు నేర్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, ప్రజా సమస్యల ఫిర్యా దు వేదికకు వచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. ఉద్యోగమేళా రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఉపాధి కా ర్యాలయంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఉద్యోగమేళాలో పలు జాతీయ కంపెనీలు పాల్గొంటాయ న్నారు. జిల్లాలో డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియ ట్, డిగ్రీ పూర్తీ చేసి 19–35 సంవత్సరాల వ యస్సులోపు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 28వ తే దీన విద్యార్హత సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని కోరారు. -
బాలికల భద్రతే.. దేశ బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : కిశోర బాలికల భద్రతే దేశ బాధ్యత అని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరి అన్నారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లాస్థాయిలో కిశోరవికాసం– సమ్మర్ స్పెషల్ కార్యాచరణపై మండల స్థాయిలో వివిధ శాఖల నుంచి హాజరైన నోడల్ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ కిశోర బాలికల సాధికారతకు ప్రతి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ క్యాలెండర్ ప్రకారం గ్రామాల్లో ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. బాల్య వివాహాల కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని తెలిపారు. నేడు చాలా వరకు అన్నీ పోటీ పరీక్షలలో బాలికలదే పైచేయిగా ఉన్నప్పటికీ, ఎంతో మంది కిశోర బాలికలు తమ కళలను నెరవేర్చుకోక ముందే బాల్య వివాహాలకు బలైపోతున్నారని అన్నారు. మరి కొంతమంది బాల కార్మికులుగా మారిపోతున్నారని చెప్పారు. మరొకవైపు బాలికలు ఇంటా బయట, తెలిసిన వ్యక్తుల చేతుల్లో లైంగిక వేదింపులకు గురై చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారన్నారు. మరికొంత మంది తెలియని తనంతో ప్రేమ, ప్రలోభాలకు గురై, నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం, ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మి, సమగ్రశిక్ష జీసీడీఓ ఇంద్రాణి, ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు. -
పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేసి, పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు. ఐరాలలో చిరుత సంచారం ఐరాల: మండలంలోని నగరి, చెంగనపల్లె గ్రామాల్లో చిరుత పులుల సంచరిస్తున్నాయి. శనివారం చెంగనపల్లె సమీపంలోని బంగారుచింతల గ్రామానికి చెందిన రైతు మల్లీశ్వర్రెడ్డి మామిడి తోటలో చిరుత పులి పాదముద్రలను పోలిన ముద్రలు కనిపించాయి. విషయాన్ని వెంటనే ఐరాల బీట్ అధికారి రెడ్డిప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన ఉదయం మామిడి తోటలో పాదముద్రల గుర్తులున్న ప్రాంతానికి వెళ్లి వాటిని సేకరించారు. పాదముద్రలను గుర్తించడం కోసం ఫొటోలను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. కాగా ఈ పాదముద్రలు దగ్గర దగ్గరగా ఉన్నాయని, చిరుత పులి పాదముద్రలు దూరం దూరంగా ఉంటాయని చెప్పారు. అయితే నగరి, చెంగపల్లె సమీపంలోని పెద్దకొండలో నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం పెద్దకొండ నుంచి దుర్గంకు వెళ్లే దారిలో మామిడి తోటలో నీటి కోసం చిరుత పులులు వస్తున్నట్లు చెప్పారు. -
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం
చౌడేపల్లె: గ్రామస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి అన్నారు. శనివారం పెద్దకొండామర్రిలో కోటూరుకు చెందిన మైనార్టీ నేతలు, పార్టీ నాయకులతోపాటు బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తదితర నేతలు కలిసి నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలకు స్వీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్, ఇంమ్రాన్, ఫయాజ్,రాంబాబు, హస్సేన్, మల్లికార్జున, అజారుధ్దీన్, సలీం, అలీ, మునిగిరిబాబు,శ్రీరాములు, వెంకీ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్త పనిచేసుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎందుకు మా వరకు ఫిర్యాదులొస్తున్నాయి. మీరెందుకు పనిచేయడం లేదు..జాగ్రత్తగా పనిచేసుకోండని కలెక్టర్ సుమిత్కుమార్ సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. ఈనెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో శ్రీచిన్నపనైనా..చేయి తడపాల్సిందేశ్రీ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు.. సోమవారం చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది, వీఆర్వోలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ముందుగా ఓ సర్వేయర్కు వార్నింగ్ ఇచ్చారు. హిట్లిస్టులో ఉన్నవని, మంచిగా పనిచేయాలని హెచ్చరించారు. వీర్వోలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని, ఫిర్యాదులన్నీ అర్బన్ నుంచి అత్యధికంగా వస్తున్నాయన్నారు. ఎందుకు ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పద్ధతి మార్చుకుని, పనిచేయాలని హుక్కుం జారీ చేశారని సమాచారం. కాగా ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఓ సర్వేయర్ తప్పిదాలు, నిర్లక్ష్యంను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైన సమాచారం. షోకాజ్ నోటీసులో తహసీల్దార్ సంతకం పెడితే సోమవారం ఆ సర్వేయర్కు నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఒకే ఈతలో 4 పిల్లలు
బైరెడ్డిపల్లె: మండలంలోని కుప్పనపల్లె గ్రామానికి చెందిన నాగరాజు మేకలను పెంచుతూ జీవిస్తున్నాడు. తన మేకల మందను శనివారం మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లగా మందలోని ఓ మేక 4 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఒకటి, రెండు పిల్లలను మాత్రమే వేస్తాయని, 4 పిల్లలు ఒకే కాన్పులో వేయడంతో రైతు నాగరాజు ఆనంద పడ్డాడు. కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు పుంగనూరు: మండలంలోని రాంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మోటారుసైకిల్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు 108లో బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య వెదురుకుప్పం: మండలంలోని మారేపల్లె సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35–40 సంవత్సరాల మధ్యలో ఉంటుందని 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్నట్లు చెప్పారు. తను వేసుకున్న పింక్ కలర్ షర్ట్తో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుడి ఎడమ చేతిపై షీలా అని ఆంగ్లంలో పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440900691 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
నగరిలో కొండముచ్చు హల్చల్
నగరి : పట్టణంలో శనివారం ఒక కొండముచ్చు హల్చల్ చేసింది. ఎక్కడో అడవుల్లో మాత్రమే కనిపించే కొంముచ్చు దారితప్పి ఎలాగో నగరి పట్టణానికి వచ్చేసింది. దీన్ని చూడడానికి స్థానికు లు, చిన్నారులు ఆసక్తి చూపారు. అరటి పండ్లు, టెంకాయలు అందిస్తూ దాని వెంట పడ్డారు. తెగిన వైర్లు.. 50 మామిడి చెట్లు ధ్వంసం వెదురుకుప్పం: మండలంలోని చెంచుగుడి సమీపంలో శనివారం సాయంత్రం 220 కేవీ విద్యుత్ లైన్ తెగిపడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో 50 మామిడి చెట్లు ధ్వంసం అయ్యాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద శబ్దంతో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పొలాలపై విద్యుత్ వైర్లు పడడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రైతు లోకేష్ రెడ్డికి చెందిన 50 మామిడి చెట్లు విరిగిపోయినట్లు బాధితుడు తెలిపారు. మామిడి కాయలు నేలరాలినట్లు పేర్కొన్నారు. 30న జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 30వ తేదీన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం నిర్వహణ, అజెండా అంశాల ఏర్పాటుకు సంబంధించి డీఆర్వో మోహన్కుమార్ క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. -
గోల్డ్ కుంభకోణంలో కీలక నిందితుడి అరెస్టు
పలమనేరు: పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో బంగారు ఆభరణాల మోసం కేసుకు సంబంధించిన కుంభకోణంలో అసలు నిందితుడిని పలమనేరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా కనకదుర్గ ఫైనాన్స్ పేరిట బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది కలసి బంగారు నగల విషయంలో అక్రమాలు జరిగి రూ.కోట్లలో మోసాలు జరిగాయి. దీనిపై సాక్షి దినపత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి. కాగా దీనిపై స్థానిక పోలీసుల పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నరసింహులు న్యాయవాదుల ఆధ్వర్యంలో పలమనేరులోని కోర్టులో లొంగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నిందితుడిని విచారించేందుకు పిటిషన్ వేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేసి ఈ కుంభకోణంలో మొత్తం నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ నరసింహరాజు తెలిపారు. ఇలా ఉండగా స్థానిక పోలీసులు నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళుతుండగా బాధితులు పెద్ద సంఖ్యలో నిందితుని పై దాటికి ప్రయత్నం చేయడం గమనార్హం. దీనిపై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా కనకదుర్గ ఫైనాన్స్ కుంభకోణంలో కీలక నిందితుడిని కోర్టు ద్వారా విచారణకు తీసుకున్న విషయం నిజమేనని, దీనిపై పూర్తి విచారణ పూర్తి చేశాక వివరాలను తెలుపుతామని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కుప్పంరూరల్: మండలంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెండుగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన ఎం.ముత్తు తన స్నేహితుడు శేఖర్తో కలిసి కూలీ పనుల కోసం మల్లానూరు గ్రామానికి బయలుదేరాడు. శేఖర్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, మార్గం మధ్యలోని ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్ర వాహనం బ్రేక్ కొట్టడంతో వెనుక వైపు కూర్చున్న ఎం.ముత్తు (28) అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీ కొన్నాడు. ప్రమాదంలో శేఖర్ సురక్షితంగా బయటపడగా, ఎం.ముత్తు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ బాలక్రిష్ణను అదుపులోకి తీసుకుని, ముత్తు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు ఎం.ముత్తుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జారిపడి వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: తాగి ఇంట్లో జారి పడిన వ్యక్తి తలకు తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్తూరు నగరంలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. యాదమరి మండలం ముత్తురామాపురానికి చెందిన తులసికుమార్(40) అనే వ్యక్తి న్యూ బాలాజీ కాలనీలో నివాసిస్తున్నాడు. భార్య ఊరెళ్లడంతో తులసికుమార్ మద్యం సేవించి తూగుతూ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన వ్యక్తి టైల్స్పై జారి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే మృతి చెందడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టూటౌన్ ఎస్ఐ బలరామయ్య తెలిపారు. కాగా ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డైయింగ్ ప్లాంట్లు తరలించాల్సిందే!
● అజెండా తీర్మానం వాయిదా ● మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నగరి: నగరి మున్సిపల్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు మిషన్ డైయింగ్, మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఏదైనా సరే ఊరిలో ఉండకూడదు దూరంగా నివాసేతర ప్రాంతాలకు తరలించాల్సిందేనంటూ అజెండా తీర్మానం వాయిదా వేసి రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్, పొల్యూషన్ బోర్డు అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే అధికారులు పొందుపరచిన అజెండాను వినడానికి కూడా తాము సంసిద్ధంగా లేమని డైయింగ్ యూనిట్ల పొల్యూషన్ సమస్య పరిష్కారం అయిన తరువాతే అజెండాలోని అంశాలు వింటామని అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డైయింగ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రమేనని వారు ఆరు యూనిట్లు సక్రమంగా ఉన్నాయంటూ కార్యాలయానికి లేఖ అందిందన్నారు. దీనిపై వైస్ చైర్మన్లు వెంకటరత్నంరెడ్డి, బాలన్తో పాటు కౌన్సిలర్లు బీడీ భాస్కర్, దయానిధి, ఇంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు ఎల్లప్పరెడ్డి మాట్లాడుతూ సక్రమంగా ఉందంటే అది ఏ ఆధారంగా తేల్చారన్నారు. గతంలో ఏ ప్లాంటు సక్రమంగా నిర్వహించడం లేదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తే, నేడు బాగుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని ప్లాంట్లు మూసే అధికారం మీకు లేకుంటే చేతులెత్తేయండి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ మోహన్రాజ్ మాట్లాడుతూ 16 డైయింగ్ యూనిట్లు ఉంటే అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ప్లాంట్లకు మాత్రమే సీల్ వేశారన్నారు. అన్ని డైయింగ్ యూనిట్లు మూసి వేస్తామని అధికారులు చెబుతున్నారని, అయితే టీడీపీకి చెందిన కొన్ని మిషన్ డైయింగ్, మాన్యువల్ డైయింగ్ యూనిట్లు నిర్వహణలో ఉన్నాయన్నారు. వైస్సార్సీపీ వారి ప్లాంటు నుంచి విషం వస్తే టీడీపీ ప్లాంటు నుంచి అమృతం వస్తుందా? అంటూ అధికారులను నిలదీశారు. ప్లాంటు ఏదైనా మూసివేయాల్సిందే ఊరికి దూరంగా వెళ్లాల్సిందే అన్నారు. దీంతో కౌన్సిలర్లు అందరూ ఏకీభవించారు. ఓ దశలో సమావేశాన్ని బాయ్కాట్ చేయడానికి కౌన్సిల్ సిద్ధమైంది. దీనిపై చైర్మన్ పీజీ నీలమేఘం మాట్లాడుతూ పాలకవర్గంగా ఉన్నవారే బాయ్కాట్ చేయడం సబబుకాదన్నారు. డీఈ మాట్లాడుతూ కౌన్సిలర్లు హాజరైనట్లు రికార్డు ఉంటేనే గౌరవ వేతనం కూడా వస్తుందన్నారు. దీనిపై కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిలర్ల మాటలకు గౌరవమే లేనపుడు గౌరవ వేతనం ఎందుకని ప్రజల బాగు కోసం వేతనం వదులుకోవడానికి కూడా తాము సిద్ధమన్నారు. పారాటానికి తాను కూడా సిద్ధమేనని, అయితే పద్ధతి ప్రకారం పోరాడుదామని చైర్మన్ తెలపడంతో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ డైయింగ్ ప్లాంట్లను తరలించే వరకు సమావేశం జరిగినా ఏ అంశానికి కౌన్సిల్ ఆమోదం ఉండదని వాయిదా తీర్మానాలే వేయాలని ఇందుకు సమ్మతమా? అని ప్రశ్నించారు. దీనిపై అందరూ ఏకీభవించడంతో హాజరు పట్టికలో మాత్రమే సంతకాలు చేసి తీర్మానాలు వాయిదా వేసిన కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేసింది. డైయింగ్ ప్లాంట్లను దూరప్రాంతాలకు తరలించడమే మా ప్రధాన అజెండా అని, అది నెరవేరేంతవరకు ఏ అజెండాలకు ఆమోదం లేదంటూ స్పష్టం చేసింది. -
కర్ణాటకలో శవమై తేలిన కుప్పం మహిళ
కుప్పంరూరల్: భార్య ఆస్తిపై కన్నేసిన భర్త 2021లో బావమరిదిని, తాజాగా భార్య ను చంపి శవాన్ని అడవిలో పడేసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. రెండు వా రాల కిందట హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని శుక్రవారం కర్ణాటక పోలీసులు వెలికి తీశారు. వివరాల్లోకి వెలితే..కుప్పం మండలం, చీగలపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు వెంకటేష్, చిన్నపాప దంపతులకు రాజేశ్వరి, వెంకటాచలం పిల్లలు ఉన్నారు. కుమార్తె రాజేశ్వరిని పదేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా పాతరామగోలు గ్రామానికి చెందిన రాఘవేంద్రకు ఇచ్చి వివాహం చేశాడు. మొదట్లో వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2021 ఉగాది పండుగ సందర్భంగా వెంకటేష్ తన కుమార్తె రాజేశ్వరిని కుటుంబ సమేతంగా చీగలపల్లెకు రావాలని ఆహ్వానించాడు. తండ్రి కోరిక మేరకు రాజేశ్వరి తన భర్త రాఘవేంద్ర, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. అప్పటికే కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర పండుగ పూట మామ వెంకటేష్ను కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. తమ వద్ద లేదని వెంకటేష్ తిరస్కరించాడు. ఆస్తి అమ్మి అమ్మి అయినా ఇవ్వాలని గొడవకు దిగాడు. తనకు 3 ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని, దాన్ని తన కొడుకు వెంకటాచలానికి ఇవ్వాలని, అమ్మడం కుదరదని తెగేసి చెప్పాడు. దీంతో రాఘవేంద్ర వెంకటాచలంపై కసి పెంచుకుని, జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణకు ప్రయత్నించాడు. బిడ్డ మృతిపై వెంకటేష్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అనుమానితుడైన రాఘవేంద్రను అరెస్టు చేసి, విచారణ జరపగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో హతుడు రాఘవేంద్ర జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి రాజేశ్వరి తన ఇద్దరి పిల్లలతో స్వగ్రామం చీగలపల్లిలోనే ఉండిపోయింది. నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తూ తల్లిదండ్రులు, పిల్లలను పోషిస్తోంది. తాజా భార్య రాజేశ్వరి.. ఏడాది తరువాత జైలు నుంచి బయటికి వచ్చిన రాఘవేంద్ర ఎలాగైనా భార్యను హతమార్చి ఆస్తి కాజేయాలని కసిపెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలలుగా భార్య రాజేశ్వరితో తాను మారిపోయానని నమ్మబలికి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. దీంతో రాజేశ్వరి భర్తను నమ్మింది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న రాజేశ్వరి ఉదయం లేచి కూలీ పనులకు బెంగళూరుకు బయలుదేరింది. భర్త బంగారుపేటలో దిగమని ఆదేశించడంతో రాజేశ్వరి బంగారుపేటలో దిగింది. భర్తతో కలిసి పాతరామగోలు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారం రోజులు గడిచిన బెంగళూరు వెళ్లిన రాజేశ్వరి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంకటేష్, చిన్నపాప దంపతులు కుప్పం పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి కాల్డేటాను పరిశీలించగా, అందులో భర్త రాఘవేంద్రతో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. బూదికోట పోలీసుల సహకారంతో భర్త రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, రాజేశ్వరిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. శుక్రవారం కర్ణాటక పోలీసులు అడవిలో కుళ్లిపోయిన రాజేశ్వరి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపేటకు తరలించి బంధువులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేశ్వరి హత్య, పిల్లల రోదన చూసి చీగలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసుశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ ఈనెల 19న మరణించిన శంకరమ్మ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఏఎస్పీ రాజశేఖర్రాజు శుక్రవారం అందజేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మృతురాలి కుమారుడు చంద్రబాబుకు ఐడీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.లక్ష, విడో ఫండ్ నుంచి రూ.50 వేలు, మొత్తం రూ.1.50 లక్షలు చెక్కు రూపంలో అందజేశారు.అర్హులకు అందుతున్న వ్యవసాయ పరికరాలుపలమనేరు: పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్కు సంబంధించి సబ్సిడీ వ్యవసాయపరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు వారు కొరుకున్న పరికరాలను పంపిణీ చేస్తున్నారు. ఆ మేరకు పలు మండలాల్లో శుక్రవారం రైతులకు వీటిని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. గత నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో ‘తమ్ముళ్లకే యంత్రసాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ అదే రోజు సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి వ్యవసాయ పరికరాలు విధిగా అందించాలని ఏఓలకు సూచించారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. దీంతో పరికరాల పంపిణీ సజావుగానే సాగుతోంది. ఆ మేరకు పలమనేరు మండలంలోని కల్లాడు సచివాలయంలో సైతం పార్టీలకతీతంగా రైతులకు అవరసమైన పనిముట్లను సిబ్బంది పంపిణీ చేశారు.బావిలో శవమై తేలిన మహిళపూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో అదృశ్యమైన ఓ మహిళా బావిలో శవమై తేలింది. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం గాండ్లపల్లికి చెందిన లక్ష్మి(70) అనే మహిళ నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉండే బావి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పూతలపట్టు సీఐకి సమాచారం అందజేశారు. పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా కాలు జారి పడిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వైభవంగా ఉరుసు ప్రారంభం
పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై ఉన్న హజరత్ సయ్యద్నూర్షావలిబాబా ఉరుసు ఉత్సవం శుక్రవారం గంధంతో వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం వేషధారణలో చాదర్ను నెత్తిన పెట్టుకుని ర్యాలీగా వచ్చి దర్గాలో బహూకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా 27వ తేదీన ఖవ్వాలి, 28న తహలీల్ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్గాలో ప్రత్యేక పూలు చాదర్లు పెట్టి హజరత్లు పూజలు చేశారు. స్థానిక ఎన్ఎస్.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. ఉరుసు కార్యక్రమానికి వేలాది మంది ముస్లిం, హిందువులు రానుండటంతో దర్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉరుసు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీరు, వైద్యసేవలతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండ ఏర్పాట్లు చేపట్టారు. అలాగే పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు లోకేష్, కేవీ రమణ, సిబ్బంది కలసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. చాదర్ బహూకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రార్థనలో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు -
మూగవేదన..తీరని రోదన
● నేడు వరల్డ్ వెటర్నరీ డే.. జిల్లా సమాచారం.. జిల్లా పశువుల ఆస్పత్రి – 1 ఏరియా పశు వైద్యశాలలు – 14 వెటర్నరీ డిస్సెన్సరీ వైద్యశాలలు – 68 రూరల్ లైఫ్స్టాక్ యూనిట్లు – 75 రైతు భరోసా కేంద్రాలు – 297 పాడి ఆవులు – 4,67,507, గేదెలు – 1,036 మేకలు – 13,80,063 గొర్రెలు – 4,38,362 పందులు – 359 కుక్కలు, కోళ్లు – 5,08,808 చాప్కటర్ పంపిణీ వివరాలు.. 2021–22 670 2022–23 365 2023–24 1800 మొత్తం 2,835 చిన్న జబ్బు చేసినా మనం ఆస్పత్రికి ఉరుకులు..పరుగులు తీస్తాం. మూగ జీవాల పరిస్థితి వేరు. ప్రభుత్వ పశువైద్యశాలలు తప్ప గ్రామాల్లో వీటికి ప్రత్యేక ఆస్పత్రులు లేవు. ఉన్న వైద్యశాలల్లో సిబ్బంది లేరు.. మందులు లేక వెలవెలబోతున్నాయి. దీనికితోడు గత సర్కారు హయాంలో అమలవుతున్న పథకాలు ఆగిపోయాయి. వెరసి మూగవేదన తీరని రోదనగా మారింది. పశువైద్యం గాలిలో దీపం అన్న చందమైంది. కాణిపాకం: కూటమి పాలనలో పశువైద్యం పడకేసింది. అత్యవసర సేవలు అటకెక్కాయి. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పాడి పరిశ్రమ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం పాడి వృద్ధి, మెరుగైన పశు వైద్యానికి కృషి చేసింది. పలు పథకాలు అమలు చేస్తూ పాడి రైతులను ప్రోత్సాహించింది. క్షేత్రస్థాయిలో పశువులు, జీవాలకు తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాడి పథకాలు నీరుగారాయి. వైద్య సేవలు కుంటుపడ్డాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే పశు సంవర్థక సహాయకులు సర్వేలకు పరిమితమయ్యారు. దీంతో పల్లెల్లో పశు వైద్యం అందని ద్రాక్షలా మారింది. నేడు వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. వరల్డ్ వెటర్నరీ డే చరిత్ర... ఏటా ఏప్రిల్ చివరి శనివారం రోజు వరల్డ్ వెటర్నరీ డే జరుపుకుంటున్నారు. జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, జంతు హింసను నిరోధించడానికి తీసుకోవాల్సిన ప్రయత్నాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఇందుకు తగ్గట్టు జిల్లాలో పశు వైద్య సేవలు అమలు కాలేదు. వేధిస్తున్న సమస్యలివీ.. పశు వైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో పశు వైద్యం మరుగున పడింది. మందుల, మాత్రల కొరత వేధిస్తోంది. డాక్టర్లు విధుల్లో ఉండడం లేదు. చాలా చోట్ల మధ్యాహ్ననానికే డుమ్మా కొడుతున్నారు. జిల్లా పశు వైద్యశాలలో టైపిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 1, అటెండర్లు –2, వెటర్నరీ అసిస్టెంట్ –1తోపాటు పలు పోస్టులు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోంది. అలాగే మండలాల్లోని పశు వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా పలు పోస్టులు ఖాళీలున్నాయి. ఇక ఉన్న సిబ్బంది కూడా సర్వేలకు పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో మూగజీవులు అనారోగ్య బారిన పడితే ప్రైవేటు వైద్యులే దిక్కుగా మారుతున్నారు. ఈ కారణంగా పశు వైద్యం మూగబోయి మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి. పశువైద్యానికి ఇబ్బందిగా ఉంది ముందు పశువైద్యానికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఫోన్ చేస్తే ఎక్కడున్న వైద్య సిబ్బంది వచ్చి వైద్యం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే బండి ఇంటికాడికి వచ్చేది. ఇప్పుడు పశువులకు వైద్యం చేయించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సిబ్బందికి ఫోన్ చేస్తే సర్వేలంటున్నారు. వాళ్లకు కూడా సర్వేలు ఇస్తే మూగ జీవాలు ఏమైపోవాలి. వారి సేవలు గ్రామాల్లో అవసరం. మనిషికి ఏ రకంగా తక్షణ వైద్యం అవసరమో..ఆ రకంగా జీవాలకు తక్షణ వైద్యం అవసరం. అధికారులు దీనినిగుర్తించాలి. – రాజేంద్ర, శ్రీరంగరాజుపురం ప్రస్తుత ప్రభుత్వ పాలనలో.. పశు సంచార పశు ఆరోగ్య సేవలు ఆపివేసింది. అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు జరగడం లేదు. రాయితీ పాడి పరికరాల అందజేతకు స్వస్తి పలికింది. బల్క్ మిల్క్ సెంటర్లను మూయించింది. మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. ఉచిత బీమాకు, పశు నష్ట పరిహారానికి మంగళం పాడింది. గత ఐదేళ్ల పాలనలో.. గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పశు వైద్య సేవలకు ప్రాధాన్యత ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పలు పథకాలను అమలు చేసింది. మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చింది. పశుసంవర్థక సహాయకుల నియామకం. వైఎస్సార్ పశునష్ట పరిహారం..ఉచిత బీమా పశు హెల్త్ కార్డులు వైఎస్సార్ చేయూత ద్వారా పశువుల కొనుగోలు 1962 నంబర్కు ఫోన్ చేస్తే వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు రాయితీ ద్వారా పశువులకు అవసరమైన మొక్క జొన్నలు, చాప్కటర్, మినరల్ మిక్చర్, పశువుల దాణా సరఫరా. సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు. పశువులు, జీవాలకు టీకాలు, పురుగుల మందులు పంపిణీ. వారానికొకసారి రైతులతో పశు సంవర్థక అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు. గ్రామంలో బల్క్మిల్క్ సెంటర్లు ఏర్పాటు చిత్తూరు నగరంలో మూతపడిన విజయ డెయిరీకి పునర్జీవనం పోసింది. అమూల్ డెయిరీకి అప్పగించి, అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ఈ ఫలితంగా జిల్లాలో పాడి పరిశ్రమ పుంజకుంది. చాలా మంది ఇతరాత్ర పనులను వదిలి పాడి ఆవులతో పాల ఉత్పత్తిని పెంచుకుంటూ జీవనం చేసేందుకు అడుగులు వేశారు. -
అంతా తికమక
మెగా మెలిక..● టెట్ ఉత్తీర్ణత సాఽధించినా డీఎస్సీ అర్హత కఠినతరం ● పది, ఇంటర్లో 50 శాతం అర్హత అవసరమా! ● ఇంటర్ తప్పి తిరిగి 35 శాతంతో పాసైన వారు ఐఏఎస్లు కాలేదా? ● సివిల్స్కు లేని నిబంధనలు డీఎస్సీకి ఎందుకు? ● ఇది కుట్రలో భాగమే అంటున్న నిరుద్యోగులు ● మండిపడుతున్న విద్యార్థి సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు – 3,766 ప్రాథమికోన్నత పాఠశాలలు – 445 ఉన్నత పాఠశాలలు – 705ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు– సుమారు 6,245ప్రస్తుతం భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు – 1,478 పోటీపడనున్న అభ్యర్థులు – 72 వేల మంది అర్హత మెలికతో డీఎస్సీకి దూరం కానున్న అభ్యర్థులు– సుమారు 14వేల మంది తిరుపతి సిటీ: ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వివాదాలకు తావిస్తోంది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. ఆన్లైన్ అగచాట్లు తలబొప్పి కట్టిస్తుండగా.. అర్హత నిబంధనలు తికమకపట్టిస్తున్నాయి. పది, ఇంటర్లో 40 నుంచి 50శాతం మార్కులు సాధించి ఉండాలని, అలాగే డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం తప్పనిసరి చేయడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం వెసులుబాటు కల్పించారు. గతంలో జరిగిన డీఎస్సీలో ఇలాంటి కఠన నిబంధనలు లేవని, కొత్తగా పది, ఇంటర్, డిగ్రీ మార్కుల అర్హతలను ప్రామాణికం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కుట్రలో భాగమేనా? సివిల్స్ సర్వీసుకు సైతం ఎలాంటి నిబంధనలు లేవు. పది, ఇంటర్లో సప్లమెంటరీ పరీక్షలు రాసి 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎంతో మంది సివిల్స్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యారు. అలాంటిది టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించినా పది, ఇంటర్, డిగ్రీల పర్సెంటేజ్పై నిబంధనలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీని సజావుగా జరపకూడదనే కుట్రతోనే ప్రభుత్వం మెలికలతో కూడిన డీఎస్సీని విడుదల చేసిందని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
డైయింగ్ ప్లాంట్లు తరలించాల్సిందే
డైయింగ్ యూనిట్లు నివాసాలకు దూరంగా తరలించాల్సిందేనని నగరి మున్సిపల్ కౌన్సిలర్లు రోడ్డెక్కారు.శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కుప్పం మున్సిపల్ చైర్మన్.. ఈ పదవికి కావాల్సిన బలం కూటమి పార్టీలకు లేదు..అయితేనేం.. అధికార బలం ఉంది.. ఆ బలుపు కనబరిచి.. ప్రలోభాల ఎర చూపి.. ఎత్తులు, జిత్తులు వేసి.. ఎలాగైనా చైర్మన్ గిరిని దక్కించుకోవాలని యత్నిస్తున్నారు. ఇందుకు బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నగదు ఆశ చూపి.. దానికి లొంగకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు కూటమి నేతలు. కుప్పంరూరల్: స్థానిక మున్సిపల్ చైర్మన్ పదవికి కావాల్సిన బలం లేకపోయినా అధికార బలం కనబరిచి ఆ పదవి దక్కించుకోవాలని కూటమి యత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి వరకు ఉన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అనివార్య కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి 2024 నవంబరు 5వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. చైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మిగిలిన తుని, పాలకొండలతో పాటు కుప్పం మున్సిపాలిటికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగిలింది. బలం లేకపోయినా ఎలాగైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చైర్మన్ గిరి దక్కించుకోవాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికలు ఇలా... సంఖ్యాపరంగా చూసుకుంటే వైఎస్సార్సీపీకి 15, టీడీపీకి 12 ఓట్లు ఉన్నాయి. మొత్తం 27 మంది సభ్యుల్లో 14 మంది ఎన్నికకు హాజరైతే కోరంగా పరిణగించి, ఎన్నికలు నిర్వహిస్తారు. హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎవరికి చేతులెత్తి మద్దతు తెలుపుతారో వారు చైర్మన్ అభ్యర్థిగా పరిగణిస్తారు. బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయాలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు 28న జరగనున్న నేపథ్యంలో నాలుగు రోజులు ముందుగా వైఎస్సార్ సీపీ, టీడీపీ అధిష్టానాలు కౌన్సిలర్లను బెంగళూరు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎవరికి వారు తమ అభ్యర్థులు జారీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి క్యాంపునకు తరలించారు. అక్కడ అన్ని రకాల సదుయాలు కల్పించి కౌన్సిలర్లు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరి దృష్టి సోమవారంపైనే... కుప్పం మున్సిపాలిటీలోని ప్రజల దృష్టి సోమవారంపైనే నిలిచింది. ఎవరు మున్సిపాలిటీ చైర్మన్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నిక జరుగుతుందా..? జరిగితే ఎవరు గెలుస్తారు..? అధికార పార్టీ తమ అధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎలాంటి కుతంత్రాలు పన్నుతోంది..? అనే విషయాలపై ప్రజల దృష్టి నిలిచింది. ఏది ఏమైనప్పటికీ సుమారు 56 వేల జనాభా ఉన్న కుప్పం ప్రజల చూపు సోమవారంపైనే నిలిచింది. కుప్పం మున్సిపాలిటీలో ప్రస్తుత బలాబలాలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల నియోజక వర్గంతోపాటు ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమైన కుప్పంపై వివక్ష చూపకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగానే కుప్పానికి రెవెన్యూ, పోలీసు డివిజన్లు వచ్చాయి. కుప్పం పట్టణాన్ని ఆరు పంచాయతీలతో కలిపి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీకి 2021 నంబర్ 15వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్ సీపీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మున్సిపాలిటీలో 25 వార్డులకుగాను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 19 మంది, టీడీపీ అభ్యర్థులు 6 గెలుపొందారు. వైఎస్సార్ సీపీ సభ్యులు అధిష్టానం అభీష్టం మేరకు డాక్టర్ సుధీర్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు తీసింది. గత ఏడాది జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో కుదుపు మొదలైంది. కూటమి నాయకులు, ప్రభుత్వం నుంచి వైఎస్సార్ సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. మొదటి వికెట్గా 2024 నంబర్ 5వ తేదీన చైర్మన్ డాక్టర్ సుధీర్ చైర్మన్ పదవితోపాటు, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి, టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో 16 వవార్డు కౌన్సిలర్ ఖాళీ కాగా, మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 24కు చేరింది. ఆయన బాటలోనే మరో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు. వెళ్లిన వారిలో 24వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఆలీ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ పరిణామంతో మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీకి 14, టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరే కాకుండా ఎక్స్ అఫిషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్ మున్సిపాలిటీ ఓటర్లుగా ఉన్నారు. వీరిని కలుపుకుంటే వైఎస్సార్ సీపీ కి 15, టీడీపీ 12గా సమీకరణలు మారాయి. ఆశావహుల్లో గుబులు... వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయం కౌన్సిలర్లకు అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా అందరు ఏకతాటిపై ఉన్నారు. అధికార పార్టీ టీడీపీలో మాత్రం అలజడి నెలకొంది. ముఖ్యంగా 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము, 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్, 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం చైర్మన్ రేసులో ఉన్నారు. వీరు ముగ్గురు తమకంటే తమకే అధిష్టానం ఆశీర్వాదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీ వారే కాకుండా ఎదుట పార్టీ వారిని ఫోన్ల ద్వారా పలకరిస్తూ తమకే మద్దతుగా నిలవాలని ఆశావాహుల్లో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. – 10లో– 10లోన్యూస్రీల్28న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బలం లేకపోయినా నెగ్గేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని ప్రలోభాలు మొదలైన ఇరుపార్టీల క్యాంపు రాజకీయాలు, రహస్య సమావేశాలు కుప్పంలో హాట్టాపిక్గా మారిన చైర్మన్ ఎన్నిక కుప్పం మున్సిపాలిటీ సమాచారం మొత్తం వార్డులు – 25 ఎన్నికల్లో పాల్గొంటున్న వార్డు సభ్యులు – 24 ఎక్స్ అఫిసియో సభ్యులు – 3 మొత్తం జనాభా – 48,532 (2011 లెక్కల ప్రకారం) మొత్తం ఓటర్లు – 39,319 పురుష ఓటర్లు – 18,838 మహిళా ఓటర్లు – 20,473 ట్రాన్స్జెండర్లు – 8 కుప్పంలో 144 సెక్షన్ అమలు కుప్పం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులరాజు తెలిపారు. ఈ నెల 28వ తేదీన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యాలయం వంద మీటర్ల దూరంలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి
బంగారుపాళెం: మండలంలోని ఎద్దులవారిపల్లె దళితవాడలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై టీడీపీ సానుభూతిపరులు దాడి చేశారు. గ్రామంలో పంచాయతీ తాగునీరు ఒకరోజు ఓ వైపు, మరో రోజు ఓ వైపు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తాగునీటి కొళాయికి సంబంధించిన గేట్వాల్ను టీడీపీ కార్యకర్త గోవిందస్వామి కుమారుడు రంజిత్కుమార్, మరో పక్కకు తిప్పాడు. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రావణ్కుమార్ గేట్వాల్ ఎందుకు తిప్పావని రంజిత్కుమార్ను ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దుర్భాషలాడుకున్నారు. నీటి కొళ్లాయి విషయంపై గురువారం ఉదయం మళ్లీ గోవిందస్వామి కుటుంబ సభ్యులు, శ్రావణ్కుమార్ కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో గోవిందస్వామి, అతని భార్య నాగరాజమ్మ, అతని కుమారుడు రంజిత్కుమార్, బంధువు శివయ్య, చిలకమ్మ కలసి శ్రావణ్కుమార్, అతని భార్య స్వాతి, బంధువు సరితపై రాళ్లతో దాడి చేశారు. దీంతో శ్రావణ్కుమార్, స్వాతి, సరిత గాయపడ్డారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హెల్మెట్ విధిగా పెట్టుకోండి
ద్విచక్రవాహనచోదకులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు.తిరుపతి, చిత్తూరు జిల్లాల పది ఫలితాల సమాచారం పరీక్షలకు హాజరైన బాలురు 24,786 ఉత్తీర్ణులైన బాలురు 17,377 పరీక్షలకు హాజరైన బాలికలు 22,689 ఉత్తీర్ణులైన బాలికలు 17,867 ఫెయిల్ అయిన బాలురు 7,409 ఫెయిల్ అయిన బాలికలు 4,822 మొత్తం ఫెయిల్ అయిన విద్యార్థులు 12,231 – 8లో -
డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభించిందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జ్ డీడీ మునీంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ ప్రారంభ కార్యక్రమాన్విన గురువారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సహాయం చేసేందుకు ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వెల్లడించారు. -
తహసీల్దార్ హుస్సేన్ సస్పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన స దుం ఇన్చార్జ్ తహసిల్దార్ హుస్సేన్ సస్పెండ్ అయ్యా రు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ సస్పెండ్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సదుం వీఆర్వో మహబూబ్ బాషాను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ మండలానికి నూతన తహసీల్దార్ నియమించే వరకు ప్రస్తుతం పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కు మార్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్న ట్లు పేర్కొన్నారు. హెల్మెట్ విధిగా పెట్టుకోండి చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ సూచించారు. రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా గురువా రం చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద హెల్మెట్ ర్యాలీ, రోడ్డు భద్రతపై రూపొందించిన పాటను ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇ టీవల స్కూటరిస్టులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కు వ మంది మరణిస్తున్నారని, హెల్మెట్ వాడకపోవడమే ఇందుకు కారణమన్నారు. గత ఐదేళ్లలో 350 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే, 170 మంది వరకు ద్విచక్ర వాహన చోదకులే ఉండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. రోడ్డు భ ద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఇక పాటను రూపొందించడంలో శ్రద్ధ చూపించిన ట్రాఫిక్ సీఐ నిత్యబా బును ఎస్పీ అభినందించారు. ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ భాష, ఈస్ట్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం కార్వేటినగరం: గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కార్వేటినగరం త్యాగరాజ పిళ్లై వీధికి చెందిన చిన్నిరెడ్డి కుమారుడు గోపాల్(52) కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాఽధితో బాధపడుతున్నాడు. గురువారం ఆ బాధ ఎక్కువ కావడంతో తాళలేక అతనే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు అతనిని ప్రైవేటు వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథ మ చికిత్స చేసి, తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అతన్ని రుయాకు తరలించారు. ప్రస్తు తం అతను రుయాలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇంటర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా
– బాధ్యతలు స్వీకరించిన నూతన డీఐఈఓ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డీఐఈఓ (జిల్లా ఇంటర్మీడియట్ అధికారి) శ్రీనివాసులు అన్నా రు. గురువారం ఆయన పీసీఆర్ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు చర్యలు చేపడతామన్నా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. మెరుగైన ఫలితాల సాధనకు ప టిష్ట ప్రణాళికను అమలు చేస్తామన్నారు. అనంతరం ఆయనకు మాజీ డీఐఈఓ సయ్యద్ మౌలా, ప్రిన్సిపల్ శరత్చంద్ర, అబ్దుల్ మజీద్, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
దళితులపై ఎందుకీ వివక్ష
శ్రీరంగరాజపురం : దళితులైన తమపై టీడీపీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ వివక్ష చూపుతున్నారని మంగుంట దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, టీడీపీ నేతల దళితులపై వివక్ష చూపుతున్న నేపథ్యంలో గురువారం వారు విలేకరుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని పేద ప్రజల వలసల నివారణకు స్థానికంగానే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం అమలు చేసి, 100 రోజులు పని కల్పనకు చర్యలు తీసుకుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉపాధి కూలీలపై నిర్లక్ష్యం, వివక్ష చూపుతుందని ఆరోపించారు. తమకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించక పోగా.. మీకు పని కావాలంటే టీడీపీ నాయకులు జీవన్బాబురెడ్డి, చంద్రరెడ్డి చెబితేనే కల్పిస్తాననని, లేకుంటే లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయుకులు జీవన్బాబురెడ్డి, చంద్రరెడ్డిని అడిగితే మా ఇంటి, పొలం వద్దకు పనిచేయడానికి వస్తేనే మీకు పని కల్పిస్తామని, లేకుంటే లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ మోహన్మురళి, ఏపీఓ లలితకూమారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖాలలు లేవన్నారు. కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో వీడ్కోలు చౌడేపల్లె: కుటుంబ సభ్యుల మనస్పర్థల కారణంగా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఎస్ఐ నాగేశ్వరరావు కుటుంబసభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్కుమార్, గుడిపల్లి, సోమల, చౌడేపల్లె, పుంగనూరుతోపాటు పలువురు పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ లక్ష్మి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. రూ: లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. లక్ష్మి మృతితో గోసలకురప్పల్లెలో విషాధ చాయలు అలుముకున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయి – టీడీపీ నాయకుడు షణ్ముగం చిత్తూరు రూరల్ : ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయని, తన కుమార్తె శ్రీదుర్గ మృతికి ముమ్మాటికి ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లే కారణమని బీసీ నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు పి షణ్ముగం ఆరోపించారు. గురువారం చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కుమార్తె మృతికి చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని వైద్యులే ప్రధాన కారణమన్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోనే చనిపోయిందని కన్నీంటి పర్యంతమయ్యారు. తలలో గాయపడిన విషయాన్ని తెలుసుకోకుండా ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపడంతోనే ఆమె మృతి చెందిందని గోడు వెలబోసుకున్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణ న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ ద్వారా సీఎం పేషీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
పది పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం
తిరుపతి సిటీ: జిల్లా విద్యార్థులకు నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదివే అవకాశాన్ని తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ కల్పిస్తోంది. పదోతరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సులో (పాక్శాసీ్త్ర) చేరేందుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, తెలుగు మాధ్యమాలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుల్లో కంప్యూటర్, గణితం, హిస్టరీ, వ్యాకరణం, సాహిత్యం, జ్యోతిష్యం, పిలాసఫీ, యోగా వంటి సబ్జెక్టుల్లో బోధన ఉంటుందని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా జాతీయ సంస్కృత వర్సిటీలో పాక్శాసీ్త్ర కోర్సులలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపారు. వచ్చేనెల 3 నుంచి దరఖాస్తులు జాతీయ సంస్కృత వర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సులు చేరదలుకున్న విద్యార్థులు వచ్చే నెల 3వ తే దీ నుంచి వర్సిటీ వెబ్సైట్ www.nrktu.ac.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు కోసం వర్సిటీలో అకడమిక్ సెక్షన్లో ఏర్పాటు చేసిన హెల్ఫ్ డెస్క్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సద్వినియోగం చేసుకోండి ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులై న విద్యార్థులకు జాతీయ సంస్కృత వర్సిటీ ఆహ్వానం పలుకుతోంది. నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సు పూర్తి చేసే అవకాశం వర్సిటీ కల్పిస్తోంది. పాక్శాసీ్త్ర (ఇంటర్మీడియెట్) కోర్సుకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్లు సైతం అందనున్నాయి. –ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, వీసీ, ఎన్ఎస్యూ నేషనల్ వర్సిటీలో ఇంటర్ చదివే భాగ్యం ఇంటర్మీడియెట్ (ప్రాక్శాస్త్రి) కోర్సులకు ఆహ్వానం పలుకుతున్న ఎన్ఎస్యూ వచ్చే నెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం -
రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి
కుప్పంరూరల్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు గురువారం మృతి చెందా రు. కుప్పం మండలం క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డగా, బీహార్కు చెందిన మరో యువకుడు కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారీ కిందపడి దుర్మరణం పాలయ్యాడు.కుప్పం యువకుడు బెంగళూరులో...కుప్పం మండలం, క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన లేట్ సోమశేఖర్ కుమారుడు కె. ఎస్. భువనచంద్ర (27) బెంగళూరు వైట్ఫీల్డ్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తల్లిదండ్రులు లేని భువన చంద్ర బెంగళూరు పట్ణణంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. నిత్యం బెంగళూరుకు ఉదయం వెళ్లి, రాత్రి ఇంటికి వస్తుంటాడు. రోజులాగానే భువన చంద్ర గురువారం ఉదయం బయలుదేరి బెంగళూరు వెళ్లాడు. ఏమైదో తెలియదు గానీ బెంగళూరు నగరంలోని వైట్ఫీల్డ్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గురువారం రాత్రి రైల్వే పోలీసులు భువన చంద్ర మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి బంధువులకు అప్పగించారు.రైలు నుంచి జారీపడి బిహార్ యువకుడు...సుమారు 27 ఏళ్ల వయస్సు ఉన్న బిహార్కు చెందిన యువకుడు బుధవారం అర్థరాత్రి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరు – గౌహతి వెళ్లే రైలు నుంచి జారి పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. వైట్ టీషర్టు, బ్లాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. అతని వద్ద బెంగళూరు నుంచి కంచ్గంజ్ వెళ్లే రైల్వే టికెట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు. -
బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రణాళికలు
● సర్కారు పాఠశాలలపై పర్యవేక్షణ శూన్యం ● ఉపాధ్యాయుల కొరతతో పలు సబ్జెక్టుల్లో తప్పిన విద్యార్థులు ● సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభావం చూపని పది ఫలితాలు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల సంఖ్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురి చేస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తొలి మెట్టులాంటి పదో తరగతిపై కూటమి సర్కారు అలసత్వ వైఖరి చూపడంతోనే ఈ చేదు ఫలితాలు చోటు చేసుకున్నట్లు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2,436, తిరుపతి జిల్లాలో 2,444 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి 20,796 మంది, తిరుపతి జిల్లా నుంచి 26,679 మంది మొత్తం 47,475 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో చిత్తూరు జిల్లాలో 13,456, తిరుపతి జిల్లాలో 21,298 మొత్తం 34,754 మంది ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన విద్యార్థులు పది పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాల్లో పది పరీక్షల్లో ఫలితాలు బోల్తా కొట్టడం పై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. కుప్పంలోనూ అదే వెనుకబాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ పది ఫలితాలు వెనుకబడ్డాయి. కుప్పం మండలంలో 1,833 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 703 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలురు అధికంగా 449, బాలికలు 254 మంది పది పరీక్షల్లో తప్పారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన మండలాల్లో పరీక్షల్లో తప్పిన విద్యార్థుల సంఖ్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ప్రభుత్వాలు ఇచ్చే బహుమతి ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే అని గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీచర్ల కొరతతోనే ఎక్కువ మంది విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్ కావాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి సర్కారు నిర్లక్ష్యం.. అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళిక లేమి.. విద్యాశాఖపై కొరవడిన పర్యవేక్షణ..ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థికి అందని బోధన.. అభ్యసన సామగ్రి.. వెరసి పది పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపింది. తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కుమారుడు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా వారి నిర్లక్ష్యం.. ఉదాసీనత.. అసంబద్ధ నిర్ణయాలతో సొంత జిల్లాల్లోనే పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో పదింతలు వెనుకపడ్డారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేద పిల్లలు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ పాలనలో ఇలా.. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల కొరత సర్దుబాటుచేసి బోధన సకాలంలో సిలబస్ పూర్తి ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక మెటీరీయల్ ముద్రించి సరఫరా ప్రణాళిక ప్రకారం రివిజన్ తరగతుల నిర్వహణ ఉత్తమ ఫలితాలకోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం, ప్రణాళిక అమలు కీలకమైన 77రోజుల కార్యాచరణ, ప్రత్యేక తరగతుల నిర్వహణ చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో గత ఏడాది 3,578 మంది విద్యార్థులు ఫెయిల్ఈ ఏడాది కూటమి పాలనలో.. విద్యాసంవత్సరం మధ్యలో టీచర్లను సర్దుబాటు చేయడం జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ సిలబస్ పూర్తి చేయని పరిస్థితి ప్రస్తుతం అలాంటి మెటీరియల్ జాడే లేదు ఫిబ్రవరి పూర్తి అయినా రివిజన్ తరగతులు లేమి ప్రత్యేక సమావేశం లేదు, పటిష్ట ప్రణాళిక సైతం అమలు కాలేదు కీలకమైన కార్యాచరణ లేనే లేదు. ప్రత్యేక తరగతులు ఆలస్యంగా నిర్వహణ ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,231 మంది విద్యార్థులు ఫెయిల్అలసత్వం తగదు ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే పేద విద్యార్థులపై కూట మి సర్కారు ప్రదర్శిస్తున్న అలసత్వ వైఖరి తగదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు పదో తరగతి చాలా కీలకం. అలాంటి పదో తరగతి పరీక్షలపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం. ప్రభుత్వ అలసత్వ వైఖరితోనే సీఎం సొంత జిల్లాలైన చిత్తూరు, తిరుపతి జిల్లాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్, చిత్తూరు జిల్లాఅనాలోచిన నిర్ణయాలే కారణం కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. విద్యాసంవత్సరం మధ్యలో సర్దుబాటు కార్యక్రమం ఎవరైనా నిర్వహిస్తారా? అనాలోచిత నిర్ణయాలతో వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. ఇందుకు గల కారణాలు విద్యాశాఖ అధికారులు నోరు మెదపకపోవడం బాధాకరం. సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురిచేస్తోంది. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి, తిరుపతి జిల్లా -
పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశాల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 756 మంది విద్యార్థుల పాఠశాల అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అదే పరీక్ష కేంద్రాలతో పాటు గిరింపేట మున్సిపల్ పాఠశాలలో జూనియర్ కళాశాలల అడ్మిషన్లకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 1,082 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, జిల్లా కో ఆర్డినేటర్లను నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి, జిల్లా గురుకుల కళాశాలల కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్ అయ్యాడు!
నాన్నమాటతోఉన్నత ఉద్యోగం.. రూ.కోటి ప్యాకేజీ.. జీవిత భాగస్వామికీ మంచి కొలువు.. మంచి సంసారం..సాఫీగా సాగే జీవనం.. అయినా ఏదో తెలియ ని వెలితి.. అసంతృప్తి.. ఏదో సాధించాలన్న తపన.. ఎలాగైనా కలెక్టర్ కావాలన్న పదే పదే గుర్తుకు వచ్చే చిన్ననాటి నాన్న మాట.. అతడిని సివిల్స్ వైపు నడిపించింది. అదే లక్ష్యం.. పట్టుదల..కృషి.. స్వీయశిక్షణ.. ప్రణాళిక.. మొక్కవోని ఆత్మస్థైర్యం.. వెరసి సివిల్ ర్యాంకర్గా నిలిచారు బైరెడ్డిపల్లె వాసి రంపా శ్రీకాంత్. పలమనేరు: లక్ష్యం కోసం కష్టపడి ప్రయాణిస్తేనే అది తప్పకుండా దక్కుతుందంటున్నారు ఇటీవల సివిల్ సర్వీసెస్లో 904 ర్యాంకు సాధించిన బైరెడ్డిపల్లి వాసి రంపం శ్రీకాంత్. ఉత్తమ ఉద్యోగం ఉన్నా జీవితంలో ఏదో తెలియని లోటు.. తాను సివిల్ సర్వేంట్ కావాలన్న తపనతో సివిల్స్ కోసం రోజుకు ఎనిమిది గంటల కష్టపడి చదువుతూ, కోచింగ్ తీసుకుంటేనే పరీక్షలు ఉత్తీర్ణత సాధించగలమన్న ఆలోచనను పక్కన పెట్టి, స్వీయశిక్షణతోనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రూ.కోటి పాకేజీ కంటే తండ్రి మాటే వేదంగా.. ‘నాన్న నువ్వు బాగా చదివి ఎలాగైనే కలెక్టర్ కావాలి.. అప్పుడే మనలాంటి పేదలకు సాయంగా ఉండొచ్చు.’ అని తండ్రి నాగరాజు చిన్నప్పుడు శ్రీకాంత్కు చెప్పిన మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకున్నారు. ప్రఖ్యాత కంపెనీలో భారీ ప్యాకేజీతో కొలువున్నా సంతృప్తి చెందలేదు. సివిల్స్ కొట్టాలనే తపన శ్రీకాంత్ను వేధిస్తూనే ఉండేది. దీంతో 2021 నుంచి ఆఫీసు పని ముగిశాక స్వీయ శిక్షణతో నాలుగు సార్లు సివిల్స్ రాసి, ఈ సారి ర్యాంకర్గా నిలిచారు. కోచింగ్తోనే ఐఏఎస్ ఛాన్స్ భావన పొరబాటు ఆన్లైన్లో మెటీరియల్తో స్వయంగా చదివా డీఎంఎంగా మంచి జీతం ఉన్నా అసంతృప్తి చిన్నప్పుడు తండ్రి మాటే జీవిత బాటగా.. సివిల్ సర్వీసెస్లో 904 ర్యాంకర్ శ్రీకాంత్ కష్టపడితే ఎప్పటికై నా విజయం క్యాట్ రాసిన అనుభవంతో సివిల్స్కు స్వయంగా చదవడం మొదలు పెట్టా. ఆన్లైన్లో మెటీరియల్, డైలీ న్యూస్ పేపర్లు చదవాను. ఆప్షనల్గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెట్టుకున్నా. ఇంటర్వ్యూలో సైతం ఎక్కువగా అంతర్జాతీయ వ్యవహారాలైన ఉక్రెయిన్ వార్, చైనా క్యాఫ్టలిస్ట్జం, టెర్రరిజం తదితరాలపైనే ఎక్కువ ప్రశ్నలడిగారు. చివరగా మనం చిన్నపాటి గ్రామంలో ఉన్నాం కదా ఐఏఎస్ కావాలంటే ఢిల్లీ కెళ్లి కోచింగ్ తీసుకోవాలనే మాట పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్లాలి. – రంపం శ్రీకాంత్, బైరెడ్డిపల్లి ఇదీ కుటుంబ నేపథ్యం పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి రంపం శ్రీకాంత్ స్వగ్రామం. తండ్రి నాగరాజు గంగవరం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి రేణుక గృహిణి. శ్రీకాంత్ బైరెడ్డిపల్లెలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై 6,7 తరగతులు అక్కడే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. 8 నుంచి 10వ తరగతి వరకు పలమనేరులోని లిటిల్ ఏంజెల్స్, ఇంటర్ శ్రీ చైతన్యలో చదివారు. ఆపై హైదరాబాద్లోని సీబీఐటీ బీటెక్ కంప్యూటర్ సైన్సు, తరువాత బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత అమెజాన్లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం గూగూల్లో రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు స్వీయశిక్షణ పొందుతూ స్వయంగా చదివారు. తిరుపతికి చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్న్స కుమార్తె శ్రావ్యను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. శ్రావ్య సైతం బెంగళూరులోని టార్గెట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. -
22 మంది విద్యార్థుల డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభమైన డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల్లో తొలిరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దామ్లానాయక్ తెలిపారు. హైపవర్ ఇన్స్ఫెక్షన్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి జోన్ పరిధిలో 16 మంది, చిత్తూరు జోన్ పరిధిలో ఆరుగురు విద్యార్థులు మాస్కాపీయింగ్కు పాల్పడగా అధికారులు వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. డీపీఓకు రాష్ట్రస్థాయి అవార్డు చిత్తూరు కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం పంచాయతీ పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానం వచ్చింది. ఇందుకుగాను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం డీపీఓ సుధాకర్రావు విజయవాడలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గుడిపాల మండలం చీలాపల్లె పంచాయతీలో జలజీవన్ మిషన్, ఇతర పథకాల్లో ప్రతిభ చూపినందుకు గుడి పాల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్కుమార్, సర్పంచ్ అరుణ్కుమార్ అవార్డులు అందుకున్నారు. పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి అరిఫ్ తెలిపారు. ఒక కుటుంబానికి 100 జీవాల వరకు బీమా చేసుకోవచ్చన్నారు. పది పశువులకు బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ పోను మేలు జాతి పశువుకు రూ.288, నాటు జాతి పశువురూ.114 ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే గొర్రెలు, మేకలు, పందులకు సంవత్సరకాలనికి రూ.27, రెండేళ్లకు రూ.40, మూడేళ్లకు రూ.56 చొప్పున్న ప్రీమియంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని పాడిరైతులు సద్వినియోగంచేసుకోవాలని, ప్రీమియం చెల్లింపునకు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. సీఎంసీ ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా గుడిపాల: చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆరా తీశారు. గురువారం సీఎంసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. రోగులకు వైద్యం అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమెర్జెన్సీ, ఎక్స్రే, ఓపీ కేంద్రాలను సందర్శించారు. -
చిన్నారి హల్ సెల్
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అనారోగ్య సమస్యలు తప్పవుసెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుసోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. -
అది పరువు హత్యే...!
చిత్తూరు అర్బన్: సంచలనం సృష్టించిన యాస్మిన్ భాను (26) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది ఆత్మహత్య కాదని, పరువు హత్యేనని నిర్ధారణ అయ్యింది. కన్న కూతురు ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతురిని హత్య చేసిన తండ్రి షౌకత్ అలీ (56), వరుసకు సోదరుడు అయిన మహ్మద్ బాషా అలియాస్ లాలా (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలామ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం మీడియాకు వివరించారు. పోలీసులను ఆశ్రయించినా లేని ఫలితం! చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కూతురు యాస్మిన్ భాను బీటెక్ చదివే సమయంలో సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించి, అందరికీ శుభ లేఖలు కూడా పంచేశారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ భాను, సాయితేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ముప్పు ఉందంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీనితో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి, వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయితేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ భానుతో ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.నమ్మించి గొంతు నులిమి..ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి, కూతురిని దుబాయ్ పంపాలనుకున్న షౌకత్ అలీ.. ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని తల్లి కోరడంతో, ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్భాను చిత్తూరుకు కారులో వచి్చంది. అప్పటికే మరో కారులో వేచివున్న లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం.. భానును వారి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలు దేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు. మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత, సాయితేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోలేదు. దీనితో కూతురి కాళ్లను తొక్కిపెట్టి, అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటివద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కుమార్తె కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్, స్థానికుల సాయంతో యాస్మిన్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయితేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు రెండుసార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది.పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. -
వేసవి సెలవులు.. దొంగలతో జాగ్రత్త
చిత్తూరు అర్బన్ : పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. విహార యాత్రలు, ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంట్లో చోరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో కోరారు. ఎవరైనా బయటి ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలా చేస్తే తాళం వేసిన ఇళ్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా 16,500 స్మార్ట్ డోర్ లాక్స్ సైతం పంపిణీ చేశామన్నారు. ఎవరైనా బయటి ఊర్లకు వెళితే ఫోన్ 112, పోలీసు వాట్సాప్ 94409 00005 నంబర్లకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. 28 నుంచి వేసవి శిక్షణ తరగతులు చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని గ్రంథాలయాల నందు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు డిప్యూటీ గ్రంథాలయాధికారి లలిత తెలిపారు. పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్, డాన్స్, చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఊపందుకున్న ‘గుజ్జు’ పరిశ్రమలు ● కేరళ నుంచి ‘మామిడి’ దిగుమతి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లాలో కొన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు తెరుచుకున్నాయి. అప్పుడే గుజ్జు తయారీని మొదలుపెట్టాయి. జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలుండగా... నాలుగు పరిశ్రమలు గుజ్జు తయారీని ప్రారంభించాయి. కేరళ నుంచి అల్పోన్సో రకం కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. గుజ్జు తయారీని ఆచితూచి చేస్తున్నాయి. ఇలా నిత్యం 90 టన్నుల వరకు దిగుమతి అవుతున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా జిల్లాలో గతేడాది మామిడి గుజ్జు 2.75 లక్షల టన్నుల తయారీ చేసి నిల్వ చేశారు. యుద్ధాలు, ఇతర కారణాల వల్ల గుజ్జు నత్తనడకన అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం వరకు అమ్ముడుపోయిందని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. పరిశ్రమదారులు పట్టుబట్టి విదేశాల ఎగుమతిపై దృష్టి పెట్టారు. దీని కారణంగా గుజ్జు ఎగుమతులు కదులుతున్నాయి. టెక్నాలజీతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తిరుపతి సిటీ: టెక్నాలజీని సంస్కృత శాస్త్రాలలో విరివిగా వినియోగించుకుని విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలని వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి సూచించారు. వర్సిటీలో జాతీయ సంస్కృత వర్సిటీ, సీడాక్ సంస్థ సంయుక్తంగా ఏఐ, ఎంఎల్, క్వాంటం కంప్యూటింగ్, ఐకేఎస్పై రెండు రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి అందించాలంటే టెక్నాలజీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణప్రపూర్ణ, విభాగాధిపతి ప్రొఫెసర్ గణపతి భట్, ప్రొఫెసర్ రమాశ్రీ, డాక్టర్ జానకి, ప్రొఫెసర్ చంద్రశేఖరం, శ్రీధర్, నాగలక్ష్మీ, ప్రసన్న పాల్గొన్నారు శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 2 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,828 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రైవేటు చేతికి అస్త్రం
ప్రభుత్వ సేవలను ప్రైవేటు పరం చేయడంతో వాహన సామర్థ్య పరీక్షలు ప్రైవేటు నిర్వాహకుల చేతిలోకి వెళ్లనున్నాయి. ఓపెన్ ‘పది’ బోల్తా ● పదిలో 8.91 శాతం, ఇంటర్లో 20.05 శాతం చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా బోల్తా కొట్టింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. దీంతో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో పాటు అత్యధికంగా అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. పది ఫలితాల్లో.. ఏపీ ఓపెన్ స్కూల్లో గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఈ సంవత్సరం పది ఫలితాల్లో 8.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పురుషులు 506, మహిళలు 358 మొత్తం 864 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పురుషులు 61, మహిళలు 16 మంది మొత్తం 77 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 12.06 శాతం, మహిళలు 4.47 మొత్తం 8.91 శాతం జిల్లా ఉత్తీర్ణత నమోదైంది. 787 మంది ఫెయిల్ అయ్యారు. ఓపెన్ పది పరీక్షల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20 స్థానంలో నిలిచింది. ఇంటర్లో .. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఉత్తీర్ణత శాతం 20.05 నమోదైంది. ఈ పరీక్షలకు పురుషులు 2005, మహిళలు 1003 మొత్తం 3008 మంది హాజరయ్యారు. వీరిలో పురుషులు 360, మహిళలు 243 మొత్తం 603 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 17.96, మహిళలు 24.23 మొత్తం 20.05 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షల్లో 2405 మంది ఫెయిల్ అయ్యారు. – 4లో -
కుప్పం కిరీటంపై కూటమి కన్ను
వైఎస్సార్ సీపీ సభ్యులకు ప్రలోభాలు అధికారం చేపట్టిన టీడీపీ ఎలాగైనా మున్సిపల్ కౌన్సిల్ ఎంపిక కోసం ప్రస్తుతం 9 మంది కౌన్సిల్ సభ్యులతో ఉన్న తెలుగుదేశం పార్టీ మరో ముగ్గురిని పార్టీలోకి లాగేయాలని ప్రలోభాలకు గురి చేస్తోంది. ఓ మహిళా కౌన్సిలర్ కుమారుడికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ పెట్టారు. మరో ముగ్గురు కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. అందరి దృష్టి కుప్పం చైర్మన్ గిరిపైనే పడింది. టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరు చైర్మన్ అవుతారనే విషయం 28వతేదీన తేలనుంది. -
టైర్ పరిశ్రమలో భారీ పేలుడు
● చెలరేగిన మంటలు ● భయాందోళనకు గురైన గ్రామస్తులు ● త్రుటిలో తప్పిన ప్రమాదం ● తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం నగరి : మండలంలోని నాగరాజకుప్పం మార్గంలోని దీపం టైర్ పరిశ్రమలో బుధవారం ఉదయం భారీ పేలుడు శబ్దం వచ్చి అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ప్లాంటుపై ఉన్న ఇనుప రేకులు ఒక్కసారిగా ఎగిరి పొగలు కక్కుతూ పక్కనే ఉన్న రోడ్డుపై పడ్డాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాంటు పక్కనే ఉన్న రోడ్డులో తరచూ ద్విచక్ర వాహనదారులు సంచరిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి భయటకు వచ్చేయడంతో ఎవరూ గాయపడలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఉదాసీనతే.. ఈ పరిశ్రమలో అగ్ని ప్రమాదం ఇది వరకే సంభవించి పేలుడు దాటికి విద్యుత్ స్తంభాలు వంగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్లాంటుకు ఆనుకొని నాగరాజకుప్పం, భీరకుప్పం, ఓజీకుప్పం, కృష్ణాపురం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ప్లాంటుకు కూతవేటు దూరంలోనే సుమారు 1300 మందికి కేటాయించిన జగనన్న కాలనీ ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. టైర్లు కాల్చే దుర్వాసన కాలనీలోని నివాసాల వరకు వ్యాపిస్తోందని. దానిని భరించలేకున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్లాంటు పక్కన రోడ్డుపై వెళ్లే సమయంలో ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మంటలు చెలరేగడంతో దుర్వాసన రెట్టింపైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలకు సమీపంగా ఉన్న ప్రమాదకర పరిశ్రమ నివాసాలకు దూరంగా మార్చి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. పేలుడు శబ్ధం వినిపించినా ప్లాంటు యజమానులు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్లు మండి ప్రమాదం సంభవించిందని తెలుపుతోంది.మండుతున్న టైర్ ప్లాంటు -
ప్రైవేటు చేతికి అస్త్రం
● వాహనాల ఫిట్నెస్ పరీక్ష ప్రైవేటు పరం ● జిల్లాలో ప్రత్యేకంగా టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● వాహనాల పరీక్షలపై అనుమానాలు కాణిపాకం : ప్రభుత్వ సేవల్లో అత్యంత ప్రధానమైన, ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది. రైల్వే శాఖలో పలు సేవలను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఇందులో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీ విధానం వేగంగా సాగిపోయింది. ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరైంది. ఇప్పటి వరకూ రవాణా శాఖ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు, ఇకపై లైట్, హెవీ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు సంస్థ మాత్రమే జారీ చేస్తుంది. ఈ సంస్థపై స్థానికంగా ఎవ్వరి అజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది. సర్టిఫికెట్ల జారీ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 3,67,008 ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఒక్కో జిల్లా నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూరేది. దీనిని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు వాహనాల ఫిట్నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మును ఫిట్నెస్ స్టేషన్లు రెండేళ్ల పాటు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించనక్కరలేదు. ఈ మేరకు టెండరలలో నిబంధన పెట్టారని చెబుతున్నారు. బంగాపాళ్యం వద్ద టెస్టింగ్ స్టేషన్.. జిల్లాకు సంబంధించి బంగారుపాళ్యం మండలం మహాసముద్రం టోల్గేట్ సమీపాన సుమారు రూ.4.5 కోట్లతో వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ప్రారంభానికి నోచుకోనుంది. ఈ స్టేషన్లో మెషీనరీతో పాటు 21 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ ఇక్కడే జరుగుతాయి. సిబ్బందిని సైతం సంబంధిత ప్రైవేటు ఏజెన్సీ నియమించుకుంటుంది. ఇందులో రాష్ట్ర రవాణాశాఖ అధికారుల ప్రమేయం కాని, అజమాయిషీ కానీ ఏమాత్రం ఉండదు. పారదర్శకత ప్రశ్నార్థకం వాహనాల ఫిట్నెస్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్పుడే ప్రమాదాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం. అన్నీ ప్రైవేటు వ్యక్తులే చేస్తుండటంతో పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెస్టులు నిర్వహిస్తే మంచిదేనని, తమకు ఎవరూ నియంత్రించలేరంటూ ఎలాపడితే అలా చేస్తే ప్రమాదాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి..ఈ టెస్టులో మార్పులు చేసి పారదర్శకతను జోడించాలని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వాహన వివరాలు.. ఫిట్నెస్ టెస్ట్ ఇలా.. రోడ్లపై తిరిగే ప్రైవేటు బస్సులు, కార్లు, క్యాబ్, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సుల వంటి ప్రతి వాహనానికీ ఫిట్నెస్ టెస్టులు తప్పనిసరి, పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ట్రాన్స్పోర్ట్, తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే నాన్– ట్రాన్స్పోర్టు వాహనాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్ టైంలో మొదటి ఎనిమిదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఏడాదికోసారి ఈ పరీక్ష తప్పనిసరి. 15 ఏళ్లకు కండిషన్ చూసి, ఆపేయాలి, స్కూల్ బస్సులకు 15 ఏళ్ల వరకే ఫిట్నెస్ చూస్తారు. తర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వాహన తనిఖీలు ఎంత వరకూ సక్రమంగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలు ప్రహసనంగా జరిగేవి, కొందరు. అధికారులు మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. దీంతో, ప్రమాదాలు చోటు చేసుకునేవి. ప్రధానంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరిగేవి. ఇప్పుడు ప్రైవేటు చేతిలో పెడితే అటువంటి పరిస్థితులే ఎదురైతే ఎలాగనే ప్రశ్న వాహనదారులు, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రైవేటు ఏజెన్సీపై పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
చౌడేపల్లె : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చౌడేపల్లె మండలంలోని గోసలకురప్పల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజ , నాగమ్మలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందగా తల్లి నాగమ్మ, అక్క మంజులతో కలిసి కానిస్టేబుల్గా పనిచేస్తున్న వై.లక్ష్మి(34) నివసిస్తున్నారు. చౌడేపల్లె సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లక్ష్మి ఇటీవల బదిలీల్లో భాగంగా గుడిపల్లె పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. లక్ష్మి భర్త హరి ప్రసాద్ పలమనేరులోని ఓ ప్రవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. మృతురాలి తల్లి నాగమ్మ, అక్క మంజులతో పాటు కలిసి ఇంట్లో మాట్లాడుతుండగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన అక్క కుమార్తెతో భర్త సరిగా మాట్లాడలేదని ఎందుకని ప్రశ్నిస్తూ భర్తను కానిస్టేబుల్ లక్ష్మి నిలదీసిందన్నారు. భర్త కుటుంబ సభ్యుల ముందు సమాధానం చెప్పకపోవడంతో కోపంతో హాలులో నుంచి బెడ్ రూములోకి లక్ష్మి కోపంగా వెళ్లి తలుపు గడియ పెట్టుకొందని, ఈక్రమంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. లక్ష్మి మృతితో గోసలకుర్పల్లెలో శోక సంద్రంగా మారింది. -
ఉగ్రదాడి పిరికి చర్య
చిత్తూరు కార్పొరేషన్ : కశ్మీర్లో జరిగిన దాడితో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. దాడికి కారణమైన వారిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడికి నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి గాంధీవిగ్రహం వరకు నాయకులతో కలిసి దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. కాల్పుల్లో 26 మంది చనిపోవడం, 20 మందికి పైగా గాయాలపాలవడం బాధాకరమన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ , మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లిన వారిని ఇలా చంపడం అత్యంత హేయమన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి పిరికిపింద చర్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపా మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు , ప్రజాప్రతినిధులు సరళమేరి, అంజలిరెడ్డి, ఆను, రజనీకాంత్, అన్బు, లక్ష్మణస్వామి, చల్లాముత్తు, దేవరాజు, శేఖర్, సురేష్, రాజశేఖర్, మనోహర్రెడ్డి, స్టాండ్లీ, శివ, చాన్బాషా, అల్తాఫ్, అఫ్జల్ఖాన్, చామంతి, రంజిత్, రాజేష్, శాంతి, హరీషారెడ్డి, సెల్వ పాల్గొన్నారు. కశ్మీర్ ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న విజయానందరెడ్డి, చంద్రశేఖర్ -
మెరిసిన ఆణిముత్యాలు
చిత్తూరు కలెక్టరేట్ : గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయని విధంగా వైఎస్సార్సీపీ సర్కారు విద్యాభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు విద్యనభ్యసించే సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుతో పేదింటి పిల్లల చదువులు సమున్నత స్థాయికి చేరాయి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన అందించారు. దీంతో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెరిగాయి. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. కార్పొరేట్ను తలదన్నేలా .. ఒక్కప్పుడు కార్పొరేట్ విద్యారంగానికే పరిమితమైన స్టేట్ ర్యాంకులు, మండల ర్యాంకులను ప్రస్తుతం ప్రభుత్వ బడుల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. సీబీఎస్ఈ సిలబస్ , అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు దోహదపడ్డాయి. ప్రభుత్వ బడుల్లో మండలాల వారీగా ఇలా... జిల్లాలోని ప్రభుత్వ బడులకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. హేమ 592 మార్కులు (మంగళపల్లి జెడ్పీ, బంగారుపాళ్యం), అలేఖ్య 592 మార్కులు(విజయపురం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్), చందు, మంజుల 590 (బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గురుకుల), రెడ్డి ప్రసన్న 589 (పుంగనూరు బాలికల పాఠశాల), భావన 588 (పలమనేరు బాలికల పాఠశాల), కుష్ నిహాజ్ 587 (పులిచెర్ల మండలం కల్లూరు జెడ్పీ) , సుష్మశ్రీ 587 (పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట బీసీ గురుకుల), దినీషా 586 (పూతలపట్టు మండలం పి.కొత్తకోట జెడ్పీ), శ్రావణి 586 (కుప్పం మండలం, గరిగశీనేపల్లి జెడ్పీ), రిషిత 585 (రొంపిచెర్ల మండలం ఏపీ మోడల్ స్కూల్), రితిక 584 (వి.కోట మండలం వి.కోట బాలికలు), యోగిత 583 (గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి జెడ్పీ), జయంత్ 583 (ఐరాల మండలం ఎం.పైపల్లి జెడ్పీ), సుదర్శన్ 582 (సదుం మండలం బీసీ గురుకుల), కౌసర్ 582 (చిత్తూరు అర్బన్ డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాల), సతీష్ 582 (నగరి మండలం చింతలపట్టెడ జెడ్పీ), విష్ణు 581 (ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం జెడ్పీ), లిఖిత 580 (చౌడేపల్లి మండలం ఏ.కొత్తకోట జెడ్పీ), మేఘన 578 (వెదురుకుప్పం మండలం జక్కదొన జెడ్పీ), భానుప్రకాష్ 577 (సోమలమండలం పెద్దఉప్పరపల్లి జెడ్పీ), ప్రశాంత్ (కార్వేటినగరం మండలం కత్తెరపల్లి), హారతి (గంగవరం మండలం జీఎల్ఎస్ఫార్మ్ జెడ్పీ), భూమిక (యాదమరి మండలం డీకే చెరువు జెడ్పీ) 576 మార్కులు, జ్ణానహర్ష (పెనుమూరు మండలం జెడ్పీ), సబీహా సధాఫ్ (రామకుప్పం మండలం రామకుప్పం బాలికలు జెడ్పీ) 571 మార్కులు, సింధుభార్గవి 568 (గుడిపాల మండలం కేటీపల్లి జెడ్పీ), ఇందుజా (శాంతిపురం మండలం ఏపీమోడల్), స్వప్న (గుడుపల్లి మండల కేంద్రం జెడ్పీ) 567 మార్కులు, అభినయ 563 (పాలసముద్రం మండలం టీఆర్పురం జెడ్పీ), మౌనేష్ 554 (తవణంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ), వికాస్ 545 (చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట హైస్కూల్), అనుష్క 542 (నిండ్ర మండల కేంద్రంలోని హైస్కూల్) లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ ఫలితాలు ఫలించిన గత సర్కారు సంస్కరణలు ప్రైవేట్కు దీటుగా విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు బంగారుపాళ్యం, విజయపురం మండలాల్లో 592 మార్కులు గుడిపాల మండలంలో అత్యధిక ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 67.06 ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అత్యధికంగా గుడిపాల మండలం పదో తరగతి విద్యార్థులు 95.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా శ్రీరంగరాజపురం మండలంలో 35.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన మండలాల్లో బైరెడ్డిపల్లిలో 66.98, బంగారుపాళ్యం 54.78, చిత్తూరు 75.92, చౌడేపల్లి 64.94, గంగాధర నెల్లూరు 60.09, గంగవరం 73.69, గుడుపల్లి 54.17, ఐరాల 68.77, కార్వేటినగరం 71.12, కుప్పం 61.65, నగరి 67.8, నిండ్ర 66.49, పలమనేరు 70.56, పాలసముద్రం 81.87, పెద్దపంజాణి 70.49, పెనుమూరు 57.51, పులిచెర్ల 54.34, పుంగనూరు 72.61, పూతలపట్టు 85.91, రామకుప్పం 49.78, రొంపిచెర్ల 58.62, శాంతిపురం 57.62, సదుం 85.71, సోమల 75.14, తవణంపల్లి 80.66, వెదురుకుప్పం 70.64, వి.కోట 57.26, విజయపురం 70.71, యాదమరి 64.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ ఫలితం నేడు కనిపిస్తోంది. బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సర్కారు బడుల విద్యార్థులు ప్రతిభ చాటారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. -
జర్నలిస్టులకు రక్షణేదీ?
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు రక్షణ కరవయ్యిందని, రాష్ట్రంలోని జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం.. భౌతిక దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిందని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిలా అధ్యక్షుడు లోకనాథన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని వేధింపులు తాళలేక టీడీపీకి చెందిన దంపతులు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే.. ఆ వార్త రాసినందుకు సాక్షి కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేస్తూ.. పాత్రికేయ రంగాన్ని భయపెట్టాలని చూడాలనుకోవడం అవివేకమన్నారు. ఈ దాడులకు పాల్పడ్డ కూటమి నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పాత్రికేయులపై దాడులు జరగకుండా జర్నలిస్టుల రక్షణ కోసం కమిటీను ఏర్పాటు చేసి, దుండగులను శిక్షించే కొత్త చట్టాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని, జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి అసెంబ్లీలో చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఇషార్ అహ్మద్ మాట్లాడుతూ.. వార్త నచ్చకుంటే ఖండించాలని, వివరణ ఇవ్వాలని.. ఇలా భౌతికంగా దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్బాబు, కాలేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్వి మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్కుమార్, చిత్తూరు ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్, పవన్కుమార్, గంగాధర నెల్లూరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తిరుమలయ్య, జిల్లా సీనియర్ జర్నలిస్టులు హేమంత్కుమార్, శివకుమార్, వీర రాఘవులు నాయుడు, బాలసుందరం, హరీష్, రాజేష్, శ్రీనివాసులు, చిన్న, చంద్రప్రకాష్ పాల్గొన్నారు. ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి దాడులకు పాల్పడడంపై మండిపడిన సంఘాలు చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు -
బాలికలదే హవా
● పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 24వ స్థానం ● సీఎం జిల్లాలో దారుణ ఫలితాలు ● గతేడాది 6వ స్థానం నుంచి 24కు దిగజారిన వైనం ● 67.06 శాతం ఉత్తీర్ణత నమోదు ● 20,796 మందికి 13,946 మంది ఉత్తీర్ణత ● జిల్లా ఫలితాలు విడుదల చేసిన డీఈఓ పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కాగా అందులో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురైంది. సీఎం సొంత జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచి అందరినీ విస్మయానికి గురిచేసింది. 67.06 శాతం ఉత్తీర్ణత సాధించి అటు విద్యాధికారులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర నిరాశ పర్చింది. గతేడాది జిల్లా 6వ స్థానంలో ఉండగా నేడు ఏకంగా 24వ స్థానానికి పడిపోవడంతో మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాఖలో పది ఫలితాలు దారుణంగా పడిపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఊరట చెందాల్సిన అంశం బాలికలు 73.20 శాతం ఉత్త్తీర్ణత సాధించి జిల్లా పరువు నిలబెట్టారు. జిల్లా ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ వరలక్ష్మి చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 26 స్థానాల్లో 24వ స్థానంలో నిలిచింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు 24వ స్థానంలో నిలవడం ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలను డీఈఓ వరలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, సిబ్బంది మురళి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏటా లాగే ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలే జిల్లాలో ముందంజలో నిలిచారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 11.9 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను కై వసం చేసుకున్నారు. దిగజారిన జిల్లా స్థానం. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు స్థానం పదో తరగతి ఫలితాల్లో దిగజారింది. గత విద్యాసంవత్సరంలో చిత్తూరు జిల్లా స్థానం రాష్ట్రంలో 6వ స్థానం సాధించగా ఈ విద్యాసంవత్సరం 24వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా స్థానం 67.06 శాతం నమోదైంది. గత విద్యాసంవత్సరం కంటే ఫలితాలు తగ్గడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. 6,850 మంది ఫెయిల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6,850 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. గత విద్యాసంవత్సరం 1826 మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు. ఈ విద్యా సంవత్సరం అంత కంటే ఎక్కువగా పరీక్షల్లో ఫెయిల్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13,946 మంది ఉత్తీర్ణత చెందగా 6,850 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.సందేహం ఉంటే .. 2025ఉత్తమ ఫలితాల్లోనూ అథమ స్థానమే.. జిల్లా వ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో మొదటి డివిజన్లో 10,096 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పరీక్షల్లో 13,946 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో మొదటి డివిజన్లో 10,096, రెండో డివిజన్లో 2,562, మూడో డివిజన్లో 1,288 మంది ఉత్తీర్ణత పొంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మూడు డివిజన్ల ఉత్తమ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లా ఫలితాల సమాచారం పరీక్షలు రాసిన బాలురు 10,723 ఉత్తీర్ణత చెందిన బాలురు 6,573ఉత్తీర్ణత శాతం 61.30 శాతంపరీక్షలు రాసిన బాలికలు 10,073 ఉత్తీర్ణత చెందిన బాలికలు 7,373ఉత్తీర్ణత శాతం 73.20 శాతంఫెయిల్ అయిన విద్యార్థులు 6,850పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా.. బాగా రాసి ఫెయిల్ అయినా.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున మే1వ తేదీ రాత్రి 11 గంటల లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మే 30 వ తేదీ లోపు అపరాధ రుసుం లేకుండా, రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 18 వ తేదీ లోపు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
కుప్పంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పెద్దవంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రోజుకు సుమారు 150 టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. హంద్రీనీవా పేరుతో అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా అతివేగంతో టిప్పర్లు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. టిప్పర్ అతివేగంగా రావడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన తాము కింద పడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుప్పంలో అధికార పార్టీకి చెందిన బడా నాయకుడి బావమరిది కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుక మాఫియా అక్రమ రవాణా చేస్తోంది. -
పేదలకు బియ్యం కోత..!
● జిల్లాలో అరకొరగా బియ్యం సరఫరా ● వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వని వైనం ● ముగిసిన పంపిణీ గడువు కాణిపాకం: కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొడుతోంది. డీలర్ల చేతివాటానికి కార్డుదారులను బలి చేస్తోంది. పలుచోట్ల వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వకుండా డీలర్లు చేతులు దులుపుకున్నారు. రేషన్ పంపిణీ గడువు సోమవారంతో ముగియడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 1,390 చౌక దుకాణాల పరిధిలో 5,36,686 రేషన్ కార్డులున్నాయి. వంద శాతం రేషన్ పంపిణీకి మిగులు బియ్యం ఆధారంగా ప్రతి నెలా జిల్లాకు 9 నుంచి 10 టన్నుల రేషన్ బియ్యం అవసరమవుతోంది. అయితే ఈ నెల 8,300 టన్నుల బియ్యం మాత్రమే సరఫరా జరిగింది. కోతలిలా.. జిల్లాలో ఈ నెలకు 9 వేల టన్నుల రేషన్ బియ్యం అవసరం కాగా కేవలం 8 వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. వెయ్యి టన్నుల వరకు జిల్లాకు కోత పెట్టింది. ఆ తర్వాత 300 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన్న 6 షాపులకు సరిపడ బియ్యం ఉందని ప్రభుత్వం సరఫరాను ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 40 షాపులకు 10 శాతం బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని షాపులకు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే సరుకు చేరిందని వెల్లడించారు. దీని దెబ్బకు జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ గందరగోళంగా మారింది. కొన్ని చోట్ల రేషన్ సకాలంలో ఇవ్వక ఇబ్బంది పెట్టేశారు. మరికొన్నిచోట్ల కార్డుదారుల నుంచి ముందుగానే వేలిముద్రలు వేసుకుని, బియ్యం వరకు సర్దుబాబు చేశారు. కొన్ని షాపుల్లో వేలిముద్రలు వేసుకుని సరుకులు లేదని చెప్పేశారు. కొంత మంది అసలు రేషన్ రాలేదని తిప్పి పంపించేశారు. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 5,36,686 కార్డులదారులగాను 4,69,468 మంది రేషన్ తీసుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కన్న 67,218 మంది రేషన్కు దూరమయ్యారు. ఐరాలలో మండలంలో ఇలా.. బియ్యం పంపిణీ గడువు ముగిస్తున్నా బియ్యం ఇవ్వకపోవడంతో ఆదివారం ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కార్డుదారులు రేషన్ కార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీఆర్వో ద్వారా సరుకులు ఇస్తున్నారని.. ఆయన వేలిముద్రలు వేసుకుని సరుకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 70 మందికి ప్రతినెలా సరుకులు ఇవ్వడం లేదని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇవ్వలేదు.. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులతోనే మూడు ముద్దలు తింటున్నాం. ఆ బియ్యం రెండు నెలలుగా రేషన్ ఇవ్వకపోతే మేం ఎట్టా బతకాలి. డీలర్ షాప్కు వస్తే స్టాక్ రాలేదంటున్నారు. బయట ఇదే రేషన్ బి య్యం కేజీ రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నా రు. సన్నబియ్యం కేజీ రూ. 60 ఆ ధరలు చూస్తేనే మా కడుపులు మండిపోతున్నాయి. –సుధాకర్, పుల్లూరు, ఐరాల మిగులు ఏమైనట్టో.. జిల్లాలో 250 చౌక దుకాణాల పరిధిలో ఈ నెల బియ్యం కొరత వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంపిణీలో సగటున లెక్క వేసి, బియ్యం డీలర్లకు సరఫరా చేశారు. గత నెల మిగులు బియ్యం, తాజాగా సరఫరా అయిన స్టాక్తో ఏ సమస్య రాకూడదు. అయితే గత రెండు, మూడు మాసాలుగా బియ్యం కొరత వస్తోందంటున్నారు. దీనికి కారణమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు. జిల్లాలో రేషన్ వివరాలు ఎంఎల్ఎస్ పాయింట్లు 41 చౌకదుకాణాలు 1390 మొత్తం రేషన్కార్డులు 5,36,686 రేషన్ తీసుకున్న కార్డుదారులు 4,69,468 రేషన్ తీసుకోనివారు 67,218 పుంజుకున్న అక్రమ వ్యాపారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్ అక్రమ వ్యాపారం పుంజుకుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో 250 మందిపైగా డీలర్లను తొలగించారు. దీంతో అక్కడి నుంచి ఆరంభమైన అక్రమవ్యాపారం..జోరుగా సాగింది. గత పది నెలల కాలంలో 80 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడగా, అందుకు సంబంధించిన వ్యాపారులంతా కూటమి పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇట్టా చేస్తే ఎట్టా... మేము పేదోళ్లం. మా కడుపులు కొడితే ఎట్టా. రేషన్ ఇవ్వకుండా మానేస్తే ఏం చేయాలి..ఏం తినాలి. దీనే నమ్ముకుని బతుకుతుండాం. ఈనెల రేషన్ ఇవ్వకుండా చేస్తే...దిక్కుమొక్కుల లేన్నోళ్లం. ప్రతి నెల ఇది మాదిరిగానే జరిగితే కష్టం. అధికారులు ఓ తూరి మా బతుకులు చూసి రేషన్ ఇచ్చేలా చూడండా. –అదెమ్మ, పుల్లూరు గ్రామం, ఐరాల -
రైతుల రక్తం పీల్చేస్తున్నారు!
● చిత్తూరులో కూటమి పార్టీ దౌర్జన్యాల ‘గేటు’ ● పేదల నుంచి రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూలు ● అడిగే దిక్కులేదు.. అడగాల్సిన అధికారుల మౌనం ● ‘మార్కెట్ గేట్’ పేరిట జనం నుంచి రూ.లక్షల లూఠీ బలవంతపు వసూళ్లు చిత్తూరులో రోడ్లపై చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు, రైతుల రక్తాన్ని పీలుస్తూ.. వారి కష్టాన్ని దర్జాగా దోచుకోవడానికి ‘గేటు’ అనే పేరు పెట్టుకున్న కూటమి పార్టీకి చెందిన నాయకులు నడిరోడ్డుపై చేస్తున్న దౌర్జ న్యాలను ప్రశ్నించే దిక్కు కనిపించడంలేదు. ఎక్కడో మారుమూల పల్లెలో పనులు దొరకని రైతులు పండించుకున్న కూరగాయాలను చిత్తూరులో విక్రయించుకుని, నాలుగు రూపాయలు సంపాదించుకోవడాని కి వస్తుంటే.. వాళ్ల రక్తాన్ని పీల్చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని మండలాల రైతులు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు చిత్తూరు నగరానికి కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నిర్ణయించిన ధరలు కాకుండా.. గేటు కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. తాటి ముంజెలు అమ్ముతున్న వ్యక్తి నుంచి రూ.50 గేటు వసూలు చేస్తున్న కలెక్షన్ బాయ్ ‘‘మండుటెండల్లో కొబ్బరికాయలు అమ్ము తున్న ఈ రైతు పేరు సుబ్రమణ్యం. రోజూ కొబ్బరికాయల కోసం చెట్టు ఎక్కే కొడుకు.. అదే చెట్టు పైనుంచి పడి చనిపోతే, వయసైపోయిన భార్య ను పోషించడానికి, ఈ పెద్దాయనే ప్రస్తుతం చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకొచ్చి చిత్తూరు లో అమ్ముతున్నాడు. ఇందుకోసం ఈ రైతు రోజూ చెల్లిస్తున్న కప్పం రూ.50. వాస్తవానికి కట్టాల్సిన గేటు రూ.20 మాత్రమే.’’ ‘‘రెండు రోజుల కిందట చిత్తూరు ప్రశాంత్ నగర్ వద్ద బలవంతపు గేటు వసూళ్లపై చిత్తూరుకు చెందిన జగ్గా, జంగాలపల్లెకు చెందిన కిరణ్ అనే ఇరువర్గాలు రోడ్లపై కొట్టుకున్నాయి. వా రపు సంతలో గేటు ఎవరు వసూలు చేయాలో తెలియక ఇరువర్గాలు కొట్టుకోవడంతో యాద మరి పోలీసులు కేసులు నమోదు చేశారు.’’ చిత్తూరు అర్బన్: నగరంలో మార్కెట్ గేటు పేరిట కూటమి పార్టీకి చెందిన నేతల బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. రోజూ వేలాది మంది రైతులు, రోడ్లపై పూసలు అమ్మేవారు, కూరగాయలు, బొమ్మలు, పండ్లు, ఆకు కూరలు విక్రయించే వారు.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి దౌర్జన్యంగా మార్కెటు గేటును వసూలు చేస్తున్నారు. అసలు ఎవరు గేటు చెల్లించాలి..? ఎవరికి మినహాయింపు ఉంది..? తట్టలో వ్యాపారం చేస్తే ఎంత..? బుట్ట పెట్టుకునే వాళ్లు ఎంత ఇవ్వాలి..? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికారులు నోరువిప్పి మాట్లాడకపోవడం, కనీసం నగరంలో గేటు ధరలు తెలిపే బోర్డులు పెట్టకపోవడం ఈ దౌర్జన్యాలకు ఊతమిచ్చినట్లవుతోంది. నెలకు రూ.20 లక్షలకు పైనే.. చిత్తూరు నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో జరుగుతున్న గేటు దౌర్జన్యకాండను అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. రోజుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు గేటు వసులు చేస్తున్నారు. నెలకు సగటున రూ.20 లక్షల చొప్పున, ఏటా రూ.2 కోట్లపైనే వసూలు చేస్తున్నారు. గేటు వసూలు చేయడం చట్టవిరుద్ధం కాదు. కానీ వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుండడమే సమస్యకు కారణం. చాలా మంది రైతులు వాళ్ల కన్నీళ్లను దిగమింగుకుని ఈ గేటు చెల్లిస్తున్నారు. గేటు వసూళ్లల్లో వచ్చిన విభేదాలు నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యలకు కారణమనే విషయం చిత్తూరు ప్రజలకు తెలిసిన బహిరంగ సత్యం. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ బలవంతపు గేటుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.చిన్న సన్నకారులు రైతులు.. చిన్న కమతాల్లో వ్యవసాయం.. అరకొర దిగుబడులు.. ఆ పంట ఉత్పత్తులు చిత్తూరులో విక్రయం.. వచ్చిన సంపాదనతో జీవనం.. అయితే ఆ బడుగుజీవులనూ కూటమి నేతలు విడవడం లేదు. కాసులపై ఆశతో మార్కెట్ గేట్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగే దిక్కులేక పోవడంతో ఆ కర్షకులు కక్కలేక మింగలేక తమకు వచ్చిన అరకొర ఆదాయంలో వారడిగినంత ముట్టజెప్పుతున్నారు. -
రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం
గంగాధరనెల్లూరు: రక్తహీనత రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం గంగాధర నె ల్లూరు మండలంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గర్బిణులు, బాలింతలకు పౌష్డికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ్ కార్యక్రమంపై గ్రామాల్లో అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రక్తహీనత లేని సమాజాన్ని నిర్మూలించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, చిన్నారులకు పీడీ వెంకటేశ్వరి, సీడీపీఓ వినీతాశ్రీ, అన్నప్రాసన్న చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రసాద్రెడ్డి, ఎంఈఓ గుణశేఖర్రెడ్డి, సీహెచ్ఓలు శ్రీనివాసులు, జ్ఞానశేఖర్, సర్పంచ్ సుబ్రమణ్యం, పర్యవేక్షకులు అనురాధ, బిందు, మాలతి, నాగరత్నమ్మ, భాగ్యలక్ష్మి, సంగీత పాల్గొన్నారు. -
ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న ఏ శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఎగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు వైఎస్సార్కడప జిల్లా ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న సయ్యద్ మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగనున్నారు. నూతన డీఐఈఓ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వరసిద్ధుడికి రూ.1.77 కోట్ల ఆదాయం కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో హుండీల్లోత భక్తుల సమర్పించిన కానుకలను సోమవారం ఆలయాధికారులు లెక్కించారు. హుండీల ద్వారా దేవస్థానానికి రూ.1.71,77,943 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,814, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,436 వచ్చిందన్నారు. 309 యూఎస్ఏ డాలర్లు, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్స్, 4 మలేషియా రింగిట్స్, 135 యూఏఈ దిర్హామ్స్ వచ్చాయన్నారు. బంగారం 165 గ్రాములు, వెండి 1.350 కిలోలు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 55 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 36 వినతులు అందాయి. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్రాజు స్థానిక ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి త గాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యా దులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. పదో తరగతి ఫలితాలు రేపు చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారన్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు bre.ap.gov.in మనమిత్ర వాట్సా ప్, లీప్ యాప్లలో చూసుకునేలా వెసులుబాటు కల్పించారన్నారు. వాట్సాప్లో 95523 00009 నంబర్కు ఏజీ (హాయ్) అని మెసేజ్ పంపి రోల్ నంబర్ నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ను పొందవచ్చని డీఈఓ వెల్లడించారు. -
రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల విజేత విక్రాంత్రెడ్డి
రొంపిచెర్ల: రాష్ట్రస్థాయి దివ్యాంగుల రన్నింగ్ డేస్ పోటీల్లో రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు చెందిన విక్రాంత్ రెడ్డి రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం జరిగిన దివ్యాంగుల రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు అములు తెలిపారు. విన్నర్స్గా నిలిచిన విద్యార్థి విక్రాంత్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఈఓలు ఇందిర, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు అభినందించారు. కక్ష కట్టి దాడులు చిత్తూరు రూరల్ (కాణిపాకం):కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షకట్టి దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యంగా పెద్దిరెడ్డి కుటుంబంపై తప్పడు కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని, నియోజకవర్గంలో నిజాయితీగా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంవారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకుని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యా..సమస్యలు పరిష్కరించండి!
● కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● అర్జీలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ● 258 అర్జీలు నమోదు చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్కు విచ్చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇస్తూనే ఉన్నాం. అయితే క్షేత్రస్థాయిలో తమ సమస్యలు ఏ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలయ్యా అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచూపి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.’ 258 అర్జీలు నమోదు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ శాఖలకు సంబంధించి 258 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే 213 ఉండడం గమనార్హం. మిగిలిన శాఖలకు సంబంధించి పోలీసు 6, డ్వామా 1, ఆర్అండ్బీ 1, డీఆర్డీఏ 26, డీసీహెచ్ఎస్ 1, మున్సిపల్ కమిషనర్ నగరి 2, డీఎస్ఓ 4, పశుసంవర్థకశాఖ 2, హౌసింగ్ 3 మొత్తం 258 అర్జీలను ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వెంకటశివ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడి స్థలం ఆక్రమిస్తున్నారు గుడి స్థలాన్ని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా రని గంగాధరనెల్లూరు మండలం పిళ్లారికుప్పం ప్రజలు రామప్ప, సుజిత్ తదితరులు వాపోయారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి శ్రీరామకృష్ణ భజన మందిరం ఉండేదన్నారు. కాల క్రమేణా ఆ మందిరం శిథిలావస్థకు చేరుకోగా భజనమందిరం వెనుక వైపున తాత్కాలికంగా దేవుడి పటాలు ఏర్పాటు చేశామన్నా రు. అక్కడే దూపదీపనైవేద్యాలు సమర్పిస్తున్నామన్నారు. నూతన భభజన మందిరం నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే చేసి, సర్వే నంబర్ 366/1లో 0.04 సెంట్ల భూమిని కేటాయించి హద్దు రాళ్లు నాటారని చెప్పారు. అయితే ఆ భూమిని ప్రస్తుతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లంటే చిన్నచూపెందుకు? ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లంటే సర్కారుకు చిన్నచూపెందుకని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అకారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని చెప్పారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28 నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి జిల్లాలోని నగరి మండలం నత్తంకండ్రిగ దళితవాడలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ నగరిలోని 9వ వార్డులో నెత్తంకండ్రిగ దళితవాడలో నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలన్నారు. పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపినాథ్, నాయకులు దాసరి చంద్ర,మణి,విజయ్ కుమార్, నత్తం కండ్రిగ గ్రామ కమిటీ నాయకులు రాజు వేలు,యేసయ్య,హరి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా! ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా అంటూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన ప్రజలు గణేష్, మునెమ్మ, గిరి, గోవిందమ్మ తదితరులు వాపోయారు. ఆ గ్రామస్తులు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు అర్జీని అందజేశారు. వారు మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామం ఆళ్లమడుగు లెక్కదాఖలాలో సర్వే నంబర్ 435/2 లో 2.87ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన శ్రీరాములురెడ్డి కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అనేక సార్లు వెదురుకుప్పం తహసీల్దార్కు విన్నవించుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమించుకుంటున్న స్థలాన్ని కాపాడి ఇళ్లు లేని పేదలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన నరసింహులు, వంశీ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి
– గ్రామస్తుల సహకారంతో అంతిమ వీడ్కోలు చౌడేపల్లె: కొడుకు, కోడలి దాడిలో గాయపడిన తండ్రి మనోవేదనతో మృతి చెందిన ఘటన ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లెలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి(90), రాజమ్మ దంపతులకు కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ ఉన్నారు. కొడుకు,కోడలు కలిసి గత మార్చి 30వ తేదీన చిన్నప్పరెడ్డిని చితకబాదడంతో కాలు విరిగి పోయింది. ఈ ఘటనపై సాక్షిదినపత్రికలో ‘కడుపున పుట్టినోళ్లా...తోడేళ్లా’ అనే శీర్షికన వృద్ధ దంపతుల ధీనగాథపై ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చౌడేపల్లె పోలీసులు కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. కాగా తీవ్రంగా గాయపడి కాలు విరిగిన చిన్నప్పరెడ్డిను మాజీ సర్పంచ్ విజయకుమార్రెడ్డి సహకారంతో గ్రామస్తుల కలిసి మదనపల్లెలో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వారం రోజుల క్రితం డిస్చార్జి కాగా ఇంటికి వచ్చిన చిన్పప్పరెడ్డి మనోవేదనకు గురై అస్వస్థకు గురై సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులెవరూ సహకరించకపోవడంతో ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ మృతుడు భార్య రాజమ్మ చేసిన రోదన పలువురిని కలిచివేశాయి. గ్రామస్తుల సహకారంతో అంతిమయాత్ర నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మదరసా హజ్రత్ మృతి పలమనేరు: చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమంగళం మదరసా హజ్రత్ సోహైల్ అహ్మద్(35) అక్కడిక్కడే మృతి చెందాడు. పట్టణంలో నుంచి స్కూటీలో నాగమంగళంలోని మదరసాకు వెళతుండగా ఎదురుగా సేలం నుంచి తిరుపతికి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలున్నారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భూసమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండా పలమనేరు: భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా చేసుకుని వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎస్సీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎ మ్మెల్యే అమరనాథరెడ్డితో కలసి గ్రీవెన్స్డే నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడొచ్చిన సమస్యల్లో 95 శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి ఆయా తహసీల్దార్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి సోమవారం ఇక్కడే గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా 53 వేల వినతులందగా వీటిల్లో 12వేల అర్జీలు కుప్పం నియోజకవర్గంనుంచే ఉన్నాయన్నారు. త్వరలో కుప్పంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపా రు. గతంలో పుంగనూరులో జమీందారి వ్యవస్థ, పలమనేరు ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎక్కువగా సమస్యలున్నాయని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. -
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస
● సోషల్ మీడియాకు బానిసలువుతున్న విద్యార్థులు ● పెరిగిన సోషల్ మీడియా వినియోగం ● అనవసర వీక్షణ ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షలు దాటిన సెల్ఫోన్ యూజర్లు ● అతివాడకంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షల స్మార్ట్ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్(టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. అనారోగ్య సమస్యలు తప్పనట్టే సెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరు మంచి కంటే చెడే ఎక్కువ పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు సెల్ఫోన్ ఓ లోకంలా మారిపోయింది. కొందరైతే కనీసం టూజీబీ ఖాళీ చేస్తే గానీ మనసు కుదుటపడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే చేతిలో సెల్ ఉండాల్సిందే. విద్యార్థులకు సైతం స్మార్ట్ఫోన్ వ్యామోహం పెరిగింది. వీటిని తల్లిదండ్రులు నియంత్రించాలి. ఎక్కువగా సెల్ వాడకంతో మంచికంటే చెడే ఎక్కువ అని గ్రహించి సమాజంలో మార్పు రావాలి. – డాక్టర్ రాజేంద్రరెడ్డి, విశ్రాంత ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలమనేరు సోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. -
చెక్డ్యామ్ ధ్వంసం
శాంతిపురం: రాళ్లబూదుగూరు పంచాయతీలోని సాతు వద్ద ఉపాధి హామీ నిధులతో ని ర్మించిన చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్య క్తులు ధ్వంసం చేశారు. రెడ్డివారిపల్లి నుంచి సాతు కొత్త చెరువుకు నీరు వెళ్లే వంకపై పదేళ్ల క్రితం చెక్ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ నీరు నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ఉపయోగంగా ఉండేది. కానీ ఇటీవల ఎవరో చెక్ డ్యామ్ను పగులగొట్టినట్టు స్థానికులు గుర్తించారు. చెక్ డ్యామ్నకు గండి కొట్టడంతో వర్షాలు కురిసి వంకలో నీరు వచ్చినా రైతులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెక్ డ్యామ్ మరమ్మతులు చేసి, దాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు కోరుతున్నారు. సీఆర్సీ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు గుడుపల్లె: ప్రభుత్వ పాఠశాలకు ఏటా ఇచ్చే మెయిన్టెన్స్ గ్రాంట్ నిధులను సీఆర్సీ ఇన్చార్జ్లు దుర్వినియోగం చేశారని పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, పొగురుపల్లె, యామగానిపల్లె, సోడిగానిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను 5 క్లస్టర్ పాఠశాలలు ఉన్నాయి. 2024–25 సంవత్సరానికి గాను ఒక్కొక్క క్లస్టర్కు రూ.లక్ష వంతున రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను క్లస్టరు పాఠశాలకు మెయిటెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. కానీ గుడుపల్లె క్లస్టర్కు సంబంధించిన రూ. లక్ష నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లస్టర్ సమావేశం నిర్వహించకుండా ఉపాధ్యాయుల సూచనలు తీసుకోకుండా బినామి బిల్లులు పెట్టారన్నారు. గతంలో నా డు– నేడు కార్యక్రమంలో తీసుకువచ్చిన ఫర్నిచర్, బుక్స్లు, మెటీరియల్తోపాటు పాత వస్తువులను చూపి, కొత్త బిల్లులు సృష్టించారు. ఈ బిల్లులు ప్రకారం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఈసీలను ఉన్నతాధికారులకు అందించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పెనుమూరు..గంజాయి జోరు
● దాణా పేరుతో విచ్చలవిడిగా అమ్మకాలు ● చీకటి పడితే బీడు భూముల్లో ముఠాలు ● పక్క రాష్ట్రాల నుంచి యఽథేచ్ఛగా దిగుమతి ● నిద్ర మత్తులో అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : గంజాయి, మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెనుమూరు మండల కేంద్రం నిలయంగా మారింది. మత్తుకు యువత బానిసలై తమ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెనుమూరు మండల కేంద్రంలో కొన్ని నెలలుగా గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు దాణా వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకాలు చేస్తూ చాపకింద నీరులా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నారు. అలాగే కొన్ని నిత్యావసర సరుకుల దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెనుమూరు మండల కేంద్రం చుట్టూ ఉన్న బీడు భూముల్లో చీకటి పడితే చాలు గంజాయి కేంద్రాలుగా మార్చేస్తున్నారు. మహిళలు బహిర్బూమికి వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాకు సమీపంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉండడంతో అక్రమ వ్యాపారులు కొందరు ప్రయాణికుల్లా ఎవరికీ అనుమానం లేకుండా చేతి సంచులు, కట్టె బ్యాగుల్లో రహస్యంగా ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తుకు బానిసలైన యువత, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారులు గంజాయితో రూ.లక్షలు గడిస్తూ పెనుమూరును గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తును వీడి గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు ఇచ్చే ఉచిత శిక్షణపై మండిపాటు ● తొలిసారిగా సీబీటీ విధానంలో పరీక్షలంటూ మెలిక ● జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 3,766ప్రాథమికోన్నత పాఠశాలలు 444 ఉన్నత పాఠశాలలు 705ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాగానే డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు మెగా డీఎస్సీ పరీక్ష ఫైల్పై తొలి సంతకం చేశారు. అయితే పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయకుండా నెలల తరబడి సాగదీశారు. చివరికి క్షేత్ర స్థాయిలో నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈనెల 20న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాటంగా నోటిఫికేషన్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. కాగా సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ మెలిక పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. నిధులను కాజేసేందుకేనా.. సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సరిపడే సౌకర్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, మరికొన్ని కంప్యూటర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ కేంద్రాల్లో సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రూ.కోట్ల కొద్ది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అదే పాత విధానంలో ఒకే రోజు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కేంద్రాల్లో నిర్వహిస్తే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో సరిపోయేది. అలా కాకుండా డీఎస్సీ పరీక్షను నెల రోజుల పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించి నిధులను నొక్కేసేందుకు ప్రణాళిక రచించినట్లు విమర్శలున్నాయి. మొక్కుబడిగా ఉచిత శిక్షణలు డీఎస్సీ పరీక్షకు ఉచిత కోచింగ్ హామీ ప్రకారం నోటిఫికేషన్కు కనీసం అయిదు నెలల ముందు శిక్షణ ఇచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపయోగం ఉండేది. ఉచిత కోచింగ్ అంటూ ప్రచారం చేసిందే తప్ప శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించినప్పటికీ 5 మంది అభ్యర్థులు కూడా లేరు. ఎస్సీ అభ్యర్థులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో అభ్యర్థులు ఉచిత శిక్షణ పై నమ్మకం లేక ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఉచిత శిక్షణ లోనూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో వివిధ కేడర్లలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికంగా ఎస్జీటీ పోస్టులు 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ కేడర్లో 499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దళితులను మోసగించింది ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం దళితులను మోసగించింది. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రొడ్డెక్కేలా చేసింది. ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంలోప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఇబ్బంది పెట్టడం సరికాదు డీఎస్సీ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకే పది నెలలకు పైగానే సమయం పట్టింది. అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉచిత శిక్షణ సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి పరీక్షలు నెలరోజులా.. డీఎస్సీ పరీక్షను ఈసారి తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో తెలియజేశారు. సీబీటీ విధానం ప్రకారం పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఒక్క రోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్ధేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
నేడు పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేయాలని కోరారు. నేడు పోలీసు గ్రీవెన్స్చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రా..మజాకా! – సీఎం జన్మదినం.. ప్రత్యేక పూజలకు ఉత్తర్వులా? కాణిపాకం : హవ్వా..నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంగా మారింది కూటమి పరిస్థితి.. సీఎం జన్మదినానికి..ప్రత్యేక పూజలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా.. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక గణపతి హోమం చేశారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. అయితే సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజల కోసం ఉత్తర్వులు జారీ చేయడం కాణిపాకంలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చర్రితలో ఇలాంటి ఉత్తర్వులు ఎప్పుడూ లేదంటూ కాణిపాక గ్రామస్తులు, ఉభయదారులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీఎం చంద్రబాబు.. డీఎస్సీ తొలి సంతకానికే దాదాపు 11 నెలలు సాగదీశారు.. ఇక నిరుద్యోగ అభ్యర్థుల ఒత్తిడి తాళలేక ఎట్టకేలకు బాబు జన్మదిన కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా పరీక్ష ఎప్పడూ ఒకే రోజు నిర్వహించే డీఎస్సీని ఇప్పుడు నెల రోజులు నిర్వహించేలా మెలిక పెట్టారు. ఎందుకు ఇలా చేశారంటే.. ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడం కోసమే ఇలా జరిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కాగా కనీసం అయిదు మాసాలు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాల్సిన ప్రభు త్వం కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం పేరుతో పనిఒత్తిళ్లు ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్లు ● పనిచేయని ఫోన్లు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు ● సెల్ఫోన్ల స్థానంలో ట్యాబ్లు ఇవ్వాలని డిమాండ్
జిల్లా సమాచారంకార్వేటినగరం : అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యాప్లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటి నుంచి అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లు మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ కాక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. యాప్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వెర్షన్తో కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్లో వర్కర్లు, హెల్పర్లు ఫొటో క్యాప్సర్ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు పోషకాహార పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనిని మూడు యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉండటం, యాప్లో సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హాజరు ఇలా.. భోజనం ఎలా? ప్రతి రోజు విధిగా ఉదయం 9 గంటలకు, తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్ వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి. ఎంత మంది హాజరైతే అంత మంది చిన్నారులకు మాత్రమే ఆహారం అందించాల్సి ఉంది. మూడేళ్లల్లోపు చిన్నారులు కావడంతో జిల్లాలోని చాలా అంగన్ఽవాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. ముందుగానే యాప్ నమోదు చేసిన కారణంగా తర్వాత వచ్చిన పిల్లలకు ఆహారం అందించేందుకు అవకాశం లేకపోవడంతో వండిన ఆహారాన్నే అందరికి సరిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు. పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బాలసంజీవని యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ అయినా సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాలు నమోదు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. నెట్ లేకపోతే యాప్ ఓపెన్ కావడం లేదు. – విజయ, సీఐటీయూ ఆధ్యక్షురాలు, కార్వేటినగరం ప్రాజెక్టు, శ్రీరంగరాజపురం ట్యాబ్లు పంపిణీ చేయాలి బాలసంజీవని 2.0 యాప్తో అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లలో ఈ యాప్ పనిచేయడం లేదు. పాత ఫోన్లను వెనక్కు తీసుకుని ఆ స్థానంలో 5జీ ట్యాబ్లు పంపిణీ చేసి అంగన్వాడీలకు యాప్ కష్టాలు తొలగించాలి. యాప్ల నిర్వహణతో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీలు పడుతున్న అవస్థలు తొలగించాలి. – మమత, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కార్వేటినగరం ప్రాజెక్టు, కార్వేటినగరం పనిభారం తగ్గించాలి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై పనిభారం అఽధికమైంది. కేంద్రాల్లో యాప్ల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఈ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. అరకొర వేతనం ఇస్తూ అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేయించడం సరికాదు.అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారిపై పనిభారం తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడుతాం. – వాడ గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరుసెల్ఫోన్లు వెనక్కి తీసుకుని 5జీ ట్యాబ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీ కేంద్రాలు 2420 సీడీపీఓలు 12 మంది మొత్తం కార్యకర్తలు 2420పర్యవేక్షకులు 70 మంది గత ప్రభుత్వంలో పకడ్బందీగా సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగంతో పకడ్బందీగా సేవలు అందాయి. ఆరు యాప్లు అమలు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పోషణ ట్రాకర్ యాప్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్, హాట్కుక్ యాప్ తదితర యాప్లతో ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల, గర్భిణులు, బాలింతలకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి వినియోగించుకునేందుకు నీరు అందుబాటులో ఉంచింది, లేనిది యాప్ వివరాలు నమోదు చేస్తే ఆర్డబ్ల్యూస్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకునేలా కృషి చేసింది. గుడ్ల సరఫరాకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చి అమలు చేసింది. -
ఇంత కక్కుర్తా.. హుస్సేన్
● చర్చనీయాంశంగా తహసీల్దార్ ఏసీబీ కేసు చిత్తూరు కలెక్టరేట్ : రైతు నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి రూ.75 వేలు లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దార్ మారుఫ్ హుస్సేన్ ఏసీబీ వలలో చిక్కిన విషయం విధితమే. ఆయన అయిదుగురు కలెక్టర్ల వద్ద సీసీగా విధులు నిర్వహించారు. 2018లో అప్పటి కలెక్టర్, ప్రస్తుతం సీఎం సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, నారాయణ భరత్గుప్తా, హరినారాయణన్, షణ్మోహన్, ప్రస్తుత కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్) గా ఏడున్నర సంవత్సరం పాటు విధులు నిర్వర్తించారు. ఆయనకు జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులతో పాటు, సెకండ్ కేడర్ అధికారులంతా సుపరిచితమే. అంతేకాకుండా జిల్లా స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్లోనూ పలుకుబడి పెట్టుకున్నారు. ఆరుగురు కలెక్టర్ల వద్ద క్యాంప్ క్లర్క్ గా విధులు నిర్వర్తించిన హుస్సేన్ లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి దొరకడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులుగా.. ఏసీబీకి చిక్కిన సదుం ఇంచార్జి తహసీల్దార్ హుస్సేన్ జిల్లా రెవెన్యూ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయన లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కడం రెవెన్యూశాఖతో పాటు ఆ సంఘానికి మాయనిమచ్చని తీసుకొచ్చింది. కలెక్టరేట్లో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సదుం ఇన్చార్జి తహసీల్దార్ ఏసీబీకి చిక్కడంతో అధికారులు కలెక్టరేట్కు నివేదికలు పంపిన వెంటనే ఆయనను సస్పెండ్ చేసి మరొకరిని ఇన్చార్జి తహసీల్దార్ గా నియమించనున్నారు. -
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ కూలీ మృతి
– మరొకరి పరిస్థితి విషమం పుంగనూరు: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కూలీలు అందులో చిక్కుకుని , ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న యుగంధర్ నాయుడు తన ఇంటి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు మదనపల్లెలోని సంతపేటకు చెందిన హేమంత్ , రాయలపాడుకు చెందిన రవి అనే కూలీలను పిలిపించాడు. ఆ ఇద్దరు కూలీలు మధ్యాహ్నం ట్యాంకులోనికి దిగి క్లీన్ చేసే సమయంలో విష వాయువులు ఒక్కసారిగా రావడంతో ఊపిరాడక ట్యాంకులో చిక్కుకున్నారు. దీనిపై యజమాని అగ్నిమాపకశాఖ కార్యాలయానికి , 108కు ఫిర్యాదు చేశారు. తక్షణమే రెండుశాఖల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు, సిబ్బంది సెప్టిక్ ట్యాంకులో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో వెలికితీశారు. వారిలో హేమంత్(27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు రవి (35)ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ
స్థానిక వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం విదేశీవిద్యకు ఆంక్షలు విధించడంతో స్వదేశంలోనే ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థు లు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది పీజీ సెట్లకు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెరిట్ స్టూడెంట్లు స్వదేశీ విద్యనభ్యసిస్తే విద్యారంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొ క్కే అవకాశం ఉంటుంది. ఎస్వీయూలో కొత్తగా ప్రవేశ పెట్టిన ఎంఎస్ డేటా అనలాసిస్, ఏఐ వంటి కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏలోనూ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ ఎన్ఈపీతో ఉద్యోగావకాశాలు మెండు నూతన విద్యావిధానంతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. విదేశీ విద్య తో సమానంగా స్వ దేశంలోనూ పలు వర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంతర్జాతీయ స్థా యి సిలబస్ అమలులో ఉంది. రూ.లక్షలు ఖ ర్చు పెట్టి విదేశీ విద్య కోసం ప్రయత్నించడం కంటే ఎన్ఈపీ విధానం అమలులో ఉన్న వర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించడం ఎంతో ఉత్తమం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మెరుగుపడడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎఫ్1 వీసా కఠినతరంతో ఈ ఏడాది వర్సిటీల్లో అన్ని పీజీ కోర్సులకు అడ్మిషన్లు పెరగనున్నాయి. –ప్రొఫెసర్ పద్మావతమ్మ, ప్రిన్సిపల్, సైన్స్ కళాశాల, ఎస్వీయూ ‘తిరుపతికి చెందిన రవిచంద్ర పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలలో గత ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. ఎలాగైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాలో పీజీ చేయాలన్న చిరకాల కోరికతో ఏడాది కాలం ఆర్థిక వనరులతోపాటు వీసా ప్రయత్నాలు చేసుకుని సన్నద్ధమయ్యాడు. ఈ ఏడాది ఽఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకుని ఎంతో ఖర్చు పెట్టాడు. కానీ నిరాశ మిగిలింది. వీసాకు అనర్హుడంటూ ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో పీజీ సెట్కు దరఖాస్తు చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.’ విదేశీ విద్య నేటి విద్యార్థుల కల. ట్రంప్ కఠిన నిబంధనలు..వీసాలపై ఆంక్షలు.. అనర్హులని తిరస్కరణ.. పార్ట్టైమ్ ఉద్యోగాలకు అవకాశాలలేమి.. ఆర్థిక సమస్యలు.. ఇంత కష్టపడినా విద్యకు దక్కని భరోసాతో అది యువతకు ఎండమావిగా మారింది. వెరసి.. విద్యార్థిలోకం విదేశీ విద్య వద్దు... స్వదేశీ విద్యే ముద్దు అంటూ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతోంది. ఫలితంగా పలు ప్రవేశపరీక్షలకు దరఖాస్తుల సంఖ్య పదిరెట్లు పెరిగింది. తిరుపతి సిటీ: ట్రంప్ అన్నంత పని చేశాడు..స్టూడెంట్స్ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంతో పాటు యూఎస్ఏలో విద్యనభ్యసిస్తున్న ఇండియన్ విద్యార్థులపై ఆంక్షలు విధించి ఇంటికి పంపుతున్నాడు. దీంతో 2025–2026 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కన్న తెలుగు విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో స్వదేశీ విద్యకు డిమాండ్ పెరిగింది. ఇటీవల రాష్ట్రంలోని పలు వర్సిటీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దీంతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎగబడుతున్నారు. గత ఏడాదికంటే పీజీ సెట్లకు దరఖాస్తులు పదిరెట్లు పెరిగాయి. విదేశీ విద్యపై మొగ్గు చూపని విద్యార్థులు తిరుపతి జిల్లా నుంచి గత ఏడాది విదేశీ విద్య కోసం సుమారు 9,871 మంది ఎఫ్1 వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 6,245 మంది విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లోని పలు వర్సిటీలలో వీసా సాధించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం ఇప్పటివరకు ఎఫ్1 వీసా కోసం కేవలం 761 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా ఆశలపై నీళ్లు చల్లారు తిరుపతిలో బీటెక్ పూర్తి చేశా. అమెరికాలో ఎంఎస్ చేయాలనే కోరిక ఉండేది. అమెరికా వెళ్లి ఎంఎస్ పూ ర్తి చేసి, అక్కడే గ్రీన్కార్డు సాధించాలనే కోరిక ఉండేది. కానీ ట్రంప్ విధించిన ఆంక్షలతో వీసాకు దరఖాస్తు చేసుకున్నా టోఫెల్తోపాటు ఇంటర్వ్యూ పూర్తి చేశా. కానీ ఎలిజిబిలిటీ రాలేదు. దీంతో ఎస్వీయూలో ఎంబీఏ చేసేందుకు ఐసెట్కు దరఖాస్తు చేసుకున్నా. –ప్రదీప్కుమార్, విద్యార్థి, తిరుపతి విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత ట్రంప్ కఠిన నిబంధనలతో విద్యార్థిలోకం బెంబేలు పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ ఐసెట్, ఏపీఈసెట్కు పదిరెట్లు పెరిగిన అప్లికేషన్లు ఎఫ్1 వీసాల ఆంక్షలతో వెనుకడుగు ప్రధానంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నా ఆమెరికాలో ఎంఎస్, ఎంటెక్, మెడికల్, పీజీ కోర్సులు చేయాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రంప్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారు. కఠిన నిబంధనలు విధించడంతో జిల్లాలో ఈ ఏడాది విదేశాల్లో విద్యాభ్యాసానికి వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు 40 శాతం కూడా లేదని అమెరికన్ రాయబార కార్యాలయం తేల్చిచెప్పడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ 50 శాతం మంది విద్యార్థులను పలు సాకులు చూపించి (ఎఫ్1) స్టూడెంట్ వీసాలకు అర్హులు కాదని ముద్ర వేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి వీసా కచ్చితం అనుకున్న విద్యార్థులకు సైతం ఏదో రూపంలో వీసాకు అన్ఫిట్ అంటూ ముద్రవేస్తున్నారు. దీంతో విదేశీ విద్యపై విద్యార్థులు వెనుకడుగువేస్తున్నారు. జిల్లాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కో ర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఐసెట్, ఏపీఈ సెట్, పీజీసెట్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. గత ఏడాది ఏపీఈసెట్కు 3వేలకు మించని దరఖాస్తులు ఈ ఏడాది 30 వేల పైచిలుకు వచ్చా యి. దీంతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నిర్వహించనున్న ఐసెట్కు సైతం అదే తరహాలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత వి ద్యకు ఈ ఏడాది ఎస్వీయూ, మహిళా వర్సిటీల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని, కటాఫ్ మార్కులు సైతం ఊహించని రీతిలో ఉంటాయని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఐసెట్కు దరఖాస్తు చేశా.. యూఎస్లో ఎంఎస్ చే యాలన్నది నా కల. కానీ ట్రంప్ ఆంక్షలతో భయమేస్తోంది. అక్కడ చదువుతు న్న మా బంధువుల పిల్ల లు సైతం ఇక్కడికి రావదని చెబుతున్నారు. దీంతో మా తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఏ చేయడం కోసం ఐసెట్కు దరఖాస్తు చేశా. ఇక్కడే మంచి వర్సిటీలో ఎంసీఏలో చేరి పేరొందిన పరిశ్రమలో ఉద్యోగం సాధిస్తా. –ప్రియాంక, విద్యార్థిని, తిరుపతి పీజీసెట్లకు పెరుగుతున్న దరఖాస్తులు పీజీ సెట్ పరీక్షలకు గత ఏ డాది కంటే ఈసారి దరఖాస్తు ల సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ ఎఫెక్ట్ విదేశీ విద్యపై పెద్ద ప్రభావం చూపుతోంది. పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు ఇప్పటికే ఊహించని రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఏపీ ఈ సెట్ గడువు ముగిసింది. గత ఏడాది 3,500 దర ఖాస్తులు రాగా ఈ ఏడాది 35 వేలకు మించడం ఊహించని పరిణామం. –ప్రొఫెసర్ సురేంద్ర బాబు, కో కన్వీనర్, ఏపీ పీజీసెట్, ఎస్వీయూ -
● బంతిపూల ధరలు నేల చూపు ● పెట్టుబడి ఖర్చులు దక్కని వైనం ● అన్నదాతల ఆవేదన ● అధిక దిగుబడే కారణమంటున్న వ్యాపారులు ● ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
కుప్పం రూరల్ : కుప్పంలో బంతిపూల ధరలు నేల చూపు చూస్తున్నాయి. రైతులు పెట్టుబడి రాక పూలను తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు. కుప్పం మార్కెట్లో కిలో రూ.5 నుంచి 10 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో రైతులు కోత కూలీ కూడ రాదని ఆవేదన చెందుతున్నారు. కొంత మంది రైతులు ధరలు లేకపోవడంతో మార్కెట్ బయటే పారబోసి వెళ్తున్నారు. మిగిలిన పూల ధరలు ఓ మోస్తరుగా ఉన్నా బంతి పూల ధరలు మాత్రం పతనమయ్యాయి. వ్యాపారులు మాత్రం అధిక దిగుబడే కారణమంటున్నారు. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పానికి పూలసాగులో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండిన పూలు రాష్ట్రాలు చుట్టి వస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం మార్కెట్ నుంచి విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. అన్ని రకాల పూల ధరలు ఓ రకంగా ఉన్నా బంతిపూల ధరలు మాత్రం నేలకు దిగిపోయాయి. కుప్పం మార్కెట్లో వారం రోజులుగా సరాసరిన కిలో రూ.10 పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూలను కోయక తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి ఎకరాకు 40 వేలు ఖర్చు చేసి బంతిపూలు సాగు చేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బంతిపూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేస్తే ధరల రూపంలో ఇలా రైతుల నెత్తిన బండ పడుతోందని వాపోతున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో రైతులు పూలసాగు వదిలిపెట్టాల్సి వస్తోందని నిరాశ చెందుతున్నారు. బంతి సాగులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సాగు ఖర్చులు రావడం లేదు.. ఎకరా బంతి సాగు రూ.40 వేలు ఖర్చు అవుతుండగా ప్రస్తుతం ధరలతో కోత కూలీ రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 7,500 మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క ధర రూ.2.50 రూపాయలుగా ఉంది. ఇలా దుక్కులు చేయడం, మొక్కలు నాటడం, ఎరువులు వెరసి ఎకరా సాగుకు రూ.40 వేలు ఖర్చు వస్తోంది. ధరలు పతనం కావడంతో సాగు ఖర్చులు వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. మిగిలిన పూలైన చామంతి కుప్పం మార్కెట్లో కిలో రూ.150 – 170, రోజా రూ.80–100, కనకాంబరం రూ.600, మల్లె రూ.280– 320, సంపంగి రూ.60, జాజిమల్లె రూ.240 పలికింది. కానీ బంతి మాత్రమే కిలో రూ.5–10 రూపాయలు పలుకుతున్నాయి. అధిక దిగుబడి రావడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కుప్పంలో టమాట తరువాత రైతులు ఎక్కువ మొత్తంలో బంతి పూలు సాగు చేయడం ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు. సాగు వదులుకోవాల్సిందే.. రూ.40 వేలు పెట్టుబడి పెట్టి 45 రోజుల పాటు ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే బంతిపూలు చేతికి వస్తాయి. ఈ మధ్యలో చీడపీడలు ఆశిస్తే పంట చేతికి రాదు. నీరు అందుబాటులో లేకపోయిన మధ్యలోనే పంట నష్టపోవాల్సి ఉంది. పంట చేతికి రాగానే ధరల రూపంలో రైతులకు గుదిబండ పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం ఓ మోస్తరుగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో బంతి ధరలు అంతగా ఉండడం లేదు. ధరలు ఇలాగే కొనసాగితే రైతులు బంతి సాగును నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. – చిన్నప్పకాంతరాజ్, రైతు, పెద్ద బంగారునత్తం -
● అందరూ 15 ఏళ్లలోపు వారే ● అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో పనులు చేస్తున్న వైనం ● అక్కడే తిని అక్కడే మకాం పెడుతున్న పిల్లలు
అలిగి తిరుమలకు చేరుతున్న బాలురు పలమనేరు : పిల్లలు చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తిరుమల కొండ చేరుతున్నారు. తాజాగా పలమనేరు మండలం టి.వడ్డూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బంగారుపాళెం ఎస్సీ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. హాస్టల్ వార్డెన్లు తిరుమలలో పది రోజులు గాలించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇల్లు చేరాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది పిల్లలు తిరుపతి, తిరుమలలో ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు గ్రామాలకు చెందిన 15 ఏళ్లలోపు వారే పదుల సంఖ్యలో తిరుమలలో ఉన్నట్లు తెలిసింది. కొందరు తల్లిదండ్రులు వెతికి పట్టుకొస్తుండగా.. మరికొందరు కొండపైనే చిరువ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. మెట్లదారుల్లో చిన్నపాటి అమ్మకాలు తిరుమలకు వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాలు పిల్లలకు ఆవాసాలుగా మారాయి. అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారు పిల్లలతో పని చేయించుకుని కొంత కమీషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా నడకదారుల్లో పచ్చిమామిడి కాయలు, జామకాయలు, వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. మరికొందరు భక్తులకు తిరునామాలు పెట్టి వారిచ్చినంత పుచ్చుకుంటున్నారు. మరికొందరు హోటళ్లలో దినసరి కార్మికులుగా పనిలో ఉంటున్నారు. అక్కడి యాత్రికుల మధ్య ఈ బాలురు ఆలయానికి వెళ్తున్నారా లేదా అక్కడ ఏమి చేస్తున్నారో గుర్తించడం కష్టంగా మారుతోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాలకు చెందిన గ్రామాలు, బంగారుపాళెం మండలంలోని కొన్ని గ్రామాల నుంచి పిల్లలు ఎక్కువ మంది తిరుమల కొండపై ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రుళ్లు వీరి ఆవాసాలెక్కడంటే.. ఇంటి నుంచి అలిగి తిరుమల చేరిన పిల్లలు రాత్రిళ్లు సీఆర్వో కార్యాలయం, బాలాజీ బస్టాండు, సీఆర్వో వెనుక వైపునున్న యాత్రికుల వసతి నిలయాలు, కళ్యాణకట్ట ముందున్న ప్రాంతం, హెచ్పీటీఎల్ తదితర ప్రాంతాల్లో నిద్రిస్తున్నట్లు సమాచారం. అక్కడి స్నానపు గదులను ఉపయోగించుకోవడం, భక్తులు పెట్టే భోజనాలు తినడం మళ్లీ పగలు పెట్టుబడిలేని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ గడుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరూ పట్టించుకోనివారు, తల్లిదండ్రులపై అలిగిన వారు ఇక్కడికి చేరుతున్నట్లు సమాచారం. తిరుమలలో విజిలెన్స్, పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచితేగాని పిల్లలను పట్టుకోవడం కష్టమే. చదువుకోవాల్సిన వయసులో బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిక్కిరిసిన బోయకొండ● పెరిగిన భక్తుల రద్దీ ● ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన మండలంలోని బోయకొండ గంగమ్మతల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు ఆదివారం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయంవద్ద భక్తులకు విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపా రు. వీటితో పాటు అన్నదానం నిర్వహణకు రూ.25 వేలు భక్తులు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
– రూ.3 లక్షల ఆస్తి నష్టం పుత్తూరు : మండల పరిధిలోని కృష్ణసముద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సుకన్య పెంకుటింటిలో నివాసం ఉంటోంది. ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో ఇల్లు పూర్తిగా మంటలు వ్యాపించాయి. పుత్తూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.3 లక్షలు విలువైన వస్తువులు, ఇంటి సామగ్రి, 4 సవర్ల బంగారు నగలు పూర్తిగా దగ్ధమయ్యా యి. సుకన్య తన ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుకన్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాటు బాంబు పేలి యువతికి గాయాలు గంగాధర నెల్లూరు : నాటుబాంబు పేలి యువతికి గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ ఆవల కొండ గ్రామానికి చెందిన కమ్రతాజ్ శనివారం తన పొలంలో కొబ్బరి కాయలు కోస్తుండగా అడవి జంతువుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నాటు బాంబుపేలి చేయి, కాలికి గాయాలయ్యాయి. వెంటనే జీడీ నెల్లూరులో ఒక ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పంట పొలాల్లో నాటు బాంబులు పెడుతున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
25 నుంచి ఉరుసు ఉత్సవాలు
పుంగనూరు : పట్టణంలోని చెరువు కట్టపై గల హజరత్ సయ్యద్ నూర్షావలిబాబా ఉరుసు ఈనెల 25న ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్లు , కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 25న గంధం, 27న ఖవ్వాలి, 28న తహలీల్ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎన్ఎస్.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉరుసు కార్యక్రమానికి వేల మంది ప్రజలు రానుండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ ట్రాఫిక్ ఏర్పాట్లు , పార్కింగ్పై కమిటీ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. -
అవినీతి సామ్రాజ్యం!
తహసీల్దార్● కూటమి ప్రభుత్వం రాకతో చెలరేగిన వైనం ● చిన్నపనికై నా ప్రజలకు తప్పని వేధింపులు , వసూళ్లు ● హైకోర్టులో కేసులు, కలెక్టర్కు ఫిర్యాదులు ● చివరకు ఏసీబీకి పట్టుబడిన మండల మేజిస్ట్రేట్ పుంగనూరు : రైతు నుంచి లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు మారుఫ్ హుస్సేన్, వీఆర్ఓ మహబూబ్ బాషా శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదుం తహసీల్దార్ బాగోతం అంతా ఇంత కాదు ఆ వివరాలు ఇలా.. ఆయన ఓ మండల మేజిస్ట్రేట్ .. సామాన్యులను కూడా వదలకుండా వేధించడం ఆయన నైజం.. చిన్న పనికై న రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకోవడం , లొంగకపోతే తన తహసీల్దార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన హోదాతో ఆదేశాలు ఒక్కొక్కశాఖకు ఇవ్వడం ఆ శాఖ ద్వారా రైతులు , ప్రజలను వేధించడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. దీనికి బెంబేలెత్తిపోయిన ప్రజలు నేరుగా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమాలపై రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అంత జరిగినా తహసీల్దారు మారుఫ్ హుస్సేన్ బుద్ధి మాత్రం మారలేదు. కార్యాలయానికి వచ్చే వారిని పిలిపించుకుని రూ. లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ అవినీతికి కేరాఫ్గా సదుం మండలంలో నిలిచిపోయారు. కూటమి నేతలతో చెలరేగాడు సదుం తహసీల్దార్గా కూటమి ప్రభుత్వంలో బదిలీపై హుస్సేన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆరు నెలల కాలంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అంతులేకుండా పోయింది. కూటమి నేతల అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. తహసీల్దార్ బాధితులు సదుం మండల తహసీల్దార్ హుస్సేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పలువురు ఆయన బాధితులు మండలంలో ఉన్నారు. దిగువకురప్పల్లెకి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తిమ్మానాయునిపల్లె గ్రామ దాఖల సర్వే నంబరులో 13.1లో 3.58 ఎకరాల పొలం ఉంది. ఇందులో ప్రభుత్వం పొలాన్ని ప్రాజెక్టుకు తీసుకుంది. మిగులు భూమితో పాటు బోరు బావితో మల్లయ్య పంటలు సాగు చేసుకుంటున్నాడు. తహసీల్దార్ డిమాండ్లకు తలవంచకపోవడంతో అతనిని వేధింపులకు గురి చేశాడు. ఆయన రెండు సార్లు హైకోర్టులో కేసు వేసి తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నాడు. అలాగే గొంగివారిపల్లెకి చెందిన ప్రసాద్, సుగుణ, చిన్నక్క, రమణ, రాజమ్మలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎర్రాతివారిపల్లెకి చెందిన ఎన్.సురేంద్ర తహసీల్ధార్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చిత్తూరు అర్బన్ : సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు హుస్సేన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడటంతో.. చిత్తూరులోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక బృందం చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో ఉన్న హుస్సేన్ ఇంట్లో దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు, కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మా ఉసురు కొట్టుకుంది... నేను టమాట పండించా. నన్ను రకరకాలుగా వేధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిపై నేను హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసి, తహసీల్దార్ ఉత్తర్వులు రద్దు చేయించుకున్నా. నేను లొంగకపోవడంతో కక్ష కట్టి రోజుకొక ఆర్డర్ ఇచ్చి వేధించాడు. బోరుకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలని ఆర్డర్ ఇచ్చాడు. అప్పటికీ లొంగకపోవడంతో భూమి, బోరును ప్రజా అవసరాలకు స్వాధీనం చేసుకుంటామంటూ ఆర్డర్ ఇచ్చాడు. ఈలోపు మా ఉసురు కొట్టుకుని తహసీల్దార్ జైలుకు వెళ్లాడు. మాకెంతో సంతోషంగా ఉంది. – మల్లయ్య, దిగువకురప్పల్లె, రైతు, సదుం మండలం -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అనర్థం
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం మెరుగైన పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక లక్ష్యంతో కార్యక్రమాలను చేపడుతోందని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. ‘ఈ–చెక్ ’థీమ్తో నిర్వహించిన కార్యక్రమాన్ని చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కలెక్టర్, ఎమ్మెల్యే జగన్ మోహన్, మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘ఈ–చెక్’ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి అవుతుందని అంచనా ఉందన్నారు. వీటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదకర మూలకాలు భూమి, వాతావరణంలో కలుస్తున్నాయన్నారు. ఈ–వేస్ట్ (ఎలక్ట్రానిక్ పరికరాలు) నియంత్రించడంలో భాగంగా రానున్న నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో చేపట్టనున్న ఈ–చెక్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తమ గృహాలు, దుకాణాల్లోని వృథాగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలోని సచివాలయాల్లో అప్పగించాలని కోరారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేశారు. జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, ఎంహెచ్వో డా. లోకేష్, నగర పాలక అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పుత్తూరులో పట్టపగలు దోపిడీ
● మార్వాడీ షాపులో రూ.6.30 లక్షలు దోచుకొన్న దొంగలు ● షాపు యజమానిని కత్తులతో గాయపరిచి దోపిడీకి పాల్పడిన వైనం ● మోటార్ సైకిల్పై పరారైన ముగ్గురు అగంతకులు ● ముగ్గురూ 25 ఏళ్ల లోపు యువకులే పుత్తూరు : ఓ మార్వాడీ షాపులోకి ముగ్గురు అగంతకులు చొరబడి షాపు యజమానిని గాయపరిచి రూ.6.30 లక్షలు దోచుకెళ్లిన ఘటన పుత్తూరు పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకొంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణంలో నివాసం ఉండే రంజిత్జీ అనే మార్వాడీ స్థానిక నగరి రోడ్డులో కొంత కాలంగా మీనాక్షి ఏజెన్సీని నడుపుతున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు రంజిత్జీ కుమారుడు మహేంద్రకుమార్ (28) షాపును తెరిచాడు. ముందుగా వచ్చిన ఒక కస్టమర్కు రూ.2 లక్షలకు పాన్ మసాలా సరుకును విక్రయించాడు. అనంతరం పిచ్చాటూరు నుంచి వచ్చిన మరో కస్టమర్ ఠాగూర్(24) అతని డ్రైవర్ ఏలుమలైలు రూ.4.30 లక్షలు చెల్లించి పాన్ మసాలా సరుకును వ్యాన్లోకి లోడ్ చేశారు. అదే సమయానికి షాపు ముందు బుల్లెట్ మోటార్ సైకిల్పై 25 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు వచ్చి ఆగారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బైక్ పైనే ఉండగా ఇద్దరు దిగి వచ్చి మహేంద్ర కుమార్ను గల్లాలోని డబ్బు ఇవ్వాలంటూ కత్తులు చూపి బెదిరించారు. గల్లాలో ఏమీ లేదంటూ చెప్పడంతో మహేంద్ర కుమార్ను భుజంపై కత్తితో దాడి చేశారు. అడ్డువచ్చిన షాపు అసిస్టెంట్ సునీల్ను మరో యువకుడు కత్తితో కాలిపై గాయపరిచాడు. వెంటనే గల్లాలోని డబ్బు బ్యాగ్ను తీసుకోవడంతో పాటు మహేద్రకుమార్, సునీల్ వద్ద నుంచి సెల్ ఫోన్లను లాక్కొని మోటార్సైకిల్పై ముగ్గురూ పరారయ్యారు. వెంటబడిన మహేంద్రకుమార్ షాపు సమీపంలోని ఆర్డీఎం గేట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సీఐ సురేంద్రనాయుడు అప్రమత్తం అయ్యి మహేంద్రకుమార్, సునీల్ ఫోన్ నంబర్లను టేస్వుట్ చేయగా అవి స్థానిక చర్చి కాంపౌండ్ వద్ద లొకేషన్ను చూపాయి. అక్కడికి చేరుకొన్న సీఐకి రెండు సెల్ ఫోన్లు అక్కడ లభ్యమయ్యాయి. దుండగులు ఫోన్లను అక్కడ పడేసి పరారైనట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కస్టమర్ ఠాగూర్తో పాటు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారి కాల్ డేటాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ సరేంద్రనాయుడు వెల్లడించారు. -
ఉత్తమ సామాజిక విజేతలు
ఉత్తమ విద్యార్థులను తయారు చేయడమే ఉపాధ్యాయుల బాధ్యత కాదని వారిని ఉత్తమ సామాజిక విజేతలుగా తీర్చిదిద్దాల్సి అవసరం ఉంది. రేపటి తరానికి ఉపయోగపడే స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాముఖ్యం, ఉపయోగాలను ప్రాథమిక పాఠశాల నుంచే పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న, జరగాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన అవసరం. రసాయన వ్యవసాయం వల్ల సమాజానికి జరుగుతున్న ఆర్ధిక, ఆరోగ్య నష్టాలను విద్యార్థులకు తెలియచేసి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానాన్ని సుదుమూరు పాఠశాల విద్యార్థులు పక్కాగా అమలు చేయడం ఆనందంగా ఉంది. – వెంకటరమణ, ఈఎండీపీ కో ఆర్డినేటర్, చిత్తూరు జిల్లా -
పల్లెల పరిశుభ్రతలో భాగస్వాములుకావాలి
బంగారుపాళెం : గ్రామాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములైనప్పుడే స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు సాధ్యమని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బంగారుపాళెం మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తొలుత పాలేరు సమీపంలోని డంపింగ్ యార్డును సందర్శించి మొక్కను నాటి నీరు పోశారు. గ్రీన్ అంబాసిడర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు పంచాయతీ కార్యదర్శులతో చర్చించి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. నెలకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు శుద్ధజలం అందించాలని ఆదేశించారు. కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత పడాలని హెచ్చరించారు. హైప్లజర్ క్లీనింగ్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసే విధానం గురించి డీపీఆర్సీ కో ఆర్డినేటర్ షణ్ముగం కలెక్టర్కు వివరించారు. వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద నూతనంగా నిర్మించిన నీటి తొట్టెలను, ఈ– వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీషను ఆదేశించారు. చివరగా స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, తహశీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీధర్, స్థానిక సర్పంచ్ ఉమాదేవి, ఉప సర్పంచ్ కామరాజు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ నిర్లక్ష్యం
పుంగనూరు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి మూడో శనివారం కార్యాలయాలు, విద్యా సంస్థలు , మున్సిపాలిటీలు , గ్రామాల్లో పరిసరాలను శుభ్రం చేయాలని నిర్ధేశించింది. అయితే పుంగనూరు శుభా రాం డిగ్రీ కళాశాలలో చీపుర్లకు బదులు కట్టె పుల్లలతో చెత్తను ఊడ్చి.. ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు బ్యానర్లు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం విస్మయానికి గురిచేసింది. విద్యార్థులకు గురువులు నేర్పించే పద్ధతి ఇదేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వడం ఇలానేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
పూతలపట్టు (కాణిపాకం) : రైలు నుంచి జారి పడి ఓ యువకుడు శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ..గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవీణ్(21) అనే యువకుడు తిరుపతి నుంచి చిత్తూరు వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం మృత్తిరేవులు గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గఫూర్ వెదురుకుప్పం : రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని నల్లవెంగనపల్లె పంచాయతీ ఏపేరి గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ డీజీ గఫూర్ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం నేతలు ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన మైనారిటీ సమావేశంలో రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్సయ్యద్బాజీ నేతృత్వంలో ఎన్నకున్నట్లు తెలిపారు. -
ఏటా దిగుబడి 5,47,320 టన్నులు
రుచికి, పోషకాలకు మామిడి పెట్టింది పేరు. అందుకే ఇది పండ్లల్లో రారాజుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏటా మామిడి వినియోగం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మోజులో పడి యువత మామిడి రుచిని ఆస్వాదించలేకవడం ఒక విధంగా అవగాహనా రాహిత్యమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల స్థాయి నుంచే మామిడి వినియోగంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతుల సంఖ్య 80 వేల మందిమామిడిని ట్రేలకు ఎత్తుతున్న వ్యాపారులు కాణిపాకం: మామిడి సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. మామిడి గుజ్జుకు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. గత ఏడాది వివిధ ఫ్యాక్టరీలు 2.75 లక్షల టన్నుల మామిడి గుజ్జును తయారు చేసి నిల్వ చేశాయి. ఈ గుజ్జు అత్యధికంగా యూరఫ్ దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధాల కారణంగా గతేడాది నుంచి గుజ్జు ఎగుమతులు స్తంభించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మేర గుజ్జు ఎగుమతి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మామిడి గుజ్జు కిలో రూ.60 నుంచి రూ.65 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.36 పలుకుతోంది. దీంతో ఏంచేయాలో తెలియక రైతులు.. పరిశ్రమల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడిలో అధిక పోషకాలు ఉన్నాయని, దీని వినియోగం పెరిగితే అటు రైతుకు.. ఇటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కూల్డ్రింక్స్తో ప్రమాదం కూల్డ్రింక్స్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. చిన్న పాటి ఫంక్షన్ నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల వరకు భారీ స్థాయిలో కూల్డ్రింక్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కూల్డ్రింక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా పెద్దపెద్ద మాల్స్లో కూల్డ్రింక్స్ను ఆఫర్ల పేరుతో అమ్మేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని చాలా మంది కూల్డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, అధిక బరువు, డయాబెటిక్, ఫ్యాటీ లివర్, గుండె, కీళ్ల సమస్యలు, పంటి సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడితో ఉపయోగాలెన్నో మామిడి పండ్లు, జ్యూస్లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్–సీ, పైబర్ శరీరంలోని హానిచేసే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దంతాలు శభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. మామిడి మంచి జీర్ణకారి. సహజమైన బరువు పెంచేందుకు దోహదం చేస్తోంది. మామిడి రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బు రాకుండా కాపాడుతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ● జిల్లాలో విస్తారంగా మామిడి సాగు ● యూరప్లో యుద్ధాల కారణంగా అమ్ముడుపోని గుజ్జు ● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు ● స్థానికంగానే వినియోగం పెంచాలంటున్న వైద్య నిపుణులు మామిడిని గ్రేడింగ్ చేస్తున్న సిబ్బందిఎనర్జీ డ్రింక్ల మోజులో పడొద్దు యువత ఎక్కువగా ఎనర్జీ డ్రింక్ల మోజులో పడుతోంది. కిక్ అంటూ వెంటపడుతున్నారు. అయితే దాని వల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో పండ్ల రసాల వినియోగంపై అవగాహన పెంచాలి. ఎనర్జీ డ్రింక్స్లు తాగితే వచ్చే అనర్థాలను వివరించాలి. –గోవర్దన్బాబి, మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమలశాఖ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు మామిడి ఆరోగ్యానికి మంచిది మామిడి రసం, పండ్లల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే బీట కెరాటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కావాల్సినంత ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎనర్జీ పెంచుతుంది. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా తీసుకోవచ్చు. కంటి చూపునకు మేలు చేసే గుణాలు మ్యాంగోలో అధికం. – సునీతాదేవి, చీఫ్ డైటీషియన్, స్విమ్స్, తిరుపతి -
ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన
చిత్తూరు రూరల్ (కాణిపాకం):ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్ఓ) అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ కార్యాలయం ఎదుట శనివారం వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు హెచ్ ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయా లని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షులు భానుప్రియ, కార్యదర్శి కీర్తి ప్రియ, సభ్యులు దివ్య భారతి, అరుణకుమారి, కవిత, గంగమణి, మోహన కుమారి, సురేష్కుమారి, రషీద్, సుధీర్ పాల్గొన్నారు. -
చెరువులో పడి అవ్వామనవడి మృతి
గుడుపల్లె: పశువులను కడిగేందుకు చెరువులోకి వెళ్లి అవ్వామనవడు మృతి చెందిన సంఘటన గుడుపల్లె మండలం బిజిగానిపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని బిజిగానిపల్లె గ్రామానికి చెందిన మునెమ్మ(65) ఆమె మనుమడు జయప్రదీప్(14) గ్రామానికి సమీపంలోని నాగరప్ప చెరువులోకి తమ పశువులను కడగడానికి తీసుకు వెళ్లారు. పశువులను చెరువులో కడుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు లోతుగా ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే చెరువులోకి వెళ్లి చూడగా వారి మృతి చెందారు. జయ ప్రదీప్ 9వ తరగతి చదువుతున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉండి చెరువులో పడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. లారీని ఢీకొన్న ఐషర్ వాహనం శ్రీరంగరాజపురం : ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొన్న సంఘటన మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పళ్లిపట్టు నుంచి చి త్తూరు వైపు వెళుతున్న ఐషర్ వా హనం మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఐషర్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జ రగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి హా మీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి అర్హత, ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ సంయుక్తంగా పండ్ల తోటల పెంపకం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఐదువేల ఎకరాలలో పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామన్నారు. మామిడి, జామ, కొ బ్బరి, దానిమ్మ, అల్ల నేరేడు, చింతకాయ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జామ, జామ (బ్లాక్, బండ్), సీతాఫలం (బ్లాక్, బండ్), యాపిల్ బెర్రీ, కొబ్బరి, మల్లె పూలు, రోజా, మునగ, ఆయిల్పామ్, జీడిపప్పు, తైవాన్జామ, అంజీర, చింత, బండ్ ప్లాంటేషన్ తదితర పండ్ల మొక్కలు పెంపకం చేపట్టవచ్చన్నారు. అలాగే పూల సాగుకు సంబంధించి మల్లె, రోజా పంటలపై ఆసక్తిగల రైతులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన చిన్న, సన్నకార రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండల పరిధిలోని ఉపాధి హామీ పథక కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. పూడి రైల్వే గేట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్ వడమాటపేట (విజయపురం): పూడి రైల్వే గేటు వద్ద శుక్రవారం గేటు దాటే క్రమంలో అటువైపు వచ్చిన లారీ పైభాగం ప్రమాద ఘంటికలు సూచించే పైపునకు తగులుకోవడంతో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో వాహనాలు రోడ్డుపై చాలావరకు ఆగిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్కు తెలపడంతో అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది ప్రమాద ఘంటికల సూచీని తొలగించడంతో లారీ ముందుకు కదిలింది. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియరైంది. -
వక్ఫ్ సవరణ వద్దని రోడ్డెక్కిన ముస్లింలు
పుంగనూరు: వక్ఫ్ చట్ట సవరణ వద్దని ముస్లింలు పుంగనూరులో శుక్రవారం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరిస్తున్నామని, తమ సత్తా చాటుతామని, రాజీపడే ప్రసక్తే లేదని ముస్లింలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వందలాది మంది ముస్లింలు నమాజ్ పూర్తి చేసుకుని, ర్యాలీగా పట్టణంలోని ఇందిరా సర్కిల్ చేరుకున్నారు. నల్ల జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో మతాలకార్చిచ్చుకు ప్రభుత్వమే పునాది వేస్తోందని ముస్లిం నేతలు మండిపడ్డారు. హిందు మతానికి చెందిన వాటిలో ముస్లింలకు సభ్యత్వం ఉండదని, అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో ముస్లింలపైన, వారి ఆస్తులపైన అన్యమతస్తులకు పెత్తనం చెలాయించేందుకు అధికారం ఎలా ఇస్తారంటు నిలదీశారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకుని, వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఐకమత్యంతో పోరాటం చేసి, సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ముస్లిం నాయకులు ముజాహిద్, యూనస్, జవహార్, అయాజ్, మమ్ము, జమీర్, రఫిక్, నూర్, అయూబ్, అస్లాం, ఎస్.రఫిక్, ఇమ్రాన్, సల్మాన్, పర్వేజ్, యాసిన్, నజీర్ తో పాటు వక్ఫ్ బోర్డు కమిటి సభ్యులు పాల్గొన్నారు. -
చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే!
● అవినీతికి అడ్డాగా చిత్తూరు రెవెన్యూ కార్యాలయం ● నకిలీ పత్రాలకు కేంద్ర బిందువు ● గొలుసు పడితే కాసులు ● పట్టాలంటే పైసలతోనే పని ● ప్రతి పనికి బహిరంగంగా వసూలు ● చిత్తూరు నగరంలోని ఓ గ్రామకంఠం భూమిలో పూర్వీకులు ఇల్లు కట్టుకున్నారు. వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కానీ వంశపారపర్యంగా వారు ఆ గ్రామ కంఠం భూమిలోనే నివాసం ఉంటున్నారు. ఉన్న పాత ఇల్లు కొట్టేసి..కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పొజిషన్ అవసరం. కానీ రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ● చిత్తూరులోని మరో చోట గ్రామకంఠ భూమి ఖాళీగా ఉంది. ఆ భూమి తమ అనుభవంలోనే ఉందని ఇద్దరు వ్యక్తులు కార్యాలయానికి వచ్చారు. పక్కాగా పని చేసి పెట్టేవారిని పట్టుకున్నారు. ఇంకేముంది మూడు రోజుల్లో ముచ్చటగా చేతిలో పొజిషన్ పెట్టేశారు. తీరా వారు అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం. ● చిత్తూరు నగరానికి చెందిన ఓ భూమి రకం తప్పుగా నమోదైంది. దాన్ని మార్చుకుని కన్వర్షన్ పెట్టుకునేందుకు భూ యజమాని ఆరునెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తొలుత భూమి సబ్ డివిజన్ కోసం ఓ సర్వేయర్కు రూ. 20 వేలు ఇచ్చుకున్నాడు. అయినా ఇంత వరకు పని కాలేదు. ● చిత్తూరు మండలంలోని ఓ రైతు సర్వే చేసి హద్దులు చూపించుకునేందుకు ఓ సర్వేయర్కు రూ.60వేలు ఇచ్చుకున్నాడు. ఆ పనికాకపోవడంతో ఆ రైతు కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆ సర్వేయర్ను అదనపు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి మార్చడంతో ఆ రైతు విస్తుపోతున్నాడు. ఇలా ఓ టీడీపీ కార్యకర్త కూడా రూ.10 వేలు ఇచ్చుకున్నా సర్వే కాలేదు. దీంతో అధికారంలో ఉండి కూడా ఏందీ తంటా అంటూ ఆ కార్యకర్త తల పట్టుకుంటున్నాడు. ఇలాంటి కేసులు ఇదొక్కటే కాదు..పదుల సంఖ్యలో వస్తున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డగా మారింది. నకిలీ పత్రాల తయారీకి కేంద్ర బిందువుగా పేరు తెచ్చుకుంది. ప్రతి పనికీ బహిరంగంగా కాసులు వసూలు చేస్తున్నారు. పట్టా ఇవ్వాలన్నా.. సర్వే చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సివస్తోంది. చిత్తూరు నగరం మిట్టూరులో అర్బన్, వేలూరు రోడ్డులో రూరల్ తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. ఇక్కడకి నిత్యం 200 మందికిపైగా వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సర్వే, పట్టాదారు పాసుపుస్తకం, మార్పులు, సర్వే నంబర్లల్లో తప్పులు తదితర సమస్యల పరిష్కారానికి వస్తుంటారు. వీరి అవసరాలను అసరా చేసుకుని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దొంగ పట్టాలకు కేంద్ర బిందువు చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కేంద్రం దొంగ పట్టాలకు కేంద్ర బిందువుగా మారింది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు, సిబ్బంది, దళారులు కాసులు దండుకుంటున్నారు. ప్రశాంత్నగర్, తిమ్మసముద్రం, ఇరువారం, తదితర ప్రాంతాల్లో పట్టా ఉన్న స్థలాలకు మళ్లీ డూఫ్లికేట్ పట్టాలు సృష్టించి ఇచ్చేస్తున్నారు. ఇందులో ఇదివరకు పనిచేసిన తహసీల్దార్లు, విశ్రాంత తహసీల్దార్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారు పనిచేసిన తేదీల్లో పట్టా ఇచ్చినట్లు పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు పత్రాలు వేలల్లో ఉన్నట్లు అధికారుల అంచనా. సర్వేకూ సమర్పించుకోవాల్సిందే! ప్రస్తుతం సర్వేకు సంబంధించిన సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కొందరు సర్వేయర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. సర్వేకు డబ్బులు..కట్టినా, కట్టపోయినా కాసులిస్తే వాలిపోతున్నారు. కొందరు నగదు రూపేణ తీసుకుంటే..మరికొందరు ఫోన్పే, జీ పే ద్వారానే కాసులు వసూలు చేసుకుంటున్నారు. ఇదంతా సాయంత్రం 6 గంటల తర్వాతే జరుగుతుంటాయి. పనుల ఆధారంగా లంచం రెవెన్యూలో ప్రతి పనికీ కొందరు అధికారులు నిర్భయంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టామార్పునకు స్థలం, దాని విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారు. సాధారణ ఫీజుగా రూ.20 వేలుగా ఫిక్స్ చేశారని విమర్శలు వస్తున్నాయి. సర్వే నంబర్లలో తప్పులు సరిదిద్దుకునేందుకు రూ.10 వేలు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అన్లైన్లో దొర్లిన తప్పులు సరిదిద్దడానికి రూ.10వేలు, కరెంటు సర్వీసు రూ.10 వేలు, సబ్ డివిజిన్ చేసుకునేందుకు ఎంత డబ్బులిస్తే అంత తొందరగా పనులు అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ
చిత్తూరు అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరులోని జిల్లా కోర్టులోని ఛాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో మచిలీపట్నం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులో పనిచేస్తున్న ఇ.భీమారావును అనంతపురం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. నేడు జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ నెల 19వ తేదీన పారిశుద్ధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇ –చెక్ అనే ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇ– చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలోని గృహాలు, దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించి, రీ యూజ్ చేయడమని తెలిపారు. ఇందుకు షాపులు, ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ను పూర్తిగా సేకరించాలనన్నారు. ఈ వేస్ట్ని సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి వెబ్సైట్లో ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి దురాగతాలను ఎండగట్టాలి
వెదురుకుప్పం: కూటమి దురాగతాలను ఎండగట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆళ్లమడుగులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పది నెలలుగా సూపర్సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని దౌర్భాగ్య పర్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. పథకాలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులతో అణచివేతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తానే తప్పు చేస్తూ ప్రతిపక్ష పార్టీపై నెట్టి వారిపైనే నిందలు, అభాండాలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచకాలకు హద్దుల్లేవన్నారు. పేదల ఉసురు తగిలితే ఎలాంటి పార్టీ అయినా కోలుకోలేదన్నారు. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దురాగతాలను ఎండగట్టేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల తలరాతలు మారాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ సభ్యురాలు రమణమ్మ, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కామసాని పద్మనాభరెడ్డి, మండల ఉపాధ్యక్షులు చిరంజీవిరెడ్డి, గోవిందన్, కార్యదర్శులు బొజ్జారెడ్డి, కేశవులు, వెంకటేశ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పురుషోత్తం పాల్గొన్నారు. –మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆమె స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధుని దర్శించుకున్న రాష్ట్ర కమిషన్ వరసిద్ధి వినాయకస్వామివారిని రాష్ట్ర శిశు, చిన్నపిల్లల సంక్షేమ కమిషన్ కేసలి అప్పారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి, స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం స్థానిక మణికంఠే శ్వరస్వామి, వరదరాజుల స్వామిని దర్శించుకున్నారు. -
మేసీ్త్ర పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తూ..
జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 935 మార్కులు సాధించింది. సన్షైన్ అవార్డుకు ఎంపికై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు సైతం స్వీకరించింది. కర్నూలు జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమార్తెలు. శివన్న తిరుపతిలో మేసీ్త్ర పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నారు. స్రవంతిని కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని, ఆ మార్పులతోనే తాను ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్రవంతి వెల్లడించింది. -
● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్ కోర్సులు ● డీసీసీపీ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు మెండు ● శ్రీహరికోట షార్లో మంచి డిమాండ్ ● అప్రెంటిస్షిప్ పూర్తితో ప్రైవేటు రంగాల్లో ఆఫర్లు
షార్లో ట్రైనింగ్.. ప్రొఫైల్ చూసి అసెంచూర్లో జాబ్ పలమనేరులోని పాలిటెక్ని క్ కళాశాలలో డీసీసీపీ కో ర్సు చదివి శ్రీహరికోటలో ఏడాది పాటు అప్రెంటిస్షి ప్ చేశా. నా ఈ ఫ్రొఫైల్ చూడగానే ఇంటర్వ్యూలో బెంగళూరులోని అసెంచూర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. పీ2పీ (ప్రొక్యూర్మెంట్ టు పే న్యూ అసోసియేషన్)గా మంచి ప్యాకేజీతో జాబ్ చేస్తున్నా. పలమనేరులో ఇలాంటి కోర్సులున్నాయని చాలామందికి తెలియదు. – హేమావతి, బెంగళూరు డీసీసీపీ కోర్సులో కంప్యూటర్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థినిలు విద్యార్థినులను అభినందిస్తున్న కళాశాల అధ్యాపక బృందం(ఫైల్)పలమనేరు: పాలిటెక్నిక్ కోర్సులు పదో తరగతి తరువాత తక్కువ ఖర్చు, సమయంలో ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పూర్తయ్యాక పాలిసెట్ రాసే విద్యార్థులు.. పాలిటెక్నిక్ అంటే బీటెక్కు సులభమైన దారిగానే భావిస్తుంటారు. చాలామంది ఈ కోర్సులో బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ వైపే చూస్తుంటారు. స్పెషల్ కోర్సులను పట్టించుకోరు. కానీ, ఇవే త్వరగా ఉపాధి పొందేందుకు సోపానాలు అని తెలుసుకోవడం లేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి మంచి అవకాశాలుంటాయి. ఇప్పటికే ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30వ తేదీన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ర్యాంకు వచ్చిన బాలికలు పలమనేరు, నెల్లూరులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లోని కొన్ని కోర్సులు చేస్తే 19 ఏళ్లకే షార్లో ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డీసీసీపీ అంటే ఏమిటి? డీసీసీపీ.. కామర్స్తోపాటు పూర్తిస్థాయి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పే మూడేళ్ల డిప్లొమా కోర్సు. ఇందులో కామర్స్, డిగ్రీ మొదటి సంవత్సరం ఇంగ్లిష్, ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్, హయ్యర్, మోడరన్ ఆఫీస్ మేనేజ్మెంట్, బిజినెస్ కరస్పాండెన్స్, స్టాటిటిక్స్, బిజినెస్ లా, మార్కెటింగ్ ప్రిన్సిపుల్స్, అనలటికల్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీసీ, టాలీ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. కోర్సులో ఏడాది అప్రెంటిస్షిప్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారు బీకాం కంప్యూటర్స్ డిగ్రీలో లేటరల్ అడ్మిషన్ కింద సెకండ్ ఇయర్లో చేరవచ్చు. ఆపై ఎంబీఏ, సీఏ, సీఎస్ లాంటి ఉన్నత కోర్సులు చదవచ్చు. ● తల్లిదండ్రులు ఇలాంటి కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.బాలికలకు ప్రత్యేక పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో ప్రత్యేకించి మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీపీ) కోర్సు చేసినవారు ఏటా తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్లో కంప్యూటర్ అనలిస్ట్గా అప్రెంటిస్షిప్నకు ఎంపికవుతున్నారు. షార్లోనే కాక ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్) హెచ్ఏఎల్ (హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్) వంటి పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. వీటిలో అప్రెంటిస్షిప్తో నైపుణ్యం సాధించినవారికి ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. పలమనేరులోని కళాశాలలో డీసీసీపీ కోర్సు పూర్తి చేసుకున్న 90 శాతం మందికి ఏటా వెంట నే ఉపాధి లభిస్తోంది. పదేళ్లలో వివిధ కోర్టులు, రాష్ట్ర సచివాలయం, పోస్టల్, ప్రైవేటు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 400 మంది దాక ఉద్యోగాలు పొందడం విశేషం. టెన్త్ తర్వాత మంచి కోర్సు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు ఆధారంగా పలు కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు పాలిటెక్నిక్ విద్య ఎంతో మేలు. తద్వారా బీటెక్లోనూ ప్రవేశించి ఉన్నత విద్య అభ్యసించవచ్చు. – డా.బెహరా శ్రీనివాస్, ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పలమనేరు ఇక్కడ చదివితే జీవితంలో సెటిల్ కోర్ బ్రాంచ్లే కాదు స్పెషల్ బ్రాంచ్ల్లో చదివినవాళ్లూ మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు. డీసీసీపీ కోర్సు చేసిన చాలామంది షార్ లాంటి గొప్ప సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. కొందరు ఉన్నత చదువులకు వెళుతున్నారు. పాలిటెక్నిక్లోని ఇలాంటి కోర్సుల గురించి చాలామందికి తెలియదు. – మహమూద్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు ఏటా పది మందిపైనే షార్లో శిక్షణకు.. ఏటా షార్కు ఇక్కడినుంచి పదిమంది పైగా విద్యార్థినులు శిక్షణకు వెళుతున్నారు. ఆపై ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈసారి సైతం ఇక్కడ చదివిన సిమ్రాన్ (సదుం), డిల్లీ (బంగారుపాళెం), శశిప్రియ (నిమ్మనపల్లి), భవాని (గుడుపల్లి) పలువురు షార్లో పనిచేస్తున్నారు. – శ్రీవిద్య, డీసీసీపీ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు -
ఉపాధికి‘షార్’్ట కట్
పాలిటెక్నిక్ కోర్సులు ఉపాధికి దోహదపడు తున్నాయి. ఈ కోర్సు చేసిన బాలిక లకు షార్లో అవకాశాలొస్తున్నాయి.శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : పేదింటి పిల్లలు ప్రపంచంతో పో టీపడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణ విప్లవం తెచ్చింది. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్ల పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి, విద్యాకానుక, నా డు నేడు తదితర పథకాలను అమలు చేసి పేద విద్యార్థు ల ఉన్నత చదువులకు భరోసా కల్పించింది. నాటి సంస్కరణలే..నేటి ఉత్తమ ఫలితాలు వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలకు దో హదం చేశాయి. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లో 74 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాల ల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు పలు కార్యక్రమాలు గ త ఐదేళ్లల్లో చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉండేది. గత సర్కారులో కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు నెరవేర్చి, వారి జీతా లు సైతం పెంచారు. దీంతో ఆ లెక్చరర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేశారు. పాఠశా ల స్థాయి విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేసి ఆర్థిక సహా యం అందజేశారు. ఆ ఆర్థిక సహాయంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పలు చేయాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలను సజావుగా చదివించుకున్నారు. సన్షైన్ అవార్డులు స్వీకరించిన ఆరుగురు విద్యార్థులు గత సర్కారులో ఉత్తమ విద్యాబోధన, విద్యాసంస్కరణతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలోని పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న హర్షిత వొకేషనల్ గ్రూపులో 971 మార్కులు సాధించింది. కుప్పం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో చదివిన సుస్మిత 976 మార్కులు, అదే కళాశాలలో శ్రీనివాసులు 952 మా ర్కులు, రొంపిచెర్ల కేజీబీవీలో సీఈసీ చదివిన శ్రవంతి 935, కుప్పం నడిమూరు మోడల్ స్కూల్లో సీఈసీ చదివిన అశ్విని 969 మార్కులు సాధించారు. ఈ ఐదుగురు విద్యార్థులు ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశా ఖ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అవార్డులు, ల్యాప్టాప్ స్వీకరించారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో వెయ్యికి 971 మార్కులను సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ప్ర భుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది. – 10లోన్యూస్రీల్ గత ప్రభుత్వ సంస్కరణలతోనే నేడు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సత్తా చాటిన సర్కారు విద్యార్థులు వైఎస్సార్సీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత సన్షైన్ అవార్డులు స్వీకరించిన జిల్లా విద్యార్థులు విద్యతోనే పేదరికం దూరం..అభివృద్ధి సాధ్యం అని నమ్మింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేసింది. విద్యకు పెద్ద పీట వేసింది. విద్యాశాఖలో పెను మార్పులు చేసింది. సంస్కరణలు తీసుకొచ్చింది. పలు పథకాలు అమలు పరిచింది. పేద విద్యార్థులకు నాణ్యతతోకూడిన మెరుగైన విద్య అందింది. వారంతా క్రమశిక్షణతో చదివి, నేడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, మెరిశారు. ఇందంతా నాటి వైఎస్సార్ సీపీ సర్కారు సంస్కరణల ఫలితంగా సాధ్యమైందని, వారి ఆలోచన, ఆచరణ అ‘ద్వితీయ’ం అని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కుప్పంలో రౌడీ షీటర్ రెమో ఆగడాలు..
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో దారుణం జరిగింది. మెకానిక్ మహబూబ్ బాషాపై రౌడీషీటర్ రెమో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ బాషా.. కుప్పం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కారులో మితిమీరిన వేగంతో వెళ్లిన రౌడీషీటర్ రెమో.. మహబూబ్ బాషాతో ఘర్షణ పడ్డాడు.ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో మహబూబ్ బాషా కూప్పకూలిపోయాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి బంధువులు.. రౌడీషీటర్ రెమోను అరెస్ట్ చేయాలని నిరసన చేపట్టారు. కర్ణాటక నుంచి కుప్పంకు మద్యం అక్రమ రవాణా చేస్తున్న రెమో.. బెల్టుషాపులు నిర్వహిస్తున్నాడు. -
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21–23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల జూలై కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జూన్ నెల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి దర్శనం టోకెన్ల జూలై కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ఎస్ఈడీ కోటా విడుదల జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్ఈడీ) టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మ«ద్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. -
గోమయం.. దివ్యమైన హోమం
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. నగరి : పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చిత్తూరు జిల్లా నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శా్రస్తోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాతి్మకతను సంతరించుకుంటుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు.ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ -
పంటకు రక్ష.. భక్షకులకు శిక్ష
పలమనేరు: ప్రతి సమస్యకూ ఓ మార్గం ఉన్నట్టు ఓ రైతు తన మొక్కజొన్న తోటలో పిట్టలు, వానరాలను తరిమేందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు. పాత రేకులతో భారీ శబ్ధాలు వచ్చేలా చేసి, నిశ్చింత అయ్యాడు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లికి చెందిన రైతు జగదీష్ తన పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం కంకులు ముదిరిన దశలో ఉన్నాయి. దీంతో పక్షులు, వానరాలు తోటలోకి వచ్చి రైతుకు నష్టం కలిగిస్తున్నాయి. దీన్ని గమనించిన కేకలు పెట్టినా అవి వెళ్లకపోవడంతో ఓ పాత ఇనుప రేకును వంచి దానికి ఓ తాడును కట్టాడు. ఇది గాలి వచ్చినప్పుడు రేకులు రాసుకుని శబ్ధం వచ్చేలా చేశారు. గాలి లేనప్పుడు రైతు రేకులకు కట్టిన ధారాన్ని లాగుతూ శబ్ధాన్ని పుట్టిస్తున్నాడు. దీంతో అతని మొక్కజొన్న తోటలోకి ఇప్పుడు పక్షులు, వానరాలు రాకుండా పోయాయి. రైతు ఐడియాను చూసిన జనం వారెవ్వా అంటున్నారు. -
సిండికేట్.. అ‘ధర’హో!
హెచరీల సిండికేట్తో చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. ప్రాంతం, సీజన్ల వారీగా రేట్లు పెంచుతున్నాయి.శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఇతర నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు (ఇన్సెట్) ఎంపీ గురుమూర్తితో కూటమి నేతల వాగ్వాదంఆర్టీసీలో టెండర్ల ఆహ్వానం చిత్తూరు రూరల్ (కాణిపాకం):చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండ్లోని డీపీటీఓ కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు www.aprrtc.ap.gov.inలో చూ సుకోవచ్చని పేర్కొన్నారు. ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం డీఈఓ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్ల కు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమ లు చేయాలన్నారు. ఆయా యాజమాన్యాల్లో ఒకటో తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 28 నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ కోరారు. వెబ్సైట్లో ఏకీకృత సీనియారిటీ జాబితాచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్అసిస్టెంట్ల ఏకీకృత సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈ ఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి హెచ్ఎం కేడర్ ఉద్యోగోన్నతికి మెరిట్ ప్రకారం సిద్ధం చేసిన ఏకీకృత సీనియారిటీ జాబితాను ఈ నెల 17వ తేదీన విడుదల చేశామన్నారు. ఈ జాబితాను స్కూల్ అసిస్టెంట్లు సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే తగు ఆధారాలతో ఈ నెల 20 వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించబడవని డీఈఓ వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ టీబీసీ వద్దకు చేరింది. బుధవా రం అర్ధరాత్రి వరకు 70,372 మంది స్వామివారిని దర్శించుకోగా 24,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.25 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారికి నాణ్యమైన సేవలు తిరుపతి కల్చరల్: శ్రీవారి భక్తుల సేవ నిరంతరం అని, మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ శ్రీవా రి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుల్ల జోగేశ్వరరావు సూచించారు. పద్మావతి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, సభ్యులు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాల కమిటీ చేసిన పలు సూచలను పరిగణనలోకి తీ సుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాల న్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. స్వామి వారి కీర్తనలు, గోవిందనామావళిని రాత్రి 10 గంటల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. టీటీడీ ఈఓ శ్యామలరావు సమాధానం ఇస్తూ ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి, ఏపీ అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు. ఏపీ అంచనాల కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, వెంకటరాజు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై లెక్కతేలకుండా కూటమి నేతలు అడ్డుకట్టకు యత్నించారు. తప్పులు కప్పిపుచ్చేందుకు అధికార మదంతో రెచ్చిపోయారు. కుట్రపూరితంగా సవాల్ విసిరి రెచ్చగొట్టారు. ఆపై పోలీసులను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ నాయకులు గోశాలకు వెళ్లకుండా నిర్బంధకాండకు పూనుకున్నారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తప్పుడు ప్రకటనలు..కప్పిపుచ్చే యత్నాలు టీటీడీ గోశాలలో వరుసగా గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ ఇటీవల వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. నాటి నుంచి కూటమి నేతలు ఆ తప్పుని కప్పిపుచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొదట తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ పరస్పర విరుద్ధ ప్రకటనలకు దిగారు. 40 గోవులు మృతి చెందాయని ఒకరంటే.. కాదుకాదు 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెందాయని ఇంకొకరు చెప్పుకొచ్చారు. మరో వైపు టీటీడీ ఏకంగా ఈఓ మీడియా సమక్షంలోనే గత మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయని కుండబద్ధలు కొట్టేశారు. మొదటి రోజు గోవులు చనిపోలేదని ప్రకటన చేసి.. మరుసటి రోజు గోవులు మరణించాయని ప్రకటన చేయడాన్ని కూటమి శ్రేణులే తీవ్రంగా తప్పుపడుతున్నారు. సవాల్ విసిరి..నిజాలు దాచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. టీటీడీ గోశాలలో గోవులు మృతిచెంది ఉంటే నిరూపించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. గురువారం ఉదయం 10గంటలకు టీటీడీ గోశాలకు వస్తాను అని ప్రకటన చేయగా.. పల్లా రమ్మని ఆహ్వానించారు. తీరా పల్లా శ్రీనివాసరావు రాకపోగా.. కూటమి నేతలను గుంపుగా గోశాలకి పంపించారు. వైఎస్సార్సీపీ నాయకులను గోశాలకు వెళ్లకుండా అడ్డుకట్టకు తెరలేపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కూటమి నేతలు ఆడిన నాటకాలు చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. – 10లో– 10లోన్యూస్రీల్కూటమి నేతలు కపట నాటకాలకు తెరదీశారు. జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి బుకాయింపులకు దిగారు. టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషను ప్రపంచానికి వినిపించకుండా.. కళేబరాలు కనిపించకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు సవాల్ విసిరి నిజాలు నిగ్గుతేలుతాయని భయపడిపోయారు. పోలీసులను రంగంలోకి దింపి ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చెలరేగిపోయారు. వీరి నాటకాలు చూసిన జనాలు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకున్నారు. గోసంరక్షణను గాలికొదిలేసి ఇలా బరితెగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ గోశాల ఘటనపై హైడ్రామా సవాల్ విసిరి స్వీకరించకుండా అడ్డగింపులు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లకుండా పోలీసుల నిర్బంధం నిజాలు నిగ్గుతేలకుండా ఇదేం పని అంటున్న స్థానికులు ఇదేనా సనాతన ధర్మం తామే సనాతన ధర్మానికి ప్రతినిధులమని, హిందువులు, గోమాతలంటే భక్తి అని చెప్పుకునే కూటమి నేతలు.. టీటీడీ గోశాలలో ఉన్న పవిత్రమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చెప్పులు ధరించి తిరిగారు. ఆలయం అరుగుపై చెప్పులతోనే నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనిపై కూటమి శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. నిజాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధం తిరుపతి మంగళం : టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్రావు విసిరిన సవాల్ను తమ పార్టీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు వస్తామంటే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటని మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతీపురంలో పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం గోశాలకు వెళ్లేందుకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోట రాజేష్ను పోలీసులచేత ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. -
పలమనేరులో విజృంభిస్తున్న బ్లేడ్బ్యాచ్లు
పలమనేరు: పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లను గుర్తుతెలియని బ్లేడ్ బ్యాచ్ రాత్రిపూట కోసేస్తోంది. ఇంతకూ ఎవరు వీటిని కట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బ్యానర్లున్నప్పటికీ కేవలం వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లనే ఈ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది. నాయకుల పుట్టినరోజు, లేదా అభినందనలు ఇలా ఏ బ్యానర్ పట్టణంలో ఏర్పాటు చేసిన తొలిరోజే బ్లేడ్ గాట్లు తప్పడంలేదు. గత కొన్నాళ్లుగా ఈ తంతు పట్టణంలో సాగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ యువనేత క్యూడీ ఎస్ రాజేష్ బ్యానర్లను వీరు టార్గెట్ చేసి మరీ కోసేస్తున్నారు. దీనిపై సీసీ కెమెరాల ద్వారా నైనా స్థానిక పోలీసులు ఈ బ్లేడ్బ్యాచ్ను గుర్తించి, శిక్షించాలని బాధిత నాయకులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ బ్యానర్లే వారి టార్గెట్ -
2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఏర్పేడు(రేణిగుంట): 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.అరవింద్ పనగారియా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని ఆయన గురువారం సందర్శించారు. ‘భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం’ అనే అంశంపై ఆయన ఐఐటీ హ్యూమానిటీస్ – సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ఆయనకు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్.సత్యనారాయణ స్వాగతం పలికి, మూడో జనరేషన్ ఐఐటీగా తిరుపతి ఐఐటీ ప్రస్థానం గురించి, పదేళ్లలో ఐఐటీ సాధించిన ప్రగతిని గురించి ఆయనకు వివరించారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పాండా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8–9 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించారు. అటల్ సేతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశంలో 9–10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో మూడో వంతు మంది విద్యార్థులు పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ఉన్నారని, అధ్యాపకులు 200మందికి పైగా పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని తెలిపారు. -
రెవెన్యూ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తహసీల్దార్లు రెవెన్యూ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురు వారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆర్ఓఆర్ సమస్యలు అధికం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు ఆర్డీఓలు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తమకు కేటాయించిన మండలాల్లో భూ అలినేషన్, అసైన్మెంట్ భూమి, రెగ్యులరైజేషన్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్, రీ సర్వే సమస్యలను గుర్తించాలన్నారు. వెబ్ల్యాండ్లో సవరణలు చేసే సమయంలో తహసీల్దార్లు రికార్డులను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే పురోగతికి వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు తరచూ సమీక్షించాలన్నారు. ఈ వర్క్షాప్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
పంటకు రక్ష.. భక్షకులకు శిక్ష
ఓ రైతు వినూత్న ఆలోచనతో పంటకు రక్షణ కలగగా, దాన్ని తినివేయడానికి వచ్చే పక్షులు, వానరాలకు శిక్షగా మారింది.– 10లో●దమ్ముంటే గోశాలకు అనుమతించాలి టీడీపీ అధ్యక్షుడు ఎక్కడో కూర్చొని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే సవాల్ను స్వీకరించిన భూమన కరుణాకరెడ్డిని గోశాలకు పిలిపించుకుని నిజాలు నిగ్గుతేల్చాలి. టీటీడీ నిర్లక్ష్యం లేకుంటే మమ్మల్ని ఎందుకు గోశాలకు రానివ్వలేదు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్కళ్యాన్ కూడా టీటీడీలో జరుగుతున్న అపచారాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. తప్పులను సరిదిద్దుకోకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులతో పాటు జగనన్నపై ఎదురుదాడులకు దిగడం సిగ్గుచేటు. – ఆర్కే.రోజా, మాజీ మంత్రి స్వామితోనే రాజకీయమా బాబు? సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చేసిన రాజకీయం కార ణంగానే తిరుమలలో ఇ న్ని అపచారాలు జరగుతున్నాయి. శ్రీవారి లడ్డూ లో ఆవు, పంది కొవ్వు కలిసిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టిక్కాయలు వేసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు గోశాలలో గోవులు మృతి చెందితే ఒక్క ఆవు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబు తున్నారు. – కే.నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం వందకుపైగా గోవులు మృతి గత పది నెలలుగా టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయి. దీనిపై టీడీపీ అధ్యక్షుడు సవాల్ విసిరి నిజాలు నిగ్గు తేల్చకుండా అడ్డుకోవడం దారుణం. ఆయన సవాల్ను తమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు బయలు దేరితే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటి?. సవాల్ను ఎదుర్కొనే దమ్ములేదా?. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పిదాలను సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త హిందువుల మనోభావాలతో ఆటలా? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం, టీటీడీ వ్యవహరిస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారు తప్ప వాటిని సరిదిద్దుకోవడంలేదు. గోశాలలో గోవుల మృతిపై సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, స్థానిక ఎమ్మెల్యేలు వారికి తోచినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాలు మానుకుని గోశాలలో గోవుల మృతిపై నిజాలు అందరికీ తెలియజేయాలి. – చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వకర్త -
దొరికితేనే దొంగలు!
● చిత్తూరు కేంద్రంగా నకిలీ పత్రాల దందా ● తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు ● బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నం ● రెవెన్యూ ఉద్యోగేసూత్రధారి ● అన్ని తెలిసినా రెవెన్యూ అధికారులు మౌనం ● సాక్షి కథనంతో నకిలీ భాగోతంపై కదలికలు ● గుట్టురట్టు చేసిన పోలీసులు చిత్తూరు అర్బన్/కాణిపాకం: చిత్తూరులో తహసీల్దార్ కార్యాలయ కేంద్రంగా నకిలీ పత్రాల దందా పెచ్చుమీరింది. ఇంటి దొంగలే ఫోర్జరీ గ్యాంగ్ను సృష్టించారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నించారు. ఈగ్యాంగ్లో రెవెన్యూ ఉద్యోగే కీలక సూత్రధారిగా వ్యవహరించారు. తహసీల్దార్ సీలును దొంగలించారు. ఏకంగా తహసీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. రూ.కోట్ల విలువ చేసే భూములపై తప్పుడు పత్రాలు సృష్టించారు. దీనిపై సాక్షి దినపత్రిక కథనాలు వండిపెట్టింది. దీంతో ఫోర్జరీ వ్యవహరంపై కదిలికలొచ్చాయి. వెంటపడిన పోలీసులు, ముఠా గుట్టును రట్టు చేశారు. చివరకు ఫోర్జరీ ముఠా కటకటలపాలైంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నగరంలోని అర్బన్ తహసీల్దార్గా పనిచేసిన కళావతి సంతకం ఫోర్జరీ చేసిన ఓ పత్రం ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. తిమ్మసముద్రంలోని ఓ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తప్పుడు ఎంజాయిమెంట్ సర్టిఫికెట్తో కూడిన ఓ దరఖాస్తు సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లింది. తహసీల్దార్ సంతకాన్ని అనుమానించిన ఆ రిజిస్ట్రార్ ఆ పత్రాన్ని పరిశీలనలో పెట్టారు. అప్పటి తహసీల్దార్ ఇది తన సంతకం కాదని స్పష్టం చేశారంటూ చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆ ఫోర్జరీ లొసుగులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆపై దీనిని బయటకు పొక్కనివ్వకుండా కూటమి నేతలు అడ్డుపడ్డారు. పోలీసులకు పరీక్షే... ఫోర్జరీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ తరుణంలో కూటమి నేతల నుంచి అడ్డంకులు వచ్చి పడ్డాయి. దీనిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు ముందుకు కదిలింది. ఫోర్జరీ గుట్టును రట్టు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో దొంగిలించిన తహసీల్దార్ సీలు, గ్రీన్ ఇంక్ ఫెన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసు ఛేదించడం పోలీసులకు పెద్ద పరీక్షే అని చెప్పువచ్చు. కూటమి నేతలు సిఫార్సులను పట్టించుకోకుండా పోలీసు బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ముఠా చిట్టా విప్పి..కటకటాల్లోకి నెట్టారు. కలిసొచ్చిన అవకాశం... అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలుంటే ఓ రెవెన్యూ ఉద్యోగి పేరిట ఆరు నెలలు మరో వ్యక్తి పని చేయడానికి అవకాశం ఉంది. అయితే రెవెన్యూ అధికారులు తండ్రి పేరుతో పనిచేసే వారిని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకు ని వసూళ్లకు తెరలేపుతున్నారు. వాళ్ల చేతికే లాగిన్లు, రికార్డులు ఇచ్చి పెట్టి రెవెన్యూ సేవలను అమ్మకానికి పెట్టారు. ఇలా రూ.లక్షల్లో డబ్బులిచ్చే వారికి అప్పన్నంగా భూములను కట్టబెట్టేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా కార్లు బహుమతులు తీసుకున్నారనే చర్చ జోరందుకుంటున్నాయి. బెంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి పార్టీలు, పబ్బ్ల్లో ముంచెత్తేవారని కార్యాలయ సిబ్బంది విమర్శిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన ఆర్డీఓ, జేసీలు కూడా పర్యవేక్షణను పూర్తిగా మరిచిపోయారని, గతంలో జేసీగా పనిచేసిన గిరీ షా మాత్రం కార్యాలయాన్ని తనిఖీ చేసి వీఆర్వో లు, అధికారులను మందలించారని గుర్తు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ కార్యాలయంలో ఇంటి దొంగలు రెచ్చిపోయారనే వాదన వినిపిస్తోంది. తహసీల్దార్ కార్యాలయంఈ గ్యాంగ్ లీడర్ ఎవరంటే... 2018 ముందు నుంచే తహసీల్దార్ కార్యాలయంలో ఫోర్జరీ వ్యవహరం నడుస్తున్నట్లు ఆరోపణులున్నాయి. చంద్రశేఖర్ తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో తహసీల్దార్ సీలు విరిగింది. ఆ సీలు దొంగ పత్రాలు సృష్టించే వ్యక్తులే ఎత్తుకెళ్లారని కార్యాలయ సిబ్బంది కోడైకూస్తూ వచ్చింది. అప్పట్లో అధికారులు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇంటి దొంగలే ఈపని చేశారనేది పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు మండలంలోని పెరుమాళ్ల కండ్రిగ రెవెన్యూ వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ ఈ సీలు చోరీ చేసి.. ఇంట్లో దాచి పెట్టి దొంగ పత్రాలకు వాడుకున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. రూ.వేలల్లో డబ్బులు తీసుకుని దొంగ సంతకాలు పెట్టడం, సీలు వేయడం, తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు పెద్ద ముఠాను ఏర్పరుచుకున్నాడని ఈకేసులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలకంగా వ్యహరించిన మోహన్ మరో వీఆర్ఏగా ఉన్న రాజశేఖర్, డాక్యుమెంట్ రైటర్ గజేంద్రకుమార్ సహకారంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న గౌతమ్, జాన్సీ సహకారంతో బ్యాంకులను రూ.లక్షల్లో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారన్న నిజాలు వెల్లడయ్యాయి. కాగా ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీపై ‘సాక్షి’ పట్టు ఫోర్జరీ పత్రాల సృష్టిపై గత కొన్నేళ్లు సాక్షి దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎవరెవరూ..ఎలా చేస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.అయితే ఇంటి దొంగల ము సుగులో పడిన అధికారులు తేలికగా తీసుకున్నా రు. తహసీల్దార్ కళావతి సంతకం ఒకటి బయటికి రాకపోయి ఉంటే ఈ ఇంటి దొంగల మరింత రెచ్చిపోయి ఉంటారు. ఈ సంతకం ఫోర్జరీ దందాను సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. కూట మి నేతల అడ్డంకులు ఉన్న వెంబడించి వార్తా కథనలు ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోర్జరీ దందా బహిర్గతమైంది. ఇంటి దొంగలతో పాటు మరో ముగ్గురు రిమాండ్లోకి వెళ్లారు. పెరుమాళ్లకండ్రిగలో సమస్యలు కుప్పలు తెప్పలు తండ్రి పేరుతో పెరుమాళ్ల కండ్రిగకు వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ రెవెన్యూ అధికారులను గుప్పట్లో పెట్టుకుని చక్రం తిప్పాడనే ఆరోపణలున్నాయి. సర్వే నంబర్లను మార్చడం, సరిహద్దుల్లో హెచ్చు తగ్గులున్నాయని సమస్యలను సృష్టించి ఆదాయ వనరులు మార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామ కంఠం భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రభుత్వ భూములను కుటుంబసభ్యులు, బంధువుల పేరుతో పట్టాలిప్పించినటు్ల్ వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు తిమ్మసముద్రం, ప్రశాంత్నగర్, ఇరువారం ప్రాంతాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి, పలు స్థలాలకు పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొ పట్టాకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: చౌడేపల్లె– తిరుపతి ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి వద్ద ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో గురువారం ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన వేణుగోపాల్ బెంగళూరు నుంచి సదుం మండలం తిమ్మానాయనపల్లెలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. ఇదే మార్గంలో లద్దిగం గ్రామానికి చెందిన రెడ్డెప్ప, షఫీ మరొక బైక్లో సదుం నుంచి చౌడేపల్లె వైపునకు వస్తుండగా బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇచ్చినా వాహనం ఆలస్యంగా రావడంతో కడియాల మహేష్బాబు ప్రథమి చికిత్స చేయించి వాహనంలోకి ఎక్కించే చర్యలు తీసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారును ఢీకొన్న కంటైనర్
బంగారుపాళెం: మండలంలోని మొగిలిఘాట్లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై కారును కంటైనర్ ఢీకొంది. దొరచెరువు వద్ద బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెనుక భాగం దెబ్బతినింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కబేళాలకు 30 పశువులు ● పట్టుకున్న పోలీసులు పుంగనూరు: చట్టవిరుద్ధంగా కబేళాలకు తరలిస్తున్న 30 పశువులను పట్టుకుని, టీటీడీ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద ఓ కంటైనర్లో పశువులను తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పశువులను స్థానిక మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, వాటిని టీటీడీ గోశాలకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కాశిరాలలో జాతీయ బృందం పర్యటన యాదమరి: జలజీవన్ పథకంలో చేసిన పనులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి జాతీయ బృందం మండలంలో పర్యటించింది. గురువారం మండలంలోని కాశిరాల పంచాయతీలో జాతీయ బృందం సభ్యులు ఏడుగురు తాగునీటి ట్యాంకులు, నీటి కొళాయిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ బృందం సభ్యుడు అన్బజ్గన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్థానిక సచివాలయంలోని జల జీవన్ మిషన్కు సంబంధించి రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ డీఈలు శ్రీనివాసులు, రవికిరణ్, ఏఈ ఉషారాణి, ఈఓపీఆర్టీ సుకుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతిలో సాగు చేయండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక పద్ధతిలో పంట సాగు చేసి, లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ డ్రోన్ గూపు కన్వీనర్లు, కో కన్వీనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ డ్రోగో టెక్నాలిజీస్ డ్రోన్ ధర రూ. 9.80 లక్షలుంటే రాయితీతో రూ.7.84 లక్షలతో అందిస్తారన్నారు. విహజ్ఞ టెక్నాలజీస్ వారి డ్రోన్ ధర రూ.9.81 లక్షలుంటే రాయితీతో రూ.7,84,800కే ఇస్తారన్నారు. రైతులకు దీనిపై పూర్థి స్థాయిలో అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతుల్లో వ్యవయసాయాన్ని వృద్ధి చేసుకునేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి హరీష్, ఎల్డీఎం హరీష్, డీసీసీబీ సీఈఓ శంకర్బాబు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. -
చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతో కుటుంబ సభ్యులే యువతిని కడతేర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు మండలం తుమ్మిందలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడి మూడో కుమార్తె యాస్మిన్ భాను (26) బీటెక్ చదువుతుండగా పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన దళిత యువకుడు సాయితేజను ప్రేమించింది. ప్రేమ విషయం పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న యాస్మిన్ భానుకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో సాయితేజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న యాస్మిన్.. ఫిబ్రవరి 6న ఇంటినుంచి వెళ్లిపోయి సాయితేజను పెళ్లి చేసుకుంది. అనంతరం సాయితేజ, యాస్మిన్ పూతలపట్టులోని పోటు కనుమలో కాపురం పెట్టారు. ఇంటికి పిలిచి మరీ చంపేశారు ఆ తరువాత తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు, కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లు చేసి యాస్మిన్తో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓసారి షౌకత్ అలీ గడ్డంతో ఉండటాన్ని చూపించి ‘నీ తండ్రి బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓసారి ఇంటికి రా’ అని కుటుంబ సభ్యులు యాస్మిన్ను కోరగా ఆమె అంగీకరించింది. దీంతో సాయితేజ ఈ నెల 13న యాస్మిన్ను ఆమె బంధువుల ద్వారా ఇంటికి పంపించాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల సాయంతో యాస్మిన్ పీకకు తాడు బిగించి తండ్రి షౌకత్ అలీ చంపేసి.. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. ఓ కారును స్వాదీనం చేసుకుని, షౌకత్ అలీ, యాస్మిన్ అన్న లాలా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కుల మతాలు వేరుకావడంతో పరువుపోయిందని భావించి యాస్మిన్ను ఆమె తండ్రి షౌకత్ అలీ తాడుతో పీక బిగించి హత్య చేశాడని ఆమె భర్త సాయితేజ ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం ఆస్పత్రి వద్ద యాస్మిన్ తల్లి కూడా చెప్పిందన్నాడు. -
వాహనం ఢీకొని జింక మృతి
బంగారుపాళెం : మండలంలోని నలగాంపల్లె వద్ద బుధవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జింక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. స్థానికులు జింక మృతి సమాచారాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కాల్చివేయనున్నట్లు తెలిపారు. -
పుంగనూరు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
● ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ● జెడ్పీలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం ● కూటమి ఎమ్మెల్యేలకు చురకలంటించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ● పలు శాఖల అధికారులతో సమీక్షించిన కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు చేయాల్సిన, చేసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించేందుకు శాసనసభ అంచనాల కమిటీ బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం నియమ నిబంధనల ప్రకారం సమీక్ష నిర్వహించాల్సి ఉండగా కూటమి ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా పుంగనూరు నియోజకవర్గంపై అక్కసుతో ప్రసంగించారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక సూటిపోటి మాటలు గుప్పించారు. కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలకు కమిటీ సభ్యురాలు ఎమ్మెల్సీ కళ్యాణి ధీటుగా సమాధానం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎందుకు అంత నిధులు ఖర్చు పెట్టారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్ని పనులు చేశారని ఆరా తీశారు. ఇందుకు ఎమ్మెల్సీ కళ్యాణి స్పందిస్తూ.. ఇది జిల్లా సమీక్ష అని, ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ధీటుగా బదులిచ్చారు. నియోజకవర్గం పరిస్థితులను బట్టి పనులు మంజూరు చేస్తారని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వెంటపడి పనులు చేసుకోవడం సహజమన్నారు. గత పాలనలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక ఇలా చేయడం సబబు కాదన్నారు. అలాగైతే గత పది సంవత్సరాల నివేదికలను సిద్ధం చేసి సమీక్ష నిర్వహించాలన్నారు. అలా చేస్తే ఏ ప్రభుత్వం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని చురకలంటించారు. శాఖల వారిగా ఖర్చుల వివరాలు సరిగ్గా లేవు.. జిల్లాలో శాఖల వారిగా చేసిన ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖర్చు చేసిన పనులను విభజించి ఎంత మొత్తం ఖర్చు చేశారో నివేదికలు సిద్ధం చేసి కమిటీకి పంపాలన్నారు. జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తాగునీటి పనులకు ప్రాధాన్యం జిల్లా పరిషత్ నిధులతో తాగునీటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఎక్కువగా మామిడి, టమాట, పూలసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఏరియా, సీహెచ్సీ, పీహెచ్సీలలో ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను పెంచాలని చెప్పారు. మిషన్ వాత్సల్య పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలన్నారు. సమీక్షలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్్ , శాసనసభ అంచనాల కమిటీ డిప్యూటీ సెక్రటరీ రాజకుమార్, డీఆర్వో మోహన్ కుమార్, జిల్లా అధికారులు సత్యనారాయణ, చంద్ర శేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, వరలక్ష్మి, వెంకటరమణ, శ్రీదేవి, చిన్నారెడ్డి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ప్రసంగంపై విమర్శలు జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం నిర్వహణలో స్టేజీ పై కమిటీ సభ్యులతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూర్చుని ప్రసంగించడం విమర్శలకు దారితీసింది. శాసనసభ అంచనాల కమిటీలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం సభ్యులను నియమించింది. కమిటీలో ఉన్న సభ్యులు మాత్రమే స్టేజీ పై కూర్చుని సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అయితే చిత్తూరు ఎమ్మెల్యే కమిటీ సభ్యుడు కానప్పటికీ స్టేజీ పై కూర్చుని ప్రసంగించడం ఏమిటని పలు శాఖల అధికారులు గుసగుసలాడారు. సభ్యుల ప్రసంగం ఇలా... కమిటీ సభ్యులు పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ నిధులతో కేటాయించిన నిధులలో తాగునీరు, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ.. అధికారులు సమీక్షకు సంబంధించి అందజేసే నివేదికలను పూర్తి సమాచారంతో ఇవ్వాలన్నారు. వ్యవసాయశాఖకు సంబంధించి నిధులు కేటాయింపులను విభాగాల వారిగా నివేదికను అందజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అమలయ్యే పథకాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వివరాల నివేదికలను సమర్పించాలని పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము, కుక్కకాటుకు మందులతో పాటు అవసరమైన ఇతర మందులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని వరాహ వెంకట సూర్యనారాయణ రాజు కోరారు. శాసనసభ అంచనాల కమిటీ సమీక్షలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఖర్చు చేసిన అంశాలపై గత పదేళ్ల కాల వ్యవధిలో సమీక్షించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. ఫొక్సో కేసుల్లోని బాధితులకు వారి పిల్లల సంరక్షణ అంశాలపై ఐసీడీఎస్ అధికారులు నివేదికలు సమర్పించాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. -
బోయకొండలో తమ్ముళ్ల తన్నులాట
● టీడీపీ ఇన్చార్జి చల్లాకు స్వాగతం పలకడంలో వర్గపోరు ● టీడీపీ వర్గీయుల పరస్పర దాడులు చౌడేపల్లె : తెలుగు తమ్ముళ్లు పరస్పరం కొట్టుకొన్న ఘటన బుధవారం బోయకొండ వద్ద చోటు చేసుకుంది. బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం విజయవాడకు చెందిన దాత సౌమినిరెడ్డి సహకారంతో ఆర్ఓఆర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవానికి బోయకొండకు వచ్చారు. టీడీపీ కన్వీనర్ శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జుననాయుడు వర్గీయులు, టీడీపీ మండలాధ్యక్షుడు రమేష్రెడ్డి, బోయకొండ సుబ్బు ఇతర మండల నేతలు కలిసి చల్లాకు స్వాగతం పలికేందుకు ఎవరికి వారు వేర్వేరుగా స్వాగతం పలికి ప్రారంభోత్సవ కార్యక్రమ తంతు ముగించేశారు. కార్యక్రమం పూర్తి అయ్యాక ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు. బోయకొండ –మదనపల్లె మార్గంలోని గల శివప్ప నాయుడు అతని అనుచరులతో కలిసి ఇంటికి కారులో కలిసి వెళ్తుండగా ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకొన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మాకు న్యాయం చేయండి : టీడీపీ ప్రభుత్వంలోనే మా పార్టీ నేతల నుంచి మాకు ప్రాణ హాని ఉంది..మాకు న్యాయం చేయండని టీడీపీ కన్వీనర్ శివప్ప నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే పార్టీ మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి ప్రోత్సాహంతోనే బోయకొండ సుబ్బు అతని అనుచరులు, తమపై తమ పార్టీకి చెందిన నాయకులే వచ్చి పక్షిరాజపురం సమీపంలో కారును అడ్డగించి ధ్వంసం చేసి శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జున నాయుడులపై దౌర్జన్యంగా దాడిచేసినట్లు ఆరోపించారు. -
టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల విద్యాశాఖ కార్యకలాపాలన్నీ ఒకే యాప్లో నిర్వహించడం జరుగుతుందని వైఎస్సార్ కడప జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. బుధవారం ఆయన డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ, టీచర్ల కార్యకలాపాలకు లీప్ (లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఏపీ ) అనే యాప్ ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ యాప్ బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లాలో 8416 మంది టీచర్లు యాప్ ను డౌన్లోడ్ చేసుకోగా మిగిలిన 08 మంది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాల్లో ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కు 30, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంకు 38 మొత్తం 68 అభ్యంతరాలు వచ్చాయన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పై తరగతుల ప్రమోషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒకే యాప్లో విద్యాశాఖ కార్యకలాపాలు డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్జేడీ -
ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు
బంగారుపాళెం : మండలంలోని పాలేరు సమీపంలో బుధవారం విద్యార్థులను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పాలేరు, పాలమాకులపల్లెకు చెందిన పలువురు విద్యార్థులు బంగారుపాళెంలోని ప్రభుత్వ పాఠశాల, తగ్గువారిపల్లెలోని భవిత పాఠశాల, స్థానిక చైతన్య పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తరువాత రోజూ వెళ్లే ఆటోలో 10 మంది విద్యార్థులు బంగారుపాళెం నుంచి ఆటోలో కొత్తపల్లె సర్వీసు రోడ్డు మీదుగా స్వగ్రామాలకు బయలుదేరారు. పాలేరు అండర్ బ్రిడ్జికి కిలో మీటరు దూరంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడగా పాలమాకులపల్లెకు చెందిన ప్రకాష్ కుమారుడు యువతేజ, పాలేరుకు చెందిన జీవన్ కుమారై సౌమ్య, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సారూ.. నదిలో ఇసుక తవ్వకాలు ఆపండి
నగరి : నదిలో ఇసుక తవ్వకాలు ఆపి .. మాపై దయచూపండి అంటూ మండలంలోని తెరణి దళితవాడకు చెందినవారు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో, తహసీల్దార్ ధనంజయులుకు వినతిపత్రం అందించారు. కుశస్థలి నదిలో ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారని, శ్మశానాన్ని వదలడం లేదని వాపోయారు. పూర్తి స్థాయిలో ఇసుక తోడేయడంతో నదిలో ఇసుక పూర్తిగా అయిపోయి రాళ్లు తేలాయని, డైయింగ్ నీరు నదిలో వదిలేయడంతో అడుగులో పేరుకుపోయిన రసాయన వ్యర్థాలు, ఉప్పు బయటపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకాసురులు ఉచిత ఇసుక పేరుతో ఊడేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు మండలాలకు చెందిన వందల ట్రాక్టర్లు తెరణి ప్రాంతంలో కుశస్థలి నదిలోనే ఉన్నాయన్నారు. ఇలాగైతే మా మనుగడే ప్రశ్నార్థం అవుతుందని సమస్యను పరిష్కరించాలని అధికారులను దళితవాడ కాలనీ వాసులు కోరారు. -
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్ఎల్వీని అభివృద్ధి
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆర్బిటల్ రీ–ఎంట్రీ ఎక్స్పరిమెంట్ డిప్లాయిబుల్ లాండింగ్ గేర్(ఆర్ఎల్వీ)ను అభివృద్ధి చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్, విక్రమ్ సారాభాయ్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్, ఐఐఎస్యూ డైరెక్టర్ పద్మకుమార్ సమక్షంలోని ల్యాండింగ్ గేర్ డ్రాప్ టెస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. విమానం తరహాలో రెక్కలు కలిగిన పునర్వినియోగ లాంచింగ్ వెహికల్ పుష్పక్ కోసం డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టం పరీక్ష అర్హత కోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో అత్యాధునిక ల్యాండింగ్ గేర్ డ్రాప్ట్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. అయితే పుష్పక్ వాహనం ఆరోహణ క్రమంలో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కొన్ని కక్ష్యల తరువాత పుష్పక్ వాతావరణంలోకి ప్రవేశించి డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టంను ఉపయోగించి రన్వేపై ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ డ్రాప్ సౌకర్యానికి టెలిస్కొపిక్, ఆర్టిక్యులేటెడ్, సెమీ ఆర్టిక్యులేటెడ్ వంటి వివిధ రకాల ల్యాండింగ్ గేర్లను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. తారు, కాంక్రీట్, పొడి, తడి, మంచుతో నిండిన ఉపరితలాల వంటి విభిన్న రన్వేలపై ల్యాండింగ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమగాములను పంపి, తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయోగాత్మక పరీక్షలను చేస్తున్నామని కూడా ఇస్రో తెలియజేసింది. అధునాతనమై ఆర్ఎల్వీలు, విమాన సాంకేతికతల అభివృద్ధి అర్హతను వేగవంతం చేసే సామర్థ్యాన్ని ఇస్రో కలిగి వుంది. -
సమస్యల పరిష్కారానికి రూ.30 లక్షల నిధులు
కుప్పం : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు సామగుట్టపల్లెలోని పలు సమస్యల పరిష్కారం కోసం కడా పీడీ వికాస్ మరమ్మత్ రూ. 30 లక్షలు మంజూరు చేశారు. బుధవారం రెండో వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యలాజనూరు, చీగలపల్లి, సామగుట్టపల్లి గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజీలు, పైపు లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గాను వెంటనే రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్ర కటించారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కంటైనర్లో అగ్నిప్రమాదం కుప్పం : కుప్పం మీదుగా కోల్కతాకు వెళ్తున్న కంటైనర్లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. పాల పదార్థాలు తీసుకుని కోల్కతా వెళ్తున్న ఏసీ కంటైనర్ పట్టణం బైపాసు రోడ్డు విజలాపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మిగిలిన రూ.10 లక్షల పదార్థాలను మంటల నుంచి కాపాడారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎస్యూలో యూజీసీ బృందం పర్యటన తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాజభాషా సమితి బృందం బుధవారం విస్తృత పర్యటన చేపట్టింది. ఇందులో భాగంగా వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధికారులతో బృందం సభ్యులు డాక్టర్ కిశోర్ కుమార్, వీకే సుదర్శన దేవి సమావేశమయ్యారు. వర్సిటీలో రాజభాషగా ఉన్న హిందీ భాషను కార్యాలయ ఆదేశాలలో ఎంత వరకు అమలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ వర్సిటీలో రాజభాష హిందీ అమలు తీరు సంతృప్తి కరంగా ఉందన్నారు. హిందీ భాషను వర్సిటీలో మరింత విస్తృతం చేసేందుకు అధికారులు, అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అకడమిక్ డీన్ రజనీకాంత శుక్లా, అధికారులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
గంగాధర నెల్లూరు : రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికారి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. మండలంలోని నాసంపల్లిలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా గిరిజనుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి మాట్లాడుతూ.. చట్టం, హక్కుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా అందరూ చట్టం ముందు సమానులేనన్నారు. ముఖ్యంగా, బలహీన వర్గాలకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిందని తెలిపారు. వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చన్నారు. ఈ చట్టం వివక్ష , హింస నుంచి కాపాడుతుందని అన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయస్థానాలు మీకు అండగా నిలబడుతాయని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఉందని , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని వీటిని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి , మండల స్థాయి అధికారులు, సర్పంచ్ నీలావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫోర్జరీ ముఠా కటకటాలపాలు
● కొలిక్కి వచ్చిన తహసీల్దార్ సంతకంఫోర్జరీ కేసు ● ఆరుగురు నిందితుల అరెస్టు ● నిందితుల్లో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది.. నలుగురు పరారీ చిత్తూరు అర్బన్ : తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా ఎట్టకేలకు కటకటాలపాయ్యింది. చిత్తూరు తహసీల్దా ర్ కార్యాలయంలో వీఆర్ఏలుగా చలామణి అవుతున్న పెరుమాల్ మోహన్(45), ఎం.రాజశేఖర్(32), ఫైనా న్స్ కంపెనీలో పనిచేస్తున్న జి.గౌతం(24), కె.జాన్సి (28), డాక్యుమెంట్ రైటర్ కె.గజేంద్ర కుమార్(52) అనే అయిదుగురు నిందితులను బుధవారం తాలూక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి తహసీల్దార్, తహసీల్దార్ కార్యాలయ రాజముద్రలు, ఓ గ్రీన్ ఇంకు పెన్నును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా కొందరు నకిలీ అధికారులు పలు రాజముద్రలు కలిగిన సీళ్లను ఉంచుకుని, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ‘ఆగని ఫోర్జరీ దందా’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీంతో అప్పటి తహసీల్దార్ కళావతి తన సంతకాలు ఫోర్జరీ అయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు కేసును ముందుకు వెళ్లనీయకుండా మిన్నకుండిపోయారు. అయితే దీనిపై ఎస్పీ మణికంఠ సీరియస్గా తీసుకుని, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని తాలూక ఎస్ఐ మల్లికార్జునను ఆదేశించారు. అనంతరం కేసు దర్యాప్తు పట్టాలెక్కింది. తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీచేసి, తిమ్మసముద్రం గ్రామంలోని భూమికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ పత్రం ద్వారా ఓ ప్రైవేటు ఫైనాన్స్లో భారీగా రుణం తీసుకోవాలన్నది నిందితుల పథకం. వచ్చే రుణంలో 20 శాతం తమకు ఇవ్వాలని జాన్సి, గౌతం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో, ఇవి తప్పుడు ధ్రువీకరణ పత్రంగా సబ్–రిజిస్ట్రార్ గుర్తించారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలుగా చెలామణి అవుతున్న ఇద్దరితో పాటు ఓ డాక్యుమెంట్ రైటర్, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో నలుగురు పరారీలో ఉన్నారు. వాళ్లను సైతం త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్ఏల సస్పెన్షన్ గతంలో పనిచేసిన తహసీల్దార్ కళావతి సంతకం పోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్ఏలపై కేసు నమోదైందని, వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వారు తండ్రి పేరుతో పనిచేస్తుంటే వాళ్ల తండ్రులను బాధ్యులు చేస్తూ..విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఇకపై తండ్రి పేర్లతో పనిచేస్తామంటే కుదరదని, అలా ఆరు నెలల వరకే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రజలకు అండగా నిలబడదాం
నగరి : ప్రజలకు అండగా నిలబడి పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ సభ్యులు ఆర్కే రోజా పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయం వద్ద మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీడీ భాస్కర్, మున్సిపల్ పార్టీ ఉపాధ్యక్షుడు మునివేలు, ఏవీ పీతాంబరం, ప్రధాన కార్యదర్శులు శశికుమార్, తనికాచలం, నూర్ మహ్మద్, కార్యదర్శులు లోకనాథం, మేషాక్, ధనపాల్, చంద్రన్, షణ్ముగం, నాయకులు అయ్యప్ప, ఎల్లప్పరెడ్డి, మురుగ, ఆనంద్కుమార్, హమీద్, కన్నాయిరం, చంద్రబాబు, ఉమాపతి పాల్గొన్నారు. ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ పొడిగింపు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఈనెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ జరిగిందన్నారు. మిగిలిన కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. -
● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో రూ.కోటి దాటిన జరిమానాలు ● జిల్లాలో ఏడాదిన్నర కాలంలో 1540 మందిపై కేసులు ● పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువతే ● ప్రజల ఆలోచనలు మారితేనే రోడ్డు ప్రమాదాల నివారణ ● మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు
చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు చూపించిన చుక్కల విలువ ప్రస్తుతం రూ.కోటి దాటింది. అవును.. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు న్యాయస్థానం విధించిన జరిమానా రూ.కోటి దాటడం ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. సిఫార్సులు పట్టించుకోకుండా చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు కొన్నాళ్లుగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తాగి రోడ్డుపైన వాహనం నడపకూడదు. పట్టుబడిన వ్యక్తి తమవాడేనని ఎవరు చెప్పినా వినకూడదని గట్టిగా అనుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని రోడ్డుపైనే ఏడాదిన్నరగా అమలు చేశారు. మద్యం తాగి స్కూటర్ నడపడం, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఇలా ఏ వాహనం నడిపినా మందుబాబులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేయడం.. తాగినట్లు తేలితే వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేయడం చేస్తున్నారు. ఆపై వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. ఇలా ఏడాదిన్నర కాలంలో ఏకంగా 1540 మందిపై చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వీళ్లను న్యాయస్థానంలో హాజరు పరచగా.. తొలుత రూ.2 వేలు ఉన్న జరిమానా ఇటీవల మోటారు వాహన యాక్టును సవరణ చేయడంతో రూ.10 వేలకు చేరింది. ఫలితంగా మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడ్డ వాళ్లకు ఒక్కొక్కరికీ న్యాయస్థానం రూ.10 వేలు చొప్పున జరిమానాలు విధిస్తూ వస్తోంది. తాగి బండి నడిపిన వారి తాట తీస్తున్నారు జిల్లా పోలీసులు.. ఇలా పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిన్నర కాలంలో జరిమానాలు ఏకంగా రూ. కోటి దాటాయంటే ఎంత విచ్ఛలవిడిగా తిరుగుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం జరిమానాలు రెట్టింపు చేసినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు వస్తేగానీ వీటిని కట్టడి చేయడం అంత సులువు కాదు. జైలు శిక్షలు కూడా.. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహన చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి కోర్టు రూ.10 వేల జరిమానా విధిస్తోంది. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా.. మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చిత్తూరులో ఇప్పటి వరకు 1540 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రుజువు కావడం ఏకంగా రూ.1,03,62,000 జరిమానాలు విధించారు. వీళ్లల్లో 32 మందికి ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు జైలు శిక్షలు కూడా విధించారు. జరిమానాలు, జైలుశిక్షల విషయం పక్కన పెడితే.. రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధానం కారణం. వాహన చోదకుల్లో మార్పు వస్తే తప్ప ఈ తరహా కేసుల నమోదుకు విరామం లభించదు. మార్పు కోసమే.. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లను కోర్టు ముందు ఉంచాలని, జరిమానా విధించాలని, జైలుకు పంపించాలన్నది మా లక్ష్యం కాదు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ విషయంలో గట్టిగా పనిచేస్తున్నాం. రోజుకు సగటున ఆరు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. పట్టుబడుతున్న వారిలో 22–45 ఏళ్ల మధ్య వాళ్లే ఉక్కువగా ఉంటున్నారు. కొన్నిసార్లు మైనర్లు పట్టుబడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించాలి. – నిత్యబాబు, సీఐ, చిత్తూరు ట్రాఫిక్ -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, డయల్–112 పనితీరు విభాగం, ఫిర్యాదులపై ఎంత సమయంలో స్పందిస్తున్నారనే విషయాలను ఆయన తనిఖీ చేశారు. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం వినియోగిస్తున్న ‘శక్తి’ యాప్లో ఫిర్యాదు వస్తే ఎలా స్పందిస్తున్నారు..? నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఏర్పాటు చేసిన కెమెరాల పర్యవేక్షణ..? పై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట కమాండ్ కంట్రోల్ ఎస్ఐ సహదేవి, కమ్యూనికేషన్ ఎస్ఐ భరత్ ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్జీల బదిలీ చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. చిత్తూరు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎస్పిడి.వెన్నెలను గుంటూరు జిల్లా రేపల్లెకు, ఈమె స్థానంలో పీలేరులో పనిచేస్తున్న కె.రవిను చిత్తూరుకు బదిలీ చేశారు. మదనపల్లె ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును అనంతపురం జిల్లా హిందూపురానికి , ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరంలో పనిచేస్తున్న కె.జయలక్ష్మిను నియ మిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జలజీవన్ పనులను పరిశీలించిన కేంద్ర బృందం కార్వేటినగరం : కార్వేటినగరం మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కార్వేటినగరం దళితవాడలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నీటిని పరిశీలించారు. జలజీవన్ మిషన్ కేంద్ర నిపుణులు అన్బ్జగన్ మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఈఈ నరేంద్రకుమార్, డీఈ సతీష్ కుమార్, ఏఈ గిరిష్ కుమార్, సర్పంచ్ ధనంజయవర్మ, కార్యదర్శి నా గరత్నమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
● వక్ఫ్బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయపోరాటంపై హర్షం ● వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
చిత్తూరు కార్పొరేషన్ : వక్ఫ్బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ మైనార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంతోషకరమని ముస్లింలు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ‘షుక్రియ జగన్ భయ్యా’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. మైనార్టీ నాయకులు చాంద్బాషా, నౌషద్, నవాజ్, అల్తాఫ్, చాపు, చామంతి, ఇమ్రాన్, అక్రం, ఖాదర్, షరీఫ్, సాదిక్, జలాలుద్దీన్, హుస్సేన్, అఫ్జల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ●అణగదొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణగదొక్కాలని చూస్తోంది. ఎప్పుడు మా విషయంలో వారు వ్యతిరేకంగానే ఉంటున్నారు. అప్పట్లో ఎన్ఆర్సీ అంటూ వేధింపులకు గురిచేశారు. దేశంలోని 9.40 లక్షల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది. టీడీపీ వారికి మద్దతు పలకడం అన్యాయం. – మహ్మద్షఫీ, న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు ఆస్తులపై కన్నేశారు పూర్వీకులు దానం చేసిన భూములపై కేంద్రం తమ అధీనంలో తీసుకోవాలని చూడటం నేరం. ముస్లింలు అంటే బీజేపీకు నచ్చదు. కానీ వారి ఆస్తులపై కన్నేశారు. వక్ఫ్ బిల్లు సవరణకు టీడీపీ మద్దతు పలకడం ప్రజలను వంచించడమే.. బిల్లుకు టీడీపీ మద్దతు తెలుపకపోతే బాగుంటుందని ఆ పార్టీలోని ముస్లింలు ఆశించారు. – ఆను, కోఆప్షన్ సభ్యుడు ముస్లింలకు అండగా వైఎస్సార్సీపీ మొదటి నుంచి మైనార్టీల పక్షపాతిగా వైఎస్సార్సీపీ నిలుస్తోంది. జగనన్న మాకు మద్దతుగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడం గొప్ప విషయం. వైఎస్సార్ పాలనలో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేశారు. దాంతో ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు సాధించారు. ఆయన వారసుడిగా జగనన్న నిలుస్తూ అండగా ఉంటున్నారు. – మస్తాన్ఖాన్, నియోజక వర్గ అధ్యక్షుడు, మైనార్టీ విభాగం వైఎస్సార్సీపీ రాజ్యాంగ విరుద్ధం కూటమి పాలనలో ముస్లిం అంటే విలువ లేకుండా పో యింది. వక్ఫ్ బిల్లు సవరణ పై సీఎం, డిప్యూటీ సీఎంలు బీజేపీతో వ్యతిరేకించలేదు. మసీదు, దర్గా, మదరాస, సందర్శించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా..? అదే విధంగా మరణిస్తే శ్మశానంలో పూడ్చటానికి వారి అంగీకారం కావాలా. వీటిని అందరూ వ్యతిరేకించాలి. – కౌసర్, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్బిల్లు చట్ట సవరణను అడ్డగోలుగా చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు అండగా నిలిచేందుకు నడుంబిగించారు. ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. ముస్లింల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఏక పక్షంగా సవరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విన్నవించింది. రాజ్యాంగాన్ని మార్పు చేయడం ముస్లింల హక్కులను కాలరాయడమే నినదించింది. వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులు కేంద్రం చేతుల్లోకి వెళ్లేందుకే చట్ట సవరణ చేశారని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న వక్ఫ్ ఆస్తులను లెక్కకట్టేందుకే అని చెప్పి ముస్లిం మనోభావాలను కేంద్రం దెబ్బతిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జిల్లాలోని ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. -
స్వర్ణరథంపై వరసిద్ధుడి అభయం
● ఘనంగా సంకటహర చతుర్థి పూజలు కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మాడ వీధుల్లో ఊరేగింపు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధులలో స్వర్ణ రథంపై విహరించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణ రథం ఆలయ మాడ వీధులలో అభయమిస్తూ ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
అంబేడ్కర్ జయంతిలో దళితులకు అవమానం
పూతలపట్టు (కాణిపాకం) : పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు సొంత పార్టీ దళిత నేతలకే ఆహ్వానం దక్కలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, నేషనల్ దళిత ఫోరం అధ్యక్షుడు ఆనగల్లు మునిరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు మండల కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్లుగా పార్టీలకతీతంగా అంబేడ్కర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జయంతి ఉత్సవాలకు ఏకపక్ష ధోరణితో రాజకీయం చేయడం తగదన్నారు. అధికారుల ద్వారా ప్రలోభాలు పెట్టి డ్వాక్రా మహిళలతోనే జయంతి ఉత్సవాలను చప్పగా ముగించడం కరెక్టు కాదని విరుచుకుపడ్డారు. ఏటా అన్ని పార్టీల కలయికతో జరిగే ఉత్సవాలకు ఈసారి పార్టీ రంగు వేశారని, ఇలా చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 18న విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర తెలిపారు. స్థానిక గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోని వినియోగదారులు సమస్యలు తెలపవచ్చన్నారు. సమస్యలను వినతి రూపంలో ఇవ్వాలని వివరించారు. చూడ కార్యదర్శి బదిలీ చిత్తూరు అర్బన్ : చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చూడ )కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్. రమేష్ బాబును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ బాబును కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు. -
అమ్మో..ఐస్
● చల్లని పానీయాలు.. ఐస్గడ్డ విక్రయాలు ● తయారీలో కానరాని శుభ్రత ● వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ● హెచ్చరికలు జారీ చేస్తున్న వైద్యనిపుణులు కాణిపాకం : జిల్లాలో జ్యూస్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీధికి రెండు నుంచి మూడు షాపులుంటాయి. వేసవి కాలం వస్తే రోడంతా చల్లటి జ్యూస్ షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇంటి నుంచి బయటకొచ్చిన వారిలో 40 శాతం మంది వీటిని గబగబా తాగేస్తుంటారు. వీరంతా చల్లటి ఐస్ వేస్తే తప్ప ఆ జ్యూస్ ముట్టుకోవడం లేదు. ఇక వేసవి సీజన్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ ఈ చల్లటి ఐస్ ముక్కలు వేసి కలిపిన జ్యూస్లు విచ్చలవిడిగా ఇస్తుంటారు. ఈ ఐస్ గడ్డలు తయారు చేసే కేంద్రాలు చాలా చోట్ల అధ్వాన్నంగా కలుషిత నీటితో తయారీ చేస్తుంటారని, రోగాలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఐస్ గడ్డ తయారీ కేంద్రాలు 40 దాకా ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రోజువారిగా సుమారు 500 కిలోలు అమ్ముడుపోతాయని అంచనా. ఈ లెక్కన జిల్లాలో 20 వేల కిలోల ఐస్ గడ్డలు అమ్ముడుపోతుంటాయి. దీనికి తోడు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు తమిళనాడు నుంచి ఐస్ గడ్డలు విపరీతంగా సరఫరా అవుతున్నాయి. ఇలా ఐస్ గడ్డల విక్రయాల ద్వారా జిల్లాలో రూ. 8 లక్షలకు పైగా వ్యాపారం నడుస్తున్నట్లు వారు లెక్కలు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఐస్ గడ్డల తయారీ సీజనల్ వ్యాపారమే అయినా తక్కువ పెట్టుబడి .. అధిక లాభాలున్నాయి. అయితే ఐస్ తయారీ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. పరిశ్రమల శాఖ, ట్రేడ్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ బోర్డు, విద్యుత్ శాఖ ద్వారా వాణిజ్య విద్యుత్తు కనెక్షన్, భవనానికి సంబంధించి పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులుండాలి. చాలా చోట్ల ఈ రకమైన అనుమతులు లేవు. చాలా వరకు ఇళ్ల మధ్య, రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. అపరిశుభ్రమైన ఐస్ వాడకంతో.. అపరిశుభమైన ఐస్ వాడటం వల్ల అనారోగ్య సమస్యలు ముంచెత్తుతున్నాయి. విష జ్వరాలు, టైపాయిడ్, దగ్గు దడ పుట్టిస్తున్నాయి. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు బాధేస్తున్నాయి. చిన్న పిల్లలకు గవద బిళ్లలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోటా, అడినో, హైపటైటిస్–ఏ వంటి వైరస్ల వల్ల ఊపిరితిత్తులు, పచ్చకామెర్లు వస్తుంటాయి. ఈ–కోలీ, సిగెల్లా వంటి వైరస్ల వల్ల వాంతులు, విరేచనాలు అవుతుంటాయని ప్రజలు జాగ్రత్త పడాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి ఎండలో తిరిగాం.. చల్లటి జ్యూస్ తాగుదామని అనుకుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ శుభ్రతను పరీక్షించుకోవాలి. చల్లగా ఉందని గటగటా తాగితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాంతులు, విరేచనాలవుతాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఎండా కాలంలో కచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి జ్యూస్లకు బదులు తాజా పండ్లు, అధిక నీటిని తీసుకుంటే చాలు. సబ్జా గింజలు రోజుకు 15 గ్రాములు నానబెట్టి తీసుకుంటే శరీరం వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. – నందీశ్వర్, వైద్య నిపుణులు, చిత్తూరు -
నేడు జిల్లాకు అసెంబ్లీ పద్దుల కమిటీ రాక
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు 11 మంది సభ్యులు మంగళవారం చిత్తూరుకు వస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారన్నారు. ఈ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ , బండారు సత్యానంద రావు, జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకట రాజు, పార్థసారథి వాల్మీకి, పాసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివ రావు, ఎంఎల్సీలు పర్చూరి అశోక్ బాబు, డా.వెంకట సూర్య నారాయణ రాజు, కళ్యాణి విచ్చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి చిత్తూరు కలెక్టరేట్ : నిర్భంధ వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిర్బంధ వెట్టిచాకిరీ బారిన పడుతున్న కూలీలకు విముక్తి కలిగేంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిర్బంధ వెట్టిచాకిరీ విధానం పౌల్ట్రీ, పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతుంటాయన్నారు. వెట్టిచాకిరీ వల్ల ఆర్థిక, శ్రమ దోపిడీతో ఇబ్బందులకు లోనవుతుంటారని తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించేందుకు ఆర్డీవో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్మిక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, జెడ్పీ సీఈవో, తదితర అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. నిర్భంధ కూలీలకు పునరావాసం కల్పించిన అనంతరం సంక్షేమ పథకాలతో ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై ముద్రించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు.సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తెలపండిభూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ భూసమస్యలపై వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పేర్కొన్నారు.బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పది నెలలుగా అన్నీ అపచారాలే.. ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. తిరుమలలో మద్యం మత్తులో వీరంగం చేస్తున్న యువకుడు(ఫైల్)అపచారాలకు అడ్డుకట్ట వేయలేరా? కొన్ని నెలలుగా తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు టీటీడీ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మద్యం, మాంసం, బహిరంగంగా దొరకడం అపచారం. తిరుమలలో అకతాయితీలు మద్యం సేవించి గొడవలు పడిన సంఘటన బాధించే అంశం. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వస్తున్న వార్తలు గో ప్రేమికులు, శ్రీవారి భక్తులను మరింత క్షోభకు గురిచేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలి. లోపాలను ఎత్తి చూపడం భక్తుల బాధ్యతగా అధికారులు గుర్తించాలి. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమతి అధ్యక్షులు, తిరుపతి వివరణ కాదు.. విచారణ జరపాలి టీటీడీ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా గోశాల లో గోవులు అధిక సంఖ్య లో మరణించాయని వస్తు న్న ఆరోపణలపై టీటీడీ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇవ్వడం దారుణం. వాటి పై వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ చేప ట్టి నిజాలను నిగ్గు తేల్చాలి. మూగజీవులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం, అనారోగ్యానికి గురికావడం భక్తుల, జంతు ప్రేమికుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తక్షణం అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలన జరపాలి. నిర్లక్ష్యం కారణమైతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి గొంతు నొక్కడం భావ్యమా? టీటీడీలో ప్రతినిత్యం ఏ దో ఒక అపచారం జరగ డం బాధించే అంశం. అధికారులు బేషాజాలకు పోకుండా భక్తుల మనోభావాలను కాపాడాలి. నిషేధి త వస్తువులను తిరుమలకు చేరకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగితే లోపాలను ఎత్తి చూపడం భక్తుల హక్కు, కర్తవ్యం కూడా. అలాంటి లోపాలు జరిగినప్పుడు వెంటనే అధికారులు వాటిని సరిదిద్దేందుకు సిద్ధపడాలే తప్ప, గొంతు నొక్కడం, కేసులు బనాయించడం విచారకరం. – నరసింహులు, స్థానిక భక్తుడు, తిరుపతికలియుగ వైకుంఠం.. పరమ పవిత్రం..ఆధ్యాత్మిక నిలయం..భక్తులకు అది అపురూపం.. అంతటి తిరుమల క్షేత్రం నేడు అపవిత్రం.. మద్యం, మాంసం, పాదరక్షలతో ఆలయ ప్రవేశ యత్నం.. గోశాలలో గో మరణ మృదంగం.. శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం ఒకటేమిటీ వరుస సంఘటనలు చోటు చేసుకోవడం మహా అపచారం.. వెరసి భక్తుల దెబ్బతిన్న మనోభావం.. ప్రశ్నించిన గొంతు నొక్కే ప్రయత్నం.. ఎదురుదాడి.. తమ పాపం ఎదుటి వారిపై నెట్టే ప్రచారం జరుగుతోంది. ఏడుకొండలపై అసలేం జరుగుతోంది.. ఏమై పోతోంది.. అంతా సత్యం వధ.. ధర్మం చెరేనా? అని భక్తులు మదనపడుతున్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ● లోపాలను ఎత్తి చూపితే.. పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే ● భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి ● ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం దారుణం ● తిరుమలలో అపచారాల కట్టడికి చర్యలు తీసుకోలేరా? ● 10 నెలలుగా సాక్షాత్తు తిరుమలలో జరిగిన ఘటనలకు బాధ్యులెవరు? ● ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం అపచారాలను అడ్డుకోవాలి ● టీటీడీ అధికారులకు స్థానికులు, భక్తులు, మేధావుల హితవు తిరుపతి సిటీ: కలియుగ వైకుంఠంలో గత పది నెలలుగా సత్యం వధ.. ధర్మం చెరగా పాలన సాగుతోంది. దీన్ని ప్రశ్నించే గొంతుకలపై ఎదురుదాడి జరుగుతోంది. ఆధ్యాత్మిక సంస్థలో జరిగే లోటుపాట్లు సున్నిత పరిష్కారానికి చర్యలు లేకపోగా.. టీటీడీలో పచ్చపాలకులు, ఏజెంట్లు, అల్లరి మూకలు చేస్తున్న తప్పిదాలను రాజకీయకోణంలో చూపుతూ ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే అసలు తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఏమి జరుగుతోంది.. అసలు తిరుమల.. ఆధ్యాత్మిక క్షేత్రమా.. పచ్చ పాపాలకు వ్యాపార నిలయమా?.. అని భక్తులు మనోవేదనకు గురికావాల్సిన దుస్థితి నెలకొంటోంది. రాజకీయ ఏజెంట్లుగా అధికారులు టీటీడీలో జరుగుతున్న అపచారాలను కప్పిపుచ్చేందుకు పచ్చనేతలు ఆ ధార్మిక సంస్థలో అధికారులనే రాజకీయ ఏజెంట్లుగా మార్చుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపితే.. వాటిని పక్కదారి పట్టించేందుకు సాక్షాత్తు కార్యనిర్వాహణాధికారి స్థాయి అధికారులే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే వారు చేసిన నేరాలు ప్రశ్నించే వారిపై నెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ వారికి అనుకూల మీడియాల్లో ప్రచారం చేస్తూ టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. గంగవరం : విద్యార్థుల నుంచి గత ప్రభు త్వం ఉచితంగా అందజేసిన ట్యాబ్స్ను ఇన్చార్జ్ హెచ్ఎం స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం.. గత ప్రభుత్వంలో కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు, అనుమతి లేకుండా స్థానిక ఇన్చార్జి హెచ్ఎం నరసింహయ్య విద్యార్థుల ట్యాబ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సెకండ్ హ్యాండ్ ధరలకు విక్రయాలు చేసుకోవడం కోసమేనా అంటూ ఆ ఇన్చార్జి హెచ్ఎంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనిపై ఎంఈవో–1 వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల నుంచి ట్యాబ్స్ లాక్కోవాలన్న ప్రభుత్వ ఆంక్షలు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ కల్లుపల్లి హైస్కూల్లో విద్యార్థుల నుంచి ట్యాబ్స్ వాస్తవంగా తీసుకున్నట్లు తెలిస్తే ఆ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతికి విడుదల చేసిన జాబితాలో అభ్యంతరాలు తెలపాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లా డారు. ఈనెల 13వ తేదీన సీనియారిటీ జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఏకీకృత సీనియారిటీ జాబితాను రూపొందించి www.chittoor deo.com వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. అన్ని మేనేజ్మెంట్ల టీచర్ల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. జిల్లాలోని టీచర్లు జాబితాల్లో సర్వీస్, సీనియారిటీ వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే బుధవారం డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఆధారాలతో తెలియజేయాలని ఆదేశించారు. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించమని డీఈవో స్పష్టం చేశారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేనా? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు అపకీర్తి తీసుకువచ్చే చ ర్యలను అధికారులు అడ్డుకో వాలి. మందు, మాంసం, డ్రోన్ కెమెరాల హల్చల్, అ కతాయితీల వికృత చేష్టలను ప్రశ్నించే హక్కు ప్రతి భక్తునికీ ఉంటుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అప చారం జరిగిన ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి పున రావృతం కాకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలి. గోవుల మృతి వార్తలు భకులు, జంతు ప్రేమికులను బాధించాయి. –మహాలక్ష్మి, శ్రీవారి భక్తురాలు, శ్రీకాళహస్తి అధికారుల అప్రమత్తత అవసరం టీటీడీలో తరచూ జరుగుతు న్న ఘటనలు భక్తులను బా ధిస్తున్నాయి. శ్రీవారి సన్నిధి లో ఇలాంటి అపచారాలు జరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. డ్రోన్ కెమెరాలతో ఫొటోషూట్ చేయడం ఎంత అపచారం. డ్రోన్ కెమెరాను ఎలా అనుమతించారో? అధికారులే సమాధానం చెప్పాలి. తిరుమలలో అభద్రతాభావం నెలకొంటే ప్రమాదమే. అధికారులు మేలుకోవాలి. –సెల్వకుమార్, తమిళ భక్తుడు, వేలూరు -
వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా వెళ్లిపోండి
● టీడీపీతో కలిసి వస్తే న్యాయం చేస్తామన్న తహసీల్దార్ ● దళిత గ్రామం సాకుతో క్వారీకి పట్టా భూమిలో రోడ్డు వేసిన కూటమి నేతలు ● మాజీ డిప్యూటీ సీఎం వద్ద గోడు వెళ్లబోసుకున్న బాధితులు పెనుమూరు (కార్వేటినగరం) : మీరు వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా బయటకు వెళ్లిపోండి.. కూట మి నాయకులతో కలిసి వస్తారా.. లోపలకి రండి అంటూ ఓ తహసీ ల్దారు పచ్చనేతలకు బానిసై, ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పెనుమూరు మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి నాయుడు, దాము కలిసి మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వద్ద కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వివరించారు. స్పందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. సర్వే నం.381/1, 384/ సీ/1లో హేమాద్రినాయుడు, దాముకు చె ందిన భూమిలో దళితవాడకు దారి పేరు తో టీడీపీ నాయకుల క్వారీ కోసం పట్టా భూమిలో దౌర్జన్యంతో అగ్రకులస్తులు కర్రలు, రాడ్లు పట్టుకొని దళితులను భ యబ్రాంతులకు గురిచేసి రోడ్డు వేయడం అన్యాయమన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రజలను హేళనగా మాట్లాడడం మంచిది కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వనరుల విధ్వంసమే రెడ్ బుక్ లక్ష్యం గంగాధరనెల్లూరు : వైసీపీ వాళ్ల ఆర్థిక వనరుల విధ్వంసమే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ లక్ష్య మని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా మండిపడ్డారు. గంగాధర్ నెల్లూరు మండలం, కుప్పనపల్లి గ్రామంలో రైతు శంకర్రెడ్డి పొలంలో కూటమి నాయకులు దౌర్జన్యంగా పచ్చని మామిడి చెట్లను నరికి వేసిన ఘటనలో రైతును పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైసీపీ వాళ్లపై దౌర్జ న్యాలు, ఆర్థిక వనరుల నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకు లు బండి హేమసుందర్రెడ్డి, వెంకటరెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు చెందురాజు, కమాలర్రెడ్డి, హరి రెడ్డి పాల్గొన్నారు. -
భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
పాలసముద్రం : మండల పరిధిలోని రైతుల భూసమస్యలపై వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కులశేఖర్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఆర్ఓలతో రీసర్వే, రెవెన్యూ సదస్సులు రైతుల వద్ద నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. శ్రీకావేరిరాజుపురం వీఆర్ఓ తంగరాజ్ రెవెన్యూ సదస్సు, రీ సర్వేలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించారని అడిగితే సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆయనపై మండిపడ్డారు. నోస్నల్ ఖాతాల్లో పడిన సర్వే నంబర్లను రైతుల వద్ద నుంచి పత్రాలు తీసుకుని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్ఆర్ దేవి, వీఆర్ఓ శ్రీనివాసులు, రమణయ్య, రమేష్ పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పుత్తూరు : మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామ సచి వాలయ వద్ద జా తీయ రహదారి పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ నడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. మృతుడి వయస్సు (60) ఉంటుందని, తెలుగు రంగు షర్ట్, పంచ ధరించి ఉన్నాడని తెలిపారు. కడుపు కుడి, ఎడమల వైపు నల్లటి పుట్టు మచ్చ లు ఉన్నాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు పుంగనూరు : వివిధ ప్రాంతాలలో సారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఎకై ్సజ్ సీఐ సురేష్ తెలిపారు. మండలంలోని పెద్దతండా సమీపంలో సారా విక్రయిస్తున్న పద్మను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నా రు. అలాగే పట్రపల్లె సమీపంలో సారా విక్రయిస్తున్న రమణా నాయక్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే గ్రామానికి చెందిన తిప్పానాయక్ ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామన్నారు. అ లాగే సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న వెంకట రమణారెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈ దాడుల్లో చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జవహర్బాబు, ఇన్స్పెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎస్.వేణుగోపాల్రెడ్డి, సిబ్బంది ఢిల్లీబాబు, సుబ్రమణ్యంగౌడు, నాగరాజు, సురేంద్రబాబు, వినోద్, శ్వేత, మమత, నరేంద్రరెడ్డి, దశరథ, రాజేశ్వరి పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ
చిత్తూరు కలెక్టరేట్ : అగ్నిమాపక ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మాక్డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎండలు పెరిగాయని, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, లీడింగ్ ఫైర్మెన్ ఏసుపాదం, సురేష్ పాల్గొన్నారు. -
● వినియోగదారుల్లో కానరాని ఆదరణ ● కనిపించని విద్యుత్ శాఖ ప్రచారం ● విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు రాయితీ
చిత్తూరు కార్పొరేషన్ : మారుతున్న కాలానుగుణంగా విద్యుత్ పరికరాల వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో అవగాహన లేక వినియోగదా రులపై భారం పడుతోంది. గతంలో వారు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న రోజున లోడుకు నేడు విని యోగిస్తున్న లోడుకు సంబంధం లేదు. దీంతో అధికారులు తనిఖీ చేసిన సమయంలో క్రమబద్ధీ కరణకు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్శాఖ అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వినియోగదారులకు ధరలో 50 శాతం రాయితీ ఇస్తోంది. కిలోవాట్కు రూ.2250 బదులు రూ.1,250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. గృహ వినియోగదారులకు ఇంత మొత్తంలో రాయితీ కల్పిస్తున్నా తగినంత ప్రచారం లేదు. అధికారులు పత్రికా ప్రకటనలు కాకుండా సెక్షన్, సబ్ డివిజన్ల వారీగా వీటిపై అవగాహన కల్పించాలి. ఏఈ, డీఈ, ఈఈ, ఈఆర్వో కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లులు ఇచ్చేటప్పుడు వినియోగదారులకు వీటిపై అవగాహన కోసం కరపత్రాలను ఇవ్వాలి. జిల్లాలో మొత్తం 4,37,377 గృహ సర్వీసులు ఉన్నాయి. స్వచ్ఛందలోడ్ కాబట్టి ఎంత మందికి ఇది అవసరమో గణాంకాలు అధికారుల వద్ద లేవు. ఇప్పటి వరకు జిల్లాలో 1,893 మంది క్రమబద్ధీకరణ చేసుకోగా వాటి ద్వారా సంస్థకు రూ.20 లక్షలు వచ్చింది. ఎక్కడ చేసుకోవాలి మీ కరెంటు బిల్లు తీసుకుని బిల్లు వసూలు కేంద్రానికి వెళ్లాలి. లోడ్ రెగ్యులైజేషన్, 50 శాతం రాయితీ అని చెబితే సరిపోతుంది. ఒక కిలోవాట్కు రూ.1000 ఇతర రుసుములు రూ.250 కలిపి రూ.1250 కట్టించుకుంటారు. అదే రెండు కిలోవాట్లు అయితే రూ.2450, 3 కిలోవాట్లు అయితే రూ.3,650 చెల్లించాలి. అదే ఆన్లైన్లో చెల్లించాలి అంటే ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్లాలి. అందులో వాలంటరీ అడిషనల్ లోడ్ స్కీము 50 శాతం రాయితీ డెవలప్మెంట్ చార్జీస్ అనే వాటిని క్లిక్ చేయాలి. అందులో విద్యుత్ సర్వీసు నంబర్ ఇచ్చి డిటెయిల్స్లోకి వెళ్లాలి. అందులో విత్ అవుట్ ఎస్టిమేట్ నమోదు చేసి మొబైల్ నంబరును కొట్టాలి. ఉన్న లోడ్, అడిషనల్ లోడ్ను నమోదు చేయాలి. తర్వాత కరెంటు బిల్లు, ఐడీ ఫ్రూఫ్ను పీడీఎఫ్లో ఆప్లోడ్ చేసి డిమాండ్ను చెల్లించాలి. వచ్చే నెల నుంచి మీ లోడ్ వివరాలు కనిపిస్తాయి. జూన్ వరకు నిరీక్షించొద్దు స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు గడువు చివరి వరకు వేచి ఉండద్దు. జూన్ వరకు సమయం ఉందని పలువురు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతలోపు సిబ్బంది తనిఖీలు చేసి నోటీసులు ఇస్తే రాయితీ రాదు. విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాల వద్ద ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వినియోగదారులు 50 శాతం రాయితీ అవకాశాన్ని వినియోగించుకోండి. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ ట్రాన్స్కో మీ నివాసం లోడ్ ఎంత? చాలా మందికి తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడ్ ఎంతో తెలియదు. సంవత్సరాల కిందట కనెక్షన్లు తీసుకున్న వారు వేల మంది ఉన్నారు. అప్పట్లో ఒక కిలోవాట్ అంత కన్నా తక్కువ కట్టించుకుని కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి నివాసంలో పరికరాలు సంఖ్య పెరిగింది. దీనికి తోడు వేసవిలో ఫ్యాన్, కూలర్, ఏసీలు పెరుగుతున్నాయి. దీంతో లోడ్ పెరిగి ట్రిప్ సమస్యలతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కాంట్రాక్ట్ లోడ్ మీ ఇంటి విద్యుత్ లోడ్ను తెలియజేస్తుంది. విద్యుత్ బిల్లులో ఉన్న ఆ లోడ్ను పరిశీలించి ఇంట్లో వాడుతున్న పరికరాల కెపాసిటీ ఆధారంగా సింపుల్గా లెక్కకట్టి అదనపు లోడ్ ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 10 సంవత్సరాల కిందట 1 కేవీతో సర్వీసు తీసుకున్న వారు ప్రస్తుతం ఏసీ, వాషింగ్ మెషిన్, మోటారు, మిక్సీ ఇలా పరికరాల సంఖ్య పెరిగి ఉంటుంది. 1 టన్ ఏసీకే తీసుకున్న కెపాసిటీ సరిపోతుంది. మిగిలిన వాటికి తక్కువనుకున్నా 2 కేవీ క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంది. వీటికి సిబ్బంది తనిఖీ చేయక ముందే స్వచ్ఛందంగా చెల్లిస్తే రూ.4,450 కాకుండా రూ.2,450 చెల్లిస్తే సరిపోతుంది. నోటీసులు ఇస్తే మొత్తం చెల్లించాలి వాడే విద్యుత్ను బట్టి ఇంట్లో ఉన్న ఉపకరణాలను అంచనా వేయవచ్చు. బిల్లు ఎక్కువగా వస్తుంటే అదనపు లోడ్ వాడుతున్నట్లు గుర్తిస్తారు. ఇలాంటి వారి సర్వీసులను అధికారులు తనిఖీ చేసి అదనంగా ఎంత లోడ్ వాడుతున్నారో నమోదు చేస్తారు. దానికి డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తారు. అధికారులు తనిఖీ చేసి నోటీసులు ఇస్తే కిలోవాట్కు నిర్దేశించిన మొత్తం చెల్లించాలి. అందులో ఎటువంటి రాయితీలు రావు. ఒక ఇంట్లో 4 ట్యూబ్లైట్లు, 3 ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఐరన్బాక్స్ , ఎలక్ట్రికల్ కుక్కర్, టీవీ, కంప్యూటర్ ఉంటే వీటి సామర్థ్యం దాదాపు 6 కిలోవాట్లు. మీ ఇంటి కనెక్షన్ 2 కిలోవాట్లు అయితే అదనంగా 4 కేవీ వాడుకుంటున్నట్లే. ఇలా అదనంగా వాడుకునే దానికి 50 శాతం రాయితీతో రెగ్యులరైజ్ జూన్ 30 లోపు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కుప్పంలోని గుణ రోజువారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఆయన అదనంగా 2 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారని గుర్తించారు. ఆయనకు రూ.4,450 చెల్లించాలని నోటీసు ఇచ్చారు. నగరి పరిధిలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి రమేష్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన విద్యుత్శాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. తీసుకున్న లోడు కంటే వాడే లోడ్ 4 కిలోవాట్లు అదనంగా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. అందుకు గాను రూ.8,850 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. -
పేదింటి ఆణిముత్యాలకు పురస్కారాలు
పలమనేరు : వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబ.. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో 1000/971 మార్కులను సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ప్రభుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై ంది. ఆ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి అవార్డు అందుకుంది. హర్షిత పదో తరగతి దాకా వలసపల్లి నవోదయ పాఠశాలలో చదివింది. హర్షితతో పాటు చెల్లి శ్రావణి సైతం ఇదే కోర్సు చదివింది. మొన్నటి ఫలితాల్లో శ్రావణి 900 పైగా మార్కులను సాధించింది. వీరి తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కేజీబీవీ విద్యార్థినికి మంత్రి అభినందన రొంపిచెర్ల : కేజీబీవీ విద్యార్థిని శ్రావంతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని శ్రావంతి సీఈసీలో 935 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోని కేజీబీవీల్లో మొదటి స్థానంలో నిలి చారు. కర్నూల్ జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమారైలు..వీరిలో పెద్ద కుమారై శ్రావంతి రొంపిచెర్ల కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. రెండో కుమారై దీక్షా 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తిరుపతిలో మేస్త్రి పని చేసుకుని పిల్లలను చదివిస్తున్నారు. కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 26 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు సాధించారు. మంగళవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థిని శ్రావంతికి ల్యాప్ టాప్ను ప్రదానం చేశారు. అలాగే వందశాతం ఫలితాలు సాధించిన కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్ సుజాత, అధ్యాపకులను మంత్రి అభినందించారు. -
ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జీడి నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్రెడ్డికి చెందిన మామిడి తోటను ధ్వంసం చేశారు. టేకు చెట్లను కూడా టీడీపీ నేతలు నరికివేశారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి.. రైతు శంకర్రెడ్డిను పరామర్శించారు.అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని.. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇదేనా చంద్రబాబు ప్రక్షాళన, సంపద సృష్టి అంటూ మాజీ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మామిడి తోట, టేకు చెట్లను నరికివేసి నాలుగు రోజులైంది. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. 1970 పట్టా, పాసు పుస్తకాలు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది. పచ్చని చెట్లు నరికిన కుటుంబాలు బాగు పడింది లేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సమాధానం చెప్పలేదు. పాల సముద్రం మండలంలో ఇసుక, మట్టి, గ్రానైట్ సరిహద్దులో ఉన్న తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చవద్దని బహిరంగ సభలో చెప్పారు.’’ అంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు. -
వరసిద్ధుడి సేవలో సినీ రచయిత
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని సోమవారం తెలుగు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితుల ఆశీర్వచనాలు పలికి, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనుల పరిశీలన చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యే లు గురుజాల జగన్ మోహన్నాయుడు, మురళీమోహన్, నాని పరిశీలించారు. వారు సోమవారం రైల్వేస్టేషన్కు వచ్చి మీడి యాతో మాట్లాడారు. తిరుపతి–కాట్పాడి డ బ్లింగ్లైన్ ఏర్పాటుతో పలు రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమృత్ భారత్ కింద చి త్తూరు రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో కాంట్రాక్టరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, రాజన్, స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, జీఆర్పీ ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. ఉద్యోగం పేరిట మోసం.. కేసు నమోదు చిత్తూరు అర్బన్: ఉద్యోగం పేరిట నగదు మోసం చేసిన ఘటనపై సోమవారం కేసు నమోదు చే సినట్లు తాలూకా ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. చిత్తూరులోని ప్రశాంత్నగర్కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి ఉద్యోగం పేరిట మోసపోయాడు. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని బెంగళూరుకు చెందిన నాగర్జున అనే వ్యక్తి రూ.16.50 లక్షలు తీసుకున్నాడు. తీరా మో సం అని తెలిసి పురుషోత్తం చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నాగర్జునపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వేటకు వెళ్లొద్దు వాకాడు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిసేధించారని, వేటకు ఎవ రూ వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యశాఖ నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘించిన వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎపీ ఎంఆర్ఎఫ్ 1994 సెక్షన్(4)ను అనుసరించి శిక్షార్హులు అవుతారని, అలాగే వా రి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
● పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ● రాజ్యాంగ నిర్మాతను యువత ఆదర్శంగా తీసుకోవాలివెదురుకుప్పం: కనికాపురంలో నేల కొరిగిన వృక్షం అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ శ్రీరంగరాజపురం: అంబేడ్కర్ ఆశయ సాధనకు కట్టుబడి పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ అభినవ అంబేడ్కర్గా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శ్రీరంగరాజుపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. విజయవాడలో దాదాపు 20 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో 250 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడితే, జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆ మహానీయుడి విగ్రహంపై దాడులు చేసిన పట్టించుకోలేదన్నారు. చౌడేపల్లె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం నేటితరం యువత కృషి చేయాలని జెడ్పీ చైర్మ న్ శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అంబేడ్కర్ జ యంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరించారు. ఆయన మాట్లాడుతూ పే ద కుటుంబంలో జన్మించి ఉన్నత చదు వులు చదివి భారత రాజ్యాంగకర్తగా నిలిచా రన్నా రు. ఆయన పేదల అభ్యున్నతికి కృషి చే సిన మహనీయులన్నారు. ఆదర్శంగా తీసు కోవా లని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు దా మోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, ఎంపీటీసీ సభ్యు లు శ్రీరాములు, లక్ష్మీనర్సయ్య, ఎంపీడీఓ లీలామాధవి, సూపరింటెండెంట్ షబ్బీ ర్ అహమ్మద్, ఈఓపీఆర్డీ కృష్ణవేణి పాల్గొన్నారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పుత్తూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం కావాలంటే మళ్లీ జగనన్న సీ ఎం కావాల్సిందేనని మాజీ మంత్రి, వైఎ స్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు ఆర్కే రోజా స్పష్టం చేశారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పుత్తూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మా ట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంబేడ్కర్ స్ఫూర్తితో పరిపాలన సాగించారన్నారు. నేటి కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, వైఎస్సార్సీపీ దళిత నాయకులు లక్ష్మణమూర్తి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్, సుబ్రమణ్యం, శివ, వేలాయుధం, రాంబత్తయ్య, గంగాధరం, రామ్మూర్తి, మస్తాన్, ఉదయ్, బాబు, ప్రభు, బొజ్జయ్య, పార్టీ నాయకులు మాహీన్, ఏకాంబరం, అన్నాలోకనాథం, భాస్కర్యాదవ్, చిరంజీవియాదవ్, మురళీయాదవ్, భాస్కర్యాదవ్, ప్రసాద్, గోపి, మునిరత్నం, చిన్నా, మురళీరెడ్డి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్ది అంబేడ్కర్ రాజ్యాంగం చిత్తూరు కార్పొరేషన్: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్ రాజ్యాంగం మేరకు పాలన సాగించారని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరో బీహార్గా మార్చారని విమర్శించారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావించారని మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి తెలిపారు. జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి రజనీకాంత్, పార్టీ గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, కార్పొరేటర్ లక్ష్మణ స్వామి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, నాయకులు జ్ఞానజగదీష్, సూర్యప్రతాప్రెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, ఆను, మధుసూదన్రాయల్, రాజేంద్ర, త్యాగ, రాబర్ట్, స్టాండ్లీ, ప్రసాద్, గిరిధర్రెడ్డి, ప్రేమ్, అల్తాఫ్, చాన్బాషా, నారాయణ, సాల్మన్, ఇరువారం ప్రేమ్, ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ అంటే చిన్నచూపెందుకు?
● జిల్లాస్థాయి కార్యక్రమానికి హాజరుకాని ప్రజా ప్రతినిధులు ● దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారేమో? ● తూతూమంత్రంగా అధికారిక అంబేడ్కర్ జయంతి ● విమర్శలు గుప్పిస్తున్న దళితులు, సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ : ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అంబేడ్కర్ జయంతి అధికారిక వేడుకలకు కూటమి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరవుతారని ఎదురు చూసిన దళితులు, దళిత సంఘ నాయకులకు నిరాశే మిగిలింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు కూటమి ప్రజాప్రతినిధులిచ్చే గౌరవం ఇదేనా? అంటూ దళితులు, దళిత సంఘ నాయకులు పెదవి విరిచారు. గత ఐదేళ్లపాటు అంబేడ్కర్ జయంతి అధికారిక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించింది. దీనిపై పలువురు పెదవి విరుస్తున్నారు. దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారా? కూటమి అధికారంలోకి వచ్చిన గత పది నెలలుగా దళితుల అభ్యున్నతికి చేసిందేమీ లేదు. దళితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో దళితులు అందజేసిన వినతులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. జిల్లాలోని అన్ని దళితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించని పరిస్థితి. గత ఐదేళ్ల పాటు దళితులకు అందిన సంక్షేమ పథకాలు, కూటమి పాలనలో వారి దరిచేరని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలకు హాజరైతే ఎక్కడ ప్రశ్నిస్తారేమోనని కూటమి ప్రజాప్రనిధులు గైర్హాజరై, ఉంటారని దళితులు, ఆ సంఘ నాయకులు గుసగుసలాడారు. అంబేడ్కర్ అంటే కూటమి ప్రజాప్రతినిధులకు చిన్నచూపెందుకని? దళిత సంఘ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యతోనే గౌరవం సాధ్యం విద్యతోనే సమాజంలో గౌరవం దక్కుతుందని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. దళితులు ఆర్థికంగా అభ్యున్నతి చెందాల న్నారు. సమాజంలో గౌరవం సంపాదించాలంటే విద్య ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలు రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధించి, సమాజంలో గౌర వంగా జీవించాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యా పార, పారిశ్రామికవేత్త ఉండేలా ఎదగాలన్నారు. ఈ వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖాధికారి చిన్నయ్య, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు గోవిందన్, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్బాబు, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, ధనశేఖర్, శంకర్, రవి, దేవరాజులు, మునస్వామి, డేవిడ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గోమాతల మృతిపై పవన్ స్పందించాలి
చిత్తూరు కార్పొరేషన్: సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోమాతల మృతిపై స్పందించాలని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీఆర్ నాయు డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీటీడీ అప్రతిష్టపాలవుతోందని, పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు మృతి బాధాకరమన్నారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిజా లు మాట్లాడితే ఆరోపణలు చేయడం సరికాదన్నా రు. నిజాలను కప్పిపుచ్చాలనుకుంటే దాగవన్నారు. మొదట బీఆర్ నాయుడు పొరబాటు జరిగిందని, తర్వాత అటువంటిది లేదని రెండు నాలుకల ధోరణిలో మాట్లాడడం తగదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు కు అధికార పార్టీ మద్దతు పలికిందని, రాబోయే రోజుల్లో చర్చిలను కూడా కై వసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ అధ్యక్షుడు జ్ఞానజగదీష్, నాయకులు రజనీకాంత్, కృష్ణమూర్తి, జయపాల్, కృష్ణరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజాలు మాట్లాడితే ఆరోపణలు అంటారా..? విజయానందరెడ్డి -
గాలీవాన బీభత్సం
అంబేడ్కరంటే చిన్నచూపెందుకు? అంబేడ్కర్ జయంతి వేడుకలకు కూటమి నేత లు గైర్హాజరుకావడంతో ఆయనంటే చిన్నచూపెందుకన్న విమర్శలొచ్చాయి.మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025చిత్తూరు అర్బన్: పోలీస్.. అర్ధరాత్రి వేళ వీధుల్లో గస్తీ కాస్తూ ప్రజల మానప్రాణాలను కాపాడే రియల్ హీరో. రోడ్లపై దుమ్ము, ధూళిలో నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేసే ఓ సంఘ సేవకుడు. సమాజం కోసం తిండి తిప్పలు లేకుండా 24 గంటల్లో ఏ క్షణమైనా అధికారులు పిలిస్తే ఇట్టే వాలిపోయే ఓ సూపర్ మ్యాన్. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతిరూపాలైన మూడు సింహాల్లో.. కనిపించని నాలుగో సింహమే పోలీస్. అలాంటి నాలుగో సింహం పరిస్థితి ప్రస్తుతం బాలేదు. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. కనీసం వారంలో ఒక్క రోజంటే ఒక్కరోజు.. సెలవు అడిగితే ఇచ్చే దిక్కులేదు. నాటి చరిత్ర ఇదీ.. పోలీసులంటే క్రమశిక్షణకు మారుపేరు. స్టేషన్లో పనిచేసే పైఅధికారి ఏం చెబితే అది చేయాలి. నోరెత్తి ఎందుకు..? అని అడిగితే అంతే సంగతులు. ఇక నెలకు ఓ రోజు సెలవు కావాలని చిట్టీ రాసుకెళితే, అగ్గిమీద గుగ్గిలమై అధికారులు భగ్గుమనే వాళ్లు. అలాంటి పోలీసులశాఖలో గత వైఎస్సార్ సీపీ సర్కారు ‘వీక్ఆఫ్’ (వారాంతపు సెలవు) తీసుకొచ్చి, ఖాకీల పాలిట అండగా నిలిచింది. పోలీసుల సాధకబాధలను ఆలకించి తీసుకున్న వీక్ ఆఫ్ నిర్ణయం ఆ శాఖలో ఓ సరికొత్త సంచలనం నమోదు చేసింది. అసలు పోలీసులకూ ఓ కుటుంబం ఉందని, వారితో వారంలో ఒక్కరోజైనా గడపాలని వారాంతపు సెలవులను తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. పని ఒత్తిడి కారణంగా ఏ ఒక్కరినీ బలి కోరకూడదని భావించి, ఎందరో పోలీసుల పని ఒత్తిడిని అర్థం చేసుకుని, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వీక్లీ–ఆఫ్ సంస్కరణ జిల్లాలోని కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతిఒక్క పోలీసు అధికారి ఉపయోగించుకున్నవారే. ఆ చరిత్ర నేడు కనుమరుగు.. ప్రస్తుతం జిల్లా పోలీసుశాఖలో వీక్ ఆఫ్ పేరును ఖాకీలు దాదాపు మరిచిపోయారు. నిత్యం పనిలో ఒడిదుడుకులు, అధికారుల అరుపులు, క్షణం తీరిక లేని పరుగులతో సగటు పోలీసన్న బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో కుటుంబంతో కలిసి వారంలో ఓ రోజు గడిపే పరిస్థితి కనుమరుగైంది. ఇటీవల జిల్లాలో జరిగిన పోలీసు సిబ్బంది బదిలీల్లో చిత్తూరు నుంచి రొంపిచెర్ల, సదుం, పుంగనూరు, సోమల లాంటి పోలీసుస్టేషన్లకు పదుల సంఖ్యలో సిబ్బంది బదిలీ అయ్యారు. భార్యాబిడ్డలు చిత్తూరులో.. కుటుంబ పెద్ద పుంగనూరు నియోజకవర్గంలో విధులు. వారంలో ఓ రోజు భార్య, బిడ్డల్ని చూద్దామని సెలవు అడిగితే, ఆ మాటను వినిపించుకునే నాథుడే లేరు. సెలవుపై డీఎఫ్ఓ చిత్తూరు కార్పొరేషన్: డీఎఫ్ఓ భరణి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆమె ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పా టు సెలవు పెట్టారు. అంత వరకు ఇన్చార్జిగా తిరుపతి డీఎఫ్ఓ వివేక్కు బాధ్యతలు అప్పగిస్తూ సీసీఎఫ్ యశోదబాయి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ జీఈఏ ఐక్యవేదిక కోచైర్మన్గా బాలాజీ చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ కా ర్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ ఐక్యవేదిక) కోచైర్మన్గా శవన్న గారి బాలాజీ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. ఈయన ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13 న విజయవాడలోని విద్యాధరపురంలో ఏపీ జీఈఏ చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షన ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉపా ధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బాలజీ సే వలందిస్తున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనకు ఏపీ జీఈఏ కోచైర్మన్గా అదనపు బాధ్యతలను అ ప్ప జెప్పారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కల్పించిన నూతన బాధ్యతలను కర్తవ్యంతో నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళి చిత్తూరు అర్బన్: భాతర రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలోని జిల్లా ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్న అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాతగా మారినతీరు నేటి యువతరానికి ఆదర్శమన్నారు. ఆయన సూక్తు లు ప్రజల్ని ధర్మం, న్యాయం వైపు నడిచేలా చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఎస్బీ సీఐ భాస్కర్, చంద్రశేఖర్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెదురుకుప్పం: చిత్తూరు జిల్లాలో పలు చోట్ల సోమవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. వెదురుకుప్పం మండలంలోని ఎగువ కనికాపురంలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్లపై పడడంతో పాక్షికంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కనికాపురం, ముఠాలం గ్రామాల్లో అకాల వర్షంతో వరి పంట నేల కొరిగి నష్టాల పాలైనట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలులకు పంటలు ధ్వంసమయ్యాయి. మండలంలో కొన్ని గ్రా మాల్లో వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. నేలరాలిన మామిడి పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పలు పంచాయతీల్లో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలాయి. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ఎండ తాపం నుంచి కొంత ఉపసమనం కలిగినా, కొన్ని చోట్ల మామిడి పంటకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన వరి తవణంపల్లె: మండలంలో ఆదివారం రాత్రి పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు వరి పంట నేలకొరిగింది. మండలంలో 475 ఎకరా ల్లో వరి పంట వివిధ దశలో సాగులో ఉంది. ఈ దశలో అకాల వర్షంతో రైతులు న ష్టపోతున్నారు. వర్షానికి, పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్జిల్లాలో పోలీసుశాఖ బలగం హోదా పోస్టు ఎస్పీ: 1 ఏఎస్పీ: 1 డీఎస్పీలు: 6 సీఐలు: 30 ఎస్ఐలు: 41 ఏఎస్ఐలు: 103 హెడ్కానిస్టేబుళ్లు: 250 కానిస్టేబుళ్లు: 627 ఆర్ముడు రిజర్వు: 360 మినిస్టీరియల్ స్టాఫ్: 35 సెలవు కరువు పోలీసుశాఖలో కానరాని వారాంతపు సెలవు సెలవు అడిగితే..అధికారుల కన్నెర్ర ఖాకీలకు వీక్లీ ఆఫ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవే మానసిక వేదనలో పోలీసులు పోలీస్ ఉద్యోగం.. కత్తి మీద సాములాంటిది. విధి నిర్వహణలో పనిభారం.. కేసుల దర్యాప్తునకు ఉరుకులు, పరుగులు.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు.. రాజకీయ నేతల జోక్యం.. అనధికార బదిలీలు.. చార్జ్ మెమోలు.. వీటన్నింటికీ తోడు కుటుంబాలకు దూరం కావడంతో నాలుగో సింహం నలిగిపోతోంది. గతంలో ఉన్న వీక్ ఆఫ్ కరువు కావడంతో మానసిక వేదనకు గురవుతోంది. ఇటీవల జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నాయి. ‘ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసు విభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పనిచేసేవారు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై 2018 ఏప్రిల్ 20న చిత్తూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.’ సం‘క్షామం’.. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటామని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పే ఉన్నతాధికారులు వీక్ ఆఫ్ను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఇక పోలీసులకు కష్టమొస్తే తామున్నామనే భరోసా ఇవ్వడానికి ఏర్పాటైన పోలీసు సంక్షేమ సంఘం జిల్లాలో ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం మాత్రమే యూనియన్ ఉందని తోటి సిబ్బంది బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నా.. నోరు మెదపని పరిస్థితి. ఏపక్షంగా జరిగిన బదిలీలను ఆపలేక, అడగలేకపోయిన యూనియన్ నాయకులు.. వారాంతపు సెలవు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడానికి కూడా వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తోంది.పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి గంగవరం: పిడుగు పాటుకు రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని కీలపల్లి పంచాయతీ జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రమణ్యం తన పొలంలోని చెట్ల కింద నాలుగు పాడి ఆవులు కట్టి ఉంచాడు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో అక్కడ పిడుగు పడి రెండు పాడి ఆవులు ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. దాదాపు రూ. 2 లక్షలు విలువ చేసే పశువులు ప్రమాదంలో మరణించడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. -
20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారి మార్గంలో దిగువచావలి ఫ్లైఓవర్పై శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం లోడ్డుతో వెళ్తున్న వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం మార్గమధ్యంలో దిగువచావలి గ్రామం ఫ్లై ఓవర్పై టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే బియ్యం వ్యాపారులు వాహనంలోని 20 టన్నుల బియ్యాన్ని గ్రామంలోని రహస్య ప్రదేశానికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ గోపీనాథరెడ్డి, తహసీల్దార్ ద్వారకానాథ్రెడ్డికి సమాచారం అందించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని వీఆర్వోలు రమేష్, వంశి నాయుడుపేట గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నవవధువు అనుమానాస్పద మృతి
● భార్య కుటుంబ సభ్యులపై భర్త అనుమానం ● కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు చిత్తూరు అర్బన్: నాలుగేళ్ల ప్రేమ. వివాహానికి పెద్దల నిరాకరణ. కులమతాలు వేరుకావడమే ప్రధాన సమస్య. పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడే రెండు నైలెంది. నాన్న దిగులుగా ఉన్నాడు.. వచ్చి చూసి వెళ్లమని బతిమిలాడితే పుట్టింటికి వెళ్లింది. గంటలోపే శవమైంది. చిత్తూరు నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై వాస్తవాలేమిటీ ఎవరికీ తెలియడంలేదు. ఈ ఘటనపై పోలీసులు అనుమానానస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. టూటౌన్ పోలీసులు, మృతురాలి భర్త కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్అలీ మూడో కుమార్తె యాస్మిన్ (26) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. బీటెక్ చదువుతుండగానే పూతలపట్టు మండలం పోటుకనుమ దళితవాడకు చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్ల ప్రేమ ప్రయాణం కొనసాగింది. అయితే యాస్మిన్కు చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి జరగాల్సి ఉండగా, 6వ తేదీన ఆమె సాయితేజతో వెళ్లిపోయి, అతడ్ని వివాహం చేసుకుంది. పెద్దల నుంచి ప్రాణహాని ఉండొచ్చని తిరుపతి పోలీసులను ఆశ్రయిస్తే, ఇరుపక్షాల కుటుంబ సభ్యుల్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పూతలపట్టులోనే సాయితేజ, యాసిన్ కాపురం పెట్టారు. ఇటీవల యాసిన్ తన అక్కలు, అమ్మతో తరచూ ఫోన్లో బాగానే మాట్లాడేది. యాసిన్ వెళ్లిపోయినప్పటి నుంచి తండ్రి దిగులుగా ఉన్నాయని, ఓ సారి వచ్చి చూసి వెళ్లాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆదివారం సాయితేజ, యాసిన్ ఇద్దరూ కారులో చిత్తూరుకు వచ్చారు. యాసిన్ ఇంటి వద్దకు వెళ్లడానికి సాయితేజ భయపడి, పీసీఆర్ కూడలిలో యాసిన్ను దిగబెట్టి.. వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఓ కారులో వచ్చిన యాసిన్ కుటుంబ సభ్యులు, ఆమెను బాలాజీ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి రాగానే యాసిన్ తండ్రి షౌకత్ ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ మా పరువు మొత్తం తీశావు, ఇప్పుడెందుకు వచ్చావు..? వెళ్లిపో ఇక్కడి నుంచి..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనే బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపు తరువాత తలుపుతెరచి చూస్తే, యాసిన్ చున్నితో ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా యాసిన్ మృతికి ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ సాయితేజ ఆరోపిస్తున్నాడు. దీనిపై టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యాసిన్ బలవన్మరణానికి పాల్పడిందా..? కుటుంబ సభ్యులు ఏమైనా చేశారా..? అనే కోణాల్లో ద ర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యాసిన్ను పీసీఆర్ కూడలి నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లిన యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇంటి నుంచి వెళ్లిన యశ్విన్ తండ్రి షౌకత్ అలీ ఆచూకీ తెలియ రాలేదు. దీంతో యశ్విన్ది హత్య..? ఆత్మహత్య..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతురాలి మెడ వెనుక ఉన్న ఎముకను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువతి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా గొంతుకు చున్ని బిగించి చంపేశారా? అనే అంశంపై పోలీసులు కూడా ఎటు తేల్చుకోలేక పోతున్నారు.