Chittoor
-
నా బిడ్డను బతికించండి
● చేతికందివచ్చిన కొడుకు ఆసుపత్రి పాలు ● మెదడు వ్యాధితో నెలన్నరగా పోరాడుతున్న యువకుడు ● ఆదుకోవాలని ఓ తల్లి వేడుకోలు పుత్తూరు : చేతికందివచ్చిన బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అగాథంలో కూరుకుపోయింది. బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తల్లి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. వివరాలు ఇలా.. పుత్తూరు మండలం కేఎం అగ్రహారం గ్రామానికి చెందిన వేలాయుదం ఆచారీ, అంబిక దంపతుల కుమారుడు చిరంజీవి (27), పావని(29) ఇద్దరు సంతానం. పావనికి వివాహం చేసి పంపించారు. వేలాయుదం తిరుమలలో అవుట్ సోర్సింగ్ వడ్రంగి ఉద్యోగిగా పనిచేస్తుండగా, అంబిక అగ్రహారంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కగానొక్క కుమారుడు చిరంజీవి(27) జనవరి 17వ తేదీన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారు పడిన తల్లి కుమారుడిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వారు ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పడంతో స్విమ్స్లో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మెదడులో రక్తం గడ్డ కట్టిందని, చైన్నెలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో చైన్నెలోని విజయా ఆసుపత్రిలో చేర్పించా రు. అక్కడ చిరంజీవికి ఆపరేషన్కు సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశా రు. మరో ఆపరేష న్ చేయాలని అందుకు మరో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని ఆదివారం డాక్టర్లు చెప్పడంతో అంబిక దంపతులు నిర్ఘాంత పోయారు. ఉన్న ఇల్లును అమ్మి ఆపరేషన్కు నగదు సర్దుబాటు చేశామని, ఇప్పుడు మళ్లీ లక్షలు అవసరం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది. తమ పరిస్థితిని మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నగరి ఎమ్మెల్యే తన బిడ్డను కాపా డాలని వేలాయుద ఆచారీ, అంబిక దంపతులు వేడుకుంటున్నారు. తన కుమారుడు ఇలా ఒక్కసారిగా కు ప్పకూలడానికి మూడు రోజుల ముందే భర్త వేలాయుద ఆచారీకి గుండె నొప్పి రావడంతో తిరుపతిలో స్టంట్ వేయించుకొచ్చామని, వెంటనే తన బిడ్డను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని అంబిక విలపి స్తూ తెలిపారు. చిరంజీవి ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఇలా జరిగిందని, తన బిడ్డను కాపాడాలని బాధిత దంపతులు వేడుకుంటున్నారు. -
మహిళా వర్సిటీ విద్యార్థినులకు అభినందన
తిరుపతి సిటీ : తమిళనాడు కన్యాకుమారి వివేకానంద కాలేజ్ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ చైన్నె ప్రాంతీయ డైరెక్టరేట్ సంయుక్తంగా గత నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సమైక్యతా శిబిరం శుక్రవారం ముగిసింది. పలు రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ క్యాడెట్లతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం, విభిన్న సంస్కృతులపై అవగాహన పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా శిబిరం నిర్వహించారు. ఇందులో మహిళా వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ లీడర్గా డాక్టర్ యువశ్రీ, వలంటీర్స్ రేణుశ్రీ, పావని, లిఖిత, కామాక్షి, వాణి, శైలజ పాల్గొన్నారు. ఈ శిబిరంలో పలు సేవా దృక్పథంతో కూడిన నైపుణ్యాలను ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందారు. వారిని ఆదివారం పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య రజని, కోఆర్డినేటర్ ఆచార్య విద్యావతి, అధ్యాపకులు అభినందించారు. -
రన్నింగ్ లారీపై నుంచి పడి క్లీనర్ మృతి
పలమనేరు : లారీపైనున్న టార్పాలిన్ పట్టను కడుతూ కాలుజారి కిందపడి క్లీనర్ మృతి చెందిన సంఘటన పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుంచి లారీ లోడ్తో బయలుదేరి తమిళనాడులోని గుడియాత్తంలో అన్లోడ్ చేసి తిరిగీ బయలు దేరింది. ఈ నేపథ్యంలో మండలంలోని కాలువపల్లి వద్ద వస్తుండగా లారీ అద్దాలకు పైనున్న టార్పాలిన్ అడ్డుగా వస్తోందని గమనించిన డ్రైవర్ ఉస్మాన్ క్లీనర్ మంజునాథ్కు చెప్పాడు. దీంతో క్లీనర్ లారీ రన్నింగ్లో ఉండగానే దాన్ని తాడుతో కట్టి కిందకు దిగే సమయంలో కాలుజారి కిందపడ్డాడు. పై నుంచి కిందపడిన మంజునాథ్(42) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ సమీపంలోని కళాడియి గ్రామంగా తెలిసింది. పలమనేరు పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు దర్యాపు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి గంగాధరనెల్లూరు : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కట్టకిందపల్లి హరిజనవాడలోని దినకరన్, మాధవీల మూడో కుమారుడు సూరి అలియాస్ సీమోను (13) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రామంలోని చర్చిలో మైక్లో అందరినీ చర్చి ప్రార్థనకు రావాలని పిలుస్తుండగా షార్ట్ సర్య్కూట్ కావడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతనిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సూరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుష్పపల్లకిలో ఊరేగిన ఆదిదంపతులు తవణంపల్లె: కాలభైరేశ్వర ఆలయంలో కొనసాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామికి ఉఽభయదారులు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రిలో పుష్పపల్లకిలో సేవను ఉభయదారులు ఘనంగా నిర్వహించారు. ఉభయదారులు స్వామికి పూజా సామగ్రి, ప్రసాదాలు, పట్టువస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఉత్సవమూర్తులు అర్చకులు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. పుష్పపల్లకిలో కొలువుదీరిన ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. భక్తులు ఇంటింటా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
15 నుంచి ఒంటిపూట బడులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లో ఒంటిపూట తరగతులు పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఒంటిపూట బడులు పకడ్బందీగా అమలు చేయాలని డీవైఈవోలు, ఎంఈవోలకు ఉత్తర్వులు పంపారు. పనివేళల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో సాయంత్రం పూట తరగతులు నిర్వహించాలని సూచించారు. మహిళా సాధికారత వారోత్సవాలు చిత్తూరు అర్బన్ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా ఉద్యోగులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగా శిక్షకులు వివరించారు. ఈనెల 8వతేదీ వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. భారతీయ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానం, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశైల పీఠం జగద్గురు డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ, బెంగళూరుకు చెందిన అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థాన్ సంయుక్తంగా వర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం శక్తి విశిష్టాద్వైతం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శక్తి విశిష్టాద్వైతం మహత్వాన్ని ఆధునిక దార్శనికులకు అందించడం శుభపరిణామమన్నారు. సంస్కృత భాష ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాశీపీఠం జ్ఞానసింహాసనధీశులు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్ఎస్యూలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి శక్తి విశిష్టాద్వైతం గొప్పతనాన్ని తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇందులో సారాంశాన్ని గ్రహించి ఆధ్యాత్మిక తత్త్వ అన్వేషణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సదుస్సులో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, సతీష్, నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్షిండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైభవం.. గిరి ప్రదక్షిణం
● ఘనంగా కొండచుట్టు మహోత్సవం ● సమస్త దేవగణాలకు వీడ్కోలు పలికిన పార్వతీపరమేశ్వరులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్ఞానప్రసూనానాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి కై లాస గిరి ప్ర దక్షిణ అత్యంత వైభవంగా సాగింది. తమ కల్యాణాని కి విచ్చేసిన సకల దేవతా గణాలు, రుషులకు పార్వతీ పరమేశ్వరులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వస్వామి, జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను ఆలంకార మండపంలో విశేషంగా అలంకరించారు. చప్పరాలపైస్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. రాజగోపురం నుంచి చుతర్మాడవీధుల్లోకి శివపార్వతులు ప్రవేశించారు. భేరివారి మండపం వద్ద భేరికులస్తులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావువీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కై లాసగిరికాలనీ, రాజీవ్నగర్కాలనీ మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. రామాపురం రిజర్వాయరు సమీపంలోని అంజూరు మండపంలో ఆదిదంపతులు కాసేపు సేదతీరారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయంతోపాటు పలువురు దాతలు అన్నప్రసాదాలు వితరణ చేశారు. అంజూరు మండపం నుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు. -
నాడు పండుగ.. నేడు దండగ
● రైతుకు దూరంగా సేవలు ● రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం ● రైతు ముంగిటకే అందని విత్తనాలు, ఎరువులు ● రేషనలైజేషన్ పేరుతో కూటమి కుట్ర చిత్తూరు రూరల్ (కాణిపాకం): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతలు ఊరు దాటకుండా విత్తనం నుంచి పంటల విక్రయం వరకు అన్ని రకాలుగా సేవలందించిన రైతు భరోసా కేంద్రాలకు ఉరి వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా అందించే ఎరువులు, పురుగు మందులు, తదితర సేవలను కుదించి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా రేషనలైజేషన్ పేరుతో వాటికి మంగళం పాడేందుకు కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లోని వాటిని ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ఆధారంగా రెండు, మూడింటిని విలీనం చేసి భారీగా కుదించాలని భావిస్తోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులు పండించే ధాన్యం దళారుల పాలు కాకుండా ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరను అందజేసే పరిస్థితి ఉండేది. ఈ–క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి ఉచిత పంటల బీమా వర్తించేది. పంటలు నష్టానికి గురైన సమయంలో ఎన్యూమరేషన్ నిర్వహించి వీలైనంత త్వరగా రైతులకు పరిహారాన్ని అందజేయడంలో వీటి పాత్ర కీలకంగా ఉండేది. వ్యవసాయ అనుబంధ శాఖలైన పశుసంవర్థక, సూక్ష్మసేద్యం, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో రాయితీలను పొందాలనుకునే రైతులు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉండేది. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆర్బీకేల పనితీరును పరిశీలించి ప్రశంసించారు. ఇది గత పరిస్థితి... పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని మండలాల్లోని వరి, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగు అధికంగా ఉంది. గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం పల్లెల నుంచి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులకు డిమాండ్ అధికంగా ఉండే సందర్భాల్లో బ్లాక్లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీంతో రైతులు అల్లాడిపోయే వారు. ఽలేకుంటే తమిళనాడుకు పరగులు పెట్టేవాళ్లు. దీనికి తోడు కల్తీ ఎరువుల కాటేయడంతో తమిళనాడులోని సరిహద్దు ప్రాంతాల వైపే చూసేవాళ్లు. పెరిగిన సాగు విస్తీర్ణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుమూల గ్రామాల్లోనూ ఆర్చీకేలను ఏర్పాటు చేయడంతో రైతులు గ్రామం దాటకుండానే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పొందడం, పండించిన పంటను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకోవడం సాధ్యమైంది. దీంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగింది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో.. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా ఖరీఫ్ సీజన్లో 12 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 300 క్వింటాళ్ల వరకు కంది, 600 టన్నుల వరకు జనుములు ఇతరా విత్తనాలను అందించేవారు. అలాగే ఏటా సుమారు 5 వేల టన్నులకుపైగా పైగా ఎరువులను కూడా రైతులకు అందించేవారు. అందుకు సంబంధించి ముందస్తుగా ఏటా సుమారు 1.14 లక్షల మంది రైతుల పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేసేవారు. అలాగే భూసార పరీక్షలను నిర్వహించి సూక్ష్మ స్థూల పోషకాలను అంచనా వేసి రైతులకు ఏ పంటలు పండించుకోవాలి.. ఎంత మేర ఎరువులు వేయాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పెట్టుబడులు గణనీయంగా ఆదా అవుతుండేవి. ఆర్బీకేల్లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా సిబ్బంది పంటల బీమా చేయడంతో పాటు ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోతే వెంటనే పరిహారం అందించే వారు. ఇలా ఆర్బీకేల ద్వారా అందించే సేవలతో పాటు రైతు భరోసా పథకం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు భరోసాను ఇచ్చింది. నేడు రైతులకు కష్టం... కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. సేవలను అంతంత మాత్రంగానే అందిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పంటల బీమా పథకం, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రైతు సేవా కేంద్రాల సంఖ్యను కూటమి ప్రభుత్వం తగ్గించేందుకు కసరత్తు చేస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం రైతులు మండల ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. వ్యాపారులు సిండికేట్తో యూరియాను అధిక రేట్లకు విక్రయించుకుంటున్నారు. దీంతో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం పండగ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకూ ప్రతి దశలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం చేయూతను అందించడంతో వ్యవసాయం పండగలా సాగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్చీకేలు రైతు నేస్తాలుగా మారి వ్యవసాయంలో నూతన శకానికి నాంది పలికాయి. 2020 మేలో ప్రారంభించిన ఆర్బీకేలను దశల వారీగా బలోపేతం చేశారు. రైతులు ఊరు దాటకుండా వారికి అవసరమైన భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, తదితర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘ఓపెన్’ బేరం
రెండు జిల్లాల సమాచారం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 15 తిరుపతి జిల్లాలో కేంద్రాలు 14 చిత్తూరు జిల్లాలో ఇంటర్ అభ్యర్థులు 3,419 తిరుపతి జిల్లాలో ఇంటర్ అభ్యర్థులు 2,838నేటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులకు సమావేశం నిర్వహించి తగు సూచనలిచ్చామన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 3,419 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్టికెట్లను సంబంధిత ఏ1 సెంటర్ నుంచి లేకుంటే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఓపెన్గా బేరం కుదిరినట్లు సమాచారం. స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఇంటర్ అభ్యర్థుల నుంచి కల్లు చెదిరే డీల్ కుదిరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వద్ద నుంచి రూ.6 కోట్లకు పైగా డబ్బులు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్కు అంతా పకడ్బందీగా సిద్ధం చేశారు. ముడుపులు ముట్టజెప్పిన అభ్యర్థులకు అనుకూలమైన కేంద్రాలు.. తెలిసిన ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉండేలా ప్రణాళిక రచించినట్లు వినికిడి. ఇంత పెద్ద స్థాయిలో దోపిడీకి తెరలేపడంపై ఉన్నతాధికారులకు తెలిసే ఈ బాగోతం నడిచినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3వ తేదీ నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు చిత్తూరు జిల్లాలో 15, తిరుపతి జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సోమవారం నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లో ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల నుంచి కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు సహకరించడానికి ఇంటర్ పరీక్షలు రాసే అభ్యర్థి నుంచి సగటున రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ తతంగం మొత్తం రెండు జిల్లాల్లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు నిర్వహిస్తున్నారు. వసూళ్ల అనంతరం విద్యాశాఖ అధికారులకు అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లో 6257 మంది అభ్యర్థులు.. చిత్తూరు జిల్లాలో 3419 మంది, తిరుపతి జిల్లాలో 2838 మొత్తం 6,257 అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫీజు చెల్లించి స్టడీ కేంద్రాల్లో నమోదైన అభ్యర్థులు సార్వత్రిక విద్యాపీఠం నుంచి మెటీరియల్ ఇస్తారు. సెలవు రోజుల్లో స్టడీ కేంద్రాల్లో బోధనా తరగతులు నిర్వహించాలి. అయితే అలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కడా తరగతులు నిర్వహించిన దాఖలాలు లేవు. సాధారణంగా పలు కారణాలతో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లని అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇంకా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగోన్నతి కోసం ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఇదే అదునుగా భావించిన స్టడీ కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.10 వేలు చొప్పున రెండు జిల్లాల్లో రూ.6.25 కోట్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుకూలమైన వారికి విధులు.... తిరుపతి జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షల్లో తమకు అనుకూలమైన వారికి ఇష్టానుసారం పరీక్షల విధుల నియామకాలు జరిగినట్లు తెలిసింది. ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉండే సంబంధిత పాఠశాల కో ఆర్డినేటర్లకే విధులకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ చేయించేందుకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను వేయడం వివాదాలకు తావిస్తోంది. ఓపెన్ స్కూల్ పరీక్షల మాస్ కాపీయింగ్ దందా ఇంటర్కు రూ.12 వేల నుంచి రూ.15 వేలు డబ్బుల వసూళ్లు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని స్టడీ సెంటర్లలో కలెక్షన్లు విద్యాశాఖ అధికారులకూ వాటాలు! నేటి నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్స్కూళ్లు) ఆధ్వర్యంలో 3వ తేదీ నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల నుంచి కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓపెన్ స్కూళ్ల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బోధనా తరగతులు నిర్వహించే స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు చిత్తూరు జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్య లు చేపట్టాం. ఈ పరీక్షలను కలెక్టర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహించడం జరు గుతుంది. ప్రతి పరీక్ష కేంద్రంలో వీఆర్ఓలను, ఇతర అధికారులను సిట్టింగ్ స్క్వాడ్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చూచి రాతలను ప్రోత్సహించేది లేదు. జిల్లా లోని కొన్ని స్టడీ కేంద్రాలను అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందాయి. హాల్ టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అక్రమాలకు పా ల్పడినా సంబంధిత స్టడీ సెంటర్ను బ్లాక్ లిస్టులో పెడతాం. – వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం తిరుపతి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్, డీఈఓ ఆదేశాల మే రకు చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాం. ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్లైతే లిఖిత పూర్వకంగా అందజేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. – గురుస్వామిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం, తిరుపతి జిల్లా -
చెరువుకు చెర!
● కబ్జా కోరల్లో ఎస్బీఆర్పురం చెరువు ● జీఓ నం.188 విరుద్ధంగా చెరువును పూడ్చేస్తున్న సర్పంచ్ ● సుప్రీంకోర్టు ఉత్తర్వులు బే ఖాతర్ ● ఎస్బీఆర్పురం తటాకాన్ని కాపాడాలంటూ రైతులు డిమాండ్ ● ప్రేక్షకపాత్ర పోషిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కొండలు, గుట్టలు దోచేస్తున్నారు.. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే చెరువులనూ వదలడం లేదు కూటమి నేతలు.. ఈ కోవలోనే వడమాలపేట మండలంలో ఓ చెరువుపై కూటమి నేత కన్ను పడింది.. ఇంకేముంది.. పది మందికి ఉపయోగపడే చెరువును పూడ్చే పుణ్యకార్యానికి పూనుకున్నాడు ఆ గ్రామ పెద్ద.. పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్ తవ్వి చెరువును పూడ్చే పనులు చకచకా చేపట్టాడు.ఆ కూటమి నేత చెరువును కబళిస్తున్నాడని తెలిసినా అడ్డుచెప్పే ధైర్యం చాలక అధికారులు చేష్టలుడిగి చూస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. వడమాలపేట (విజయపురం ) : శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రమైన తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో వడమాలపేట మండలం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉండడంతో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు కొండలు, గుట్టలు, చెరువులు వేటినీ వదలడం లేదు. ప్రభుత్వం స్థలమంటే అధికార పార్టీకి చెందిన ఆస్తులే అన్న చందంగా రెచ్చిపోతున్నారు. ఎంత ఆక్రమించుకోగలిగితే అంత కబ్జాకు తెరతీశారు. జానెడు జాగా కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పేదవారు ఈ తంతును చూసి నివ్వెరపోతున్నారు. ఇదేం పాలనరా బాబూ అంటూ ఆవేదన చెందుతున్నారు. ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ, ఫారెస్టు భూములను ఆక్రమించుకొని మామిడి చెట్లు పెంచుకుంటున్న విషయం బహిర్గతమై రోజులు గడవక ముందే మరో ఆక్రమణ వెలుగు చూస్తోంది. వడమాలపేట మండలం, ఎస్బీఆర్పురం చెరువు కబ్జా చేయడానికి స్థానిక కూటమి నేత కంకణం కట్టుకున్నాడని, ఇప్పటికే రెండు రోజులుగా చెరువు కట్ట ఆనుకొని ఉన్న కొండలో నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించి చెరువును పూడ్చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అది తప్పని తెలిసినా అధికార పార్టీ నేత కావడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటానికి సాహసించడం లేదు. ఆక్రమిత నేతకు ధన బలం, అధికారం బలం ఉండటంతో అధికారులు అది తప్పు అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఆక్రమణకు గురవుతున్న చెరువును కాపాడాలని మాజీ నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, రైతులు కోరుతున్నారు. జీఓ నంబరు 188కి విరుద్ధంగా .. ఎస్బీఆర్పురం చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాల చెరువు, 439 ఎకరాల మునక పట్టాలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీఓ నం.188 ప్రకారం చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. సాగు చేసిన తరువాత చెరువు నిండితే వాటిని ఎలాంటి నష్ట పరిహారం చెల్లించరు. చెరువులో నీరు ఉంటే ఆ భూములను గ్రావెల్తో ఎత్తు పెంచడం వంటి పనులు చేయకూడదు. ఆ జీఓకు విరుద్దంగా అధికారి పార్టీకి చెందిన స్థానిక కూటమినేత చెరువులో నీళ్లు ఉండగానే మునక ప్రాంతంలో గ్రావెల్ పోసి ఎత్తు పెంచేస్తున్నాడు. ఇలా గ్రావెల్తో చెరువును పూడ్చేయడంతో లోతు తగ్గిపోయి, పూర్తి స్థాయిలో నీరు చెరువులో నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 గ్రామాలకు సాగు, తాగునీరు ఎస్బీఆర్పురం చెరువు నిండితే సుమారు 35 గ్రామాలకు సాగు, తాగునీరు పుష్కలంగా ఉంటుంది. 20 ఏళ్లుగా తడుకు, చిరుగురాజు పాలెం, గొల్లపల్లి, తోరూరు, కొడలచెరువు, నెసనూరు, పుత్తూరు ప్రాంతాల్లో ఉన్న సాగు, తాగునీటికి ఎలాంటి కష్టాలు రాలేదంటే అది ఈ చెరువులో చేరే నీటి వల్లే అన్నది నిష్టూర సత్యం. అలాంటి చెరువు ఆక్రమణకు గురికావడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు జారీ చేశాం ఎస్బీఆర్పురం చెరువులో మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 439 ఎకరాలు మునక పట్టాలు. చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలి. నీళ్లు ఉన్నప్పుడు మట్టితో పూడ్చడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అది చట్టరీత్యా నేరం. సంబంధిత సర్పంచ్కి నోటీసు జారీ చేశాం. – పరశురామ్నాయుడు, నీటిపారుదలశాఖ ఏఈ, పుత్తూరు అది పట్టా భూమి రైతుల ఫిర్యాదు మేరకు మా సిబ్బంది సర్వే చేయడం జరిగింది. అది అతని పట్టా భూమి అని తెలిసింది. చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో మోటారు మునిగిపోతుందని గ్రావెల్ తోలి ఎత్తు పెంచుకున్నాడు. గ్రావెల్ తరలించడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. – జరీనా, వడమాల పేట, తహసీల్దార్ అధికారులు చెరువును కాపాడాలి ఎస్బీఆర్పురం సర్పంచ్ చేస్తున్న పని చూ స్తుంటే కంచే చేనును మేస్తున్నట్లు ఉంది. పంచాయతీకి సంబంధించిన భూమి, చెరువు, గుంటలను కాపాడాల్సిన సర్పంచ్ చెరువును పూడ్చేయడం అన్యాయం. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచి అధికారంతో ఇలా చేయడం ఎంత వర కు న్యాయం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన చె రువును వెంటనే స్వాధీనం చేసుకొని, గ్రావెల్ను బయటకు తొలగించాలి. – శ్రీనివాసులురెడ్డి, నీటి పారుదల సంఘం మాజీ అధ్యక్షుడు -
ఇది రాజకీయ కక్ష కాదా బాబూ?
కార్వేటినగరం : ఎన్నికలప్పుడు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి తీరా పదవి వచ్చాక పార్టీలకు అతీతంగా సేవలందించాల్సింది పోయి రాజకీయంగా కక్ష గట్టి కేవలం టీడీపీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చేలా సీఎం చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గంగాధర నెల్లూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీకి చెందిన వారికి ఎలాంటి పనులు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని చేయకూడదని పార్టీ నేతలు, అధికారులకు ఆదేశాలిచ్చేలా మాట్లాడడం ద్వారా తన వైఖరి ఏంటో ప్రజలకు అర్థమయిందన్నారు. అధికారంలోకి వచ్చన ఏ పార్టీ అయినా ప్రజలకు ఎలాంటి పనులు చేపట్టాలి.. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన ఉండాలే తప్ప ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా సంక్షేమ పథకాలైనా పార్టీలకు అతీతంగా అందించాలని పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని దీక్షతో దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. నేడు పోలీస్ గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ వివరించారు. -
గ్రంథం..అంధకారం
జిల్లా కేంద్ర గ్రంథాలయం కూటమి పాలనలో గ్రంథాలయాలు అలంకారప్రాయంగా మారాయి. ఈ విజ్ఞాన భాండాగారాలకు సెస్ పరంగా దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. రూపాయిలో ఎనిమిది పైసలు గ్రంథాలయాలకు సెస్ రూపంలో చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గ్రంథాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. జిల్లాలో దాదాపు రూ. 37 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల సేవలు మొక్కుబడిగా మారాయి. పేద విద్యార్థులకు శాపం జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉండగా నిత్యం 80 వేల మంది పాఠకులు సేవలు పొందుతున్నారు. స్థానిక సంస్థల నుంచి సెస్ సకాలంలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల్లో అరకొరగా వసతులు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తకాలు సైతం తగిన స్థాయిలో లేవని పాఠకులు అంటున్నారు. త్వరలో డీఎస్సీ పరీక్షలు ఉన్న కారణంగా జిల్లాలో వేల మంది యువత వీటికి సన్నద్ధం అవుతున్నారు. వాటితో పాటు వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధం అవుతున్నారు. వీరిలో అత్యధిక మంది సామాన్య, పేద అభ్యర్థులే ఉంటారు. వీరంతా పోటీ పరీక్షల పుస్తకాలు, పేపర్లు కొనే ఆర్థిక స్థోమత లేక సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ అక్కడ అరకొరగా పుస్తకాలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : విజ్ఞాన భాండాగారాలుగా పేరుపొందిన గ్రంథాలయాలు ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో సమస్యలు వేధిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి. ఆ పన్నుల్లో నుంచి లైబ్రరీలకు చెల్లించాల్సిన సెస్ వాటాను మాత్రం సక్రమంగా జమ చేయడంలేదు. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో నుంచి 8 శాతం గ్రంథాలయాలకు సెస్గా చెల్లించాలి. ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడంతో గ్రంథాలయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. సెస్ బకాయి ఏటా పెరుగుతూ దాదాపు రూ.37 కోట్ల వరకు చేరాయి. ఈ బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. రూపాయికి 8 పైసలు సెస్ ఉమ్మడి జిల్లాలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, పంచాయతీల పరంగా గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లింపులు జరగడంలేదు. ఈ బకాయిలు రూ.37 కోట్లకు చేరాయి. 2015–16 నుంచి బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో రూపాయికి ఎనిమిది పైసల చొప్పున గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లించాలి. కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కూడా ఇదే నిబంధనను అనుసరించాలి. సెస్ ద్వారా వచ్చిన సొమ్ముతో గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, దిన, వార, మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచే వీలు ఉంటుంది. సెస్లో కొంత మొత్తమే జమ చేయడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బకాయిలు ఇలా.. తిరుపతి నగరపాలక సంస్థ రూ.26.63 కోట్లు, చిత్తూరు నగరపాలక రూ.5.90 కోట్లు, శ్రీకాళహస్తి రూ.1.29 కోట్లు, నగరి మున్సిపాలిటీ రూ.42 లక్షలు, కుప్పం మున్సిపాలిటీ రూ.13 లక్షలు, పుంగనూరు మున్సిపాలిటీ రూ.11.05 లక్షలు, పంచాయతీల పరంగా రూ.2.50 కోట్లు కలిపి మొత్తం రూ.37 కోట్లు వరకు రావాల్సి ఉంది. వీటి వసూళ్లకు చర్యలు చేపడుతున్నట్లు గ్రంథాలయ అధికారులు చొరవ తీసుకుంటున్నా ఫలితం దక్కడం లేదు. విజ్ఞాన భాండాగారాలపై బకాయిల భారం వసూలైన పన్నుల్లో 8 శాతం గ్రంథాలయాలకు చెల్లించాలనే నిబంధన పట్టించుకోని పంచాయతీ, పురపాలికలు సమస్యల వలయంలో విజ్ఞాన కేంద్రాలు ఇప్పటికే రూ.37 కోట్లకు పైగా బకాయిపూర్తి స్థాయి మెటీరియల్ లేదు స్థానిక సంస్థలు సెస్ సకాలంలో పూర్తిగా చెల్లించాలి. అప్పుడే గ్రంథాలయాలకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. పాఠకులతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు లైబ్రరీలను ఆశ్రయిస్తుంటారు. కానీ నేడు లైబ్రరీల్లో అరకొరగా వసతులు ఉంటున్నాయి. పూర్తి స్థాయి మెటీరియల్ ఉండడం లేదు. – భరత్ , విద్యార్థి అసంతృప్తిగా ఉంది డిగ్రీలు, టీటీసీ, బీఈడీల అనంతరం చాలా మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. పేద విద్యార్థులు పుస్తకాలు అన్నీ కొనుగోలు చేయలేరు. వారు సమీపంలోని లైబ్రరీల్లో అన్ని వసతులు ఉంటాయని వెళ్తుంటారు. కావాల్సిన పేపర్లు, పుస్తకాలు లేకపోతే అసంతృప్తిగా ఉంటుంది. ఉన్నతాధికారులు, నేతలు గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. – నాని, విద్యార్థి -
వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను: చంద్రబాబు
చూశారా.. ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో! తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది.. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది.. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలని అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది.. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది.. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చేయాలన్న ఆరాటం ఒకరిది.. మనవాళ్లు కాని వారందరినీ అణచి వేయాలన్న కుట్ర మరొకరిది.. చిత్తూరు అర్బన్/ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయ పరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం విస్తుగొలిపింది.విజనరీనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. సీఎం స్థానంలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం తగదంటున్నారు. నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా.. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదేపదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరా అందరితోపాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదట! ఓ వైపు రాష్ట్రంలో ఆదాయం లేదని, ఏం చేయాలో దిక్కు తోచడం లేదని చెప్పుకొచి్చన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించేశానని లేని గొప్పలు చెప్పడం విస్తుగొలుపుతోంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియడం లేదని అంటూనే వృద్ధి రేటు పెంచేశానని చెప్పుకోడం పచ్చి అబద్ధమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయం అంతా తన చుట్టూ ఉన్న వారికి కమిషన్ల రూపంలో దోచిపెట్టి.. ‘నీకింత.. నాకింత’ అని పంచుకోవడానికే సరిపోతోందని అంటున్నారు.నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తూ.. వాటిలో కమిషన్లు కొట్టేస్తూ ఆదాయం లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం వైఎస్సార్సీపీ నేతలను తిట్టిపోశారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పుల నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని.. తానొక్కడినే పరుగెడుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారి బాగోగులను చూసే బాధ్యత తనదన్నారు. సూపర్ సిక్స్ హామీల సంగతి చెప్పవయ్యా అంటే.. ఆకాశానికి నిచ్చెన వేసేలా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం అన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. ఎనిమిది, పదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ పిల్లల్ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు.. వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడటం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనస్సును ఎంతగా గాయ పరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం.. వాసు, సెల్వి దంపతుల ఇంట్లోకి వెళ్లి పింఛన్ డబ్బులిచ్చారు. ‘సార్ కాస్త నీళ్లు తాగండి..’ అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా.. ‘అవి వద్దమ్మా.. నా వద్ద ఉన్న నీటినే తాగుతాను’ అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు. సర్పంచ్ వి.సి. సుబ్రమణ్యం యాదవ్ వైఎస్సార్సీపీకి చెందిన వారని వేదికపై చోటు కల్పించలేదు. -
ముసుగు దొంగల హల్చల్
చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలో ముసుగు ధరించిన నలుగురు దొంగలు శుక్ర వారం అర్ధరాత్రి హల్చల్ చేశారు.కుప్పం టౌన్ బ్యాంకుపై ఆంక్షలు తొలగింపు కుప్పం : కుప్పం కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గతంలో రిజర్వు బ్యాంకు విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు మేనేజర్ శివక్రిష్ణ తెలిపారు. 2020లో టౌన్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రుణాలు, షేర్ హోల్డర్లకు డివిడెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వడ్డీ ఇవ్వాలని ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి టౌన్ బ్యాంకులో ఎలాంటి రుణాలు, షేర్ హోల్డర్లకు డివిడెంట్లు నిలిపివేశారు. ప్రస్తుతం ఆంక్షలు తొలగిస్తూ మార్చి 2025 నుంచి అన్ని విధాలా సేవలను పునరుద్ధరించాలని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చిత్తూరు అర్బన్ : చిత్తూరుకు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) వి.లోకనాథరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పోస్టులో కొనసాగలేనని, మార్చి 1వ తేదీ నుంచి ఏపీపీగా విధులకు హాజరుకాలేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్స్పల్ కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపించారు. క్రీడాకారులకు డీఈఓ అభినందన చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటిన జిల్లా సర్కారు పాఠశాల విద్యార్థులను డీఈఓ వరలక్ష్మి అభినందించారు. ఆ విద్యార్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించిన విద్యార్థుల ప్రతిభ అభినందనీయమన్నారు. భవిష్యత్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి క్రీడల్లో మరింత రాణించాలన్నారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు డీఈఓ సర్టిఫికెట్లు, పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవి, కృష్ణ, దాము, హరికృష్ణ పాల్గొన్నారు. 8న మహిళా సదస్సు చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సమితి నిర్వాహకులు తులసీనాథం నాయుడు తెలిపా రు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరులోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కళా మందిరంలో మహిళా సదస్సు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీసమాజాభివృద్ధి మహిళలుశ్రీ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సుతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 25 మంది మహిళలకు ఉత్తమ మహిళా పురస్కారాలు అందిస్తామని వెల్లడించారు. – 8లో -
‘నీ ఫ్రెండ్స్ వచ్చారు లేచి చూడరా నాన్న’
● మంచంపై నుంచి పడి పదో తరగతి విద్యార్థి మృతి పలమనేరు : ‘రే నీ ఫ్రెండ్స్ వచ్చారు లేచి చూడరా నాన్నా’ అంటూ బిడ్డ శవం వద్ద ఆ తల్లి ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. పలమనే రు పాతపేటకు చెందిన టెన్త్ విద్యార్థి శనివారం ఉదయం మంచం పైనుంచి కింద పడి తల వెనుక వైపు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. పట్టణానికి చెందిన గౌషాబాషా కుమారుడు రియాజ్(15) పలమనేరులో ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నిద్ర లేచేముందు మంచంపై నుంచి కిందపడి అపస్మారక స్థితిలో ఉండడాన్ని తల్లి గమనించింది. దీంతో బిడ్డను పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. పిల్లాడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. వారం రోజుల్లో పబ్లిక్ పరీక్షలను బాగా చదువుతున్న బిడ్డ ఇలా విగతజీవిగా మారడంపై ఆమె లబోదిబోమంది. ఏటా రంజాన్ మాసంలో ఉపవాసాలు సైతం ఉండే తన బిడ్డ రంజాన్ నెల ఆదివారం వస్తుందనే లోపే ఇలా తమను విడిచిపెట్టి వెళ్లాడని తలచుకుంటూ రోదించింది. కాగా బాలుడి తండ్రి దుబాయ్లో ఉంటున్నాడు. ఫోన్ ద్వారా విషయాన్ని ఆయనకు తెలిపారు. వీరికి ఎనిమిదో తరగతి చదివే కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి పిల్లాడిని పోస్టుమార్టానికి తరలించి కేసు విచారిస్తున్నారు. స్కూల్లోగాని వీధిలో గాని మంచి పిల్లాడుగా పేరు తెచ్చుకున్న రియాజ్ లేడనే విషయాన్ని అక్కడివారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. -
గురుకులాన్ని తనిఖీ చేసిన విజిలెన్స్
పుంగనూరు : పట్టణంలోని మేలుపట్లలోని ఎస్సీ, ఎస్టీ గురు కుల పాఠశాలను శనివారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్, నాగేనాయక్ పాఠశాలను తనిఖీ చేశారు. వి ద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ పార్వతితో చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీంద్రనాయక్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, పలు రకాల సమస్యలు ఉన్నాయని , వీటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సభ్యులు రామయ్యనాయక్, శ్రీరాములునాయక్, చిన్నరాయుడు, జిటినారాయణ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
● ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు ● సీఎం పర్యటనతో గందరగోళం ● చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మురగానపల్లి వరకు నిలిచిన వాహనాలు ● కేంద్రాల వద్దకు చేరుకునేందుకు విద్యార్థులు అగచాట్లు ● మొదటి రోజు పరీక్షకు 889 మంది గైర్హాజరు
ఇంటర్ విద్యార్థులకు సీఎం పర్యటన చుక్కలు చూపించింది. శనివారం ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కాగా పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఇదే సమయంలో సీఎం పర్యటనకు సంబంధించిన వాహనాలు వందల సంఖ్యలో రావడంతో చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మురగానపల్లి వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో చాలా మంది విద్యార్థులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. మరికొంత మంది ఆలస్యంగా చేరుకొని అధికారులను బతిమాలుకొని కేంద్రాల్లోకి వెళ్లిన పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపించింది. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా శనివారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్ధూ/తమిళం పరీక్షకు జనరల్ విద్యార్థులు 14,480 మందికి గాను 13,794 మంది హాజరుకాగా, 686 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 2,088 మందికి గాను 1,885 మంది హాజరు కాగా 203 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. జిల్లాలో మొదటి రోజు జరిగిన పరీక్షలను డీవీఈవో సయ్యద్ మౌలా చిత్తూరులోని 4, సిట్టింగ్ స్క్వాడ్లు 5, ప్లైయింగ్ స్క్వాడ్ 03, డీఈసీ మెంబర్లు 4, కన్వీనర్ 5, స్పెషల్ ఆఫీసర్ 4 పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పరీక్షల సమయంలోనే పర్యటన ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో సీఎం పర్యటన అవసరమా అంటూ పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో సీఎం పర్యటనలు ఉండడం వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సీఎం పర్యటన వల్ల అధికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో నగరంలోని సీకేపల్లి వద్ద ఉన్న శ్రీ వివేకానంద కళాశాల కేంద్రం వద్దకు ఒక విద్యార్థిని సెంటర్ తెలుసుకోకుండా వచ్చేశారు. ట్రాఫిక్ సమస్యతో ఆ విద్యార్థిని సీకేపల్లి వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వచ్చిన సమయం ఉదయం 9.20 గంటలు. వచ్చిన పరీక్ష కేంద్రం సరైనది కాకపోవడంతో మళ్లీ అక్కడ నుంచి వెనుదిరిగి పీసీఆర్ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అప్పుడున్న ట్రాఫిక్ సమస్యకు 3 కి.మీ వరకు పీసీఆర్ పరీక్ష కేంద్రానికి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే ఆ విద్యార్థినిని మానవతా దృక్పఽథంతో అధికారులు పరీక్షకు అనుమతించారు. అయినప్పటికీ అర్ధగంట సమయం ఆ విద్యార్థినికి పరీక్ష సమయం వృథా అయింది. ఇదే విధంగా పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులకు లోనయ్యారు. పరీక్ష కేంద్రాల తికమక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రాలు తెలియక తికమకకు లోనయ్యారు. నగరంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలు ఎక్కువగా కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోనే ఉన్నాయి. మురగానపల్లిలో ఒకచోటే శ్రీవివేకానంద పేరుతో మూడు పరీక్ష కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తికమక పడ్డారు. పరీక్ష కేంద్రాల వివరాలను సరిగ్గా తెలియజేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గతంలో ముందస్తుగా గూగుల్ రూట్ మ్యాప్లతో అవగాహన కల్పించేవారు. ఈసారి అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ● తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థులను నగరంలోని 12 కేంద్రాల్లో కేటాయించారు. వారందరూ కేంద్రాలు తెలియక ఆందోళనకు గురయ్యారు. పీసీఆర్ పరీక్ష కేంద్రం వద్ద రూం నంబర్లను చూసుకుంటున్న విద్యార్థులుసీఎం పర్యటనతో అవస్థలు జిల్లా కేంద్రంలో శనివారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల విద్యార్థులకు ట్రాఫిక్ ఇక్కట్లు అధికమయ్యాయి. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనకు రావడంతో పలు వాహనాలు గాంధీ విగ్రహం నుంచి కొత్తబస్టాండ్, కొంగారెడ్డిపల్లి మీదుగా గంగాధర నెల్లూరుకు వెళ్లాయి. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు సీఎం పర్యటనకు అధికంగా వాహనాలు వెళ్లడంతో కొంగారెడ్డి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ముందే కొంగారెడ్డిపల్లి వద్ద ఇరుకు రోడ్లు కావడంతో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. గాంధీ విగ్రహం నుంచి ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వరకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు కరువయ్యారు. కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో పరీక్షా కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించాం. ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలను సజావుగా నిర్వహించేందుకు పలు బృందాలు విస్తృతంగా జిల్లాలో పర్యటించడం జరిగింది. – సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈవో, చిత్తూరు -
ముసుగు దొంగల హల్చల్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ముసుగు ధరించిన నలుగురు దొంగలు దుర్గానగర్ కాలనీలో హల్చల్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత దుర్గానగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ముఖాలకు మంకీ క్యాప్, ముసుగులు ధరించి కాలనీలో సంచరించారు. ఓ ఇంటికి తాళం వేసి ఉండగా అక్కడ చోరీ చేయడానికి ప్రయత్నించారు. స్థానికులు కేకలు వేయడంతో దొంగల వద్ద ఉన్న క్యాటర్బాల్ (పిచ్చుకల్ని కొట్టే ఉండేలు)తో రాళ్లు పెట్టుకుని స్థానికులపై విసిరారు.ఈ నిందితులంతా హిందీలో మాట్లాడినట్లు, ఆయుధాలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటికే పోలీసు వాహనం గస్తీలో ఉండటంతో దొంగలు పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ దృశ్యాలన్నీ ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయి.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడైనా దొంగల సంచారం తెలిస్తే, పోలీసుల సాయం తీసుకోవాలని.. వెంటనే డయల్ 100, 112 నంబర్లతో పాటు వన్టౌన్ 9440796705, 9440796707, టూటౌన్ 9440796706, 9491074517 నంబర్లకు సమాచారం ఇవ్వాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. -
టీడీపీ ఎంపీటీసీ రాజీనామా
పలమనేరు: పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి–2 ఎంపీటీసీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు స్థానిక ఎంపీడీఓ ఖాదర్బాషాకు తన రాజీనామా లేఖను శనివారం అందజేశారు. కూటమి రాజకీయాలు నచ్చక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తాను పదవికి రాజీ నామా చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పంచాయతీలో జరుగుతున్న కొన్ని సంఘటనలే రాజీనామాకు కారణమని తెలుస్తోంది. నేటి సమాజానికి భారతీయ జ్ఞాన పరంపర అందాలి తిరుపతి సిటీ : నేటి ఆధునిక సమాజానికి భారతీయ జ్ఞాన పరంపర అందించాలని, ఇందులో అధ్యాపకుల పాత్ర కీలకమని మహిళా వర్సిటీ వీసీ ఆచార్య ఉమ, జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఎస్వీయూ మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (ఎంఎంటీటీసీ)లో యూజీసీ సహకారంతో భారతీయ జ్ఞాన పరంపర – సమాజ పురోగతి అనే అంశంపై వారం రోజులుగా చేపట్టిన శిక్షణ శనివారం ముగిసింది. వారు మాట్లాడుతూ మన ప్రాచీన సంప్రదాయాలైన ఆయుర్వేదం, నీటి సంరక్షణ, పంటల సాగు, గురుకుల విద్య, సాంకేతిక స్థితి, ప్రాచీన విజ్ఞానం వంటివి ఆధునిక సమాజానికి అనుసంధానించాలన్నారు. అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు అధ్యాపకులకు ఈ శిక్షణ కార్యక్రమం ప్రధానమైందన్నారు. యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనోల్ ఆండ్రే మాట్లాడుతూ ప్రాచీన భారత జ్ఞాన పరంపర పరిరక్షణ ఆధునిక సమాజంలో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా శిక్షణ చేపట్టిందన్నారు. ఈ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 100 మంది అధ్యాపకులు శిక్షణ తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 52,731 మంది స్వామిని దర్శించుకున్నారు. 17,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. -
మనవడిని చంపేశారు.. మనవరాలినైనా అప్పగించండి
● గ్రామస్తులతో కలిసి రోడ్డెక్కిన ఓ కుటుంబం కార్వేటినగరం : మనవడిని చంపేశారు.. కనీసం తన మనవరాలినైనా మాకు అప్పగించాలని కొల్లాగుంట దళితవాడకు చెందిన కిరణ్ కుటుంబ సభ్యులు శనివారం రోడ్డెక్కారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... కొల్లాగుంట దళితవాడకు చెందిన కిరణ్ తమిళనాడులోని పల్లిపట్టు గ్రామానికి చెందిన నిషా కలసి పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి సుస్మిత(8), మోటు(6) ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అయితే నెల రోజుల కిందట ఇద్దరి పిల్లలతో కలసి నిషా మేల్మరవతూరు ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. దీంతో భార్య కావాలని పెద్దల సాయంతో ఎంత ప్రయత్నించినా ఆమె తిరిగీ రాలేదు. కాగా శనివారం కుమారుడు మోటు మృతి చెందినట్లు ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా తెలియ జేయడంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, మా మనవడిని కావాలని వాళ్లే చంపేశారని, అదే విధంగా తన మనవరాలు తమపై బెంగపెట్టుకుని ముఖం వాచిపోయి అనారోగ్యానికి గురైందని , మనవరాలినైనా తమకు అప్పగించాలని రోదిస్తూ గ్రామస్తులతో కలిసి కొల్లాగుంట దళితవాడ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై రాళ్లు, చెట్ల కొమ్మలను అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతికి కారకులైన వారిని శిక్షించాలని భీష్మించి కూర్చున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
హామీలు నెరవేర్చలేక కేసులు
పలమనేరు : అధికారం ఉంది కదా అని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు పెడుతున్న తప్పుడు కేసులను ప్రజలు గమనిస్తున్నారని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఆ మేరకు స్థానిక పీఎస్లో షరతులతో కూడిన బెయిల్ైపె శనివారం ఆయన సంతకం చేసి పట్టణంలోని వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎస్పీ పేరిట నకిలీ ఫేస్బుక్ చిత్తూరు అర్బన్ : సైబర్ మోసగాళ్లు సామాన్యులనే కాదు.. ఐపీఎస్ అధికారులనూ వదలడంలేదు. ఇప్పటి వరకు ఫేస్బుక్ (ఎఫ్బీ)లో పలువురి నకిలీ ఐడీల ద్వారా ఒరిజినల్ ఫొటోలు పెట్టి ఖాతా ప్రారంభించడం, ఆపై డబ్బులు వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం. విషయం తెలుసుకున్న అసలు వ్యక్తి, తన ఖాతా హ్యాక్ అయిందని, ఎవరూ డబ్బులు పంపొద్దని మెసేజ్లు పెట్టేవాళ్లు. ఎఫ్బీ అకౌంట్ ఉన్న దాదాపు 90 శాతం మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. దీన్ని డిలీట్ చేయడానికి కొందరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా ప్రయోజనం కనిపించదు. కానీ ప్రస్తుతం చిత్తూరు ఎస్పీ మణికంఠ పేరిట ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ హల్చల్ చేస్తోంది. వి.ఎన్.మణికంఠ చందోలు ఐపీఎస్ పేరిట ఉన్న ఈ ఖాతా దాదాపు 2 వేల మంది ఫాలోవర్స్ను కలిగి ఉంది. చాలామంది ఎఫ్బీ వాడేవాళ్లకు ఎస్పీ పేరిట ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తున్నాయి. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎస్పీ ఫొటో కనిపిస్తుండడంతో అందరూ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసేస్తున్నారు. తీరా ఇందులో యువతుల ఫొటోలు, మద్యం బాటిళ్లు, వంటలు ఇలా సంబంధంలేని పోస్టులు దర్శనమిస్తున్నాయి. కొద్దిమంది మాత్రమే దీన్ని చెక్చేసుకున్న తరువాత.. ఇది ఎస్పీ ఒరిజినల్ ఖాతా కాదని అన్–ఫ్రెండ్ చేస్తున్నారు. చిత్తూరు సైబర్ పోలీసులు ఇలాంటి నిందితులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని టెకీలు కోరుతున్నారు. -
ఆయన హెచ్ఎం.. ఆమె పెత్తనం
ఆయన హెచ్ఎం.. ఆరోగ్యం సరిగా ఉండదు.. తోడుగా స్కూల్కు భార్యను తెచ్చుకుంటాడు. మొదట్లో తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిన ఆమె.. మెల్లగా అజమాయిషీ చేయడం మొదలెట్టింది. ఆపై అన్నిటా పెత్తనం చేస్తూ వస్తోంది. అయితే ఏమైనా అనాలంటే హెచ్ఎం భార్య. ఏమీ అనలేని పరిస్థితి.. దీంతో తోటి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. ఈ తంతు పలమనేరు పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. పలమనేరు: సాధారణంగా క్వాలిఫైడ్ ఉన్న వారే హైస్కూల్ హెచ్ఎంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ ఆ హెచ్ఎం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన భార్య రంగంలోకి దిగారు. భర్తకు సాయంగా స్కూల్కు వస్తున్న ఆమె క్రమక్రమంగా బడిలో పెత్తనం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు స్కూల్ మొత్తం ఆమె కంట్రోల్లోకి తీసుకోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్న సంఘటన పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ స్కూల్లో 3వ తరగతి నుంచి పదో తరగతి దాకా 724 మంది పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ఇదే పాఠశాలలో పీఈటీగా పనిచేసి ప్రమోషన్ పొంది ఇక్కడే హెచ్ఎంగా షంషీర్ ఏడాది కిందట బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇతని అనారోగ్య కారణాలతో భార్య స్కూల్కు తోడుగా రావడం మొదలు పెట్టింది. గత కొన్ని నెలలుగా స్కూల్లో హెచ్ఎం చేయాల్సిన కొన్ని పనులను ఈమె చేయడంతో పాటు తోటి సిబ్బందిపై అజమాయిషీ చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది. మధ్యాహ్న భోజనానికి బియ్యం, సరుకులు ఇవ్వడం, వారిపై పెత్తనం చెలాయించడం, పిల్లలను సైతం బెదిరించడం, టీచర్లాగా కుర్చీల్లో కూర్చోవడం లాంటి పనులు అక్కడ ఉన్న టీచర్లకు సైతం సహించలేదు. కానీ హెచ్ఎం భార్య గనుక వారు కూడా ఏమీ చేయలేక మనకెందుకులే అని పట్టించుకోలేదని తెలిసింది. మధ్యాహ్న భోజనం నుంచి అన్నింటా ఆమె చెప్పిందే వినాలి స్కూల్ హెచ్ఎం భార్య కావడంతో అంతటా పెత్తనం ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న టీచర్లు, పిల్లలు పలమనేరులోని ప్రభుత్వ స్కూల్లో పూర్తిగా గాడితప్పిన పాలన మద్యం బాటిళ్లు ఎలా వస్తున్నాయబ్బా ? హెచ్ఎం భార్య విషయమై ఇప్పటికే ఎంఈఓ లీలాకుమారి దృష్టికెళ్లినా హైస్కూల్ హెచ్ఎంలపై తమకు సంబంధం లేదని పట్టించుకోలేదని తెలిసింది. ఇలా ఉండగా ఈ మధ్య బడిలోని బాలుర టాయ్లెట్లలో దాచిపెట్టిన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో అసలు బడిలో ఏం జరుగుతోంది ? ఎవరి కోసం మద్యం బాటిళ్లు తెచ్చారు ? వీటిని లోపలకు ఎవరు తీసుకొస్తున్నారని తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్రెడ్డిని వివరణ కోరగా తాను తనిఖీ చేసి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
● హంద్రీ నీవా లైనింగ్ గుత్తేదారుపై ప్రేమతో నిధుల కేటాయింపు ● కాంట్రాక్టర్ల మేలు కోసమే బడ్జెట్ పెంచి పక్కా ప్లాన్
పలమనేరు : హంద్రీనీవా కాలువలో సాగునీరంది పచ్చటి పంటల కోసం ఇక్కడి రైతులు ఆశ పడుతుంటే ముందు లైనింగ్ పనులు జరిగి కాంట్రాక్టర్ బాగు పడితే చాలన్నట్టుంది ఈ బడ్జెట్ కేటాయింపులు. 2024–25 బడ్జెట్ (సవరణ)లో హంద్రీనీవా కోసం రూ.1586.14 కోట్లను కేటాయించిన కూటమి ప్రభుత్వం, 2025–26 బడ్జెట్లో మరో రూ.1657 కోట్లను పెంచి మొత్తం రూ.2,243.59 కోట్లుగా చూపింది. అయితే ఈ పెంచిన బడ్జెట్ ఇప్పుడు కాలువ లైనింగ్ పనులు దక్కించుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు మేలు కోసమేనని అర్థమవుతోంది. దీంతో ఇక్కడి రైతుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలోని పడమటి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇక్కడి ప్రజలకు కల్పతరువనుకున్న హంద్రీ నీవా కాలువలో కృష్ణా జలాలు భవిష్యత్తులో రానట్టేనని తెలుస్తోంది. కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్–1 తీర్పు అమల్లో ఉన్నంత కాలం కృష్ణాలోని 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ వాడుకొని ఆపై మిగులు జలాలు మాత్రమే హంద్రీ నీవా కాలువకు నీటిని విడుదల చేస్తామని బ్రిజేష్ కుమార్ ట్రిబునల్కు కూటమి ప్రభుత్వం సృష్టంగా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవాకు నీరు వచ్చే అవకాశమే లేదు. ప్రధాన కాలువకే నీరు రాకుంటే ఇందులో అంతర్భాగమైన పుంగనూరు ఉప కాలువ, కుప్పం ఉప కాలువలు అలంకార ప్రాయంగా మారడం ఖాయమనే మాట రైతుల్లో నెలకొంది. పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులకే రూ.642 కోట్లు హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచి కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 145 నుంచి 282 క్యూసెక్కులకు పెంచే లక్ష్యంగా కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం రూ.480.22 కోట్లకు ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇక కుప్పం బ్రాంచి కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులు రూ.161.78 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ రెండు చోట్ల పనులు చేస్తున్న కంపెనీలకే ఈ బడ్జెట్ నుంచి రూ.642 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ రూ.3,243 కోట్లలో కరెంట్ బకాయిలకు రూ.1000 కోట్లు పోతే మిగిలే రూ.2,243 కోట్లలో లైనింగ్ పనులకు రూ.642 కోట్లు పోగా రూ.1601 కోట్లు. దీంతో ఉమ్మడి జిల్లాకే రెండు వేల కోట్ల అవసరం ఉండగా పెండింగ్లోని పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం చేస్తేనే అడవిపల్లి, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణం జరగని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రైతులకు సాగునీరు అందిచకపోగా కాంట్రాక్ట్ కంపెనీలకు మేలు జరిగిన బడ్జెట్పై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కమనీయం..
● తరలివచ్చిన భక్తులు ● ఒక్కటైన జంటలుశ్రీకాళహస్తి: ఆదిదంపతుల కల్యాణం భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. శనివారం తెల్లవారు జామున సుమారు 4.30గంటల సమయంలో జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరునిచే మాంగల్యధారణ జరిగింది. ఇదే శుభఘడియల్లో ఆదిదంపతుల సమక్షంలో నూత న జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అంతకుముందు శుక్రవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అదిష్టింపజేసి పెండ్లిమండపం వద్దకు వేంచేశారు. పెండ్లి మండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకోగా.. మధ్యలో పార్వతీదేవి అలకబూనడంతో చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం చేయడంతో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సంతృప్తి చెంది పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం వేదపండితులు ఆదిదంపతుల కల్యాణ ఘటన్ని పూర్తిచేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఒక్కటైన నూతన జంటలు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. జ్ఞానప్రసూనాంబ దేవికి మాంగల్యధారణ చేసిన సమయంలోనే ఈ జంటలు కూడా మాంగల్యధారణ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఒక్కటయ్యారు. నేడు గిరిప్రదక్షిణ శనివారం ఉదయం కల్యాణోత్సవం ముగిసింది. కల్యాణానికి వచ్చిన రుషులు, దేవతలను సాగనంపేందుకు శివయ్య ఆదివారం విల్లంబులు ధరించి వారివారి స్థావరాలకు చేర్చనున్నారు. దీన్నే రుషిరాత్రి అని కూడా అంటారు. గిరిప్రదక్షిణ తరువాత పట్టణానికి తిరిగి వచ్చే స్వామి, అమ్మవార్లకు భక్తులు వేలాది ఎదురుసేవ మండపం వద్దకు చేరుకుని స్వాగతం పలకడం ఆనవాయితీ. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రుద్రాక్ష చప్పరాలపై శివయ్య వైభవం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి రుద్రాక్ష చప్పరాపై పురవీధుల్లో ఊరేగారు. ఆదిదంపతుల కల్యాణం ముగిసిన తర్వాత ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11గంటల సమయంలో వేదోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్లును రుద్రాక్ష చప్పరాలపై అధిష్టింపేజేసి పురవీధుల్లో ఊరేగించారు. ఆగమోక్తం నటరాజస్వామి కల్యాణం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి సభాపతి కల్యాణం ఆగమోక్తంగా సాగింది. నటరాజ స్వామి, శివకామ సుందరి వివాహాన్ని పురోహితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శివకామసుందరి సమేత నటరాజస్వామి పురవీధుల్లో ఊరేగారు.బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటలకు : కై లాసగిరి ప్రదక్షిణ వాహన సేవలు ఉదయం: బనాత అంబారి వాహనసేవ సాయంత్రం: అశ్వం – సింహ వాహన సేవ ఉభయదాతలు: బియ్యపు కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం శ్రీవాణిరెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి (శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు) -
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు కరువు ● కోర్సులు ఫుల్.. అధ్యాపకులు నిల్ ● ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ● నాక్ గ్రేడ్లున్నా.. పట్టించుకోని వైనం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య ఎంతో కీలకం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా విద్యార్థుల ఉజ్వల భ విష్యత్తు అంధకారం నెలకొంటోది. జిల్లా వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు నాక్ ఉత్తమ గ్రేడ్లను సాధిస్తున్నాయి. కానీ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల వైపు విద్యార్థులు ఆస్తకి కనబరుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ పాలనలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దీటుగా ప్రవేశాలు కల్పిస్తూ ఫ్యూచర్ రెడీనెస్ కాన్సెప్ట్ తో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్ది కొత్త ఒరవడిని సృష్టించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెనుకబడిపోతున్నాయి. అయిదేళ్లకు ముందు అందరికీ చిన్నచూపే.. వైఎస్సార్సీపీ సర్కారు అధికారంలోకి రాకముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలంటే అందరికీ చిన్నచూపే. పాతికేళ్ల కిందట ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి దైన్యస్థితికి చేరాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డిగ్రీ కళాశాలల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భవనాల మరమ్మతులు, సరైన సౌకర్యాలు లేని తరగతి గదులు, పనికిరాని లేబొరేటరీలు , తాగునీటి సమస్యలు, ముఖ్యమైన బోధనా అధ్యాపకుల కొరత వేధిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లే దిక్కు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల తోనే బోధన సాగిస్తున్నారు. ఇదే అదునుగా మార్చుకున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నిష్ణాతులైన అధ్యాపకులను నియమించుకుంటున్నాయి. క్రమేణా ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటున్నారు. దీంతో ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. రెగ్యులర్ పోస్టు లు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. ఉద్యోగోన్నతులు లేకపోవడం, కొత్త నియామకాలు లేకపోవడంతో ఏటా కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేధిస్తున్న అధ్యాపకుల కొరత.. ప్రభుత్వ కళాశాలపై చిన్నచూపు తగదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలపై రా ష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భర్తీ కాని పోస్టులను కూటమి ప్రభు త్వం వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలి. ఎన్నో ఆశలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉంది. ఈ కళాశాలలో అధిక సంఖ్యలో అధ్యాపకుల కొరత ఉంది. కూటమి ప్రభు త్వం విద్యాభివృద్ధికి ఏం చేస్తోందో తెలియజేయాలి. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి జిల్లా వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. అయితే వీటిలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులను వెంటనే నియమించాలి. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోతే పేద విద్యార్థులు ఎలా విద్యను కొనసాగించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో క్వాలిఫైడ్ లెక్చరర్లు ఉండడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ వైపు మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి. – పవన్, ఏబీవీపీ సంఘం చిత్తూరు బాగ్ కన్వీనర్ జిల్లా సమాచారం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 18 నాక్ ఏ ప్లస్ డిగ్రీ కళాశాలలు: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఉండాల్సిన రెగ్యులర్ అధ్యాపకులు: 1678 విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు: 748 భర్తీ చేయాల్సిన రెగ్యులర్ పోస్టులు: 930 విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు: 15,300జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీలు చేయకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఇటీవల నాక్ ఏ గ్రేడ్ వచ్చిన ఎంతో చరిత్ర కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 65 మంది రెగ్యులర్ అధ్యాపకులకు ప్రస్తు తం 18 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తు న్నారు. మిగిలిన 47 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉంది. అదే విఽ దంగా నాన్న్టీచింగ్ స్టాఫ్ 53 మందికి గా ను 23 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 30 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 35 మంది రెగ్యులర్ అధ్యాపకులకు గాను 16 మంది విధు లు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 29 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ ప్లస్ హోదా ఉంది. ఈ కళాశాలలో 34 మంది అధ్యాపకులకు గాను 21 మంది రెగ్యులర్గా ఉన్నారు. మిగిలిన 13 మంది కాంట్రాక్టు, గెస్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీ ప్లస్ ప్లస్ నాక్ హోదా ఉంది. ఈ కళాశాలలో 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా 6 మంది మాత్రమే రెగ్యులర్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
సాక్షి, చిత్తూరు: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ(ACB) అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లంచావతారమెత్తిన అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్ల కోసం భారీగా డిమాండ్ తలెత్తింది. అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లించినట్టు అప్పట్లో దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏపనికి వెళ్లినా మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! ‘చంద్రగిరి(Chandragiri) పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వర య్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ దినేష్ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు చంద్రగిరి మేజర్ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
టీడీపీ నేతల లాటరీ గుట్టు రట్టు
● లాటరీ డెన్పై పోలీసుల దాడి ● పన్నెండు మంది పట్టివేత పలమనేరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలమనేరు అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ సాగే లాటరీ వ్యాపారాలను ఓ యువనేత లీడ్ చేస్తూ పేదల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నాడంటూ గతనెల సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై పోలీసు నిఘా విభాగాలు కన్ను పెట్టాయి. ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణంలోని మదనపల్లి రోడ్డు గుండుబావి సమీపంలో లాటరీ ఆఫీస్నే నిర్వహిస్తున్న నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 20వ వార్డు టీడీపీ ఇన్చార్జి లోకనాథ ఆచారితోపాటు అతని తండ్రి సుబ్రమణ్యం ఆచారి, సోదరుడు యుగంధరాచారి, నారాయణస్వామి, శశిధర్, షంషీర్, శివకుమార్, మహ్మద్వాజిద్తోపాటు గంగవరానికి చెందిన మరో నలుగురిని అరెస్ట్ చేసి.. వీరినుంచి రూ.8,500 , సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు తమిళనాడు, కేరళ తదితర అంతర్రాష్ట్ర లాటరీ నిర్వాహకులతో సంబంధాలున్నట్లు విమర్శలున్నాయి. కాగా టీడీపీ నేతల ప్రమేయం ఉన్నందున ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదనే వాదన వినిపిస్తోంది. -
● బడ్జెట్లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమి లేదు ● అన్ని వర్గాలను దగా చేసిన కూటమి సర్కారు ● జిల్లా అభివృద్ధికి నిధులు శూన్యం ● ఎన్నికల హామీలకు ఎగనామం ● ప్రభుత్వ తీరుపై జిల్లా వాసుల అసంతృప్తి
జిల్లా సమాచారం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు 04 జిల్లాలోని మండలాలు 32 జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822 జిల్లాలోని గ్రామ పంచాయతీలు 697 జిల్లా జనాభా 18.73 లక్షలు పురుషులు 9.40 లక్షలు మహిళలు 9.33 లక్షలు రూరల్ జనాభా 15.04 లక్షలు అర్బన్ జనాభా 3.69 లక్షలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో కరపత్రాలు తీసుకుని ఇంటింటికి వెళ్లారు. అధికారంలోకి వస్తే అంత చేస్తాం..ఇంత చేస్తాం అని మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాకా ప్రజలనే మరిచిపోయారు. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందినప్పటికీ గతంలోనూ...ప్రస్తుతం మేలు చేసిందేమీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఆసుపత్రుల్లో మందులు లేవు. సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన భోజనం, నాడు–నేడు పనులు నిలిపివేత ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు విలయతాండవం చేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ఏదైనా మేలు కలుగుతుందని ఆశించారు. ఎప్పటిలాగే అరచేతిలో వైకుంఠం చూపి బడ్జెట్ను మమ అనిపించారని జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : కూటమి టీడీపీ అధికారంలోకి వ చ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతోంది. చిత్తూరు జిల్లా నుంచి కూటమి ప్రభుత్వంలో (సీఎం చంద్రబాబు)తో సహా 6 గురు ఎమ్మెల్యేలున్నారు. అయితే శుక్రవారం రాష్ట్ర బడ్జెట్లో చిత్తూరు జిల్లా అభివృద్ధికి, సంక్షేమ ప థకాల అమలుకు మేలు చేకూరుతుందని అన్ని వ ర్గాలు ఆశతో ఎదురుచూశారు. చివరికి వారి ఆశలన్నీ అడియాశలుగా మారాయి. కూటమి ప్రభుత్వం మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. తల్లికి వందనంలో కోతలే... ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టి మోసం చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకంలో నిధులకు కోత విధించారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లకు పైగా అవసరం ఉంటే బడ్జెట్లో రూ.8,276 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగులకు అన్యాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేలు చేస్తుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులు ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే తొమ్మిది నెలలు కావొస్తున్నా నిరుద్యోగులకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,78,869 మంది నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మరోసారి మోసగించింది. సున్నా వడ్డీ రుణాలకు సున్నం జిల్లా వ్యాప్తంగా 9193 డ్వాక్రా సంఘాలున్నాయి. డ్వాక్రా మహిళలకు ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం కుచ్చు టోపీ పెట్టింది. ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో జిల్లాలోని డ్వాక్రా మహిళలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. రైతుకు రూ.20 వేలు పాయే.. జిల్లా వ్యాప్తంగా విస్తీర్ణం 2,56,402 హెక్టార్లు ఉంది. ఇందులో సాగు విస్తీర్ణం 41,796 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,18,386 మంది రైతులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే తొమ్మిది నెలల తర్వాత ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి అరకొర నిధులే కేటాయించింది. బాబు నిజస్వరూపం బయటపడింది బడ్జెట్తో సీఎం బాబు నైజం బయటపడింది. మహిళలను నిలువునా మోసం చేశారు. నీకు రూ.1,500 అంటూ గొ ప్పగా ప్రచారం చేశారు. కానీ ఈ హామీకి బడ్జెట్ లో అవకాశం లేదు. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ అంటూ దగా చేశారు. రెండేళ్లకు కలిపి రూ.21 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ మొక్కుబడిగా కేటాయించి వారి నడ్డి విరిచారు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి విద్యాభివృద్ధిపై చిన్నచూపు ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిపై చిన్నచూపు చూడటం తగదు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పింది. అయితే ఆ అంశాన్ని పట్టించుకోకుండా 9.86 శాతం నిధులను మాత్ర మే కేటాయించింది. నాడు– నేడు పేజ్– 2లో పూర్తి చేయని తరగతి గదులు అనేకం ఉన్నాయి. వీటి ప్రస్తావన బడ్జెట్లో చర్చించకపోవడం బాధాకరం. – జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పీఆర్సీ అమలుకు కేటాయింపులేవీ.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మేలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ అమలుకు కేటాయింపులే చేయలేదు. బడ్జెట్లో పీఆర్సీ, ఐఆర్ అమలుకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. సీపీఎస్, జీపీఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో ఎటువంటి ప్రకటన చేయలేదు. – రెడ్డిశేఖర్రెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ట్రెజరర్ -
‘పచ్చ’ గుప్పిట్లో ఫారెస్టు భూములు
● యథేచ్ఛగా 70 ఎకరాలు ఆక్రమణ వడమాలపేట (విజయపురం) : మండలంలోని బాలినాయుడు కండ్రిగ పంచాయతీ బంగారెడ్డి కండ్రిగ సమీపంలోని అటవీ ప్రాంతంలోని గుట్ట పొరంబోకుతో పాటు రిజర్వు ఫారెస్టు భూములను స్థాని క టీడీపీకి చెందిన ఓ నేత యథేచ్ఛగా ఆక్ర మించుకొని మామిడి తోట సాగు చేసు కుంటున్నాడు. గతంలో వీటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆ పచ్చ నేతపై కే సు నమోదు చేసి అరెస్టు వారెంట్ ఇచ్చా రు. అరెస్ట్ వారెంట్ ఉన్నా అధికారులు చూసీ చూడన ట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలు మితి మీరిపోవడం సుమారు 70 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేసి ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఎస్టీ కాలనీ వాసులు మీడియా ముందుకు వ చ్చారు. జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఎకరాలకు ఎకరాలు అటవీ భూముల ను ఆక్రమించుకోవడమే కాక ఎస్టీలకు చెందిన శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్ట పొరంబోకు స్ధలాన్ని కబ్జా చేసి ఇష్టారాజ్యంగా పంచు కుంటున్నారని తెలిపారు. ఈ భూమి ఎకరం రూ.కోటి పలుకుతుందన్నారు. 30 కుటుంబాల ఎస్టీలకు సెంటు భూమి కూడా లేదని, అయితే పెద్ద రైతులు ఎకరాలకు ఎకరాలుగా భూములు ఆక్రమించుకొంటున్నారని వా పోయారు. ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని తమకు జీవనోపాధి నిమిత్తం పట్టాలివ్వాలని ఎస్టీ కా లనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలను అ డ్డుకోకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే మీడియాకు సమాచారం అందించిన విషయం తెలియడంతో పచ్చనేత ఎస్టీ కాలనీ వాసులపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. -
కోతల పింఛన్
గజ వాహనంపై మల్లన్న బంగారుపాళెం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు గజవాహనంపై దర్శనమిచ్చారు.కొత్త పింఛన్ రాక పాయే.. ఉన్నవి ఊడిపాయే ! ● జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు ● వేల పింఛన్లు తొలగించిన కూటమి ప్రభుత్వం ● నలుగురికి పింఛన్లు ఇచ్చేందుకు రూ.40 లక్షలకు పైగా ఖర్చు ● నేడు జీడీ నెల్లూరు పర్యటనకు రానున్న సీఎం చంద్రబాబు●నేడు సీఎం రాక జీడీ నెల్లూరు: పింఛన్ల పంపిణీకి శనివారం జీడీ నెల్లూరుకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో కలెక్టర్ సుమిత్కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : సూపర్ సిక్స్ హామీలిచ్చారు.. ఇంకా వాటిని ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్లలో కోత విధిస్తూనే ఉన్నారు. జిల్లాలో ఏళ్ల తరబడి ప్రతినెలా ఠంఛన్గా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారులకు ‘మీ పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైంది’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేసి కోతల ప్రక్రియ చేపట్టారు. పింఛన్దారులకు పార్టీల రంగు పులిమి తొలగింపు చేపట్టారు. 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాల తరహాలోనే ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేస్తున్నారు. కూటమి నేతల జోక్యం టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి ప్రభుత్వం జులైలో తొలిసారి పింఛన్లు పంపిణీ చేసింది. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కొనసాగినా, ప్రతి చోటా పంపిణీ మొత్తం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలోనూ 2014–19 మధ్య వృద్ధులు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల పంపిణీలో ప్రతి అంశంలోనూ అప్పటి అధికార టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం విపరీతంగా కొనసాగిన విషయం తెలిసిందే. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు మొదలు, పంపిణీలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి జోక్యం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్తి స్థాయిలో పథకం అమలు కొనసాగిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల పరిస్థితికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తుండడం గమనార్హం. మరికొన్ని ప్రాంతాల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతో పింఛను డబ్బు ఇవ్వకుండా నిలిపివేశారు. నలుగురికి సీఎం చేతుల మీదుగా పింఛన్లు.. జిల్లాలోని గంగాధర నెల్లూరులో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన సాగనుంది. మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 12.40 గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అధికారులు ముందస్తుగా ఎంపిక చేసిన నలుగురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా పింఛన్లు అందజేయనున్నారు. నలుగురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసి జిల్లా పర్యటనకు రావడం అవసరమా అని పలువురు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ఒకేసారి లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ నగదు జమ చేశారని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కోసం ప్రతి నెలా నలుగురికి ఆయన చేతుల మీదుగా పింఛన్లు అందిస్తున్నారని జిల్లావాసులు వెల్లడిస్తున్నారు. ఎన్సీడీ తప్పుల తడకపై విచారణ చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఎన్సీడీ తప్పుల తడకపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘సాక్షి’ దినపత్రికలో బతికుండగానే మృతుల జాబితాలోకి అనే శీర్షికన ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంలో విచారణకు దిగారు. బాధితుడి ఇంటి వద్దకు ఆశా కార్యకర్తను పంపారు. వారు బతికి ఉన్నారా..అనే విషయంపై ఆరా తీశారు. తప్పు జరిగిందని.. ఆ తప్పు మాకు ఎలా జరిగిందో తెలియదని తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఆ సర్వేలో జరిగిన లోటుపాట్లను జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరు సిబ్బందికి తాఖీదులు ఇచ్చారు. గుడుపల్లి ప్రిన్సిపల్కు షోకాజ్ నోటీసు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గుడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణానాయుడుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్మీడియట్ డీవీఈవో సయ్యద్ మౌలా ప్రిన్సిపల్కు నోటీసులు పంపారు. గుడిపాల ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధు లు నిర్వహిస్తున్న రామకృష్ణానాయుడు పరీక్ష ల విధుల పట్ల అలసత్వం వహించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన కార్యాలయ మెటీరియల్ మామి డి తోటలో లభ్యం అయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వ్యాపించింది. ఈ ఘటన పై ప్రిన్సిపల్కు షోకాజ్ నోటీసు జారీచేసినట్లు డీవీఈవో పేర్కొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం.. ఆర్డీ విచారణ పుత్తూరు : అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్ట 2021 మే 18వ తేదీన కుంగింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ పుత్తూరు ప్రజలు భయాందోళన చెందారు. ఈ సంఘటన సమయంలో అనారోగ్యంతో చైన్నె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ నాటి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జిల్లా అధికారులను అప్రమత్తం చేసి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. దీంతో పుత్తూరు ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం ఆనాటి మరమ్మతు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆర్డీని విచారణకు ఆదేశించారు. దీంతో అనంతపురం రీజనల్ డైరెక్టర్ పి.విశ్వనాథ్ శుక్రవారం పుత్తూరు మున్సిపాలిటీకి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఇదివరకే ఆడిట్ జరిగిందని, అయినా పై అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నామని, ఏదైనా జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరతామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా బయటికే! ● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ అధికారులు పకడ్బందీ ఏ ర్పాట్లు చేపట్టారు. మార్చి1న మొదటి సంవత్సరం విద్యార్థులకు, 3న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. జిల్లాకు చేరిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్స్టేషన్లలో భద్రపరిచారు. మొత్తం 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 30,652 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే హాల్టికెట్లు చేరాయి. రోజూ ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 8 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షల సమయంలో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఎవరైనా 08572–293867 నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారు అధికార నందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారు కామధేనువుపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. నేడు సభాపతి కల్యాణం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం సభాపతి కల్యాణం నిర్వహించనున్నారు. నటరాజస్వామికి శివకామి సుందరితో కల్యాణం నిర్వహించనున్నారు. సభాపతి కల్యాణం జరిగే రాత్రిని ఆనందరాత్రిగా వ్యవహరిస్తారు. న్యూస్రీల్టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తగ్గుతున్న పింఛన్లు 2024 జులై నెలలో 548 ఆగస్టు 634 సెప్టెంబర్ 1,513 అక్టోబర్ 2,819 నవంబర్ 3,670 డిసెంబర్ 3,847 2025 జనవరి 4,598 కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో పేదలు, దివ్యాంగులు పొందుతున్న పింఛన్లలో కోత విధించారు. మరి కొంత మంది పింఛన్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు గ్రీవెన్స్లో అర్జీలు అందజేస్తూనే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు, పింఛన్లను అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం నలుగురు లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చేందుకు ఆర్భాటం చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శనివారం గంగాధర నెల్లూరు పర్యటనకు విచ్చేస్తున్నారు. పింఛన్ ఇవ్వడం లేదు.... నాకు అంగవైకల్యం ఉంది. వృద్ధాప్యం పైబడుతోంది. అంగవైకల్యం వల్ల ఎలాంటి జీవనోపాధి లేదు. 63 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంది. పింఛన్కోసం గత ఏడాది నవంబర్ 28వ తేదీన కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చాను. కొత్త పింఛనుకు ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియడం లేదు. – విమల, దివ్యాంగురాలు, గంగాధర నెల్లూరు మండలం కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నా.. మాది బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి గ్రామం. పూర్తి అంగవైకల్యం ఉండడం వల్ల నడవలేని పరిస్థితి. ఎటువంటి ఉపాధి లేదు. కొత్త పింఛన్కు అవకాశం కల్పిస్తే అప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటున్నా. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా చెప్పడం లేదు. – లక్ష్మప్ప, దివ్యాంగుడు, బైరెడ్డిపల్లి మండలం. అర్హత ఉన్నా ఇవ్వలేదు.. మాది తవణంపల్లి మండలం కుయ్యవంక ఎస్టీ కాలనీ. వృద్ధాప్య పింఛన్ కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నాను. మండల అధికారుల వద్దకు వెళ్లి అడిగితే నోరు మెదపడం లేదు. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్కు అర్జీ ఇచ్చాను. ఇంత వరకు న్యాయం చేయడం లేదు. – గంగులమ్మ, వృద్ధురాలు, తవణంపల్లి మండలం. ఎప్పుడిస్తారు సారూ.. మాది కార్వేటినగరం మండలం సుద్ధగుంట గ్రామం. నా వయస్సు 80 సంవ త్సరాలు. నాకు ఐదు నె లలకు ముందు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఉన్నట్టుండి ఆ పింఛన్ ఇవ్వడం మానేశారు. ఎందుకు ఇవ్వ డం లేదని మండల అధికారుల దగ్గరకు వెళ్లి చాలా సార్లు అడిగాను. వారేమో ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. – మునెమ్మ, వృద్ధురాలు, కార్వేటినగరం -
బతికుండగానే... మృతుల జాబితాలోకి..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వే తప్పుల తడకగా జరుగుతోంది. ఈ సర్వే లక్ష్యాన్ని వైద్య సిబ్బంది నీరుగారుస్తున్నారు. ఇంటింటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చేసేస్తున్నారు. దీంతో సర్వేలో తప్పులు దొర్లుతున్నాయి. బతికున్న వారిని కూడా మృతుల జాబితాలోకి చేర్చారు. చిత్తూరు జిల్లాలో ఈ సర్వే నత్తనడకన జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు కలిసి ఈసర్వే చేయాల్సి ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్ (ఎన్సీడీ) అయిన బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి కేసులను గుర్తించాలి. అయితే వీరంతా ఇంటింటి సర్వేకు వెళ్లకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. కొంతమందికి ఫోన్ చేసి ఓటీపీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక చేసే ఓపికలేని వారు చనిపోయారని, పరి్మనెంట్గా మైగ్రేట్, తాత్కాలిక మైగ్రేట్, సీబ్యాక్ సర్వే జాబితాలోకి చేరుస్తున్నారు. తాజాగా చిత్తూరులోని సత్యనారాయణపురంలో నివాసముంటున్న కటికపల్లి నారాయణ స్వామి, కటిక పల్లి జ్యోతి బతికుండగానే చనిపోయిన వారి జాబితాలోకి చేరారు. ఇలా ఈ దంపతులే కాదు.. చాలా మందిని చనిపోయిన జాబితాలోకి చేర్చడంతో సర్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిoది. కాగా గత ప్రభుత్వ హయాంలో వైద్య సేవలతో పాటు సర్వేలన్నీ పకడ్బందీగా జరిగేవనీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్యసేవలతోపాటు సర్వేలు కుంటుపడ్డాయని పలువురు విమర్శిస్తున్నారు. -
టీడీపీ కంచుకోటకు బీటలు
● కేవీపీఆర్పేటలో మార్పునకు తొలి అడుగు ● ‘రోజా’కు జననీరా‘జనం’ నగరి : కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయలేమని చేతులెత్తేయడంతో ఓట్లేసిన ప్రజలు విస్తుపోతున్నారు. బాబు చేతిలో మరోసారి మోసపోయామని ప్రజలకు అర్థమవుతోంది. ఆలోచించకుండా మంచి చేసిన ప్రభుత్వాన్ని చేజేతులా వదులుకున్నామే అంటూ ఆవేదనకు లోనవుతున్నారు. దీంతో మున్సిపల్ పరిధిలో టీడీపీకి కంచుకోటగా ఉన్న కేవీపీఆర్ పేట నుంచి అయ్యప్పన్ అనే టీడీపీ నాయకుడు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగనన్న నేతృత్వంలో మాజీమంత్రి ఆర్కే రోజా నాయకత్వాన్ని బలపరిచారు. తమ ప్రాంతంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు మాజీ మంత్రి ఆర్కేరోజాకు ఆహ్వానం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఆమెకు దారి పొడవునా ప్రవాహంలా వచ్చిన జనం డప్పు వాయిద్యాలు, నృత్యాల నడుమ నీరాజనం పలికారు. స్వతాగా జనం కదలివచ్చిన తీరు కూటమి పాలనపై విసుగు చెందారని, మార్పువైపుగా ప్రజలు పయణిస్తున్నారనే విషయం తేటతెల్లం అయింది. అరుణాచలేశ్వరుని దర్శనానంతరం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. జగనన్న నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజాసంక్షేమాన్ని ఆలోచించే పనిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను ప్రలోభాలకు గురిచేసి అనుకున్నది సాధించి ఆపై ప్రజలను నట్టేట వదిలేశారన్నారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ మార్పునకు కేవీపీఆర్ పేటలోనే బీజం పడిందన్నారు. ఆమె వెంట మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు గంగాధరం, బీడీ భాస్కర్, మురుగ, బాబు, ఇంద్రయ్య, మోహన్రాజ్, భూపాలన్, బాలన్, స్థానిక నాయకులు ఈవీ బాలకృష్ణ, ఏజీ భాస్కర్, టీపీ సురేష్, కన్నాయిరం, సంబంధం, తనికాచలమొదలి, భూపతి, షణ్ముగం పాల్గొన్నారు. -
● మధ్యాహ్నం వరకు తెరుచుకోని కార్యాలయం ● తాళం లేక సిబ్బంది పడిగాపులు ● ఆలయ సమస్యలపై వచ్చిన ప్రజలకు నిరాశ
దేవదాయశాఖ కార్యాలయం మూత చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు నగరంలోని జిల్లా దేవదాయశాఖ కార్యాలయానికి గురువారం తాళం పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయ తలుపులు తెరుచుకోలేదు. అంత వరకు కార్యాలయ సిబ్బంది తలుపు వద్దే కునుకు తీశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారు కార్యాలయం ఎప్పుడెప్పుడు తెరస్తారని ఎదురు చూశారు. తీరా విచారిస్తే తాళం సహాయ కమిషనర్ చేతిలో ఉన్నట్లు తెలిసింది. ఆమె క్యాంపునకు వెళ్లిపోవడంతో కార్యాలయ తాళం దూరమైంది. కార్యాలయ తలుపులు తెరుచులేకపోయింది. దీంతో సిబ్బందికి విధులు తప్పింది. ఇక కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు పడిగాపులు పడ్డారు. కుప్పం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కూడా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. గతంలో ఈ కార్యాలయం ఉదయం 9.30 గంటలకు తెరుచుకునేది. ఆ సమయానికి స్వీపర్ కార్యాలయాన్ని శుభ్రం చేసి సిద్ధంగా ఉంచేవారు. అయితే కొత్తగా వచ్చిన సహాయ కమిషనర్ తాళం తీసే..వేసే బాధ్యతలను కూడా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై సహాయ కమిషనర్ చిట్టెమ్మను వివరణ కోరగా..తాను క్యాంపులో ఉన్నానని, త్వరలో కార్యాలయాన్ని తెరుస్తారని బదులిచ్చారు. మహా శివరాత్రికి అందరికి ప్రత్యేక డ్యూటీలు వేశామని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,323 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,460 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.92 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. -
టీచర్ల ఉద్యోగోన్నతులు చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల ఉద్యోగోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు డీఈఓ వరలక్ష్మికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగోన్నతుల జాబితా కసరత్తు పారదర్శకంగా చేపట్టాలన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక ప్రతిభావంతుల టీచర్ల ఉద్యోగోన్నతుల జాబితా విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్రెడ్డి, మోహన్ మాట్లాడుతూ.. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లు జిల్లాలో ఉన్నారన్నారు. వారికి సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేయాలన్నారు. వివిధ సబ్జెక్టుల్లో విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగోన్నతులకు కేటాయించిన పోస్టులు భర్తీ చేయాలన్నారు. పాస్పోర్టు, ఎన్వోసీ తదితర అంశాలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చంద్రన్, డిల్లీబాబు, సుబ్రహ్మణ్యం, ఉమాపతి పాల్గొన్నారు. -
● మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోటిఫికేషన్ జారీచేసిన విద్యాశాఖ అధికారులు ● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ముఖ్యంగా గుర్తించు కోవాల్సినవి.. ● 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.150 ఉంటుంది. ● 6వ తరగతిలో ప్రవేశం పొందే ఎస్సీ, ఎస్టీ కులా లకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్ట్ 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.75 చెల్లించాలి. ● సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో 4, 5 తరగతుల్లో చదివి ప్రమోషన్కు అర్హత పొంది ఉండాలి. ● పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజిర్వేషన్ ప్రాతిపాదికన సీట్లు కేటాయిస్తారు. ● ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో రాయవచ్చు. ● cse.ap.gov.in (లేదా) apms.ap.gov.in వెబ్పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్స్)లలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది. సీటు చాలా విలువైనది.. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకు రావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఈ పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడంతోపాటు విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు కార్పొరేట్ తరహా హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. పూర్తి ఇంగ్లీష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్/జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందడం అంత సులువు కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఎంతో ఖర్చు పెట్టి నా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్య, ఇక్కడ అందుబాటులో ఉండడం పేద పిల్లలకు వరంగా మారింది. జిల్లాలో 7 మోడల్ స్కూల్స్ వివరాలు జిల్లాలో నడిమూరు (కుప్పం మండలం), అగరం గ్రామం (గుడుపల్లి), తుమ్సి (శాంతిపురం), కమ్మనపల్లి (బైరెడ్డిపల్లి), ఏఎన్కుంట (పుంగనూరు), రామకుప్పం, రొంపిచెర్ల మండలాల్లో మొత్తం 7 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒక్కో చోట 100 సీట్లు చొప్పున మొత్తం 700 మందిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఇలా.. 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 24వ తేదీ నుంచి నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో పరీక్ష ఫీజు పేమెంట్స్కు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించారు. ఆన్లైన్ పేమెంట్స్కు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది. గతేడాది మాదిరిగానే 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్లిస్టు, అదేరోజు ఎంపిక జాబితాను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సదుపాయాలు ఇలా.. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సువిశాల ప్రాంగణాలతో రెండంతస్తుల భవనాలను కలిగి ఉన్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య. బయాలజీ, పిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తిస్థా యి పరికరాలతో వేర్వేరుగా ల్యాబ్లు ఉన్నాయి. అత్యాధునిక లాంగ్వేజ్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి. నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్ఎంఎంఎస్, ఐఎంవో, ఐఎస్వో వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ స్పోకెన్న్ ఇంగ్లీష్, చేతిరాతపై ప్రత్యేక శ్రద్ధ. అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం. ఎల్సీడీ ప్రొజెక్టర్తో విద్యా బోధన, డిజిటల్ విద్యా బోధనకు అవకాశం. 9వ తరగతి నుంచి అకడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు. మోడల్ స్కూళ్లకు సమీప గ్రామాల అనుసంధానంతో కూడిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు. పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మోడల్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్ స్కూళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేశాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోంది. ఇంజినీరింగ్, మెడిిసిన్ వంటి కోర్సులకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. – వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు జిల్లా -
ఉత్తీర్ణత సర్టిఫికెట్లు తీసుకెళ్లండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులు ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్ష ఉత్తీర్ణత చెందిన సర్టిఫికెట్లను తీసుకోవాలని డీఈఓ వరలక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 03–03–2024 లో ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన టీచర్లు డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు. ఉత్తీర్ణత చెందిన టీచర్లు తప్పనిసరిగా హాల్ టికెట్ జిరాక్సులను తీసుకురావాలని డీఈఓ కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి చిత్తూరు కలెక్టరేట్ : రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఈ మేరకు గురువారం ఆ సంఘం నాయకులు డీఈఓ వరలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ జాబితా 2010 డీఎస్సీ వరకు మాత్రమే నిర్వహించారన్నారు. మిగిలిన డీఎస్సీల రేషనలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో జాబితాలు అప్లోడ్ చేయాలని కోరారు. గతంలో విడుదల చేసిన సీనియారిటీ జాబితాను పునఃసమీక్షించాలన్నారు. మెరిట్ కమ్ రోస్టర్లో సీనియారిటీ జాబితా సిద్ధం చేసి వెంటనే విడుదల చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే ఆమోదించాలన్నారు. అనంతరం ఆపస్ డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం ఇంటర్మీడియట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శరత్చంద్ర, ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజునాథగుప్తా, విజయ్, గౌరవాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మీడియా కన్వీనర్ రాధాకృష్ణ, గౌరవ సలహాదారు ఉమాపతి పాల్గొన్నారు. ఎస్వీయూ దూరవిద్యకు అనుమతులు తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులకు 2024 – 25 సంవత్సరానికి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతులు మంజూరు చేసింది. జనవరిలో యూజీసీ నిపుణుల బృందం వర్సిటీలో మూడు రోజులు పర్యటించింది. అనుమతుల మంజూరుకు సంబంధించిన అర్హతలపై యూజీసీకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అనుమతులు మంజూరు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో వర్సిటీ డీడీఈ విభాగంలో 17 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డీడీఈ కోర్సుల పునరుద్ధరణకు, అనుమతులు రావడానికి కృషి చేసిన వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి వీసీ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. -
క్వారీ తవ్వకాలకు అనుమతించొద్దు
శాంతిపురం : రాతి క్వారీ తవ్వకాలకు అనుమతించవద్దని సి.బండపల్లి, బేవనపల్లి గ్రామాల ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. ముద్దనపల్లి రెవెన్యూ లోని సర్వే నంబర్ 54/పి లోని 4.301 హెక్టార్లలో మె స్సర్స్ బియాండ్ స్కేల్ టెక్పాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తవ్వకాలు జరిపేందుకు గురువారం సి.బండపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి రాజశేఖర్ ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సి.బండపల్లి, బేవనపల్లి గ్రామాల ప్రజలు క్వారీ తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత క్వారీ నుంచి 10 మీటర్లలోపు 500 ఏళ్ల నా టి జొన్న గంగమ్మ ఆలయం ఉందని చెప్పారు. జడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామానికి 500 మీటర్ల లోపు క్వారీ కి అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇంత తక్కువ దూరంలో క్వారీ పేలుళ్లు జరిపితే నివాస గృహాలు, స్కూలు భవనాలు దెబ్బతింటాయని ఆందోళ న వ్యక్తం చేశారు. పంచాయతీకి చెందిన డంపింగ్ యా ర్డు కూడా ఇదే సర్వే నంబర్లో ఉందన్నారు. సమీపంలోని క్వారీలో పేలుడు పదార్థాల వినియోగం కారణంగా పక్కనే ఉన్న శ్యామనకుంట, పెద్దవంక చెరువు, నా యనచెరువులలో నీరు కలుషితం అవుతోందన్నారు. కొత్తగా మరో క్వారీకి ఇక్కడ అనుమతులు ఇస్తే కాలు ష్య ముప్పు మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా క్వారీకి అనుమతులు ఇచ్చేసి, ఇప్పుడు వచ్చి తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆగ్రహంతో వాదనకు దిగారు. దీంతో స్థానికుల అభ్యంతరాలను తాము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ముగించారు. కాగా క్వారీకి అనుమతి పొందిన సంస్థ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి బినామీ సంస్థగా ప్రచారం సాగుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వేడుకోలు ఆందోళన వ్యక్తం చేసిన బండపల్లి, బేవనపల్లి ప్రజలు -
● రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం ● రైతులకు యూరియా కష్టాలు ● మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ ధ్వజం
హామీలు మరిచి.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు కాణిపాకం : బూటకపు మాటలతో కూటమి ప్రభుత్వం రైతులను, అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్కుమార్ ధ్వజమెత్తారు. బంగారుపాళ్యంలో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా దొరకని పరిస్థితి దాపురించిందన్నా రు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో అమ్మకానికి పెట్టడంతో ఆ కాస్త యూరియా బ్లాక్ మార్కెట్కు తరలుతోందన్నారు. బస్తా రూ.226కు విక్రయించాల్సి ఉంటే..రూ.380కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవకు ఎసురు పెట్టి రైతుల కడుపు కొట్టడం సరికాదన్నారు. సూపర్సిక్స్ను పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదని ఖండించారు. పోసానిపై అక్రమంగా కేసు పెట్టడం దారుణమని, ఇలాంటి రౌడీ పాలనకు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, నాయకులు శిరీష్రెడ్డి, పాలాక్షిరెడ్డి, అన్నమలరెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. -
‘వివాదాల’ వైద్యఆరోగ్యం
● డీఎంఅండ్హెచ్ కార్యాలయంలో ఇష్టారాజ్యం ● విధుల కేటాయింపుల్లో రాజకీయం ● సీనియర్లకు అన్యాయం.. జూనియర్లకు అవకాశాలు ● మార్పులు.. చేర్పులపై బహిరంగ విమర్శలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గందరగోళం నెలకొంది. ఇంటిపోరు తార స్థాయికి చేరింది. మానిటరింగ్ విభాగంపై వివక్ష చూపుతున్నారు. కక్ష్య కట్టి ముగ్గురు సీనియర్లను కార్యాలయం నుంచి తప్పించారు. అనుకూలంగా ఉన్న జూనియర్లను తెచ్చుకుంటున్నారు. దీంతో కార్యాలయంలో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెండు నెలల కిందట చిత్తూరు జిల్లా డీఎంఅండ్హెచ్ఓగా పనిచేస్తున్న ప్రభావతి బదిలీ అయ్యారు. ఈ స్థానానికి చంద్రగిరిలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓగా పనిచేస్తున్న సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెకు చేరువయ్యారు. దీంతో కార్యాలయ పెత్తనం ఆ కొందరి చేతుల్లోకి వెళ్లిపోయింది. వాళ్లు ఊ అంటే ఆ జిల్లా స్థాయి అధికారి ఉలిక్కిపడుతున్నారు. వారి చెప్పిందే వేదంగా కార్యాలయాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో ముగ్గురు మానిటరింగ్ అధికారులపై వేటు వేశారు. డాక్టర్ శిరీష, హనుమంతరావు, జానకీరావ్లను కక్ష్య కట్టి కార్యాలయం నుంచి తప్పించారు. వెంటనే వారిని కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని, ఈ స్థానానికి జూనియర్లు అంటే..పూతలపట్టు వైద్యులు ప్రవీణ, బొమ్మసముద్రం నుంచి అనూష, ఎస్ఆర్పురరరం నుంచి గిరిలను పట్టుబట్టి.. కార్యాలయాన్ని తీసుకొచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కార్యాలయంలో లుకలుకలు మొదలయ్యాయి. ఇదంతా కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ వ్యవహారం బయట పడుతుందని ఆ ముగ్గురిని టార్గెట్ చేసి కార్యాలయం నుంచి తప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులు ముట్టజెప్పితేనే ..ఫైళ్లు ముందుకు పీజీ శిక్షణ వెళ్లే వైద్యులకు రిలీవ్ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, పై నుంచి ఉత్తర్వులు రావాలని సాకు చూపిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇక్కడ కాసులిస్తే తప్ప పనులు కావడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక సీనియర్ అసిస్టెంట్ల ఉద్యోగోన్నతి విషయంలో సంతకానికి బట్టి ముడుపులు అడుగుతున్నట్లు కొందరు చెబుతున్నారు. ఆస్పత్రిని బట్టి భారీగా డిమాండ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల పర్వానికి కొందరు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. ఏసీబీకి ఉప్పందించి రెడ్ హ్యాండడ్గా పట్టించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిలబడి నీరసించిపోతున్నారు.. గతేడాది వరకు కార్యాలయం కాస్త సాఫీగా సాగింది. అయితే రెండు నెలల కాలంలో ఓ అధికారిని కలవాలంటే వైద్యులు, కార్యాలయ సిబ్బందికి పురిటినొప్పులు పడుతున్నారు. ఆ అధికారి ఛాంబర్ ముందు నిలబడి నీరసించిపోతున్నారు. చీటి రాసి ఇస్తే..తీరిక ఉంటే పిలుస్తున్నారు..లేదంటే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గంటల తరబడి వేచి ఉండలేక విసిగిపోతున్నారు. కార్యాలయ సిబ్బంది అయితే ఫైళ్లు చేతులో పెట్టుకుని పిలుపు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాత వెళ్లినా ఛీదరింపులు తప్ప ఫైళ్లల్లో సంతకాలు పడడం లేదని వారు వాపోతున్నారు. ఇలా వందల ఫైళ్లు పెండింగ్లో పడ్డాయి. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు మూలకు చేరాయి. పాత డీఎంఅండ్హెచ్ఓ ప్రభావతి పనిచేసిన సమయంలో ఉన్న ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు 10 వరకు పక్కన పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
చిత్తూరు, కలెక్టరేట్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని మూడు నెలలు పాటు మార్చి 01, 2025 నుంచి మే 31 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 28, 2025 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మార్చి 01,2025 నుంచి మే 31 వరకు అక్రిడిటేషన్ పొడి గింపు సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు. తెలుగు భాషాభ్యున్నతికి కృషి తిరుపతి సిటీ: తెలుగు భాషాభివృద్ధికి సమష్టి కృషి, నిరంతర ప్రణాళికలు అవసరమని ఎస్వీయూ వీసీ సీహెచ్.అప్పారావు తెలిపారు. ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖ, ప్రాచ్య పరిశోధనా సంస్థ, బెంగళూరుకు చెందిన తెలుగు సంపద సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ వేదికగా మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం, విశిష్టత ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశీ భాషల పట్ల వ్యామోహం పెరుగుతోందని, తెలుగు భాష అంతరిస్తూ ఉందనే విషయం సత్య దూరమైనదని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బోధన, అధికారిక కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం పెరగాలన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్.కృష్ణమూర్తి, విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథశర్మ, సదస్సు సంచాలకులు ఆచార్య రాజేశ్వరమ్మ, నిర్వహణ కార్యదర్శి ఆచార్య పీసీ వేంకటేశ్వర్లు, సలహాదారు డాక్టర్ రేమిళ్ల మూర్తి, పరిశోధకులు రమేష్ పాల్గొన్నారు. -
ఆశలు.. ఊసులు
● రాష్ట్ర బడ్జెట్పై జిల్లా వాసుల ఎదురుచూపులు ● ఆలయాల అభివృద్ధికి కరువైన నిధులు ● పర్యాటక అభివృద్ధికి నిధులే కీలకం ● సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నిస్తున్న జనం జిల్లా సమాచారం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు 04 జిల్లాలోని మండలాలు 32 జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822 జిల్లాలోని గ్రామ పంచాయతీలు 697 జిల్లా జనాభా 18.73 లక్షలు పురుషులు 9.40 లక్షలు మహిళలు 9.33 లక్షలు రూరల్ జనాభా 15.04 లక్షలు అర్బన్ జనాభా 3.69 లక్షలు చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో జిల్లా వాసులు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ సమస్యలు, ప్రధాన ఆలయాల అభివృద్ధి, పర్యాటక రంగం, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై జిల్లా వాసుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావడంతో బడ్జెట్ పై రైతులు, మహిళలు, వ్యాపారులు, పేద, మధ్య తరగతి వర్గాలకు దక్కనున్న ప్రయోజనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాడలేని సంక్షేమం జిల్లాలో 4.56 లక్షల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో 18.73 లక్షల మంది నివసిస్తున్నారు. పురుషులు 9.40 లక్షలు, మహిళలు 9.33 లక్షల మంది ఉన్నారు. రూరల్లో 15.04 లక్షల మంది, అర్బన్లో 3.85 లక్షల మంది నివసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తోంది. ఈ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల అమలుపై ఎన్నో హామీలు గుప్పించింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం కల్పించాలి చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపైనే రైతులు, ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గంలో మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రారంభించింది. ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు గతంలో రూ.2144.50 కోట్ల అంచనాలు సైతం సిద్ధం చేశారు. అయితే పలు కారణాలతో పెండింగ్ పడిన ఆ రిజర్వాయర్లను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గండికోట రిజర్వాయర్, అలాగే చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో కండలేరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పూర్తికి రూ.7659.06 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. పర్యాటక అభివృద్ధికి నిధులు అవసరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి నిధులు అవసరం ఉంది. జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రధానమైన కాణిపాకం, బోయకొండ, అర్ధగిరి, ననియాల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కుప్పం, నగరి, పలమనేరు, పులిగుండు వద్ద ఉన్న పర్యాటక హోటల్లు నిధుల కొరతతో అభివృద్ధిలో వెనుకబడ్డాయి. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రూ.57.24 కోట్ల ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. పర్యాటక అభివృద్ధికి కూటమి టీడీపీ చొరవ చూపుతుందో లేదో వేచి చూడాల్సిందేనని ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి .. చిత్తూరు జిల్లాలో దేవాదాయ శాఖ అధీనంలో మొత్తం 1592 ఆలయాలున్నాయి. వీటిలో 6ఏ కింద 06, 6 బీకింద 25, 6సీ కింద 1546, 6డీ కింద 15 ఆలయాలున్నాయి. వీటిలో ప్రధానమైన ఆలయాల్లో సౌకర్యాలు మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని కాణిపాకం, అర్ధగిరి అరగొండ, బోయకొండ, తదితర ఆలయాల్లో సౌకర్యాలను మెరుగు పర్చాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
మొగిలి ఘాట్లో ఆటోను ఢీకొన్న లారీ
– 9 మంది భక్తులకు గాయాలు బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్లో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడియాత్తంకు చెందిన 9 మంది భక్తులు గాయపడ్డారు. అందులో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడగా మరో ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన తొమ్మిది మంది భక్తులు మొగిలి శివాలయానికి బయలుదేరారు. గుడియాత్తం నుంచి పలమనేరుకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి మొగిలికి ఆటోలో బయలుదేరారు. మార్గ మధ్యలో మొగిలి ఘాట్ వద్ద ఆటోను పలమనేరు నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడియాత్తంకు చెందిన పద్మ, తులశమ్మకు కాళ్లు విరిగిపోయాయి. కల్పన తలకు బలమైన గాయమైంది. ప్రేమ తీవ్రంగా గాయపడింది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మ, తులశమ్మ, కల్పన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి కార్వేటినగరం : ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అన్నూరు బస్షెల్టర్ వద్ద చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజ్కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా.. వెదురుకుప్పం మండలం చవటగుంట దళితవాడకు చెందిన గోవర్ధన్ ద్విచక్ర వాహనంలో కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి దళితవాడలోని తన అత్తగారి ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో అన్నూరు బస్టాండ్ వద్ద మండలంలోని అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(66) బస్సు కోసం వేచి ఉన్న సమయంలో గోవర్ధన్ ద్విచక్ర వాహనంలో వేగంగా దూసుకొచ్చి చొక్క లింగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.అలాగే ద్విచక్ర వాహనంలో వచ్చిన గోవర్ధన్కు తీవ్రగాయాలు కావడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చొక్కలింగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
చేసిందే పని.. వేసిందే రోడ్డు !
పుత్తూరు మండల సమాచారం మండలంలోని పంచాయతీలు – 14 సచివాలయాలు – 10 మండలంలోని గ్రామాల సంఖ్య – 82 మంజూరైన రోడ్ల సంఖ్య – 54 రోడ్లు వేయాల్సిన మీటర్లు – 3,350అంచనా వ్యయం – రూ.167.53 లక్షలు పూర్తయిన రోడ్ల సంఖ్య – 30 నిర్మాణంలో ఉన్న రోడ్లు – 22 ఇంకా ప్రారంభించని పనులు – 02పుత్తూరు : గ్రామీణ రోడ్లలో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. వివిధ తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలకు పల్లెరోడ్లు ఛిద్రమయ్యాయి. ఈ రోడ్లలో నడక అటుంచి, బైక్ , ఆటో వంటి వాహనాలపై ప్రయాణం సైతం ప్రమాదకరంగా మారింది. దీంతో గ్రామీణుల అగచాట్లు వర్ణణాతీతంగా మారింది. పుత్తూరు మండలంలోని 14 పంచాయతీల్లోని పలు గ్రామాలకు చెందిన రోడ్లు బురదమయంగా దర్శనమిస్తున్నాయి. అలాగే గ్రామాల్లో సరైన డ్రైనేజీలు లేక పల్లె ప్రజలు మురుగు మధ్యనే మగ్గుతూ రోగాల బారిన పడి, ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు విష జ్వరాలు ప్రబలి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా పాలకులు పల్లెల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో వసతుల కల్పన పేరిట పుత్తూరు మండలంలో 54 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.167.53 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ఇప్పటి వరకు 30 పనులు పూర్తి కాగా 22 పనులు జరుగుతున్నాయి. రెండు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటి వరకు పూర్తయిన రోడ్లు నాసిరకంగా నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు అన్ని పనులను పరిశీలిస్తున్నారు. ఆందోళన చేసినా రోడ్డు వేయలేదు వర్షం పడితే మా ఆనంబట్టు గ్రామ రోడ్డు బురదమయంగా మారుతుంది. బైక్పై నుంచి జారిపడిన సంఘటనలు ఉన్నాయి. తారు రోడ్డు వేయాలని ఇది వరకే చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశాం. అయినా నేటికీ మా గ్రామం రోడ్డు బాగు చేయలేదు. పైడిపల్లి గ్రామం నుంచి ఆనంబట్టు వరకు సీసీ రోడ్డు గానీ, తారు రోడ్డు గాని వేయాలి. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగానైనా మా రోడ్డును బాగు చేయండి. – కె.రమేష్, ఆనంబట్టు గ్రామం, పుత్తూరు మండలం రోడ్డు పైనే నీళ్లు నిలుస్తున్నాయి పేరుకు రోడ్డు వేశారు. చూడడానికి రోడ్డు బాగుంది. రోడ్డుపైనే నీళ్లు నిలిచిపోతున్నాయి. రోడ్డును బాగు చే యాల్సిన అవసరం ఉంది. రోడ్డుకు ప క్కన డ్రైనేజీలు కూడా లేవు. మురుగు నీరు ఎలా పోతుంది.? అధికారులు అన్నీ చూసి చేయాలి. – కాంతమ్మ, వేణుగోపాలపురం, పుత్తూరు మండలం నాణ్యత పరిశీలన తర్వాతే బిల్లులు రోడ్డు పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించి, ధ్రువీకరణ చేసిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. రోడ్డు వేసిన దూరం, మందం, నాణ్యతను పరిగ ణలోకి తీసుకొని పరిశీలిస్తాం. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరగకపోతే బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదు. – గాయత్రి, ఏఈ, పంచాయతీరాజ్ శాఖ, పుత్తూరు మండలం తమ్ముళ్లకు పల్లె ‘పండుగ’ సీసీ రోడ్లతో నేతలకు ‘ఉపాధి’ ఇష్టారాజ్యంగా పనులు నాణ్యతకు తిలోదకాలు పట్టించుకోని అధికారులు -
నాగమల్లేశ్వర స్వామి సేవలో పెద్దిరెడ్డి
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు శివరాత్రి సందర్భంగా బుధవారం సందర్శించారు. ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, నిహాంత్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ధనుంజయరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, నాయకులు మనోహర్ రెడ్డి, శివారెడ్డి, ఇందాద్, తేజరెడ్డి పాల్గొన్నారు. రూ.1.05 కోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలో శివరాత్రి ప్రభుత్వ సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలను తెరిచారు. దీంతో మొత్తం 4,800 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించారని చిత్తూరు, తిరుపతి జిల్లాల ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. వీటి ద్వారా రూ.1.05 కోట్ల బిల్లుల చెల్లింపు అయిందని వివరించారు. క్యాన్సర్ బాధితుడికి పీఎం సహాయ నిధి రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం మద్దిపట్లవారిపల్లెలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దుర్గాప్రసాద్నాయుడుకు ప్రధానమంత్రి సహాయ నిధి కింద రూ.3 లక్షలను రాజంపేట ఎంపీ వెంకట మిధున్రెడ్డి మంజూరు చేయించారు. మద్దిపట్లవారిపల్లెకు చెందిన మునిరత్నం నాయుడు కుమారుడు దుర్గాప్రసాద్ నాయుడు(26) క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని ఎంపీ దృష్టికి రెండు నెలల కిందట తీసుకెళ్లారు. దీంతో ఆర్థిక సాయం మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. దీంతో పీఎం సహాయ నిధి కింద రూ. 3 లక్షలను మంజూరు చేయించారు. అడిగిన వెంటనే పీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయించడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా? ● తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు ● జీడీనెల్లూరు ఇన్చార్జి కృపాలక్ష్మి మండిపాటుకార్వేటినగరం : కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి భయపడి పోతారనుకోవడం అవివేకమని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆ పార్టీ ఇన్చార్జి కళత్తూరు కృపాలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ఎల్లో మీడియాలో తన తండ్రి ఏదో స్కాంలో చిక్కుకుని జర్మనీకి వెళ్లిపోయినట్లు అసత్యాలను వండి వారుస్తున్నారని, అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. మా నాన్న కుమార్తె ఇంటికి వెళ్లడంపై భయపడి పారిపోయాడని అబద్దాలు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. కళత్తూరు కుటుంబం కష్టపడి రాజకీయంగా ఎదిగిందని, స్కాంలు, అక్రమాలు చేసి రాలేదని హెచ్చరించారు. తన తండ్రిపై పనిగట్టుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వారికి త్వరలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై తప్పుడు ప్రచారం చేసిన చానళ్లు ఆయనకు వెంటనే బహిరంగంగా క్షమాణ చెప్పాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిరుద్యోగులకు ‘జాబ్ ఎక్స్’ పోర్టల్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగులకు జాబ్ ఎక్స్ పోర్టల్ ఎంతో ఉపయోగకరమని జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఆఫీసర్ గాంధీరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మిట్టూరులోని శ్రీ టెక్నాలజీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేషనల్ స్కిల్ హబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూచనల మేరకు జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ నిరుద్యోగ యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎన్ఎస్డీసీ జాబ్ ఎక్స్ పోర్టల్తో కలిగే లాభాలను నిరుద్యోగులు తెలుసుకోవాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఆ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల నిరుద్యోగుల అర్హతలకు తగ్గ ఉద్యోగాలను సాధించేందుకు వీలవుతుందన్నారు. పోర్టల్ లో అన్ని కంపెనీలు రిజిస్ట్రర్ కావడంతో నిరుద్యోగులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఏవైనా సందేహాలకు 99592 36172 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్దాలు
● వైఎస్సార్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం చిత్తూరు కార్పొరేషన్ : ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అ సెంబ్లీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయు డు అబద్దపు మాటలు వల్లెవేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరులోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు జగనన్నపై వ్యంగాస్త్రాలు వేసే స్థాయి గురజాలది కాదన్నారు. ప్రతిపక్ష హోదాపై గవర్నర్ను బెదిరిస్తున్నామంటున్నారు.. గతంలో బీజేపీకి 3 సీట్లు వస్తే ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి, ఈవీఎంల మాయతో ఎమ్మెల్యేగా గెలిచిన గురజాలకు ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. కూట మి పాలనలో జిల్లా మొత్తానికి కలిపి 36 ఆర్టీసీ బస్సులు వ స్తే.. ఇందులో చిత్తూరుకు మాత్రం నాలుగు బస్సులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చి త్తూరుకే 21 బస్సులు తెచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడొచ్చిన 36 బస్సులు కూడా తమ ప్రభుత్వ హయంలో మంజూరు చేసినవేనని స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టు 15 నుంచి మహిళల కు ఉచిత బస్సు అంటూ చిత్తూరులో ప్రచారం చేసుకున్న గురజాల ఇప్పటికీ దాన్ని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని విజయానందరెడ్డి నిలదీశారు. ఆ మద్యం బ్రాండ్లు మీవే.. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్బూమ్ లాంటి మద్యం బ్రాండ్లు టీడీపీ పాలనలో వచ్చినేవని.. వీటి అనుమతులు కూడా టీడీపీనే ఇచ్చిందన్నారు. మద్యం అక్రమ కేసుల్లో తమ పార్టీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి, నారాయణస్వామి పేర్లు చెప్పాలని ఎకై ్సజ్ ఉన్నతాధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు కూటమి నేతలు వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జర్మనీలో ఉన్న కుమారై వద్దకు వెలితే, మాజీ మంత్రి విదేశాలకు పారిపోయారని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు గాయత్రీదేవి, జ్ఞానజగదీష్, రజనీకాంత్, అంజలిరెడ్డి, ముత్తు, శేఖర్, హరీషారెడ్డి, ప్రభాకర్రెడ్డి, స్టాన్లీ పాల్గొన్నారు. -
నేడు రథోత్సవం, తెప్పోత్సవం
● శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తులు ● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ● విశిష్ట వాహనాలపై ఊరేగిన ఆదిదంపతులు ● శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కై లాసం ఇంద్ర విమానంపై ముక్కంటి రాజసం హర హర మహాదేవ.. శంభో శంకర.. నమో పార్వతీపతయే నమః.. ముక్కంటీశా పాహిమాం.. పరమేశ్వరా రక్షమాం.. ఓం నమఃశ్శివాయ అంటూ ఆదిదేవుని స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. మహిమాన్విత వాయులింగేశ్వరుని దివ్యతేజస్సును వీక్షించి పులకించారు. ఆదిమధ్యాంత రహితుని ఆత్మలింగ దర్శనంతో పునీతులయ్యారు. నిజరూపంతో సాక్షాత్కరించిన నీలకంఠుని సేవించుకుని తరించారు. ఇంద్ర విమానంపై ఊరేగుతున్న కై లాసనాథునికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అత్యంత ప్రీతిపాత్రమై నంది వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తున్న లయకారుని మనసారా స్తుతిస్తూ పరవశించారు. పవిత్ర లింగోద్భవ కాలంలో త్రినేత్రుని తేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని కోటి జన్మల పుణ్యఫలం పొందారు. శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. వాయులింగేశ్వరుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలు జరిపించారు. అలాగే ఉచ్ఛికాలాభిషషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం చేపట్టారు. పర్వదినం సందర్భంగా మొత్తం 9 విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈక్రమంలోనే మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామి, అమ్మవార్లను మేల్కొలిపారు. అనంతరం గోపూజ చేశారు. 3 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5 నుంచి 10.30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాలఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు సులభతరంగా స్వామి, అమ్మవార్లను సేవించుకునే వెసులుబాటు ఏర్పడింది. క్యూలను విభజించి పకడ్బందీగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనివితీరు ముక్కంటీశుని దర్శించుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు సుమారు 1.5లక్షల మంది భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదని వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఇంద్రవిమానంపై పురవీధుల్లో ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంపై కొలువుదీరి అనుసరించారు. మూషిక వాహనంపై వినాయకుడు, శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగింపులో ముందుకు సాగారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మహోత్సవం ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశౠరు. అలాగే రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతులు తెప్పలపై విహరించనున్నారు. ఈ మమేరకు పుష్కరణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
జీడీ నెల్లూరులో డీపీఆర్సీ శిక్షణ భవనం
● రూ.2 కోట్ల నిధులు విడుదల ● 8 వేల అడుగులలో నిర్మాణం చిత్తూరు కార్పొరేషన్ : జీడీ నెల్లూరులో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (డీపీఆర్సీ) శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి శాఖాపరంగా అనుమతులు వచ్చాయి. స్థలం ఎంపిక, నిధులు విడుదల పూర్తయింది. డీపీఆర్సీ కార్యాలయం ప్రస్తుతం జెడ్పీలో ఉంది. జిల్లాలోని పలు పథకాలు, అంశాల మీద సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మండలాలు లేదా జెడ్పీ కార్యాలయం, లేదా అద్దె భవనాలు తీసుకొని శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నారు. ఇది వ్యయంగా మారడంతో కొత్త భవనం కోసం నివేదిక పెట్టారు. గతంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలకు ఎక్కువగా శ్రీకాళహస్తిలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ)లో నిర్వహించేవారు. జిల్లాల విభజన తర్వాత చిత్తూరులో పెట్టాలని ప్రతిపాదన పెట్టారు. తర్వాత చిత్తూరు, జీడీ నెల్లూరు ప్రాంతాలను మొదట ఎంపిక చేసి స్థలాన్వేషణ చేశారు. చివరిగా జీడీ నెల్లూరులో ఏర్పాటుకు స్థలం దొరికింది. 8 వేల చదరపు అడుగులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం రూ.2 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్నట్లు పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో సమావేశ మందిరం, డీపీఆర్సీ కార్యాలయం, హాలు, డైనింగ్హాలు, కిచెన్, స్టోర్ రూమ్, సీ్త్ర, పురుషుల విశ్రాంతి గది, టాయిలెట్స్ను నిర్మించనున్నారు. -
సామాన్య భక్తుల ఇక్కట్లు
ముక్కంటి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలను చూసి కంగారు పడ్డారు. సామాన్య భక్తులకు తీవ్రంగా ఇబ్బందివ పడ్డారు. ఎమర్జెన్సీ దారులు లేకపోవడంతో గంటలు తరబడి వేచి ఉన్న మహిళలు బాత్రూమ్కు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేసినా, అర్ధరాత్రి వరకు 60 వేల మంది భక్తులు మాత్రమే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం గమనార్హం. అయినప్పటికీ చిన్నపాటి తోపులాటలు, భక్తులు అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మదర్ ఫీడింగ్ కోసం ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రాఫిక్ కష్టాలు వాహనాలను వంతెనకు అవతలే నిలిపేశారు. అయినప్పటికీ ప్రోటోకాల్ పేరుతో వీఐపీల వాహనాలు ఆలయ నాలుగో గేటు వరకు వచ్చాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు ఏర్పాడ్డాయి. -
బతుకు భారమై వృద్ధుడు..
బైరెడ్డిపల్లె : వృద్ధాప్యం మీద పడటంతో పాటు బతుకు భారమై జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తయిండ్లు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుర్రప్ప (70)కు భార్య, కుమారులు పదేళ్ల కిందట మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాం చేశాడు. దీంతో ఒంటరిగా ఉన్న గుర్రప్పకు జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో రెండు రోజుల కిందట గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గ్రామస్తులు గమనించి కుమార్తెలకు సమాచారం అందించారు. దీంతో కుమార్తె నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్నాథగౌడుకు దాతల చేయూత ● వైద్య ఖర్చులకు సాయం పలమనేరు : బైరెడ్డిపల్లి మండలం రామనపల్లికి చెందిన జగన్నాథగౌడుకు మెరుగైన వైద్యం కోసం పలమనేరుకు చెందిన కనకదాస సేవా సమితి తరఫున కురుబ కులస్థులు రూ.16 వేల ఆర్థిక సాయాన్ని రోగి కుటుంబికులకు బుధవారం పట్టణంలో అందజేశారు. దీంతో సాయం చేసిన సుబ్రమణ్యం గౌడు, ఈశ్వర్, సోము, గోపాల్గౌడు, నారాయణ, దొర స్వామి తదితరులు బాధితుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులేదని తల్లి లక్షుమమ్మ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయ్యానా బిడ్డను కాపాడండి! అనే శీర్షికన గత శనివారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాలతో ఆ మండలం వైధ్యాధికారి విజయచంద్ర రోగిని చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలించి హెచ్బీ లెవెల్స్ను మెరుగు చేశారు. మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం దాతలు ముందుకొచ్చి సాయం చేశారు. సాక్షి చూపిన సామాజిక బాధ్యతను స్థానికులు కొనియాడారు. కంటైనర్లో మంటలు గుడిపాల : కంటైనర్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం వేలూరు నుంచి ఢిల్లీకి కంటైనర్ స్క్రాబ్ (వేస్టేజ్)ను తీసుకెళ్తోంది. గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్నట్టుండి లారీలో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే కొంత మేర నష్టం వాటిల్లింది. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆలయాలకు పూర్వవైభవం
పుంగనూరు : పురాతన ఆలయాల అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నెక్కుందిలోని శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. నెక్కుంది సోమల మండలంలోని దుర్గంకొండలో, చౌడేపల్లె మండలంలో బోయకొండ, మృత్యుంజయేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, దేవళంపేటలోని పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే దేవళంపేట, పుంగనూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, చౌడేపల్లె మండలంలోని రాజనాల బండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట అనీషారెడ్డి, శ్రీనాధ్రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు. -
కట్టుదిట్టంగా సీఎం భద్రతా ఏర్పాట్లు
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చినెల 1న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు మండలంలో పింఛన్ల పంపిణీ నేపథ్యంలో మంగళవారం జీడి నెల్లూరు హరిజన వాడ, సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పి.వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే థామస్తో కలసి పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ నిర్వహణ, ప్రజా వేదిక, పింఛన్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సంబంధిత అంశాలపై సమన్వయకర్తతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ట్రాన్స్కో ఈఈ నాగరాజు , డీఈ సురేష్, ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.పలమనేరులో ఐహెచ్పీ ల్యాబ్ ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇక్కడే ఏర్పాటు పలమనేరు : పలమనేరు ఏరియా ఆస్ప త్రిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధునీకరించింది. ఇప్పుడున్న సౌకర్యాలు, సువిశాలమైన ఆస్పత్రి ప్రాంగణాన్ని ప రిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మంజూరైన అయిదు ఐహెచ్ఎఫ్ ల్యాబ్ లో ఒక ల్యాబ్ను పలమనేరుకు కేటాయించారు. ఇంటర్నల్ హెమరాజిక్ ఫ్యాసిమెనిన్ జియోసిస్ అని పిలవబడే ఈ ల్యాబ్ను రూ.40 లక్షల నాబార్డు నిధులతో ఇక్కడి ఆస్పత్రిలోని నాలుగు గదుల్లో పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల పురోగతిని స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బుధవారం ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్, వైద్యులు, ఆస్పత్రి సలహా మండలి సభ్యులతో కలసి చర్చించారు. అన్ని రకాల వైరల్ టెస్టులతో పాటు బయాప్సీ పరీక్షలు కూడా ఈ ల్యాబ్లో చేయనున్నారు. బయాప్సీ టెస్ట్ల కోసం ఇప్పటి దాకా ముంబై, చైన్నె, పూణె లాంటి ల్యాబ్లకు పంపేవారు. ఈ నివేదికలు నెలల తర్వాతగాని అందేవి కాదు. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో నాలుగు ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందులో పలమనేరు ఒకటి. ల్యాబ్ ఏర్పాటైతే ఇందులో వైరాలజిస్ట్లు, ఫాథాలజిస్ట్లు, అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. -
రంజాన్కు మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మసీదుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. నగరం, పట్టణాలు, గ్రామాల్లో మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తెల్లవారుజామున ము స్లింలు మసీదులకు వెళ్లి నమాజ్ చేసుకుంటారని ఆ సమయంలో విద్యుత్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జాతీయ సైన్స్డే పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 28న జాతీయ సైన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ పోటీల నిర్వహణకు జిల్లాకు రూ.50 వేలు మంజూరు చేశారు. వికసిత్ భారత్ కోసం ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం అనే అంశంపై విద్యార్థులకు క్విజ్, సెమినార్లు నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బతుకు భారమై వృద్ధుడు..
బైరెడ్డిపల్లె : వృద్ధాప్యం మీద పడటంతో పాటు బతుకు భారమై జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తయిండ్లు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుర్రప్ప (70)కు భార్య, కుమారులు పదేళ్ల కిందట మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాం చేశాడు. దీంతో ఒంటరిగా ఉన్న గుర్రప్పకు జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో రెండు రోజుల కిందట గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గ్రామస్తులు గమనించి కుమార్తెలకు సమాచారం అందించారు. దీంతో కుమార్తె నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్నాథగౌడుకు దాతల చేయూత ● వైద్య ఖర్చులకు సాయం పలమనేరు : బైరెడ్డిపల్లి మండలం రామనపల్లికి చెందిన జగన్నాథగౌడుకు మెరుగైన వైద్యం కోసం పలమనేరుకు చెందిన కనకదాస సేవా సమితి తరఫున కురుబ కులస్థులు రూ.16 వేల ఆర్థిక సాయాన్ని రోగి కుటుంబికులకు బుధవారం పట్టణంలో అందజేశారు. దీంతో సాయం చేసిన సుబ్రమణ్యం గౌడు, ఈశ్వర్, సోము, గోపాల్గౌడు, నారాయణ, దొర స్వామి తదితరులు బాధితుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులేదని తల్లి లక్షుమమ్మ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయ్యానా బిడ్డను కాపాడండి! అనే శీర్షికన గత శనివారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాలతో ఆ మండలం వైధ్యాధికారి విజయచంద్ర రోగిని చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలించి హెచ్బీ లెవెల్స్ను మెరుగు చేశారు. మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం దాతలు ముందుకొచ్చి సాయం చేశారు. సాక్షి చూపిన సామాజిక బాధ్యతను స్థానికులు కొనియాడారు. కంటైనర్లో మంటలు గుడిపాల : కంటైనర్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం వేలూరు నుంచి ఢిల్లీకి కంటైనర్ స్క్రాబ్ (వేస్టేజ్)ను తీసుకెళ్తోంది. గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్నట్టుండి లారీలో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే కొంత మేర నష్టం వాటిల్లింది. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మొగిలీశ్వరా నమోనమః
● కిక్కిరిసిన మొగిలి క్షేత్రం బంగారుపాళెం : హరహర మహాదేవ శంభోశంకర అంటూ.. మొగిలి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం మొగిలీశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఉదయం స్వయంభు శ్రీ మొగిలీశ్వరసామి, కామాక్షమ్మ వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు మొగిలీశ్వరాలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో బారులు తీరాయి. పలమనేరు, చిత్తూరు డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను నడిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం అనంతరం స్వామి, అమ్మవారు వృషభ వాహనంపై విహరించారు. జిల్లా ఎస్పీ మణికంఠచందోలుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. రఘు కుటుంబ సభ్యులు చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొని భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో బంగారుపాళెం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మునిరాజు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. దేవరకొండపై..: మొగిలి శివాలయానికి అనుబంధ ఆలయమైన దేవరకొండపై బుధవారం మహాశివరాత్రి సందర్భంగా జలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వయంభు శ్రీమొగిలీశ్వర స్వామికి కాణిపాక ఆలయం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాక వినాయక స్వామి ఆలయ ఈఓ పెంచల కిషోర్ పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. నేడు రావణబ్రహ్మవాహనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అభిషేకం కై లాసగిరి రావణ బ్రహ్మ వాహనం, రాత్రి శేషవాహన సేవలను నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
అక్రమ వ్యాపారాలపై చర్యలు
చిత్తూరు కార్పొరేషన్ : తుక్కు అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని సీటీ(వాణిజ్య పన్నుల)శాఖ జేసీ (సంయుక్త కమిషనర్) జాన్ స్టీవెన్సన్ బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా గతంలో మొత్తం 13 వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందేనన్నారు. మరికొన్ని వ్యాపార సంస్థలను తనిఖీ చేసి భారీ మొత్తంలో జరిమానా విధించామన్నారు. రద్దయిన 13 సంస్థలకు సంబంధించిన అక్రమ రవాణాకు సూత్రధారిగా అనుమానిస్తున్న కట్టమంచిలోని వ్యాపార సంస్థపై మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు ఏసీ–1 శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారన్నారు. ఆ సంస్థ కార్యాలయంలో పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అక్రమ లావాదేవీలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆలయాలకు పూర్వవైభవం
పుంగనూరు : పురాతన ఆలయాల అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నెక్కుందిలోని శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. నెక్కుంది సోమల మండలంలోని దుర్గంకొండలో, చౌడేపల్లె మండలంలో బోయకొండ, మృత్యుంజయేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, దేవళంపేటలోని పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే దేవళంపేట, పుంగనూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, చౌడేపల్లె మండలంలోని రాజనాల బండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట అనీషారెడ్డి, శ్రీనాధ్రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద మృతి
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి శవమై కనిపించాడు. టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య కథనం మేరకు చిత్తూరు నగరంలోని పోతంబట్టుకు చెందిన చంద్రశేఖరెడ్డి (60) ఈనెల 17వ తేదీన అదృశ్యమయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోయే సరికి కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పోతంపట్టు నీవానది ఒడ్డున ఓ మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడు కుమారుడు భరత్రెడ్డితో శవం చంద్రశేఖర్రెడ్డిదేనని నిర్ధారించారు. కాగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి చేపలు పట్టడం, అడవి పందులు వేటాడే అలవాటు ఉందని, ఈ క్రమంలో కరెంటు వైర్లు తగిలి చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలు
విద్యార్థులు చదివింది తిరుపతి జిల్లాలో.. పరీక్షలు రాయబోయేది చిత్తూరు జిల్లాలో ఇదేమి వింత ధోరణి అని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థులు చిత్తూరు జిల్లా కేంద్రానికి విచ్చేసి పరీక్షలు రాయనున్నారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన కూటమి అలసత్వంతో ఇలాంటి అవస్థలు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ అధికారుల నుంచి అనుమతి లేకుండా తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఎస్ఎస్ఆర్ అనే కళాశాల 2024–2025 విద్యాసంవత్సరంలో నిర్వహించారు. తిరుపతిలో కళాశాల నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఓంప్రకాష్ చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన ఎస్వీ కళాశాల కరస్పాండెంట్ నుంచి కళాశాలను కొనుగోలు చేసుకున్నారు. కొనుగోలు చేసుకున్న తిరుపతి నిర్వాహకుడు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అలా తీసుకోకుండా ప్రస్తుత విద్యాసంవత్సరం అంతా తిరుపతిలో కళాశాలను నిర్వహించారు. ఈ వ్యవహారం పలుమార్లు అక్కడి విద్యార్థి సంఘాలు తిరుపతి ఇంటర్మీడియట్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత తిరుపతి ఎస్ఎస్ఆర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ అధికారులు అప్పట్లోనే కళాశాలను సీజ్ చేసి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవి కావు. అలా చేయకుండా ఎస్ఎస్ఆర్ కళాశాల నిర్వాహకుడికి అనుకూలంగా ఇంటర్మీడియట్ అధికారులు వ్యవహరించారు. ఈ సమస్య జఠిలమై పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు వచ్చే సరికి 84 మంది విద్యార్థుల భవిష్యత్కు అంధకారంలోకి వెళ్లేలా చేసింది. విద్యార్థులకు అగచాట్లు ఈ వ్యవహారంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలేమో సాఫీగా ఉంటున్నాయి. చివరికి 84 మంది విద్యార్థులు మాత్రం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఆ విద్యార్థుల హాల్టికెట్లు జారీ కాకపోవడంతో సమస్య తీవ్రం అయింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో విచారణ నిర్వహించారు. పెనుమూరు కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత క్షుణ్ణంగా విచారణ చేసిన అనంతరం రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులకు విచారణ నివేదికలను పంపారు. తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థుల వివరాలు పెనుమూరు ఎస్వీ జూనియర్ కళాశాల లాగిన్లోనే నమోదయ్యారు. దీంతో వారందరినీ చిత్తూరు జిల్లాలో చదివినట్లుగానే పరిగణించాల్సి వచ్చింది. తిరుపతి విద్యార్థులకు చిత్తూరులో పరీక్ష కూటమి పాలనలో ఇంటర్ విద్యార్థులకు వింత అనుభవం ప్రైవేట్ కళాశాల నిర్వాహకంతో విద్యార్థుల అవస్థలు అనుమతి లేని కళాశాలల నిర్వహణతోనే ఈ పరిస్థితి 84 మంది విద్యార్థులకు చిత్తూరులోనే కేంద్రాలు.. ఈ విషయంపై రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చి విద్యార్థులకు అన్యాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 84 మంది విద్యార్థులకు పరీక్షలు ఎలా రాయించాలనే విషయంపై చిత్తూరు డీవీఈఓ సయ్యద్ మౌలాతో సంప్రదింపులు జరిపారు. తిరుపతి జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించాలంటే ఎస్ఎస్ఆర్ కళాశాలకు అనుమతి లేదు. దీంతో విద్యార్థుల వివరాలు పెనుమూరు మండలం ఎస్వీ కళాశాల లాగిన్లోనే ఉండడంతో చిత్తూరు జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్ష ఫీజుకు అదనంగా జరిమానా విధించి తత్కాల్ విధానంలో ఎస్వీ కళాశాల నిర్వాహకుడు ఫీజు చెల్లించాలని ఆదేశించారు. ఎస్వీ కళాశాల నిర్వాహకుడు జరిమానాతో 84 మంది విద్యార్థుల ఫీజులు ఆన్లైన్లో చెల్లించారు. దీంతో ఆ విద్యార్థులకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చివరికి మార్చి 1వ తేదీ నుంచి తిరుపతి జిల్లా నుంచి చిత్తూరుకు వచ్చి విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. -
● రైతాంగాన్ని నిలువెల్లా మోసం చేసిన కూటమి సర్కారు ● పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాలయాపన ● రబీ, ఖరీఫ్లో చిల్లిగవ్వ విదల్చని వైనం ● ఇప్పటికే మూడు విడతల సాయం అందజేసిన కేంద్రం ● రైతుకు దక్కని భరోసా
కూటమి సర్కారు ‘అన్నదాత సుఖీభవ’ అని పేరు పెట్టి.. రైతన్న నోట్లో మట్టి కొట్టింది. ఇప్పటికే ఖరీఫ్, రబీ పంట కాలం ముగిసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు.. రైతులపై కనికరం చూపడం లేదు. పంటల సాగుకు పెట్టుబడి సాయం అందజేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు గుప్పించారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం ఊసే లేకపోవడంపై బాబు చేతిలో మరోసారి మోససోయామని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. చిత్తూరు అర్బన్: అన్నదాత సుఖీభవ.. పేరు ఎక్కడో విన్నట్టుందనుకుంటున్నారా..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు పంట సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని.. దానికి అన్నదాత సుఖీభవగా నామకరణం చేస్తున్నట్లు ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ పేరు ఇది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో రెండు సీజన్లు ముగిసిపోతున్నా.. రైతులకు ఒక్క రూపాయి పెట్టుబడి సాయం అందలేదు. సాగు భారం గత ఏడాది జూన్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యింది. జిల్లాలోని 36 మండలాల్లో ఖరీఫ్లో 81,169 హెక్టార్లలో వేరుశనగ, కంది, రాగి, ఉలవలు, సజ్జలు ఇతర పంటలు సాగు చేయాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దగా చేసి, అన్నదాతకు అండగా నిలబడకపోవడంతో కేవలం 33,920 హెక్టార్లలో మాత్రమే పంటల సాగుకు పరిమితమయింది. ఇక నాలుగు నెలల క్రితం ప్రారంభమైన రబీ సీజన్.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ రబీలో జిల్లాలో 23,387 హెక్టార్లు వరకు వరి, మిరప, రాగి, ఉలవలు, వేరుశనగ, చెరకు లాంటి ప్రధాన పంటల సాగు చేయాల్సి ఉంటే.. సీజన్ ముగుస్తున్న వేళ 18,017 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నైరుతి రుతు పవనాల్లో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక.. రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. రబీలోనైనా ప్రభుత్వం పంటలు వేసుకోవడానికి పెట్టబడి సాయం ఇస్తారని కోటి ఆశలతో ఎదురు చూసిన హాలికులకు ఈ సీజన్లోనూ నిరాశే మిగిలింది. రూ.252 కోట్ల బకాయి జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.280 కోట్లకు పైనే పెట్టబడి సాయం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం బకాయి పడింది. కొందరు రైతులు అసలు పంట జోలికే వెళ్లకపోగా.. మరి కొందరు పంట వేసుకోవడానికి పెట్టుబడుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందకపోవడంతో వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. రూ.886 కోట్లు అందించిన గత ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడడమే ధ్యేయంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఖరీఫ్ ఆరంభంలోనే రైతులకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు కష్ట నష్టాల్లో ఉంటే నాటి సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ఏటా క్రమం తప్పకుండా జూన్, అక్టోబర్, జవవరి నెలల్లో ప్రతి రైతుకు పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ప్రకారం జమ చేశారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కేంద్రంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందించారు. జిల్లాలోని రైతాంగానికి ఆయన సీఎంగా ఉన్న అయిదేళ్లల్లో పెట్టుబడి సాయంగా ఏకంగా రూ.886.31 కోట్లు అందించి అన్నదాతలకు అండగా నిలిచారు.కేంద్ర సాయం సంపూర్ణం కూటమి ప్రభుత్వంతో పాటు అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి జమ కావాల్సి రూ.6 వేలను మూ డు విడతలుగా చెల్లించేసింది. సోమవారం మూడో విడతగా 1,80,184 మందికి రూ.2 వేలు చొప్పున రూ.36.03 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో కేంద్ర సాయం సంపూర్ణంగా అందినట్లయ్యింది. కా నీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖరీఫ్, రబీ సీజన్లు వెళ్లిపోతున్నా.. అదిగో, ఇదిగో అంటూ అన్నదాతను దుఖఃపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఏమారుస్తోంది. -
ఆటగదరా శివ!
పలమనేరు: కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని గుర్తు చేసే ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. ఓ వివాహిత భర్తను, పిల్లలను కాదనుకుని ప్రియుడితో వెళ్లేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా.. ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపింది. బయటకు వచ్చిన ఆమెను భర్త పెద్ద మనసుతో స్వీకరించాడు. అయితే చిన్నపాటి గొడవకే ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత ఏడాది.. ఈ ఏడాది.. శివరాత్రి సందర్భంలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో శివరాత్రి పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే... గడ్డూరుకు చెందిన కోమలకు జగన్నాథంతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కిందటి ఏడాది.. శివరాత్రి పర్వదినాన జాగరణ పేరిట గుడి వెళ్తున్నానని చెప్పి.. కొలమాసనపల్లికి చెందిన గౌతం(26)తో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. బైక్పై గడ్డూరు శివారులోని జగమర్ల అడవి వైపుగా వెళ్లారు. అయితే అప్పటికే జంటలను టార్గెట్ చేసే సైకో వినయ్ కంట వీళ్లు పడ్డారు.పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్.. ఏకాంతం కోసం అడవుల్లోకి, పార్క్ల్లోకి వచ్చే జంటను బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్ఫోన్లు చోరీ చేసేవాడు. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలు చేసేవాడు. అలా.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైకో వినయ్పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. కోమల, గౌతంలను వినయ్ బెదిరించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాడుతో దాడికి పాల్పడబోయాడు. అయితే జరిగిన పెనులాగటలో వినయ్ కింద పడిపోగా.. గౌతం పక్కనే ఉన్న బండరాయి పడేశాడు. దీంతో వినయ్ అక్కడిక్కడే మరణించాడు. ఆపై ఏమీ తెలియనట్లు గౌతం, కోమల అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో భయపడిన ఇద్దరూ అతన్ని చంపింది తామేనని పోలీసులకు లొంగిపోయారు.ఇప్పుడేమైందంటే... ఆరు నెలల తర్వాత కోమలను ఆమె తల్లిదండ్రులు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. మళ్లీ తప్పు చేయనని మాట తీసుకుని భర్త ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుంచి అంతా హాయిగా నడుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ప్రాణం తీసుకోవడం ఆ ఇంట విషాదం నింపింది. ఇదంతా ఆ శివుడే ఆడించిన ఆట అంటూ గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
బంగారుపాళెం : కూలీ పనులకు వెళ్లి పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని ఎన్.కోటూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎన్.కోటూరు దళితవాడలో నివాసం ఉంటున్న సదాశివయ్య భార్య చిట్టెమ్మ(55) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన సురేంద్రబాబు వ్యవసాయ బావి వద్ద వరిలో కలుపు తీసేందుకు వెళ్లింది. పొలం పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె కమ్మికి పచ్చటి తీగలు అల్లుకుపోయాయి. ప్రమాదవశాత్తు రక్షణ కంచె కమ్మిని చిట్టెమ్మ చేతితో తాకడంతో విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయ పడింది. సహచర కూలీలు ఆమెను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బాధితురాలి భర్త సదాశివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూతలపట్టు వీఆర్ఓ హఠాన్మరణం పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండల కేంద్రానికి సంబంధించిన వీఆర్ఓ ధరణికృష్ణ (38) మంగళవారం గుండె పోటుతో మృతిచెందారు.ఈయన పెనుమూరు మండలం పులికల్లు స్వగ్రామం. ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న కొద్ది సేపటికే గుండెపోటు గురై అపస్మారస్థితికి వెళ్లిపోయారు. ఈవిషయాన్ని గమనించిన కుటుంబికులు పెనుమూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పని ఒత్తిడి కారణంగానే గుండె పోటుకు గురై మృతి చెందినట్లు పలువురు రెవెన్యూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
3 నుంచి పదో తరగతి గ్రాండ్ టెస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో మార్చి 3వ తేదీ నుంచి పదో తరగతి గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్ను జారీ చేశారు. ఆ షెడ్యూల్ మేరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో గ్రాండ్టెస్ట్లు తప్పనిసరిగా నిర్వహించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు. ఈ పరీక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంట నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ఇలా..... మార్చి–3వ తేదీన మొదటి లాంగ్వేజ్, కాంపోజిట్ కోర్సు, మార్చి 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 5న ఇంగ్లీష్, 6న మొదటి లాంగ్వేజ్ పేపర్ (కాంపొజిట్కోర్సు), 7న గణితం, 10న ఫిజికల్ సైన్స్, 11న బయాలజికల్ సైన్స్, 12న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2, ఒకేషనల్ కోర్స్ థియరీ, 13న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. చెరకు తోట దగ్ధం వెదురుకుప్పం : మండలంలోని యనమలమంద గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు నీలకంఠానికి చెందిన చెరకు తోట దగ్ధమైంది. మంగళవారం సాయంత్రం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని బాధిత రైతు తెలిపారు. నాలుగెకరాల్లో చెరకు పంట కాలిబూడిద అయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళపై దాడి
శ్రీరంగరాజపురం : మహిళపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని దిగువ కమ్మకండ్రిగ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు సబ్బలక్ష్మి కథనం మేరకు.. తన భర్త వెంకటేష్ ఫీల్డ్ అసిస్టెంట్గా ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీలో విధులు నిర్వహిస్తుండగా కొంత మంది వ్యక్తులు అవినీతి ఆరోపణలు చేస్తూ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి అధికారులు ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ ప్రజలను విచారించారు. ఈ విచారణలో ఫీల్డ్ అసిస్టెంట్పై ఎటువంటి ఆరోపణలు రాకపోవడంతో జిల్లా అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని రమేష్, అమరేంద్రన్ కలసి వెంకటేష్ భార్య అయిన తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. తనకు, తన భర్త వెంకటేష్కు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్నీటి వీడ్కోలు కుప్పంరూరల్ : మండలంలోని మల్లానూరు గ్రామంలో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దును నిలువరించేందుకు వెళ్లి గాయపడిన కరుణాకరన్కు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కరుణాకరన్ ఆదివారం గాయపడగా వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మంగళవారం మృతదేహాన్ని సీఎంసీ నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఇక్కడ వంద పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు కరుణాకరన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నిన్నటి వరకు తమ మధ్యనే ఉన్న కరుణాకరన్ మృతిని జీర్ణించుకోలేని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా కరుణాకరన్కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బోల్తా పడిన ట్రాక్టర్ ● డ్రైవర్, ముగ్గురు కూలీలకు గాయాలు పెనుమూరు(కార్వేటినగరం) : ఇటుక రాళ్ల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్, ముగ్గురు కూలీలకు గాయాలైన సంఘటన మండల పరిధిలోని పులికల్లు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. బందార్లపల్లికి చెందిన రామనాథరెడ్డికి చెందిన ట్రాక్టర్లో ఇటుకలను పెనుమూరుకు తీసుకెళుతుండగా పులికల్లు పాఠశాల సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు మరో ముగ్గురు కూలీలకు గాయాల య్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. -
చందాలతో వేసుకున్న రోడ్డుకు కూటమి బిల్లు ?
భక్తుల చందాలతో నిర్మించుకున్న రోడ్డు శాంతిపురం : దేవుడి ఊరేగింపును తీసుకురావటానికి తాము ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డుకు స్థానిక టీడీపీ నేతలు బిల్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. కొలమడుగు పంచాయతీలోని కదిరిముత్తనపల్లిలో సిద్దేశ్వరస్వామి ఆలయం ఉంది. పొరుగున ఉన్న రెడ్లపల్లి గ్రామస్తులు కొందరు శివరాత్రి సందర్భంగా తమ గ్రామంలో దేవుడి ఊరేగింపు జరపాలనుకుని నిర్ణయించుకున్నారు. తలా కొంత చందాలు వేసుకుని రెండు గ్రామాల మధ్య పాలారు నదిలో తాత్కాలిక మట్టి రోడ్డును రెండు రోజుల కిందట నిర్మించుకున్నారు. మరో నెల రోజుల్లో సిద్దేశ్వరస్వామి ఆలయంలో 12 ఏళ్లకు ఓసారి జరిగే కురబ కులస్తుల జాతరకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ కొందరు టీడీపీ నాయకులు సోమవారం పంచాయతీరాజ్ ఇంజినీరును తీసుకొచ్చి మట్టి రోడ్డు ఫొటోలు తీసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో తాము భక్తితో నిర్మించుకున్న మట్టి రోడ్డును చూపి అధికార పార్టీ నాయకులు బిల్లు చేసుకోకుండా చూడాలని కోరుతూ గ్రామస్తులు వాపోయారు. అదే రోడ్డుపై నిరసన తెలిపి, ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చారు. -
సింహ వాహనంపై శివతేజం
బంగారుపాళెం : మొగిలి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం పరమేశ్వరుడైన శ్రీ మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు మొదట అధికార నంది వాహనాన్ని అధిరోహించి భక్తలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మ వార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. అనంతరం నంది వాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి ఆదిశంకరుడైన మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. అభిషే కానంతరం స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధుల మీదుగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం, వృషభ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈఓ మునిరాజ తెలిపారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
చిత్తూరు కార్పొరేషన్ : మండల కేంద్రాల్లో అధికారులు బాధ్యతగా పనిచేయాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు హెచ్చరించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ కార్యాలయ, జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయ ఏఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నెలకు 2 సార్లు ఎం–బుక్లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. ఎంబుక్లను ఉద్యోగులు జెడ్పీకి తీసుకురావాలని, కాంట్రాక్టర్లతో పంపరాదన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ప్రారంభానికి ముందు, పూర్తయ్యాక ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఆకస్మికంగా ఎంపీడీఓ కార్యాలయాలకు తనిఖీలకు వెళ్లినప్పుడు పలు విషయాలు తెలుస్తున్నాయన్నారు. కార్యాలయంలో ఒకరి పైనే పని ఒత్తిడి పడుతోందన్నారు. కొందరు పనులు చేయకుండా సాకులు చెబుతున్నట్లు తెలుస్తోందన్నారు. కొందరు పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారని, మరికొందరు కంప్యూటర్ పరిజ్ఙానం లేదని ఏదో సాకులు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇంక పలువురికి ఈ–ఆఫీసు మీద పరిజ్ఙానం లేదన్నారు. విధి నిర్వహణలో కక్కుర్తి పడి తప్పులు చేస్తే ఎప్పటికై న శిక్ష అనుభవించక తప్పదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జుబేదా తదితరులు పాల్గొన్నారు. -
చందాలతో వేసుకున్న రోడ్డుకు బిల్లు
కదిరిముత్తనపల్లిలో చందాలతో వేసుకున్న రోడ్డుకు కూటమి నేతలు బిల్లు పెట్టేందుకు యత్నించడంపై స్థానికులు నిరసన తెలిపారు.● పూతలపట్టు మండలం వావిల్ తోట పంచాయతీ అబ్బిరెడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళకు వారం కిందట జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు తలనొప్పి, నీరసం, ఒళ్లు నొ ప్పులు ఉండడంతో వైరల్ ఫీవర్గా భావించారు. జ్వరం మాత్రలు మింగి తగ్గిపోతుందిలే అనుకున్నారు. తీరా చూస్తే తీవ్రత పెరిగింది. దీంతో కుటుంబీకులు చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షిస్తే స్క్రబ్ టైఫస్గా బయట పడింది. ఈనెల 19 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ● ఈనెల 2వ తేది పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామంలో మరో కేసు వెలుగుచూసింది. 49 ఏళ్ల మహిళకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం తీవ్రంగా మారింది. మందులు, మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోవడంతో అయిదు రోజుల పాటు జ్వరంతో అల్లాడిపోయింది. బయట ఆస్పత్రుల్లో చూపించినా తగ్గకపోవడంతో చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్గా నిర్ధారించారు. ఆపై సరైనా వైద్యసేవలు అందించడంతో 10 రోజుల కిందట డిశ్చార్జ్ అయింది. ఇలాంటి కేసులు ఈరెండు మాత్రమే కాదు..జిల్లాలో పదుల సంఖ్యలో నమోదు అవుతూ కలవరానికి గురి చేస్తోంది. – 8లో– 8లో -
పెట్టుబడి పెట్టండి..తిరిగొస్తుందిలే.!
● కుప్పంలో 7489 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్ టాప్ సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గంలోని 7489 ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(కెఆర్ఈసీఎస్ఎల్) సమర్పించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే నియోజకవర్గంలో 30వేల వ్యవసాయ పంపుసెట్లను సోలరైజ్ చేసే ప్రాజెక్టును కూడా అదే డీపీఆర్లో పొందుపరిచారు. దానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్టాప్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంద్రం నుంచి కొంత సబ్సిడీ వస్తుంది. మిగతా మొత్తాన్ని కెఆర్ఈసీఎస్ఎల్గానీ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్)గానీ పెట్టుబడిగా భరించాల్సి ఉంటుంది. అలా పెట్టిన పెట్టుబడి 3 నుంచి 5 ఏళ్లలో తిరిగి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సోలార్ పంపుసెట్లకు పీఎం కుసుమ్ పథకం ద్వారా వచ్చే నిధులతో ఏర్పాటు చేసుకోవాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అడగనవసరం లేదని స్పష్టం చేశారు. -
ఆటగదరా శివ..
● గత ఏడాది శివరాత్రిన భర్తను ఏమార్చి.. ప్రియడితో వెళ్లిన వివాహిత ● మళ్లీ ఈ ఏట శివరాత్రి ఉత్సవాలలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఇప్పుడేమైందంటే... నాడు శివరాత్రి జాగారణకు గుడికి వెళ్లి వస్తానని భర్తను ఏ మార్చి ప్రియుడితో వెళ్లి ఓ సైకో ను చంపి ఆపై ఆరునెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన కోమల ఆపై తన ఇరువురు బిడ్డలను బాగా చూసుకుంటూ భర్తతో కలసి ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా జీవనం సాగించింది. సోమవారం ఉదయం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆమె మనస్తాపానికి గురై పక్కనే ఉన్న జల్లిపేట చెరువులో ఆత్మహత్య చేసుకొంది. స్థానిక ఫైర్ సిబ్బంది ఆమె మృతదేహాన్ని వెలుపలికి తీశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇలా ఉండగా గత శివరాత్రి నుంచి ఈ శివరాత్రిలోపు జరిగిన ఘటనలను గమనించిన స్థానికులు కర్మ సిద్దాంతం ఉందయ్యా శివయ్యా అంటూ జనం చర్చించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.పలమనేరు : కర్మ సిద్ధాంతం ఉందనే మాట మళ్లీ జనానికి గుర్తు చేసిన ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) ఇంట్లో గొడవ జరిగి రెండు రోజుల కిందట జల్లిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. వీరికి వివాహం జరిగి ఏడేళ్లు అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం ఉదయం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆమె మనస్తాపానికి గురై పక్కనే ఉన్న జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది సాధారణ ఆత్మహత్య అనుకుంటే పొరబాటే. దీని వెనుక ఏడాది కిందట శివరాత్రి నాటి కథ తెలియాల్సిందే. గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే... గడ్డూరుకు చెందిన కోమల ఇదే మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ప్రియుడు గౌతం(26)తో కలిసి వెళ్లేందుకు శివరాత్రి జాగరణ పేరిట గుడికి వెళుతున్నానంటూ భర్తను నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంటి బయట బైక్పై ఉన్న ప్రియుడితో కలసి గడ్డూరు నుంచి పట్టణ సమీపంలోని జగమర్ల అడవిలోకి వెళ్లారు. అడవిలోకి ఎవ రైనా ప్రేమికులు కలుసుకొనేందుకు వస్తే వారిని బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్ఫోన్లు చోరీ చేసి మహిళలను రేప్ చేయడంతో ఓ సైకో దిట్ట, ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోమల, గౌతం అడవి లో ఉండగా చెట్టుపై మాటువేసిన సైకో వినయ్ వీరిని బెదిరించాడు. డబ్బు, మహిళపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలన్నాడు. అందుకు వారు అడ్డం తిరగ్గా తన వద్దనున్న రాడ్తో కొట్టేందుకు గౌతంను చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో గౌతం అక్క డున్న బండరాయితో వినయ్పై పడేశాడు దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఆపై ఏమీ తెలియనట్లు వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం మూడురోజుల తర్వాత వెలుగు చూసింది. ఇదే సమయంలో తామే హత్య చేశామంటూ కో మల, గౌతం స్థానిక పోలీసుల వద్దకు రావడంతో మొత్తం విషయం బయటపడింది. మృతుడు పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్ (30) గా పోలీసులు గుర్తించారు. ఇలా ఉండగా శివాడి గ్రామానికి చెందిన శివశంకర్ కుమారుడైన వినయ్ గత కొన్నేళ్ల నుంచి చెడు వ్యసనాలకు బానిసై సంచార జీవనం సాగిస్తూ గంజాయి అక్రమరవాణా, చోరీలకు పాల్పడేవాడు. ఇతనిపై గంగవరంతో పాటు కర్ణాటకలోని పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సైకోగా మారిన వినయ్ పట్టణ సమీపంలోని జగమర్ల అడవిలో పగలు, రాత్రి ఉంటూ ఏకాంతం కోసం అక్కడికి వెళ్లే ప్రేమికులను బెదిరించడం చేసేవాడు. ఈ నేపథ్యంలో వీరిని బెదిరించడం జరిగి ఆపై గొడవల్లో ప్రేమికుల చేతుల్లో ఇతను హత్యకు గురయ్యాడు. -
పాఠశాల విద్యార్థుల ఈవ్ టీజింగ్!
శాంతిపురం : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విదార్థినులను అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితులు టీజింగ్ చేయడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం స్కూలు ముగిశాక జాతీయ రహదారి మీదుగా ఇంటికి కాలి నడకన బాలికలు బయలుదేరారు. అదే సమయంలో మరో గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి, తన మిత్రులతో కలిసి బైకుపై వచ్చి అమ్మాయిలపై పూలు చల్లుతూ ఆకతాయి వేషాలు వేశారు. బాలికలు ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం వారు పాఠశాలకు వచ్చి హెచ్ఎం నటరాజరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో 9వ తరగతి విద్యార్థి కుటుంబ సభ్యులను పిలిపించిన హెచ్ఎం వారిని హెచ్చరించి పంపారు. నిందితుడు, బాధిత బాలికలు అందరూ మైనర్లే కావడంతో వారికి వేర్వేరుగా కౌన్సెలింగ్ ఇచ్చారు. -
మారథాన్ వీరుడి మరో ఘనత
చిత్తూరు అర్బన్ : దేశంలో ఎక్కడా మారథాన్ జరిగినా అందులో పాల్గొనే సీఐ రామకృష్ణ తన కెరీర్లో మరో మారథాన్ పూర్తి చేశారు. గత ఆదివారం ఢిల్లీలో జరిగిన పూర్తిస్థాయి మారథాన్లో పాల్గొన్న ఆయన 3.26 గంటల్లో పరుగును పూర్తి చేశారు. గతేడాది ముంబైలో జరిగిన టాటా మారథాన్లో 42.2 కిలోమీటర్ల దూరాన్ని 3.21 గంటల్లో పూర్తి చేసిన ఆయన.. తాజా మారథాన్లో 5 నిముషాల నిడివిని తగ్గించి, లక్ష్యాన్ని పూర్తి చేశారు. తన తరువాతి మారథాన్ను 3.05 గంటల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. కాగా తిరుపతి పోలీసు శిక్షణ కేంద్రంలో రామకృష్ణ పనిచేస్తున్నారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయండి
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి1న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడీ నెల్లూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జీడి నెల్లూరు హరిజన వాడ, రామానాయుడు పల్లిలో సభా వేదిక, హెలీప్యాడ్కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు , ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త వెంకటేష్తో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ నిర్వహణ, ప్రజా వేదిక, పెన్షన్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సంబంధిత అంశాలపై చర్చించారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఇస్మాయిల్, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు అప్పగించిన ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని గంగాధర నెల్లూరు మండలానికి మార్చి1వ తేదీన సీఎం వస్తున్నారన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం హాజరై లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారని తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అప్పగించిన విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించకూడదని కోరారు. హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాలకు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి వసతి, బారికేడ్లు, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. సీఎం పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావించి విధులు నిర్వర్తించాలన్నారు. హెలీప్యాడ్ ఏర్పాటుకు ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పారు. స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు సంబంధిత పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్ఓ మోహన్కుమార్, ఏఆర్ ఏఎస్పీ శివానందకిశోర్, జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ఇతర శాఖల అధికారులు చంద్రశేఖర్రెడ్డి, రవికుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ట్రాన్స్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో లూజు, ఓపెన్ వైర్లు ఉండరాదన్నారు. విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్గా అమర్చుకోవాలని చెప్పారు. లైన్ల నుంచి వచ్చే వైర్ల ద్వారా దేవాలయానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్ను పెట్టాలన్నారు. ఆలయానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీ మీటర్ల కంటే తక్కువగా ఉండరాదన్నారు. సిల్క్ వైర్లను వాడటం మంచిదికాదని, ప్రతి సర్క్యూట్కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్తవైర్ను తీసుకోవాలని సూచించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు సమయంలో విద్యుత్ అధికారుల సహాయ సహకారాలతో భద్రతా చర్యలు పాటించాలన్నారు. -
అశేషం..శివోహం!
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు శేష వాహనంపై, అమ్మవారు యాళి వాహనంపై ఆశీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మొదట స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సర్వాంగసుందరంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకుని రాజగోపురం వద్దకు వేంచేశారు. అక్కడ స్వామివారిని శేష వాహనంపై, అమ్మవారిని యాళి వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హంస, శుక వాహనాలపై ఆదిదంపతులు.. ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి బంగారు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసే సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప కొలవుదీరి స్వామి, అమ్మవార్లను అనుసరించారు. కళాకారుల కోలాటాలు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. పట్టువస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతులమీదుగా పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఈఓ బాపిరెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. -
ఇష్టం లేని పెళ్లిపై యువతి ఆత్మహత్యాయత్నం
పాలసముద్రం : ఓ యువతికి సమీప బంధువుతో కట్టబెట్టాలని బలవంతం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ముంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు సరిహద్దులోని గ్రామానికి చెందిన ఓ యువతి గార్మెంట్స్లో పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం యువతి బంధువులు తమ సమీప బంధువుతో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావి చుట్టు ప్రక్కల గాలించడంతో ఆ యువతి ముళ్లపొదల్లో ఉన్నట్లు గుర్తించి యువతి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని అప్పగించారు. కాగా ఆ యువతికి ఇంతక ముందే వివాహమై విడిపోయినట్లు బంధువులు తెలిపారు. -
● కాసులు కురిపించిన ‘ఉపాధి’ రోడ్లు ● సందు గొందుల్లోనూ సీసీ రహదారులు ● వైఎస్సార్సీపీ వాళ్లున్న చోట రోడ్లు వేయని వైనం ● సీసీ రోడ్ల ఎంపికల్లో కూటమి నేతల ఇష్టారాజ్యం ● నాణత్యకు తిలోదకాలు ● ప్రేక్షకపాత్ర పోషిస్తున్న అధికారులు
ఉపాధిహామీ పనులు కింద చేపట్టిన సీసీ రోడ్లు కూటమి నేతలకు కాసుల వర్షం కురిపించాయి. అవసరం ఉన్నచోట్ల రోడ్లు వేయడం కంటే..తమ్ముళ్లు ఎక్కడ చెబితే అక్కడ రోడ్లు వేసి అధికారులు కూటమి భక్తి చాటుకున్నారు. ఒక ఇంటికే దర్జాగా సీసీ రోడ్డు వేసినా అధికారులు కళ్లప్పగించి చూసారే కానీ అడ్డు చెప్పకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. వేసిన రోడ్లు సైతం నాసిరకంగా వేసి నాణ్యతకు తీలోదకాలు ఇచ్చారు. అందినకాడికి నేతలు దోచుకొని జేబులు నింపుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు మండలంలో పనులు ఇలా.. సచివాలయాలు 12 మొత్తం పంచాయతీలు 10 గ్రామాలు 56 మంజూరైన పనులు 34 నిధుల కేటాయింపు రూ.1,49,62 కోట్లు మంజూరైన మీటర్లు 3758 ఇప్పటిదాకా పూర్తయిన పనులు 27 ఇస్టాను సారంగా వేసిన పనులు 4 రోడ్లపైనే వేసిన రోడ్లు 1 అనుమతి లేకుండా వేసిన రోడ్లు 2 నాసిరకంగా ఉన్న రోడ్లు 4 బిల్లుల చెల్లింపులు రూ. 1 కోటి పనులు దక్కించుకున్న కూటమి నేతలు 34 మంది పలమనేరు : కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు ఉపాధిని కల్పించే పథకంగా పలమనేరు నియోజకవర్గంలో మారింది. తమకిష్టమైన చోట పనులు, కావాల్సిన వారికి సీసీ రోడ్లు, కాంట్రాక్టు పొందిన వారు మరొకరికి కమీషన్ కింద పనులు, పలుచోట్ల నాసిరకంగానే పనులతో ప్రజాధనాన్ని కూటమి నేతలు ఎడాపెడా మేసేశారు. నేతలు ఎక్కడ చెబితే అక్కడే పనులు పలమనేరు మండలంలో కూటమి నేతలు ముందుగా ఎక్కడ చెబితే అక్కడ మాత్రం పనులను చేపడుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా గతంలో సీసీ రోడ్లు వేసి దెబ్బతిన్నవి లేదా అవసరమైన వీధుల్లో వీటిని వేయకుండా టీడీపీ నాయకులు సూచించిన వీధుల్లో పనులను చేపట్టారనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరుల ఇళ్లకు వీలుగా సీసీ రోడ్లను నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. కమీషన్లు తీసుకొని వదిలేసి.. కొందరు సీసీ రోడ్ల పనులను చేజిక్కించుకొని వాటిని ఎంతో కొంత కమీషన్ తీసుకొని డబ్బులున్న కాంట్రాక్టర్లకు అంటగట్టి పనులు చేపించారనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి పనులు కూటమి నేతల జేబులు నింపేందుకు తప్ప గ్రామాల్లోని ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై సంబంధిత అధికారులను అడిగినా మాదేముంది అంతా అధికారంలోని వారి ఇష్టమే కదా అనే మాట వినిపిస్తోంది. నాణ్యత ప్రమాణాలేవీ...? సీసీరోడ్ల నిర్మాణాల్లో నిబంధనలు కూటమి కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్డు కింద పట్ట, బెర్ములు కనిపించలేదు. బస్తా సిమెంట్కు రెండు బస్తాల ఇసుక, నాలుగు తట్టల కంకర వేయాలి. వీటిని పెద్దగా పాటించలేదు. ఇక కాంక్రీట్ మిక్చర్లోనూ తక్కువరేటున్న సిమెంట్ను వాడారు. ఇన్నాళ్లకు డబ్బు సంపాదించుకొనే అవకాశం దక్కిన కూటమి కాంట్రాక్టర్లు దొరికినంత ఎక్కువగా సంపాదించేందుకు నాణ్యతకు తిలోదకాలిచ్చారనే విమర్శలు ఉన్నాయి. 30 నుంచి 40 శాతం నేతల జేబుల్లోకి... పలమనేరు మండలంలో జరిగిన పనుల్లో వాటిని దక్కించుకున్న నేతలకు 30 నుంచి 40 శాతం జేబుల్లోకి అక్రమంగా వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే సీసీ రోడ్లను వేసిన కాంట్ట్రార్లకు పది శాతం దక్కేది గగనంగా ఉండేది.. కానీ కూటమి నేతలు నాసిరంగా పనులు చేపట్టి దొరినంత దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సైతం అధికార పార్టీ నేతలు కావడంతో చేసేదేమీ లేకుండా మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపించి కూటమి నేతలకు దాసోహమయ్యారు. పలమనేరు మండలంలో పరిస్థితి ఇలా.. పలమనేరు మండలంలోని మొరం పంచాయతీలోని రాజీవ్నగర్ కాలనీలో డ్రైన్లకు మంజూరైన నిధులను సీసీ రోడ్డుకు వినియోగించుకున్నారు. గతంలో గ్రామానికి వేసిన సీసీ రోడ్డుకు మిగిలిన చోట మాత్రం సీసీ రోడ్డును వేశారు. జరావారిపల్లిలో ఇంకా సీసీ రోడ్ల పనులు మొదలు కాలేదు. ఇదే పంచాయతీలో పందేరుపల్లి సమీపంలోని తెల్లగుండ్లపల్లి కాలనీకి రోడ్డు దెబ్బతిన్నా సీసీ రోడ్డుకు ఎంపిక చేయలేదు. సముద్రపల్లి పంచాయతీ నూనేవారిపల్లిలో ఎంపిక చేసిన వీధిలో పనులు ఇంకా చేపట్టలేదు. జంగాళపల్లిలో అనవసరమైన వీధుల్లో ఇప్పటికే సీసీ రోడ్లను వేశారు. అక్కడ వైఎస్సార్సీపీ సానుభూతి పరులున్న వీధులను పట్టించుకోలేదు. కోతిగుట్టలో కేవలం టీడీపీ సానుభూతిపరుడి ఇంటికి సౌకర్యంగా సీసీ రోడ్డును నిర్మించారు. మండలంలో సాగిన ఈ పనులు పలుచోట్ల నాసిరకంగా ఉన్నా సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
జిల్లాలో ఫీవర్ కేసులు ఇలా.. నెల ఫీవర్ కేసుల సంఖ్య నవంబర్–2024 5,289 డిసెంబర్–2024 4,640 జనవరి–2025 4,425 ఫ్రిబవరి–2025 3,502
కాణిపాకం : స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బుష్ టైఫస్ అని పిలుస్తారు.. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. కీటకం కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువగా ఈ వ్యాధి బారీన పడుతారు. చెట్లు, పొలాల్లో ఉండే ఈ కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపు తాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారి శరీరం పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. అవగాహన లేకపోవడం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు, పూతలపట్టు, గుడిపాల మండలాల్లో పలువురికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించాయి. గతేడాది ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్ష కిట్లు లేవు... ఈ వ్యాధి నిర్ధారణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్ఫ్రారెక్ట్ ఇమ్యూనో ఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఎ) పరీక్ష, ఇన్ఫ్రారెక్ట్ ఇమ్యూనో పెరాకై ్సడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీ బయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అందుకే ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గుర్తిస్తారు. ఈ వ్యాధి నిర్ధారణకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి కిట్లు, పరీక్షలు లేవని వైద్యులే చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తితో అవయవాలపై ప్రభావం uవ్యాధి లక్షణాలు ఇలా.. అధిక జ్వరం తీవ్రమైన చలి పొడిదగ్గు తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, నీరసం ఎరుపు మచ్చలు లేదా శరీరంపై దద్దుర్లు ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కోరలు చాస్తున్న స్క్రబ్ టైఫస్ జిల్లాలో క్రమంగా పెరుగుతున్న టైఫస్ కేసులు జ్వరమని తేలికగా తీసుకుంటున్న జనం నిర్లక్ష్యం చేస్తే అవయవాలపై తీవ్ర ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రుల్లో టైఫస్ పరీక్షలు శూన్యం నిర్లక్ష్యం చేయొద్దు జ్వరం రెండు, మూడు రోజులు ఉంటే పర్వా లేదు. దానికి మించి జ్వరం ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. పలు పరీక్షలు చేసుకుని జ్వర కారణాలను నిర్ధారణ చేసుకోవాలి. వీటిని లెక్క చేయకుండా రెండు మందు బిల్లలు మింగితే తగ్గిపోతుందని తేలికగా తీసుకోవద్దు. జ్వరం ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తుంది. ఆ రకంలో ఈ స్క్రబ్ టైఫస్ ఒకటి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై మచ్చలను గమనించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో స్క్రబ్ టైఫస్ను గుర్తించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ అశోక్కుమార్, పల్మోనాలజిస్ట్, క్రిటికల్ కేర్ ఫిజీషియన్, చిత్తూరు న్యూమోనైటీస్ తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ ప్రభావం కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం హృదయ కండరాల వాపు సెప్టిక్ షాక్ అంతర్గత రక్తస్రావం తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితి చూపడం సకాలంలో గుర్తించి వైద్యం పొందితే బయటపడొచ్చునని వైద్యుల సూచన -
పరీక్షలకు వేళాయె!
దిగవూరు వద్ద పొలంలోని ఇంటికి వేసిన రోడ్డు తుమ్మింద కాలనీలో అధ్వానంగా దారి మామిడి తోటలో గెస్ట్హౌస్కు వేసిన బాటజిల్లాలో పది , ఇంటర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది పరీక్షా సమయం. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వం సన్నద్ధమయ్యేందుకు మార్చి, ఏప్రిల్ నెల అత్యంత కీలకం. విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో పది, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం కావడం ముఖ్యమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది. ఇంటర్ విద్యార్థుల హాల్టికెట్లు విడుదల కాగా, త్వరలో పదో తరగతి హాల్టికెట్లు రానున్నాయి. జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చిత్తూరు కలెక్టరేట్ : పరీక్షల సమయం సమీపించింది. సంవత్సర కాలం పాటు వ్యయ ప్రయాసల కోర్చి చదువుకున్న పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవితవ్యం పబ్లిక్ పరీక్షలతో ముడిపడి ఉంది. కష్టపడి పరీక్షలకు సన్నద్ధం అయిన విద్యార్థుల భవితవ్యం తేల్చే ప్రత్యేక సమయం దగ్గర పడింది. పుస్తకాలతో కుస్తీ పట్టి మేధస్సును మదించి పొందిన విద్యను మార్కుల రూపంలో ప్రతిఫలం అందించే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ఇక ఐదు రోజులే సమయం ఉంది. కాగా ఈ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు, అదే విధంగా పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ రెండు తరగతుల పరీక్షలు మార్చి నెలలోనే ప్రారంభం అవుతుండడంతో పాఠశాల, కళాశాల విద్యాశాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ప్రత్యేక ఫోకస్.. జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్న పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు మార్లు పది, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పలు శాఖల అధికారులకు పకడ్బందీ సూచనలు జారీచేశారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు ఇలా....... జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 30,652 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు ఇలా...... జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 118 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా మౌలిక వసతులు చేపడుతున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలకు నాలుగు రోజులే.. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ‘పది’ పరీక్షలు నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు పది, ఇంటర్ పరీక్షల జిల్లా సమాచారం ఇంటర్ పరీక్షల తేదీలు : మార్చి 1 నుంచి 20 వరకు ‘పది’ పరీక్షల తేదీలు : మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఇంటర్ పరీక్షకు హాజరుకానున్న మొదటి సంవత్సరం విద్యార్థులు : 15,482 ఇంటర్ పరీక్షకు హాజరుకానున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 15,170 పదో తరగతి పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు : 21,248 ఇంటర్ పరీక్ష కేంద్రాలు : 50 పదో తరగతి పరీక్ష కేంద్రాలు : 118టీవీ, సెల్కు దూరంగా ఉండాలి విద్యార్థులు పరీక్షల కాలంలో ముఖ్యంగా టీవీలు, సెల్ఫోన్ వాడకానికి దూరంగా ఉండాలి. గంట చదివిన తరువాత కొంత విరామం తీసుకోవడం అవసరం. సమూహంగా కూర్చొని, చదివిన విషయాన్ని చర్చించడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం, ధ్యానం చేయండి. – సయ్యద్మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈవో, చిత్తూరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముమ్మరంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడుతున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే సామర్థ్యం ఉన్న అధికారులను విధులకు కేటాయిస్తున్నాం. – వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు పరీక్షలకు భయపడాల్సిన అవసరం లేదు.. ఇంటర్, పదో తర గతి విద్యార్థులు భయాందోళన చెందకుండా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలో మాదిరిగానే పబ్లిక్ పరీక్షలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాయాలి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. – సుమిత్కుమార్ గాంధీ, కలెక్టర్, చిత్తూరు -
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్తూరు ఆర్టీసీ–2 డిపో నుంచి పలు ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీపీటీఓ జగదీష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అలాగే సిద్ధేశ్వరస్వామి కొండ, మరకతవళ్లి సమేత స్వయంభు శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయాలకు పెనుమూరు, పచ్చికాపల్లం నుంచి ప్రత్యేక సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టోర్స్ భవనానికి భూమి పూజ చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో ఉమ్మడి జిల్లా స్టోర్స్ భవనానికి సోమవారం భూమి పూజ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ మాట్లాడుతూ రూ.45 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే చిత్తూరులో రూ.47లక్షలతో నిర్మిస్తున్న ఎస్ఈ కార్యాలయ భవనం పనులు శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, వాసవీలత, శ్రీనివాసులు, డీఈలు వసంతనాయుడు, ఆనంద్, ఏఈలు మోహన్రావు, జనార్ధన్నాయుడు పాల్గొన్నారు. వర్మీకంపోస్ట్తో భూసారం చిత్తూరు కలెక్టరేట్ : వర్మీకంపోస్ట్తో భూసా రం పెరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వర్మీకంపోస్ట్ స్టాల్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్తో మట్టికి మంచి పోషకాలు లభిస్తాయన్నారు. దీంతో పంట దిగుబడి పెరుగుతుందని వెల్లడించారు. పర్యావరణహితమైన వర్మీకంపోస్టును రైతులు విరివిరిగా వినియోగించుకోవాలని సూచించారు. సేంద్రియ విధానంపై ఆసక్తిగలవారు ప్రతి సోమవారం కలెక్టరేట్లోని స్టాల్కు వచ్చి నాణ్యమైన వర్మీకంపోస్టు పొందవచ్చని చెప్పారు. రైతులు రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజసిద్ధమైన వర్మీకంపోస్ట్ వాడుకోవాలని కోరా రు. కార్యక్రమంలో డీపీఓ సుధాకర్రావు, డీపీఆర్సీ జిల్లా కో–ఆర్డినేటర్ షణ్ముగం పాల్గొన్నారు. 1న జిల్లాకు ముఖ్యమంత్రి రాక చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి 1వ తేదీన జిల్లాకు రానున్నట్లు కలెక్టరేట్ అధికారులు సోమవారం వెల్లడించారు. గంగాధరనెల్లూరులో చేపట్టే పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొనన్నుట్లు తెలిపారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
రావణబ్రహ్మపై శివయ్యరాజసం
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. యాప్లో ఫొటోలు తొలగింపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఈ పనులను బువిన్ అనే యాప్లో పొందు పరచాల్సి ఉంటుంది. పని ప్రారంభానికి ముందు ఆ రోడ్డు పరిస్థితిని ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. జియో ట్యాగ్ చేయాల్సి ఉంది. అలాగే పనిచేసే సమయం, పూరైనా తర్వతా ఫొటోలు విధిగా పెట్టాలి. ఆ వర్క్ ఐడీలో ఆ పనితీరును ఎక్కడైనా చూసుకొనేలా అవకాశం ఉంది. ఇది గమనించిన క్షేత్ర సహాయకులు క్షేత్ర స్థాయిలో చేపడుతున్న పలు పనులకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. ప్రధానంగా పని ప్రారంభానికి ముందు ఫొటోలను నాయకులు ఒత్తిడితో డిలీట్ చేశారనే ఆరోపణలున్నాయి. – 8లో -
చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’
● నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ● అవసరం లేని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం ● యథేచ్ఛగా ప్రజాధనం లూటీ చేస్తున్న కూటమి నేతలు ● వైఎస్సార్సీపీకి అనుకూలమైన ప్రాంతాలపై చిన్నచూపు ● చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ● చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్పురం గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్డుపై మళ్లీ రోడ్డు వేశారు. గతంలో ఉన్న రోడ్డుకు అక్కడక్కడా గతకులుగా ఉండేదని సాకుగా చూపి సిమెంట్ రోడ్డుపైనే మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతంలో వేసిన సిమెంట్ను జేసీబీలతో తొలగించారు. ఊరు మొత్తం నాలుగు వీధులు.. రెండు పొడవాటి దారులకు రోడ్డు నిర్మాణం చేశారు. మొత్తం 600 మీటర్లు కాగా ఇందుకు రూ. 25 లక్షల వరకు వ్యయం చేశారు. ● తుమ్మిందలో గ్రామంలోని ఓ కూటమి నేతకు ఊరికి దగ్గరగా మామిడి తోట ఉంది. ఈ విశాలమైన మామిడి తోటలో ఓ గెస్ట్హౌస్ కూడా ఉంది. ఆయనకు ఊళ్లో ఇళ్లు ఉన్నా పొలం పనులు, ఇతర అవసరాల కోసం అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఈ హౌస్కు కూడా సీసీ రోడ్డు వేశారు. 88 మీటర్లకు గాను రూ. 4 లక్షలు వ్యయం చేశారు. దీనిపై గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ● తుమ్మింద దళితవాడ వైఎస్సార్సీపీకి అనుకూలమని చిన్నచూపు చూశారు. కాలనీలో రోడ్డు అవసరం ఉన్నా రోడ్డు వేయలేదు. దీంతో కాలనీ బాటరోడ్డు పై పిచ్చిమొక్కలు ఏపుగా మొలిచాయి. సరైనా రోడ్డు మార్గం లేదు. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని లెక్క చేయకుండా మామిడి తోటలోని గెస్ట్హౌస్, ఒకే ఒక ఇంటికి, చెరువు కట్టలపై రోడ్డు వేశారని పల్లెవాసులు మండి పడుతున్నారు. ● తాళంబేడులో గ్రామంలోని ఓ బీడు భూమిలో శ్మశానం పేరు చెప్పి కిలో మీటర్ మేర రోడ్డు నిర్మించారు. ఇందుకు రూ. 7 లక్షల వరకు వ్యయం చేశారు. కానీ ఈ రోడ్డు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడానికే వేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ● దిగువమాసాపల్లి పంచాయతీలో కూటమి నేతల వర్గపోరుతో ఇష్టానుసారంగా పనులు జరుగుతున్నాయి. ఆ వర్గం రోడ్డు వేస్తుందని..మరో వర్గం ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంటి గుమ్మాన్ని కూడా వదలకుండా రోడ్డు నిర్మాణం చేపట్టింది. అప్పయ్యగారిపల్లి అనుమతి లేకుండా ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు వేసి వదిలేశారు. దిగువ కండ్రిగలో పక్క రోడ్డు చూపించి ఓ ఇంటి ముందు రోడ్డు వేశారు. దీనిపై బిల్లులు పెట్టించాలని కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కలెక్టర్కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. సీసీరోడ్ల పేరుతో కూటమి నేతలు రోడ్లు మేసి కాసులు దోచేస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణం సాగిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదు. కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లపైనే రోడ్డు వేసి దోచుకున్నారు. మరికొన్ని చోట్ల అవసరం లేకున్నా రోడ్లు వేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. కూటమి నేతల గెస్ట్ హౌస్లకు సైతం రోడ్లు పడుతున్నాయి. పొలాల్లో ఒకే ఒక ఇంటికి రోడ్లు వేసుకున్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలమైన ప్రాంతాలపై చిన్నచూపు చూస్తున్నారు. దీంతో గ్రామజనం భగ్గుమంటోంది. చిత్తూరు మండలంలో 17 పంచాయతీలు 117 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతల బాగోగుల కోసం సీసీ రోడ్ల నిర్మాణ పనులు జోరుగా మంజూరయ్యాయి. మొత్తం 73 పనులు..8,477 మీటర్లకు గాను రూ.3.56 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 46 పనులు..3,530 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.2 కోట్లకుపైగా వ్యయం చేశారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి నేతలు గబగబా రోడ్లు వేస్తున్నారు. అయ్యప్పగారి పల్లెలో అనుమతి లేకుండా ఇంటి గుమ్మం వరకు వేసిన సీసీ రోడ్డుమండల వివరాలు.. సచివాలయాల సంఖ్య 09 పంచాయతీలు 17గ్రామాలు 117 మంజూరైనా పనులు 73 మంజురైనా మీటర్లు 8,477 నిధుల కేటాయింపు రూ.3.56 కోట్లు ఇప్పటి వరకు పూర్తయిన పనులు 46..మీటర్లల్లో 3,530 చేపట్టాల్సిన పనులు 27 ఇష్టానుసారంగా చేసిన పనుల సంఖ్య 15 (చెరువు ప్రాంతం, కట్టప్రాంతం, మామిడితోటలు, ఇతరా) రోడ్లపైనే రోడ్లు వేసిన సంఖ్య 04 అనుమతి లేకుండా వేసిన రోడ్లు 03 నాసిరకంగా ఉన్న రోడ్లు 04 బిల్లు చెల్లింపులు రూ. ఒక కోటి చెల్లించాల్సిన బిల్లులు రూ.1.20 కోట్లు పనులు దక్కించుకున్న కూటమినేతల సంఖ్య 48 మంది(సుమారు) నాణ్యతకు పాతర.. సీసీ రోడ్లు నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించాలనే నిబంధన ఉంది. అయితే అందుకు విరుద్ధగా రోడ్డు నిర్మాణాలు సాగుతున్నాయి. గతంలో రోడ్లు వేస్తే కింద పట్టా, రోడ్డుకు మధ్య భాగంలో అక్కడక్కడా బెర్ములు అమర్చేవారు. ఎండ కాలంలో సిమెంట్ రోడ్లు కూడా సాగుతాయని..ఇలా చేస్తే రోడ్లు తొందరగా పాడవ్వకుండా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఆ పట్టాలు, బెర్ములు ఎక్కడా కనిపించ లేదు. రోడ్డుకు మధ్యలో అక్కడక్కడ మిషన్తో సన్నటి గీతలు చేస్తున్నారు. అది కూడా ౖపైపెకే జరుగుతున్నాయి. ఆ గీతలో తారు పోసేస్తున్నారు. ఇక రోడ్డు వేసే సమయంలో సిమెంట్, ఇసుక, కంకరను 1:2:4 నిష్పత్తిలో వినియోగించాలి. అంటే బస్తా సిమెంట్కు రెండు బస్తాల ఇసుక, నాలుగు తట్టల నల్లకంకర వేయాలి. కానీ పనులు జరిగిన చోట పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంలో నిబంధనలు పాటించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇసుక, కంకరను ఎక్కువగా వినియోగిస్తూ..సిమెంట్ను నామమాత్రంగా వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు చాలా చోట్ల కల్తీ సిమెంట్ ( బూడిద కలిపిన సిమెంట్) వాడుతున్నారు. ఇదీ తక్కువ రేటుకు వస్తుందని...అధిక మొత్తంలో ఇలాంటి సిమెంట్ను వాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్లుగా అవతారమెత్తిన కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా పనులు.. రోడ్లు మంజూరైన నెలల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అయితే ఆవేసిన రోడ్లను పలుచోట్ల పరిశీలిస్తే..ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నేతల స్వార్థం కోసమే రోడ్లు వేశారు. కూటమినేతే కాంట్రాక్ట్గా అవతారమెత్తి అతని గెస్ట్హౌస్కు రోడ్డు వేసుకున్నారు. పెద్దిశెట్టిపల్లి పంచాయతీ దిగువూరు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో ఉన్న ఒకే ఒక ఇంటికి రోడ్డు వేశారు. ఈ గ్రాామం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇష్టానుసారంగా రోడ్లు వేశారు. తుమ్మిందలో చెరువు కట్టపై రోడ్డు వేశారు. చెరువు కట్టపై సీసీ రోడ్డు వేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని, ఈ రోడ్డు ఎలా వేస్తారని కొంత మంది అధికారులు చెబుతున్నారు. కుర్చివేడులో రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా జరిగినట్లు అంటున్నారు. ఇలా పలుచోట్ల విచ్చలవిడిగా రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పల్లె ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.