breaking news
Chittoor
-
చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది మాత్రం..!
సాక్షి, టాస్క్ఫోర్స్: గురివిందకు కింద నలుపు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఓ పాలక మండలి సభ్యుడు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో గోవిందా...! నారాయణ..! అంటూనే ఇతరులపై విషం చిమ్ముతున్నాడు. ఆఖరుకి రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరివట్టం వ్యవహారం కూడా ఆయన తన రాజకీయ వేదిక కింద మలిచేశారు. టీటీడీలో ఏ వివాదం తలెత్తినా తగుతునమ్మా అంటూ వకల్తా పుచ్చుకుంటున్నాడు. పోనీ వాస్తవాలు చెబుతాడా..! అంటే అదీ లేదు. అన్నీ అసత్యాలే. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వారికి సంబంధించిన అంశాలు అయితే మాత్రం తిరుమలను వేదికగా చేసుకొని ప్రసంగాలు దంచేస్తాడు. ఇక రోజు మార్చి రోజు దర్శనానికి వచ్చే ఆయన అయితే.. టీటీడీ చైర్మన్ ప్రాపకం కోసం ఆయన చానల్లో కనిపించడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. అసత్యాలను వల్ల్లివేస్తున్నాడు.⇒ వరివట్టం కట్టడం విషయంలో గతంలో ఏమైనా జరిగాయో లేదో పక్కన పెడితే ఇలా చేయడం బహిరంగంగా తప్పని పండితులు చెప్తున్నారు.⇒ అయితే సదరు సభ్యుడు పబ్లిసిటీ పిచ్చి కోసం టీటీడీని అడ్డంగా వాడుకుంటున్నాడు. టీటీడీలో అనేక మంది పాలకమండలి సభ్యులు ఉన్నా.. ఎవరూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయరు. కానీ సదరు సభ్యుడు మాత్రం శ్రీవారి ఆలయం ముందు నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 2019 క్రితం పాలకమండలి సమావేశంలో అయితే ఏకంగా చైర్మన్ కార్యాలయంలోనే సమావేశం నిర్వహించి.. రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై భక్తులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ⇒ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా ఇలా మాట్లాడడంపై పలువురు భక్తులు రగిలిపోతున్నారు. -
● దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● బంధువుల రోదనలతో పుత్తూరు ఆసుపత్రి
పుత్తూరు : కై లాసవాసా ఉన్నెపాత్తదానే వందారు.. కై విట్టియే సామి అంటూ పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. బుధవారం సాయంత్రం స్థానిక బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తమిళనాడు పళ్లిపట్టు తాలుకా పొద్దటూరుపేటకు చెందిన మూర్తి (58), సుబ్రమణ్యం(56) అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ ఓబయ్య కథనం మేరకు.. పొద్దటూరుపేటకు చెందిన పవర్లూమ్స్ కార్మికులైన మూర్తి, సుబ్రమణ్యం ఇద్దరు బుధవారం ఉదయం బైక్పై శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొన్నారు. తిరుగు ప్రయాణంలో పుత్తూరు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మూర్తికి నలుగురు పిల్లలు కాగా, సుబ్రమణ్యానికి ముగ్గురు పిల్లలు అందరికీ వివాహాలు అయ్యాయి. -
కల్తీ మద్యం.. కూటమికి నైవేద్యం
తిరుపతి మంగళం : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కాసుల కక్కుర్తితో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతాయాదవ్, తిరుపతి నగర బూత్కమిటీ ఇన్చార్జి ఉప్పాల సాయికుమారి మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులను తొలగించాలి, నకిలీ లిక్కర్ తయారుచేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. టీడీపీ నేతలే విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప నకిలీ లిక్కర్ కారణంగా మహిళల పుస్తెలు తెగిపోతున్నా పట్టదని ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలోనే కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా లిక్కర్ దందాను నిలిపివేయకుంటే ఇదే మద్యం ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. పవన్కల్యాణ్కు ఇప్పడు కల్తీ లిక్కర్ కనిపించం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుణీత, పార్టీ నేతలు నైనారు మధుబాల, విజయలక్ష్మీ రాయల్, పద్మజ, పుష్పలత, మహిత, రాజేశ్వరి, రాధ, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ఎస్వీ వెటర్నరీలో జాతీయ సదస్సు ప్రారంభం
చంద్రగిరి: పశుపక్ష్యాదులకు అందించాల్సి మెరుగైన వైద్య సేవలు, శస్త్రచికిత్సల కోసం తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ తిలగర్ హాజరవ్వగా, ప్రత్యేక అతిథిగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ, ప్రొఫెసర్ ప్రతాబన్ పాల్గొన్నారు. ఎస్వీ వెటర్నరీ చికిత్స, టీచింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 రాష్ట్రాల నుంచి 25 పశువైద్య కళాశాలలకు చెందిన 250 పశువైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ తిలగర్ మాట్లాడుతూ.. పశువైద్యంలో స్పెషలిలైజేషన్ చాలా అవసరమన్నారు. పశువైద్య విద్యార్థులు స్కిల్తో పాటు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ పాత్ర చాలా ఉందని తెలిపారు. ప్రొఫెసర్ ప్రతాబన్ మాట్లాడుతూ.. శస్త్ర చికిత్స విభాగం, డయాగ్నోసిస్ విభాగం ప్రాముఖ్యత, వ్యాధి నిర్ధారణ విభాగాల పాత్ర చాలా అవసరమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి. వైకుంఠరావు, పశు వైద్య కళాశాల, తిరుపతి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ పి.జగపతి రామయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రొఫెసర్ వీరబ్రహ్మయ్య వ్యవహరించారు. అనంతరం పశువైద్య, శస్త్రచికిత్సలకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నగరి : మండలంలోని మునెప్పనాయుడు కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిందుప్రియ (5) అనే చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేష్ కుమార్తె బిందు ప్రియ వీధిలో ఆడుకుంటుండగా ఆ వైపు వేగంగా వచ్చిన ఆటో చిన్నారిని ఢీకొనడంతో పాటు చిన్నారిపై నుంచి పోవడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉడుమును వేటాడిన ఇద్దరు అరెస్టు చిత్తూరు కార్పొరేషన్ : ఉడుమును వేటాడిన ఇద్దరి వ్యక్తులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం అటవీశాఖ ఈస్ట్ ఎఫ్ఆర్వో థామస్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన జిల్లాలోని పాలసముద్రం మండలంలో ఉడుమును వేటాడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. వేటాడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎఫ్ఎస్వో చండికుమార్, బీట్ ఆఫీసర్లు బాలాజీ, ప్రభాకర్రెడ్డి, గౌస్భాషా, తదితరులు పాల్గొన్నారు. ఎస్వీయూ వీసీగానర్సింగరావుతిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది. -
పేలుడు పదార్థాల రవాణాలో ఐదేళ్ల జైలు
చిత్తూరు అర్బన్/చిత్తూరు లీగల్: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్, జిల్లా సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కథనం మేరకు.. 2019 ఫిబ్రవరి 22వ తేదీన కుప్పం మండలం మల్లనూరు–తిరుపత్తూరు రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా 40 జిలెటిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లు లభించాయి. ట్రాక్టర్ను సీజ్ చేసిన అప్పటి కుప్పం సీఐ జిటి.నాయుడు.. తమిళనాడు వేలూరుకు చెందిన నిందితుడు మురుగన్ మన్నుకన్(39)ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
సమర్థ పాలనతోనే దేశాభివృద్ధి
ఏర్పేడు : సమర్థవంతమైన పాలనతోనే దేశాభివృద్ధి సుస్థిరంగా సాగుతుందని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ‘ఇండియా రోడ్ అహెడ్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ, చట్ట పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు వంటి సామూహిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎందుకు అవసరమో వివరించారు. దేశంలో ప్రజాస్వామ్య విధానం, ఆర్థిక పరిణామం, సాంకేతిక విప్లవం కోసం నూతన ఆవిష్కరణల ఆవశ్యతకను విశదీకరించారు. సుస్థిర, సమ్మిళిత వృద్ధి సమాన అభివృద్ధిని నిర్ధారించేందుకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరం తగ్గించేందుకు ఆవిష్కరణలు ఉపయోగపడతాయన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిశ్రమ వంటి రంగాలే ప్రధాన ఆర్థిక వ్యవస్థలని వెల్లడించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ పదేళ్ల ప్రస్థానం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. -
సమస్యలు గుర్తించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంక్లను తనిఖీ చేసి సమస్యల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల నివేదికలను సంబంధిత హెచ్వోడీలకు అందజేయాలన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రూ.10 లక్షలు, వివిధ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పల్లె ముంగిటకే సేవలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య సేవలను పల్లె ముగింటకే తీసుకొచ్చింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. ఆ కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించింది. 150 రకాల మందులు, మాత్రలను అందుబాటులో ఉంచింది. 14 రకాల పరీక్షలు అక్కడే చేసేలా చర్యలు తీసుకుంది. కేంద్రం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తిస్తూ వచ్చింది. టెలీమెడిసన్ విధానం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసింది. తద్వారా పల్లె జనానికి వైద్య ఆరోగ్య సేవలను చేరువ చేసింది. ఈ సేవలను నిత్యం పర్యవేక్షిస్తూ..లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చర్యలు చేపట్టింది. పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్ల విధానాన్ని తీసుకొచ్చింది. పేషియల్ అటెండెన్స్ను తీసుకొచ్చి సేవలను పారదర్శకంగా అమలు చేసింది. పల్లె జనానికి ఆరోగ్య భరోసాను కల్పించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ వైద్య సేవలను నీరుగారుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కట్టమంచి.. ప్రమాదం పొంచి
సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ప్రసిద్ధి గాంచిన కట్టమంచి చెరువు సుందరీకరణకు తొలి అడుగు అంటూ గత ఏడాది సెప్టెంబర్ 24న కూటమి నేతలు హంగామా చేసి భూమి పూజ చేశారు. సుందరీకరణ చేపడుతున్నామంటూ ప్రజలను ఏమార్చారు. రోజులు గడిచే కొద్ది కట్ట మంచి చెరువులో జరిగే అభివృద్ధి ఏమిటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండు, రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో కట్టమంచి చెరువు ఉండటంతో అటు వైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కూటమి నేతలు జరిపిన అక్రమ మట్టి తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయారు. పొక్లయిన్, జేసీబీలతో యథేచ్ఛగా మట్టిని తవ్వి ఆ చెరువు తల్లికి తీరని శోకం నింపారు. ఎక్కువ లోతు మట్టిని తవ్వితే ప్రమాదం జరుగుతుందనే ఆలోచన కూడా లేకుండా వందల లోడ్ల మట్టిని అక్రమంగా తరలించి జేబులు నింపుకున్నారు. కూటమి నాయకులు చేపట్టిన పనులు సుందరీకరణగా లేకపోయినప్పటికీ కట్ట మంచి చెరువు ను డేంజర్ జోన్లోకి నెట్టేసింది. చెరువు కట్టలకు ప్రమాదం కట్ట మంచి చెరువులో ఎక్కువగా మట్టి తవ్వడం వల్ల కట్ట బలహీనపడే అవకాశాలున్నట్లు నగరవాసులు భయాందోళనకు లోనవుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ వర్షాలు కురిస్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. ఇష్టానుసారంగా అధిక స్థాయిలో మట్టిని తవ్వడం వల్ల కట్టమంచి చెరువులో భూగర్భ జలాల రీచార్జ్ సరిగ్గా జరగదని నిపుణులు వెల్లడిస్తున్నారు. బోర్లల్లో సైతం నీటి స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. మట్టిని ఎక్కువ లోతు తవ్వడంతో చెరువు సహజ జీవావరణం మారిపోతుంది. చెరువు భూమి కింద ఉన్న రాతి పొరలు బయపడి భూమి ఉత్పాదకత తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చెరువులో అనియంత్రితంగా మట్టిని తవ్వడం వల్ల తాత్కాలిక లాభం కంటే దీర్ఘకాల నష్టాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక వర్షాలు కురిస్తే కట్ట మంచి చెరువుకు సమీపంలో ఉండే ఆర్టీసీ బస్టాండు, సమీపంలో ఉండే కట్టమంచితో పాటు మరికొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. సంరక్షణ శూన్యం చెరువు సంరక్షణకు చర్యలు చేపట్టాల్సింది పోయి సుందరీకరణ పేరుతో మట్టిని అక్రమంగా తవ్వేశారు. అక్రమమట్టి తవ్వకాల వల్ల చెరువుకు చుట్టూ ఉన్న పెన్సింగ్ దెబ్బతింది. చెరువుకు సమీపంలో నిర్మించిన కాలువ కుంగిపోయింది. పలు చోట్ల పగుళ్లు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మట్టి లోతు 1 నుంచి 1.5 మీటర్ల వరకు మాత్రమే తొలగించాల్సి ఉంటే అంతకంటే ఎక్కువ లోతుకు తవ్వేశారు. దీంతో కట్టమంచి చెరువు సహజ రూపురేఖలు మారిపోయాయి. చెరువులోకి వచ్చే నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయకుండా అనేక వ్యర్థ పదార్థాలు అధికంగా చేరిపోయాయి. చెరువులో పీవోపీ విగ్రహాలు అలాగే ఉండటంతో కలుషితంగా మారింది. చెరువు కట్టకు దగ్గరలో తవ్వడం వల్ల అధికవర్షాలకు ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి నేతల వాదనలు ఇలా.. కట్ట మంచి చెరువులో నిర్వహించిన అక్రమ తవ్వకాల వ్యవహారం కొన్ని నెలలుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కట్టమంచి చెరువులో పూడికతీత పనుల వల్ల చిత్తూరు నగర పరిధిలో ఉండే బోర్లకు నీరు రీచార్జ్ అవుతుందని వెల్లడిస్తున్నారు. చిత్తూరు నగర పరిధిలో ఉండే దాదాపు 500 బోర్లకు పూడికతీత పనుల వల్ల ప్రయోజనం కలుగుతుందని కూటమి నేతలు వాదిస్తున్నారు. అయితే నిష్ణాతుల అభిప్రాయాలు, అధికారుల అనుమతులు, పర్యావరణ నిబంధనలు పాటించకుండా అక్రమంగా కట్టమంచి చెరువులో అక్రమ తవ్వకాలు నిర్వహించడం భవిష్యత్తులో నష్టమేనని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కట్ట మంచి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేశారు. చెరువులో అధిక లోతుకు మట్టి తవ్వడంతో కట్ట బలహీనపడి గండి పడే ప్రమాదం పొంచి ఉంది. చెరువులో ఎక్కువ లోతుకు మట్టి తవ్వేయడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అటు వంటి చెరువును తమ అక్రమార్జన కోసం స్వరూపాన్నే మార్చేశారు. ఫలితంగా అధిక వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని నగర వాసులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. -
‘నవోదయం’ నగుబాటు!
చిత్తూరు అర్బన్ : నాటు సారాకు సిబిల్ స్కోరుకు సంబంధం ఏంటనేగా సందేహం. అధికారులు తలుచకుంటే దేనికై నా లింకులు పెట్టగలరు. జిల్లాలో నాటుసారా వృత్తిని మాన్పించి.. ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెరపైకి తీసుకొచ్చిన నవోదయం 2.0 నవ్వులపాలవుతోంది. ఎవరెన్ని చెప్పినా తమ నిబంధనలు మారవంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో పంచాయతీ కలెక్టర్ వద్దకు వెళ్లనుంది. సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంచుకున్న కుల వృత్తులు, ఎదురైన పరిస్థితులు అట్టడగు పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. జిల్లాలోని కొన్ని వర్గాలు పల్లెల్లో సేద్యం చేసుకోవడానికి భూముల్లేక, ఉండటానికి సొంత ఇళ్లులేక రెండు, మూడు తరాల కిందట ఎంచుకున్న నాటు సారా తయారీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడిగా సారా తయారీను వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలు ఆ ఊబి నుంచి బయటకు రాలేకున్నాయి. ఇదే సమయంలో కూలీలకు డబ్బులు ముట్టజెప్పి రూ.కోట్లు గడించిన వాళ్లు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా మారిపోయాయి. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నవోదయం తీసుకొచ్చినా.. సారా తయారీ కుటుంబాలపై సమాజంలో అసమానతలను తొలగించడంలో విఫలమయ్యింది. సిబిల్ స్కోర్ లేదు.. రుణాలు ఇవ్వం సారా మాన్పించడానికి ఎవరెవరికి ఏయే రుణాలు ఇవ్వాలనేదానిపై ఎకై ్సజ్ అధికారులు ఓ నివేదిక సిద్ధంచేసి కలెక్టర్కు ఫైలు పంపించారు. తొలుత తాకట్టులేనిదే రుణం ఇవ్వబోమని మొండికేసిన బ్యాంకర్లు.. కలెక్టర్ చీవాట్లు పెట్టడంతో సరేనన్నారు. తీరా ఇప్పుడేమో అధికారులు ప్రతిపాదించిన వాళ్లకు సిబిల్ స్కోర్ లేదని, రుణాలు మంజూరు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవంటూ మొండికేసి కూర్చుకున్నారు. సారా తయారీను వదలిస్తే రుణాలు ఇప్పిస్తామన్న ఎకై ్సజ్ అధికారులు మాటలు వట్టివేనంటూ ఇప్పటికే పలు కుటుంబాలు మళ్లీ సారా ఊబిలోకి దిగుతున్నాయి. వీటిని నడిపిస్తున్న వ్యక్తులు సైతం క్రమంగా నాటుసారా విస్తరిస్తూ పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అదే పేరు.. అదే తీరు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు జిల్లాలో ఎక్కడా నాటు సారా ప్యాకెట్ ఒక్కటి కూడా తయారు కాకూడదని ఎకై ్సజ్ శాఖకు బాధ్యతలు పురమాయించింది. చిత్తూరులోని రాసనపల్లె, పాలసముద్రంలోని నరసింహాపురం, నగరి సత్రవాడ, విజయపురం మంగళం, కెవి.పురం, పుంగనూరులోని పెద్దతండా, నల్లగుంట్లపల్లె తండా, పట్రపల్లె తండా ల్లాంటి 52 సారా తయారీ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా గుర్తించారు. సారా తయారీ తప్ప మరో దారితెలియని 239 కుటుంబాలను గుర్తించి.. వీళ్లకు స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకు రుణాలు ఇవ్వడమే ఏకై క మార్గమని నివేదిక రూపొందించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ఫైలు సిద్ధం చేయగా.. బ్యాంకర్ల నుంచి ఊహించని ట్విస్టు ఎదురయ్యింది. -
సర్కారుకు షాక్ తప్పదు
తిరుపతి రూరల్ : విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు రోడ్డెక్కారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. తిరుపతి డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కూటమి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయాస్ సంఘాల సమాఖ్య (జేఏసీ) తిరుపతి డిస్కమ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం గ్రేడ్–2 కింద నియమితులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. డిస్కమ్ కో–చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ యాజమాన్యం అనుసరించే అశాసీ్త్రయ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు నష్టం వస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డిస్కమ్ కన్వీనర్ మురళీధర్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తూ దూర విద్య కళాశాలల్లో ఉన్నత చదువులు చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లడించారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయరాం మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. డిస్కమ్ వైస్ చైర్మన్ జయమణి మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్ 2 కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి విధించిన కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశార9ఉ. తిరుపతి సర్కిల్ జేఏసీ చైర్మన్ వెలకటూరి గోపి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.తిరుపతిలో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు మోసానికి నిరసనగానే.. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులను మోసం చేసినందుకు నిరసనగానే ఈనెల 13న చలో విజయవాడ చేపడుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి కూడా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పందించకుంటే ఈనెల 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు ఎల్.చలపతి, వై.వెంకట సునీల్, వి.సతీష్, టి.రవికుమార్, సురేష్,రియాజ్ అహ్మద్, రామలింగారెడ్డి, సంజీవరావు, కృష్ణయ్య , తిరుపాల్ రెడ్డి ,రంగయ్య ,హుస్సేనయ్య , శంకర్, బాలకాశి, నాగార్జున, సుధాకర్, ఏలుమలై పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
చంద్రబాబుకు దశితులంటే చిన్నచూపు
నన్నెవడ్రా ఆపేది? చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడి పేరు చెప్పిన ఆ వ్యక్తి నగరంలో కార్పొరేషన్ అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నాడు. ప్లాన్ లేకపోవడంతో భవన నిర్మాణాన్ని ఆపాలని ఇటీవల అధికారులు సూచించగా.. అధికార పార్టీ నాయకుడు ఫోన్ చేసి వదిలేయమన్నారు. సరేనని అధికారులు వచ్చేశారు. తీరా మూడంతస్తుల భవనం నిర్మిస్తుండడంతో కార్పొరేషన్ అధికారులు పనులను ఆపి, నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆ వ్యక్తి పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులపై నోరు పారేసుకున్నాడు. ‘నేను రూలింగ్ పార్టీ వ్యక్తిని. అన్నకు ప్రధాన శిష్యుడిని.. ప్లాన్ లేదు, అయితే ఎవడ్రా ఆపేది..?’ అంటూ ఏకవచనంతో అధికారులను తూర్పారబట్టాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు తీవ్రంగా స్పందించడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత అధికార పార్టీకి చెందిన వ్యక్తులైనా.. ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడి ఇలా అధికారులనే బెదిరింపులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తిరుపతి మంగళం : ‘చంద్రబాబుకు దళితుంటే చిన్నచూపు, అందుకే దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని వ్యాఖ్యానించారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టినా పట్టించుకోరు.. దళితులపై దాడులు జరిగినా స్పందించరు’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంల దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహనంపై కక్షపూరిత రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం కాల్చిన దుండగులను వదిలేసి, ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ అది స్వల్ప విషయమంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలీసులు కేవలం పచ్చనేతల మెప్పుకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ బుక్లో దళితులకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేస్తామని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నారాయణస్వామిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్యపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత సతీష్నాయుడే అంబేడ్కర్ విగ్రహాన్ని తగులబెట్టించాడని తెలిసినా పచ్చనేతల మెప్పు కోసం చిత్తూరు ఎస్పీ కుట్రపూరితంగా గోవిందయ్య పై కేసులు పెట్టారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ గతంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా టీడీపీ నేత సతీష్నాయుడు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే థామస్ ఏనాడైనా దళితుల కోసం పోరాటాలు చేశారా? ఎక్కడైనా ఒక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు కోసం దళితుడని అని చెప్పుకునే థామస్ తిరుమలకు వెళ్లినప్పుడు క్రిస్టియన్గా డిక్లరేషన్ ఇవ్వడంలోనే నిజ స్వరూపం తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తాను రూ. వేల కోట్లు అవినీతి చేశానంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చంద్రబాబు, పవన్కల్యాణ్ అంటరానివారిగానే చూస్తున్నారన్నారు. ఈ మేరకు దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, రామయ్య, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్పీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు. -
రాష్ట్ర తైక్వాండో పోటీలకు ఎంపిక
వడమాలపేట (పుత్తూరు): ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో అండర్–14 బాల బాలికలకు తైక్వాండో ఎంపిక పోటీలు సోమవారం చిత్తూరులో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వడమాలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని రేష్మా తైక్వాండో 20 కిలోల విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లా, రేపల్లెలో జరుగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న రేష్మాను హెచ్ఎం కరుణానవనీతం, ఉపాధ్యాయులు అభినందించారు. -
అవగాహన కల్పించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాక్షి దినపత్రికలో ‘ఏ మాత్రం తగ్గలేదు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్సీ, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు విధిగా నిర్వహించాలన్నారు. ర్యాలీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు ప్రవీణ, అనూష, వేణుగోపాల్, శ్రీవాణి, రామ్మోహన్ పాల్గొన్నారు. -
వాల్మీకి సేవలు మరువలేనివి
చిత్తూరు కలెక్టరేట్ : వాల్మీకి మహర్షి సేవలు మరువలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేయర్ అముద, బీసీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, సూపరింటెండెంట్ శ్రీను పాల్గొన్నారు. సావిత్రమ్మ కళాశాలలో.. నగరంలోని సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్.ఉషారాణి పాల్గొని ప్రసంగించారు. అధ్యాపకులు షమ్స్ అక్తర్ పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర రూ.9 ఇవ్వాలి
కోళ్లు పెంచి పోషిస్తే కార్పొరేట్ సంస్థలు కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఫీడ్, చిక్స్ క్వాలిటి తక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల పెంపకందారులు చాలా నష్టపోతున్నాం. కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉండడంలేదు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా కేజీకి రూ.9 ఇవ్వాలి. ఆరకంగా అధికారులు చొరవ చూపాలి. మాజీవనోపాధిని కాపాడాలి. – విశ్వనాథరెడ్డి, గంగాధరనెల్లూరు ఖర్చు పెరిగింది ఫౌల్ట్రీ రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇటీవల ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగాయి. కరెంటు బిల్లులు, వరిపొట్టు, బొగ్గు, మందుల ధరలు భారంగా మారాయి. కంపెనీ చెప్పిన విధంగా నిబంధనలు పాటించినా గిట్టుబాటు కలగడం లేదు. బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నాం. అప్పుల పాలవుతున్నాం. అధికారులు స్పందించాలి. మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – కేశవులురెడ్డి, చెన్నారెడ్డిపల్లి, గంగాధరనెల్లూరు -
అడ్డగోలుగా తవ్వకాలు
కట్టమంచి చెరువులో ఇరిగేషన్ అధికారుల సూచనలు, స్పష్టమైన అనుమతులతో పూడి కతీత పనులు చేపట్టినట్లు గతంలో కూటమి ప్రజాప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన సమాచారంతో అంతా అవాక్కయ్యా రు. కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. గత రెండేళ్లుగా తమ శాఖ తరఫున ఎటువంటి తనిఖీలు చేయలేదని ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. నెలలతరబడి సాగిన పూడికతీత పనులకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చేశారు. కట్టమంచి సుందరీకరణ పేరుతో టీడీపీ నాయకులు మట్టిని అక్రమంగా తరలించి దోచుకున్నట్టు స్పష్టం చేశారు. -
మోకాళ్లపై నిరసన
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఏపీపీహెచ్సీడీఏ సంఘం పిలుపు మేరకు జిల్లాలోని పీహెచ్సీ వైద్యులు సమ్మెను కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్ ధరించి.. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సంఘ నాయకులు ఎల్లయ్య, శిరీష మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె ఆగదన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్ సర్వీస్ పీజీ కోటా విషయంలో తగ్గేదేలేదన్నారు. పీహెచ్సీలు వెలవెల సమ్మె కారణంగా పీహెచ్సీలు వెలవెలబోతున్నాయి. వైద్యులు సమ్మె బాట పట్టారని తెలిసి పల్లెల్లోని జనం పట్టణ బాట పడుతున్నారు. కేవలం మందులు, మాత్రల కోసమే పీహెచ్సీలకు వస్తున్నారు. చికిత్స కోసం ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పీహెసీల్లో ఓపీ సేవలు పూర్తిగా స్తంభించాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మూలనపడ్డాయి. ఆన్లైన్ సేవలు ఆమాడ దూ రంలో పడిపోయాయి. పల్లెల్లో విష జ్వరాలు కోరలు చాస్తున్నాయి. సమ్మె మరిన్ని రోజులు కొనసాగితే పరిస్థితులు చేయిదాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
సచివాలయం పక్కనే జీవశ్చవంలా..
నగరి : పట్టణ పరిధి కశింమిట్ట సచివాలయ సమీపంలో నాలుగు రోజులుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నీరు, ఆహారం లేకుండా నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లేవారు గానీ, సచివాలయానికి వచ్చి వెళ్లేవారుగానీ, సిబ్బంది గానీ చూస్తూ వెళుతున్నారు తప్ప.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్నది తెలియరాలేదు. ఎండకు, వానకు ఎలాంటి చలనం లేకుండా అక్కడే పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ ప్రాంతంలో జీవశ్చవంలా పడి ఉన్నా అధికారులు ఎవ్వరూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణం తప్ప చలనం లేని ఇతని పరిస్థితిని ఆరా తీయాలనిని స్థానికులు కోరుతున్నారు. -
విచ్చలవిడిగా స్పిరిట్!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు ఏపీలోకి విచ్చలవిడిగా స్పిరిట్ దొడ్డిదారిన వస్తోంది. ములకల చెరువుతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఈ మద్యం తయారీకి అసలైన ముడిసరుకు ఆర్ఎస్(రెక్టిఫైడ్ స్పిరిట్). గతంలో మన రాష్ట్రంలోకి మహారాష్ట్ర, గోవాల నుంచి కర్ణాటక మీదుగా వచ్చేది. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్ఎస్ను ఆయిల్ ట్యాంకర్లలో స్మగింగ్ చేసేవారు. అప్పట్లో పలమనేరు పోలీసులు సైతం డీజిల్ ట్యాంకర్లో ఆయిల్ బిల్లుతో వస్తున్న స్పిరిట్ ట్యాంకర్ను పట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో గంగవరం మండలంలోని ఓ కోళ్ల ఫామ్లో నకిలీ మద్యం గుట్టురట్టయ్యింది. తయారీ పరికరాలు బెంగళూరు, నరసాపురం నుంచి వస్తుంగా.. స్పిరిట్ మాత్రం మహారాష్ట్ర నుంచి తమకు అందుతోందని పట్టుబడిన వ్యక్తులు ఎకై ్సజ్ పోలీసులకు చెప్పారు. తాజాగా ములకలచెరువుతోపాటు విజయవాడ ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారవతున్నందున స్పిరిట్ అక్రమ రవాణా మళ్లీ సాగుతోందని తెలుస్తోంది. ఇదో పెద్ద నెట్వర్క్ స్పిరిట్తో బయల్దేరిన ట్యాంకర్ గమ్యం చేరేదాకా ఓ రహస్య నెట్వర్క్ బలంగా పనిచేస్తోంది. ఒక్కో ట్యాంకర్కు నలుగురికి పైగా డ్రైవర్లు ఉంటున్నారు. ఈ వాహనానికి ముందు రోడ్డు క్లియరెన్స్ కోసం మరికొందరు ఇతర వాహనాలతో ఎస్కార్ట్గా వెళ్తుంటారు. వీరికి అండగా సంబంధిత ప్రాంతాల్లోని స్థానికులు, ఎకై ్సజ్, మార్కెటింగ్, రవాణాశాఖలోని కొందరి అండదండలున్నట్టు సమాచారం. వీరందరూ మొత్తం అక్రమరవాణాను చిన్న మొబైల్ ఫోన్ల ద్వారానే సాగిస్తారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోనే.. గతంలో నకిలీ మద్యం తయారీ జరిగింది కూడా కర్ణాటక, ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లోనే. ఇప్పుడు కూడా ములకలచెరువు కర్ణాటక రాష్ట్రానికి దగ్గర్లోనే ఉంటుంది. ఎందుకంటే తయారీకి అవసరమైన వస్తువులు చేరవేసేందుకు బోర్డర్లే సేఫ్టీగా వీరు భావిస్తుంటారు. ఏదేమైనా ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పిరిట్ అక్రమరవాణాపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో పలమనేరులో పట్టుబడిన స్పిరిట్ లారీ -
పరిసరాల శుభ్రత పై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలపై ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసే వర్షాలకు ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పకడ్బందీగా రీ సర్వే జిల్లా వ్యాప్తంగా 3వ విడత రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంలో మండల సర్వేయర్, వీఆర్వోలు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. రీ సర్వేలో అందే అర్జీలకు పది రోజుల్లోపు పరిష్కారం చూపాలన్నారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 31 గ్రామాల్లో 30,774 ఎకరాల భూమిని రీ సర్వే చేశారన్నారు. రెండో విడతలో 38 గ్రామాల్లో 40,359 ఎకరాల్లో, మూడో విడతలో 12 గ్రామాల్లో 3,859 ఎకరాల భూమిని రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వే వచ్చే ఏడాది మార్చి 31 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేపటి నుంచి జిల్లాలోని 12 గ్రామాల్లో మూడో విడత రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్కుమార్, సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ శాంతిరాజ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ
సదుం: మండలంలోని చెరుకువారిపల్లె శివార్లలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఆలయంలో ఉన్న బీరువాను చిందర వందర చేశారు. హుండీలో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారు. కాగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గం చిత్తూరు రూరల్ (కాణిపాకం): నగరంలో మంగళవారం జిల్లా నాయీబ్రహ్మణ సంఘ నూత న కార్యవర్గాన్ని ఎనుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చిట్టిబాబు, వెంకటేష్, అధ్యక్షుడిగా ప్రసా ద్, ఉపాధ్యక్షులుగా మురళి, లక్ష్మీకాంత్, కార్య దర్శులుగా ధనశేకర్, శివ, కోశాధికారిగా వాసు కిరన్, మురళీకృష్ణ, సహాయ కార్యదర్శిగా కార్తీక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రచార కార్యదర్శులు, సభ్యులను నియమించుకున్నారు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో కార్తీక్కు చోటు చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్సీసీ అధికారి, ఉపాధ్యా యుడు కార్తీక్కు రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల పరేడ్కి ఎన్సీసీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఆయన ఎంపికయ్యారు. ఆయన ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఫ్రీ ఆర్డీసీ క్యాంప్లో పాల్గొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ఆయన ఎంపిక కావడంపై హెచ్ఎం హసన్బాషా, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఐరాల: అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఫారేస్ట్ రేంజ్ అధికారి కథనం మేరకు.. సోమవారం తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ అధికారికి పులిచెర్ల సమీపంలో కొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ప్లయింగ్ స్క్వాడ్ బృందం రాత్రి 10 గంటల సమయంలో పులిచెర్ల క్రాస్ సమీపంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. ఇన్నోవా కారు వేగంగా వచ్చింది. పసిగట్టి ఐరాల మార్గంలోకి వెళ్లగా పోలీసులు వెంబడించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ బృందం మండలంలోని గుడిపల్లె సమీపంలోని మామిడి తోట పక్కన ఇన్నోవా కారుతో పాటు 439.100 కిలోల బరువున్న 13 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పుల్లిచెర్ల నుంచి సుమారు 30 కి.మీ దూరం వరకు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామన్నారు. నిందితుడు కారు వదిలి పరారయ్యాడని తెలిపారు. వాటి విలువ రూ.18,64,857 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలో సెక్షన్ అధికారి శశికుమార్, బీట్ అధికారులు చంద్రబాబు, ప్రసాద్కుమార్, వాచర్లు భార్గవ్, రాజా తదితరులు పాల్గొన్నారు. -
కోడికి కార్పొరేట్ అంతంతే!
కాణిపాకం: కార్పొరేట్ సంస్థల కారణంగా కోళ్ల పెంపకందారులు నష్టాల్లో మునిగిపోతున్నారు. కష్టపడి కోళ్లను పెంచితే కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 మాత్రమే చెల్లిస్తున్నారు. ఫలితంగా ఫౌల్ట్రీ రైతులు ఫల్టీకొడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతోవారు రోడెక్కి.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ను లేవనెత్తారు. కోళ్ల పెంపకం ఇలా... జిల్లాలో లింగాపురం, నాటుకోళ్లు, లేయర్స్, బ్రాయిలర్స్ పెంపకం జరుగుతోంది. లింగాపురం, లేయర్స్, నాటుకోళ్లు పక్కన పెడితే బ్రాయిలర్స్ కోళ్ల పెంపకంపై వెయ్యి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంటిళ్లిపాదీ ఈ పెంపకంలో నిమగ్నమైపోతున్నారు. వీరి వద్ద సుమారుగా 7 లక్షల నుంచి 10 లక్షల కోళ్లు పెరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట హెచరీస్ ద్వారా ఫౌల్ట్రీ రైతులు కోడి పిల్లలను తెచ్చుకుని పెంచేవారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలే పిల్లలను ఇచ్చి.. ఫీడు, మెడిసిన్ ఇస్తున్నాయి. ఫౌల్ట్రీ రైతులు వాటిని 40 రోజుల పాటు పెంచితే... కిలోకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఈ మొత్తం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. అదనపు భారం కోళ్ల పెంపకందారులు 10వేల కోళ్లను 40 రోజుల పాటు పెంచి పోషించాలంటే కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఫీడ్, మెడిసిన్ సరిపోవడం లేదని రైతుల వాదన. ఈ కారణంగా ఫౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడుతోంది. తొలుత పిల్లలను ఉష్ణోగ్రతలో పెట్టేందుకు బొగ్గు 25 బ్యాగు(25కేజీ)లు అవసరమవుతోంది. ఒక బ్యాగును రూ.500 చొప్పున్న కొనుగోలు చేస్తున్నారు. మెడిసిన్ ఖర్చులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోంది. కరెంటు బిల్లు 40 రోజులకు గాను రూ.7 వేల నుంచి రూ.9వేల వరకు వస్తోంది. వరిపొట్టు సైతం డబ్బులిచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని పెంపకందారులు వాపోతున్నారు. ఏదీ లాభం పెంపకందారులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కోడి పిల్లలను దింపే సమయంలో చెప్పే ధరకు, కోడి బలిసిన తర్వాత ఇచ్చే ధరకు పొంతన ఉండడం లేదని పెంపకందారులు వాపోతున్నారు. కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చనిపోయిన కోళ్లు, కాళ్లు దెబ్బ తిన్న కోళ్లను తమవైపే నెట్టేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇదేమని అడిగితే ఎఫ్సీఆర్, సీఎఫ్సీఆర్ పేరుతో బెదిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీకి రూ.9 ఇవ్వాలని రోడెక్కుతున్నారు. -
ఏ 'మాత్ర'o తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాత మందులంటూ బూచీ జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. -
తగ్గలేదు!
జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏ మాత్రం మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పాత మందులంటూ బూచీ కాణిపాకం: జిల్లాలో దాదాపు 1,500 మెడికల్ స్టోర్లు, 200పైగా హోల్ సేల్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్ ఎగ్గొట్టాలని చాలామంది మెడిసిన్ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. బేరాల్లేవ్! చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించరే మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తగ్గింపు ధరలు అమలు కావాలి ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి. – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు -
ఎంపీపీగా నాగినేని దుర్గాదేవి బాధ్యతల స్వీకరణ
నిండ్ర : నిండ్ర ఎంపీపీగా వైస్ ఎంపీపీ దుర్గాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో ఎంపీపీగా ఉన్న దీప వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన విషయం విధితమే. ఎంపీపీకి రాజీనామా సమర్పించే హక్కు ఉన్నందున ఆమె రాజీనామా ఆమోదించి గెజిట్ 14/2021లోని నిబంధనల మేరకు వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగినేని దుర్గాదేవికి ఎంపీపీగా బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో శివప్రసాద్వర్మ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కేరోజా హాజరై నూతన ఎంపీపీకి శుభాకాంక్షలతో పాటు ఆశీస్సులు అందజేశారు. ఎంపీపీ దుర్గ, పార్టీ నేతలు మాజీ మంత్రిని దుశ్శాలువలతో సత్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ పదవులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేయాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. పదవికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీపీ దీప, వైస్ ఎంపీపీ శుభ, ఎంపీటీసీలు విజేష్, రమ్య, కో–ఆప్షన్ సభ్యుడు అనిల్, జెడ్పీటీసీ పరంధామన్, రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి శ్యామ్లాల్, విజయపురం, నిండ్ర మండల పార్టీ అధ్యక్షుడు వేణురాజు, శివరాజు, విజయపురం ఎంపీపీ మంజు బా లాజీ, సర్పంచ్లు బాబురెడ్డి, చంద్రబాబు నాయకు లు మునికృష్ణారెడ్డి, శివయ్య, శివరాజు, రామచంద్రయ్య, మహేష్, చార్లీ, రాము పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో ఎంపీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న దుర్గాదేవి మాజీ మంత్రి, నూతన ఎంపీపీతో పార్టీ నేతలు -
గుర్తింపు లేదా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరోనా వంటి విపత్తులను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న వైద్య వృత్తికి తగిన గుర్తింపు లేదని పీహెచ్సీ వైద్య సంఘ నాయకురాలు శిరీష అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నా.. పీహెచ్సీ వైద్యులకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇక పీజీ కోటాను 10 శాతం తగ్గించడం దారుణమన్నారు. ఇలాగైతే పీహెచ్సీ వైద్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని గుర్తు చేశారు. పలుమార్లు దీనిపై రాష్ట్ర పాలకులకు విన్నమించినా ఎలాంటి మార్పులు లేవని వాపోయారు. వైద్యులు జానకీరావు, ఎల్లయ్య పాల్గొన్నారు. -
క్వారీ..వసూళ్ల సవారీ!
అడ్డూఅదుపూ లేదు సాక్షి టాస్క్ఫోర్స్: క్వారీలపై వసూల్ రాజాలు కన్నేశారు. రాయల్టీ పేరుతో దోచుకోవడం ప్రారంభించారు. దొంగ బిల్లులతో రెచ్చిపోతున్నారు. కాపు కాచి కాసులు కొట్టేస్తున్నారు. యూనియన్ పేరుతో అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. దీనికితోడు అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది. ఆ శాఖకు వసూళ్ల పగ్గాలు దక్కాయి. దీంతో అడ్డూ అదుపు లేకుండా మాఫియా వసూళ్లకు తెగబడుతోంది. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు కొమ్ము కాస్తూరనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఇంతేనా? బంగారుపాళ్యం మండలం, పాలేరు ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విలువైనా ఖనిజం బయట పడడంతో జోరుగా తవ్వేస్తున్నారు. ఇదంతా ఓ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో సాగుతోంది. అనుమతి లేకుండా ఈ క్వారీని కొనసాగిస్తున్నారు. ఆ విషయం సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలుసు. నేషనల్ హైవే రోడ్డు నుంచి చూసినా ఈ అక్రమ క్వారీ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో వరుసగా కథనాలొచ్చాయి. వీటిపై ఆ శాఖ అధికారులు స్పందించినట్టు నటించి మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. దోచేద్దాం..దాచేద్దాం! కూటమి అధికారంలోకి రావడంతో అందరి కన్నూ ఆదాయంపై పడింది. తొలుత వర్కులపై పడ్డారు. అవి పార్టీలో పట్టున్న నాయకులే దక్కించుకోవడంతో అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న క్వారీ తవ్వకాలపై కన్నేశారు. పార్టీ కోసం కష్టపడిన వారు, సీనియర్లందరూ అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ప్రధానంగా కూటమిలో కొత్త ముఖాలు మాత్రమే చక్రం తిప్పుతున్నాయి. వీరంతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా మైనింగ్ మాఫియాలోకి దిగి కోట్లకు పడగలెత్తుతున్నారు. కొండలు కరిగించి.. కోట్లు మింగేసి కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తగా తెరపై కనిపిస్తున్న కూటమి నేతలు మైనింగ్ మత్తులో పడిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకుని అక్రమ క్వారీలతో కోట్లు కొల్లగొడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దొంగబిల్లుల సంగతేంటి? రాయల్టీ అధికారిక వసూళ్లతోపాటు కూటమి నేతలు బెదిరించి యూనియన్ పేరుతో దొంగ బిల్లులు ఇస్తూ.. కాసులు దోచేస్తున్నారు. నెలనెలా కోట్లు కొల్లగొడుతూ గుట్టు చప్పుడు కాకుండా దొంగ బిల్లుల వ్యవహరాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యవహరం బయటకు రావడంతో దొంగ బిల్లులను నొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ఇది అధిష్టానం వరకు వెళ్లడంతో పార్టీలోని సీనియర్లతో పాటు వివిధ శాఖల అధికారులు సైతం దొంగ బిల్లుల రారాజుపై ఏళ్లు ఎక్కుపెట్టారు. దీంతో కొంతమందికి గట్టిగా అక్షింతలు పడ్డాయి. ఇంతలో అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది. పట్టుకుంటారా? అక్రమ క్వారీలు, తరలింపులు దర్జాగా సాగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయల్టీ వసూళ్ల పగ్గాలు ఆ శాఖకు అప్పగించినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వెళ్లి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ క్వారీలు, తరలింపులను కట్టడి చేసేందుకు సాహసం చేయడం లేదని, మైనింగ్ మాఫియాకు భయపడి వారు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు కార్యాలయంలోని ఓ అధికారి సహకారం, ఆయనిచ్చే సలహాలతోనే అక్రమ క్వారీల వ్యవహారం పుంజుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని బడానేతల పేర్లు చెప్పుకుంటూ ఈ దందాకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బంగారుపాళ్యంలో అక్రమ క్వారీ -
వారికి న్యాయవాదులు సహకరించకూడదు
మైనర్ బాలికలపై గ్యాంగ్రేప్, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దుర్మార్గపు కామాంధులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఆ నింధితులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదన్నారు. గత ఐదు రోజులకు ముందు సీఎం సొంత జిల్లా పెనుమూరు క్రాస్ వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన పార్కులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహాయం చేయకూడదని కోరారు. -
ఆగని ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలో పంట పొలా లపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుండడంతో రైతు లు లబోదిబోమంటున్నారు. సోమవారం తెల్ల వారు జామున బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి వరి పంట, ప్రభాకర్రెడ్డి, రుక్మణమ్మకు చెందిన వేరుశనగ పంటను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను వేరే ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగ తం పలికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేయగా.. ఏఈవో రవీంద్రబాబు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. -
టెంపో ఢీకొని వృద్ధురాలి మృతి
బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమ వారం టెంపో ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలంలోని కుమ్మరపల్లెకు చెందిన మునస్వామి భార్య రాజమ్మ(67) చిత్తూరు వెళ్తేందు కు కేజీసత్రం గ్రామానికి వచ్చింది. రోడ్డు దాటుతున్న క్రమంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాజ మ్మ మృతి చెందింది. మృతురాలు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నేడు మహర్షి వాల్మీకి జయంతి చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు హాజరుకావాలని కలెక్టర్ కోరారు. పేదల భూ సమస్యల పై పోరాటం చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా పేదల భూ సమస్యలపై సీపీఎం పోరాటం చేసేందుకు నిర్ణయించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పేదలు భూ సమస్యలు పరిష్కారం అవ్వక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వాటి పట్ల రెవెన్యూ అధికారులు చొరవ చూపాలన్నా రు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.8ను పరిశ్రమల నిర్వాహకులు చెల్లించడం లేదన్నారు. పరిశ్రమల్లో, ఇతర చోట్ల పనిచేసే వారికి 13 గంటల పనివిధానాన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా నాయకులు సురేంద్ర, గిరిధర్ గుప్తా పాల్గొన్నారు. -
తిరుపతిలో కత్తితో రౌడీషీటర్ హల్చల్
తిరుపతి క్రైమ్: తిరుపతిలోని విక్టరీ వైన్స్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీవీఎస్ సర్కిల్ వద్ద ఉన్న ఓ వైన్ షాప్ ముందు వీరంగం సృష్టించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు.. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తన బృందంతో ఆ యువకుడిని, అతనితో పాటు ఉన్న మరో యువకుడిని వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ కత్తితో హల్చల్ చేసిన వ్యక్తి రౌడీషీటర్ ఫిరోజ్, పక్కన ఉన్న వ్యక్తి సయ్యద్ బాషాగా గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు ఫిరోజ్ గతంలో కేసుల్లో నేరస్తుడనీ, అతను చాలా కాలంగా పరారీలో ఉన్నాడని తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించామని..వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయని.. తెలిపారు. నగరంలో నడిపించుకుంటూ కోర్టుకు రెండు రోజుల క్రితం చిత్తూరులో లైంగిక దాడి కేసులో నిందితులను పోలీసులు కోర్టు వరకు నడిపించుకుని తీసుకెళ్లారు. అదే తరహాలో తిరుపతిలో కత్తితో హల్చల్ చేసిన నిందితులు ఫిరోజ్, సయ్యద్ బాషాలను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండ్కు తర లించామని తెలిపారు. -
ట్రాక్టర్ల దొంగలు అరెస్ట్
గుడిపాల: రెండు ట్రాక్టర్లను దొంగతనం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం.. గుడిపాల మండలం, పశుమంద దళితవాడకు చెందిన వినాయకం ట్రాక్టర్ను జూలై 21వ తేదీ రాత్రి దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అలాగే సెప్టెంబర్ 30వ తేదీన కృష్ణజమ్మాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబునాయుడు ట్రాక్టర్ను కూడా ఎత్తుకెళ్లారు. వీటిపై కేసు నమోదైంది. చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనం జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ట్రాక్టర్లు రెండూ తమిళనాడు వైపుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు తమిళనాడు మేల్పాడి దారిలో నిఘా పెట్టారు. సోమవారం చలిచీమలపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కమ్మతిమ్మాపల్లె వైపు నుంచి మేల్పాడి వైపుగా రెండు ట్రాక్టర్లు.. వాటి ముందు ఒక మోటార్ సైకిల్లో వస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కాట్పాడి తాలూకా, కోదండ రామాపురం గ్రామానికి చెందిన బద్రి అలియాస్ సాయికుమార్(26), కార్తీక్(19), రాజమణి(47) ఉన్నారు. వారి నుంచి రెండు ట్రాక్టర్ల తోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు వారు పేర్కొన్నారు. -
అవిశ్వాస తీర్మానంపై నోటీసులు
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట ఎంపీపీ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సోమవారం చిత్తూరు సీఈఓ, వడమాలపేట ఎంపీడీఓకు వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు నోటీసులు అందజేశారు. మండల అభివృద్ధికి ఎంపీపీ సహకరించడం లేదని, సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయారని, ఫలితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని నోటీసులో పేర్కొన్నారు. చట్టం ప్రకారం నోటీసు అందుకున్న 15 రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని సూచించారు. నోటీసులు అందజేసిన వారిలో వైస్ ఎంపీపీలు డీ.ఉపేంద్ర, వీ.లోకేష్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎ.రవి, ఎ.ప్రతిమ, టి.పుష్పలత, ఇ.కనకమ్మ ఉన్నారు. -
స్వచ్ఛతే మన లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నాగయ్య కళా క్షేత్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో స్వచ్ఛత కార్పొరేషన్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 7 అవార్డులు, జిల్లా స్థాయిలో 55 అవార్డులు అందజేసినట్టు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులను కై వసం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ 2026 నాటికి జిల్లాకు 100 స్వచ్ఛత అవార్డులు తెప్పించాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేతుల మీదుగా జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులను అందజేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి త దితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్కు పనులు..కర్షకులకు కన్నీళ్లు!
శాంతిపురం: కర్ణాటక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలతో మండంలోనే పెద్ద దైన సోగడబళ్ల పెద్ద చెరువుకు చేరిన నీటిని వృథాగా కిందికి వదిలేశారు. పంచాయతీ కేంద్రమైన చెంగుబళ్ల గ్రామానికి పక్కనే ఉన్న ఈ చెరువు గట్టు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొరవ పనులు కూడా చేయాల్సి ఉంది. వర్షపు నీటితో ఈ పనులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన కాంట్రాక్టర్ మొరవ పక్కనే దాదాపు ఐదు అడుగుల లోతుతో కాలువ తీసి నీటిని వృథాగా వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. జల సంరక్షణ పనుల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తుంటే పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన నీటిని వినియోగించుకోలేని పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు స్పందించి నీటి వృథాకు కారణమైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టుదార్లు, సమీప గ్రామాల రైతులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లకు పనులు, బిల్లుల కోసం ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను విస్మరించారని స్థానిక సర్పంచ్ పూలకుంట భాస్కర్ వివమర్శించారు. మొరవ పక్కన కాలువ తవ్వి నీటి విడుదల సోగడబళ్ల పెద్ద చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు -
ఫ్యాను పాటకు డ్యాన్స్ వేస్తే ఎస్ఐ కొట్టారు
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో ఖాకీలు కూటమి పార్టీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ పాటకు డ్యాన్స్ వేశాడనే నెపంతో గుడిపాల మండలంలో ఓ బాలుడిపై ఎస్ఐ దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. తాను వైఎస్సార్సీపీ ఫ్యాన్ పాటకు డ్యాన్స్ వేస్తే టీడీపీ నేతల కుట్రతో ఎస్ఐ కక్షపూరితంగా తనపై దాడి చేసినట్లు గుడిపాల మండలం 189 కొత్తపల్లికి చెందిన యశ్వంత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఆరోపించారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో సోమవారం దళిత నేతలు, గ్రామస్తులతో కలసి మీడియాతో మాట్లాడాడు. గతనెలలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకలో అందరితో పాటు తాను కూడా పాల్గొన్నానన్నాడు. అందులో భాగంగా వైఎస్సార్సీపీ పాటకు డాన్స్ చేశానని తెలిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుడిపాల ఎస్ఐ తనను పిలిచి అకారణంగా కొట్టి హింసించారని ఆరోపించాడు. కొట్టిన విషయా న్ని నాయకుల వద్దకు వెళ్లి చెబితే.. భవిష్యత్తు లేకుండా చేస్తానని ఎస్ఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపై డీజేకు పర్మిషన్ లేదని కేసులు నమోదు చేశారన్నాడు. దీని వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని వివరించాడు. ఈ విషయమై ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని, దాడిచేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దళిత నేత గడ్డం విజయ్ మాట్లాడుతూ.. పాటకు డాన్స్ వేస్తే బాలుడి చెంపపై, చేతులు వాచేలా కొట్టడం సరికాదని మండిపడ్డారు. బాలుడికి న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
తప్పు చేసేవారికి శిక్ష ఖాయం
కుప్పం: అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడేవారికి శిక్ష తప్పదని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ డిజిటల్ డైరీ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, భవిష్యత్లో ఇలాంటి వారికి చట్టం శిక్షింస్తుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్త కోసం డిజిటల్ డైరీతో పాటు క్యూర్ కోడ్ సిస్టంమ్ను ప్రారంభించినట్టు వెల్లడించారు. దీని ద్వారా కార్యకర్తులు కూటమి ప్రభుత్వంతో జరుగుతున్న అక్రమాలు గురించి అధిష్టానం దృష్టి తీసుకెళ్లవచ్చన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ఆపేదెవడ్రా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి:తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులను బుట్టలో వేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తున్నారు. రాత్రీపగలు తేడాలేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి మట్టి, గ్రావెల్, ఇసుక, సిలికా, క్వార్ట్జ్ను సరిహద్దులు దాటిస్తున్నారు. దగ్గర్లోని వెంచర్లకు తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. అడ్డుచెప్పిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు రికార్డులు సృష్టించి స్వాధీనం ప్రభుత్వ భూములు చేసుకుంటున్నారు. అటు కుప్పం నుంచి ఇటు గూడూరు వరకు వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చిత్తూరు కేంద్రంగా భారీగా గ్రానైట్ దందా సాగుతోంది. చిత్తూరు, బంగారుపాళెం, యాదమర్రి, పాలసముద్రం, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు, కుప్పంలో కొండల్లోని గ్రానైట్ సంపదను కొల్లగొడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ పరిధిలోని కుంట్రపాకం సర్వే నం.599 ఎగువ చెరువులోని బంక మట్టిని భారీ యంత్రాలతో తోడి ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులోని నీటిని కూడా ఇటుక బట్టీలకు వాడుకుంటున్నారు. రైతులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగవుతున్న స్వర్ణముఖి తిరుపతి రూరల్ మండలం, అవిలాల రెవెన్యూ వేదాంతపురం పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదిని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు సర్వే నం.504/7 నదీ పోరంబోకు భూమిలో ఇసుకను తోడి విక్రయించి ఆపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా స్వర్ణముఖి నది పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం ఉన్న కొద్ది పాటి నదిని సైతం పూడ్చివేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కరిగిపోతున్న కొండలు.. స్వర్ణముఖి కరిగిపోతున్న అంజేరమ్మ కనం.. వడమాలపేట మండల పరిధిలోని అంజేరమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ కరిగిపోతోంది. ఇప్పటికే ఆలయం వెనుక ఉన్న కొండను యంత్రాలతో తొలిచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భూమిని చదునుచేసుకున్నారు. ప్రస్తుతం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సిద్ధం చేశారు. అదే విధంగా ఆలయం వెనుక ఉన్న కొండను తవ్వి గ్రావెల్ను తరలించకపోవడంతో పాటు.. ఆక్రమించి మామిడి చెట్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ అక్రమాలు స్థానిక అధికారులకు తెలిసినా మామూళ్ల పుచ్చుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
దర్జాగా దోషులు.. నిర్దోషులకు వేధింపులు
కార్వేటినగరం : అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో దోషులను దర్జాగా వదిలేసి, నిర్దోషులను వేధిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఆదివారం పుత్తూరు లోని తన నివాసంతో మీడియాతో మాట్లాడారు. దళితులపై కక్షగట్టి అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుడిని ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. దేవళంపేటలో రాజ్యాంగ నిర్మాత విగ్ర హం నెలకొల్పిన సర్పంచ్ గోవిందయ్యను మాత్రం అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఎలా కస్టడీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. గ్రామంలో అంబేడ్కర్ విగ్ర హం పెట్టినప్పటి నుంచి గొడవ చేస్తున్న టీడీపీ నేత సతీష్నాయుడుని వదిలిపెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్నాయుడు పలుమార్లు విగ్రహం తొలగించేందుకు యత్నించాడని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలికితీయాల్సిన పోలీసులు సైతం కూటమి ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులను సైతం దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. విగ్రహానికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయని, అయితే పోలీసులు అలాంటివి లేవని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈక్రమంలోనే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్దోషికి శిక్ష పడకూడదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి తానే నిప్పు పెట్టానని ఒప్పుకోవాలని ఓ మహిళను బలవంతం చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. అభం శుభం తెలియని అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని, నిజమైన దోషిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేఽశారు. వైఎస్సార్సీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్ పాల్గొన్నారు. -
కాలువలు లేక.. నీరు ముందుకు కదలక
చిత్తూరు అర్బన్: నగరంలోని సీఎంటీ రోడ్డులో మురుగు కాలువలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడితే సీఎంటీ రోడ్డులో వర్షపు నీరంతా రోడ్డుపై నిలిచిపోతోంది. కాలువలు లేకపోవడం, రోడ్డు ఆక్రమణకు గురవడంతో ఈ పరిస్థితి తతెత్తింది. నిత్యం ఇటువైపు వందలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వర్షం పడినప్పుడల్లా నీళ్లు రోడ్లపై, నివాసాల మధ్య నిలిచిపోతోంది. అటు వాహన చోదకులు, పాదచారులతో పాటు స్థానిక ప్రజలకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. పాలకులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
గుర్తుకొస్తున్నాయ్..
కార్వేటినగరం : వారంతా కార్వేటినగరం టీటీసీ కళాశాలలో చదువుకున్నారు.. చదువులు పూర్తవ్వగానే ఎవరికి వారే వెళ్లి పోయారు. ఎవరు ఎక్కడ స్థిరపడ్డారో ఎవరికీ తెలియదు. ఎక్కడో ఒకరో ఇద్దరో అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకునేవారు. ఇతర మిత్రులను వివరాలను గుర్తు చేసుకునేవారు. ఇంతలో ఒక ఫోన్ కాల్ టీటీసీ కళాశాల /్ఞాపకాలను గుర్తు తెచ్చింది. డైట్ కళాశాలలో అప్పటి స్నేహితులతో మళ్లీ కలయికకు శ్రీకారం చుడుతున్నామనే మాటలు వారందరినీ ఒకటి చేశాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడో ఉన్న వారందరనీ ఒకటిగా చేసింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ డైట్లో విద్యార్థులుగా మారిపోయారు. కార్వేటినగరం జిల్లా విద్యాశిక్షణా సంస్థలో 1985–86 విద్యాసంవత్సరంలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చదివిన విద్యార్థులు ఆదివారం డైట్ కళాశాలలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. అప్పట్లో వంద మంది విద్యార్థులు కలసి ఒక సంవత్సరం పాటు టీటీసీ చదువుకున్నారు. వీరిని ఒకటి చేయాలనే ఉద్దేశంతో కార్వేటినగరానికి చెందిన ఆ బ్యాచ్ విద్యార్థులు గాజుల నాగేశ్వరరావు, శేఖర్, ఆనంద్, మురుగన్ స్నేహితుల వివరాలను సేకరించి అపూర్వ కలయిక ప్రయత్నంలో విజయం సాధించారు. 39 సంవత్సరాల అనంతరం డైట్ కళాశాలలో కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు, వయసు మీరినా ఆట పాటలతో సందడి చేశారు. -
మదనపల్లెను జిల్లా చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం
పుంగనూరు : మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు పుంగనూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షుడు చందు, సీపీఐ , ఏఐటీయూసీ, మాల మహానాడు నాయకులు వెంకట రమణారెడ్డి, ఎన్ఆర్.అశోక్ ఆధ్వర్యంలో పలువురు కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారని తెలిపారు. ప్రస్తుతం హామీని అమ లు చేయాలని , పుంగనూరు, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అందరితోనూ కలసి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో గంగరాజు, నరసింహులు, శ్రీనివాసులు, మహబూబ్బాషా, జెవి.నాగరాజు, అజప్ప త దితరులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్.. అట్టర్ ప్లాప్
చిత్తూరు కార్పొరేషన్ : సూపర్ సిక్స్.. అట్టర్ ప్లాప్ అయ్యిందని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జి విజయానందరెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరు నగరంలో నాల్గవ డివిజన్ కట్టమంచిలో కార్పొరేటర్ స్వరూపరాణి, నాయకులు మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆ డివిజన్లోని ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వెఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ.. హామీలను అమలు చేయకుండా బాబు మోసగించారని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు అబద్దపు హామీలు గుప్పించి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 16 లక్షల మంది ఉంటే 2.70 లక్షల మందికే.. కూటమి ప్రభుత్వం తాజాగా ఆటో డ్రైవర్లను మోసగించిందని విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల పథకానికి 13 లక్షల మంది ఉంటే కేవలం 2.90 లక్షల మందికి ఇచ్చి పండగ చేసుకోమని చెప్పడం మోసం చేసినట్టేనని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ఏటా రూ.15 వేలు చొప్పున 16 లక్షల మందికి అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఆటో డ్రైవర్ల పథకం ఎగ్గొట్టారన్నారు. కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రోడ్డు అలినేషన్ ఆర్అండ్బీకి మార్పు చేసేలా ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాబు మోసాల నుంచి మేల్కోవాలి చంద్రబాబు మోసాల నుంచి ప్రజలు మేల్కోవాలని విజయానందరెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో మహిళలకు రూ.18 వేలు, నిరుద్యోగులకు ఏటా రూ.36 వేలు ఇస్తామని ఎగ్గొట్టారన్నారు. అనంతరం క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నాయకులు జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, రాహుల్రెడ్డి, శివారెడ్డి, మనోజ్రెడ్డి, కృష్ణారెడ్డి, తిమ్ము, నారాయణ, బాబురెడ్డి, సోమురెడ్డి, శేఖర్రెడ్డి, అఖిలేష్ త దితరులుపాల్గొన్నారు. -
గజరాజుల బీభత్సం
పులిచెర్ల(కల్లూరు) : పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని దిన్నెపాటి దళిత వాడ, బాలిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏనుగులు పంటలను నాశనం చేశాయి. వరుస దాడులతో పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. సురేంద్రరెడ్డికి చెందిన వరిపంట, రుక్మణమ్మకు చెందిన టమాట పంటలను నాశనం చేశాయి. ఏనుగులు పులిచెర్ల మండలాన్ని వదిలిపోవడం లేదని ఇక్కడే తిష్టవేసి రోజూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం వి.కోట : జలపాతంలో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని పోలీ సులు, అగ్ని మాపక సిబ్బంది ఆధ్వర్యంలో వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మండలంలోని గిడిగి జలపాతం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు (45) శనివా రం సాయంత్రం మండలంలోని గిడిగి జలపాతం చూసేందుకు సరదాగా వెళ్లాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశా త్తు జలపాతంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ఆదివారం సంఘటన స్థలా నికి చేరుకుని గల్లంతైన శ్రీనివాసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలిసులు తెలిపారు. అందాల హరివిల్లు బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లెలో రెండు ఇంద్ర ధనుస్సులు అక్కడి ప్రజలను కనువిందు చేశాయి. ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. సాధారణంగా వర్షం కురిసిన తరువాత ఒక ఇంద్ర ధనుస్సు వస్తుందని అయితే రెండు ఇంద్ర ధనుస్సులు ఒకేసారి రావడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. -
వసతి పర్యవేక్షీణం
జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ కళాశాల మైదానం ఆవరణలో ఉండే బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో సమస్యలు తాండవిస్తున్నాయి. 150కి పైగా బాలికలు ఉండే ఆ వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేని దుస్థితి. దీంతో ప్రస్తుతం అక్కడున్న వార్డెన్ ఇంచార్జి కావడంతో విద్యార్థుల సమస్యలు అంతగా పట్టించుకోని పరిస్థితి. ఇంచార్జి వార్డెన్కు సమస్యలు చెప్పుకోవాలంటే విద్యార్థులు జంకుతున్నారు. ఇంకెవరైనా అధికారులు తనిఖీకి వస్తే చెప్పుకుందామనుకుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటమే లేదు. జిల్లా కేంద్రంలోని ముఖ్యమైన వసతి గృహంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే వసతి గృహాల దయనీయ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడం, ఇంచార్జి వార్డెన్లతో గాడి తప్పుతున్నాయి. కార్వేటినగరం మండలం కత్తెరపల్లి బీసీ వసతిగృహానికి ఇన్చార్జులే దిక్కు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 బాల, బాలికల వసతి గృహాలున్నాయి. ఇందులో 3162 మంది బాల, బాలికలు ఉంటున్నారు. అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 25 ప్రీ మెట్రిక్ వసతి గృహాలుండగా అందులో 1022 మంది, 13 కళాశాల వసతి గృహాలుండగా అందులో 871 మంది విద్యార్థులుంటున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలకు పూర్తి స్థాయిలో వార్డెన్లు లేని దుస్థితి. దీంతో సగానికి పైగా హాస్టళ్లను ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో వార్డెన్లు లేకపోవడంతో హాస్టళ్ల పై సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు గాడి తప్పుతున్నారు. వారికి మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అస్తవ్యస్తంగా నిర్వహణ పూర్తి స్థాయిలో వార్డెన్లు లేకపోవడంతో ఒక్కొక్క వార్డెన్ రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్నారు. వాస్తవానికి ప్రతి హాస్టల్లో వార్డెన్, డిప్యూటీ వార్డెన్, కుక్, సహాయకులు, నైట్ వాచ్మెన్ ఉండాలి. దగ్గరలో ఉండే పీహెచ్సీ ఏఎన్ఎంలు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తుండాలి. కానీ, వార్డెన్లు అరకొరగా ఉండగా...మిగతా సిబ్బంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వార్డెన్లకు రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలను అప్పగించడంతో పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో మెనూ అమలు, నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అడ్మిషన్లు సైతం నామమాత్రంగానే జరిగాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం ప్రస్తుతం జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో ఒక్కో వార్డెన్ కనీసం రెండు వసతి గృహాలైనా బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఒకదానిలో బాధ్యతలు చూడటమే కష్టంగా మారిన సందర్భంలో రెండు, మూడింటి పర్యవేక్షణ అప్పగించడంతో వారు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ఆ ప్రభావం వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల చదువులపై ప్రభావం చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడి చదువులు సవ్యంగా సాగని పరిస్థితి నెలకొంది. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వార్డెన్లు రాత్రి సమయాల్లో ఏ వసతి గృహంలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నిబంధనలు గాలికి వదిలేసి.. నిబంధనల ప్రకారం సమీపంలోని వసతి గృహ అధికారికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలి. లేదా సమీపంలోని ఎస్సీ వసతి గృహ అధికారికీ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఎవరూ అందుబాటులో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతంలోని వారికి ఇంచార్జి బాధ్యతలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో అలా జరగడం లేదు ఇష్టానుసారంగా ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సస్పెన్షన్కు గురై తిరిగి విధుల్లో చేరిన వారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించకూడదు. అయితే కొందరికి నిబంధనలకు విరుద్ధంగా అదనపు బాధ్యతలను అప్పగించారు. వసతిగృహ అధికారులు రెగ్యులర్ గా పనిచేస్తున్న చోట ఉదయం, ఇంచార్జిగా వ్యవహరిస్తున్న హాస్టల్ లో సాయంత్రం సమయంలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఇవేమీ అమలు కావడం లేదు. 30 నుంచి 40 కి.మీ దూరంలోని వసతి గృహాలకు ఇంచార్జి బాధ్యతలను ఇవ్వడంతో పర్యవేక్షణ దారి తప్పింది. అంత దూరం ఇంచార్జి వార్డెన్లు వెళ్లలేక అక్కడ పనిచేసే సిబ్బందితోనే హాస్టళ్ల నిర్వహణ భారం మోపి చేతులు దులుపేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా సిబ్బంది వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పేద విద్యార్థులంటే అలుసెందుకు? పేద విద్యార్థులు విద్యనభ్యసించే సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయకుండా అలసత్వం వహించడం దారుణం. జిల్లాలో చాలా వసతి గృహాలకు రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడంతో సమస్యలు అధికంగా ఉన్నాయి. వార్డెన్లు లేని వసతి గృహాల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సక్రమంగా మెనూ సైతం అమలు చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇసుక..దాచేయ్..దోచేయ్ !
చౌడేపల్లె : కూటమి నేతల అండదండలు.. ఏమి చేసినా అడిగేవారెవరున్నారు? దొరికినంతా దోచేయ్.. మాకు వాటా ఇచ్చేయ్.. అనే చందంగా చౌడేపల్లెలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. చౌడేపల్లె మండలంలో ఇసుక, ఎర్రమట్టి గ్రావెల్ దందా దర్జాగా ప్రభుత్వ స్థలాలు, గుట్టలు, చెరువుల్లో మట్టి, ఇసుకను కొల్లగొట్టి సొమ్ము చేసుకొంటున్నా అధికారులెవ్వరూ నోరెత్తకపోవడంతో పలు ఆరోపణలకు తావిస్తోంది. చౌడేపల్లె బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి సమీపంలో ఓ వ్యాపారి ఏకంగా ఇసుక డంప్ చేసి వ్యాపారం చేస్తున్నా అధికారులు నోరు మెదపడంలేదు. పగలు గ్రామాల్లో ఇసుక అవసరమైన వారి నుంచి ఆర్డర్లు తీసుకొని లోడు ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కందూరు అటవీ ప్రాంతాల్లోని వాగులో నుంచి జేసీబీల సాయంతో ఇసుక లోడ్చేసి వారికి అనుకూలమైన రహస్య ప్రాంతాలకు తరలించి ఇసుకను దోచేస్తున్నారు. రాత్రి పూట ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలకు ఇసుక టిప్పర్లు రాత్రిపూటే రైట్ చెబుతూ కూటమి నేతలకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లోని మట్టిని ఒకే చోట డంప్ చేయడంతో పాటు ఇసుకతోపాటు అక్రమ వ్యాపారం సాగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. -
ఖాకీలు మారినప్పుడల్లా ఇదే సమస్య
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ట్రాఫిక్ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కొత్త అధికారులు ఎవరు వచ్చారో తెలుసుకోవాలంటే చిత్తూరు–వేలూరు రోడ్డులోని ఎంఎస్ఆర్ కూడలి వద్ద చూస్తే అర్థమైపోతుంది. ట్రాఫిక్ స్టేషన్కు ఎవరైనా కొత్తగా వస్తే చాలు.. తొలుత ఎంఎస్ఆర్ కూడలి నుంచి చిత్తూరు నగరంలోకి వచ్చే రోడ్డును మూసేయడం అలవాటుగా మారిపోయింది. కొద్దిరోజుల తరువాత ఇలా చేస్తే ట్రాఫిక్కు ఇబ్బందిగా మారుతోందని గ్రహించి, ఆపై రోడ్డుకు అడ్డుగా ఉన్న బోర్డులను తీసేసి.. వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్ స్టేషన్కు బదిలీపై కొత్తగా అధికారి వచ్చినప్పుడంతా ఇదే పరిస్థితి. కిందిస్థాయి ఉద్యోగులు విషయం చెప్పడం లేదో..? ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన లేకో..? తెలియడంలేదు గానీ.. అధికారుల తీరు వల్ల వాహనచోదకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డుకు అడ్డుగా బోర్డులు పెట్టడం వల్ల వాహనాలన్నీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ రెండు ద్విచక్రవాహనాలు వెళ్తే, వెనుకవైపు ఆటో వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఇక బెంగళూరు–చిత్తూరు వైపునకు వచ్చే వాహనాలు ఇదే మలుపు వద్ద రావడంతో రెండు వైపులా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. చీకటి పడితే దొంగతనంగా గ్రానైట్ను లారీల్లో చిత్తూరులోని ఓవర్ బ్రిడ్జిపై తీసుకెళుతున్నా.. పట్టించుకోని పోలీసులు సామాన్యులు తిరిగే రోడ్లను మూసేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. డీఈఓ కార్యాలయం వద్ద స్తంభించిన వాహనాలు ఎంఎస్ఆర్ కూడలి వద్ద రోడ్డుకు అడ్డుగా పెట్టిన బోర్డులు -
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం
చిత్తూరు రూరల్/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.⇒ చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు.⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.తిరుపతిలో భారీ వర్షం భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. తిరుమలలో కూడా..తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వరి, టమాటా పంటలకు నష్టం అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది. -
ఆకలి కేకలు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది. ఈనెల కోటాలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఇంతవరకు పలు షాపులకు సరుకులు చేరలేదు. పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు కుంటిసాకులు చెతున్నారు. ఈ క్రమంలో రేషన్ దుకాణదారులు, కార్డుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆకలితో కడుపు మాడ్చుకుంటున్నారు. జిల్లాలో 5.40 లక్షల రేషన్కార్డులున్నాయి. వీటికి 14 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరుకులు సరఫరా అవుతుంటాయి. ప్రతి నెలా 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3,500 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరమవుతోంది. అయితే ఈనెల కావాల్సినంత మేర సరుకు ఎంఎల్ఎస్ పాయింట్లకు కేటాయించలేదు. జిల్లాలోని రేషన్ షాపులకు అరకొరగా సరుకులు చేరాయి. జిల్లా వ్యాప్తంగా 1,339 రేషన్ దుకాణాలుంటే దాదాపు 250 షాపులకు పైగా సరుకులు చేరలేదు. దీంతో కార్డుదారులు పస్తులతో కడుపుమాడ్చుకోవాల్సి వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే..మాకు తెలియదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆగ్రహానికి గురవుతున్నట్లు వాపోతున్నారు. పట్టించుకునే వారేరి? బియ్యం సరఫరా కాలేదని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 250పైగా షాపులకు సరుకులు చేరలేదని నివేదిస్తున్నా ఏ మాత్రం కదలికలు లేవని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వాపోతున్నారు. పంపిణీ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. మరో వైపు షాపులకు సరుకులు సరఫరా చేసిన వివరాలు చూపించడం లేదని అంటున్నారు. ఈ పాస్, ఆన్లైన్లో తలెత్తిన కారణాల వల్ల కేటాయింపు ఆలస్యమైందని చెప్పుకొస్తున్నారు. ‘మాకు ఏం సంబంధం లేదు.. వెళ్లి ప్రభుత్వాన్ని అడగండి’ అని దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వారు ఆగ్రహానికి గురవుతున్నారు.మాకేం తెలుసు? రేషన్ షాపులకు బియ్యం రాలేదంటే మాకే తెలుసు. వెళ్లి వాళ్లను అడగండి. మా చేతులో ఏముంది. బియ్యం వచ్చాయా... రాలేదా అనే వివరాలు మా దగ్గర లేవు. షాపుల్లో బియ్యం మిగిలి ఉంటాయి. వాటిని ఇస్తారులే. జిల్లాలో 5.4 లక్షల కార్డులుంటే 2.1 లక్షల కార్డుదారులు సరుకులు తీసుకున్నారు. ఇంకా టైం ఉంది. 17వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు సరుకులు రాలేదంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు -
ముగ్గురు యువకులకు గాయాలు
కుప్పంరూరల్: వేగంగా వచ్చి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తమిళనాడు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం కుప్పం మండలం, నాయనూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు.. తమిళనాడు వాణియంబాడీకి చెందిన మతిన్, సల్మాన్, వసీవుల్లాలు వాణియంబాడీ నుంచి ద్విచక్ర వాహనంలో నాయనూరు మీదుగా కుప్పం వస్తున్నారు. నాయనూరు అటవీ ప్రాంతం దిబ్బరేవు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదం జరగగానే కారు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదంలో గాయపడ్డ యువకులను కంగుంది పీహెచ్సీకి తరలించారు. డిటోనేటర్లు, జిలెటిన్స్టిక్లు స్వాధీనం పుంగనూరు: మండలంలోని భీమగానిపల్లె వద్ద చట్టవిరుద్ధంగా డిటోనేటర్లు, జిలెటిన్స్టిక్లు తీసుకెళ్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమగానిపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మండలంలోని కురప్పల్లెకి చెందిన మణి, గంగాధర్ కలసి ద్విచక్ర వాహనంలో ఆరు డిటోనేటర్లు, జిలెటిన్స్టిక్లను రాతి గుట్టలు పగులగొట్టేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడ్డారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. డివైడర్ను ఢీకొని.. ద్విచక్రవాహనదారుడి మృతి బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద శనివారం చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై గల డివైడర్ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాలసముద్రం మండలం, ఆముదాల గ్రామానికి చెందిన కోదండశెట్టి(54) బెంగళూరులో ఎలక్ట్రీషియన్. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. సొంత పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో కేజీ సత్రం వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్ను అదుపుతప్పి ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డీఎంహెచ్వో ఆదేశాలు బేఖాతర్
పలమనేరు: పలమనేరులో పీఎంపీలు డీఎంహెచ్ఓ బేఖాతర్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చి వెళ్లినా మళ్లీ సూదులేయడం, మాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. మీరు క్లినిక్ను సీజ్ చేస్తే మా ప్లాన్ మాకుంటుందంటూ నిరూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే శనివారం వెలుగు చూసింది. స్థానిక ఎస్బీఐ ఎదురుగా ఉన్న టీఎస్ రామచంద్రన్ పీఎంపీ క్లినిక్ను శుక్రవారం డీఎంహెచ్వో సుధారాణి దాడులు చేసి సీజ్ చేశారు. ఆమె ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆ పీఎంపీ ముందు సీజ్చేసిన క్లినిక్ ఉంటే వెనుకవైపు రహస్యంగా మళ్లీ ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించాడు. దీంతో పట్టణంలోని మిగిలిన పీఎంపీలు సైతం ఏ ధైర్యంతో ఆయన మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ విస్తుపోతున్నారు. ఆ పీఎంపీకి పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నేత అండదండలున్నందునే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడనే మాట వినిపిస్తోంది. దీనిపై డీఎంహెచ్వో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
కూటమిలో గూడుగట్టిన కక్ష!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లపై కూటమి సర్కారు కక్ష పెంచుకుంది. వివిధ దశల్లో ఆగిన గృహాలకు సక్రమంగా బిల్లులందించకుండా వేధిస్తోంది. వసతి లేక పనులు ప్రారంభించని వారిని లబ్ధిదారుల జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. నిరుపేదల సొంతింటి కలను శాశ్వతంగా దూరం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. చేతనైతే సాయం చేయాల్సింది పోయి.. 1,624 గృహాలను రద్దు చేసేసింది. ఎప్పటికై నా తమదైన గూడులో నివసించవచ్చని ఆశించిన బడుగులపై ఆకాంక్షలను పిడుగుపాటుకు గురిచేసింది. పలమనేరు : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 609 జగనన్న లేఅవుట్లలో 77,365 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. అందులో 46,163 వేల గృహాల నిర్మాణం పూర్తి చేయించింది. 31,203 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రణాళిక మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 2,389మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికీ 4,330 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఆగింది. వాటిలో ఇప్పటికీ పనులు ప్రారంభించి 1,624 ఇళ్లకు మ్యాపింగ్ , జియోట్యాగింగ్ లేదని కూటమి ప్రభుత్వం ఆన్లైన్లో తొలగించింది. గత ప్రభుత్వంలో వీటి నిర్మాణాలకోసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని హౌసింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ లబ్ధిదారులు పనులు చేపట్టేందుకు ధైర్యం చేయడంల లేదు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభించని ఇళ్లను ప్రభుత్వం రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవాటి ఊసేలేదు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే అధికంగా ఇళ్లను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఊదరగొట్టారు. తీరా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది వేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే జిల్లాలో పంచాయతీలవారీగా పక్కా ఇళ్లకు పలువురు నేతలు అర్జీలు తీసుకున్నారు. కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 30వేల మందిని లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఇళ్ల రద్దుపై హౌసింగ్శాఖ అధికారులనే సంప్రదిస్తే ప్రభుత్వ పాలసీని తాను అమలు చేయాల్సిందనే చెబుతున్నారు. దీనిపై జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు మేనేజర్ సుబ్రమణ్యాన్ని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,624 ఇళ్లును రద్దు చేసింది వాస్తవమేనని స్పష్టం చేశారు. -
ఎవరు చోరీ చేశారో చెప్పేయండి!
చౌడేపల్లె: పెద్ద పంజాణి మండలం, ముత్తుకూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీ వ్యవహారం శనివారం రాజనాలబండ అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరింది. బాఽధితురాలి కథనం.. ముత్తుకూరుకు చెందిన లింగప్పగారి రెడ్డెమ్మ గత నెల 12న తన కుమార్తె ఉన్న పెద్దారికుంటకు వెళ్లింది. బీరువాలోని నగలు, నగదు భద్రపరచి తాళాలు మంచం పరుపు కింద దాచి బండ్లమిద్దికి తాళం వేసి వెళ్లింది. వారం రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు కిటికీ మార్గం గుండా ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన 20 గ్రాముల బంగారు, రూ.1.5 లక్షల నగదును చోరీ చేశారు. ఈనెల 18న ఇంటికొచ్చిన రెడ్డెమ్మ తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువాలోని నగదు కనపడక పోవడంతో చుట్టు పక్కల విచారించింది. ఆపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంగా గ్రామంలోని ఇంటికొక మనిషితో సత్యప్రమాణాలు చేసేందుకు శనివారం రాజనాలబండకు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులతో అర్చకులు కృష్ణమూర్తి వేర్వేరుగా విచారణ జరిపి ఈ నెల 11కు వాయిదా వేశారు. ఆ రోజు గ్రామస్తులు రాజనాలబండకు రావాలని తీర్మానించారు. -
రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి
చిత్తూరు రూరల్(కాణిపాకం): సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ విధిగా రక్త పరీక్షలు చేయాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూ రులోని తన కార్యాలయంలో శనివారం ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జ్వరాల కేసులు అధికమయ్యాయని, వర్షా ల కారణంగా విష జ్వరాలు పెరుగుతున్నాయన్నా రు. ఇలాంటి తరుణంలో ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, డీపీఎంఓ ప్రవీణ పాల్గొన్నారు. -
ఉద్యోగోన్నతులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఈవో పూల్లో ఉన్న 166 మందికి ఉద్యోగోన్నతులు కల్పించడం హర్షణీయమని ఎస్ఎల్టీఏ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దొడ్డా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 నుంచి భాషా పండితులు ఉన్నతీకరణ ఉద్యోగోన్నతుల్లో ఎస్జీటీలకు స్థానం కల్పించడంతో డీఈవో పూల్లో ఉండిపోయారన్నారు. స్థిరమైన చోటు లేక, సుదీర్ఘకాలంగా ఉద్యోగోన్నతులు లభించక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు 123, హిందీ 34, ఉర్దూ 2, తమిళం 6, సంస్కృతం 1 మొత్తం 166 మందిని డీఈవో పూల్ నుంచి తొలగించి ఉద్యోగోన్నతులు కల్పించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ‘అల్లుకున్న’ నిర్లక్ష్యం గుడిపాల మండలంలోని గొల్లమడుగు గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే చేతికందే ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన దిమ్మె చుట్టూ తీగలు, ముళ్ల పొదలు అల్లుకుపోయాయి. అలువైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆదమరిస్తే అంతే సంగతులు. పెను ప్రమాదం ముంచుకురాకముందే ట్రాన్స్కో అధికారులు మేల్కొనాల్సి ఉంది. – గుడిపాల -
డ్యూటీకి డుమ్మా!
కార్వేటినగరం: మండలంలో ఆరోగ్య సిబ్బంది తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. డ్యూటీలకు డుమ్మా కొడుతూ రోగులను ముప్పుతిప్పలు పెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నానికే మూత జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మేజర్ పంచాయతీలో మూడు సచివాలయాలు, మూడు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. అందులో ముగ్గురు ఏఎన్ఎంలు, ఇద్దరు ఎంఎల్హెచ్పీలు విధుల్లో ఉన్నారు. వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విదుల్లో ఉండాలి. కానీ సిబ్బంది 3 గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. 10 గంటల వరకు డ్యూటీకి రావడం లేదు. కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు ఇద్దరు పర్యవేక్షకులు, ఒక సీహెచ్ఓ, సీహెచ్ఎన్ ఉన్నప్పటికీ సబ్సెంటర్లపై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. శనివారం కార్వేటినగరం సబ్సెంటర్ 2.45 గంటలకే తాళాలు వేసి ఉండడంతో రోగులు వచ్చి నిరాశతో వెనుదిరగడం కనిపించింది. మందుబిళ్లలూ కరువే కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో జ్వరం, దగ్గు, జలుబు లాంటి వాటికి కూడా మందుబిళ్లలు, స్విరప్లు, ఇంజక్షన్లు ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ రోగులు వెళ్లి అడిగినా ‘మందుల్లేవ్’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. -
దంచికొట్టిన వర్షం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉదయం 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుని మొరవెత్తాయి. భారీ వర్షం దెబ్బకు పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు సైతం దెబ్బతిన్నాయి. ● పలమనేరు కౌండిన్య నదిలో నీట్టిమట్టం 8 అడుగులు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరింత వర్షం పడితే ప్రవాహం ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. కలగటూరు మార్గంలోని చెక్ డ్యామ్ వద్ద వర్షపు నీరు ప్రవహిస్తోంది. అయితే అక్కడ రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు. వరినాట్లు పూర్తిగా నీట మునగాయి. టమాట నేల రాలింది. మచ్చ రోగం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ● తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపో యాయి. సాయంత్రానికి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే బాహుదానది ప్రవాహంతో కాణిపాకం నుంచి ఉత్తర బ్రహ్మణపల్లి రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. ఎక్కువగా బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రవాహ ఉధృత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, పాలసముద్రం, కార్వేటినగరం తదితర మండలాల్లో సైతం కాలువలు, వంకలు, నదులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణాపురం జలాశయం గేట్ల ఎత్తివేత నగరి : జీడీ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, కృష్ణాపురం జలాశయం నిండడంతో శనివారం మధ్యాహ్నం గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినట్లు నగరి తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. నగరి మండల కుశస్థలి నది ఒడ్డు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో 9000299091, 6305312141, 9951777547, 9704623597, 8179399712 సంప్రదించాలన్నారు. -
కూటమి నిర్లక్ష్యం.. దళితులకు శాపం
‘దళిత జాతికి ఎక్కడ అవమానం జరిగితే అక్కడ వాలిపోతాం. వారికి అండగా నిలబడతాం. కూటమి పాలనలో దళితులకు సముచిత స్థానం దక్కడం లేదు. వారిని చిన్నచూపు చూడడం.. అవహేళన చేయడం రివాజుగా మారుతోంది. దళితుల దేవుడు, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను కూల్చడం, పెట్రోలు పోసి నిప్పు పెట్టడం లాంటి వికృత చేష్టలకు పూనుకుంటున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదు. దోషులను వదలి.. మాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు..’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి నిప్పుపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవళంపేటలో దళితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతల ధర్నాఅంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులువెదురుకుప్పం: ‘పేదల పక్షాన నిలబడతాం.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అమాయకులపై అన్యాయంగా కేసులు పెడితే ఊరుకునేది లేదు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశా రు. శనివారం మండలంలోని దేవళంపేటలో అంబే డ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. దోషు లను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కేసుల నుంచి తప్పించే కుట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన కూటమి నాయకులను కేసుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్కు అవమానం జరిగితే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్య అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. అయితే ఘటన తర్వాత అప్పట్లో వేసిన శిలాఫలకాన్ని తొలగించడం దారుణమన్నారు. న్యాయం చేయాలని ప్రాదేయ పడిన సర్పంచ్ గోవిందయ్యను నిర్బంధించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. కూటమి అరాచకాలకు హద్దుల్లేవ్ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ విగ్రహాన్ని తగలబెట్టిన వారిని దోషులుగా నిలబెట్టాలని కోరారు. చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అరాచకాలకు హద్దుల్లేవన్నారు. వాళ్లు తప్పులు చేసి ఆ నెపాన్ని తమపై నెడుతూ సునకానందం పొందుతున్నారన్నారు. గంగాధరనెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. దళితులనే చులకన భావంతో రెచ్చిపోతూ అవమానవీయంగా ప్రవర్తిస్తున్న టీడీపీ నాయకుడు సతీష్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి రామయ్య, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, మాజీ ఎంపీపీ పురుషోత్తం, వైద్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, నాయకులు నరసింహారెడ్డి, జగదీష్రెడ్డి, అమర్నాద్ తోపాటు కార్వేటినగరం, పెనుమూరు, శ్రీరంగరాజపురం మండలాల నాయకులు పాల్గొన్నారు. దళిత జాతికి అవమానమా.. సిగ్గుసిగ్గు ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన దేవళంపేటకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్లప్రసాద్, ఎమ్మెల్యే జగన్మోహన్ వచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన ఘటనపై ఆరాతీశారు. బంగారుపాళెం: దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహన ఘటనపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దళితుల ఆత్మగౌరవంపై దాడి చేయడమేనన్నారు. ఈ ఘటనను టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా నింధితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో అసహనానికి గురిచేస్తోందన్నారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలన్నారు. దళితజాతి మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని హెచ్చరించారు. -
వైద్యుల నిరవధిక సమ్మె
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పీహెచ్సీ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వంతో పీహెచ్సీ వైద్యుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో వైద్యులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. శనివారం కూడా సమ్మెను కొనసాగించారు. డిమాండ్లపై గళం విప్పారు. ఏపీపీహెచ్సీడీఏ (ఏపీ ఫ్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్) పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు శనివారం కూడా సమ్మెను చేపట్టారు. విధులకు స్వస్తి పలికి చిత్తూరు నగరంలోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నల్లరిబ్బన్ ధరించి.. ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా వెలవెలబోయాయి. చికిత్స కోసం వచ్చిన రోగులు డాక్టర్ లేరని ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టారు. అక్కడక్కడా పీజీ వైద్యులు ఉన్న వారి వద్ద చికిత్స పొందేందుకు ఇష్టపడ లేదు. చాలా మంది స్టాఫ్నర్సులు, ఆస్పత్రి సిబ్బంది వద్ద మందులు, మాత్రలు తీసుకుని వెళ్లిపోయారు. కాగా శుక్రవారం రాత్రి ప్రభుత్వం, పీహెచ్సీ వైద్యుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రాష్ట్ర కమిటీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సమ్మెను కొనసాగిస్తున్నట్లు జిల్లా నాయకులు ప్రకటించారు. ఉద్యోగోన్నతి లేకుంటే ఎలా? ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగోన్నతి లేదని పీహెచ్సీ వైద్య జిల్లా సంఘ నాయకులు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విపత్తులను లెక్క చేయకుండా తాము విధులను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినా తమ శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం లేదన్నారు. ప్రధానంగా పీహెచ్సీలో పనిచేసే వైద్యులకు ఉద్యోగోన్నతులు లేవన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నామన్నారు. ఈ విషయంలో పీహెచ్సీ వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. అలాగే పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్లకు 30 శాతం ఉండేదన్నారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని 15 శాతానికి తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు పలు న్యాయ పరమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. -
బోయకొండ హుండీ ఆదాయం రూ.62.67 లక్షలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.62.67 లక్షల వరకు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. శనివారం కానుకలు లెక్కించగా నగదు రూ.62,21,142, బంగారం 72 గ్రాములు, వెండి 705 గ్రాములు సమకూరినట్టు వెల్లడించారు. వీదేశీ కరెన్సీ తోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.46,310 నగదు లభించిందన్నారు. ఈ ఆదాయం 68 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో దయానంద చిత్తూరు అర్బన్: పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఆర్జీ.దయానందను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. శనివారం ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. 30 మందికి అంతర్జిల్లా బదిలీలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేస్తున్న టీచర్లకు శనివారం అంతర్జిల్లా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ బదిలీలకు సంబంధించి డీఈవో వరలక్ష్మి పర్యవేక్షణలో చిత్తూరు డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియలో అంతర్జిల్లా బదిలీలకు స్పౌజ్ కేటగిరీలో 10 మంది, మ్యూచువల్ కేటగిరీలో 20 మొత్తం 30 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం వారికి అంతర్జిల్లా బదిలీల ఉత్తర్వులు అందజేశారు. అదే విధంగా ఇద్దరు ఎంఈవోలకు ఆర్జేడీ కార్యాలయంలో అంతర్జిల్లా బదిలీలు నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. క్యూలైన్ గోగర్భం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,581 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,976 మంది తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.60 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో స్వామివారం దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
కార్యకర్తల బలోపేతమే లక్ష్యం
పుంగనూరు: పార్టీ కార్యకర్తల బలోపేతానికి కృషి చేస్తామని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ పార్టీ క్యాడర్ను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు పటిష్ట ప్రణాళికలు చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, వివిధ మండలాలకు చెందిన వార్డు ఇన్చార్జ్లు, గ్రామ ఇన్చార్జులతో సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామాల వారీగా నియమించిన ఇన్చార్జ్లకు పలు సూచనలు, సలహాలు అందించారు. పార్టీ విషయాలతో పాటు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, అరాచకాలు, అక్రమాలపై ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని అందరితో ఒకేసారి చర్చించేలా టెలీకాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీకి కార్యకర్తలే మూలాధారమని, వారిని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతామన్నారు. తొలిసారిగా పుంగనూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కార్యకర్తలు అందరూ సైనికులవలే పని చేస్తూ వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కష్టపడాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఐటీ వింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, విరూపాక్షి, జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాతో పాటు ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు, నూతన కమిటీల ఇన్చార్జులు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
పుంగనూరు: సోమల మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో గార్గేయనది పొంగి పొర్లింది. నీటి ఉధృతికి సోమల మండలంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. టమాట, వరి, చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొండల మధ్యన గల గార్గేయ నదిలో నీటి నిల్వలు భారీగా చేరాయి. ఆవులపల్లె, రాయలపేట రోడ్డు పై సుమారు మూడు అడుగుల ఎత్తువరకు నీరు ప్రవహించింది. పెద్దఉప్పరపల్లె నుంచి రాయలపేటకు వెళ్లే రహదారి కోతకు గురైంది. స్థానిక ప్రభుత్వాస్పత్రి ముఖద్వారం దెబ్బతింది. మండలంలోని తుగడంవారిపల్లి, వడ్డిపల్లె, పొదలగుంట్లపల్లె, కొత్తూరు ఇర్లపల్లె, పట్రపల్లె, రెడ్డివారిపల్లెతో పాటు పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. -
అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు
వెదురుకుప్పం/తిరుపతి మంగళం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకలు దారుణానికి ఒడిగట్టాయి. వెదురుకుప్పం మండలం, బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. పక్కా ప్రణాళికతోనే టీడీపీకి చెందిన రౌడీ మూకలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. తొలి నుంచి వ్యతిరేకమే..సర్పంచ్ చొక్కా గోవిందయ్య, దళిత నాయకులు కలిసి దేవళంపేటలో 2023లో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పట్లోనే స్థానిక టీడీపీ నాయకులు సతీష్నాయుడు, పయణితో పాటు వారి అనుచరులు కొంతమంది ఈ విగ్రహాన్ని నెలకొల్పకుండా చేయాలని విఫలయత్నం చేశారు. ఆ తర్వాత సైతం అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ లేకుండా చేయాలని అనేకమార్లు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం రావడంతో సతీష్నాయుడు ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడినని చెప్పుకుంటూ స్థానిక సర్పంచ్ గోవిందయ్యను పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. విగ్రహం ఉన్న ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే సర్పంచ్ గోవిందయ్యకు సమాచారం అందించారు. జరిగిన ఘటనను 100కు డయల్ చేసి చెప్పడంతో నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్, కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఘటనపై సర్పంచ్ గోవిందయ్య వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా న్యాయం చేయాలి’ అంటూ రోడ్డుపై సర్పంచ్ పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతల ధర్నాఘటనకు కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్సీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత, ప్రజా సంఘాల నేతలు దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ దేవళంపేటకు చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుమునుపే అనుమానితులైన సతీష్నాయుడు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, డీఆర్ఓ, వెదురుకుప్పం తహసీల్దార్ బాబు దేవళంపేటకు చేరుకుని ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళన కారులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నిప్పు పెట్టిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో శుక్రవారం రాత్రి అధికారులు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ఆగమేఘాల మీద అధికారులు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే..ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో ఇలాంటి అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. జరిగిన ఘటనను సుమోటోగా తీసుకుని అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి. ఈనెల 25 లోపు న్యాయం జరగకుంటే 15 వేల మందితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖబడ్దార్. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రిజాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహంఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్కు శుక్రవారం ఎంపీ ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిర్దిష్ట గడువులోపు నివేదిక అందించనట్లయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్ట్ అధికారాలను వినియోగించి, సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. -
టీడీపీ నేతలే సూత్రధారులుగా.. నకిలీ మద్యం మాఫియా
అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో, మరికొన్ని బ్రాండ్లకుచెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. ఈ తతంగం పూర్తయ్యాక బాటిళ్లను బాక్సుల్లో పెట్టి పాల వ్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లు ములకలచెరువు ప్లాంట్ నుంచి తరలి పోతున్నాయి. ఏ బ్రాండ్తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతోనే నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారు. రంగు, వాసనలో ఎలాంటి తేడా లేకుండా అసలు మద్యాన్ని పోలి ఉండేలా నకిలీ తయారు చేయడానికి నిపుణులను నియమించుకున్నారు. ఇంత భారీ ఎత్తున్న టీడీపీ నియోజకవర్గం నేతల కనుసన్నల్లో తయారవుతున్న ఈ నకిలీ మద్యాన్ని ఇప్పటిదాకా ఎంత మంది ఏ మోతాదులో తాగారో.. వారి ఆరోగ్యం పరిస్థితి ఏమిటో! ప్రజల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం మరొకటి అవసరమా?మదనపల్లె : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంట్ బండారం బట్టబయలైంది. రాష్ట్రమంతటా ఉలిక్కి పడేలా చేసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకలచెరువుకు కూతవేటు దూరంలో కళ్లు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం బాగోతం శుక్రవారం వెలుగు చూసింది. ఈ కేంద్రం నిర్వహణ, సరఫరాలో అధికార టీడీపీ నియోజకవర్గం నేతల ప్రమేయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ములకలచెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ..రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నరనే సమాచారంతో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి (కడప), అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) మధుసూదనరావు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి, ఎస్ఐలు యల్లయ్య, జహీర్, సిబ్బంది శుక్రవారం ఆ భవనంపై దాడులు నిర్వహించడంతో కళ్లు చెదిరే రీతిలో, ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయ్యింది. దాడులు జరిగిన సమయంలో తొమ్మిది మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ, బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు లోపలికి ఎవరినీ రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు. అక్కడ మద్యం తయారీ యూనిట్, సరఫరా విధానం అంతా పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి మూడు యంత్రాలు, స్పిరిట్, కలర్ ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు. బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు, 70 ఖాళీ క్యాన్లు, 180 ఎంఎల్ ఖాళీ బాటిళ్లు 10 వేలు, వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 30 క్యాన్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధమైన 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు. సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండటం చూసి అధికారులు నివ్వెరపోయారు. టీడీపీ నేత కట్టా అరెస్ట్ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ ఈఎస్ మధుసూదనరావు వెల్లడించారు. నియోజకవర్గంలో కీలక నాయకుడైన ఈయన స్వగ్రామం కమ్మవారిపల్లెలో సైతం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కట్టా ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లలో నకిలీ మద్యం ఉన్నట్టు నిర్దారించారు. ఈయన పెద్దతిప్పసముద్రం మండలం ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులో ఆంధ్రా వైన్స్ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా, నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పని చేస్తున్న ఎనిమిది మంది కూలీలను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన సయ్యద్ హాజీ, విశాఖపట్నంకు చెందిన చుక్కల బాలరాజు, తమిళనాడుకు చెందిన మణిమారన్, వి.సురేష్, వి.సూర్య, ఎస్.ఆనందం, ఒడిశాకు చెందిన డి.ఆనందదాస్, బి.మిథున్ ఉన్నారు. తన బెల్ట్ షాపులో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్ద తిప్పసముద్రం మండలానికి చెందిన కే.నాగరాజును సైతం అరెస్ట్ చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్దం చేసిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాను ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు స్పష్టమైంది. ఏ–1గా జనార్దన్రావు నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయిన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్గా విజయవాడకు చెందిన జనార్దనరావు వ్యవహరిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. ఈయనపై ఏ–1గా కేసు నమోదు చేశారు. ఇతని కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారం కొనసాగుతోందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇతనికి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పని చేస్తున్న నిపుణులైన కూలీలను ఇతనే ఇక్కడికి పంపినట్టు తేలింది. జనార్దన్రావుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఇతన్ని పోలీసులు ఇంకా విచారించ లేదు. ఇతన్ని విచారిస్తే తెర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు.. పెద్ద తలకాయల వివరాలు వెలుగులోకి వస్తాయి. కాగా, ఇక్కడ తయారయ్యే నకిలీ మద్యాన్ని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఆర్డర్లను బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపుతున్నట్లు సమాచారం. జయచంద్రారెడ్డి పీఏపై కేసు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ పై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేష్ పేరుతో ములకలచెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుస్తోంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడిన పాల వ్యాను రికార్డులు పరిశీలించగా, అది రాజేష్ పేరు మీద ఉన్నట్టు వెల్లడైందని చెప్పారు. ఈ పాల వ్యాను ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని ఆధారంగా రాజేష్పై కేసు నమోదు చేయడమే గాక, అతని పేరుతో ఉన్న మద్యం దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడన్నారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేంద్రం బిల్డింగ్ లీజుదారుడు పై కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 13 మందిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. తాను రాష్ట్రంలో లేనని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాగా, టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడటం దారుణమని, ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని టీడీపీ వర్గాల సోషల్ మీడియా గ్రూపుల్లో ట్రోల్ అవుతోంది. నకిలీ మద్యం తయారీ ఇలా.. నకిలీ మద్యం తయారీ విధానాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. ‘నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని నీటిలో స్పిరిట్ను కలుపుతున్నారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా.. ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఇందు కోసం ఓ మోటార్ను ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపుతున్నారు. ఇదే సమయంలో రెండు యంత్రాలతో గ్యాస్ మిక్స్ చేస్తున్నారు. దీనికి రెండు ఆటోమెటిక్ యంత్రాలు, ఒకటి మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుళ్లు అతికిస్తున్నాను. ఈ లేబుళ్లు ఏపీకి చెందినవేననని తేలింది’ అని వెల్లడించారు. ఇదీ చదవండి:ష్.. గప్చుప్! -
మీరే సూదులేస్తారా?
‘మీరు పీఎంపీలు.. ఎంబీబీఎస్ల్లాగా మీరే సూదులెలా వేస్తారు.’ అంటూ డీఅండ్హెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచీ అరాచకమే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ వారు చేస్తున్న అరాచకాలకు హద్దుల్లేవు. ఇది అన్యా యం అని ప్రశ్ని స్తే అడిగిన వాళ్లపైనే కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేయడం, చెప్పుల మాలలు వేసి అవమానించడం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే లున్నాయి. మహిళలు, వృద్ధులు, బాలికలు ఇలా అందరూ కూటమి పాలనలో దాడులకు గురవుతున్నారు. అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకే కాదు అందరికీ దారి చూపించాడు. ప్రతిక్కరికీ దైవ స్వరూపమైన అంబేడ్కర్కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. – కే.కృపాలక్ష్మి, జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి -
కేజీ కుప్పంలో భారీ చోరీ
నగరి : మండలంలోని కేజీ కుప్పం గ్రామానికి చెందిన నాగూర్ బాషా ఇంట్లో గురువారం రాత్రి 15 సవరాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.11 వేల నగదు చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1న కుటుంబంతో సహా నాగూర్ బాషా తిరుపతికి వెళ్లి అక్కడ కుమార్తెను తీసుకొని 2వ తేదీ ఉదయం పెళ్లి చూపుల నిమిత్తం కడపకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆలస్యం కావడంతో రాత్రి తిరుపతిలో బసచేసి ఉదయాన్నే వచ్చేందుకు నిర్ణయించుకొని ఆగిపోయారు. ఇంటివద్ద ఎవరూ లేకపోవడాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయాన్నే ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడం, వస్తువులు చిందరవందరగా పడివుండడం చూసిన స్థానికులు నాగూర్ బాషాకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన కేజీ కుప్పం చేరుకున్నని ఇంటిలోకి వెళ్లి చూడగా 15 సవరాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.11 వేలు నగదు చోరీ అయినట్లు గుర్తించారు. చోరీ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తిరుచానూరులో అత్యాధునిక హోటల్
చంద్రగిరి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు తిరుచానూరులో అత్యాధునిక హంగులతో హోటల్ ఏర్పాటైంది. తిరుచానూరు సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని లెమన్ ట్రీ హోటల్స్ ప్రీమియర్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి, నగిరి ఎమ్మెల్యే గాలి భాను, తిరుపతికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం హోటల్లో ప్రత్యేక పూజలను నిర్వహించి, ముఖ్య అతిథిలు హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ... డబుల్ హైట్, గ్రాండ్ డ్రాప్ ఆఫ్, మార్బుల్ ఫినిష్, స్టెయిన్ గ్లాస్ అలంకరణతో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 సీట్ల సిగ్నేచర్ రెస్టారెంట్, లైవ్ కిచెన్, బఫేతో పాటు 30 సీట్ల సామర్థ్యం గల అల్ఫ్రెస్కో డైనింగ్ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ రీతిలో వినియోగదారులను ఆకట్టుకునేలా మండపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పోర్ట్స్ బార్, స్పా, మల్టీపర్పస్ హాల్, 500 సీట్ల బ్యాంక్వెట్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. వేడుకలను జరుపుకునేందుకు ప్రత్యేకంగా స్థలం, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్తో పాటు పవిత్ర తిరుమల దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వసతులు అందిస్తున్నట్లు తెలిపారు. -
మీరే సూదులేస్తారా?
పలమనేరు: ‘మీరసలే ప్రాథమిక వైద్యం చేయాల్సిన వారు.. ఎలా సూదులేస్తారు, మీరే మెడికల్స్ స్టోర్స్ ఎలా నిర్వహిస్తారు..?..’ అని డీఎంఅండ్హెచ్వో సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరులో కొందరు పీఎంపీలు సైలెన్ పెట్టడం, సూదులేయడం తదితరాలపై కొందరు ఇటీవల జిల్లా వైద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన ఆమె శుక్రవారం పట్టణంలోని పీఎంపీలు, నిబంధనలు పాటించని మెడికల్ ల్యాబ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ మేరకు ఎస్బీఐ ఎదురుగా ఉన్న టీఎస్ రామచంద్రన్, ఆయన సతీమణి మంజుల పీఎంపీలుగా ఉంటూ సూదులేయడం, వారే మందులనివ్వడం చూసి నిర్ఘాంతపోయారు. ఇలా ఇస్టానుసారంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అంటూ నిలదీశారు. మరోవైపు మున్సిపల్ కాంప్లెక్స్లోని ఓ పీఎంపీ నిత్యం సైలెన్న్లు పెట్టడమే పనిగా పెట్టుకుందని తెలుసుకున్నారు. ఆమైపె ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. గంగమ్మతోపులోని క్లిస్టల్ ల్యాబ్ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదని, వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్ యాక్టు మేరకు పీఎంపీలు ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలన్నారు. అయినా కొందరు కావాలనే సూదులేయడం, వారి వద్దే లైసెన్లు లేకుండా మెడికల్స్ నిర్వహించడం చేయడం తీవ్రమైన తప్పన్నారు. ఇకపై పలమనేరులోని ప్రతి ఆర్ఎంపీ, పీఎంపీపై ప్రత్యేక నిఽఘా ఉంటుందన్నారు. -
పిడికిలి బిగించిన పల్లె వైద్యులు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పల్లైవెద్యులు పిడికిలి బిగించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. డిమాండ్ల పరిష్కారం కోసం నినాదాలు మిన్నంటించారు. వైద్యుల సమ్మెతో రోగులు విలవిల్లాడిపోయారు. మొదలే సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఆర్ఎంపీలను ఆశ్రయించారు. వ్యాధుల విజృంభణ సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలకు మంచినీరు కలుషితమైపోవడంతో చాపకింద నీరులా విరేచనాలు ప్రబలుతున్నా యి. ఇలాంటి కీలక సమయంలో అధికారులతో సమ న్వయం చేసుకొని చర్యలు తీసుకోవడంతో పాటు, వైద్యులను సమ్మెలోకి వెళ్లకుండా చూడాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడిన చందంగా ప్రాథమిక వైద్యుల సమ్మెతో అసలే అంతంత మాత్రంగా అందుతున్న వైద్య సేవలు కూడా కొండె క్కాయి. గ్రామీణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కార్యాలయం ఎదుట నిరసన రాష్ట్ర యూనియన్ నాయకుల పిలుపుతో శుక్రవా రం పీహెచ్సీ వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 50 మందికి పైగా వైద్యులు విధులను పక్కన బెట్టి సమ్మెలోకి దిగారు. దీంతో వైద్య సేవలు స్తంభించాయి. 104 సేవలకు సైతం బ్రేకులు పడ్డాయి. పల్లె జనం వైద్యం అందక పట్టణం, ప్రయివేటు వైద్యం కోసం పరుగులు పెట్టారు. కాగా వైద్యులు శిరీషా, ఎల్లయ్య, చంద్ర మహేష్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీజీ వైద్యులతో.. జిల్లాలో 50 పీహెచ్సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీకి ఇద్దరేసి వైద్యులు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో 90 మంది వైద్యులు పనిచేస్తున్నారు. మూడు రోజులుగా పీహెచ్సీ వైద్యులు అని వార్య కారణాలతో స్టెతస్కోప్ పక్కన పెట్టేశారు. గతంలో పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు పీజీలో 30 శాతం సీట్ల కోటా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే ఏకపక్షంగా సీట్ల కోటాను 15 శాతానికి తగ్గించేసింది. ఎంబీబీఎస్ వైద్యుల ఆశలపై నీళ్లు చల్లింది. దాంతో వైద్యులు ఆందోళన బాటపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక ఏడాది మాత్రమే దాన్ని అమలు చేసిన ఆ తర్వాత పట్టించుకోకుండా పోయింది. ఈ సమస్యపై గత కొన్నాళ్ల నుంచి మిన్నకుండిపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. అధికారులు పలు పీహెచ్సీలకు పీజీ వైద్యులను తీసుకున్నారు. అదీ ఒక్కో డాక్టర్ను మాత్రమే నియమించారు. డాక్టర్లు లేని కారణంగా చాలా చోట్ల స్టాప్ నర్సులే వైద్యం చేసి మందు బిళ్లలిచ్చి రోగులను పంపించేశారు. రక్త పరీక్షలు, ఇతరత్రా సేవలన్నీ పడకేశాయి. -
స్వచ్ఛతలో ఆరు రాష్ట్ర స్థాయి అవార్డులు
చిత్తూరు అర్బన్: పరిశుభ్రత–స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లాకు ఆరు అవా ర్డులు లభించాయి. గురువారం చిత్తూ రు కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకల్ని నిర్వహించిన అనంతరం కలెక్టర్ సుమిత్కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ మునిసిపాలిటీల విభాగంలో పలమనేరు, కుప్పం.. ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో కనుమాకులపల్లె (శాంతిపురం), స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రం–కామినాయనిపల్లె (ఐరాల).. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం– కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ), స్వచ్ఛ బస్ స్టేషన్ విభాగంలో చిత్తూరు బస్స్టాండు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై నట్లు కలెక్టర్ వెల్లడించారు. అక్టోబర్ 6న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 48 అవార్డులు స్వచ్ఛత విభాగంలో జిల్లా స్థాయిలో 17 విభాగాల్లో 48 అవార్డులు ఇవ్వనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ నెల నెల 6న చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరగనున్న వేడుకల్లో వీటిన ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ పురపాలక–పుంగనూరు, స్వచ్ఛ ఆంగన్వాడీ కేంద్రాలు–ఇరికి పెంట (సోమల), ఆగరమంగళం (జీడీనెల్లూరు), బందార్లపల్లె (రామకుప్పం), మహాసముద్రం (బంగారుపాళ్యం) స్వచ్ఛ ప్రభుత్వ కార్యాల యం–జెడ్పీ కార్యాలయం చిత్తూరు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చిత్తూరు. స్వచ్ఛ పరిశ్రమ– షాహి ఎక్స్ఫర్ట్ స్వచ్ఛ ఎంఎస్ఎంఈ –రావాండ్స్ ప్లాస్టిక్, విశ్వా ఆపీరియల్స్ స్వచ్ఛ హాస్టల్–ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ (నగరి), ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ (కుప్పం), ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ (కుప్పం). స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాల–డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం సర్వేరెడ్డిపల్లె (జీడీనెల్లూరు) స్వచ్ఛ ఆస్పత్రి–పీహెచ్సీ కొత్తపల్లె (కుప్పం), ఏరియా ఆస్పత్రి పలమనేరు, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి స్వచ్ఛ పాఠశాల– ఏపీ మోడల్ స్కూల్ తుమ్మిసి (శాంతిపురం), కేజీనీబీ (బైరెడ్డిపల్లె) జెడ్పీ ఉన్నత పాఠశాల బీరప్పచెరువు (ఐరాల), ఎంపీపీఎస్ కమ్మపల్లె (పులిచెర్ల), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బంగారుపాళ్యం) స్వచ్ఛ వారియర్స్– వెంకటేష్ (చిత్తూరు), శ్రీనివాసులు (పలమనేరు), రవిచంద్రన్ (నగరి), గంగమ్మ (కుప్పం), హరిబాబు (పుంగనూరు) స్వచ్ఛ హరిత రాయబారులు –విజయకుమార్ (అగరంపల్లె), బాలకష్ణ (పెద్దచల్లారగుంట), సావిత్రి (తూర్పు మాదిగవాడ), నాగరాజు (పెద్దచల్లారగుంట), బాలకృష్ణ (కొలమాసనపల్లె) స్వచ్ఛ గ్రామ పంచాయతీ–యమగానిపల్లె (గుడుపల్లె), కాణిపాకం (ఐరాల), కంగుంది (కుప్పం), మల్లానూరు (కుప్పం) స్వచ్ఛ స్లమ్లెవల్ ఫెడరేషన్–పొన్నెమ్మ మహిళా సమాఖ్య (నగరి) శ్రీలంజనేయ మహిళా సమాఖ్య (నగరి), శ్రీ విరుపాక్షి మహిళా సమాఖ్య (చిత్తూరు). స్వచ్ఛ రైతు బజారు కుప్పం వ్యవసాయ మార్కెట్, స్వచ్ఛ గ్రామ సంఘం–గడ్డంవారిపల్లె (చౌడేపల్లె), కొల్లాగుంట (కార్వేటినగరం) మాంగాడు (నగరి), ఏకరపల్లె (కుప్పం), నల్లిశెట్టిపల్లె (తవణంపల్లె) స్వచ్ఛ ఎన్జీవో– నేచుర్ లవర్స్ అసోసియేషన్ (చిత్తూరు), నాగమణి చారిటబుల్ ట్రస్ట్ (పలమనేరు), పలమనేరు పరిరక్షణ సమితి (పలమనేరు) ఎంపికయ్యిందన్నారు. -
కలెక్టర్ ఆరా..
వెదురుకుప్పం: మండలంలో దారుణం చోటు చేసుకుంది. దళితుల ఆశాజ్యోతి, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేగింది. అగ్రవర్ణ దురహంకారులను అరెస్ట్ చేయాలంటూ దళిత వర్గాలు నిరసనకు దిగాయి. అసలేం జరిగిందంటే!దేవళంపేటలో స్థానిక సర్పంచ్ గోవిందయ్య 2023లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేవళంపేట–తిరుపతి ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ స్థలాన్ని స్థానికంగా కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్ప ట్లోనే పరోక్షంగా సర్పంచ్ గోవిందయ్యపై కొందరు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని టీడీపీ నేత సతీష్ నాయుడు కులం పేరుతో దూషించారు. అధికారం రావడంతో సర్పంచ్పై జిల్లా అధికారులకు ఫిర్యా దు చేసి చెక్ పవర్ను రద్దు చేయించారు. అంతటితో ఆగకుండా సర్పంచ్పై పలు కేసులు పెట్టించి వేధించారు. వాటన్నిటికీ వెరవకుండా వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన సతీష్ నాయుడు, అతని అనుచరులు కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు పూనుకున్నారు. ఉలిక్కిపడ్డ దళితులు గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ విగ్రహంపై పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా దళితులు ఉలిక్కిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఏకమయ్యారు. అగ్రవర్ణ దురహంకారుల దుశ్చర్యను ఖండించాయి. రేపు మమ్మల్ని ఏం చేస్తారోనని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాళ్లు పట్టుకుంటాం.. న్యాయం చేయండి మీ కాళ్లు పట్టుకుంటాం.. ఇక మమ్మల్ని బతకనివ్వరు.. మాకు న్యాయం చేయండంటూ సర్పంచ్ గోవిందయ్య ఏకంగా నగరి డీఎస్పీ మహ్మద్అజీజ్ కాళ్లు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్పీ తుషార్డూడిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి వెదురుకుప్పం పోలీసు స్టేషన్లో కలిసి.. పోలీసుల వైఫల్యం, వారి తీరును ఎండగట్టారు. వారి నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బందార్లపల్లె ఘటనను గుర్తుచేశారు. బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్కు జరిగిన అవమానాన్ని గుర్తుచేసి న్యాయం చేయాలని కోరారు. ఈనెల 25లోపు నిందితులను పట్టుకుని శిక్షించాలని సూచించారు. కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యేల ఆరావారిని అరెస్టు చేయాలి కార్వేటినగరం: రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన అగ్రవర్ణ దురహంకారులను అరెస్టు చేయాలని శుక్రవారం కార్వేటినగరం గాండ్లమిట్ట కూడలిలో దళిత నాయకులు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను కొనియాడుతుంటే, దళిత నియోజకవర్గంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేయడం హేయమైన చర్య అన్నారు. అగ్రవర్ణ దురహంకారులను రాజకీయాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలన్నారు. దళితవర్గ ఆశాజ్యోతి అంబేడ్కర్కు జరిగిన అవమానానికి దేశ వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడ బోమని హెచ్చరించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం భారత రాజ్యాంగానికి నిప్పు పెట్టినట్టేనన్నారు. దళిత దేవుడ్ని కించపరిస్తే దళితజాతి ఊరుకోబోదన్నారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ క్రమంలో పుత్తూరు, చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలు భారీ స్థాయిలో స్తంభించాయి. దళిత ఉద్యోగ నాయకులు చలపతిరావు, వెంకటేష్, దొరబాబు, వేమయ్య, రామూర్తి, నాగభూషణం, రవి, గంగాధరం, భాస్కర్, కొత్త పల్లి సుబ్రమణ్యం, సోము, దొరబాబు, శేషాద్రి, కిరణ్, పాపయ్య పాల్గొన్నారు. అలాగే మండలంలోని గోపిఽశెట్టిపల్లిలో కూడా దళిత నాయకులు ఎంపీటీసీ మురగయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. -
ఆ మృగాళ్లపై ఎన్నో అనుమానాలు!
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ మైనర్ బాలికపై జరిగిన సామూహిత లైంగికదాడి ఘటనలో పట్టుబడ్డ నిందితుల తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. చైన్ స్నాచింగ్లు, దోపిడీలు పోలీ సు శాఖ పనితీరును ప్రశ్నిస్తోంది. ఉన్న స్టేషన్లలో పోస్టింగులు కాపాడుకోవడానికి చూపుతున్న విశ్వాసం.. ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం కలిగిద్దామనే ఆలోచన కొందరు ఖాకీల్లో కనిపించడం లేదు. మరోవైపు సామూహిత లైంగికదాడి ఘటనలో నిందితుల వద్ద లభించిన వీడియోలన్నీ కూడా అటవీశాఖకు చెందిన నగరవనంలోవే కావడం.. ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. వీడియోల్లో ఏముందంటే? నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎం.మహేష్, పి.కిషోర్, జె.హేమంత్ వద్ద మొబైల్ఫోన్లు సీజ్ చేసిట్లు తెలిపారు. ఇందులో పలువురు ప్రేమికులు, స్నేహితులు సన్నితంగా ఉండే వీడియోలు గుర్తించామన్నారు. దీని ప్రకారం నిందితులు ముగ్గురూ కరుడుగట్టిన మృగాలని అర్థమవుతోంది. చిత్తూరు–తిరుపతి రోడ్డులోని అటవీశాఖకు చెందిన నగరవనంపై ఈ ముగ్గురికీ పూర్తిగా పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. పార్కులోపలకు వచ్చే ప్రేమజంటలు, స్నేహితులు, దంపతులను ఫాలో అవుతూ వెళ్లడం.. వాళ్లు సన్నిహితంగా ఉండే వీడియోలు తీయడం అలవాటుగా మారింది. ఆపై వీడియోలను చూపించడంతో ‘వీటిని మా ఇంట్లో చూపిస్తే నన్ను చంపేస్తారు. మీ కేం కావాలి..’ అని అడిగితే అక్కడికక్కడే వాళ్లను బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యాలకు పాల్పడడం, కొందరి నుంచి డబ్బు, నగలు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాలామంది బాధితులు విష యం బటయకు చెబితే పరువుపోతుందని, పెద్దలు చదువు మాన్పిస్తారని, పనులకు పంపరని ఎక్కడా కూడా చెప్పుకోలేదు. మైనర్బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి రావడంతో, ముగ్గురు నిందితులపై మరికొన్ని ఫిర్యాదులు రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా నిందితులకు వ్యతిరేకంగా ఫోరెన్సిక్, ఫింగర్ప్రింట్, సాంకేతికపరమైన కీలక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. నేర నిరూపణకు బలమైన డాక్యుమెంటేషన్ సిద్ధం చేసిన ట్లు సమాచారం. ఖాకీల పనితీరు ప్రశ్నార్థకం! చిత్తూరులో ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం, ఆభరణాలు సీజ్ చేయడం వరకు హర్షించదగ్గ విషయమే. కానీ ఇదే సమయంలో నేరం జరగకుండా ఆపాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉందనే విషయాన్ని ఖాకీలు మరచిపోతున్నారు. వేలూరు రోడ్డులోని ఫారెస్టు వద్ద ప్రేమ జంటలు, స్నేహితులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడ్డ అఖిల్ ఘటన కూడా నెలల తరబడి బయటకు వచ్చింది. ఇలాంటి ఘటనలు పోలీసు నిఘా, పట్రోలింగ్ చేసే పద్ధతులను ప్రశ్నిస్తోంది. పట్టపగలు, మధ్యాహ్నం వేళల్లో కూడా ఈ తరహా ఘటనలను నియంత్రించడం పోలీసులకు చేతగాలేదనే చెప్పాలి. కొందరు ఖాకీలు పేకాట క్లబ్బు లు, లాటరీ నిర్వాహకులు, పంచాయితీల ద్వారా పొందే ఆర్థిక వనరులపైనే మక్కువ చూపిస్తున్నారు. పోస్టింగులు కాపాడుకోవడానికి అధికార పార్టీ నేతలు చెప్పినవాళ్లను వదిలేయడం, ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారనే అపవాదు ఉంది. నిఘా పెంచుతాం చిత్తూరులో ఇటీవల జరిగిన ఘటనల్లో పోలీసుశాఖపై బాధ్యత పెంచింది. నేర నియంత్రణలో బీట్లను పెంచడం, పట్రోలింగ్ పటిష్టం చేయడంపై దృష్టి పెడతాం. లైంగికదాడి ఘటనలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఎస్పీతో మాట్లాడి ఫారెస్టు వాళ్లపై చర్యలకు సిఫార్సు చేసే విషయాన్ని పరిశీలిస్తాం. జరిగిన ఘటనలు మాకు కేసే తప్ప.. రాజకీయకోణం కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి అఘాయిత్యాలు జరిగి ఉంటే పోలీసులకు చెప్పండి. మీ వివరాలు మేము బహిర్గతం చేయం. – సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
లేదా కనువిప్పు!
ఆత్మగౌరవానికి నిప్పు..దళితులకు అండగా వైఎస్సార్సీపీ బానిస బతుకుల నుంచి విముక్తికి పోరాటం చేయడమే ఆయన చేసిన తప్పా...? పేద వాడు అందరితో పాటు సమానంగా తలెత్తుకు తిరాగాలనుకోవడమే ఆయనకు శాపంగా మారిందా...? సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షే ఆయన చేసిన నేరమా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు తీసుకొచ్చిన రిజర్వేషన్ ఆ మహనీయుని పాలిట శత్రువైందా..?అంటే కూటమి పాలనలో అవుననే సమాధానం వస్తోంది. కూటమి కొలువుదీరినప్పటి నుంచీ అడుగడుగునా అవమానమే ఎదురవుతోంది. దళితుల ఆశాజ్యోతి అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టడం... చెప్పుల దండలు వేసి అవమానించడం రివాజుగా మారుతోంది. తమ ఆత్మగౌరవానికి నిప్పు పెడుతుంటే.. అధికారులు, నేతలకు కనువిప్పు లేదా..? అంటూ దళిత వర్గాలు మండిపడుతున్నాయి. వెదురుకుప్పం మండలం, దేవళంపేట ఘటనను తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి. -
చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
పలమనేరు: పట్టణంలో గత నెల 26న మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు గ్రామంలో మోహనకుమారి ఇంట్లో చోరీకి సంబంధించిన కేసులో ఐదుగురు నిందితులను పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. వీరి నుంచి 68 గ్రాముల బంగారు నగలు, కొన్ని రోల్గోల్డ్ నగలు, రూ.90 వేల నగదు, చోరీకి వాడిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్థానిక కేవీ స్ట్రీట్కు చెందిన సయ్యద్ అల్తాఫ్(17), నాగమంగళానికి చెందిన సయ్యద్ జావీద్(20), గడ్డూరు కాలనీకి చెందిన హరి(24), డీసీ స్ట్రీట్కు చెందిన ఫైజాన్ అహ్మద్(19), సాయిగార్డెన్స్కు చెందిన వినయ్కుమార్(25)ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. ఇదే కేసులో మరో నిందితుడైన సందీప్ పరారీలో ఉన్నాడని, ఇతన్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇందులో సీఐ మురళీమోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు
చిత్తూరు అర్బన్: డీఈఓ పరిధిలోని పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించాయి. ఎంతో కాలంగా 166 మంది పండిట్లకు ఎట్టకేలకు పదోన్నతులు దక్కాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర విద్యశాఖ నుంచి గురువారం మధ్యాహ్నం రాగా.. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు రాత్రి 12.30 నుంచి 2.30 గంటలకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఎన్ఏలుగా పదోన్నతి, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. మదపుటేనుగుల సంచారం పలమనేరు : మండలంలోని మొసలిమడుగు సమీపంలోని కుంకీ ప్రాజెక్టు వద్ద బుధవారం రాత్రి మదపుటేనుగులు సంచరించినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతుల వరిపైర్లను నాశనం చేశాయని వాపోయారు. అలాగే అరటి తోటలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గజదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తెప్పించిన కుంకీ ఏనుగుల సమీపంలోనే మదపుటేనుగులు సంచరిస్తున్నట్లు తెలిపారు. కుంకీల కారణంగా తమ పంటలకు మరింత నష్టాలు వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మతుకువారిపల్లె, మేకలవారిపల్లె పంచాయతీల్లో ఏనుగులు గురువారం తెల్లవారు జామున పంట పొలాలపై దాడిచేశాయి. మతుకువారిపల్లెలో రాజారెడ్డి, రవిరెడ్డి పొలంలో వరి పంటను తొక్కిపడేశాయి. మేకలవారిపల్లెలో మల్లికార్జు న పొలంలో సాగులో ఉన్న టమాట పంటను ధ్వంసం చేశాయి. ఫారెస్టు అధికారులు ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు. నియామకం చిత్తూరు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నుంచి స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పూతలపట్టు నుంచి లలితకుమారి, కుప్పం నుంచి సెంథిల్కుమార్, పలమనేరు నుంచి సీ.వీ.కుమార్ నియమితులైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శిక్షణ ప్రారంభం చిత్తూరు అర్బన్: డీఎస్సీ 2025లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎంపికై న ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కౌన్సెలింగ్లో ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులు అందుకున్న టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,407 మందికి గాను 1,398 మంది హాజరు కాగా, తొమ్మిది మంది గైర్హాజయ్యారు. చిత్తూరులోని ఆర్కే పాఠశాలలో 118 మంది, ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 150 మంది.. తిరుపతి కేంద్రంగా నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 211 మంది, విశ్వం స్కూల్లో 249 మంది, మెడ్జీ స్కూల్లో 449 మంది, ఆదిశంకర ఇంజినీరింగ్ కాళాశాలలో 221 మంది హాజరయ్యారు. చిత్తూరులో డీఈవో వరలక్ష్మి, తిరుపతిలో డీఈవో కేవీఎన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో సమగ్రశిక్ష ఏపీసీల సహకారంతో కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. -
రెండిళ్లలో చోరీ
నగరి : మండలంలోని ముడిపల్లె గ్రామంలో రెండిళ్లలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు.. ముడిపల్లెకి చెందిన నాగరాజస్వామి బుధవారం బొమ్మలకొలువు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న మరో నివాసంలో రాత్రి బస చేశారు. ఉదయం నివాసానికి వెళ్లి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన 30 వేల నగదు, బొమ్మల కొలువులో అమ్మవారికి వేసిన రెండు సవరాల బంగారు గొలుసు చోరీ చేసి ఉండడం గమనించారు. ఆ నివాసానికి పక్కనే ఉన్న మరో నివాసంలో నివసించే నాగరాజు అనే ఉద్యోగి ఉద్యోగరీత్యా నగరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. తన నివాసం పక్కనే ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలుసుకొని తన నివాసం వద్దకు వెళ్లి చూడగా ఆయన ఇంటి గొళెం కూడా తొలగించి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. పూజ గదిలో ఉంచిన ఒక సవరం బంగారు నగలు చోరీకి గురయ్యాయి. -
చిత్తూరు దేవళం పేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, చిత్తూరు: సాక్షి, చిత్తూరు: వెదురుకుప్పం మండలం దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానిక సర్పంచ్ ఆధ్వరంలో దళిత సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు(Ambedkar Statue fire Incident). అయితే.. టీడీపీ నేత సతీష్ నాయుడు(TDP Leader Satish Naidu), అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విగ్రహానికి నిప్పు పెట్టినవాళ్లను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి -
జనసేన జెండాను పీకి పడేసిన టీడీపీ నేత
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీలో ఆవిష్కరించిన జనసేన జెండాను టీడీపీ చోటా నాయకుడు నవీన్ చౌదరి బుధవారం జనసేన జెండాను పీకి ముళ్లపొదల్లో పడేశాడు. వనదుర్గాపురంలో ప్రాథమిక పాఠశాల ఎదుట దిమ్మెలు కట్టి జనసేన, టీడీపీ జెండాలు ఆవిష్కరించారు. కొన్ని రోజులు తరువాత టీడీపీ జెండా లేకుండా పోయింది. అయితే జనసేన పార్టీ జెండా మాత్రమే ఉంది. దీన్ని గమనించిన టీడీపీ నాయకుడు జెండా ఎగుర వేయడానికి ఉంచిన పైపును పడగొట్టి పై నున్న జెండాను చుట్టి ముళ్లపొదల్లో విసిరేశాడు. రోడ్డు పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన జనసేన పార్టీ యువకులు ముళ్లపొదల్లో ఉన్న పైప్ జెండాను చూశారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం ముదిరి తీవ్ర స్థాయికి చేరింది. ముళ్లపొదల్లో పడేసిన జనసేన జెండా, విరిచేసిన జెండా పైప్ -
పెళ్లిపత్రికలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం
యాదమరి : పెళ్లిపత్రికలు ఇచ్చి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని కారులోని ముగ్గురు గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు..పూతలపట్టు మండలం బండపల్లి గ్రామానికి చెందిన నరేష్, భీమేశ్వరన్, వినోద్ కలిసి కారులో తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధి సంతగేటు సమీపంలోకి రాగానే అదుపు తప్పి గుడియాత్తం వైపుగా వెల్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అర్ధరాత్రి భారీ శబ్ధం రావడంతో భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని గాయపడ్డ క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నామని స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. కారు బోల్తా పడి ఒకరి మృతి తిరుపతి రూరల్ : మండలంలోని చిగురువాడ వద్ద స్వర్ణముఖినదిలో కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, కిచ్చమనాయుడుపల్లెకు చెందిన కంకలపాటి మురళి (42) తిరుపతిలో నివసిస్తున్నాడు. అయితే వ్యాపారం రీత్యా కార్వేటినగరంలో ప్రొవిజన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం తిరుపతి నుంచి కార్వేటినగరానికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కారులో తిరుపతికి వస్తుండగా చిగురువాడ బ్రిడ్జి వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి స్వర్ణముఖి నదిలోకి దూసుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన కేసీపేట సర్పంచ్ పినాకపాణి మరికొందరి సాయంతో మురళిని బయటకు తీసి 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవస్థల పింఛన్
జిల్లా సమాచారం గ్రామ సచివాలయాలు 504 వార్డు సచివాలయాలు 108 రూరల్లోని కుటుంబాలు 1,65,970 అర్బన్లోని కుటుంబాలు 1,01,121 గత నెల సెప్టెంబర్లో అందజేసిన పింఛన్లు 2,69,812 ప్రస్తుత నెల అక్టోబర్లో అందజేసిన పింఛన్లు 2,68,307 తొలగించిన పింఛన్లు 15,495కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు పొందేందుకు పండుటాకులు అవస్థలు పడుతున్నారు. ప్రతి నెలా ఏదో ఒక సమస్యతో వృద్ధులకు సకాలంలో పింఛన్లు అందని దుస్థితి. తాజాగా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ విధులు తాము చేయలేమంటూ నిరసన చేపట్టారు. దీంతో ఈనెల 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా వేకువజామునే వృద్ధులకు అందాల్సిన సామాజిక పింఛన్లు ఉదయం 11 గంటల వరకు మొదలవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని ఇంటింటీకి వెళ్లి పింఛన్లు తాము అందజేయలేమని నిరసనకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియ కోతలతో పాటు అవస్థల నడుమ కొనసాగింది. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రూరల్లో 504, అర్బన్లో 108 మొత్తం 612 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. సచివాలయాల పరిధిలోని పింఛన్ లబ్ధిదారులకు గత ఐదేళ్లల్లో ప్రతి నెలా ఒకటవ తేదీన వేకువజామునే పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. దీంతో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు సేవలందించే వాలంటీర్లు కనుమరుగయ్యారు. వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడటంతో వారి విధులు సచివాలయ ఉద్యోగులతో చేయించడం మొదలుపెట్టారు. గత ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయ ఉద్యోగులు అదనపు విధులు నిర్వహిస్తూనే వచ్చారు. ఓపికతో ఎంత ఒత్తిడి ఉన్నా అదనపు బాధ్యతలను చేస్తున్న సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం మొదలుపెట్టింది. దీంతో అధిక ఒత్తిడికి తట్టుకోలేని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మెరుపు నిరసన సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. తాము వాలంటీర్లు కాదని, కష్టపడి ఉన్నత విద్య చదివి పోటీ పరీక్షలు రాసి సచివాలయ ఉద్యోగాలు సాధించామని తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వాలంటీర్ల విధులు తాము చేయమంటూ అక్టోబర్ 1న జిల్లా వ్యాప్తంగా సకాలంలో పింఛన్ల పంపిణీ చేయకుండా నిరసన చేపట్టారు. గందరగోళంగా పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ గందరగోళంగా కొనసాగింది. సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు వల్ల వేకువజామున పంపిణీ కావాల్సిన పింఛన్ల పంపిణీ ఉదయం 11 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. వేకువజామునే పింఛన్ సొమ్ము కోసం నిరీక్షించే వృద్ధులు సచివాలయాల వద్దకు పరుగులు తీశారు. ఇంటింటి పింఛన్ల పంపిణీ జరగకపోవడంతో వృద్ధులు అధిక సంఖ్యలో సచివాలయాల వద్ద క్యూ కట్టారు. నిలబడేందుకు ఒంట్లో సత్తువ లేకున్నా గంటల తరబడి నిలబడి పింఛన్ సొమ్మును తీసుకున్నారు. అసలే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు చిత్తూరు నగరంలోని 28, 30 వార్డుల సచివాలయాల మెట్లు ఎక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని సచివాలయాల వద్ద ఉదయం 10 గంటలు అవుతున్నా సచివాలయ ఉద్యోగులు రాకపోయే సరికి పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. 1,505 పింఛన్ల తొలగింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలకు పైగా అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కొత్త పింఛన్ల కోసం ప్రతి సోమ వారం వృద్ధులు పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తూనే ఉన్నా రు. ఆ అర్జీలను అధికారులు స్వీకరించి బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప కొత్త పింఛనన్లు ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ప్రతి నెలా ఏదో ఒక కారణంతో కూటమి ప్రభుత్వం ఉన్న పింఛన్లలో కోత విధిస్తోంది. తాజాగా అక్టోబర్ నెల పింఛన్లలో 1,505 పింఛన్లు తొలగించారు. గత నెల సెప్టెంబర్లో జిల్లా వ్యాప్తంగా 2,69,812 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికా రులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అక్టోబర్ నెల లో 2,68,307 మందికి పింఛన్ల నగదు మంజూరు అ యినట్లు తెలిపారు. కాగా మంజూరు అయిన వారిలో 2,68,307 మందికి గాను 2,52,812 మందికి బుధవా రం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేశారు. మి గిలిన 15,495 మందికి సరఫరా చేయలేక విఫలమ య్యారు. ప్రతి నెలా ఏదో ఒకసాకుతో పింఛన్ల కోత విధిస్తున్న ప్రభుత్వంపై పింఛన్ లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.చిత్తూరు : 28వ వార్డు సచివాలయంలో పింఛన్లు అందజేస్తున్న ఉద్యోగులు నడవలేని స్థితిలో ఉన్న తల్లిని సచివాలయం వద్దకు తీసుకొచ్చి పింఛన్ తీసుకెళ్తున్న దృశ్యం 28వ డివిజన్ సచివాలయం వద్ద రోడ్డులో నిలబడి పింఛన్లు అందజేస్తున్న దృశ్యం -
బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలి
● సమావేశంలో ఐద్వా జిల్లా నాయకురాలు చిట్టెమ్మ డిమాండ్ చిత్తూరు కార్పొరేషన్ : బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకురాలు చిట్టెమ్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం నాయకులు వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పలు ఘటనలతో మహిళలు, బాలికలు భయాందోళనకు లోనవుతున్నారని తెలిపారు. రోజురోజుకు బాలికలు, మహిళలపైన అఘాయిత్యాలు జరగడం దారుణమన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి పాలకులు రోజూ మహిళలకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నారే తప్ప ఆచరణలో అవేమి జరగడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల అధికారులు సౌకర్యాలు ఉన్నా ఇక్కడే పలు ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
స్విమ్స్లో మెడికల్ మాఫియా!
సాక్షి టాస్క్ ఫోర్స్: టీటీడీ పరిధిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఇక్కడి మందుల షాపులో నాణ్యమైన మందులు లేవని, జనరిక్ స్థానంలో ఖరీదైన మందులను రోగులకు అంటగడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఇటీవల సదరు మందుల దుకాణం నిర్వహిస్తున్న ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీకి టీటీడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కంపెనీ యజమాని తన రాజకీయ పలుకుబడితో నోటీసులను లెక్కచేయలేదు. టెండర్ రూల్స్కు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి అండదండలతో కంపెనీ యజమాని రెచ్చిపోతున్నాడు. సిమ్స్ ఓపీ , డాక్టర్స్ క్యాంటీన్ పక్కన గతంలో ఉన్న జనరిక్ మందుల షాపులు రోగులకు సౌకర్యంగా ఉండేవి. అత్యవసర విభాగం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి కుడి పక్కన ఉన్న ఇన్నొవేటివ్లీ ఫార్మా కంపెనీకి చెందిన మెడికల్ షాప్ మేలు కోసం ఆ రెండు జెనరిక్ షాపులను తొలగించారు. ఈ మందుల దుకాణం నిర్వహణ తీరు స్విమ్స్ అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్టు పద్మావతి ఆస్పత్రి సమీపంలోని మరో మెడికల్ షాపును సైతం ఇన్నొవేటివ్లీ ఫార్మా యజమాని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ నేతలను రంగంలోకి దింపి టీటీడీ చైర్మన్ను సైతం మెప్పించి, ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు మెడికల్ ఏజెన్సీకి టెండర్ ఫైనల్ చేయాలని టీటీడీకి అనధికారిక ఆదేశాలు అందినట్లు సమాచారం.డిపాల్టర్గా ముద్ర స్విమ్స్ అత్యవసర విభాగం సమీపంలోని మెడికల్ షాపును ఈ ఏడాది జనవరి నుంచి ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీ చేజిక్కించుకుని పలు ఆరోపణల నడుమ నడుపుతోంది. స్విమ్స్ పరిధిలో కొంత కాలం వరకు మరో మెడికల్ షాపు లేకుండా చక్రం తిప్పి పుష్కలంగా ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలకు అడిగింది ఇచ్చుకుని పద్మావతి ఆస్పత్రిలోని పద్మావతి మెడికల్ షాపును కూడా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మందుల దుకాణానికి రెండు నెలల క్రితం టీటీడీ టెండర్ పిలిచింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవాళ్లు కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన టెండర్ ఓపెన్ చేశారు. సదరు ఫార్మా కంపెనీ అత్యధిక కోడ్ తో మొదటి వరుసలో నిలిచి టెక్నికల్గా అర్హతను కోల్పోయింది. టీటీడీలో ఇప్పటివరకు నిధులను ఎగ్గొట్టిన వారు టెండర్ తగ్గించుకునేందుకు అనర్హులు. ఇప్పటికే నడుపుతున్న మెడికల్ షాపునకు సంబంధించి టీటీడీకి రూ. 57 లక్షలకు పైగా సకాలంలో చెల్లించకుండా ఇన్నొవేటివ్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్గొట్టింది. అలాగే టీటీడీకి ఇవ్వాల్సిన రూ.5కోట్ల బ్యాంకు గ్యారంటీని పాత మెడికల్ షాపునకు సంబంధించిన గ్యారెంటీనే కొత్త అటెండర్లోనూ చూపించింది. టెండర్ ఓపెన్ చేయకముందే మోసం చేసిన కంపెనీని పక్కన పెట్టాల్సిన టీటీడీ అధికారులు ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పై రెండు అంశాల తో ఆ సంస్థ డిఫాల్టర్గా ముద్రపడింది. రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ అధికారులు అనర్హత కలిగిన కంపెనీకే మెడికల్ షాపును అప్పగించేందుకు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు టీటీడీ చైర్మన్ సైతం డిఫాల్ట్ కంపెనీకే కేటాయించేలా అధికారులకు సూచనలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. సదరు కంపెనీ ఎక్కువ కోట్ చేసిందనే సాకును చూపి, డిఫాల్టర్ అనే విషయాన్ని పక్కన పెట్టడంపై కొందరు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. -
రక్తదానంతో ప్రాణదానం
గుడిపాల : రక్తదానం చేసి ప్రాణ రక్షకుడిగా మారి నిజమైన హీరో అవ్వాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్డూడి అన్నారు. బుధవారం స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా చీలాపల్లె వద్ద ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యం వివరించారు. రక్తం కృత్రిమంగా తయారు చేయలేని అత్యంత విలువైన బహుమతి అని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నతమైన సేవ అని చెప్పారు. అరుదైన రక్తగ్రూప్ కలిగిన దాతలు సమాజానికి నిజమైన ప్రాణ రక్షకులని అభినందించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలను నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో సిఎంసీ ఆస్పత్రి అసోసియేట్ డైరెక్టర్ ఉదయ్ జకారియా, మెడికల్ సూపరింటెండెంట్ అలెక్స్, రక్తశాస్త్రం హెడ్ డాక్టర్ డాలి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్మల మార్గరెట్, సీఎంసీ ఆసుపత్రి అడ్మిన్ ప్రిన్స్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, వెస్ట్ సీఐ శ్రీధర్నాయుడు పాల్గొన్నారు. సామాజిక విలువలకు ప్రతీక చిత్తూరు అర్బన్ : చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని.. ఇది ధార్మిక, సామాజిక విలువలకు ప్రతీకని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. కుటుంబ సఖ్యతను గౌరవించడం, సంప్రదాయాలను పాటించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రజలంతా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఈ దశమిను అందరూ సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
అభ్యుదయ రైతుకు అభినందన
పెనుమూరు(కార్వేటినగరం) : ప్రముఖ కవి, అభ్యుదయ రైతు హరికృష్ణారెడ్డిని కలెక్టర్ సుమిత్కుమార్ అభినందించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జీఎస్టీ తగ్గింపుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యంత్రాలు, పరికరాల ప్రదర్శన జరిగింది. హరికృష్ణారెడ్డి పులిగుంటేశ్వర ప్రకృతి రైతు ఉత్పత్తిదారుల సంఘం స్థాపించి రైతులకు పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు హరికృష్ణారెడ్డి కొనుగోలు చేసిన కిసాన్ డ్రోన్ను ప్రారంభించి రైతును కలెక్టర్ అభినందించారు. వారితో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే కూడా అభినందించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో బుదవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,275 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,973 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
అమ్మో.. మృగాళ్లు
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగరంలో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు చేసిన పాపానికి ఉచ్చు బిగుస్తోంది. నేరం చేస్తే ఎవరూ నోరు విప్పరనే ధైర్యంతో ఉన్న ఆ ముగ్గురూ.. చేసిన నేరాన్ని సాక్ష్యాలతో సహా న్యాయస్థానం ఎదుట నిరూపించడానికి ఆధారాలు సేకరిస్తున్నారు. బుధవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్తో పాటు, తాలూక ఎస్ఐ మల్లికార్జున, ఫింగర్ప్రింట్ ఇన్స్పెక్టర్ సతీష్, తిరుపతిలోని ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కేంద్రానికి చెందిన మహిళా అధికారి గ్యాంగ్రేప్ జరిగిన ఘటనా స్థలంలో పలు సాక్ష్యాలను సేకరించారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టి, కీలకమైన ఆధారాలను సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిందితులను పట్టుకునేప్పుడు స్థానికులపై తిరగబడటానికి ప్రయత్నిస్తే దేహశుద్ధి చేశారు. ఆపై నిందితులు తీసిన వీడియోలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ అఘాయిత్యం జరిగిన తీరును వివరిస్తున్నట్లుగా ఆ వీడియోల్లో తెలుస్తోంది. వీళ్లను పోలీసులకు అప్పగించే క్రమంలో నిందితులు ముగ్గురూ పారిపోగా.. తాజాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక నిందితుల మొబైల్ ఫోన్లలో వీడియోల విషయం తేల్చడానికి వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. నిందితులను గురువారం అరెస్టు చూపించే అవకాశం ఉంది. పార్కులో అటవీశాఖ భద్రత డొల్ల ఈ ఘటనలో చిత్తూరు పశ్చిమ రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కులో ఎంట్రీ కోసం రూ.10 డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేస్తున్న అధికారులు, ఇక్కడ సందర్శకుల భద్రత కోసం ఏ ఒక్క చర్య పాటించడంలేదు. దాదాపు 6 కి.మీ విస్తీర్ణం ఉన్న నగర వనంలో ఒక్కటంటే ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా పార్కులో దట్టమైన రిజర్వు ఫారెస్టు (ఆర్ఎఫ్) కలిసి ఉంది. ఈ రెండింటినీ వేరుచేసే కంచె కూడా లేదు. దీనివల్ల వన్య మృగాలు సందర్శకులపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పార్కును దాటుకుని ఆర్ఎఫ్లోకి వెళితే, వాళ్లు బయటకు వచ్చారా..? లేదా కూడా తెలియదు. ఇక వాచర్లు, బీట్ అధికారులు పూర్తి సమయం ఇక్కడ ఉండటం లేదు. సందర్శకులకు కనీస భద్రత లేకుండా ఆఘమేఘాలపై నగరవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం అధికారుల అత్యుత్సాహమే అవుతుంది. దీనిపై వెస్ట్ రేంజ్ ఎఫ్ఆర్వో పట్టాభి వివరణ ఇస్తూ.. ఆర్ఎఫ్ చుట్టూ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, హెచ్చరిక బోర్డులు పెట్టామని, వాచర్లను కూడా పెట్టామంటూ చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ సాయినాథ్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ బృందాలు గ్యాంగ్రేప్కు పాల్పడ్డ నిందితులు మాటువేసి..కాటువేసి గత నెల 25వ తేదీన బాలిక, ఆమె స్నేహితుడు కలిసి చిత్తూరు–తిరుపతి రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన నీవా నగరవనికి వెళ్లడం.. అక్కడ కిషోర్, మహేష్, హేమంత్ ముగ్గురూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం అయిదు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు ముగ్గురికీ నీవా నగరవనంపై పూర్తి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాలిక, ఆమె స్నేహితుడు లోపలికి వెళ్లగానే వాళ్లను వెనక నుంచి నిందితులు ముగ్గురూ వెంబడించారు. ఓ చోట ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుండగా అప్పటికే మాటు వేసిన నిందితులు చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. తొలుత తమను అటవీశాఖ సిబ్బందిగా చెప్పుకున్న నిందితులు, బాధితులు ఇద్దరినీ ఓ గుట్టపై ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే తమ వద్ద ఉన్న కత్తులు చూపించి బాలికపై ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే అతడిపై విచక్షణారహితంగా దాడిచేసి, నోరుమూసి పెట్టి చంపడానికి ప్రయత్నించారు. చివరగా వెళ్లేప్పుడు యువకుడి బంగారు చైనును లాక్కెళ్లారు. ఈ మొత్తం ఘటనలో కొన్ని నిముషాల వీడియో నిందితుల మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల తరువాత గాయపడ్డ యువకుడు జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆపై వారు నిందితుల కోసం గాలించి, గత నెల 29వ తేదీన వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు. -
మహిషాసురమర్ధినిగా బోయకొండ గంగమ్మ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని బుధవారం శత్రు సంహారి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. ఉగ్రరూపం దాల్చుతూ సింహంపై నిలువరించి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, గదను ఎత్తుకొని శత్రువుని సంహరిస్తూ ఉన్నవిధంగా అర్చకులు అలంకరించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో ముస్తాబుచేశారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో వేద పండితులు గోవర్థనశర్మ అర్చక బృందం అభిషేకాలు, అర్చనలు, గణపతి హోమం, చంఢీహోమంతో పాటు పూర్ణాహుతి చేశారు. -
మనోరథం తీరేలా.. కల్కి కటాక్షం
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బ్రహ్మోత్సవ వేళ.. బ్రహ్మాండనాయకుని దర్శించిన వారిది కదా భాగ్యము.. భువి వైకుంఠంలో అడుగిడిన వారిది కదా పుణ్యము.. ఆనందనిలయంలో దేవదేవుని కనులారా కాంచిన వారి జన్మము కదా ధన్యము.. మహిమాన్విత రథంపై మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీమలయప్పస్వామివారిని సేవించిన వారు కదా పునీతము.. గోవింద నామస్మరణతో పులకించిన వారిది కదా ముక్తిమార్గము.. అశ్వవాహనంపై కల్కి అవతారంలో విహరిస్తున్న అలంకారప్రియుని కటాక్షం పొందిన వారి జీవితము కదా చరితార్థము. తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడిన వైకుంఠనాథుడు చతుర్మాడ వీధుల్లో రథంపై ఊరేగారు. శ్రీనివాసుని దివ్యదర్శనంతో భక్తులు పులకించారు. రథోత్సవంలో దేవదేవుడిని సేవించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అశేష భక్తజనులు గోవిందనామస్మరణల నడుమ మహారథం లాగుతూ తన్మయత్వం చెందారు. రాత్రి అశ్వవాహనంపై మలయప్పస్వామివారు కల్కి అవతారంలో విహరించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. -
కమిషనర్ తీరుపై ఆగ్రహం
పుత్తూరు : పుత్తూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహార తీరుపై మున్సిపల్ కౌన్సిల్లో ఎగసిన ఆగ్రహ జ్వాల కలెక్టర్ వద్దకు చేరింది. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీలోని సమస్యలు, వాటికి మున్సిపల్ కౌన్సిల్ చేసే తీర్మానాలు, అమలు కాకపోవడాన్ని పూర్తి వివరాలతో మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్చైర్మన్లు జయప్రకాష్, శంకర్, కౌన్సిలర్లు వినతిపత్రం రూపంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అందించారు. కౌన్సిల్లో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్కు వివరిస్తూ మున్సిపాలిటీ కమిషనర్గా మంజునాథ్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి వరకు 7 సమావేశాలు జరిగాయని ఆ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినా ఏ మాత్రం స్పందన లేదన్నారు. అధికారిగా ఆయన వ్యవహరించడం లేదని పచ్చచొక్కా తొడుక్కున్న నేతలా వ్యవహరిస్తున్నారన్నారు. వర్షాకాల పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నారు. పార్టీ మారిన ఇద్దరు కౌన్సిలర్లపై విప్ యాక్షన్ తీసుకొని అనర్హులుగా ప్రకటించమన్నా స్పందించడం లేదన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ కేశవా ఆచారి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా గౌరవ వేతనం ఇస్తూ సమావేశానికి అనుమతిస్తున్నారన్నారు. మున్సిపల్ పార్కు, క్రిమేషన్ షెడ్డు, షాదిమహల్ ఇలా గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 90 శాతం పూర్తయిన మున్సిపల్ భవనాన్ని వినియోగంలోకి తేవడం లేదన్నారు. ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్కు ఉన్న హక్కులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారులే హక్కులు కాలరాస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందన్నారు. అలాంటి కమిషనర్ మా కొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ వేదికగా ఏకగ్రీవంగా సరెండర్ చేయాలని ఆమోదించినా మినిట్స్ పుస్తకంలో నమోదు చేయలేదన్నారు. సమస్య తీవ్రతను అవగాహన చేసుకొని కమిషనర్ను సరెండర్ చేయాలని, కౌన్సిల్కు న్యాయం చేయాలని కోరారు. అలాగే పుత్తూరు ఈశలాపురం సర్వే నంబరు 6లో గ్రానైట్ క్వారీ ఉందని ఆ క్వారీలో పరిమితికి మించి పేలుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా జనజీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, పక్కనే ఉన్న మామిడి తోటలు, ఇతర పంటలపై దుమ్ము చేరి పంటలు సరిగా పండటం లేదన్నారు. ఇటీవల ఒక బాలుడి తలపై రాయిపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడన్నారు. రైతుల బోర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి తీవ్రతను అర్థం చేసుకొని క్వారీని నిలుపుదల చేయాలని కోరారు. -
నేడు మద్యం.. మాంసం విక్రయాల నిషేధం
చిత్తూరు అర్బన్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లాలో ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు నిర్వహించొద్దని చిత్తూరు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బార్లలో కూడా మద్యం అమ్మకాలు ఉండొద్దని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక చిత్తూరు నగరంలో ఎక్కడా మాంసం విక్రయాలు చేయకూడదని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ జంతు వధశాల, చేపల మార్కెట్ను సైతం మూసి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 1న ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన కేంద్రీయ విద్యాలయాలో జాబితాలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని మంగసముద్రం వద్ద ఒకటి, కుప్పం మండలంలోని బైరుగానిపల్లి వద్ద మరొకటి మంజూరయ్యాయి. మంజూరైన కేంద్రీయ విద్యాలయాలకు నూతన భవనాలను నిర్మించే వరకు తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. మొదట్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత అదనపు తరగతులు పెంచుకుంటూ వెళ్తారు. ఇలా ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. రేపటి నుంచి డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 10 వరకు డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో 8 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ శిక్షణలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా సూచనలు పాటించాలన్నారు. శిక్షణ కార్యక్రమం రెసిడెన్షియల్ విధానంలో జరుగుతుందన్నారు. కొత్తగా ఎంపికై న టీచర్లందరూ కచ్చితంగా హాజరు కావాలన్నారు. గైర్హాజరైతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. శిక్షణ పొందే వారికి మాత్రమే కౌన్సెలింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారని వెల్లడించారు. శిక్షణ కార్యక్రమానికి ప్రతి అభ్యర్థి అధునాతన ఆండ్రాయిడ్ ఫోన్ తెచ్చుకోవాలన్నారు. నియామకపత్రం కచ్చితంగా తెచ్చుకోవాలన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఐరాల : స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. బుధవారం కాణిపాకం పీహెచ్సీని ఆమె తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, వివిధ రకాల ఆరోగ్య సేవల రికార్డులు, స్కానింగ్ పరికరాల నిర్వహణపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాల్లో మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు అన్ని రకాల యాప్లో నమోదు చేయాలని వైద్యాధికారి స్వాతి సింధూరకు సూచించారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా సచ్చిదానందమూర్తి తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్చార్జిగా ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తిని నియమిస్తూ వీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేసిన డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సాంబశివమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం సచిదానందమూర్తికి అభినందనలు తెలిపారు. -
దుర్గమ్మకు క్షీరాభిషేకం
దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా వి.కోట లోని దుర్గామాత ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే క్షీర కలశాల శోభాయాత్ర మంగళవారం ఘనంగా నిర్వహించారు. 4,005 మంది మహిళలు క్షీర కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ యువరాజ్ కుటుంబ సమేతంగా ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించారు. తొలుత వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పట్టు వస్త్రాల సారెకు ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మహిళలు క్షీర కలశాలతో ఊరేగింపుగా దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. అభిషేకం, పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. – వి.కోట క్షీర కలశాల ఊరేగింపు -
దివ్యరూపం..మహాతేజం
చంద్రప్రభ వాహనంపై జగద్రక్షుకుడు సూర్యప్రభ వాహనంపై మలయప్పతిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్య కాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగ నాయక మండపంలో స్నపన తిరుమంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సేద తీరారు. సాయంత్ర సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. నేడు శ్రీవారి రథోత్సవానికి సర్వం సిద్ధం బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి రథోత్సవం సాగనుంది చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ అధికారులు పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మైనింగ్లో మనీ రాజా!
మనల్ని ఆపేదెవడ్రా? సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. పచ్చ సైన్యం ఖనిజాన్ని దోచేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. దొంగబిల్లుల దందాతో రా శ్రీరాజుశ్రీను చేస్తోంది. ఓ మంత్రి పేరును తెరపైకి తీసుకొచ్చి దొంగ బిల్లుల దందాకు ఆజ్యం పోస్తోంది. ఈ వ్యవహరంపై ఆ శాఖ అధికారులు తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. దీని కారణంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెడుతోంది. దొంగ బిల్లుల గోల ఏంటి? చిత్తూరు జిల్లా కేంద్రంలో దొంగ బిల్లుల యవ్వారం గోలగోలగా మారింది. విదేశీ గొప్పలు చెబుతూ కొత్తగా రాజకీయ తీర్థం పుచ్చుకున్న ఓ కూటమి నేత మైనింగ్ మాఫియాతో జతకట్టాడు. చేతికి మట్టి అంటకుండా డబ్బులు సంపాదించే పనికి పదును పెట్టాడు. గ్రానైట్ తవ్వకాలు కొద్ది మేరకు చేసుకుంటూ.. అక్రమ తరలింపుపై కన్నేశాడు. అధికారిక సంస్థను బయపెట్టి.. ఆ బిల్లులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. విదేశీ తెలివితేటలు ఉపయోగించి దొంగ బిల్లుల చలామణికి మార్గం సుగమం చేసుకున్నాడు. మస్తు మనీ రావు? దొంగబిల్లుల అమలుకు అన్ని రూట్లను రారాజు తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రుల పేరు చెబుతూ అడ్డదారుల్లో అడ్డు తొలగించుకున్నాడు. 20 నుంచి 30 మందితో కూడిన గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా రాత్రి పూట కాపు కాచి దొంగ బిల్లులు పంపిణీ చేస్తూ వస్తున్నాడు. ఒక్కో బిల్లుకు రూ.30 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దొంగ బిల్లుల అమలులో ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఒక బిల్లుతో రెండు నుంచి మూడు ట్రిప్పుల వరకు తరలించుకోవచ్చని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అక్రమార్కులు చాలా మంది దొంగ బిల్లుల వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా వసూళ్ల మొత్తాన్ని వాటాలు పంచుతూ గ్రానైట్ మాఫియానే మేసేస్తున్నాడని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. అలా కొద్ది మేర వాళ్లకు.. వీళ్లకు పంచి.. మిగిలిన ఆదాయంతో విలువైన ఆస్తులు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లా యంత్రాంగం నిఘా దొంగ బిల్లుల వ్యవహరంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మైనింగ్ శాఖ చేతులెత్తేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓ కమిటీని వేసింది. వారు గుట్టు చప్పుడుకాకుండా ఈ దొంగబిల్లుల మాఫియా గుట్టును కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ బిల్లుల సృష్టికర్త విషయాన్ని ఇప్పటికే అధిష్టానం వరకు తీసుకెళ్లిన ఆ నేతలు జిల్లా యంత్రాంగంతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో యంత్రాగం సైతం గట్టిగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు కమిటీ మైనింగ్ మాఫియా చెక్ పెట్టే పనిలో పడింది. కాగా దొంగ బిల్లులను టచ్ చేయొద్దని పలు శాఖల అధికారులకు ఆ నేత నుంచి వార్నింగ్ వెళ్లినట్లు చర్చలు జరుగుతున్నాయి. దొంగ బిల్లుల వ్యవహరం తెరపైకి రావడంతో కూటమిలో కలకలం రేపింది. జిల్లాలోని సీనియర్లంతా ఎవడు రా వీడు?.. అని ఆరా తీసే పనిలో పడ్డారు. దొంగ బిల్లుల వ్యవహరంలో కోట్లకు పడగెత్తుతున్నాడని.. మాఫియాను మట్టు పెట్టేందుకు అధిష్టానానికి కొందరు సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా ఈ దొంగ బిల్లుల దందాకు అడ్డు లేకుండా చేస్తూ.. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కాపు కాస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. మంగళవారంతో అధికార బిల్లుకు గడువు ముగియడంతో ...దొంగ బిల్లుల దందాను విస్తృతం చేయాలని చూస్తున్నారు. కొత్త సంస్థకు పగ్గాలు వచ్చేంత వరకు దొంగ బిల్లుల దందాకు జోరుగా రైట్..రైట్ చెప్పాలని ఆర్డర్లు వేశారు. మంగళవారం నుంచి రారాజు ఆర్డర్లు అమలుకు నోచుకోనున్నట్లు కూటమి సీనియర్ నేతలే చెబుతున్నారు. అడ్డొస్తే.. కొంత మంది ప్రజాప్రతినిధులు, మంత్రుల పేర్లు చెప్పాలని గ్యాంగ్కు చెప్పారని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ దొంగ బిల్లుల వ్యవహరాన్ని బయటకు తీసుకొచ్చిన ఆ కూటమి నేత ఎవరు అని మైనింగ్ మనీ రాజా తలలు పట్టుకుంటున్నారని తెలిసింది. -
కోర్టు తీర్పు కూటమికి చెంప పెట్టు
మద్యం కుంభకోణం అంటూ కక్షసాధింపులకు పాల్పడిన కూటమికి కోర్టు తీర్పు చెంప పెట్టని మాజీ డెప్యూటీ సీఎం పేర్కొన్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025‘పేద, మధ్యతరగతి పిల్లలు పెద్దపెద్ద చదువులు చదవాలి. డాక్టర్లు, ఇంజినీర్లుగా రాణించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించింది. ఇందులో ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా పూర్తిచేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. వెంటనే ప్రయివేటీకరణ ఆపాలి.. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు తేల్చిచెప్పారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ఆందోళనలు మిన్నంటించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలుబాబూ.. ప్రయివేటీకరణ ఆపు! చిత్తూరు అర్బన్: ‘పేద, మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం. పేద విద్యార్థుల భవిష్యత్తుపై ఇది గొడ్డలిపెట్టు లాంటిది’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దుశ్చర్య జరగలేదని దుయ్యబట్టా రు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం చిత్తూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని దర్గా కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి, వినతి పత్రం అందచేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు పార్టీ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డి, పూతలపట్టు సమన్వయకర్త డా.సునీల్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారితో పాటు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ అర్హతతో ధారాదత్తం చేస్తున్నారు రాజ్యాంగాన్ని అవమానిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలు, పేదలు లక్ష్యంగా కుట్రలు పన్నుతోంది. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంకుని వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలు తీసుకొస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణం. ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా కల్పించిన అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేస్తోంది. – పీవీ.గాయత్రీదేవి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి. హక్కులు లాక్కున్నారు.. అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు. పేదలు వైద్య విద్య చేయకూడదని కుట్రపన్ని.. కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వైఎస్.జగన్ మదిలో వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చి 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుంటే.. కూటమి ప్రభుత్వం వాటిని కోటీశ్వరుల చేతుల్లోకి పెట్టేస్తోంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే. బాబూ.. ఒక్క ఇటుకై నా వేశావా? చంద్రబాబునాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెబుతున్నారు. ఇన్నేళ్లలో ఒక్క వైద్య కళాశాలకై నా నువ్వు పునాది వేశావా..? మా నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పేదల కోసం నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి సిగ్గుండాలి. ప్రభుత్వ చర్యల వల్ల తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. రూ.4 వేల కోట్లు పెడితే ఇప్పటికే పలు దశల్లో ఉన్న కళాశాలలన్నీ పూర్తవుతాయి. ఆ మాత్రం కూడా పేదల కోసం నిధులు పెట్టకుండా ప్రైవేటీకరణ చేస్తోంది. – ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, చిత్తూరు కిట్ల వివరాలను సేకరించి పంపండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసి మిగిలిన ఎస్ఆర్వీకేఎం (సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కిట్ల వివరాలను సేకరించి నివేదికలు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జారీచేసిన ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి మంగళవారం పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను పంపిణీ చేసి మిగిలిన ఎస్ఆర్వీకేఎం కిట్ల వివరాలను సేక రించాలన్నారు. నిర్దేశించిన ప్రొఫార్మాలో నిర్దేశించిన తేదీలోపు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అవార్డుల ప్రదానం చిత్తూరు కలెక్టరేట్ : భారతదేశ తొలి విద్యాశాఖామంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీ య విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకుని త్వర లో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ, విద్యార్థి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పంపాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోపు నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను పంపాలన్నారు. జిల్లాలోని ఉర్దూ మీడియంలో 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో టాపర్ విద్యార్థుల వివరాలను స్టూడెంట్ అవార్డులకు పంపాలని పేర్కొన్నారు. అలాగే విధుల పట్ల ఉత్తమ సేవలందిస్తున్న ఉర్దూ టీచర్ల వివరాలను పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 10న సంకటహర గణపతి వ్రతం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన సంకటహర గణపతి వత్రం నిర్వహించనున్నట్టు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉద యం 10 నుంచి 11 వరకు, రాత్రి 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 నుంచి స్వర్థ రథోత్సవం ఉంటుందన్నారు. నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ లక్ష్యం ప్రకారమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, రూ.కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేసిందన్నారు. దీనిపై కూటమి పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఒక్క మెడికల్ కళాశాల కూడా నిర్మించని చంద్రబాబు నాయుడు, ఏ అర్హతతో కళాశాలలను కోటీశ్వరులకు ధారదత్తం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై కూటమి ప్రభుత్వం.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. మాజీ మునిసిపల్ చైర్పర్సన్ సరళామేరి, యాద మరి ఎంపీపీ సురేష్బాబు, వసంతాపురం సర్పంచ్ రజనీకాంత్, వైఎస్సార్సీపీ నాయకులు రామచంద్ర, గజేంద్ర, వెంకటరమణ, దొరబాబు, భరత్, ప్రసాద్ పాల్గొన్నారు. -
బాస్కెట్బాల్ విజేత చిత్తూరు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ విజేతగా చిత్తూరు జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు గుడివాడలో ఏపీ బాస్కెట్బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో 14 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్లో చిత్తూరు జట్టు, రామచంద్రాపురం (తూర్పుగోదావరి) జట్లు తలబడ్డాయి. తూర్పుగోదావరి జట్టు పై 79–66 పాయింట్ల తేడాతో చిత్తూరు జట్టు విజయకేతనం ఎగురవేసింది. క్రీడాకారులు, కోచ్, పీడీ జేమ్స్ను రాష్ట్ర బాస్కెట్బాల్ అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, జిల్లా కార్యదర్శి సురేష్బాబు అభినందించారు. ఉత్తమ క్రీడాకారుడిగా ఆదర్శ్పాల్, ఉత్తమ షూటర్గా ఆకాష్ ప్రత్యేక బహుమతులు పొందారు. ఇద్దరు క్రీడాకారులు చిత్తూరు జట్టులోని క్రీడాకారులే కావడం గర్వకారణం. -
ప్రశ్నించడంతోనే గ్యాంగ్రేప్ విషయం వెలుగులోకి!
చిత్తూరు అర్బన్: ‘చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్రేప్నకు పాల్పడ్డ నిందితులు ముమ్మాటికీ టీడీపీ కార్యకర్తలే. ఎమ్మెల్యే జగన్మోహన్నాయుడు స్వయానా వీళ్లకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు గ్యాంగ్రేప్ విషయం బయటపడంతో నిందితులకు వైఎస్సార్సీపీ రంగు పూయాలనుకోవడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శం’ అంటూ చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్యాంగ్రేప్ జరిగిన విషయం, బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షం ప్రశ్నించడంతోనే పోలీసు శాఖలో చలనం వచ్చిందన్నారు. వైఎస్సార్పీసీ దీనిపై ప్రశ్నించకుంటే విషయం వెలుగులోకి వచ్చేదికాదని, బాధితలకు అన్యాయం జరిగేదనని స్పష్టం చేశారు. ఎస్పీ కల్పించుకోవడంతోనే పోలీసు అధికారులు కేసు నమోదు చేశారని, లేని పక్షంలో ఘటన మరుగున పడిపోయేదన్నారు. ఆగస్టు 27న నిందితులు కిషోర్, మహేష్ ఇద్దరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పారని, ఎమ్మెల్యే పనితీరు నచ్చడంతో పాటు సూపర్సిక్స్ అమలు విధానంపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నిందితులు చెప్పిన వీడియోను సైతం విడుదల చేశారు. గతంలో వీళ్లు వైఎస్సార్సీపీలో ఉన్నమాట నిజమేనని, వీళ్ల ప్రవర్తన నచ్చక పార్టీ నుంచి పంపించేస్తే.. ఆపై టీడీపీ నేతలు ఎల్బీఐ లోకేష్, కార్పొరేటర్ నవీన్ చేరదీసి ఆ పార్టీలో చేర్పించారన్నారు. చిత్తూరులో అభివృద్ధిని తాము స్వాగతిస్తామని.. ఇదే సమయంలో అధికార పార్టీ ముసుగులో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు గాయత్రీదేవి, మొదలియార్ విభాగం నాయకులు జ్ఞానజగదీష్ మాట్లాడుతూ గత నెల పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వద్ద అఖిల్ అనే వ్యక్తి ప్రేమ జంటలను పోలీసునంటూ బెదిరించి, బంగారు ఆభరణాలు దోచుకున్నాడని.. అప్పుడు కూడా తమ పార్టీనే దీనిపై ప్రశ్నించిందన్నారు. డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి శిష్యుడైన అఖిల్ టీడీపీకి చెందిన వాడని, అతడికి సైతం వైఎస్సార్సీపీ రంగు పులమడానికి అధికార పార్టీ నేతల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. చిత్తూరులో మహిళల మాన ప్రాణాలు పోతున్నా, గ్యాంగ్రేప్ జరుగుతున్నా ప్రశ్నిస్తామన్న పవణ్కళ్యాణ్ నోరు కూడా మెదపడంలేదన్నారు. చిత్తూరులో జరుగుతున్న ఘటనలు పోలీసు శాఖ పనితీరుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. పైగా ప్రశ్నించే ప్రతిపక్షంపైనే అధికార పార్టీ నేతలు నిందలు మోపడం పద్ధతికాదన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ నేతలు అంజలిరెడ్డి, మధుబాబు, హరీషారెడ్డి, కవిత, ప్రతిమారెడ్డి, బిందురెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు. -
సీఎం సొంత జిల్లాలో అమానుషం.. బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు టీడీపీ మూకలు వంతులేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. స్నేహితుడి గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. చిత్తూరులో జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఫారెస్టు ఆఫీసర్లమంటూ బెదిరించి.. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెపె్టంబర్ 25వ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాస్లోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్కుకు వెళ్లింది. ఇద్దరూ ఓ బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటుండగా.. సంతపేటకు చెందిన హేమంత్, మురకంబట్టు అగ్రహారానికి చెందిన మహేశ్, కిశోర్తో పాటు మరికొందరు టీడీపీ వర్గీయులు పార్కు లోపలికి వచ్చారు. ఒంటరిగా కూర్చున్న వీరిద్దరి వద్దకు వెళ్లి.. ‘మేము ఫారెస్టు ఆఫీసర్లం. మీకు ఇక్కడేం పని? మీపై మాకు అనుమానం ఉంది. స్టేషన్కు పదండి’ అంటూ బెదిరించారు.తాము స్నేహితులమని.. మాట్లాడుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా.. వారిద్దరినీ పార్కులోని పొదల్లోకి లాక్కెళ్లారు. ప్రతిఘటించిన బాలిక స్నేహితుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కడుపుపై తన్ని.. మొహంపై పిడిగుద్దులు గుద్దారు. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అరవకుండా అతని నోరు మూసేశారు. అతడి కళ్లెదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ.. దాదాపు రెండు గంటల పాటు కీచకపర్వం సాగించారు. ముగ్గురు లైంగిక దాడికి పాల్పడగా.. మిగిలిన వారు బాలికను అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందినట్లు తెలిసింది. ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. టీడీపీ కండువాతో నిందితులు మహేశ్, హేమంత్ పంచాయితీకి ప్రయత్నించిన టీడీపీ నాయకులు..! ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్.. గుట్టుచప్పుడు కాకుండా పంచాయితీ చేసేందుకు యత్నించినట్లు సమాచారం. జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు.. తన కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు పార్కు సమీపంలోని హోటల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి.. 29వ తేదీన నిందితులను పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేశారు. ఆ సమయంలో నిందితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన ఏడు వీడియోలను గుర్తించినట్లు తెలిసింది. పట్టించుకోని పోలీసులు.. అంతకుముందు యువకుడి కుటుంబసభ్యులు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. సీఐ, ఎస్సై అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది జవాబిచి్చనట్లు సమాచారం. పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బంది సైతం సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్లు వెనుదిరిగినట్లు తెలిసింది. నిందితులకు దేహశుద్ధి జరిగిన విషయం బయటకురావడంతో పోలీసులు.. బాలిక స్నేహితుడి నుంచి సోమవారం రాత్రి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిందితులు ముగ్గురూ టీడీపీ కండువాలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్రావు, టీడీపీ నాయకుడు ఎల్బీఐ లోకేశ్, కార్పొరేటర్ నవీన్తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంగళవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నాయుడు, సీఐలు శ్రీధర్ నాయుడు, మహేశ్వర మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక ఫిర్యాదు మేరకు.. హేమంత్, మహేశ్, కిశోర్ అనే ముగ్గురిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
దయ చూపండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు ఇస్తూనే ఉన్నాం.. దయ చేసి న్యాయం చేయండి’ అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడేల్ ఎదుట తమ సమస్యల గోడును విన్నవించుకున్నారు. ఇదిలావుండగా పలు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నాలతో కలెక్టరేట్ దద్ధరిల్లింది. వివిధ సమస్యలపై 292 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలి చిత్తూరులో కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు కలెక్టరేట్కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. చిత్తూరులో అధిక సంఖ్యలో విచ్చల విడిగా కార్పొరేట్ సెలూన్ షాపులు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటి వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆత్మహత్యే శరణ్యం పెనుమూరు తహసీల్దార్ వద్దకు ఎన్ని సార్లు తిరిగినా న్యాయం జరడం లేదని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని పెనుమూరు మండలం, శాతంబాకం గ్రామానికి చెందిన సురేష్, నదియా దంపతులు వాపోయారు. తమకున్న కొంత సాగుభూమికి వెళ్లే దారిని మూసి వేసి అగ్రకులస్తులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి దళితులమైన తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలి యాదమరి మండలంలోని బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఉండే మూడు ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఓ కుటుంబానికి చెందిన ఒక మహిళను పెళ్లి చేస్తుకున్నారనే నెపంతో గ్రామ బహిష్కరణ చేశారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మునెమ్మకు న్యాయం చేయాలి గంగవరం మండలం, బూడిదిపల్లికి చెందిన దళిత మహిళ మునెమ్మకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా మునెమ్మ అనుభవంలో ఉన్న రేకుల షెడ్ను ప్రైవేట్ వాహనంతో తొలగించడం దారుణమన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ వారంలోపు సమస్య పరిష్కరించాలని పలమనేరు ఆర్డీవోను ఆదేశించారు. లేని పక్షంలో తానే స్వయంగా వచ్చి బాధితులకు న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జీతాలు పెంచాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులకు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్ బిల్లులను పెంచాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్నభోజన కార్మికుల జీతాల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటకలో జీతాలు పెంచారని, ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. కలెక్టర్కు దండం పెట్టి వేడుకుంటున్న అర్జీదారులు గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న సీపీఐ నాయకులు -
ఇంత చిన్న చూపా?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులంటే ఎందుకంత చిన్న చూపని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రశ్నించింది. వలంటీర్లు చేయాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం ఏ మాత్రం భావ్యం కాదని మండిపడింది. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించింది. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. వలంటీర్ విధులు మాకొద్దు వలంటీర్ల విధులు తమకొద్దని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తేల్చిచెప్పారు. ఆయన మాట్లాడు తూ తమ న్యాయమైన సమస్యలను కూటమి ప్రభు త్వం పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్ పనులు అప్పగించి ఒత్తిడి చేయడం దారుణమన్నారు. సచివాలయ ఉద్యోగులకు కచ్చితమైన జాబ్చార్ట్ విడుదల చేయాలన్నారు. ప్రొబేషన్ 9 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. డోర్ టు డోర్ సర్వేల నుంచి తమకు విముక్తి కల్పించాలన్నారు. ఇంటింటి సర్వేలకు వెళ్తుంటే ప్రజలు ఓటీపీ చెప్పడానికి ఇష్టపడడం లేదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ సంఘ సభ్యులు త్యాగరాజు, జానకీరామ్, బాలాజీ, అరుణకుమారి, జయశ్రీ, హరికృష్ణ పాల్గొన్నారు. -
కోర్టులో ఉన్న భూమిపై కూటమి నేత పెత్తనం
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ సానుభూమి పరులపై అధికార పక్షానికి చెందిన నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని సాతంబాకం రెవెన్యూ లెక్క దాఖలాలోని కొందరు రైతులు సోమవారం పెట్రోల్ క్యాన్తో నిరసన వ్యక్తం చేశారు. మహిళా రైతులు మాట్లాడుతూ పెనుమూరు మండలం, సాతంబాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.39/1లో 1.79 సెంట్లు నాగేశ్వరరావు, భారతి పేరుతో ఉందన్నారు. అలాగే సర్వే నం.40లో 79 సెంట్లు జీఎస్.సుబ్రమణ్యంరెడ్డి పెరుతో ఉందన్నారు. తమ భూములకు ఆనుకుని అదే గ్రామానికి చెందిన కూటమి నేత సురేష్కు కొంత భూమి ఉండడంతో ఆ భూమికి దారి కల్పించాలని అధికారులపై దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ భూతగాదా ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. అయినప్పటికీ కూటమి నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో తాము లేని సమయంలో జేసీబీ యంత్రాలతో చదును చేస్తూ అక్రమంగా దారి ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అడితే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమంటూ పెట్రోల్ క్యాన్తో నిరసన తెలిపారు. -
ప్రజల్లోకి ‘సూపర్ జీఎస్టీ .. సూపర్ సేవింగ్స్’
చిత్తూరు అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథరెడ్డి, కమిషనర్ పి.నరసింహప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై ఆర్పీలు, సీవోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కమిషనర్ మా ట్లాడుతూ.. నూతన జీఎస్టీ శ్లాబులు, సేవింగ్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో వాణిజ్య పనులు శాఖ డిప్యూటీ కమిషనర్ పరదేశి నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ మహేష్కుమార్, సహాయ కమిషనర్ ఏ.ప్రసాద్, ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ వెంకట రామిరెడ్డి, ఇన్చార్జ్ సీఎంఎం గణేష్, పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 41 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్బాషా ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, వన్టౌన్ సీఐ మహేశ్వర సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు. ఆధిపత్య రగడ చౌడేపల్లె: ఆలయ ఆవిర్భావ వంశస్తులకు, దాత మధ్య మండలంలోని గాండ్లపల్లె అభయాంజనేయస్వామి దేవస్థానం నిర్వాహక ఆధిపత్య రగడ సాగుతోంది. ఈ వివాదం సోమవారం సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండకు చేరింది. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకొని నిర్వహణ అర్హతపై చర్చించారు. ఇందులో వెలుగుచూపిన అంశాలు మూడు తరాల క్రితం దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని గాండ్లపల్లెకు చెందిన జమ్మలమడుగు పెద్ద రామాంజులమ్మ, వెంకటస్వామి దంపతులకు ఏళ్ల తరబడి సంతానంలేదు. స్వామీజీ వద్దకు శాస్త్రానికి వెళ్లగా ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని సెలవించారు. స్వామీజీ సూచనల మేరకు గ్రామపంచాయతీలోని చెన్నకేశ్వరస్వామి మాన్యం భూమిలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి వంశస్తులే ధూపధీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణకర్త మనవడు జమ్మల మడుగు హరినాథ్ బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఉండగా 2007లో అదే పంచాయతీకి చెందిన దాత గిరినాథప్రకాష్ గ్రామ పెద్దల వద్ద అనుమతి తీసుకొని ఆలయానికి ప్రాకారం నిర్మించారు. కొంత కాలంగా ఆలయంపై దాత ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ కొంతమంది ద్వారా వివాదాలు సృష్టిస్తున్నారు. నిర్వాహకులు, దాత మధ్య వివాదం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాకారం నిర్మాణం చేపట్టిన సమయంలోనే పెద్దల సమక్షంలో కలిసి నిజానిజాలను అందరి అభిప్రాయాలను రికార్డు చేశారు. అనాధిగా ఆలయ నిర్మాణానికి కారణమైన వారి వంశుస్తులకే నిర్వహణ భాధ్యత ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. గాండ్లపల్లెకు చెంది పుంగనూరులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ సరస్వతమ్మ పాల్గొన్నారు. సెలవులో డీఆర్వో చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవు పెట్టడంతో ఇన్చార్జి బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్చార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వైద్య విద్య..అందని ద్రాక్ష
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షలా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం రివాజుగా మారుతోందన్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తన లబ్ధి కోసం పెత్తందారుల చేతిలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేక పోయాడని ఎద్దేవాచేశారు. అధికారం చేపట్టిన 15 నెలలకే అన్ని రంగాల అధికారులు, విద్యార్థులు నిరసన సెగలు తెలుపుతున్నా బాధ్యతగల పదవిలో ఉంటున్న చంద్రబాబు పట్టించుకోకపోవడ దారుణమన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,496 మంది స్వామివారిని దర్శించుకున్నారు 29,591 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. సెలవు దినం అయినా.. చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సౌకర్యార్థం ఈనెల 30న ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు వసూలు కేంద్రాలు పనిచేస్తాయని విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని అన్ని వసూలు కేంద్రాలు మంగళవారం యథావిధిగా పనిచేస్తాయన్నారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండలం, కొత్తకోట పంచాయతీ పరిధిలోని మోటకంపల్లి వద్ద రైల్వే విద్యుత్ లైన్లు తనిఖీ చేసే రైలింజిన్ అదుపుతప్పింది. వివరాలు.. సోమ వారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చిత్తూరు–తిరుపతి రైల్వే మార్గంలో విద్యుత్ లైన్ల పరిశీలన నిమిత్తం ఓ ఈహెచ్ఈ ఇన్ఫెక్షన్ కారు వెళ్తోంది. ఇంజిన్ నడుపుతున్న లోకోపైలెట్ అజాగ్రత్త వల్ల పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాగా ఈ ఘట న కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో దారి మళ్లించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరు కుని మరమ్మతులు చేయిస్తున్నారు. శిక్షణకు హాజరుకావాల్సిందే చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీకి ఎంపికై న నూతన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాల్సిందేనని డీఈవో వరలక్ష్మి చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీలో ఎంపికై న నూతన టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 7 గంటలకు తమకు కేటాయించిన శిక్షణ కేందాల్లో హాజరుకావాలన్నారు. వంద శాతం హాజరు తప్పనిసరి అన్నారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్, అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకురావాలన్నారు. చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఫార్మసీ (ఆర్వీఎస్ నగర్, చిత్తూరు), ఆర్కే పాఠశాల (కట్ట మంచి, చిత్తూరు), ఢిల్లీ పబ్లిక్స్కూల్ (చిగురువాడ, తిరుపతి), విశ్వం స్కూల్ (జీవకోన, తిరుపతి), మెడ్జీ స్కూల్ (తిరుపతి), ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల (బైపాస్రోడ్డు, గూడూ రు)లో శిక్షణ ఉంటుందని డీఈవో వెల్లడించారు. -
ఇన్ని నిబంధనలా?
వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. -
న్యాయం గెలిచింది!
పుంగనూరు: అక్రమ మద్యం కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావడంపై జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కూటమి కుట్రలు, కుతంత్రాలకు కోర్టులు కళ్లెం వేస్తున్నాయని, న్యాయపోరాటంలో అంతిమ విజ యం మిథున్ అన్నదే అని నినాదాలు మిన్నంటించారు. వైఎస్సార్సీపీ జిల్లా మైనారిటీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్దీన్షరీఫ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, మిథున్రెడ్డి యువసేన అధ్యక్షుడు రాజేష్ ల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సోమ వారం ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పట్టణంలోని బస్టాండ్లో గల రాజన్న విగ్రహం వద్ద అభిమానులు మిఠాయిలకు పంపిణీ చేశారు. అలాగే ఇందిరా సర్కిల్లో బాణసంచా పేల్చారు. పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, పట్టణ బలిజ సంఘ నాయకుడు కొండవీటి నరేష్, కౌన్సిలర్ కాళిదాసు, నాయకులు అజ్ము, గౌసి, నూర్, మమ్ము, అస్లాంమురాధి, నజీ ర్, అఫ్సర్, జావీద్, బావాజాన్, జవహార్, సిద్ధిక్, ఆయాజ్, నయాజ్, జిమ్ ఇర్ఫాన్, అజిజ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సంబరాలు పులిచెర్ల(కల్లూరు): ఎంపీ మిథున్రెడ్డికి బెయిల్ రావడంపై మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. న్యాయం గెలిచిందన్నారు. మండల కన్వీనర్ నాదమునిరెడ్డి, మాజీ జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గోటూరి మురళీమోహన్రెడ్డి, ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్, మువ్వల నరశింహులుశెట్టి, రెడ్డి అహమ్మద్, నిరంజన్రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాయల్మోహన్, గోవిందరెడ్డి, సౌకత్, మునస్వామి, మునీశ్వర, విజయకుమార్, శ్రీనివాసులు, మునీర్ఖాన్, కోదండ సైదుల్లా, అమీన్, రాజారెడ్డి, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. కల్లూరు: సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలు పుంగనూరు: స్వీట్లు పంపిణీ చేస్తున్న నేతలు మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా వస్తారు చిత్తూరు అర్బన్: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త హర్షం వ్యక్తం చేశారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పారు. కూటమి చేసే ప్రతి తప్పులను జగన్మోహన్రెడ్డి లెక్కిస్తూనే ఉన్నారన్నారు. -
వైభవోత్సవం
బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భద్రతా సిబ్బంది హడావుడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలహనుమంత వాహనంపై కోదండరాముడు మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సరస్వతీ..నమోస్తుతే! దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు అయిన సోమవారం బోయకొండ గంగమ్మ చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం తోపాటు ఉభయదారులు ప్రత్యేక హోమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. చౌడేపల్లె -
చెరువు చెప్పదు.. ఆక్రమణ ఆగదు
చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అధికారులు చెరువుల చుట్టూ శాశ్వత హద్దులు ఏర్పాటు చేయకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. చెరువు భూముల్లో మట్టిని, గ్రానైట్ వ్యర్థాలను పోస్తూ టీడీపీ నేతలు అధికార దర్పంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న గంగాసాగరం చెరువును ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ టీడీపీ కబ్జాదారులకు సహకరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని గంగాసాగరం చెరువు ఆక్రమణపై సాక్షి కథనం.. చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రంలో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నేతలు ప్రకృతి వనరులపైనే పడతారు. వాటిని ఆక్రమించడం.. ప్లాట్లు వేసి అమ్ముకోవడం పరిపాటిగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో తమ పంథా మొదలుపెట్టారు. చెరువు ఏదైనా తమదే ఆక్రమణ అనేలా తెగబడుతున్నారు. వీరి ఆక్రమణలకు అంతులేకుండా పోవడంతో భవిష్యత్ రోజుల్లో మనం పుస్తకాల్లో మాత్రమే చెరువుల గురించి చదువుకునే స్థితికి చేరుకునేలా కబ్జాలకు గురవుతున్నాయి. కూటమి సర్కారు పాలనలో చెరువులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో చెరువులు పూర్వపు రూపురేఖలు కోల్పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ నేతలు అధికారదర్పంతో చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నారు. చెరువులు ఆక్రమణలతో ఆయకట్టుదారులకు సమీప గ్రామాల ప్రజలకు నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ కబ్జాదారుల ఆక్రమణలపై పలుమార్లు పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందన లేదు. అధికారుల ఉదాశీనతతో చెరువులు రూపురేఖలు కోల్పోతుండగా తూములు పూడిపోతున్నాయి. కలెక్టరేట్కు కూతవేటులో ఆక్రమణ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు కూతవేటులో ఉన్న గంగాసాగరం చెరువు ఎంతో పురాతనమైనది. ఇది జిల్లాలోని ప్రధాన నీటి వనరులలో ఒకటిగా గుర్తింపు పొందింది. గంగాసాగరం చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 15 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్లో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంగాసాగరం చెరువుపై టీడీపీ నేత కన్ను పడడంతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ చెరువులో మట్టి, గ్రానైట్ వ్యర్థాలను తీసుకొచ్చి పూడ్చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చెరువు ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి అక్కడి స్థానికులు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోని దుస్థితి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించి గంగాసాగరం చెరువు ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని ఆక్రమణలు ఇలా.. ఏ చెరువులోనూ సెంటు భూమిని కూడా ముట్టుకునే అధికారం జిల్లా సర్వోన్నత అధికారాలు ఉన్న కలెక్టర్కు కూడా లేవు. ప్రజాప్రతినిధులకు సైతం వాటిని ప్రోత్సహించే హక్కు లేదు. ప్రజా ప్రయోజనాల అవసరం కోసం చెరువును ముట్టుకున్నా, దానికి చట్టపరమైన విధి విధానాలకు లోబడే జరగాలి. – చెరువుల పరిరక్షణపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి చెరువుల వివరాలు.. జిల్లాలోని చెరువులు 4303 ఆయకట్టు 46,903 ఎకరాలు నీరందుతున్న ఆయకట్టు 20 వేల ఎకరాలు ఆక్రమణకు గురైన చెరువులు 1800 కబ్జాబారిన పడిన విస్తీర్ణం 1147 ఎకరాలు చిత్తూరు నగర పరిధిలో చెరువుల విస్తీర్ణం 630 ఎకరాలు నగర పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు 75 ఎకరాలు -
మహాచండీగా బోయకొండ గంగమ్మ
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవరోజైన ఆదివారం బోయకొండ గంగమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. భక్తుల పాలిట వరాలిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారు. అమ్మవారిని పట్టుపీతాంబరాలు, రంగు రంగులపూలు, స్వర్ణాభరణాలతో శత్రు సంహారి మహాచండీ దేవిగా కొలువుదీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. – చౌడేపల్లె -
శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్కు పురస్కారం
శ్రీసిటీ(సత్యవేడు) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024–25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో ‘ఉత్తమ థీమ్–బెస్ట్ రిసార్ట్’ అవార్డును శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ అందుకుంది. ఇక్కడ అమలు చేస్తున్న స్థిరమైన ఆకర్షణీయమైన అతిథ్య సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం–25 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ , సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మ్యాంగో రిసార్ట్ తరఫున రిసార్ట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. శ్రీసిటీలోని సుందర సువిశాల ప్రాంతంలో ఉన్న మ్యాంగో రిసార్ట్ 20 లగ్జరీ కాటేజీలు, 10 సాధారణ గదులను కలిగి ఉంది. ఇక్కడ బస చేసే అతిథులు మంచి ప్రకృతిని వీక్షించడంతో పాటు కయాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ పక్షలను వీక్షించడం వంటి వివిధ రకాల కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్కు వరుసగా రెండవ సారి అవార్డు దక్కడం విశేషంగా చెప్పవచ్చు. రీసార్టును తీర్చిదిద్దిన విధానాన్ని ప్రశంసించారు. -
గ్రామీణ వైద్యానికి ఆటంకం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మైసెరన్ మోగించారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో పాటు ఓపీ సేవలకు స్వస్తి పలకనున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తూ..డిమాండ్ల సాధనకు పిడికిలి బిగించారు. ఈమేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) నాయకులు నోటీసు సైతం అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. దీంతో పల్లె వైద్యానికి ఆటంకం ఏర్పడనుంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): గ్రామీణ పని చేసే వైద్యుల విషయంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తన్నట్లు ప్రకటించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ ఫీవర్స్ పట్టి పీడిస్తున్న తరుణంలో డాక్టర్లు సమ్మెలోకి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినా కూడా పీహెచ్సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 95 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్లు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్క్లినిక్లకు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినిక్లు 15 శాతానికి, నాన్ క్లినికల్ 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినికల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్టుగా ఏపీపీహెచ్సీడీఏ చెబుతోంది. సీహెచ్సీల్లో పనిచేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్గా ప్రమోషన్ ఇస్తుంటే 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నా పదోన్నతులు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు రావడం లేదని, జాయిన్ అయినప్పుడు ఉన్న కేడర్లోనే రిటైర్డు అవుతున్న పరిస్థితి ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఇదీ వైద్యుల డిమాండ్.. సర్వీస్లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలి. టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువును ఐదేళ్లకు కుదించాలి. సీజనల్కు సమ్మె ఎఫెక్ట్ జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి పల్లెజనం విషజ్వరంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడ్డారు. జేబులో డబ్బులు ఉంటే ఆర్ఎంపీ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్యూకడతారు. ఈ మధ్యకాలంలో జ్వరం కేసులు ఆరోగ్య కేంద్రాలను చుట్టిముడుతున్నాయి. ఇలాంటి తరుణంలో డాక్టర్ల సమ్మె పేద రోగులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
కుప్పంరూరల్: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన కుప్పంలో వెలుగు చూసింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలవగా, కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా.. తమిళనాడు ప్రమాదంలో .. కుప్పం పట్టణానికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సొంత పనులపై భార్య, కుమారుడు సాత్విక్ (17)తో కలిసి చైన్నెకి వెళ్లాడు. పనులు ముగించుకుని శనివారం రాత్రి కుప్పానికి తిరుగుప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో నాట్రంపల్లి వద్ద లారీని వెనుక వైపు నుంచి ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ ఘటనలో సాత్విక్ (17) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. రవికుమార్, అతని భార్య గాయాలతో బయటపడ్డారు. వెండుగంపల్లి వద్ద ఘటనలో.. కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కుప్పం మండలం గట్టప్పనాయునిపల్లికి చెందిన మునెప్ప (50) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనులపై బైక్లో వెండుగంపల్లి వైపునకు వెళ్లాడు. పైనాసికి క్రాస్ వద్ద మునెప్ప ప్రయాణిస్తున్న బైక్ను టాటాఏస్ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో మునెప్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. -
కిక్కిరిసిన కొండ
గరుడ వాహన సేవ కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు పడ్డారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడ వాహన సేవ కోసం నిరీక్షించారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం ఒంటి గంటకే నిండిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా రెండోసారి భర్తీ చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలో కళాకారులుతిరుమల : అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం జగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుడు మోహినీ రూపంలో దంత పల్లకీపై శృంగార రసాధి దేవతగా, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్ని కృష్ణుడితో కలసి హోయ లొలుకుతూ భక్తకోటిని సాక్షాత్కరించారు. కట్టుదిట్టమైన భద్రత తమిళనాడు ఘటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు తిరుమల భద్రతను మరింత పెంచారు. గరుడ వాహన సేవలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సుబ్బరాయుడు పటిష్ట భద్రతను కల్పించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ వీధుల్లోకి రాకుండా కట్టడి చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ సిబ్బంది అప్రమత్తతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల అనుమతి లేకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో తిరుమలకు రావాల్సి వచ్చింది. గరుడోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనమురుగన్ వేషధారణభక్తులను నియంత్రిస్తున్న పోలీసులుబారులు తీరిన వాహనాలువైభవంగా శ్రీవారి గరుడ సేవ -
వైఎస్సార్సీపీ శ్రేణుల రక్షణకు డిజిటల్ బుక్
నగరి : కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేశారని మాజీ మంత్రి ఆర్కేరోజా స్పష్టం చేశారు. ఆదివారం ఆమె తన నివాస కార్యాలయంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయవచ్చన్నారు. ‘‘డీబీ.డబ్ల్యూఈవైఎస్ఆర్సీపీ.కామ్’’ అనే వెబ్సైట్లో గానీ, 040–49171718 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పార్టీ లీగల్ సెల్ ప్రధానకార్యదర్శి రవీంద్ర, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, బాలన్, జెడ్పీటీసీ పరంధామన్, నిండ్ర, విజయపురం ఎంపీపీలు లత, మంజుబాలాజి, భార్గవి, నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మున్సిపల్, మండల అధ్యక్షులు, మండల పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చౌడేపల్లె: రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆనందంగా జీవనం గడపాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణమ్మ దంపతులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజుతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ ఈఓ ఏకాంబరం ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మహాచండీ దేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారికి పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక అభిషేక పూజలు, అర్చనలు, చేశారు. అనంతరం హోమ పూజల్లో పాల్గొని, ప్రధాన గర్భాలయం కింద ఉన్న మూలస్థానం, రణభేరి గంగమ్మ అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితులు పెద్దిరెడ్డి దంపతులకు ఆశీర్వాదం అందించారు. అనంతరం ఈఓ పవిత్ర తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘ అధ్యక్షుడు బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, పుంగనూరు ఎంపీపీ భాస్కర్రెడ్డి, మండల ఇన్చార్జి కొత్తపల్లి చెంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మీకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని, అందుకే అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన పుత్తూరులోని తన నివాసంలో నాయకులతో కలిసి డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి రికార్డులతో చేరవేయడానికి జననేత జగనన్న ఎంచుకున్న బాణం డిజిటల్ బుక్ అని అన్నారు. డిజిటల్ బుక్లో నమోదు చేసే ప్రతి సమస్యను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జగనన్న కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఇబ్బందులు పెడితే 040–49171718 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చన్నారు. వైఎస్సార్సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కలసికట్టుగా పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. డిజిటల్ బుక్పై గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆగడాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేబిస్తో బీకేర్ఫుల్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రేబిస్తో బీకేర్ఫుల్ అని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి సూచించారు. చిత్తూరు నగరంలోని జిల్లా పశు వైద్యశాలలో ఆదివారం ప్రపంచ రేబిస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం యజమానులకు పెంపుడు కుక్కల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రతి యజమాని తమ పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలన్నారు. కుక్కలను బయటికి తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెంపుడు కుక్కల వల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. కుక్క కరిస్తే ప్రజలు వెంటనే టీకాలు వేయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎపిడిమాలజిస్ట్ శ్రీవాణి, పశుసంవర్థకశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 1,276 కుక్కలకు టీకాలు ప్రపంచ రేబిస్ డేలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1,276 పెంపుడు కుక్కలకు టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. 33 మండలాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సాయంత్రానికి 1276 కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు. -
పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం
– 2 కే రన్ ప్రారంభించిన ఎంపీ చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటక రంగం అభివృద్ధి రాష్ట్రానికి అవసరమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని శనివారం పర్యాటక దినోత్సవం నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ మైదానం వరకు 2 కే రన్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధితో పాటు ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ, సీఐ మహేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని నిరసన చేపట్టారు.ఆగని ఏనుగుల దాడులు పంట పొలాలపై ఏనుగుల దాడి కొనసాగుతోంది. శనివారం పంటలపై పడి బీభత్సం సృష్టించాయి.ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025హోమ పూజల్లో పాల్గొని పూర్ణాహుతి చేస్తున్న ఈఓ, ఉభయదారులుశాకాంబరీదేవి అలంకరణలో అమ్మవారు ఓ పక్క రుక్ష్మిణ..మరో పక్క సత్యభామ.. మురళీలోలుడు బకాసురుడిని వధిస్తూ భక్తులకు కనువిందు చేశారు. స్వర్ణతేజోమయంగా కాంతులీనుతున్న సర్వభూపాలుడిని అధిరోహించిన స్వామి సకల భూపాలురకు తానే అధిపతినని.. తన భిక్షే రాజ్యాధికారమని సందేశమిచ్చారు. అంతకుముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై రాజమన్నార్ అవతారంలో వచ్చి భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం కల్పవృక్ష. సర్వభూపాల వాహనసేవలు నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో భక్తులు మలయప్పను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వాహనసేవల ముందు కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. – తిరుమల శాకాంబరీగా బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం బోయకొండ గంగమ్మ శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారమై అమ్మవారు ప్రసిద్ధి కెక్కారు. పట్టుపీతాంబరాలు , రంగు రంగుల పుష్పమాలికలు , స్వర్ణాభరణాలతో పాటు కూరగాయలతో శాకాంబరిగా కొలువు దీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. – చౌడేపల్లె -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్పగించడం సబబు కాదని విమర్శించారు. 2019–2024 సంవత్సరాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. వాటిలో 5 కళాశాలలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అయినట్లు తెలిపారు. ఆ కళాశాలల్లో 750 సీట్లతో మెడికల్ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను స్థాపించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు నిధుల కొరత అనే కుంటి సాకుతో ప్రారంభించకుండా ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మెడికల్ కళాశాలలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో రెండు లక్షల కోట్లను అప్పుచేసి అమరావతి రాజధాని నిర్మాణానికి 70 వేల కోట్ల టెండర్లను పిలిచిందని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఎలాగైనా కార్పొరెట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్లు సుగుణశేఖర్రెడ్డి, గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వారు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వాలాభం కోసం కుట్రలు చేసి ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసేందుకు రూ.5 వేల కోట్లు పెడితే సరిపోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. రూ.8 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం దోచుకునేందుకేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేసి ప్రైవేటీకరణ సమస్యలను విన్నవించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా జాయింట్ సెక్రటరీలు దివాకర్రెడ్డి, గౌమతి, ఉదయ్భాను, చిత్తూరు నియోజకవర్గం అధ్యక్షులు చక్రవర్తిరెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గం జాయింట్ సెక్రటరీ హరిబాబు, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు సోమశేఖర్రెడ్డి, సెక్రెటరీలు కృష్ణమూర్తి, ఇషాద్, నగరి నియోజకవర్గం అధ్యక్షులు బాబు, సెక్రెటరీ నాగరాజు, మెంబర్ తిరుమలయ్య, పలమనేరు కార్పొరేషన్ లీగల్ సెల్ మెంబర్ హరికృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్ : ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఈనెల 6వ తేదీన ఓ ద్విచక్రవాహనం ఢీ కొని, దాదాపు 62 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, శనివారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 94910 74515 , 70135 54201 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. తాళాలు పగులగొట్టి నగలు చోరీ పుంగనూరు : గుడికి వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు రూ.20 లక్షలు విలువ చేసే నగలు, నగదును దోచేసిన ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బజారువీధిలో నివాసం ఉన్న రాధాకృష్ణయ్యశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి చూడగా ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలను ఢీ కొట్టిన కారు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ఓ వ్యక్తి కారుతో అతివేగంతో వచ్చి.. మరో రెండు వాహనాలను ఢీ కొట్టాడు. శనివారం కట్టమంచి వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబరుతో అతి వేగంతో వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆపై ఆటోను ఢీ కొట్టి, ఓ పాదచారిని సైతం ఢీ కొట్టారు. కారులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలు కాగా పాదచారి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకమండలిలో బీజేపీకి అన్యాయం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రధాన ఆలయాల పాలక మండలి నియామకాల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు రామభద్ర మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాల్లో పాలక మండలి ఏర్పాటు నియామకంలో తమ పార్టీకి చెందిన నాయకులకు చైర్మన్ పదవులు అడగలేదన్నారు. కనీసం పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వాలని కోరామన్నారు. అయితే బీజేపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన ప్రతిపాదనలపై ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియాలని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, తోటపాలెం వెంకటేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ
పలమనేరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని గంటావూరుకు చెందిన శ్రీవారి భక్తుడు మురుగన్ 12 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నదాన సత్రానికి శనివారం వితరణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీవారి సేవకులు కాబ్బల్లి రవీంద్రారెడ్డి దాతను అభినందించారు. ఆ మేరకు కూరగాయలు నింపిన ప్రత్యేక వాహనానికి పూజలు నిర్వహించి గోవింద నామస్మరణాల మధ్య తిరుమలకు ఇక్కడి నుంచి తరలించారు. ప్రసవాల సంఖ్య పెంచాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి పీహెచ్సీలో వంద శాతం గర్భిణుల నమోదు చేపట్టాలని, అలాగే ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12 వారాలకే గర్భిణుల నమోదు చేయాలన్నారు. ఇప్పటికి 80 శాతం మాత్రమే పూర్తి అయ్యిందన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు ఆధార్ కార్డుతో అనుసంధానం ఉందా లేదా అని పరిశీలించాలన్నారు. డీఎంఅండ్హెచ్వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి పాల్గొన్నారు. -
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల (కల్లూరు) : పంట పొలాలపై ఏనుగుల దాడి నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున మండలంలోని దిగువమూర్తి వారిపల్లె, మిట్టమీద రాచపల్లె, మర్రి కుంట వారిపల్లె, పాళెం, కొంగరవారిపల్లె గ్రామాల్లోని పొలాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. మిట్టమీద రాచపల్లెకు చెందిన సుధాకర్, ప్రభాకర్ పొలాల్లో వరి పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే కృష్ణారెడ్డికి చెందిన టమాట పంటను ధ్వంసం చేశాయి. దిగవ మూర్తి వారిపల్లెకు చెందిన సుధాకర్ పొలంలో మామిడితోటలో కొమ్మలను విరిచేశాయి. ఏనుగులు రాత్రి సమయంలో చుట్టు పక్కల పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. -
కాసుల‘గుట్టలు’
జిల్లాలో అక్రమ క్వారీలు సవారీ చేస్తున్నాయి. మైనింగ్ అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కూటమి నేతలు కసితీరా గుట్టలను కొల్లగొట్టి దోచేస్తున్నారు. అక్రమాలకు కూటమిలో ని కొందరు బడా నేతలు, ప్రజాప్రతినిధులు బ్రాండ్ అంబాసి డర్లుగా నిలిచారు. వీరిచ్చే అనుమతులకు ప్రతిఫలంగా లక్ష లు జేబులోకి వెళ్తోంది. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు చో ద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలోని సీనియర్ నేతలు మైనింగ్ మాఫియా విషయాన్ని సీఎం చెంతకు తీసుకెళ్లారనే విషయం జిల్లాలో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లాలో 400 వరకు క్వారీలకు అనుమతులున్నాయి. వీటిలో చాలా క్వారీలు జోరుగా నడుస్తున్నాయి. ఇందులో 200 క్వారీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. మిగిలిన వాటిలో కొన్ని నాసిరకం, క్రాక్లు, ఆర్థిక కష్టాల కారణంగా నిలిచాయి. మరికొన్ని మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అయితే దీనికి దీటుగా అక్రమ క్వారీలు వెలుస్తున్నాయి. చిత్తూరు, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కుప్పం, ఎస్ఆర్పురం, యాదమరి, జీడీనెల్లూరులో విచ్చలవిడిగా కొండలు ఛిద్రమవుతున్నాయి. బంగారుపాళ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టి ఎత్తులు వేశారు. దీంతో అక్కడ నల్లబంగారమే అక్రమ గనులకు రూ.కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అనుమతులు ఇలా.... క్వారీ నడపాలంటే తొలుత మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. ఆ దరఖాస్తు మేరకు మైనింగ్ శాఖ అధికారులు సర్వే చేసి విజయవాడకు పంపుతారు. దీంతో అక్కడి నుంచి ఎల్ఓఐ (లెటర్ ఆఫ్ ఇండెంట్) వస్తుంది. అనంతరం మైనింగ్ ఫ్లానింగ్, ఈసీ, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైర్క్టర్ నుంచి తదుపరి అనుమతులు వస్తాయి. డీడీకి గ్రాంట్ ఆర్డర్ వచ్చాక , సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ చెల్లింపుతో వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేందుకు కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. మామూళ్లు రూ.లక్షల్లో చేరిపోతున్నాయి మైనింగ్ శాఖ చుట్టూ తిరగకుండా కొంత మంది కూటమి నేతలు అధికారపార్టీ బలాన్ని కొండలపై పెడుతున్నారు. మైనింగ్ శాఖ చట్టానికి, అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కొందరు బడానేతలు, ప్రజాప్రతినిధుల నోటి మాటలే అనుమతులుగా మలిచి క్వారీలపై సవారీ చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రతి ఫలంగా కొందరు ప్రజాప్రతినిధులు, బడానేతలకు రూ. లక్షల్లో క్వారీ కాసులు చేరుతున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. క్వారీలో అడుగు పెట్టాలంటే రూ. 5 నుంచి రూ. 10 లక్షలు, రాళ్లు బయటపడితే నెలవారీ మామూళ్లు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకు వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఓ మంత్రి పేరు సైతం వాడేస్తున్నారని ఆగ్రహానికి లోనవుతున్నారు. అడ్డొచ్చే వారికి, ఈ అక్రమ క్వారీల విషయాన్ని బయట పొక్కకుండా కాపాడేందుకు వివిధ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు పంపుతున్నామని అక్రమ క్వారీ నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రతిఫలంగా అధికారులు అక్రమ క్వారీ నిర్వాహకులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని టీడీపీలోని ఓ వర్గం నేతలు గొంతు చించుకుంటున్నారు. అక్రమంపై ఫిర్యాదు చేస్తే.. ఆ కార్వీలకు దరఖాస్తులు పెట్టుకున్నారని అధికారులు తోసి పుచ్చుతున్నట్లు వారు మండిపడుతున్నారు. అక్రమ క్వారీ వ్యవహారంపై కలెక్టర్కు కూడా మైనింగ్ అధికారులు తప్పుడు నివేదికలు పంపుతున్నారని వాదిస్తున్నారు. అనుతులుంటే నష్టపోతున్నారు.. అక్రమ క్వారీలతో పక్కాగా అనుమతులు తీసుకుని క్వారీలు నడిపిస్తున్న వారు నష్టపోతున్నారు. అక్రమ క్వారీలకు గిరాకీ పెరగడంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. అక్రమ గ్రానైట్ తక్కువ రేటుకు లభించడంతో అక్రమ క్వారీలకు క్యూ కడుతున్నారు. అక్కడ తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ...అనుమతులతో నడిపిస్తున్న క్వారీపై పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. అక్రమ క్వారీ నిర్వాహకులు గ్రానైట్ తరలింపునకు దొంగ బిల్లులు అంటగడుతూ..గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులను బుట్టలో వేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. దీని దెబ్బకు అనుమతులతో క్వారీ నడిపిస్తున్న వారు ఏకమయ్యారు. అక్రమ క్వారీలతో తమ కడుపు కాలుతోందని..వారంతా రాష్ట్ర నేతల వద్ద గోడు వెలబోసుకుంటున్నారు. దొంగబిల్లుల రచ్చ... చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న దొంగ బిల్లుల వ్యవహారం రచ్చ కెక్కింది. ఈ వ్యవహారానికి మూల పురుషుడుగా రారాజేనని కూటమి నేతలు ముద్రవేశారు. సాక్షిలో వచ్చిన వరుస కథనాలను టీడీపీలోని నేతలే నిజమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి చేరినట్లు ఓ వర్గం కోడై కూస్తోంది. ఈ విషయాన్ని తొక్కే పడేయాలని కొందరు అధికారులు, రారాజు వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వ్యతిరేక వర్గం చెబుతోంది. ఈ వ్యవహారంపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బంగారుపాళెం మండలంలో నడుస్త్తున్న అక్రమ క్వారీలు జిల్లాలో ఆగని అక్రమ క్వారీలు -
కిక్కిరిసిన గోవిందరాజులగుట్ట
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పెరటాసి నెలను పురస్కరించుకుని చిత్తూరు మండలం టి.వేపనపల్లి సమీపంలోని గోవిందరాజుల గుట్టకు శనివారం జనం పోటెత్తారు. గుట్టలోని శ్రీవారి పాదాలకు క్షీరాభిషేకం చేశారు. చుట్టూ పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో తాళంబేడు సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, సభ్యులు సోమనాథరెడ్డి, నందగోపాల్నాయుడు, మధుబాబు, గోవిందరాయుడు, శ్రీరాములు, నీరాజాక్షులునాయుడు, అర్చకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు నగరంలోని శ్రీవేంకటేశ్వస్వామి ఆలయంలో కూడా భక్తులు కిక్కిరిశారు. గోవింద నామస్మరణలతో మార్మోగించారు. అనంతరం స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించారు. -
లోన్ మంజూరైందంటూ ఘరానా మోసం
చౌడేపల్లె : ఫోన్ చేసి హలో.. మీకు రూ.5 లక్షల లోన్ మంజూరైందని మాటలతో బురిడీ కొట్టి రూ.50 వేలు సొమ్ము కాజేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా.. చౌడేపల్లె మండలం 29 ఏ చింతమాకులపల్లెకు చెందిన డి. కృష్ణప్ప కుమారుడు రవికి శుక్రవారం 8601605396 నంబరుతో ఫోన్లో ‘ధని ప్రవేటు పైనాన్స్ కంపెనీ మేనేజరు విజయరావు మాట్లాడుతున్న.. మీకు లోన్ మంజూరైంది, అది జమ కావాలంటే తొలుత కొంత సొమ్ము చెల్లించాలని కోరాడు’. రవిని నమ్మించడానికి విజయరావు పైనాన్స్ మేనేజరు ఐడీ , ఆధార్ కార్డులను వాట్సాప్నకు పంపించడంతో నిజమేనని నమ్మిన రవి తొలుత రూ.20 వేలు, తరువాత రూ.30 వేలు చెల్లించేశాడు. ఎంతసేపటికీ తనకు రూ.5 లక్షలు లోన్ సొమ్ము ఖాతాకు జమ కాకపోవడం, తనకు వచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు. చివరికి ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపాడు. ధని పైనాన్స్ మేనేజరుగా పంపిన విజయరావు గుర్తింపు కార్డు, ఆధార్ -
మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు
అధికార బలంతో కూటమి నేతలు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువుపై కన్నేశారు. పూడికత తీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు ఒడిగట్టారు. పొద్దున్నుంచి చీకటి పడేవరకు యంత్రాల సహాయంతో తవ్వేయడం.. ఆపై ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ తంతు సాగుతున్నా ఏ ఒక్క అధికారీ వారికి అడ్డుచెప్పలేకపోయారు. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదు కావడంతో తోకముడిచారు. శుక్రవారం మట్టితవ్వకాలకు ఫుల్స్టాప్ పెట్టారు. కన్నుమన్ను కానకుండా..!ఆగిన పనులు సాక్షి, టాస్క్ఫోర్స్ : చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువును కూటమి నేతలు చెరబట్టారు. అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. గత ఎనిమిది నెలలుగా ఉదయం నుంచి రాత్రి వరకు యంత్రాలు పెట్టి అందినకాడికి అడ్డంగా తవ్వేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోతు లోడేశారు. ఈ అక్రమ తవ్వకాల్లో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధి పాత్ర కీలకంగా ఉందనే ఆరోపణలు మిన్నంటాయి. ఎనిమిది నెలల క్రితం నుంచి తవ్వుతున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడ లేదు. ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి వందల ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నా అడ్డుచెప్పలేదు. దీనిపై ఇదివరకే సాక్షి దినపత్రికలో ఈ ఏడాది మే 03, మే 12, జూలై 19 తేదీలలో పతాక స్థాయిలో వార్తలు వెలువడ్డాయి. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. గతంలో సాక్షిలో ప్రచురితమైన ప్రత్యేక కథనంగ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాలపై అనేక ఆరోపణలు నమోదైనప్పటికీ అధికారిక యంత్రాంగం పట్టించుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువు రూపురేఖలు మారిపోయినా కన్నెత్తి చూడలేదు. ఇష్టానుసారంగా మట్టి తవ్వితే కట్టమంచి చెరువుకు ప్రమాదం అని తెలిసినప్పటికీ అడ్డుకోలేదు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదు కావడంతో కట్టమంచి చెరువులో శుక్రవారం నుంచి మట్టితవ్వకాలు నిలిపివేశారు. పక్కా ఆధారాలతో గ్రీన్ ట్రిబ్యునల్కు జిల్లా కేంద్రంలోని గాండ్లపల్లి రెవెన్యూ పరిధి సర్వే నం.1లోని కట్టమంచి చెరువులో టీడీపీ నేతలు పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. ఈ విషయం పై తిరుపతి జిల్లా, కేవీబీపురం మండలం, కళత్తూరు గ్రామానికి చెందిన కోలా విజయ్కిరణ్ అనే న్యాయవాది గ్రీన్ ట్రిబ్యునల్ చైన్నె బెంచ్లో పిటీషన్ వేశారు. కట్టమంచి చెరువులో మట్టిని తొలగించడం పర్యావరణ రక్షణ చట్టం 1986 సెక్షన్ 5ను ఉల్లంఘించడమేనని ఉద్ఘాటించారు. కట్టమంచి చెరువులో 2 కి.మీ చుట్టు కొలతతో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ రవాణాపై పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో పిటీషన్ వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కట్టమంచి చెరువును కాపాడేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదయ్యింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చిత్తూరు కలెక్టర్, చిత్తూరు నగరపాలక కమిషనర్, చిత్తూరు తహసీల్దార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శిని ప్రతివాదులుగా నమోదు చేశారు. -
పీఈఎస్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు
కుప్పం: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పీఈఎస్ యూనివర్సిటీ విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికాలు దాడులు నిర్వహించారు. కుప్పం పట్టణ సమీపంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో మూడు రోజులుగా తమిళనాడు రాష్ట్రం, చైన్నెకి చెందిన 12 మందితో కూడిన ఆదాయ పన్నుశాఖ అధికార బృదం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం పీఈఎస్ మెడికల్ కళాశాల మెయిన్ గేట్ను మూసివేసి, ఎంట్రాన్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. కళాశాలలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని లోనికి అనుమతించారు. ఇప్పటికే బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఐటీ దాడులు జరిగిన విషయం విధితమే. పంటలపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పంటలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని పాళెం, దేవళంపేట పంచాయతీల్లో పంట పొలాలను నాశనం చేశాయి. దాదాపు పది మంది రైతులకు సంబంధించిన పంటలను తొక్కిపడేశాయి. పాళెం పంచాయతీతోపాటు దేవళంపేట పంచాయతీలోని దిగవమూర్తివారిపల్లె, మర్రికుంటవారిపల్లె, బాలిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. మామిడి తోపునకు అమర్చిన ఇనుప గేటును గొడతో సహా పెకళించివేశాయి. తిరిగి సమీపంలోని చింతల వంకకు చేరు కున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
ముత్యాల మురిపెం
సింహాసన యోగం.. ధనలక్ష్మీ నమోస్తుతేధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయదారులు, ఈఓ ఏకాంబరం పాల్గొన్నారు. – చౌడేపల్లెఇల వైకుంఠంగా అలరారుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి శుక్రవారం ఉదయం సింహ వాహనంపై యోగ నృసింహుడి రూపంలో దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. – తిరుమల -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,388 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. 21,998 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.1.74 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో వెంకన్నను దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
మా భూమిని ఆక్రమిస్తున్నారయ్యా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమ అనుభవంలోని రెండెకరాల భూమిని టీడీపీ యాదమరి మండల అధ్యక్షుడు మురార్జీ, కార్యకర్త కుప్పయ్యమందడి ఆక్రమిస్తున్నారని అదే మండలం, రసూల్ నగర్ ఏఏడబ్ల్యూ కాలనీకి చెందిన బుజ్జి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదమరి తహసీల్దార్ అండతో అక్రమార్కులు తప్పుడు రికార్డులు సృష్టించి తమను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. తమ భూమిలోని టేకు, మామిడి చెట్లను తొలగించారని.. ప్రశ్నించిన తమను కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమపై తప్పుడు కేసు పెడుతామని అధికారులు, టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ బతకులు రోడ్డు పాలు చేస్తున్న మురార్జీ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి గుడుపల్లె: వ్యవసా య పొలం వద్ద కరెంట్ షాక్కు గురై వేలు (40) అనే వ్యక్తి శుక్ర వారం మృతి చెందా డు. బంధువుల కథనం.. మండలంలోని కంచిబందార్లపల్లె గ్రామానికి చెందిన వేలు తన పొలం వద్ద ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న స్టార్టర్లోని స్వీచ్ వేసేందుకు వెళ్తుండగా కరెంట్ వైరు తగిలి షాక్కు గురయ్యా డు. స్థానికులు అతన్ని కుప్పం ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. గ్రానైట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చిత్తూరు అర్బన్: జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీల సంఘం నాయకుడు, చిత్తూరుకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి శేఖర్ నాయుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్నాయుడుకు పలు క్వారీలు, గ్రానై ట్ ఫ్యాక్టరీలు ఉన్నా యి. దీంతోపాటు కొన్ని క్వారీలను లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిత్తూరు మండలంలోని సిద్ధంపల్లె వద్ద కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అప్పటికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న శేఖర్నాయుడు తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గరుడసేవ నాడు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 28న గరుడ సేవ నాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 27న సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబరు 28 ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. -
బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వెళ్లాడేమో!
రేణిగుంట: ఎమ్మెల్యే బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాడా..? అనే అనుమానం వస్తోందని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. విజయవాడ నుంచి శుక్రవారం రాత్రి రేణిగుంటకు చేరుకున్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రతి ఒక్కరికీ దేవాలయం లాంటిదని, అలాంటి ప్రదేశంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. మానవత్వం, కృతజ్ఞత అనేది బాలకృష్ణకు ఉంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పై అలాంటి మాటలు మాట్లాడరన్నారు. కౌరవుల సభలో ద్రౌపదిని అవమానించి ఆనందించినట్లు అసెంబ్లీలో అభివృద్ధిని పక్కనపెట్టి జగన్ జపం చేస్తున్నారని అన్నారు. బాలకృష్ణ చేసిన పనికి రాజశేఖరరెడ్డి తలుచుకుని ఉంటే జీవితాంతం జైల్లో ఉండేవారన్నారు. మానవత్వం చూపిన కుటుంబంపై ఈ విధంగా మాట్లాడడం తగదన్నా రు. జగన్మోహన్రెడ్డి కూడా బాలకృష్ణ అభిమానే అని.. అలాంటి వ్యక్తిపై వ్యక్తిత్వం చంపుకొని మాట్లాడడం బాధాకరమన్నారు. అయితే సినీ నటుడు చిరంజీవి హుందాతనంతో వెంటనే స్పందించారని అన్నారు. చిరంజీవి స్పందించకుండా ఉంటే ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లి ఉండేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి లాగానే పవన్ కళ్యాణ్ కూడా నడుచుకుంటే బాగుంటుందని హితవు పలికారు. -
ఆ గౌరవం కూడా పోయింది
పలమనేరు: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారశైలి, మాట్లాడిన తీరును చూసి వారి తండ్రి ఎన్టీరామారావుపై ప్రజల్లో ఉన్న గౌరవం కూడా పోయిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. బాలకృష్ణ సినిమాల కోసం గత ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి నుంచి లబ్ధిపొందినప్పుడు ఆయన మంచివారు.. ఇప్పుడు చెడ్డవారా..? అని ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సభలో సంబంధంలేని చిరంజీవిపై తూలనాడడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇంత జరిగినా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు మాట్లాడకపోవడం మరీ ఘోరమన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నటికీ టీడీపీకి జనసేన కట్టుబానిసగా ఉండాల్సిందేనని తెలుస్తోందన్నారు. బాలకృష్ణ అదే అసెంబ్లీలో జగనన్నకు సారీ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. -
మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులకు జెండర్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ హింస లేని కుటుంబాలే లక్ష్యంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అయితే సంఘాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక వనరులు అందుకుంటున్న కుటుంబాల్లో హింస కారణంగా వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. సమావేశంలో వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్, డీపీఎం మంజుల, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, హేమ పాల్గొన్నారు. -
నేషనల్ అథ్లెటిక్స్లో ప్రతిభ
పలమనేరు: పట్టణంలోని కేవీఎస్ వీధికి చెందిన గౌతమిప్రసాద్రెడ్డి కుమార్తె మోక్షితారెడ్డి నేషనల్ అథ్లెటిక్స్లో వివేష ప్రతిభ కనబరించింది. ఈనెల 24న గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 36వ సౌత్జోన్ జూనియర్ నేషనల్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్పు 2025లో అండర్–16 విభాగం లాంగ్ జంప్లో విజేతగా నిలచింది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. బాలిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదవుకుంటూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. గతేడాది జరిగిన ఇదే క్రీడల్లో బాలిక గోల్డ్మెడల్ సాధించిన విషయం తెల్సిందే. -
బంగారుపాళెంలో అగ్ని ప్రమాదం
ఇంట్లో కాలిపోయిన వస్తువులుఇంట్లో నుంచి వస్తున్న పొగ బంగారుపాళెం: మండల కేంద్రమైన బంగారుపాళెంలో శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. మండలంలోని మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన నాగరాజ బంగారుపాళెంలో వినాయక టెక్స్టైల్స్ దుకాణాన్ని నిర్వహింస్తున్నాడు. పాత తాలూకా వీధిలో సొంత గృహాన్ని నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గుర్తించారు. స్థానికులు పోలీసులకు, విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు, కిటికీలు పగులగొట్టి మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బంది బంగారుపాళ్యానికి చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
భూకబ్జాలో రవితేజం!
కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కన్ను ప్రభుత్వ, పేదల భూములపై పడుతోంది. అధికారం అడ్డుపెట్టుకుని ఏకంగా పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూమిని సైతం దర్జాగా కబ్జా చేశాడు. కార్పొరేట్ స్థాయిలో కొబ్బరి తోట సాగుకు పూనుకున్నాడు. దాదాపు కోటి రూపాయల విలువైన 8 ఎకరాలను ఆక్రమించాడు. ఈ యవ్వారంపై శుక్రవారం బాధితులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భూమి ని చదును చేస్తున్న జేసీబీని సీజ్ చేశారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పాలనలో బండపల్లె ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. సుమారుగా 500 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించింది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం, ఇతర కారణాలతో కొంత మంది ఇళ్లు కట్టుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ కార్పొరేటర భర్త ఆ స్థలంపై కన్నేశారు. ఎలాగైనా దానిని సొంత చేసుకోవాలని కరెంటు స్తంభాలు, నంబర్ రాళ్లను, నీటి పైపులను ధ్వంసం చేశాడు. పేదల ఇళ్ల స్థలాలతో పాటు అటవీ భూములను సైతం ఆక్రమించేశాడు. ఆక్రమించిన సుమారు 8 ఎకరాల స్థలంలో దాదాపు 400 కొబ్బరి చెట్లు నాటాడు. ఇది ఆ నోటా ఈనోటా పడి చివరకు అధికారుల చెవిలో పడింది. గురువారం రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కొబ్బరి చెట్లను తొలగించారు. పేదల స్థలాన్ని కబ్జా చేస్తారా..? రెవెన్యూ అధికారులు కబ్జాకు చెక్ పెట్టినా మళ్లీ ఆక్రమణ పర్వం కొనసాగడంతో వైఎస్సార్సీపీ నాయకులు, పేదలు శుక్రవారం ఆక్రమిత ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఆక్రమణ వ్యవహారాన్ని మీడియా ముందుకు పెట్టి, నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు దోచుకోవడమే పనిగా పడ్డారన్నారు. టీడీపీ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూములను సైతం కబ్జాచేశారని, కరెంటు స్తంభాలు, పైపులైన్లను దౌర్జన్యంగానే తొలగించారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జేసీబీని సీజ్ చేశారన్నారు. జయలక్ష్మి భర్త లెప్రసీ డాక్టర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ చెందారని, వారికి కోట్లాది రూపాయల ఆస్తులు సైతం ఉన్నాయన్నారు. అధికారులు తనకు 8 ఎకరాల స్థలం కేటాయించినట్లు ఆయన చెప్పుకుంటున్నారని, ఇదే నిజమైతే ఎవరికి ఎంతెంత వాటాలందాయో, దీని వెనుక బాగోతమేమిటో ఉన్నతాధికారులే తేల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బాధితులకు ఎమ్మెల్యే సైతం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, మురగయ్య, ప్రభాకర్రెడ్డి, వెంకటముని, సుధా, బాలాజి, సురేంద్ర, రమేష్, మోహన్, మురగ, సెల్వం, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. దీనిపై రూరల్ తహసీల్దార్ జయప్రకాష్ను వివరణ కోరగా.. ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. చదును చేసిన భూమిధ్వంసమైన తాగునీటి ట్యాంక్, పైపులు విద్యుత్ స్తంభాలు -
నేడు ఐఐటీ ఫేజ్–బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఏర్పేడు : తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఫేజ్–బీ పనులకు శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేయనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటీ అభివృద్ధికి ఫేజ్–బీ కింద రూ.2,313 కోట్లు నిధులు కేటాయించింది. ఫేజ్–ఏలో ఇప్పటికే రూ.1,444 కోట్లు ఖర్చు చేయగా, ఫేజ్–బీ నిధులతో మరింతగా ఐఐటీ శాశ్వత ప్రాంగణం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమి పొందిన సమయంలో కుంగిపోకుండా తిరిగి పోటీల్లో రాణించేలా ప్రయత్నం చేయాలన్నారు. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చందు మాట్లాడుతూ క్రీడల్లో మంచి పుణ్యం ప్రదర్శిస్తే క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చన్నారు. జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీల్లో ఎంపికై న జట్లకు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖపట్టణం జిల్లా నర్సీపట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన జట్లను అభినందించారు. అనంతరం ఉచితంగా క్రీడాదుస్తులు అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్లు దేవానంద్, నూరుద్దీన్, కృష్ణా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాబూ.. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయా?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్, ముంబై, భువనేశ్వర్, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు. -
మార్గం సుగమం!
చిత్తూరు నగర నడిబొడ్డున రోడ్ల విస్తరణ అంశం తుది అంకానికి చేరుకుంది. మూడో దశ రోడ్ల అభివృద్ధి (ఆర్డీ) ప్రణాళికలను ఆమోదిస్తూ అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు భవన స్థలాన్ని ఇచ్చే యజమానులకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇక టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కార్పొరేషన్ కమిటీ అధికారికంగా బాండ్లను పంపిణీ చేయనుంది. ఆర్డీ ప్లాన్ ఆమోదిస్తూ.. సంతకం చేస్తున్న కమిషనర్ చిత్తూరు హైరోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతీ పదేళ్లకు ఓసారి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తారు. పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారుచేస్తారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో 2022లో నూతన మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. నూతన మాస్టర్ ప్లాన్ ప్రకా రం కట్టమంచి నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఉన్న రోడ్డును వంద అడుగులకు విస్తరించాల్సి ఉంది. 2018లో హై రోడ్డులోని కృష్ణుడి ఆలయం నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఆర్డీ ప్లాన్ను ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్లో కట్టమంచి నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు, తాజాగా రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి కృష్ణుడి ఆలయం వరకు ఆర్డీ ప్లాన్ ఆమోదించడంతో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో పాటు టీడీఆర్ బాండ్ల పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా న్యాయస్థానాల సముదాయ ప్రహరీ గోడ, రైల్వే స్టేషన్, వక్ఫ్బోర్డు, దేవదాయ శాఖ స్థలాల్లో కట్టడాలను తొలగించారు. టీడీఆర్ బాండ్ల జారీ ఇలా.. విస్తరణలో భవనాలు, కట్టడాలు కోల్పోయేవారికి పరిహారం స్థానంలో టీడీఆర్ బాండ్లను ఇవ్వడానికే అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్తూరు హై రోడ్డు విస్తరణలో భవన యజమానులు 600–1000 అడుగుల వరకు స్థలాన్ని కోల్పోవాల్సి ఉంటుందని అంచనా. పరిహారమైతే భూమి రిజస్టర్ విలువ ప్రకారం రూ.100కు రూ.200 ఇస్తారు. టీడీఆర్ బాండ్లు ప్రతీ వంద అడుగులకు 400 అడుగుల విలువ చేసే పత్రాలు ఇస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లను జిల్లాలో మాత్రమే విక్రయించుకునే వెసులు బాటు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దీన్ని రాష్ట్రంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో టీడీఆర్ బాండ్లకు విలువ పెరిగింది. టీడీఆర్ బాండు కలిగి వ్యక్తి.. తాను ఎక్కడైనా భవనం నిర్మించేటప్పుడు రెండు అంతస్తులకు అను మతి ఉంటే, టీడీఆర్ బాండు ద్వారా అదనంగా మరో రెండు అంతస్తులకు అనుమతులు పొందొచ్చు. భవ నం చుట్టూ సెట్బాక్స్ను కూడా వదలాల్సిన అవసరం ఉండదు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో సబ్–రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులను తొలగించి.. మునిసిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, ఏసీపీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్డీలను సభ్యులుగా ఉంచడంతో బాండ్ల జారీ సులభతరం కానుంది. నిధులిస్తేనే అభివృద్ధి చిత్తూరు కార్పొరేషన్లో ఇక ఎవరైనా విస్తరణ స్థలం కోల్పోయే వ్యక్తులు టీడీఆర్ బాండ్ల కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కమిటీ మార్కెట్ విలువను సబ్–రిజిస్ట్రార్ నుంచి తీసుకుని, భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను జారీచేసి, ఆన్లైన్లో ఉంచుతుంది. అయితే విస్తరణలో మరో కీలక అంశం నిధుల విడుదల. ప్రస్తుతం 50 అడుగల మేరకు రోడ్డును విస్తరించాల్సి ఉంది. విస్తరించిన స్థలంలో రోడ్లు వేయడం, కాలువలు కట్టడం, విద్యుత్ లైన్లు, మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు దాదాపు రూ.100 కోట్లు అవసరం ఉంది. కార్పొరేషన్ వద్ద అంత నిధులు లేవు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు తీసుకొస్తేనే చిత్తూరులో అభివృద్ధి చూడడం సాధ్యమవుతుంది. లేకుంటే రోడ్ల విస్తరణ కాస్త కొట్టేసిన భవనాలు, గుంతలు పడ్డ రహదారులతో అందహీనంగా కనిపించనుంది. దీనిపై కలెక్టర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకొస్తారని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
చౌడేపల్లె: ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టిసారించాలని డీపీఎం జి.వాసు తెలిపారు. ఆయన గురువారం బోయకొండ సమీపంలోని గట్టువారిపల్లెలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచరల్ ఫామింగ్ రైతు సాధికార సంస్థ (ఈవీఎస్) ఆధ్వర్యంలో జిల్లాలో 263 క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై రైతులను చైతన్యవంతులను చేశామన్నారు. వేరుశనగ, వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ప్రకృతి సేద్యం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం అక్కడే సాగుచేసిన వరిపంటతోపాటు కషాయాన్ని పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్పీ ఎంఎంటీ సుధాకర్ నాయుడు, ఎన్ఎఫ్ఏ నాంచారమ్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గంగిరెడ్డి, రామనాథం, తదితరులు పాల్గొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి..
పాలకడలిపై తేలియాడే శేషుడు తిరువీధులకు తరలివచ్చాడు. ఆపద మొక్కుల వాడికి వాహనమయ్యాడు. శ్రీహరి చిద్విలాసంగా విహరించాడు. రాయంచ సింహసం కాగా శ్రితపరిపాలకుడు వీణాపాణి ధరించి, విహరించాడు. వివేచన బోధించాడు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం చిన్న శేష, హంస వాహనాలపై మలయప్పస్వామి విహరించారు. ఈ వాహనసేవల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలఅన్నపూర్ణాదేవిగా బోయకొండ గంగమ్మఅన్నపూర్ణా.. పాహిమాంచౌడేపల్లె: దసరా మహోత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ గురువారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు గోవర్థనశర్మ, గంగిరెడ్డి తదితర అర్చక బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలు చేశారు. ఉభయదారులు, ఈఓ ఏకాంబరం పాల్గొన్నారు. -
మరమ్మతులకు పచ్చజెండా
పాలసముద్రం : స్థానిక రెవెన్యూ కార్యాలయ మరమ్మతులకు నివేదికలు పంపాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తహసీల్దార్ అరుణకుమారిని ఆదేశించారు. గురువారం పాలసముద్రం రెవెన్యూ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పెచ్చులూడి, అధ్వానంగా ఉండడంతో వెంటనే మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంతమేర నిధులు అవసరమవుతాయని ఏఈ జయరాజ్ను అడగగా రూ.15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న రైతులతో స్నేహభావంతో మెలగాలని సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరు నుంచి బలిజకండ్రిగకు వస్తున్న జాతీయ రహదిరి కూడా అధ్వాన్నంగా ఉందని, దాన్ని కూడా త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో వనదుర్గాపురం నుంచి మండల కేంద్రానికి రోడ్డు పనులు ప్రారంభించారని, అవి అర్ధంతరంగా ఆగిపోవడంతో తమిళనాడు రాష్ట్రం మీదుగా 15 కి.మీ చుట్టుతిరిగి రావాల్సి వస్తోందని ఎంపీపీ శ్యామలశివప్రకాష్ రాజు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి చర్యలు చేపడుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఓ ఢిల్లీన్రసాద్, ఆర్ఐ దేవి, వీఆర్ఓ తంగరాజ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం పాలసముద్రం: ప్రకృతి వ్యవసాయ పంటలు, కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. గురువారం మహదేవపురం, తిరుమలరాజుపురంలో ప్రకృతి వ్వవసాయ క్షేత్రం, నర్సరీని ఆయన పరిశీలించారు. రసాయనాలతో సాగు చేసే పంటలు హానికరమని, రైతులు ప్రకృతి పద్ధతిలో సాగుపై ఆసక్తి చూపాలని తెలిపారు. అనంతరం తిరుమలరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల సమీపంలో పాడైన బావిని పూడ్చి వేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ అరుణ కుమారి, ఆర్ఐ దేవి, వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు. -
కూలి పనులకెళ్తూ..!
రొంపిచెర్ల: ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుల కథనం.. రొంపిచెర్ల మండలం, రామచంద్రాపురం కాలనీ, మూరేవాండ్లపల్లె, పిచ్చిగుంట్లవారిపల్లె గ్రామాలకు చెందిన మహిళలు అన్నమ్మయ్య జిల్లాలోని కలకడ మండలంలో టమాట తోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఆ మూడు గ్రామాలకు చెందిన 14 మంది మహిళలు ఆటోలో కలకడకు బయల్దేరారు. నేషనల్ హైవేలోని బోనంవారిపల్లె సమీపంలో ఆటోను పీలేరు వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన అలివేలమ్మ (53) మృతి చెందారు. అలాగే మూడేవాండ్లపల్లెకు చెందిన పీ.రత్నమ్మ, పీ.లక్ష్మీదేవి, పీ.శాంతమ్మ, టీ.నారాయణమ్మ, పీ.కమలమ్మ, పీ.నారాయణమ్మ, రామచంద్రాపురం కాలనీకి చెందిన పీ.రాణి, ఎం.రాములమ్మ, పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రొంపిచెర్ల ఎస్ఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాఽధితులను పరామర్శించిన జెడ్పీటీసీ క్షతగాత్రులను జెడ్పీటీసీ రెడ్డిశ్వర్రెడ్డి పరామర్శించా రు. ఆయన నేరుగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరు కుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటా మని భరోసానిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలయజేశారు. బాధితులకు దగ్గరుండి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మృతురాలు అలివేలమ్మ గాయపడిన మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు