breaking news
Hyderabad
-
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
పొన్నంకు ‘లక్ష్మణ’ రేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది. నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా? తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని. పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు.. పొన్నం ప్రభాకర్లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు. పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు.. పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు.. ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్కుమార్ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు. ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్ దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు. పీసీసీ చీఫ్కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్నగర్లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు. -
‘పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీటిలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తప్పు జరిగింది వాస్తవమేనని అంగీకరించి పున్నం గారి చేత క్షమాపణ చెప్పించే విధంగా చూస్తామని తెలిపారని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణను తీసుకోవలసి వస్తుందని అన్నారు మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు ఆత్మగౌరవ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు అనే విషయం స్పష్టం చేశారు.కార్యక్రమం మైనార్టీ వర్గాలకు చెందిన ఆయనప్పటికీ ఆ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉండగా వాటి మీద పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం ఎందుకు అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్న వివేక్ జోక్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి పరిశీలన చేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే పొన్నం సహించగలుగుతాడా అలాగే కార్మిక శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి సహించగలుగుతారా తెలుసుకోవాలని అన్నారు. లక్ష్మణ్ కుమార్ దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌనంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందని అన్నారు నిజంగా వివేక్ లో దళిత సృహ ఉంటే సాటి దళిత మంత్రిని అలా అనకూడదని వెంటనే ఖండించాల్సిన అవసరం ఉండేది కానీ వివేకలో ఆస్పృహ లేదని అర్థమైంది. వివేక్ వెంకటస్వామి మాదిగలను పోర్చుకోలేకపోతున్నాడని అన్నాడు కాక జయంతి వేడుకల్లో అన్ని వర్గాలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి.. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వివేక్లో దళిత సోదర సోదర భావం కనుమరుగైందని అన్నారు. ఉమ్మడిగా దళితులకు రావలసిన హక్కులను సాధించడం కోసం అందని కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న వివేక్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడని అన్నారు.బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతుందని అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతించినట్లుగానే బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని పిలుపునిచ్చారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని, ఆ స్థానంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్లో నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్ -
HYD: కొండాపూర్, కూకట్పల్లిలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో(Hyderabad) మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు(IT Raids) చేపట్టారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొండాపూర్లోని అపర్ణా హోమ్స్లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
డ్రైవింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?.. శిక్ష తప్పదు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వాహనాల డ్రైవర్లకు సీపీ వీసీ సజ్జనార్(CP Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్లు(Traffic Violations) ఉపయోగించడం నేరమని అన్నారు. ఇది ప్రమాదకరం.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. ఇటీవలి కాలంలో ఆటో, క్యాబ్ డ్రైవర్స్(Cab Drivers), బైక్ టాక్సీలు నడిపేవారు డ్రైవింగ్ సమయంలో తరచుగా మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, ఇయర్ఫోన్స్ వినియోగించడం చేస్తున్నారు. ఇలాంటివి చేయడం నేరం. ఇది ప్రమాదకరమైంది.. శిక్షార్హమైన నేరం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు అని హెచ్చరించారు. ఇదే సమయంలో వాహనదారుల స్వీయ రక్షణ, ప్రయాణీకులు, తోటి రోడ్డు వినియోగదారుల భద్రత చాలా ముఖ్యమైనది. ఏ పరధ్యానం కూడా ప్రాణానికి విలువైనది కాదు. ఇలాంటి వాటి దృష్టి పెట్టండి, సురక్షితంగా ఉండండి’ అని సూచించారు. 🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025 -
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కీలక నేత నవీన్ యాదవ్పై(Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ(Election Code) ఆయనపై కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విదులైన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు.అనంతరం, దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్పై బీఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నారు. ఇక, తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. -
కొందరికే కొత్త రేషన్కార్డులు!
సాక్షి, సిటీబ్యూరో: సాక్ష్యాత్తు రాష్ట్ర రాజధానిలో(GHMC) కేవలం సుమారు 2.31 లక్షల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు(Telangana Ration Cards) మంజూరయ్యాయి. సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతున్నాయి. ఫలితంగా నిరుపేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అందని ద్రాక్షగా తయారైంది. రెండు నెలల నుంచి కొత్త రేషన్న్కార్డు దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ, ఆమోదం ప్రక్రియ అంతంత మాత్రంగా మారింది. కేవలం మధ్యవర్తుల ప్రమేయం, ఇతరాత్ర సిఫార్సుల ఉన్న దరఖాస్తులకు మాత్రమే మోక్షం లభిస్తోంది.వాస్తవంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మీ సేవా కేంద్రాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. ఒకటి రెండు నెలల వ్యవధిలోనే కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్ర స్థాయి విచారణ కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. ఏకంగా ఆగస్టు మొదటి వారంలో మంత్రులు సైతం నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కొత్త కార్డుల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఆ తర్వాత కొత్త కార్డులు మంజూరును తగ్గించింది. ఆరు లక్షలపైనే దరఖాస్తులు గ్రేటర్ పరిధిలో సుమారు ఆరు లక్షల పైనే కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో మంజూరు 30 శాతం మించలేదు. కనీసం దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ కూడా ముందుకు సాగడం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఎఫ్ఎస్సీ ఆన్లైన్ లాగిన్కు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించినా మంజూరు మాత్రం కొందరికి పరిమితమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే పౌరసరఫరా శాఖ వెబ్సైట్ ఆన్లైన్ లాగిన్ నిలిచిపోయింది.అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల స్థాయిలో వడబోసి అదే ఏడాది జూలై చివరి వారంలో కొత్త కార్డులు మంజూరు చేసింది. మొత్తం దరఖాస్తుల్లో 40 శాతం మాత్రమే క్లియర్ కాగా..మిగతా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పునరుద్ధరించారు. దీంతో దరఖాస్తుల నమోదు నిరంత ప్రక్రియగా సాగుతున్నా మంజూరు నత్తనడకన సాగుతోంది. కార్డు లేని కుటుంబాలు పది లక్షల పైనే.. గ్రేటర్లో రేషన్ కార్డులు లేని కుటుంబాలు 10 లక్షలపైనే ఉన్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన మహానగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు 27.21 లక్షలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజా పాలనలో పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి.హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చి చేరాయి. అయితే ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది.అయితే అది కాస్త విమర్శలకు దారితీయడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, సిద్ధిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ నెలలో 10+10+11.. అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ పాస్లు -
సికింద్రాబాద్-కాజీపేట మధ్య ఫోర్ లైన్ రైల్వే కారిడార్.. కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు, సికింద్రాబాద్(secunderabad) నుంచి ఏకంగా రోజుకు కనీసం 150 అదనపు రైళ్లు నడిపేందుకు వీలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ నుంచి కాజీపేట(Kazipet) వరకు ఉన్న రెండు వరుసల రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లకు(Four Line Railway Route) విస్తరించబోతోంది. ఉత్తర–దక్షిణ భారత్లను రైల్వే మార్గంతో జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్తో ఇది అనుసంధానం కాబోతోంది.గ్రాండ్ ట్రంక్ రూట్లో మూడో లైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చినందున త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మార్గాన్ని నాలుగు లైన్ల రూట్గా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, దానికి అనుసంధానమయ్యే సికింద్రాబాద్–కాజీపేట మార్గాన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన డీపీఆర్లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా నిత్యం నడుస్తున్న 200 రైళ్లకు (గూడ్సు సహా)అదనంగా మరో 150 రైళ్లను నడపొచ్చు.సామర్థ్యానికి మించి రైళ్లు.. దేశంలో అతి కీలక లైన్లు అయిన హైలీ యుటిలైజ్డ్ నెట్వర్క్ (హెచ్యూఎన్)లలో సికింద్రాబాద్–కాజీపేట మార్గం ఒకటి. ఈ మార్గంలో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ సాంద్రత 150 శాతంగా ఉంది. ఇది ప్రమాదకర పరిస్థితిగా భావిస్తారు. సిగ్నలింగ్కు సంబంధించి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఈ తరుణంలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. హైదరాబాద్ నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు రోజుకు అదనంగా 40కి పైగా రైళ్లు అవసరమున్నాయి.ఆయా ప్రాంతాలకు చెందిన వలస కూలీలు రాష్ట్రంలో అధికసంఖ్యలో పనిచేస్తుండటమే దీనికి కారణం, ఇక ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, తదితర ప్రాంతాలకు కూడా అధికంగా రైళ్ల అవసరం ఉంది. తిరుపతి, విజయవాడలకు కూడా మరిన్ని రైళ్లు తిప్పాల్సి ఉంది. వెరసి కనీసం మరో వందకుపైగా రైళ్లు నడపాల్సిన డిమాండ్ ఉన్నా, ట్రాక్ సామర్థ్యం సరిపోక నడపటం లేదు. ఇప్పుడు మూడు, నాలుగు లైన్లు అందుబాటులోకి వస్తే ఆ కొరత తీరిపోతుంది. ఎంఎంటీఎస్–2కు వెసులుబాటు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి. నగరం నుంచి ఘట్కేసర్కు వరకు రెండు మార్గాల్లో కలిపి నాలుగు లైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన మార్గంలో రెండు లైన్లు, అమ్ముగూడ మీదుగా నిర్మించిన బైపాస్ లైన్లో రెండు లైన్లు ఉన్నాయి. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో భాగంగా మూడో లైన్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కాజీపేట వరకు ప్రధాన లైన్ను నాలుగు వరుసలకు విస్తరించనున్నందున, ఎంఎంటీఎస్కు నాలుగో లైన్ కూడా అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. అటు వాడీ, ఇటు బల్లార్షా, విజయవాడ.. నాలుగు లైన్లతో.. కాజీపేట నుంచి బల్లార్షా, కాజీపేట నుంచి విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇది గ్రాండ్ ట్రంక్ రూట్ అయినందున, ఈ మార్గంలో నాలుగో లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక సికింద్రాబాద్–వాడీ మధ్య ఒకేసారి మూడో, నాలుగో లైన్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు మొదలవుతాయి. వెరసి ఈ కీలక మార్గాల్లో నాలుగో లైన్ వస్తున్నందున, విరివిగా రైళ్లను పరిగెత్తించే వీలుంది. దానికి సమతూకం చేయాలంటే సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్య కూడా నాలుగో లైన్ అవసరమవుతుంది. అప్పుడు హైదరాబాద్ మీదుగా అటు బల్లార్షా నుంచి ఢిల్లీ వైపు, విజయవాడ మీదుగా చెన్నై, ఒడిశా, బెంగాల్ వైపు, వాడీ మీదుగా ముంబై వైపు వీలైనన్ని రైళ్లను నడపొచ్చు. 160 కి.మీ. వేగంతో... పస్తుతం ఉన్న రెండు లైన్ల మీద రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. మాత్రమే. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన రెండు లైన్లను 160 కి.మీ. వేగ సామర్థ్యంతో నిర్మించనున్నారు. అప్పుడు ఈ మార్గంలో నడిచే వందేభారత్ రైళ్లు తమ గరిష్ట వేగాన్ని (160కి.మీ.) అందుకొని ప్రయాణిస్తాయి. దీంతో మరింత తొందరగా గమ్యం చేరుకుంటాయి.పచ్చజెండా ఊపేందుకు సిద్ధం రైళ్ల రద్దీ పెరిగి రూట్ ఇరుకుగా మారిన నేపథ్యంలో సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ నిర్మించాలని దాదాపు పదిహేనేళ్లుగా ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ప్రాజెక్టు మంజూరై సర్వేకు సూచించారు. ఆ సమయంలోనే ఒకేసారి మూడు, నాలుగు లైన్లను నిర్మించాలని కేంద్రం భావించి ఆ సంవత్సరం జూలైలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరు చేసింది. సర్వే పూర్తి చేసి గత ఏప్రిల్లో రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పించారు. దాన్ని పరిశీలించిన కేంద్రం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.త్వరలో అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి. అదనపు రెండు లైన్ల నిర్మాణానికి 124 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. త్వరలో ఆ మేరకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ రైలు మార్గంలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్ఓబీ), 27 రైల్వే అండర్ బ్రిడీŠుజ్ల (ఆర్యూబీ) ఉన్నాయి. ఘట్కేసర్, కాజీపేటతో సహా మొత్తం 16 స్టేషన్లు ఈ రూట్లో ఉన్నాయి. -
ఉప ఎన్నికకు సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ బరిలో ఉండే అవకాశాలున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, ఎంఐఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటోన్మెంట్ను కైవసం చేసుకున్నట్టే.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. ఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యరి్థని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ యాదవ్ల పేర్లను పరిశీలిస్తోంది. అయి తే ఏఐసీసీకి పంపిన జాబితాలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం. రేసులో ‘కారు’జోరు నియోజకవర్గంలో ఉన్న పార్టీ సంస్థాగత బలంతో పాటు, మాగంటి గోపీనాథ్ కుటు ంబంపై ఉన్న సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం ద్వారా మిగిలిన పక్షాల కంటే ముందంజలో ఉంది.పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా భేటీ అయిన కేసీఆర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు నెల రోజుల నుంచే పార్టీ కేడర్ను సన్నద్ధం చేసే పనిలో ఉన్నా రు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసే ందుకు ఆరు డివిజన్లకు పార్టీ ఇన్చార్జిలను ఇప్పటికే నియమించారు. హైదరాబాద్లో సత్తా చాటేందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హైదరాబాద్లో సత్తా చాటేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని, హిందూత్వ ఎజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్పై కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఆశపడుతున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల దీపక్రెడ్డితో పాటు, అట్లూరి రామకృష్ణ, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, బండా రు విజయలక్ష్మీ, సినీనటి జయసుధ, ఆకుల విజయ పోటీ పడుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యరి్థని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంఐఎం కార్యాచరణపై మాత్రం ఇంతవరకు స్పష్టత రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన మజ్లిస్ ఈసారి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీపీఐ, సీపీఎం, జనసమితిలు అధికార కాంగ్రెస్ వైపే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
స్థానిక ఎన్నికల్లో ‘సిరా’ చుక్కపై ఎస్ఈసీ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 27 తేదీల్లో (రెండుదశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటింగ్ సందర్భంగా వేలిపై సిరా చుక్క వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టతను ఇచి్చంది. ఈ నెల 23న తొలిదశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ సందర్భంగా ఓటర్ ఎడమచెయ్యి చూపుడు వేలుపై వేసిన ఓటుకు గుర్తుగా సిరా చుక్క వేయాలని ఎన్నికల అధికారులకు తెలిపింది.ఆ తర్వాత ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో జరగనున్న మూడుదశల గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటరు మధ్యవేలుపై సిరాచుక్క వేయాలని పేర్కొంది. ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు ఈ మేరకు ఓ సర్క్యులర్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, రిటరి్నంగ్ అధికారులకు సమాచారం పంపించారు. -
ముందు హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును కాదని నేరుగా తమ వద్దకు రావడాన్ని తప్పుబట్టింది. సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనంటూ, ముందు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. కాగా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అత్యవసరంగా విచారించాలని అభ్యరి్థంచారు. ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళకముందే, జస్టిస్ విక్రమ్నాథ్ ఆయన్ను అడ్డుకున్నారు. ‘ముందు మీరు ఆర్టీకల్ 32 కింద ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి?’అని సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన ధర్మాసనాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయతి్నంచారు. తమ క్లయింట్ను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం పని దినాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు కీలకమైన సర్క్యులర్ జారీ చేసిందంటూ వాదించారు. తాము అత్యవసర విచారణ కోసం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నివాసానికి కూడా వెళ్లా మని, కానీ అక్కడ ఉపశమనం లభించలేదని నివేదించారు. ఇక 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీంతో జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకున్నారు. తొలుత ఆ అడ్డంకిని దాటండి ‘ముందు మీరు ఆ అడ్డంకిని దాటండి, ఆ తర్వాతే కేసు యోగ్యతపై (మెరిట్స్) మేము వాదనలు వింటాం’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. హైకోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు రానంత మాత్రాన, సుప్రీంకోర్టును ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చూడటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయవాదిని ఉద్దేశించి.. ’మీ క్లయింట్లకు మీరు సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది..’అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయి ంచేందుకు స్వేచ్ఛ ఇచ్చారు.ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆ అవసరం లేకుండా పోయింది. కాగా సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో, స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించడంతో ఇక ఈ నెల 8వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ, తీర్పు కీలకంగా మారనుంది. -
అక్రమ లేఔట్లు... రహదారుల ఆక్రమణలు!
సాక్షి, సిటీబ్యూరో: అనుమతి లేని లేఔట్లతో పాటు ఆక్రమణలకు గురవుతున్న రహదారులపై పలువురు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా 41 ఫిర్యాదులు అందాయి. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్రిచ్ ప్రాంతంలోని సర్వే నం.83లో ఉన్న వరకుంట చెరువు కబ్జాల నిరోధించాలని, నిజాంపేట సర్వే నం.233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగికి జవహార్నగర్లో ప్రభత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేరని ఆయన కుమారుడి ద్వారా ఫిర్యాదు అందింది. అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సి ఉండగా ఆక్రమణలకు గురైందని, అక్కడి డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో ఖాళీ చేయించినా మళ్లీ డబ్బాలు పెట్టారని, వీటిని తీయమంటే రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బౌరంపేటలోని సర్వే నం. 166/3లోని ప్రభుత్వ భూమిలో ఎగువన ఉన్న వెంచర్ల కోసం రహదారి నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందింది. హయత్నగర్ మండలంలోని ఆదిత్యనగర్–బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జా అయిందని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాను కోరింది. మేడిపల్లి మండలం సాయిప్రియానగర్లో 2500 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల్లో ఉండాల్సిన పార్కును కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.హైడ్రాను అభినందించిన హైకోర్టు...హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని తీరును హైకోర్టు అభినందించిందని అధికారులు సోమవారం ప్రకటించారు. తమ విభాగం చెరువుల అభివృద్ధిని యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చినట్లు పేర్కొన్నారు. బతుకమ్మకుంటను అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం వ్యాఖ్యానించినట్లు ప్రకటించింది. బతుకమ్మకుంట ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచిందని, గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు హైడ్రా పేర్కొంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇంటి స్థలాలు, భూములు ఉంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకురావాలని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్భంలో ఇది చోటు చేసుకుందని హైడ్రా తెలిపింది. -
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రాకపోకలతో సోమవారం నగరంలోని పలు మెట్రోస్టేషన్లు, మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు నగరానికి తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి పలు ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్నవాళ్లు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి ఇంచుమించు మధ్యాహ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. అలాగే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లైన నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు దసరా అనంతరం శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా నగరవాసులు సొంత ఊళ్ల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. తిరుగుప్రయాణం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్ మేరకు అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సివచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ, వరంగల్, కరీంనగర్, తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి. -
నగరా మోగింది!
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్తో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అది వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రం ఎన్నికల కోడ్ వర్తించదు. –సాక్షి, సిటీబ్యూరోనోటిఫికేషన్: 13 అక్టోబర్ (సోమవారం)నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి దాదాపు 980 మంది ఓటర్లుంటారునియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరున్నదీ, లేనిదీ ఈఆర్ఓ కార్యాలయంలోకానీ, బూత్లెవెల్ అధికారి వద్ద కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్లోకానీ, సంబంధిత వెబ్సైట్లలో కానీ పరిశీలించుకోవాల్సిందిగా కర్ణన్ సూచించారు.జాబితాపై ఏవైనా అభ్యంతరాలున్నా, జాబితాలో పేరు లేకున్నా నామినేషన్ల చివరి రోజుకు పదిరోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం 1950 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన, ఫొటో కలిగిన 12 రకాల ఐడీల్లో ఏదైనా ఒకదాన్ని వినియోగించుకోవచ్చునన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందినోడల్ ఆఫీసర్లు: 19 మందిసెక్టార్ ఆఫీసర్లు: 38 సెక్టార్లకు 55 మంది నియామకంతోపాటు రిజర్వులో కొందరిని ఉంచారు.రిజర్వుతోసహ మొత్తం పోలింగ్ సిబ్బంది: 2,400వీరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు: 600 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 600 మంది, ఇతర సిబ్బంది 1200 మంది.ఈవీఎంలు, వీవీప్యాట్లుకంట్రోల్ యూనిట్లు: 826, బ్యాలెట్ యూనిట్లు: 1494, వీవీప్యాట్లు: 837.రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇప్పటికే మొదటిదశ తనిఖీ పూర్తయిందన్నారు.ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)షెడ్యూలు జారీతోనే ఎన్నికలప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ప్లాన్ రెడీ అయిందని పేర్కొన్నారు.ఎన్ఫోర్స్మెంట్ కోసం 9 ఫ్లై యింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాల కనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు. ఫిర్యాదులకోసం కాంటాక్ట్ నెంబర్ 1950 , కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తాయన్నారు. సీజ్ చేసిన నగదు పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఇంకా..శారీరక వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి వీల్చైర్ సదుపాయం, వాలంటీర్ల ద్వారా ఇళ్లనుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లవద్ద దింపే సదుపాయం.పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వార్తాపత్రికలు, టీవీల్లో మూడు పర్యాయాలు ప్రకటించాలి.రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాల్ని 48 గంటల్లో వెబ్సైట్, సోషల్మీడియా,పత్రికలు, టీవీల ద్వారా వెల్లడించాలి. ‘నో యువర్ క్యాండిడేట్స్’ యాప్ ద్వారా కూడా ప్రజలు అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు.మీడియా ఫేక్న్యూస్ ప్రచారం చేయొద్దు. సంబంధిత అధికారుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. వదంతుల్ని ప్రచారం చేయవద్దు.ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్లుజిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వ్యవహరిస్తుండగా, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ బాధ్యతలు నిర్వహిస్తారు. నామినేషన్లను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరిస్తారు. జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓగా వ్యవహరిస్తారు. జాయింట్ పోలీస్ కమిషనర్ నోడల్ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరగనుంది.ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ సజ్జనర్ తెలిపారు. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలని సూచించారు.407 పోలింగ్ కేంద్రాలు139 భవనాల్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు, టాయ్లెట్స్, తాగునీరు, లైటింగ్, పోలింగ్ కేంద్రమని సూచించే బోర్డులు, వీల్చైర్లు, తదితర సదుపాయాలుంటాయన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీల నుంచి బూత్లెవెల్ ఏజెంట్లున్నారన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి 219 మంది, కాంగ్రెస్ నుంచి 132 మంది ఉన్నారని, ఇతర పార్టీలవి పెండింగ్లో ఉన్నాయన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి 407 మంది బీఎల్ఓలు, 38 మంది సూపర్వైజర్లను నియమించినట్లుపేర్కొన్నారు.21,003 ఎపిక్ కార్డులు జనరేట్ కాగా, 8,491 కార్డుల ముద్రణ పూర్తయిందని, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయన్నారు. 8,491 కార్డుల్ని పోస్టు ద్వారా పంపిణీ చేసినట్లు కర్ణన్ తెలిపారు. -
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై నకిలీ దందా!
సాక్షి, సిటీబ్యూరో: వాహనాల హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లపై నకిలీ వెబ్సైట్లు దందా కొనసాగిస్తున్నాయి. కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు పాతవాహనాలకు సైతం హెచ్ఎస్ఆర్పీని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చర్ (ఎస్ఐఏఎం–సయామ్) అనే సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్ల ఏర్పాటు పైన 15 రాష్ట్రాల్లో ఈ సయామ్ సంస్థ సేవలందజేస్తోంది. వాహనదారులు సయామ్ వెబ్సైట్లో హెచ్ఎస్ఆర్పీ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం నిర్ణీత గడువు మేరకు కొత్త నెంబర్ప్లేట్లను అందజేస్తారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రం షోరూమ్లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఏపీ తదితర రాష్ట్రాల్లో సయామ్ ద్వారా పెండింగ్ వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అందజేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం హెచ్ఎస్ఆర్పీపైన ఇప్పటి వరకు ఎలాంటి తుదిగడువును విధించలేదు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ‘సయామ్’ పేరిట నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఇటీవల వాహనదారులకు పెద్ద ఎత్తున నోటీసులు అందజేశారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపైన భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ‘ఆర్టీఏ చలాన్ల’ పేరిట వాహనదారులకు నోటీసులు ఇచ్చి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో రవాణాశాఖ అప్రమత్తమైంది.హెచ్ఎస్ఆర్పీ కోసం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదని పేర్కొంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఈ గందరగోళంకొనసాగుతూనే ఉంది. ‘సయామ్’ వెబ్సైట్ను పోలిన విధంగా ఒకటి, రెండు అక్షరాలను మార్చి మాయాజాలం సృష్టిస్తున్నారని, అలాంటి వెబ్సైట్ల నుంచి వచ్చే మెసేజ్లను చూసి మోసపోవద్దని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.గ్రేటర్లో 45 లక్షలకు పైగా పెండింగ్...వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు హెచ్ఎస్ఆర్పీని తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2013లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ఈ పథకం ఏళ్లకు ఏళ్లుగా నత్తనడకన సాగుతుంది. తెలంగాణలో సుమారు 65 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. వాటిలో 45 లక్షల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. 2019 వరకు నమోదైన అన్ని వాహనాలకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హెచ్ఎస్ఆర్పీని అమర్చాలని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కానీ నగరంలో మాత్రం ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, దీంతో తాము ఇప్పటి వరకు ఎలాంటి తుది గడువును విధించలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మొదట్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలంటూ వెలువడిన ఒక ఉత్తర్వు వాహనదారులను గందరగోళానికి గురిచేసింది. దీంతో చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ‘సయామ్’ ద్వారా ఈ పథకం అమలు జరుగుతున్న క్రమాన్ని అవకాశంగా తీసుకొని నకిలీవెబ్సైట్లు రంగంలోకి దిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటికీ తప్పనిసరి కాదు...‘హెచ్ఎస్ఆర్పీపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి గడువు విధించలేదు. భవిష్యత్తులో గడువు విధించే వరకు హెచ్ఎస్ఆర్పీ కోసం ఎలాంటి వెబ్సైట్లను ఆశ్రయించవలసిన అవసరం లేదు. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే స్పష్టమైన విధివిధానాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు’. అని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.నాణ్యతపై సందేహాలు....హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లలో నాణ్యత లేకపోవడం వల్ల కూడా వాహనదారులు విముఖత చూపుతున్నారు.తెలుపురంగు ప్లేట్లపై నెంబర్లను ఎంబోజింగ్ చేసి నలుపురంగు పెయింట్ వేస్తారు.కానీ ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు.ప్లేట్లు కూడా నాసిరకంగా ఉండి తొందరగా దెబ్బతింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం.రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్లు అమర్చుకునేందుకు అయిష్టత చూపుతున్నారు.కానీ 2019 నాటికి నమోదైన అన్ని వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా కదలిక వచ్చింది. -
మద్యం మత్తులో భార్యను కొట్టిన భర్త
గౌలిపురా: మద్యం మత్తులో భర్త కొట్టడంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. భవానీనగర్ తలాబ్కట్టా సిద్దిఖీనగర్ సమద్ హోటల్ ప్రాంతానికి చెందిన సయీద్ ఉన్నీసా (28), మహ్మద్ ఫెరోజ్ ఖాన్లు దంపతులు. వీరికి నలుగురు పిల్లలు. కాగా ఫెరోజ్ ఖాన్ తరచూ మద్యం తాగి వస్తుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత నెల 30న ఫెరోజ్ ఖాన్ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో ఫరోజ్ ఖాన్ భార్య సయీద్ ఉన్నీసాను కొట్టాడు. ఈక్రమంలో మరుసటిరోజు (ఈ నెల 1న) సాయంత్రం సయీద్ ఉన్నీసా తన నలుగురు పిల్లలను తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఫెరోజ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చంచల్గూడ నివాసి మృతి
చాదర్ఘాట్: అమెరికాలోని చికాగో ఇవన్స్టంగ్ ప్రాంతంలో నివాసముంటున్న చంచల్గూడకు చెందిన సిరాజ్ మొతీబ్ మహ్మద్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. కుటుంబ సభ్యులు పది సంవత్సరాల క్రితం అక్కడే సెటిలయినట్లు స్థానికులు తెలిపారు. వరుస సంఘటనలతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.చెరువులో పడి మహిళ మృతిమోతీనగర్: మతిస్థిమితం లేని ఓ మహిళ సున్నం చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపిన మేరకు.. బోరబండ సైట్ 3లో మానిక్కర్ ఆండాళు (49) నివాసముంటోంది. ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు నవీన్కుమార్ బంధువులు, మిత్రులు, పరిసర ప్రాంతాల్లో విచారించినా జాడ తెలియరాలేదు. దీంతో 5న బోరబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సున్నం చెరువులో ఆమె మృత దేహం లభించింది.వేడుకల్లో విషాదం..చిన్నారి మృతిఅమీర్పేట: నూతన గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. సనత్నగర్ ఉదయ్నగర్ కాలనీలో శ్రీరాములు భార్య మానస, కుమార్తెలు మేఘన(8),ప్రణవితో కలిసి ఉంటున్నాడు. సుభాష్నగర్లో ఉండే సమీప బంధువు వెంకటస్వామి గృహ ప్రవేశానికి శ్రీరాములు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు టెర్రస్పై ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఇంటి డెకరేషన్ లైట్ల తీగలు తాకి మేఘన స్పృహ కోల్పోయింది. వెంటనే సనత్నగర్లోని ప్రైయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.డివైడర్ ఢీకొని వ్యక్తి మృతిమల్లాపూర్: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండంగా డివైడర్ను ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన మేరకు.. చెంగిచర్ల గణేష్నగర్ కాలనీకి చెందిన చేర్యాల హైమావతి చిన్న కుమారుడు దిలీప్కుమార్ (31) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుడి బర్త్డే వేడుకలకు వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా వస్తానని తల్లికి చెప్పాడు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 4.25 ఐఐసీటీ గేటు వద్ద యాక్టీవా పై(టీఎస్08జీఏ9032) వస్తుండగా ఫుట్పాత్ను ఢీ కొట్టాడు. దీంతో దిలీప్ కుమార్ తలకు తీవ్ర గాయ కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.నగరంలో ఫేక్ డాక్టరేట్ల కలకలం– నిందితుడి అరెస్ట్లక్డీకాపూల్ : నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతి వద్ద పెద్దిటి యోహాన్ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా గురుజాలకి చెందిన పెద్దిటి యోహాన్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరిట గత కొంత కాలంగా డాక్టరేట్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్ ద్వారా డాక్టరేట్లు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో పలువురికి ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేశారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని యోహాన్ను అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యోహాన్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. -
అడిగిన సమాచారం ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎక్సైజ్శాఖ హైదరాబాద్ డిఫ్యూటీ కమిషనర్ అనిల్కుమార్రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని చెప్పారు.అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎకై ్సజ్సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు.26న ప్రెస్క్లబ్ ఎన్నికలులక్డీకాపూల్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి చెప్పారు. 2025–27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా దొడ్డా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి సభ్యత్వ రెన్యువల్, అన్ని బకాయిలు చెల్లించిన రెగ్యులర్ సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు(జనరల్), ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శుల పదవులతో పాటు కోశాధికారి, పది మంది కార్యనిర్వాహక సభ్యులు (8 మంది సాధారణ సభ్యులు, రెండు మహిళా రిజర్వ్ స్థానాలు) ఎన్నికలు జరుగుతాయన్నారు.గాలిలో పల్టీలు కొట్టిన కారు● ఫ్లైఓవర్పై స్తంభాన్ని ఢీకొట్టి..మరోకారుపై పడి...● ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమంకేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూ–హైటెక్ సిటీ రోడ్డులో అతివేగంగా వెళ్తూ ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడమే కాకుండా గాలిలోకి పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ జోధ్పూర్ ప్రాంతానికి చెందిన వికాస్శర్మ, శాంతను స్నేహితులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్డులో నివాసం ఉండే శాంతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. వికాస్శర్మ ఇంటీరియర్ డిజైనర్. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి మియాపూర్ ప్రాంతంలో మద్యం తాగారు. సోమవారం తెల్లవారుజామున జేఎన్టీయూ వైపు నుంచి హైటెక్ సిటీ వైపు టాటా కర్వ్ కారులో ఇరువురూ వెళ్తున్నారు. ఆ సమయంలో వికాస్శర్మ డ్రైవింగ్ చేస్తున్నాడు. నెక్సెస్ మాల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న వీరు ఫ్లైఓవర్ దిగే క్రమంలో అతివేగంగా వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. వీరు ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరి హైటెక్ సిటీ వైపు నుంచి–జేఎన్టీయూ వైపు వెళ్తున్న టాటా సిట్రాన్ ఎలక్ట్రిక్ కారుపై పడింది. ఈ కారులో నానక్రాంగూడలోని ఐసీఐసీఐ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న ప్రియను దింపేందుకు సంస్థకు చెందిన కారును అఖిల్రెడ్డి నడుపుతుండగా సెక్యూరిటీగార్డ్గా వచ్చిన సాహిల్కుమార్ కూడా ఉన్నారు.ఈ ఘటనలో స్నేహితులు వికాస్శర్మ, శాంతన్తో మరో కారులోని అఖిల్రెడ్డితో పాటు అందులో ఉన్న ప్రియ, సాహిల్కుమార్లు తీవ్రంగా గాయపడ్డారు.కార్లను నడుపుతునన వికాస్శర్మ,అఖిల్రెడ్డిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదుగురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నేడు పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయంసాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరాచేసే సింగూరు జలాశయం సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతిని ఏర్పడిన భారీ లీకేజీ మరమ్మతులు పనులు నేపథ్యంలో మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి వర్గాలు తెల్పాయి. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్ పేట్, హకీంపేట్, తౌలిచౌకి, కాకతీయ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, కార్వాన్, ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. -
‘హైడ్రా’మా నేనా?
సాక్షి, సిటీబ్యూరో: సెప్టెంబర్ 21: గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల స్థలం ప్రభుత్వానిదని ప్రకటించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఆధీనంలో ఉన్న 11 ఎకరాల చుట్టూ ఉన్న షీట్లను తొలగించి ఫెన్సింగ్ వేసింది.సెప్టెంబర్ 23:ఆ స్థలం తనదేనని, పట్టా భూమి కొనుగోలు చేశానని ప్రకటించిన ఆరికపూడి గాంధీ హైడ్రా అక్కడ వేసిన ఫెన్సింగ్ తొలగించారు. దాని స్థానంలో గతంలో మాదిరిగానే బ్లూషీట్లు ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అక్టోబర్ 1:ఆరికపూడి గాంధీ చెరలో ఉన్న ప్రభుత్వం భూమినీ పరిరక్షించాలంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా సహా వివిధ విభాగాలకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ స్థలం తనదేనని, ఆరోపణలు చేస్తే కోర్టు కీడుస్తానంటూ గాంధీ ప్రకటించారు. హైడ్రా మాత్రం ఈ భూమి విషయంలో మిన్నకుండిపోయింది.పక్షం రోజులు సాగిన ఈ ఎపిసోడ్లో నష్టపోయింది మాత్రం 260 నిరుపేద కుటుంబాలే. గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న ప్రభుత్వ భూమిలోని వెంచర్లు, లే ఔట్లకు సంబంధించిన ఈ నిర్మాణాలను హైడ్రా గత నెల 21న తొలగించింది. ప్రగతినగర్ వైపు కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సర్వే నెంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నాటి సర్కారు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ ఆస్తుల పంపకాల్లో జాప్యం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయంపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆరు నెలల పాటు సాగిన విచారణలో భాగంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో ఐదారుసార్లు సమావేశమై అనేక విషయాలు గుర్తించింది.బాధ్యులపై చర్యలేవి?ఈ భూమిలో ప్రగతినగర్ వైపు బడాబాబులు వెంచర్లు, లే ఔట్లు వేశారని, సర్వే నంబర్లు 329/1, 342ల్లో ఉన్న భూమిని 60 గజాలు, 120 గజాల చొప్పున ప్లాట్లు వేసిన రౌడీషీటర్లు, స్థానిక నేతలు పేదలకు విక్రయించారు. జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీటర్గా ఉన్న షేక్ అబిద్... లక్ష్మి మురళి హుస్సేన్ పేరుతో ఈ విక్రయాలు జరిపారు. బోడాసు శ్రీనివాస్ (డాన్ శీను), ఏసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్, దేవా తదితరులూ భూమిని ఆక్రమించి, ప్లాట్లుగా అమ్మేశారు. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించారు. వీటిలో నిర్మించిన గదులను కొందరు అద్దెలకు కూడా ఇచ్చారు. ఇలా ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న 12 ఎకరాల వెంచర్తో పాటు 20 ఎకరాల లే ఔట్ను హైడ్రా తొలగించింది. నిర్మాణాలను కూల్చివేసిన అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు.హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్ఎల్ఆర్...హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమిలో 11 ఎకరాలు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ బంధువుల పేర్లపై ధరణిలో చేర్చింది ప్రభుత్వ భూమి అంటూ బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి (ఆర్ఎల్ఆర్) హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ పేరిట ఉన్న 11 ఎకరాలను ఎప్పుడో విక్రయించి వెళ్లిపోయిన జాహెద్ బేగం, షేక్ ఇమామ్, ఇశాన్ అమీన్ను తీసుకొచ్చి వారి పేరిట భూమిని కొన్నట్లు చూపించారని ఆరోపించారు. గత బుధవారం హైడ్రా కమిషనర్కు కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భూ ఆక్రమణకు పాల్పడిన ఆరికపూడి గాంధీపై ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు గత నెల 21న తమ భూమిలో చేపట్టిన కూల్చివేతలపై తాము హైకోర్టును ఆశ్రయించామని ఆరికపూడి గాంధీ అదే రోజు ప్రకటించారు. దీనిపై హైడ్రా ఆ భూమిలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు హైడ్రా వ్యూహం ఎలా ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
నగరం.. రోడ్లు ఛిద్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది. శంషాబాద్ నుంచి షాద్నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాకపోకలకు ఇబ్బందులుఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. -
గొడవ వద్దన్నందుకు దాడి..వ్యక్తి మృతి
ఘట్కేసర్: పిల్లలను గొడవపడొద్దు అన్నందుకు ఓ పిల్లాడి తండ్రి అతడిపై దాడిచేశాడు. ఈ సంఘటనలో బాధితుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని అవుషాపూర్లో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన మేరకు.. అవుషాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అమీర్ (34) రాళ్లు కొట్టుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉండగా సమీపంలో నివసించే షన్ను పిల్లలు అసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబు గొడవ పడ్డారు. శబ్దం విన్న సయ్యద్ అమీర్ బయటకు వచ్చిన గొడవ పడొద్దని అబుకు సూచించాడు.గొడవ వద్దన్నందుకు...గొడవ పడొద్దన్నాడనే విషయాన్ని అబు తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పడంతో అతడొచ్చి సయ్యద్ అమీర్పై దాడికి దిగాడు. చుట్టు పక్కల వారు ఇరువురిని శాంత పరిచి ఇంటికి పంపించి వేశారు. అనంతరం అర్థగంట తర్వాత ఛాతి నొప్పితో పాటు వాంతులు కావడంతో కుటుంబీకులకు సయ్యద్ అమీర్ తెలిపాడు. అతడి శరీరానికి చెమటలు పట్టడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.జాతీయ రహదారిపై నిరసన...అకారణంగా దాడి చేసి ప్రాణం తీసిన సయ్యద్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బాఽధితులు పోస్ట్మార్టం అనంతరం జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు. కాగ ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పంధం జరిగినట్లు సమాచారం. -
ఎల్ లిల్లీ @ రూ 9వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ (తయారీ కర్మాగారం)ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం సుమారు రూ.9 వేల కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎల్ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తమ విస్తరణ ప్రణాళికలు, రాష్ట్రంలో భారీ పెట్టుబడులపై ఎల్ లిల్లీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. క్వాలిటీ హబ్ ఏర్పాటు హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమని ఎల్ లిల్లీ కంపెనీ ప్రకటించింది. ‘సంస్థ హైదరాబాద్ నుంచి దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్కు సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందిస్తుంది. కొత్త హబ్ ఏర్పాటుతో తెలంగాణతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. త్వరలో కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపడతాం..’ అని తెలిపింది. ‘అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెడుతుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. భారత్లో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి..’ అని సంస్థ ప్రతినిధులు వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్: సీఎం రేవంత్ ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్లో ఆగస్టు 4న ఎల్ లిల్లీ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం తెలంగాణకు గర్వ కారణం. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్గా పేరొందింది. ఎల్ లిల్లీ పెట్టుబడితో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. 1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారింది. ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు ఇక్కడే తయారయ్యాయి..’ అని సీఎం చెప్పారు. హైదరాబాద్లో ఎల్ లిల్లీ పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరా రూ.177 కోట్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డులు బద్దలయ్యాయి. భూముల వేలంలో సరికొత్త రికార్డు ధర లభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా రూ.177 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ సంస్థ వేలం పాట పాడింది.TGIIC నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ను MSN రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, MSN రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. -
LBnagar Metro: ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ ఫుల్.. కిలోమీటర్ క్యూ
సాక్షి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్(LbNagar Metro) వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు. అనంతరం, ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందడి నెలకొంది.అయితే, ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్రో రైలు సిబ్బంది.. ప్రయాణికులను క్యూ పద్దతిలో పంపిస్తున్నారు . ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి ఉంది. క్యూలైన్ల నుంచి ప్లాట్ఫామ్కు చేరుకోడానికి దాదాపు రెండు గంటలు పడుతోంది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Shameless @HyderabadMetroR #LT @hydcitypolice@HYDTP@CPHydCity@ZC_LBNagar@lbnagarps@TheSiasatDaily@TimesNowNo proper security management to maintain the crowd. #Stampede at #LBNagar #MetroStationl pic.twitter.com/cr9OJNk53N— Citizen's Right (@citizensri8) October 6, 2025మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది.Huge traffic today too!People are returning to the city after the Bathukamma and Dussehra festivals, leading to huge traffic jams at Choutuppal on the National Highway. Large number of passengers are lined up at LB Nagar station as they travel back into the city. pic.twitter.com/DaBC4pjoo0— Revanth Chithaluri (@RevanthCh_) October 6, 2025ఇక, పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.Roads jammed, metro crammed#MondayMood #hyderabadmetro #traffic pic.twitter.com/83cxsfdy2Z— Kruthivarsh Koduru (@Kruthiivarsh) October 6, 2025 -
ఇన్స్టాలో పరిచయం.. ఫామ్హౌస్లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ ఫాంహౌస్లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. అందరూ మైనర్లే.. ఇన్స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ ఉన్నట్టు సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఒక డీజే ఇన్స్టా యాప్లో మొయినాబాద్లోని చెర్రీ ఫామ్హౌస్లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు పాస్లు తీసుకోవాలని షరతు విధించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800 ధర నిర్ణయించాడు. ఇన్స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది శనివారం మొయినాబాద్లోని ఓక్స్ ఫామ్హౌస్కు చేరారు. మత్తులో జోగుతున్న సమయంలో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన డ్రగ్ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మొయినాబాద్ ఠాణాలో అప్పగించారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. -
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
హైదరాబాద్: తన అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ తనపై కూడా దాడి చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్
రంగారెడ్డి జిల్లా: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మైలార్దేవ్పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ఇంజమూరి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదివారం ఉదయం ఇతను పోలీస్ స్టేషన్కు వచ్చి ఇంటి పక్కనే ఉన్న మల్లారెడ్డి, శిరీష అనే ఇద్దరు తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా...తన ఇంటి పక్కనే ఉన్న వారికి వేణు గతంలో డబ్బులు ఇచ్చాడని, ఆ డబ్బులు ఇవ్వమని మద్యం మత్తులో వెళ్లి అడుగగా వారు అతన్ని బెదిరించి పంపించారని తేలింది. ఈ క్రమంలోనే వేణు తను అప్పుగా ఇచి్చన రూ.1500 ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో పోలీసులను కూడా ఇబ్బంది పెట్టడంతో వారు నచ్చజెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలోనే వేణు బయటకు వెళ్లి తనకు న్యాయం జరగడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న 33 కేవీ హైటెన్షన్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంటు సరఫరా నిలిపివేయించారు. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ మక్సూద్, ఎస్ఐలు పైడినాయుడు, విశ్వనాథ్రెడ్డి, డీఆర్ఎఫ్ బృందాలు కలిసి పైకి ఎక్కిన వేణును బుజ్జగించి కిందకి దింపారు. అతన్ని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనతో దుర్గానగర్ నుంచి చంద్రాయణ గుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. జవహర్నగర్లో... జవహర్నగర్ వికలాంగుల కాలనీలోనూ ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు తెలి్పన మేరకు వెంకటే‹Ù, లక్ష్మి దంపతులు కాగా ముగ్గురు పిల్లలతో కలిసి వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. వెంకటేష్ మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను వేధింపులకు గురిచేసేవాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ పెద్దగా అవడంతో భార్య లక్ష్మి చేతులను విరగొట్టాడు. దీంతో లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనని కొడతారనే భయంతో విద్యుత్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వెంకటేష్ని కిందికి దించారు. అయితే వెంకటేష్ గతంలో కొన్నిసార్లు చనిపోతానంటూ ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యూనిఫాం తీసేసి పబ్స్లో ఎంజాయ్..!
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచి్చందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ అధికారులకు అవసరమైన ప్రొటోకాల్ సేవలు చేయడంతో పాటు బిల్లులు విషయంలోనూ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కింది స్థాయి పోలీసు వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకప్పుడు ఆదాయ మార్గాలుగా.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పని చేసే కొందరు అధికారులకు అనేక ‘ఆదాయ మార్గాలు’ ఉంటాయి. అలాంటి వాటిలో భూ వివాదాలతో పాటు వైన్షాపులు, బార్లు, పబ్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా ఉన్న పోలీసుస్టేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ పొందడానికి ఏ స్థాయి పైరవీ చేయడానికైనా సిద్ధమవుతుంటారు. ఇటీవల కాలంలో పబ్స్ ఉన్న పోలీసుస్టేషన్ల ఎస్హెచ్ఓల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్లోని కొన్ని ఠాణాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వీరికి నిద్రపట్టట్లేదు. అధికారుల తాకిడే ప్రధాన కారణం.. ఒకప్పుడు ఎస్హెచ్ఓలకు తన బ్యాచ్మేట్స్, స్నేహితులు, పరిచయస్తుల నుంచే పబ్లకు సంబంధించిన సిఫార్సులు వచ్చేవి. తామో, తమ సంబం«దీకులో ఫలానా పబ్కు వెళ్తున్నారని, బిల్లులో ఎంతో కొంత తగ్గించేలా చూడాలని కోరేవారు. అలా వచ్చే వాళ్లు కూడా కొన్ని పబ్స్కే వెళ్లడానికి ఆసక్తి చూపించడం ఎస్హెచ్ఓలకు తలనొప్పిగా మారేది. కొన్నాళ్లుగా కొన్ని పబ్స్కు పోలీసు విభాగానికే చెందిన అత్యున్నత అధికారుల తాకిడి పెరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలా వీళ్లు తమ స్నేహితులు, సన్నిహితులతో వాలిపోతున్నారు. పబ్స్లో ప్రత్యేక కార్యక్రమాలు, కొందరి ఆర్కెస్ట్రాలు ఉన్నప్పుడు ఎంట్రీకి భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయాల్లోనూ తాము వస్తున్నామని, తొలి వరుసలో, ప్రత్యేకంగా సీట్లు కావాలంటూ ఆయా అధికారులు హుకుం జారీ చేస్తుండటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. తగ్గింపు కాదు పూర్తిగా ‘భరింపు’... పబ్స్కు వస్తున్న పోలీసు ఉన్నతా«ధికారులకు ప్రొటోకాల్ సంబంధిత మర్యాదలూ స్థానిక పోలీసులకు తప్పట్లేదు. సాధారణంగా ఆయా అధికారులు ఆలస్యంగా వస్తుంటారు. దీంతో వారిని రిసీవ్ చేసుకోవడానికి, సపర్యలు చేయడానికి కనీసం ఓ హోంగార్డుని కేటాయించాల్సి వస్తోంది. ఇంత వరకు సర్దుకుపోతున్నా.. బిల్లుల వద్దకు వచ్చేసరికి కొందరు అధికారుల తీరు ఎస్హెచ్ఓలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆయా అధికారులకు ఆ పబ్లో లభించే అతి ఖరీదైనవే సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లుల్లో రాయితీ కోరితే కొంత వరకు ఇబ్బంది ఉండదు. అయితే కొందరు అధికారులు అసలు బిల్లులే చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో పబ్స్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఎస్హెచ్ఓలే వాటిని చెల్లించాల్సి వస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తమ ‘కష్టార్జితం’ ఇలాంటి చెల్లింపుల కోసం వెచి్చంచాల్సి వస్తోంది. సమయం మీరినా కొనసాగింపు... ఇలాంటి అత్యున్నత అధికారులు పబ్స్కు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు, బిల్లుల చెల్లింపులతో పాటు సమయం అనేదీ ఎస్హెచ్ఓలకు ఇబ్బందికరంగా ఉంటోంది. తమ దైనందిన విధులు, ఇతర కార్యకలాపాలు ముగించుకునే ఆయా అధికారులు చాలా ఆలస్యంగా పబ్స్కు వస్తున్నారు. వాటి సమయం ముగిసినప్పటికీ తమ పారీ్టలు పూర్తికాలేదంటూ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్హెచ్ఓల ద్వారా పబ్ నిర్వాహకులు, యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రధాన ద్వారాలు మూసేసి, ఇతరుల్ని పంపించేసి కొన్ని పబ్స్ నడిపించాల్సి వస్తోంది. సాధారణ సమయంలో సమయం మీరినా, పరిమితికి మించి మ్యూజిక్ పెట్టినా కేసులు నమోదు చేస్తుంటామని, అలాంటిది ఇలాంటి ఉన్నతాధికారుల కోసం తాము ఉల్లంఘనలు చేయిస్తే మరోసారి కేసులు ఎలా నమోదు చేస్తామంటూ ఎస్హెచ్ఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది కింది స్థాయి అధికారుల్లో హాట్టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులపై చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు చార్జీల వల్ల ప్రయాణికులపై ప్రతి నెలా దాదాపు రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు సుమారు రూ.2.5 కోట్లు టికెట్లపై నగదు రూపంలో లభిస్తుండగా, మరో రూ.4 కోట్ల వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అందజేసే ఉచిత ప్రయాణ సదుపాయం నుంచి రీయింబర్స్మెంట్ ఆర్టీసీ ఖాతాలో జమ అవుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రతిరోజూ రూ.6.5 కోట్లు లభిస్తున్నాయి. పెంచిన చార్జీలు రోజుకు రూ.50 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో నిత్యం సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 16 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు. 9 లక్షల మంది పురుషులు ప్రయాణిస్తున్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు.. నగరంలోని 25 డిపోల నుంచి 3,100 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా గ్రేటర్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హైటెన్షన్ కనెక్షన్ల కోసం రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. రానున్న రోజుల్లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం టికెట్ చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ ఖర్చులే అధికం.. గ్రేటర్ ఆర్టీసీకి రోజుకు రూ.6.5 కోట్లు లభిస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం గ్రేటర్లోని 25 డిపోల్లో సుమారు 1,5000 మంది పని చేస్తున్నారు. వీరిలో 7,000 మంది కండక్టర్లు. 5,700 మంది డ్రైవర్లు. మిగతా వారిలో మెకానిక్లు, శ్రామిక్లు మొదలుకొని డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లభించే ఆదాయంలో సుమారు 50 శాతం సిబ్బంది జీతభత్యాలకే ఖర్చవుతోంది. మరో 25 శాతం ఇంధనం కోసం విని యోగిస్తుండగా, వివిధ అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి లాభనష్టాల్లేకుండా బస్సులను నడపడమే ఆర్టీసీకి సవాల్గా మారింది. ఈ క్రమంలో తాజాగా పెంచిన చార్జీలతో ప్రయాణికులకు భారమే అయినా ఆరీ్టసీకి మాత్రం కొంత ఊరటగా చెప్పవచ్చు. చార్జీల పెంపు మచ్చుకు ఇలా.. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈ–ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున పెంపు. 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీ. మెట్రో డీలక్స్, ఈ– మెట్రో ఏసీ సరీ్వసుల్లో మొదటి స్టేజీకి రూ.5 చొప్పున పెంచారు. రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున పెంపు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.20 చెల్లించి ప్రయాణం చేసేవారు ఇక నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇప్పటి వరకు రూ.30 ఉండగా, సోమవారం నుంచి రూ.40 చొప్పున చార్జీ ఉంటుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరగనుంది. మియాపూర్ –అమీర్పేట్ల మధ్య రూ.60 నుంచి రూ.70కి పెరగనుంది. -
మూసీలోకి భారీ వరద
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ : మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల 10 గేట్లు 3 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నీరు చేరడంతో ఆదివారం ఎగువ నుంచి వచి్చన వరదను దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల నుంచి మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. లంగర్హౌస్లో మూసీ నదిలో కలవటంతో అక్కడి నుంచి మరింత ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. గండిపేట నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నార్సింగి మున్సిపాలిటీ కేంద్రం నుంచి మంచిరేవులకు, ఔటర్ ఓ వైపు సరీ్వసు రోడ్ల మీదుగా నీరు పారటంతో రాకపోకలను నిలిపివేశారు. పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవటం, మూయటం చేస్తామని మూసీ నదీ పరీవాహకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. జలాశయాల నీటి విడుదలతో స్థానికులు కొందరు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
నాలుగు పేర్లతో ఏఐసీసీకి జూబ్లీహిల్స్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ షార్ట్లిస్ట్ను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆదివారం ప్రజా భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో నలుగురి పేర్లతో కూడిన జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. పోటీ రేసులో దానం నాగేందర్, గడ్డం రంజిత్రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి యాదవ్, సీఎన్రెడ్డి, మురళీగౌడ్ల పేర్లు వినిపించాయి. వాటి నుంచి మూడు పేర్లతోపాటు మరో కొత్తపేరును జోడించి నలుగురి పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం.అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మనస్సు మార్చుకుని తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను రాజీనామా చేయట్లేదు ఆయన ప్రకటించారు.గెలిచి తీరాలన్న పట్టుదలతో..బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయిన జూబ్లీహిల్స్ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. త్వరలో వెలువడే బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే మంత్రులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఆదివారం జరిగిన కీలక సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హాజరై 22 మంది పరిశీలకులకు మార్గదర్శనం చేశారు.టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేయాలని స్పష్టంచేశారు.పోలింగ్ బూత్ స్థాయి ఇన్చార్జీలకు కూడా మీనాక్షి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు కూడా పాల్గొన్నారు. పోలింగ్ బూత్లవారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సర్వేలు సానుకూలంగా ఉన్నాయని, అభ్యర్థి ఎంపిక తర్వాత ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మీనాక్షి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీని గెలిపించాలని కోరారు. -
దక్షిణాదిపై బీజేపీ వివక్ష: హరీశ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, మనం పండించే వడ్ల కన్నా, ఉత్తర భారతంలో పండించే గోధు మలకు ధర ఎక్కువ ఉండడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి టి హరీశ్రావు అన్నారు. కామారెడ్డి జిల్లా లోని నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. నాగిరెడ్డిపేట మండలం బంజర శివారులో మంజీర ప్రవాహంతో మునిగిన పంటలను పరిశీలించారు.అనంతరం గాంధారి మండల కేంద్రంలో బీఆర్ఎస్లో బీజేపీ నేతల చేరిక కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లా డారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, అప్పుడు వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.1,400, గోధుమలు క్వింటాల్కు మద్దతు ధర రూ.1,400 ఉండేవని, ఇప్పుడు వడ్ల ధర రూ.2,369 ఉంటే, గోధుమల ధర రూ.2,585 కు చేరిందన్నారు. ఉత్తర భారతంలో గోధుమలు పండించడం వల్లే ధర ఎక్కువగా ఇస్తూ, దక్షిణాన ముఖ్యంగా తెలంగాణలో పండించే వడ్లకు తక్కువ ధర ఉండడం కేంద్రం వివక్ష కాదా అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం ఏదీ..ఇటీవల కామారెడ్డి జిల్లాలో వరదలు సంభవిస్తే, స్వయంగా వచ్చి చూసిన సీఎం పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తానని చెప్పి నెల రోజులు గడిచినా రివ్యూ లేదని, మొహం చాటేశాడన్నారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ రావాలని ఊరూరా కోరుకుంటున్నారని చెప్పారు. -
నగర ప్రజలపై కక్షతోనే బస్సు చార్జీల భారీ పెంపు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీల పెంపు నిర్ణయం హైదరాబాద్ ప్రజలపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆరోపించారు. గత ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారన్న కసితోనే ఈ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకే జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీలను ఏకంగా రూ.10 పెంచాలని రేవంత్రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రజలపై ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని, ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందన్నారు. సిటీలో బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తూ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సు చార్జీల పెంపు రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని దివాలా తీయించిన కాంగ్రెస్, ఇప్పుడు సామాన్యుల నడ్డి విరవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. -
బీసీ రిజర్వేషన్ల సాధన ప్రజాప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ /లక్డీకాపూల్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. దాన్ని రాష్ట్రపతికి పంపించామని, ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర గవర్నర్కు పంపించామని, అయితే వాటికి ఆమోదం రాకపోవడం బాధాకరమని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కానప్పటికీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.ఆదివారం లక్డీకాపూల్లోని ఓ హోటల్లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్లు సాధించాలన్న కసి మనందరికీ ఉంది. ఇప్పుడు సాధించకుంటే భవిష్యత్లో సాధించడం అసాధ్యమనిపిస్తోంది. రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు కలిసి ఉద్యమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. గతంలో తమిళనాడులో జయలలిత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఆమోదం తెలిపింది.ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టి 6 నెలలు కావొస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీలకు న్యాయం జరగాలని బండి సంజయ్ ఇంటికి వెళ్లి మరీ కలిసి పోరాటం చేద్దామన్నాను. కాంగ్రెస్ పార్టీకే క్రెడిట్ వస్తుందని మద్దతు తెలపడం లేదు’అని చెప్పారు. ⇒ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ రాజ్యాంగ సవరణతోనే సాధ్యమవుతుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుంది. ఈ విషయం తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది’అని చెప్పారు. ⇒ ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ‘వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలంటే తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ అడ్వొకేట్లను నియమిస్తే కేసు తప్పకుండా గెలిచే అవకాశం ఉంది’ అన్నారు. ⇒ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉద్యోగ, వైద్య రంగంలో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి’అన్నారు.ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో 'సీట్ బెల్ట్'..
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్తోపాటు పక్కన ఉండే సింగిల్ సీటుకు కూడా సీటు బెల్టును ఉన్నతాధికారులు తప్పనిసరి చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిపో మేనేజర్లు యుద్ధప్రాతిపదికన అన్ని బస్సుల్లో డ్రైవర్ సీటుకు, ముందుండే ప్రయాణికుల సీటుకు బెల్టులు బిగిస్తున్నారు. కార్లకే అమలవుతున్న నిబంధన.. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలా ప్రమాదాల్లో సీటు బెల్టు ధరించని వారు మృతిచెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే కార్లు సహా ఇతర వాహనదారులు సీటు బెల్టు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే కారు డ్రైవర్ సీటు బెల్టు ధరించకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు.. ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు డ్రైవర్లు వేగంగా ముందుకు ఎగిరిపడి గాయపడటమో లేదా మరణిస్తుండటమో జరుగుతోంది. ఆర్టీఐ దరఖాస్తుతో స్పందన.. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్టీసీ నుంచి సీటు బెల్టులకు సంబంధించిన వివరా లు కోరారు. బస్సుల్లో సీట్లకు బెల్టులున్నాయా? వాటిని డ్రైవర్లు ధరిస్తున్నారా? ఒకవేళ ధరించకుంటే ఎన్ని కేసులు నమోదయ్యాయి? జరిమానాలు చెల్లించారా? లాంటి వివరాలు కోరారు. ప్రస్తుతం కొత్త ఆర్టీసీ బస్సులకు బెల్టులుంటున్నా వాటిని డ్రైవర్లు వినియోగించనందున క్రమంగా అవి ఊడిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయట్లేదు. ఆర్టీఐ కింద వచ్చిన అర్జీకి అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున నిబంధనలను పాటించట్లేదని ఆర్టీసీ అధికారికంగా ఒప్పుకున్నట్టవుతుంది. అందుకే వెంటనే అన్ని బస్సుల్లో సీటు బెల్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు డిపో మనేజర్లను ఆదేశించగా డిపో మేనేజర్లు ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్లు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలని ‘గేట్ మీటింగ్’సమయంలో డిపో మనేజర్లు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ముందు సీట్లో కూర్చొనే వారు కూడా ధరించేలా చూడాలని సూచిస్తున్నారు. కాగా, కొత్త బస్సుల్లో చిట్టచివరి సీట్ల వరుసలోని మధ్య భాగం సీట్ల (దారి ఎదురుగా ఉండే సీట్లు)కు కూడా బెల్టులు ఉన్నా ఆ విషయం ప్రయాణికులకు తెలియట్లేదు. -
బిగ్ఫిక్స్ రాకుంటే 'బైబై'
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోడింగ్తో కొలువులు నెట్టుకొస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టెక్నాలజీ రంగంలో తెరపైకి వచ్చిన ‘బిగ్ఫిక్స్’ సవాల్ విసురుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్ కోడింగ్కు అనుగుణంగా నైపుణ్యాలకు పదునుపెట్టుకోని వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. ఇప్పటికే కొన్ని బహుళజాతి కంపెనీలు ‘అప్డేట్’ కాని ఉద్యోగులకు లేఆఫ్లు (ఉద్యోగాల నుంచి తొలగించడం) ప్రకటించగా మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు (నాస్కామ్) ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి ఏఐపై చేపట్టిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల్లో 68 శాతం మంది ఎమర్జింగ్ కోర్సులు చేస్తుండగా వారిలో 5 లక్షల మందే ఉద్యోగాలు పొందుతున్నారు. అలా కొలువులు సాధించిన వారిలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్నది 3 లక్షల మందే. వాళ్లలోనూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోనందుకు దాదాపు 1.20 లక్షల మంది ఏడాది తిరగకుండానే లేఆఫ్ లేఖలు అందుకుంటున్నారు. మిగతా వాళ్లలో 20 శాతం మందే సుమారు రూ. 40 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఏమిటీ ‘బిగ్ఫిక్స్’? విలువైన డేటాతో నిక్షిప్తమయ్యే లేదా బిడ్ డేటా సెంటర్లకు అనుసంధానమయ్యే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాలను ఆటోమేటిక్గా మేనేజ్ చేయడాన్నే బిగ్ఫిక్స్ అంటారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలు సెక్యూరిటీ కోసం సరికొత్త కోడింగ్, మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. సాధారణ కోడింగ్ నుంచి ఏఐ టూల్ కోడింగ్కు అప్డేట్ అయితే తప్ప బిగ్ఫిక్స్ తేలికగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ రూట్లో వెళ్లలేని సీనియర్ టెకీలు ఇప్పుడు లేఆఫ్లకు గురవుతున్నారు. బిగ్ డేటా కేంద్రాలపై ఆధారపడే బహుళజాతి సంస్థలు సరైన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఇందుకు సమస్యగా మారుతోంది. సమీకృత ఏఐ ఆటోమేషన్లో సర్వర్ల స్థితి, సెక్యూరిటీ లాగ్స్, రిసోర్స్ యూజ్లను ట్రాక్ చేయడానికి మారుతున్న కోడింగ్ కీలకంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ కోడ్ జనరేషన్పై ఎప్పటికప్పుడు ఆప్డేట్ అయితే తప్ప ఉద్యోగంలో అభివృద్ధి కనిపించదని అంటున్నారు. కోడింగ్ కొత్తగా.. ఏఐ రంగంలో ఎప్పటికప్పుడు గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలోలాగా ఒకే మోడల్ కాకుండా మల్టీ ఏజెంట్స్ కొలాబరేషన్తో ఏఐ పనిచేస్తోంది. మారుతున్న ఈ మోడల్స్ను ఏఐ ఏజెంట్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఉదాహరణకు మెటా కోడ్ ఏజెంట్పై 2024 నుంచి అనేక పరిశోధనలు చేశారు. ఇప్పుడిది ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లో కోడ్ రాసే స్థాయికి ఎదిగింది. ఈ కోడ్ను ప్రాక్టికల్గా పరీక్షించడం, తప్పులు సరిచేయడం చేస్తుంది. ‘ఆటోడెవ్’ ఫ్రేమ్వర్క్ కొన్ని మోడల్స్తో కలిసి కొత్త సాఫ్ట్వర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూరోపియన్ ఏఐ అలయన్స్ కొత్తగా ఎథికల్ ఏఐ కోడ్ జనరేషన్, ట్రాన్స్ఫరెన్స్ ఏఐ రైటింగ్ కోడ్, ఏఐ జనరేటెడ్ అకౌంటబులిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చాయి. దీంతో వాటి మూలాలు, పనిచేసే విధానం, వాటికి మెరుగైన ప్రోగ్రామింగ్ ఇవ్వడంలో మెళకువలు ఉన్న ఏఐ నిపుణులు మాత్రమే ఈ వేగాన్ని అందుకొనే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ కోర్సుల్లో కొత్తదనం ఏదీ? కొన్ని కాలేజీలు ఇంకా దశాబ్దకాలం నాటికి సీ, సీ ప్లస్ కోడింగ్తోనే ఎమర్జింగ్ కోర్సులు మొదలు పెడతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు కొన్ని ఆధునిక కోడ్ను అనుసరిస్తున్నాయి. ఏఐ మోడల్స్ స్వయంగా అల్గోరిథంను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా వస్తోంది. 600కుపైగా ప్రోగ్రాములతో రూపొందించిన కోడ్ టీ5 ప్లస్, స్టార్ కోడ్ 2 వంటి జనరేటివ్ మోడల్స్ ఇప్పటికీ ఐఐటీలకే పరిమితం అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ తరహా మోడల్స్ ఉండటంలేదు. దీంతో ఏఐఎంఎల్, డేటా సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం టెక్నాలజీ రౌండ్, కోడింగ్ రౌండ్లలో ప్రతిభ చూపలేకపోతున్నారు. ఫలితంగా ఫ్రెషర్స్ ఏఐ కోర్సుల ద్వారా ఆశించిన ఉద్యోగాలు పొందలేని స్థితి నెలకొంది. మారాల్సిందే ఎమర్జింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం మారుతున్న ఏఐ కోడ్కు అప్డేట్ కావాలి. లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం. కొన్ని బహుళజాతి కంపెనీలు ఈ దిశగా శిక్షణ ఇస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు నైపుణ్యం సాధించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి, జేఎన్టీయూహెచ్ లేఆఫ్లు తప్పట్లేదు టెక్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు కూడా పరిమిత కాలంలో ఏఐ కోడింగ్ను నేర్చుకోవడం, కొత్త కోడింగ్లో నైపుణ్యం పొందడంలో విఫలమవుతున్నారు. వారికి ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు కష్టంగా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్తో అనుసంధానమయ్యే కంపెనీ సమాచారాన్ని కాపాడే సామర్థ్యం వారికి ఉండటం లేదు. అందుకే లేఆఫ్లు ఇవ్వడం అనివార్యమవుతోంది. – పరిమళ సిద్ధార్థ్, ఓ ఏఐ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ -
కోటా.. ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేయడం, అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన దరిమిలా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ జీవో కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. కాగా వాటిపై విచారణ జరగనుండటంతో కోర్టులు ఏం చెబుతాయోనన్న చర్చ పార్టీల్లో జరుగుతోంది. ముఖ్యంగా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు పరిమితి విధించగా..ఇప్పుడదే సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం బీసీ రిజర్వేషన్ల సంబంధిత పిటిషన్ విచారణకు రానుండడంతో.. న్యాయస్థానం ఏం తీర్పునిస్తుంది? ఆ తీర్పు భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ హైకోర్టులో కూడా కేసు ఉన్నందున తొలుత అక్కడ విచారణ కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు చెపితే ఈ నెల 8వ తేదీన విచారణ సందర్భంగా హైకోర్టులో ఏం జరుగుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన ఓకే అవుతుందా? అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా..? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అటు ప్రభుత్వం.. ఇటు కాంగ్రెస్ బిజీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ.. సుప్రీం విచారణ నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నివాసంలో కీలక భేటీ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్లు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించిన కార్యాచరణపై సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేలా చూడాలని ఆయన సూచించినట్లు తెలిసింది. రిజర్వేషన్ల పరిమితి విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించిందనే విషయంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్కు పంపిన ఆర్డినెన్సు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ ఆలోచనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చాయని, ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉందనే విషయాన్ని స్పష్టంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సంఘ్వీ, సిద్దార్ధ దవేలతో కూడా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించడాన్ని, ఇతర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ కార్యాచరణ ఈ సమావేశం అనంతరం ప్రజాభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేశ్గౌడ్తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. పార్టీ పరంగా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు కూడా గట్టిగా వినిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో సమన్వయం చేసుకునే బాధ్యతలను డిప్యూటీ సీఎంకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు ఆదివారం రాత్రికే హస్తినకు చేరుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వెంటనే ఢిల్లీకి చేరుకున్న బీసీ సంక్షేమ శాఖకు చెందిన అధికారుల బృందంతో కలిసి న్యాయవాదులతో కూలకషంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాల్ చేస్తూ వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అఖిల పక్షం భేటీ బీసీల రిజర్వేషన్లపై హైదరాబాద్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల రిజర్వేషన్లకు మరోమారు మద్దతు ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో ఇంప్లీడ్ కావాలని ఇప్పటికే నిర్ణయించిన బీసీ సంఘాలు.. సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కూడా హాజరు కానున్నాయి. మరోవైపు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రంలో అగ్గిరాజేస్తామని ఆ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమకు అందివచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించేది లేదని, ఈ నెల 7వ తేదీన పూలే విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పును బట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు బీసీ సంఘాల జేఏసీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సమావేశం కావాలని నిర్ణయించింది. అందరి దృష్టీ దీనిపైనే.. కోర్టులు ఇచ్చే తీర్పులకు అనుగుణంగా రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే కార్యాచరణ రూపొందించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్లను సాధించలేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఇంకోవైపు కోర్టుల తీర్పుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడం గమనార్హం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సోమవారం సుప్రీంకోర్టు విచారణ అనంతరం స్పష్టత వస్తుందా? ఈ నెల 8న హైకోర్టు విచారణ వరకు వేచి ఉండాల్సి వస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలి: మంత్రి పొన్నం ఢిల్లీ వెళ్లడానికి ముందు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు కేసులో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలని, అసెంబ్లీలో చెప్పిన అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించిందన్న విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు. -
జీఎస్ఎల్-ఇంపల్స్ భాగస్వామ్యంతో ఉజ్బెకిస్థాన్లో వైద్య విద్య
రాజమండ్రికి చెందిన జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ ఉజ్బెకిస్థాన్లోని ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్తో కలిసి సంయుక్తంగా వైద్యవిద్య కోర్సు అందిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు పూర్తిగా కట్టుబడుతూ ఇలాంటి కోర్సు చేపట్టడం ఇదే మొట్టమొదటి సారి. ఉజ్బెకిస్థాన్లో వైద్యవిద్య చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఈ భాగస్వామ్యం ఎంతో మేలుచేస్తుంది. దీనివల్ల వారు తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ విజయవంతంగా ప్రాక్టీసు చేయొచ్చు.ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్లోని కోర్సులు ఎన్ఎంసీ మార్గదర్శకాలు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ (ఎస్ఎస్ఎంఎల్ఈ) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా ఉన్నాయి. కరిక్యులంను భారత్, ఉజ్బెకిస్థాన్లకు చెందిన విద్యారంగ నిపుణులు కలిసి రూపొందించారు. ఇది భారతీయ ఎంబీబీఎస్ సిలబస్, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ, సీబీఎంఈ (భారత వైద్యకళాశాలల కరిక్యులం)ను పాటిస్తుంది. దీనివల్ల ఇండియా, అమెరికా, ఇంగ్లండ్, లేదా ప్రపంచంలోని మరేదేశంలోనైనా ప్రాక్టీసు చేసుకోవడానికి వీలుగా విదేశాల్లో చదివేందుకు ఇది సరైన ఆప్షన్గా విద్యార్థులకు ఉంటోంది.ఈ సందర్భంగా జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గోగినేని మాట్లాడుతూ, ‘‘విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించే విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ (ఎఫ్ఎంజీఎల్) 2021 నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎన్ఎంసీ సూచించింది. ఈ ప్రమాణాలు పాటించని సంస్థల్లో చదివినవారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) లాంటి లైసెన్సింగ్ పరీక్షలకు అర్హులు కారు. ఇందుకు బాధ్యత పూర్తిగా విద్యార్థులదే అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ), ఈసీఎఫ్ఎంజీల నుంచి ఎక్రెడిటేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్కు చెందిన విద్య, సైన్స్, ఇన్నోవేషన్ మంత్రిత్వశాఖ నుంచి గుర్తింపు ఉన్న ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్తో చేతులు కలపడం ద్వారా, జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులకు సురక్షితమైన, నమ్మదగిన మార్గాన్ని జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ చూపిస్తోంది’’ అన్నారు.2021 నాటి ఎఫ్ఎంజీఎల్ నిబంధనల ప్రకారం విదేశాల్లో కనీసం 54 నెలల వైద్యవిద్య, 12 నెలల ఇంటర్న్షిప్ ఉండాలి. కొత్త జీఎస్ఎల్ ఇంపల్స్ వైద్యవిద్యలో భాగంగా ఉజ్బెకిస్థాన్లోని 43కు పైగా భాగస్వామ్య ఆస్పత్రులలో 12 నెలల ఇంటర్న్షిప్ కూడా ఉంది. దీంతో విద్యార్థులు రోగులకు చికిత్సలు చేస్తూ శిక్షణ పొందగలరు.ఈ రెండు సంస్థల భాగస్వామ్యం గురించి ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బఖ్తినూర్ ఒయ్బుటేవిచ్ ఖుదనొవ్ మాట్లాడుతూ, ‘‘ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్, నమన్గన్ ప్రాంతాల్లో ఉన్న ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అంతర్జాతీయ వైద్యవిద్యకు ప్రతిష్ఠాత్మక కేంద్రంగా నిలిచింది. అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన బోధకులు, ఇంగ్లిషు మీడియం కరిక్యులం, అందుబాటులో ఫీజులతో విద్యార్థులకు నిజమైన అంతర్జాతీయ అభ్యసన వాతావరణాన్నిఅందిస్తుంది. జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్తో భాగస్వామ్యం ద్వారా మా విద్యార్థులు భారతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ నుంచి పాఠాలు వింటారు. ఇండియా వెళ్లి లైసెన్సింగ్ పరీక్షలకు హాజరవ్వగలరు’’ అని తెలిపారు.ఈ సందర్భంగా రోహిత్ గా , సీఓఓ, నియో & జీఎస్సెల్ అంతర్జాతీయ అవుట్రీచ్ హెడ్, మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం వల్ల భారతీయ విద్యార్థులకు స్వదేశంలో ఉండే సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య లభిస్తాయి. అసలైన మృతదేహాల డిసెక్షన్లతో పాటు భారతీయ ఎంబీబీఎస్కు అనుగుణంగా ఉండే కరిక్యులం, అత్యాదునిక హాస్టళ్లలో అసలైన భారతీయ ఆహారం.. ఇవన్నీ భారతీయ విద్యార్థులకు చాలా సుఖంగా, సురక్షితంగా ఉండేలా అనిపిస్తాయి. అదే సమయంలో తిరిగి రాగానే కెరీర్కు వారు సిద్దం కావచ్చు’’ అని వివరించారు.జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మధ్య ఈ భాగస్వామ్యంతో భారతీయ విద్యార్థులు స్వదేశంలో కెరీర్ అవకాశాలను రక్షించుకుంటూనే విదేశాల్లో వైద్యవిద్య చదవగలరు. ఇది భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక విద్యా సంబంధాలనూ బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా చేయడం ద్వారా ఈ భాగస్వామ్యం విద్యార్థులు స్వదేశంలో తమ వృత్తిపరమైన భవిష్యత్తు విషయంలో రాజీ పడకుండానే తమ కలలు నెరవేర్చుకోగలరు. -
అమానుషం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గ్రామస్తులు
సాక్షి,హైదరాబాద్: మెదక్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. బైక్లను దొంగిలించాడనే నెపంతో ఓ దొంగను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల వివరాల మేరకు.. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దారుణం జరిగింది. బైక్ దొంగతనం చేయబోయిన ఇద్దరు యువకుల్లో ఒకరిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు. పార్క్ చేసిన బైక్లను చోరీ చేసి మార్కెట్లో అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో ఓ బైక్ను దొంగతనం చేశారు. దొంగతనానికి వస్తూ వస్తూ..అక్కరకొస్తుందని ఓ బాటిల్ పెట్రోల్ను వెంట తెచ్చుకున్నారు.అయితే దొంగిలించిన బైక్లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్య పప్రాంతానికి తీసుకెళ్లి బండిలో పెట్రోల్ నింపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బండిని కొంతదూరం నెట్టుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళుతున్న యువకులు బైక్ చోరీ చేసిన నిందితుల్ని గుర్తించారు. యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మహిపాల్ పరారయ్యాడు. యవాన్ను స్తంభానికి కట్టారు. అతని జేబులో ఉన్న పెట్రోల్ను తీసుకుని తగలబెట్టారు. యవాన్ 90 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. యవాన్పై దారుణానికి తెగబడ్డ గ్రామస్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. -
‘భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి మండిపడ్డారు. -
అంబర్ పేట బిడ్డకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్
అంబర్ పటేల్ నగర్కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు. సినీ నటి మరియు విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలు తీసుకున్నందుకు కారకులైన తన గురువులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ కూన ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సిరాజ్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: ఓఆర్ఆర్.. వరుసగా ఢీకొన్న ఏడు కార్లు
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం(అక్టోబర్ రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వస్తుండగా జరిగింది.ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ‘పార్కింగ్’ దందా..
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్లోని ఓ ప్రాజెక్ట్లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్.. ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్డ్ టు సాటిస్ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.టీడీఆర్తోనూ పార్కింగ్ సమస్యలే.. సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్ను బట్టి ఒక్కో కారు పార్కింగ్ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8 అపార్ట్మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.డ్రైవ్ వేలు కూడా పార్కింగ్గానే.. ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. – కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా -
స్ఫూర్తి మూర్తి.. సాంస్కృతిక కీర్తి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి వడ్డాణంలా.. నడిమధ్యలో వయ్యారంగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవానికి అందమైన సొబగులు అద్దుకుంటున్నాయి. మూసీని వాణిజ్య కేంద్రంగానే కాకుండా.. నదీ పరీవాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ఆలవాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈమేరకు మూసీ, దాని ఉపనది ఈసా నదుల సంగమం అయిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు గాంధీ తత్వాన్ని బోధించే ఆశ్రమం, మ్యూజియంను కూడా నిర్మించనున్నారు.సమగ్ర మాస్టర్ప్లాన్ త్వరలోనే ప్రభుత్వానికి.. మెయిన్హార, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్, ఆర్ఐఓఎస్, జెడ్హెచ్ఏ, ఎస్ఓఎంలతో కూడిన కన్సార్టియం తొలి దశ మూసీ సుందరీకరణ సమగ్ర మాస్టర్ ప్లాన్ను అతి త్వరలోనే ప్రభుత్వానికి సమరి్పంచనుంది. గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం 250 ఎకరాల భూమి అవసరం కాగా.. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అ«దీనంలో ఉన్న ఈ భూములను బదిలీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే కేంద్రం 100 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు కేంద్రం అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం చర్చలు జరుగుతున్నాయని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి.సాంస్కృతిక పునరుజ్జీవంగా.. తొలి దశలో గండిపేట నుంచి బాపూ ఘాట్ వరకూ 20.5 కిలో మీటర్ల వరకు మూసీకి పునరుజ్జీవం కల్పించనున్న అధికారులు.. రెండో దశలో హెచ్ఎండీఏ పరిధిలోని 55 కి.మీ. వరకూ నదిని సుందరీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మూసీకి వాణిజ్య, ఉపాధి కేంద్రంతో పాటు సాంస్కృతిక పునరుజ్జీవంగా అభివృద్ధి చేయనున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపి థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు నదీ పరీవాహక ప్రాంతం వెంబడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన వ్యక్తులు, మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.సకల మతాల సమ్మేళనంగా.. నగరం మధ్యలో నుంచి 55 కి.మీ. మేర ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాన్ని సకల మతాల సమ్మేళనంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మంచిరేవులలో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం, పాతబస్తీలోని మసీదు, సిఖ్చౌనిలో గురుద్వార, ఉప్పల్లో మెదక్ కేథడ్రిల్ తరహాలో చర్చిని కూడా నిర్మించనున్నారు. బాపూ ఘాట్ను అభ్యాస ప్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గాంధీ ఆశ్రమం, మ్యూజియంలను నిర్మించనున్నారు. ఇందులో గాంధీ బోధనలను నుంచి ప్రేరణ పొందిన నీతి, కమ్యూనికేషన్, విలువలపై కోర్సులను అందిస్తారు.దండియాత్ర విగ్రహమే.. మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్దకు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి.. ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశ, విదేశాల్లో కొలువుదీరిన మహాత్మా గాంధీ విగ్రహాలను అధ్యయనం చేసిన అధికారులు.. చరిత్రాత్మక దండి యాత్రలో చేతిలో కర్రతో నడుస్తున్న స్థితిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. అహింసా, ప్రతిఘటన, స్వావలంబన, స్వేచ్ఛను సాధించే సమష్టి శక్తికి ఇది సూచిక. గాం«దీజీ నిశ్శబ్ద బలమైన వాకింగ్ స్టిక్.. శ్రద్ధ, దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇప్పటికే 68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాపూఘాట్లో ధ్యాన భంగిమలో ఉన్న 22 అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 1999లో ఏర్పాటు చేశారు. -
Hyderabad: యువతి ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబంలోని విభేదాలతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డినగర్కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారి కుమార్తె సృష్టిత (21) తల్లి ప్రసన్నతో కలిసి మధుసూదన్రెడ్డినగర్లో ఉంటుండగా...భర్త వేరుగా ఉంటున్నాడు. సృష్టిత డిగ్రీ చదువుతుండగా, తల్లి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ప్రసన్న రోజులానే ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో కూతురు సృష్టిత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తల్లి కుమార్తెతో ఫోన్లో మాట్లాడింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు మరోమారు ఫోన్ చేస్తే సృష్టిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఇంట్లో కిరాయిదారులకు ఫోన్ చేసి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని తెలిపి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు తలుపు తట్టి ప్రయతి్నంచినా ఎలాంటి సమాధానం రాలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సృష్టిత తన గదిలో ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో విషయాన్ని తల్లి ప్రసన్నకు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల వల్లే మనస్థాపం చెంది యువతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రాణం తీసిన మూఢనమ్మకం
చంచల్గూడ: మూడ నమ్మకమనే పెనుభూతం ఒక చిన్నారి ప్రాణం బలితీసుకుంది. అనారోగ్యంతో కన్న కూతురు చనిపోతే..అందుకు కారణం చేతబడే అని నమ్మి, అందుకు తోడు ఆస్తి వివాదం కొనసాగుతుండటంతో సోదరి కూతుర్ని చంపేశాడో కిరాతకుడు. శనివారం మాదన్నపేట పీఎస్లో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..చావణీలో నివాసం ఉండే మీర్ సమీ అలీ స్థానికంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అతని భార్య యాస్మీన్ బేగం గృహిణి. కాగా సమీ కుమార్తె గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి చేతబడే కారణమని సమీ అనుమానించాడు. దీనికి తోడు సమీకి సోదరి, సోదరులతో ఆస్తి వివాదం ఏర్పడింది. తన తల్లి ఆస్తిని తన పేరున రాయించుకుని సోదరి, సోదరులకు కొంత డబ్బులు ఇస్తానని సమీ హామీ ఇచ్చాడు. కానీ ఇవ్వకపోవడంతో వారంతా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో తన కూతురు చేతబడి వల్లే మృతి చెందిందని ధృఢంగా నమ్మిన సమీ..లోలోపల తన సోదరి షబానా బేగంపై ప్రతీకారంతో రగిలిపోయాడు. గత మంగళవారం మధ్యాహ్నం షబానా బేగం తన కుమార్తె ఉమ్మేహని సుమయ (7)తో కలిసి తల్లి ఇంటికి వచి్చంది. బాలికను వదిలేసి షాపింగ్కు చారి్మనార్ వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సమీ దంపతులు సుమయను ఆడుకుందామని నమ్మించి పిలిచి..బెడ్షీట్తో వెనక నుంచి చేతులు కట్టేసి బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి బతికుండగానే వాటర్ ట్యాంక్లో పడేసి మూత పెట్టి వెళ్లిపోయారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్లో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను విచారించగా సమీ దంపతులు నేరాన్ని అంగీకరించారు. భార్యా భర్తలిద్దర్నీ పోలీసులు రిమాండ్కు తరలించారు. సమావేశంలో సైదాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, మాదన్నపేట ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ తెరపైకి అజహరుద్దీన్!?
సాక్షి,సిటీబ్యూరో/బంజారాహిల్స్: అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీటు కోసం తీవ్రపోటీ ఉండటంతో అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి బరి నుంచి తప్పించింది. తాజాగా ఆశావహుల జాబితా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో.. తిరిగి అజహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ కోటా నాన్ పొలిటికల్ కేటగిరీ కింద అజహరుద్దీన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఉండటంతో న్యాయపరమై చిక్కులతో పదవికి గండం తప్పదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయనకు కూడా ఆ అనుమానం వెంటాడుతోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా శనివారం బంజారాహిల్స్లోని అజహరుద్దీన్ నివాసానికి మైనారిటీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. వారం రోజులుగా కార్యకర్తల ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఆయన రెండు మూడు రోజులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. రంగంలోకి మీనాక్షీ నటరాజన్ తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, యువనేత నవీన్ యాదవ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాత్రం తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. మజ్లిస్ కలిసి వస్తున్నందుకు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలో దిగి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చేవిధంగా ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగానే ఉన్నారు. తాజాగా మజ్లిస్ కూడా ఉప ఎన్నికల బరి నుంచి దూరం పాటిస్తున్నట్లు, కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలు ఇచి్చంది. ఆశావహుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఎంపికైనప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే హైదరాబాద్ మైనారిటీ కోటాలో మంత్రి పదవీ దక్కవచ్చని అజహరుద్దీన్ కూడా యూ టర్న్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో బస్సు చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని సిటీ బస్సుల చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులనే తిప్పనుండటంతో అందుకయ్యే మౌలికవసతుల కల్పనకు కావాల్సిన నిధుల కోసం సిటీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తాజాగా అనుమతించింది. దసరా వేళ చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో పండుగ రద్దీ ముగిశాక పెంచాలని నిర్ణయం తీసుకుంది. చార్జీల పెంపు సోమవారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచి అమల్లోకి రానుంది. పెంపు ఇలా... ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై రూ. 5 పెరగనుంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 కానుంది. నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెరుగుతుంది. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి నిత్యం రూ. 20 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల కోసం.. హైదరాబాద్లో డీజిల్ బస్సుల వల్ల వాతావారణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ బస్సులను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం తిరుగుతున్న 2,800 డీజిల్ బస్సులను ఔటర్ రింగ్రోడ్డు అవతల ఉన్న డిపోలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సానుకూలంగా స్పందించి బస్సులను మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిచింది. ఎంపికైన ప్రైవేటు సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. ఆ సంస్థ బస్సులను సమకూర్చుకొని ఆరీ్టసీకి అద్దెకిస్తుంది. ‘ఫేమ్’పథకం కింద గతంలో హైదరాబాద్కు 500 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 225 బస్సులు ఇప్పటికే సమకూరగా మరో రెండు నెలల్లో మిగతావి అందనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే బస్సులతో కలిపి అప్పుడు మొత్తం 3,300 విద్యుత్ బస్సులు నగర రోడ్లపైకి వస్తాయి. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. ప్రస్తుతం నగరంలో 25 బస్సు డిపోలున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు పవర్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు కొంత స్థలం అవసరమవుతుంది. ప్రస్తుతం డీజిల్ బస్సుల తరహాలో ఒక్కో డిపోలో 100 అంతకుమించి బస్సులకు స్థలం సరిపోదు. 3,300 బస్సులకు సరిపోవాలంటే అదనంగా మరో 10 కొత్త డిపోలను, ఎలక్ట్రిక్ చార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో డిపోపై రూ. 7–8 కోట్ల భారం పడనుంది. ఇంటర్మీడియట్ స్టేషన్ల ఏర్పాటుకు మరో రూ. 6 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే కొన్ని డిపోలకు ఏర్పాటు చేయగా, మరో 19 డిపోలకు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రతిపాదించిన 10 డిపోలతో కలిపి ఇప్పుడు 29 డిపోలకు ఈ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇందుకు రూ. 392 కోట్లు అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం చేతెలెత్తేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సిటీ బస్సుల ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బస్సు చార్జీలను సవరించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. -
స్థానిక ఎన్నికల కోసం కాల్సెంటర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రజల సందేహాల నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం కేంద్రీకృత కాల్సెంటర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది.ఇప్పటికే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ జారీ చేసిన నేపథ్యంలో... ప్రజలు సంబంధిత అధికారుల ద్వారా అవసరమైన సమాచారం తెలుసుకు నేందుకు 9240021456తో ఎస్ఈసీ కార్యాల యంలో కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నిక లకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు ఈ కాల్సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఎస్ఈసీ కార్యదర్శ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరోగమనంలో వైద్యం
చైతన్యపురి (హైదరాబాద్): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తిరోగమనంలో ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను 30 నుంచి 70 శాతానికి పెంచితే నేటి రేవంత్ సర్కార్లో అది 55 శాతానికి పడిపోయిందని విమర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, వివేకానందగౌడ్, చింత ప్రభాకర్లతో కలిసి శనివారం ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.కోవిడ్ సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో హెల్త్సిటీ, హైదరాబాద్లో నాలుగు వైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. కొత్తపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి కోసం సెల్లార్ ప్లస్ అరు అంతస్తులు నిర్మాణం చేశామని గుర్తు చేశారు. అయితే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ రెండేళ్లలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కేవలం ఐదు అంతస్తులు మాత్రమే నిర్మాణం చేశారని విమర్శించారు. అంతేకాక తమ ప్రభుత్వం ఈ ఆసుపత్రికి 24 అంతస్తులకు అనుమతి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 14 అంతస్తులకు కుదించిందని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే పనులు పూర్తయి, పేద ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని రేవంత్రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆసుపత్రుల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణాలను ఆరునెలల్లో పూర్తి చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తిట్లమీద ఉన్న శ్రద్ధ ఆరోగ్య కిట్లమీద లేదని విమర్శించారు. పేద ప్రజలకు ఉపయోగ పడే టిమ్స్ నిర్మాణాలను రాజకీయాల కోసం ఆపవద్దని హితవు చెప్పారు. -
పరిమితి వేలల్లో.. ఖర్చు లక్షల్లో
సాక్షి, హైదరాబాద్: జమీన్ ఆస్మాన్ ఫరక్.. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అనేది నానుడి. గత కొన్నేళ్లలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఊహించలేనంతగా పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. స్థాని క ఎన్నికల్లో పోటీ చేయటం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలంటే భూము లు ఇతర ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం అభ్యర్థులకు విధిస్తున్న వ్యయ పరిమితికి, వాస్తవంగా చేస్తున్న ఖర్చుకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామ వార్డు సభ్యుడు మొదలు జెడ్పీటీసీ వరకు పోటీచేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల ఖర్చు వివరాలు చూద్దాం..గరిష్ట వ్యయపరిమితి (2011 జనాభా లెక్కల ప్రకారం..)⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.50 వేల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.⇒ జెడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షల వరకే ఖర్చు చేయాలి.అభ్యర్థులు చేయాల్సినవి...⇒ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే వారు ఇద్దరు సాక్షులతో కూడిన తమ స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్)ను నామినేషన్ పత్రంతో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ⇒ అభ్యర్థులపై ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే స్వీకరించిన కేసులు (కాగ్జినెన్స్ టేకన్) మాత్రమే రాయాలి.⇒ శిక్ష పడిన కేసు వివరాలు రాయాలి.⇒ అభ్యర్థి లేదా భాగస్వామి, అభ్యర్థిపై ఆధారపడిన వారి చర, స్థిరాస్తులు (విదేశీ ఆస్తులతో సహా) పొందుపరచాలి.⇒ ఉమ్మడి ఆస్తిలోని వాటాను కూడా తెలపాలి.⇒ ఉమ్మడిగా కలిగి ఉన్న భూములు, భవనాలు, ఆపార్ట్మెంట్ వివరాలు వేర్వేరుగా పొందుపరచాలి.⇒ వ్యవసాయ భూమికి సంబంధిత భూమి సర్వే నంబర్, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, మొత్తం విస్తీర్ణం పొందుపరచాలి. వారసత్వమా కాదా అనేది కూడా తెలపాలి.⇒ బాండ్లు,షేర్లు, డిబెంచర్ల విలువ, తత్సంబంధిత కంపెనీ స్టాక్ ఎక్సె్చంజీ జాబితాలో ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ, జాబితాలో లేని కంపెనీల వివరాలు పుస్తకాలలో పేర్కొన్న ప్రకారం చూపాలి.⇒ ఆధారపడటం అంటే ఓ వ్యక్తి పూర్తిగా అభ్యర్థి ఆదాయంపైనే ఆధారపడినట్టు అర్థం.⇒ ప్రతి పెట్టుబడి, ఎంత మొత్తంలో ఆ పెట్టుబడి పెట్టారో వివరాలు తెలపాలి.⇒ చేతిలో నగదు, అభ్యర్థికి సంబంధించిన నగదు, భార్య/భర్తకు సంబంధించిన నగదు, ఆధారపడిన వారి వద్ద ఉన్న నగదు వివరాలు తెలియజేయాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలు, వాటిలో ఉన్న మొత్తం నిల్వ, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, అకౌంట్ నంబర్లు, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు ఉంటే వాటి వివరాలు తెలపాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారికి ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, ఇతర ఆభరణాలు వాటి బరువు ఒక్కొక్కటిగా పేర్కొనాలి.⇒ అభ్యర్థి, భార్య/భర్తకు సంబంధించిన వృత్తి, వ్యాపార వివరాలు పొందుపరచాలి.⇒ అభ్యర్థికి సంబంధించిన విదార్హతల సర్టిఫికెట్లు, కోర్సు పూర్తి చేసిన సంవత్సరం, ఇతర వివరాలు ఇవ్వాలి.⇒ అభ్యర్థుల స్వీయ ప్రకటనను ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయించి, వారి పూర్తిపేరు, చిరునామా స్పష్టంగా రాయకపోతే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. -
బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు
సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్ ఇస్తాం. – మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రావలసిన బోనస్ రూ.1,159.64 కోట్లు యాసంగి సీజన్లో 74.22 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు. బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల్ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్పై హామీ ఇవ్వలేదు. ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల ఎల్ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నధాన్యం మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్ క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. నాకు రూ.5.60 లక్షల బోనస్ రావాలి నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. – వాడ్వాట్ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. – చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం -
స్థానికంపై ‘ప్లాన్ బీ’!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే.. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే.. ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్నాయి. కోర్టుల వైపు అందరి చూపు.. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా.. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఆ పిటిషన్పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ దశలో రిజర్వేషన్ల పెంపుదలను ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా.. పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న కోర్టు ఏం తేలుస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారమూ సిద్ధమే... సుప్రీం, హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే (50 శాతానికి లోబడి) ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పీఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్ల కల్పనకు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామపంచాయతీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ, అన్ రిజర్వ్డ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ జారీచేసిన ఎన్నికల షెడ్యూల్స్ మార్చి వారం రోజుల అంతరంతో నిర్వహించేలా మరోసారి షెడ్యూల్ను జారీచేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. అవసరమైన మార్పులు చేశాక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీచేసి, ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా నాలుగు విడతలకు కూడా వారం రోజుల అంతరంతో నోటిఫికేషన్, మిగతా దశల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా గతంలో ప్రకటించిన విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మొదటి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై (పీఆర్ చట్టానికి సవరణలతో) అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరో 25 రోజులైతే ఆ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీనితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. -
TG: ఆర్టీసీకి లాభాల పంట.. దసరా ఆదాయం రూ.110 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దసరాకి పెంచిన చార్జీలతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కి భారీగా ఆదాయం సమకూరింది. రూ.110 కోట్లు ఆదాయం ఆర్జించింది. 50 శాతం అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేసింది.కాగా, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5,300 స్పెషల్ బస్సులు నడిపింది. వీటిలో కొన్ని సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడిపింది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసింది.ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్తోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి నడిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపింది. దసరా స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం టికెట్ ధరలను సవరించారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో స్పెషల్ బస్సుల్లోనూ సవరణ చార్జీలు అమలు చేస్తోంది. -
ప్రయాణికులకు TGSRTC బిగ్ షాక్.. బస్సు ఛార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం మోయలేని తరుణంలో.. జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకుంది. పెరిగిన ఈ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సిటీ బస్సుల్లో సోమవారం(అక్టోబర్ 6వ తేదీ నుంచి) పెంచిన ఛార్జీలను.. అదనపు చార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు, నాలుగో స్టేజ్ నుంచి రూ.10 పెంపు వర్తించనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంచిన ఛార్జీలు వసూలు చేస్తారు. అలాగే.. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్న మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేం.. అందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని టీజీఎస్ఆర్టీసీ అంటోంది. -
జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్ దాదాపుగా మహమ్మద్ అజారుద్దీన్ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటికే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate). ఇక ఈ లిస్టులో లోకల్ యంగ్ లీడర్ నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గ్రాండ్ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ జూబ్లీహిల్స్ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇల్లు కొనేవాళ్లకు భరోసా.. అక్రమ డెవలపర్లకు కొరడా!
ప్రీలాంచ్లు, సాఫ్ట్ లాంచ్ల పేరుతో ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.1.50 లక్షల ప్రాజెక్ట్ల నమోదు..ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.ఎస్క్రో అకౌంట్..దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.తెలంగాణ రాష్ట్రంలో..2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.రెరా ఎందుకొచ్చిందంటే?గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్(హెచ్డీబీ)1965: యూఎస్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (హెచ్యూడీ)1985: యూకే, హౌసింగ్ యాక్ట్1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..
పండగ అంటే ప్రతి ఇంటా ఆనందమే.. ఫెస్టివల్ సీజన్ (Festive Season) వస్తుందంటే చాలు మార్కెట్లు కళకళలాడుతుంటాయి. దీనికి స్థిరాస్తి రంగం మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితితో ఆరంభమయ్యే పండగ సీజన్ హోలీ వరకూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచింది. దీంతో ఈసారి పండగ ప్రాపర్టీ కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారింది. - సాక్షి, సిటీబ్యూరోదీంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు 25–30 శాతం అధికంగాఉంటాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. డెవలపర్లలో నూతనోత్తేజం నెలకొంది. పండగ సీజన్లో రియల్ రంగానికి (Real Estate) పండగే. కాకపోతే ఈసారి కొనుగోలుదారులకే సిసలైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ భారం తగ్గింది. అందుకే ఈ పండగ సీజన్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి డబుల్ ధమాకాగా చెప్పొచ్చు.హైదరాబాద్లో ఏడాదిన్నరగా ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. కాకపోతే ఇళ్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాలని కొందరు ఎదురుచూస్తుండగా.. మార్కెట్ మెరుగ్గా లేని తరుణంలో కొంటేనే మెరుగని, ఒకసారి అమ్మకాలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమని భావించిన కొందరు కస్టమర్లు నచ్చిన ప్రాజెక్ట్లలో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.ఔత్సాహిక బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ.. కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నియోపొలిస్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేమనే ఆలోచన బయ్యర్లలో ఏర్పడింది. అందుకే ఆయా ప్రాంతాలలో ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం!!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించనుందా? అనే ప్రశ్నకు సమాధానం ఔననే వస్తోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కరానికి తపించే యువ నేతను ఎన్నుకోవాలి’ అని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఏకంగా ఒవైసీ.. బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.. తాను బాధ్యతాయుతంగా చెబుతున్నానంటూ అనడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు యోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించినట్లైంది. మరోవైపు బీజేపీ బలోపేతం కాకుండా నిలువరించాల్సి అవసరం ఉందని, మధ్యలో ఓట్లు చీల్చేందుకు కొన్ని కత్తెర పారీ్టలు రావ్చని, ఆలోచించి యువనేతను ఎన్నుకోవాలని సూచించడాన్ని బట్టి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం పాటిస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. పార్టీ పరంగా అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షంతో కలిసి నడిచేందుకు.. మజ్లిస్ పార్టీ వ్యూహంలో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచే అనవాయితీ ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా తయారైన మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్పై పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలోకి దిగలేదు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో సత్ససంబంధాలు కలిగి ఉండటంతో ఉప ఎన్నికలకు దూరం పాటించాలని భావిస్తోంది.సెగ్మెంట్లో మజ్లిస్ ప్రస్థానం తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. దీంతో నవీన్ యాదవ్ మజ్లిస్కు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి సుమారు 18 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్ పార్టీ.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు ఆ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అంతా ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా ఉప ఎన్నికల్లో దూరం పాటించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్నెట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పూటకో మాట.. రోజుకో తీరు
సాక్షి, హైదరబాద్: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు సంబంధించి జీహెచ్ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి. సోషల్మీడియాలో వైరల్గా మారడంతో ఫ్లై ఓవర్ రెండో వైపు(లోయర్ట్యాంక్బండ్) ప్రవేశమార్గంలో కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది. ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు? రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు? రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ పలువురు జీహెచ్ఎంసీ చర్యల్ని తప్పుపడుతున్నారు. -
పాతబస్తీలో కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఫలక్నుమా జంక్షన్ (జీమ్యాక్స్ కన్వెన్షన్) నుంచి ఫలక్నుమా బస్డిపోతో పాటు చార్మినార్ వరకు వెళ్లే వారికి ఇప్పటిదాకా ఉన్న ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సికింద్రాబాద్ –ఫలక్నుమా బ్రాడ్గేజ్ లైన్లోని ఫలక్నుమా వద్ద ఇప్పటికే ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా రూ. 52.03 కోట్లతో నిర్మించిన కొత్త ఆర్ఓబీని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. పాత ఆర్ఓబీ పునరుద్ధరణతో పాటు కొత్త ఆర్ఓబీని నాలుగు వరుసల క్యారేజ్వేతో నిర్మించడంతో బార్కాస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎంతో సమయం ఆదాతో కావడంతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించనుంది.కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్ , ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జలి్ఫకర్ అలీ, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించినప్పటికీ, ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. -
జీఎస్టీ జోరుకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా జోరు మీద ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు కళ్లెం పడింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్లో తెలంగాణ జీఎస్టీ రాబడులు రూ.4,998 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్లకు తక్కువగా జీఎస్టీ ఆదాయం నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్తో పోల్చినా ఇది తక్కువే. 2024 సెప్టెంబర్లో రూ.5,267 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా, ఈసారి అంతకంటే రూ.269 కోట్లు (5 శాతం) తక్కువగా వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశమంతా రాబడులు పెరిగినా తెలంగాణలో తక్కువగా రావడం గమనార్హం. దేశంలో రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ ఆదాయం పడిపోయింది. మణిపూర్ (1 శాతం), ఢిల్లీ (1 శాతం), హిమా చల్ప్రదేశ్ (4శాతం)లో రాబడులు తగ్గాయి. మధ్య ప్రదేశ్లో 21 శాతం, బిహార్లో 17, ఉత్తరప్రదేశ్లో 11, రాజస్తాన్లో 10 శాతం మేర జీఎస్టీ పెరిగింది. దక్షిణాది విషయానికొస్తే కేరళలో 13 శాతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో (4 శాతం), కర్ణాటకలో 7 శాతం జీఎస్టీ పెరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం గత సెప్టెంబర్తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో తక్కువ ఆదాయం వచ్చిందిఆగస్టు వరకూ పైపైకే...:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మినహాయిస్తే మిగిలిన ఐదు నెలల జీఎస్టీ రాబడులు రాష్ట్రంలో ఆశాజనకంగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరుసగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో చూస్తే మాత్రం ప్రతి నెలా (ఒక్క జూలై మినహా) తగ్గుతూనే ఉన్నాయి. 2025లో ఏప్రిల్లో అత్యధికంగా రూ. 6,983 కోట్లు వచ్చిన జీఎస్టీ రాబడులు ఆ తర్వాతి నెలలో రూ.5,310 కోట్లకు పడిపోయాయి. జూన్లోనూ అంతకంటే తక్కువగా నమోదు కాగా, జూలైలో మాత్రం రూ.300 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక, ఆగస్టు, సెప్టెంబర్లో మళ్లీ తగ్గుదలే నమోదైంది.కారణాలేంటి?దేశవ్యాప్తంగా జీఎస్టీ రాబడులు పెరగ్గా.. రాష్ట్రంలో మాత్రం తగ్గేందుకు కారణాలేంటన్న దానిపై వాణిజ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జీఎస్టీ అధికారులు మాత్రం ఇందుకు చెప్పుకోదగిన కారణాలేవీ లేవని, సాంకేతిక కారణాలతోనే అలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఈ తగ్గుదల యాదృచ్ఛికమేనని చెబుతున్నారు. తెలంగాణలో లగ్జరీ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుందని, సెప్టెంబర్ రిటర్న్స్ వచ్చే నెలలో ఆ వస్తువుల కొనుగోళ్లు తగ్గి ఉండటం, కేంద్రం నుంచి వచ్చిన పాత బకాయిలు, పరిహారం లాంటివి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చి ఉండొచ్చని, లేదంటే ఆయా రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో వచ్చిన డిమాండ్ ఈనెలలో కార్యరూపం దాల్చి ఉంటుందని అంటున్నారు. అంతేతప్ప జీఎస్టీ రాబడుల్లో తెలంగాణలో ప్రత్యేక తగ్గుదల లేదని వారు చెబుతుండటం గమనార్హం. -
ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్
సాక్షి, హైదరాబాద్: బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్నీ భారత్లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన ‘జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) కనెక్ట్ 2025’మూడు రోజుల సదస్సును కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణమన్నారు.దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5 శాతం ఉన్నా, మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24 శాతంగా ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. జైన సముదాయ తాత్వికత భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉందని, దాని చరిత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణంలో అమూల్యమైన పాఠమని పేర్కొన్నారు. ఫార్మా, ఏవియేషన్, విద్యా రంగాల్లో జైన సముదాయం ముందంజలో ఉందని తెలిపారు. ‘పురాతన తీర్థంకరుల నుంచి ఆధునిక కాల నాయకుల వరకు, జైన సిద్ధాంతం భారతదేశ నైతిక, ధార్మిక ఆకృతిని రూపొందించింది. జైన సముదాయ ముద్ర ప్రతిచోటావిలువలతో కూడిన వృద్ధికి చిరునామా: శ్రీధర్బాబుతెలంగాణ విలువలతో కూడిన వృద్ధికి చిరునామాగా నిలుస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని చెప్పారు.జైన సమాజం సేవా స్ఫూర్తిని, తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణంతో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.రెండేళ్లకో మారు రొటేషన్ ప్రాతిపదికన జరిగే జిటో సదస్సు ఈసారి హైదరాబాద్లో జరుగుతుండగా, ప్రపంచ నలుమూలల నుంచి 50 వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వా హకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, యోగాగురువు రాందేవ్ బాబా, జిటో హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, జిటో కన్వీనర్ బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిటో సదస్సుకు వచ్చిన రాజ్నాథ్ సింగ్కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఉన్నారు. -
సర్వేజనా సుఖినోభవంతే.. భారతీయ సంస్కృతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి ‘సర్వేజనా సుఖీనోభవంతు’తో ముడిపడి ఉందని గవర్నర్ డా.జిష్ణుదేవ్వర్మ అన్నారు. భారత్లో ఒక ప్రాంతం, మరో ప్రాంతం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పండుగలు, ఆచారాల వంటివి మారినా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసి పోయాయన్నారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్ బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మార్గదర్శకత్వంలో చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దసరా సమ్మేళనం’లో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలయ్ బలయ్ని ఈ ఏడాది ప్రత్యేకంగా ’ఆపరేషన్ సింధూర్’ వీరులకు శ్రద్ధాంజలి, సైనికుల త్యాగాలను స్మరించే కార్యక్రమంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిషు్టదేవ్వర్మ మాట్లాడుతూ అలయ్ బలయ్ వంటి అసాధారణమైన వేడుకల తర్వాత మానవ సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. జమ్మిచెట్టును పూజించడం ద్వారా పర్యావరణం, ప్రకృతిని ప్రేమించాలనే పురాతన ధర్మాన్ని నేటికీ చాటి చెబుతున్నారన్నారు. ⇒ మేజర్ జనరల్ అజయ్మిశ్రా (సెంట్రల్ ఆఫీసర్ కమాండ్) ప్రసంగిస్తూ ‘కేవలం 88 గంటల్లో ముగిసిన ఆపరేషన్ సింధూర్ భారత మిలటరీ చరిత్రలో గొప్ప ఆపరేషన్. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానం’అన్నారు. ⇒ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో చీల్చే ప్రయత్నాలు సాగవు. నేపాల్లో ఏదో జరిగిందని, భారత్లోనూ అలాంటిది జరుగుతుందని ఆశించేవారి ఆశలు నెరవేరవు, భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం’అన్నారు. ⇒ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘దేశానికి ఏ సమస్య వచ్చిన అందరం ఏకం కావాలి. అదే నిజమైన అలయ్ బలయ్’అని అన్నారు. ⇒ కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రసంగిస్తూ...‘మనుషులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటే మనస్సులు పరిశుభ్రమవుతాయి. రాజస్తాన్లోని బికనీర్ ప్రాంతంలోనూ అలయ్ అంటూ జానపదగీతం ఉంది (పాడి వినిపించారు). జాతీయ సమైక్యతకు ఒక రూపం, చిహ్నంగా అలయ్ బలయ్ నిలుస్తోంది’అన్నారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘తెలంగాణ సాధనకు అందరం ఐక్యంగా పోరాటం చేశాం. బయట కత్తులు దూసుకునే వారు ఇక్కడకు రాగానే అలయ్ బలయ్ చేసుకుంటారు’అని చెప్పారు. ⇒ సినీనటుడు నాగార్జున మాట్లాడుతూ ‘అలయ్ బలయ్’లో సత్కారం చేయించుకోవడం తొలిసారి. చాలా కొత్తగా ఉంది. ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గొప్పవిషయం’అని చెప్పారు. ⇒ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రసంగిస్తూ ‘అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం. ఇది మన పూర్వికుల నుంచి వస్తోంది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, మంత్రులు డి.శ్రీధర్బాబు, డా.వివేక్ వెంకటస్వామి, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా.కె.నారాయణ, ఎమ్మారీ్పఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, డీకే.అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, అనిల్కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్రెడ్డి, వి.హనుమంతరావు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గాయకులు విమలక్క, మంగ్లీ, వందేమాతరం శ్రీనివాస్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అలయ్ బలయ్ ఫౌండేషన్ ప్రతినిధులు చింతలరామచంద్రారెడ్డి, డా.శిల్పారెడ్డి నిర్వహించారు. బాక్స్ ఐటమ్ గా వాడాలి ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్ బలయ్’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాక్షి, న్యూఢిల్లీ: ఆచారాలను పునరుజ్జీవింపజేసేందుకే ‘అలయ్ బలయ్’కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఇది సోదరభావాన్ని పెంపొందించే సాంస్కృతిక ఉత్సవమని కొనియాడారు. బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. ఇంత గొప్ప వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.‘హైదరాబాద్లో అక్టోబర్ 3న అలయ్ బలయ్ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ నృత్యాలు, జానపద కళలకు ప్రతీక. నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే అన్ని వర్గాలను ఒకచోటకు చేర్చే ఘనమైన వేడుక. తెలంగాణ సంస్కృతి, ప్రజల్లోని ఐక్యత, సమాజ విలువల వ్యాప్తికి ఇదో సామాజిక సమావేశంగా ఉపయోగపడుతుంది. అలయ్ బలయ్ పండుగ విజయవంతం కావాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.‘అని ద్రౌపది ముర్ము తన సందేశంలో తెలిపారు. -
ప్రచారం.. వారమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న మండల, జిల్లా పరిషత్ తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుంది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. ఈ కాలంలో వారు ఓటర్లకు అవగాహన కల్పన, ఎన్నికల ప్రచారానికి, కార్యకర్తలు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ⇒ రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుందని పేర్కొంది. ⇒ సమావేశాలు, ర్యాలీల నిర్వహణలో ఆయా ప్రదేశాలకు అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ⇒ అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలియజేయాల్సిఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలని తెలిపింది. ⇒ ప్రచారం నిర్వహించేటప్పుడు నైతికతకు ప్రాధాన్యతనిస్తూ, స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని దెబ్బతీసేలా అభ్యర్థులు వ్యవహరించొద్దని సూచించింది. ⇒ ఎన్నికల సమయంలో ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు తావు లేకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలని పేర్కొంది. ⇒ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు. ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచిత ప్రవర్తనతో ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ⇒ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదైనా వాహనంలో పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచొద్దు. ⇒ ఎస్ఈసీ విధించిన అభ్యర్థుల వ్యయ పరిమితి మాత్రం పూర్వకాలం నాటిదే కొనసాగుతోంది. జెడ్పీటీసీగా పోటీచేసే వారి వ్యయ పరిమితి రూ.4 లక్షలుగా ఉంది. విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే... ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. ఏదో ఒక నామినేషనే ఉంచుకోవాలి ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసి ఉంటే, అందులో ఏదో ఒకటి ఎంచుకొని మిగిలిన వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అభ్యర్థులు సమర్పించిన అన్ని నామినేషన్లు తిరస్కరణకు గురై ఎక్కడి నుంచైనా పోటీకి అనర్హులుగా మిగిలిపోతారు. ఉదాహరణకు రెండు చోట్ల ఎంపీటీసీగా లేదా రెండు చోట్ల జెడ్పీటీసీగా నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకోకపోతే అనర్హులు అవుతారు. ఒక చోట ఎంపీటీసీగా, మరో చోట జెడ్పీటీసీగా పోటీ చేసినా, ఆ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి. -
మన మాటే ఆయుధం
సాక్షి, హైదరాబాద్: ‘అయుధం అంటే ఏకే–47, ఆటంబాంబులే కాదు... అంతకంటే శక్తివంతమైంది మన మాట’అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ వ్యవస్థాపకులు కొలిన్ గొన్సాల్వేస్ అన్నారు. ఏ సమస్య అయినా అది ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నా... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా దానిపై గొంతెత్తి నినదించాలని చెప్పారు. అప్పుడే దాని తీవ్రత తెలుస్తుందని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘మంథన్ సంవాద్–2025’కార్యక్రమంలో పలు అంశాలపై మేధావులు, నిపుణులు ప్రసంగించారు.ఇందులో కొలిన్ గొన్సాల్వేస్ మాట్లాడుతూ.. లద్దాక్లో ప్రజలు చేస్తున్న ఆందోళనలో యువత పాత్ర ప్రధానంగా ఉందన్నారు. మణిపూర్లో 2022లో ప్రారంభమైన హింస నేటికీ చల్లారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు కనీస పరిహారం దక్కలేదని, నిరాశ్రయులైన వారికి పునరావాసం కలి్పంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కాలేదన్నారు.ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలన పేరిట గిరిజనులను తరలించే యత్నం జరుగుతోందని, గిరిజన ఆవాసాల్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను తవ్వేందుకే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అత్యంత దారుణంగా మాట్లాడుతూ హింసాత్మకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై ప్రతీ పౌరుడు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. వ్యంగ్యంతో కూడిన విమర్శలకు తీవ్ర ప్రభావం: వీర్ దాస్, నటుడు ఏదైనా సమస్యపై వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేసినప్పుడు అవి తీవ్ర ప్రభావం చూపడమేకాక... అంతే వేగంతో వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది. అలాంటి విమర్శలు చేయాలంటే భావప్రకటనా స్వేచ్ఛ అవసరం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. విమర్శలపై ప్రభుత్వం సహనాన్ని కోల్పోతోంది. వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం పరిపాటిగా మారింది. హాస్యం అనేది సమాజానికి అద్దంలాంటిది. అందులో కనిపించే వ్యంగ్యం సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటకు చూపుతుంది. ఆర్థిక అసమానతలు: ప్రొఫెసర్ రతిన్ రాయ్ దేశంలోని చాలా రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఢిల్లీ కంటే రెట్టింపుగా ఉంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల వృద్ధి ఇండోనేసియా దేశం కంటే ఎక్కువ. జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, బిహార్లో నేపాల్ వృద్ధి కంటే చాలా తక్కువ. దేశంలోని రాష్టాల మధ్య సమానత్వంతో కూడిన ఆర్థిక విధానాలుండాలి. లేకుంటే పేదలు, మధ్యతరగతి వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందవు. ఆర్థిక విధానాలను సరిచేసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. నిజాయితీ జర్నలిజం కావాలి: ఆర్ఫా ఖానమ్ శేర్వానీ, సీనియర్ ఎడిటర్, ది వైర్ ప్రజాస్వామ్య రక్షణలో మీడియా పాత్ర కీలకం. నాలుగో స్తంభంగా పిలిచే మీడియా ప్రభుత్వాలకు మద్దతుగా ప్రచారం చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే అది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదం. సమాజంలో సమస్యలు, ప్రభుత్వ లొసుగులను మీడియా బయటకు చెప్పకుంటే ప్రజలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకే నిజమైన వార్తలను నిజాయితీగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉంది. సైన్యాన్ని బలపరిస్తే సరిపోదు: ప్రవీణ్ సావ్నీ, ఎడిటర్, ఫోర్స్ మేగజైన్ దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలం సైన్యానికి అధిక నిధులు కేటాయిస్తే సరిపోదు. ఆర్థిక, సాంకేతికంగా ప్రత్యేక దృష్టి సారించి బలపర్చాలి. ఇప్పటివరకు యుద్ధమంటే సైనికులు మాత్రమే చేసేవారు. ఇకపై జరిగే ఆధునిక యుద్ధాలు సాంకేతిక పరిజ్ఞానంతో జరిగేవే. ఇక అమెరికా–భారత్ విషయంలోనూ ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. చైనా, పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యూహాలు భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలమైన వ్యవస్థగా ఎదగాలంటే సరైన స్పృహతో ప్రభుత్వం పాలన సాగించాలి. నైతికత, సహనంతోనే భవిష్యత్తు: రుద్రాంగ్షు ముఖర్జీ, చరిత్రకారులు, అశోకా వర్సిటీ చాన్స్లర్ నైతికత, సహనం, జ్ఞానంతోనే యువతకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. మహాత్మా గాం«దీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు ఈ అంశాలను ప్రస్ఫుటం చేస్తాయి. నేటి సమాజంలో ప్రజల్లో విభజన భావాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి దేశ సమగ్రతకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆలోచనల నుంచి సరైన మార్గంలో నడిపించేందుకు సరైన విద్యావిధానం అవసరం. స్వతంత్రంగా ఆలోచనలు చేసే విధంగా, మానవతా విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి. -
‘లక్ష’ణంగా ఖజానా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లకు చేరవయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలలకుగాను రాష్ట్ర ఖజానాకు రూ. 96,654.25 కోట్లు సమకూరినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కాగ్ ఇచి్చన నివేదిక మేరకు రెవెన్యూ రాబడులు రూ. 63 వేల కోట్లు దాటగా అప్పులు రూ. 33 వేల కోట్ల మార్కు చేరాయి. పన్నుల ఆదాయం రూ. 60 వేల కోట్లకు చేరువ కాగా గతేడాదితో పోలిస్తే ఒక శాతం మేర పన్ను రాబడులు తగ్గాయి. భారీగా అప్పుల పద్దు కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 54 వేల కోట్లకు పైగా అప్పులు సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో పొందుపర్చగా అందులో 61.87 శాతం అంటే రూ. 33,434 కోట్లు ఈ ఐదు నెలల్లో సమకూరాయి. అయితే ఈ లెక్క ఆగస్టు వరకు మాత్రమే. గత నెలలో ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంది. ఈ అప్పులతో కలిపితే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే అప్పులు దాదాపు 90 శాతానికి చేరనున్నాయి. గతేడాదితో పో లిస్తే అప్పులు ఈసారి కూడా ఎక్కువేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి ఆ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే 59.79 శాతం అప్పులు తీసుకోగా ఈసారి అది మరో రెండు శాతం పెరిగింది. పన్ను ఆదాయం ఇలా... ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల రాబడులను పరిశీలిస్తే గతేడాది కంటే కొంచెం తగ్గినా అటూఇటుగానే పన్ను ఆదాయం వస్తోందని ‘కాగ్’వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి జీఎస్టీ కింద రూ. 21,144 కోట్లు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,218 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 14,079 కోట్లు, ఎక్సైజ్ రూపంలో రూ. 7,758 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 7,413 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీల ద్వారా రూ. 3,352.82 కోట్లు వచ్చాయి. వాటికి అదనంగా పన్నేతర ఆదాయం కింద రూ. 1,578 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 1,673 కోట్లు సమకూరాయి. -
కోచింగ్ సెంటర్ల వ్యాపారం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, గ్రూప్స్, టోఫెల్.. ఇలా రంగం ఏదైనా, ఎలాంటి పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇన్ఫీనియం తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లుగా ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యాపారం.. ఈ ఏడాది నాటికి ఏకంగా రూ. 70 వేల కోట్లకు చేరిందని వెల్లడించింది. అలాగే 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.కోవిడ్ తర్వాత ఆన్లైన్, డిజిటల్ కోచింగ్ (Digital Coaching) విధానం బాగా పెరగడం వల్ల కోచింగ్ కేంద్రాల వ్యాపారం పెరుగుదలకు దోహదపడుతోందని తెలిపింది. వ్యాపార మార్కెట్ను మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రచారంపై ఏటా రూ. 150 కోట్లకుపైనే కోచింగ్ సెంటర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆయా కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులు ఉండట్లేదని.. సూక్ష్మ బోధన విధానం తప్ప సబ్జెక్టుపై దృష్టి పెట్టడం లేదని కనుగొంది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయపడింది. విద్యార్థులపై ఒత్తిడి.. దేశవ్యాప్తంగా ఏటా జేఈఈ మెయిన్కు (JEE Main) సుమారు 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీ పడుతుండటంతో కోచింగ్ సెంటర్లు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు మొత్తం విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మిగతా వారికి పెద్దగా నాణ్యత లేని ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 13 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. ర్యాంకుల కోసం కోచింగ్ కేంద్రాలు, తల్లిదండ్రుల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన, ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమని ఎన్సీఆర్బీ తెలిపింది. కట్టడికి కార్యాచరణ మొదలైనా.. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ.. ఇందుకోసం ఈ ఏడాది మొదట్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి, కాన్పూర్ ఎన్ఐటీ, ఐఐటీ, ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రతినిధులు సహా మరికొందరిని ఇందులో సభ్యులుగా చేర్చింది.కోచింగ్తో పనిలేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతోపాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ప్రచార, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఈ కమిటీని కేంద్రం ఆదేశించింది. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, పాఠశాల విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలను సూచించలేదు. ఉన్నత విద్యామండలి సిఫార్సులివి.. కోచింగ్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని కట్టడి చేయడానికి చట్టబద్ధ నియంత్రణ అవసరమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ఇటీవల నివేదించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందిన ఈ నివేదికలోని పలు సిఫార్సులు ఇవి.. ⇒ కోచింగ్ సెంటర్లపై బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ⇒ శిక్షణా కేంద్రాలకు గుర్తింపును తప్పనిసరి చేయాలి. ⇒ డేటా ప్రైవసీ చట్టాల పరిధిలోకి వాటిని తేవాలి. ⇒ ఆయా సెంటర్లపై ఫీజుల నియంత్రణ ఉండాలి. విదేశీ విద్యా కన్సల్టెంట్లు, ఆన్లైన్ విద్యా వేదికలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ ప్రొవైడర్లు నియంత్రణ పరిధిలో ఉండాలి. ⇒ ఉన్నత విద్యా మండలి వద్ద కోచింగ్ కేంద్రాలు అనుమతి పొందేలా ఉండాలి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించి ఏటా నాణ్యతను అధికారికంగా నిర్ణయించాలి. ⇒ ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. ⇒ ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్న కోచింగ్ పారదర్శకంగా ఉండట్లేదు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. అకడమిక్ పాఠాలతో ఒత్తిడి లేకుండానే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులూ కారణమే ర్యాంకులే తప్ప విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేయడం లేదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారమే బోధించాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల సగటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దితే కోచింగ్తో పనే లేదు. – ఎంఎన్ రావు (జేఈఈ కోచింగ్ నిపుణుడు) చట్టం తేవాల్సిందే కోచింగ్ కేంద్రాల నియంత్రణకు పకడ్బందీ చట్టం తేవాలి. నాణ్యత లేని, నిపుణులు లేని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై ఒత్తిడి పెంచి ర్యాంకులతో ప్రచారం చేసుకొనే కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతా. చట్టం తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. – పింగిలి శ్రీపాల్రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) -
అల్లరి చేస్తోందని.. చేతులు విరిచి.. ట్యాంకులో పడేసి.. ఏడేళ్ల బాలిక హత్య
సాక్షి,హైదరాబాద్: మాదన్న పేట బాలిక హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడేళ్ల బాలిక అల్లరి చేస్తుందనే కారణంతో మేనమామ,అత్త కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో బాలికను నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. అయితే, బాలిక తల్లితో నిందితులకు గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, పాప అల్లరి చేయడం తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్లిన బాలిక ఆచూకీ గల్లంతయ్యింది. చీకటి పడుతున్న పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రమాదవ శాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి వాటర్ ట్యాంక్లో నీర్జీవంగా ఉన్న బాలిక మెడ, నోరు, చేతులు అనుమానాస్పద గుర్తులు ఉండటం, చేతులు వెనక్కి విరిచి ఉండడంపై పోలీసులు బాలికది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో బాలిక మేనమామ,అతని భార్య తీరు అనుమానాస్పదంగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసింది మేనమామ,అత్తేనని గుర్తించారు. -
కొమ్మినేని కేసులో సుప్రీం దెబ్బ మర్చిపోయావా చంద్రబాబూ?
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా, వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండవని తెలిసీ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అవివేకమైన చర్యగా పొన్నవోలు సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ చర్యలు ఎప్పటికీ నెరవేరవని గట్టిగా బదులిచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ ఇన్ఫర్మేషన్కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి విష ప్రచారం చేశారని, ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారిమీదనే పెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని, వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ప్రశ్నించే గొంతు నొక్కుతున్న నియంత పాలనప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాలన సాగిస్తున్నారు. ఈ 16 నెలల్లోనే సుమారు 2వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తోంది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఒక్కొక్కరి మీద రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధంలో హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తోంది. వరుసపెట్టి ఒక్కో వర్గాన్ని ఎలాగైతే అంతం చేశాడో సీఎం చంద్రబాబు సైతం అదేవిధానాలను అవలంభించబోతున్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. అంగన్వాడీలు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు.. ఆఖరుకి రైతులను కూడా.. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధింస్తున్నట్టే వారినీ ఇలాగే వేధిస్తారు.బీఎన్ఎస్ 111 సెక్షన్ పై కోర్టు మొట్టికాయలు వేసినా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్, పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసు రుజువైతే వారు జీవితకాలం జైలుకు పోతారని ఈ ప్రభుత్వానికి తెలియదా? మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైయస్సార్సీపీ లీగల్ సెల్ పోరాడితే 111 సెక్షన్ ని కోర్టులు స్వ్కాష్ చేశాయి. ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రావడం లేదు. 2 వేల మంది మీద కేసులు పెట్టారు. యాక్టివిస్టులను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.టీవీలో హోస్ట్గా ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తే.. నవ్వినా, మాట్లాడినా కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం, పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది. పాలన సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన కూటమి నాయకులు అదే రాజ్యాంగం తమకు వర్తించదు అన్నట్టు నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైన విషయం మర్చిపోతే ఎలా?ఫేక్ ఫ్యాక్టరీని నడిపిస్తుంది చంద్రబాబేఫేక్ ప్రచారం చేయడంలో మొదటి దోషి చంద్రబాబు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో ముద్దాయి ఐటీడీపీయే. ఎన్నో ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్ష నాయకుడి మీద ఇప్పటికీ బురదజల్లుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారు. అలాంటిది వీళ్లే ఇప్పుడు సోషల్ మీడియాను కట్టడి చేస్తామంటూ చట్ట సవరణకు ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. నియంతృత్వ పోకడలు మరింత పెరిగిపోతే ఏపీలోనూ నేపాల్ మాదిరిగా జెన్జీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పౌరుల హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఆయన కుటుంబంతోపాటు పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషప్రచారంపై ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో డీజీపీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వరకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇవే కేసులు అధికార పార్టీ వారికి కూడా వర్తిస్తాయని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నా.మీరు చేసిన తప్పుడు ప్రచారానికి కేసులు పెట్టొద్దా? సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించడానికి మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాస్తవానికి ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీయే. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర టీడీపీ నాయకులు ఎన్నో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విషప్రచారం చేశాడు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అందులో ప్రథమ ముద్దాయి చంద్రబాబే అవుతాడు. 34 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ నాడు పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. మిస్ ఇన్ఫర్మేషన్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, శ్రీలకం చేశాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి పథకం ప్రకారం విషం చిమ్మారు. అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ చేసిన ప్రచారం అబద్ధమేనని ఎన్సీఆర్బీ లెక్కలతో తేలిపోయింది. అంతా ఉత్తుదేనని కేంద్ర మంత్రి పార్లమెంట్లోనూ చెప్పాడు.వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.70 లక్షల కోట్లేనని ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉచితంగా ఇసుక పేరుతో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించినా రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ వేదికగా వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు. అదంతా అబద్ధమేనని తేలిపోయింది. వీటన్నింటిపైనా తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు?ఐటీ యాక్ట్ కేంద్ర పరిధిలోని అంశం సోషల్ మీడియా ఐటీ యాక్ట్ 2000 పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడిగా మూడు వేర్వేరు చట్టాలున్నాయి. వాటి అధికారం, పరిధులు వేర్వేరుగా ఉంటాయి. ఉమ్మడి చట్టమైనా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడం మినహా రాష్ట్రం మార్పులు చేయలేదు. తిరగరాయడం సాధ్యం కాదు. ఐటీ యాక్ట్ అనేది రిసిడ్యూరీ లిస్టులో ఉంటుంది. కాబట్టి కేంద్రం మాత్రమే దీనికి చట్టం చేయగలదు. దీనిలో రాష్ట్రం ఏమాత్రం కలగజేసుకోవడం సాధ్యపడదు. అయినా సోషల్ మీడియాను కట్టడి చేసే పేరుతో ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం పరిధిలో లేదని చంద్రబాబు అనుకుంటున్నారా? మాకొక ప్రత్యేక రాజ్యాంగం ఉందని ఆయన చెప్పదలుచుకున్నారా? అయినా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం చూస్తుంటే వారిది అవివేకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టుల ముందు ఇలాంటి చట్టాలు నిలబడవని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.సోషల్ మీడియా పోస్టులు, కట్టడికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించి నవంబర్ లోపు కోర్టు ముందు ఉంచాలని మార్చి 25న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఐటీ యాక్ట్ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టే నేరుగా సుప్రీంకోర్టు కేంద్రానికి సూచనలు చేస్తే, అందులో రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అని ఎలా దూరిపోతుంది? రెసిడ్యూరీ లిస్టులో ఉన్న ఐటీ యాక్టుకి పార్లమెంట్లో మాత్రమే చట్టం చేయడానికి వీలుపడుతుందే తప్ప, ఇందులో ఏ రాష్ట్ర అసెంబ్లీలు కలుగజేసుకోలేవు. ఐటీ యాక్టులో ఇప్పటికే చట్టాలున్నప్పుడు వీరు కొత్తగా ఏం తీసుకొస్తారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో ఏ ఒక్కరూ లా అండ్ జస్టిస్కి సంబంధించిన మంత్రి లేకపోవడం ఇక్కడ మరీ విచిత్రంగా ఉంది. ఐటీ యాక్టుని నిర్దేశించేది గృహ నిర్మాణం, సివిల్ సప్లయిస్, వైద్యారోగ్య శాఖకు చెందిన మంత్రులా అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
TG: రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు
హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటవ తేదీల్లో మద్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయగా, అక్టోబర్ 1వ తేదీన రూ. 86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ కావడంతో మళ్లీ శుక్రవారం నుంచి మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఒక్కరోజు రూ. 300 కోట్ల మద్యం బిజినెస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: నా స్థానంలో పోటీ చేసేది ఎవరంటే?.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
‘కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలి’
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. నగరంలో ఈరోజు(శుక్రవారం, అక్డోబర్ 3వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు కె. లక్ష్మణ్, రఘునందన్రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ కేంద్ర ప్రభుత్వం ఇమేజ్ను పెంచేందుకు పార్టీలోని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కేంద్ర పాలసీలకు అనుగుణంగా కోర్టలల మనం వాదిస్తామనేది కీలకం రానున్న మూడేళ్లు కీలకం. అందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాలి.కేంద్ర ప్రభుత్వ స్టాండ్ బలంగా వినిపించేందుకు ఎఫర్ట్ పెట్టాలి. తెలంగాణ లో అధికారంలో బీజేపీ రావాలి అంటే అందరం కలసి కట్టుగా పని చేయాలి. అర్జున్ రామ్ మేఘవల్ ఐఏఎస్గా ఉన్నప్పటికీ రాజీనామా చేసి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రతి శాఖ అనేక రిఫార్మ్స్ తీసుకువస్తుంది. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.బ్రిటిష్ చట్టాలు ఇప్పటికి అమలు అవుతున్నాయి. వర్తమాన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా చట్టాలు తేవాలని మోదీ ఆలోచన’ అని పేర్కొన్నారు.ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ కాలం చెల్లిన చట్టాలను మోదీ రద్దు చేశారు దేశాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇతర దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. మోదీ విజనరీ లీడర్ కాబట్టి సూక్ష్మంగా స్పందిస్తున్నారు. జీఎస్టీ తగ్గిపుతో దీపావళి వెలుగులు పేదల ఇళ్లల్లో నింపుతున్నారు. అగ్రదేశాల అడ్డగోలు టారిఫ్లతో తో భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి.ఇండియా ఎదుగుదలను చాలా దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. స్వదేశీ వస్తువుల వినియోగించడం ద్వారా.. మన ఆదాయం ఇతర దేశాలకు వెళ్లకుండా ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఇతరులకు ఉపాధి కలుగుతుంది’ అని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ. ‘ త్వరిగతిన న్యాయం దక్కాలని గత చట్టాలను రద్దు చేసి.. భారత న్యాయ సంహిత చట్టాలు మోదీ సర్కార్ తెచ్చింది. హైదరాబాద్ నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను నరికి చంపారు. కేసు వేసిన వాళ్లను వెనక్కి తీసుకోకపోతే హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రస్తుతం జరుగుతుంది. న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలి’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 -
బేగం బజార్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ కనిష్క జ్యువెల్లరీ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినదా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
కేటీఆర్ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని వీడియో పోస్టు చేశారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.… pic.twitter.com/o0k5tk9OW6— KTR (@KTRBRS) October 2, 2025 -
శాఖాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం
సిటీ కోర్టులు: ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేస్తే మాంసాహారాన్ని పంపడం ముమ్మాటికీ రెస్టారెంట్ తప్పేనని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అభిప్రాయపడింది. అందుకు బాధితుడికి రూ. 20 వేల నష్టాపరిహారాన్ని అందజేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్కు చెందిన వెంకటశరత్ అనే వ్యక్తి జొమోటో ద్వారా ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే జొమోటో నుంచి అసంపూర్తిగా ఉన్న శాఖాహారం వచ్చింది. వెంటనే సంబంధిత రెస్టారెంట్కు ఫిర్యాదు చేయగా వారు క్షమాపణలు చెప్పి తిరిగి ఆర్డర్ డెలివరీ చేశారు. అప్పుడు వచి్చన ఆర్డర్ తీసుకొని తింటూ ఉండగా అది శాఖాహారం కాదని, మాంసాహారమని గుర్తించిన అతను రెస్టారెంట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసేందుకు ఎంత ప్రయత్నించినా వారు ఫిర్యాదును తీసుకోకపోవడమే కాకుండా కనీసం ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు.దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ మొదట్లో అసంపూర్తిగా ఉన్న శాఖాహారాన్ని పంపిన రెస్టారెంట్ తర్వాత శాఖాహారం కాకుండా మాంసహారం ఎలా పంపుతారని ప్రశ్నించిన. ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన రెస్టారెంట్, జొమోటో కంపెనీలు ఒక్కొక్కరూ రూ.5 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అదేవిధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం చెరో రూ.5 వేలు ఫిర్యాదు దారుడికి 45 రోజుల్లోపు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లోపు చెల్లించకుంటే కోర్టు ఆర్డర్కు రెట్టింపు అంటే ఒక్కొక్కరూ రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 39(1)(డీ) ప్రకారంగా ఒక్కొక్కరు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. -
వాటర్ ట్యాంకులో శవమై తేలిన ఏడేళ్ల బాలిక
చంచల్గూడ: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మొదట బాలిక ఇంటి నుంచి తప్పిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు మంగళవారం మాదన్నపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం సదరు బాలిక అమ్మమ్మ ఇంట్లోని వాటర్ ట్యాంక్లో శవమై తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సంతోష్ నగర్కు చెందిన షబానా బేగం తన కుమార్తె (7)తో కలిసి మంగళవారం మధ్యాహ్నం యాఖుత్పురాలోని పుట్టింటికి వచ్చింది. బాలికను ఇంట్లోనే వదిలి షాపింగ్కు చారి్మనార్ వెళ్లింది. ఇంటికి తిరిగి వచి్చన తర్వాత కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు వెతికినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. బాధితురాలి ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్లో శవమై కనిపించింది. బాలిక చేతులు వెనక నుంచి తాడు కట్టి ట్యాంక్లో పడేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా బాధితురాలి తల్లి ఆస్తి విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలికను లక్ష్యంగా చేసుకుని హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
హైదరాబాద్లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివురాలిలా ఉన్నాయి. హైదర్గూడ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె ఇషిక (29) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది.జూన్ చివరి వారంలో నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తల్లి రాత్రి 7 గంటల ప్రాంతంలో బెడ్రూమ్ వద్దకు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
ఇచ్చంపల్లికి షరతులతో ఓకే
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీళ్లను తరలించేందుకు పలు షరతులతో రాష్ట్రం సమ్మతి తెలియజేసింది. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల వాటా నీళ్లను వినియోగించుకునేందుకు వీలుగా పెండింగ్ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్కి కేటాయించిన నికర జలాల వాటాలో ఆ రాష్ట్రం వాడుకోకపోవడంతో మిగిలి ఉన్న 148 టీఎంసీల గోదావరి జలాలను ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించేందుకు ఆ రాష్ట్ర అంగీకారం తీసుకోవాలని తెలిపింది. ఇచ్చంపల్లికి దిగువన తెలంగాణకు ఉన్న 152.17 టీఎంసీల అవసరాలకు తొలి ప్రా ధాన్యతనిస్తూ రక్షణ కల్పించాలని కోరింది. ఇచ్చంపల్లి బరాజ్తో సమ్మక్క సాగర్ బరాజ్ దిగువ భాగంలో ఎలాంటి వరద ముప్పు ఏర్పడకుండా భరోసా కల్పించాలని షరతు విధించింది. ఇచ్చంపల్లి బరాజ్ను నిర్మిస్తే కలిగే ప్రభావాలను విశ్లేషించడానికి సిమ్యులేషన్ అధ్యయనాలను జరపాలని సూచించింది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా నిర్వహించిన పాలకమండలి సమావేశంలో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, హైడ్రాలజీ ఎస్ఈ వెంకటరమణ, అంతర్రాష్ట్ర జల విభాగం ఎస్ఈ ఎస్.విజయ్కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు. 74 టీఎంసీలు కేటాయించాలి ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో రాష్ట్రానికి కేవలం 45 టీఎంసీలే కేటాయించారని, అలా కాకుండా 50 శాతం (74 టీఎంసీలు) కేటాయించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. కరువు పీడిత ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి అదనంగా మరో 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి అనుమతించాలని కోరింది. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని కృష్ణా పరీవాహకం పరిధిలో రెండు జలాశయాలను, కాల్వలను నిర్మించాలని, రాష్ట్రానికి కేటాయించిన కోటాను తాము ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛను కల్పించాలని విజ్ఞప్తి చేసింది. సాగర్/టెయిల్పాండ్ కింద రాష్ట్రంలో ఉన్న ఆయకట్టు భూములు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కాల్వల కారణంగా ముంపునకు గురికాకుండా రక్షణ కల్పించాలని, భూసేకరణను సాధ్యమైనంతగా తగ్గించాలని సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లోని నిబంధనల విషయంలో అన్ని రాష్ట్రాల అంగీకారం తీసుకున్న తర్వాతే సంతకాల సేకరణ జరపాలని పేర్కొంది. ఏపీ ప్రతిపాదనలపై అభ్యంతరం గోదావరి–కావేరి అనుసంధానంలో అంతర్భాగంగా చింతలపాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పలనాడు కరువు నివారణ ప్రాజెక్టు, గుండ్రేవుల రిజర్వాయర్ అనే నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతి కోరుతూ ఏపీ చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో తెలంగాణ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్ల తీర్పులతో పాటు రాష్ట్ర పునరి్వభజన చట్టానికి ఈ ప్రతిపాదనలు విరుద్ధమని స్పష్టం చేసింది. -
12లోగా ‘రీయింబర్స్మెంట్’ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఈ నెల 12లోగా చెల్లించకపోతే ఆందోళన చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రకటించింది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం మాట తప్పిందని, ఇచ్చిన హామీ మేరకు దీపావళిలోపు బకాయిలు చెల్లిస్తారన్న నమ్మకం లేదని వెల్లడించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యాయి. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘ఫతి’ చైర్మన్ డాక్టర్ ఎన్.రమేష్బాబు మీడియాకు వెల్లడించారు. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు తమతో చర్చలు జరిపారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఇందులో రూ.1,200 కోట్లలో రూ.600 కోట్లు తక్షణం, మిగతా రూ.600 కోట్లు దీపావళిలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్నుంచీ ప్రభుత్వం చుట్టూ తిరిగామని, అయినా బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 200 కోట్లే ఇచ్చారని, మిగతాదానికి సీఎంవో నుంచి క్లియరెన్స్ లేదని అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. తమ ఉద్యోగులు కనీసం దసరా పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. ఇక ఉపేక్షించం విద్యారంగంపై ప్రభుత్వం శీతకన్ను చూపుతోందని, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని రమేష్బాబు అన్నారు. ఇక ఏమాత్రం ఉపేక్షించలేమని, బకాయిలు ఇవ్వకపోతే 13వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామన్నారు. క్లాసులు నిర్వహించకపోవడం, విద్యార్థులతో చలో హైదరాబాద్, చలో సెక్రటేరియట్, బంద్లు, రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ నెల 12లోగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని ఎప్పుటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీలోపు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సునీల్ కుమార్, ట్రెజరర్ కె.కృష్ణారావు, జనరల్ సెక్రటరీ కేఎస్ శివకుమార్, సంఘం నేత నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిషేధాలు.. వివాదాల మధ్యే పురోగాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల చరిత్రలో నిషేధాలు, ప్రతిబంధకాలు, వివాదాలు ఎన్నో ఎదురైనప్పటికీ, ప్రతి దశలో తన శ్రేణులను విస్తరించుకుంటూ ముందుకెళ్లింది. హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, జాతీయ పునరుజ్జీవానికి దారితీసేలా కృషి చేసేందుకు ఇది ఏర్పాటైంది. యుద్ధాలు, ఎమర్జెన్సీ, రామజన్మభూమి ఉద్యమం వంటి కీలక దశల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర దేశ రాజకీయ, సామాజిక మార్పులను ప్రభావితం చేసిందనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో చిన్న వలంటీర్ బృందంగా ఏర్పడి, దేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగా ఎదిగింది. గాంధీజీ హత్య తరువాత వచ్చిన ప్రతికూలత, అత్యవసర పరిస్థితి సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అయోధ్య ఉద్యమం వంటి దశలు సంఘానికి మలుపుతిప్పే సంఘటనలుగా నిలిచాయి. ప్రస్తు తం ఆర్ఎస్ఎస్ లక్షలాది శాఖలతో సమాజంలో తన సిద్ధాంతాలను విస్తరించి, రాజకీయ, సామా జిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపుతోంది. బ్రిటిష్ వలస పాలనలో హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారు. మొదట్లో బ్రాహ్మ ణులు, యువకులు పాల్గొన్నారు. 1930లలో శాఖలు (స్వయం సేవకుల సమావేశాలు) విస్తరించాయి. 1940లో మాధవరావ్ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) సర్సంఘచాలక్గా నియమితులై, ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంతో హిందూత్వ భావనను మరింత బలపరిచారు. అంకురార్పణ ఇలా...1925లో విజయదశమి నాడు...ప్రథమ సర్సంఘచాలక్ హెడ్గేవార్ ఇంటి వద్ద 17 మందితో జరిగిన సమావేశంలో ఈ సంస్థని ప్రకటించారు. ఈ సమావేశంలో హెడ్గేవార్తో పాటు విశ్వనాథ్ కేల్కర్, భావ్జీ గావ్రే, అన్నా సహా, బాలాజీ ఉద్దార్, బాపూరావ్ భేది వంటివారు ఉన్నారు. ఆ రోజుల్లో కేవలం హిందువులని ఏకం చేయాలన్నది ఒక్కటే ఆశయం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరు సైతం 1926 ఏప్రిల్ 17న నిర్ణయించారు. అదేరోజున హెడ్గేవార్ని సంఘ్ ప్రముఖ్గా ఎన్నుకున్నారు. కానీ సర్సంఘచాలక్గా ఆయనను 1929 నవంబర్లో నియమించారు. ముందుగా మూడు పేర్లపై...రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జరీ పట్కా మండల్ ఇంకా భారతోద్ధారక మండళ్లపై చర్చించారు. మొత్తం 26 మంది సభ్యుల్లో నుంచి 20 మంది సభ్యులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కే ఓటు వేశారు. వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా హెడ్గేవార్ సంఘ కార్యక్రమాలను ముందుకు నడిపించారు. ఆధ్యాత్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్, విద్యా రంగంలో ఏబీవీపీ, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, వ్యవసాయ రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, వనవాసుల కోసం వనవాసీ కళ్యాణ అశ్రమ్, సేవారంగంలో సేవాభారతి, ఆరోగ్యం కోసం సక్షమ్, ఆరోగ్యభారతి, సహకార రంగం కోసం సహకార భారతి, స్వదేశీని ప్రోత్సహించేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్, న్యాయం కోసం అధివక్త పరిషత్, ఉద్యోగుల కోసం లఘు ఉద్యోగ్ భారతి, క్రీడా రంగం కోసం క్రీడా భారతి, సాహిత్య రంగంలో సాహిత్య పరిషత్, సంస్కృత భారతి, వినియోగదారుల కోసం గ్రాహక్ పంచాయత్ ఇలా ప్రతి రంగంలోనూ విస్తరించాయి.తెలుగునాట ఒకటిన్నర దశాబ్దం తరువాతే» ఆవిర్భవించిన ఒకటిన్నర దశాబ్దానికి గాని తెలుగు ప్రాంతాలకు ఆర్ఎస్ఎస్ విస్తరించలేదు. మళ్లీ ఆనాటి మత, రాజకీయ పరిస్థితులు, ఆంధ్ర ప్రాంతంలో 1946 కాస్త ముందు, పదేళ్ల తరువాత నిజాం ప్రాంతానికి ఆర్ఎస్ఎస్ వచ్చింది. 1940 ముందు రాజమండ్రిలో శాఖ కార్యక్రమం ప్రారంభమయింది. షేవర్ మిల్లులో పనిచేసే కొందరు మరాఠీలు శాఖ నడిపే యత్నం చేశారని వెల్లడైంది. విశాఖలోనూ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. మొదటి శిక్షణ శిబిరం 1942ల్నో గుంటూరు సమీపంలోని నల్లపాడులో 100 మందితో నిర్వహించగలిగారు. రెండవది గోరంట్లలోను, మూడోది విజయవాడలోను నిర్వహించారు. 1948, జనవరిలో విజయవాడలో భారీ శిక్షణ శిబిరానికి ఏర్పాట్లు జరిగాయి. » నిజాం ప్రాంతంలో కూడా పీఎల్ దేశ్ముఖ్ గోపాల్రావు ఠాకూర్ల ఆధ్వర్యంలోనే ఆర్ఎస్ఎస్ విస్తరించింది. 1950 ప్రాంతంలో వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. రామ్ధార్ షా, రామ్ పార్టేకర్, రామమూర్తి వంటివారు పని చేశారు.» 1960లో శ్రీశైలంలోను, 1963లో హైదరాబాద్లో శిబిరాలు నిర్వహించారు. ఇవి విస్తృతంగా జరిగాయి. సోమేపల్లి సోమయ్య, పిన్నమనేని లింగయ్య చౌదరి వంటివారు ఆనాడు విశేషంగా సంఘ విస్తరణకు కృషి చేశారు» ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 73,500 శాఖలు ఉన్నాయని, నిత్యశాఖలకు హాజరయ్యే వారు వారాంతపు శాఖలకు హాజరయ్యేవారు దాదాపు 40 లక్షలని అంచనా. అయితే ఆర్ఎస్ఎస్ సభ్యత్వం అని ఏమీ ఉండదు. భారతీయ మూలాలను అంగీకరించే వారు ఎవరైనా శాఖకు రావచ్చునని ఆర్ఎస్ఎస్ చెబుతుంది.» ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... 1940లలో ఆర్ఎస్ఎస్ ప్రవేశించింది. 1956 తర్వాత విస్తరించింది. 1940లలో హైదరాబాద్లో మొదటి శాఖలు. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత హైద రాబాద్, వరంగల్లో విస్తరణ. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో హిందూత్వ ప్రచారం. 1977 దీవిసీమ తుఫాను సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల విస్తృత సేవలు.» ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,100 శాఖలు, 75,000 స్వయం సేవకులు ఉన్నారు. 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో శాఖలు. 1952లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు ప్రారంభం. 1977 తుఫానులో స్వయం సేవకులు 35,000 మంది సేవలు. 1980లలో విజయవాడ, అనంతపురం, విశాఖపట్నంలో విస్తరణ. » ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘ్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణలోని ఇందూరు జిల్లా కందకుర్తి గ్రామానికి చెందినవారు.1963లో సంఘ్లో చేరిన నేను 1970 నుంచి (55 ఏళ్లుగా) ఆరెస్సెస్ ప్రచారక్గా కొనసాగుతున్నాను. ప్రారంభం నుంచి మాతృభూమిపట్ల భక్తి, ప్రేమ, సమాజం పట్ల సంవేదన, ఆత్మీయత జాతీయ భావాలు ప్రేరణగా మేమంతా చేరాము. అంతకు ముందు స్వామి వివేకానంద ఆలోచనలు స్ఫూర్తిని నింపితే సంఘ్ వాటినే సమ్మిళితం చేసుకుని ముందుకు సాగింది. రోజువారీ సంఘ్ నిర్వహించే శాఖల ద్వారా సంవేదన, సంఘటిత సామర్థ్యం, సమాజంతో కలిసి నడవడం వంటివి అలవడుతున్నాయి. హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మా శాఖకు ముఖ్యసూచిగా నాకంటే ఒక ఏడాది సీనియర్. మా అన్నయ్య ఆయనకు సీనియర్. తర్వాత ఉమ్మడి ఏపీలో విశాఖలో పదేళ్లు, విజయవాడలో 23 ఏళ్లు, హైదరాబాద్లో ఐదేళ్లు, బెంగళూరులో ఆరేళ్లు, పశ్చిమబెంగాల్లో 12 ఏళ్లు, గత మూడేళ్లుగా గువాహతి కేంద్రంగా అస్సాంలో పనిచేస్తున్నాను. దేశవ్యాప్తంగా అనేక బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా దేశ ప్రజల్లో ఏకాత్మత అనేది కనిపించింది. ఈ విధంగా జాతీయత ఆధారంగా అసంఘటిత శక్తి నిర్మాణమైంది. ఎమర్జెన్సీలో 13 నెలలు అండర్గ్రౌండ్లో ఉండి ఆ తర్వాత మీసా కింద అరెస్ట్ అయ్యి ఆరునెలలు జైళ్లో ఉన్నాను. ఎమర్జెన్సీ తర్వాత సేవా కార్యక్రమాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం గ్రామ వికాసం, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులు, స్వదేశీ భావాల వ్యాప్తి తదితరాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో ఓ పెద్దశక్తిగా సంఘ్ పనిచేస్తోంది. వ్యక్తిగత, కుటుంబస్థాయిలలో సామాజిక పరివర్తన కోసం కృషి సాగుతోంది. జాతీయత, హిందుత్వం ఆధారంగా...‘వర్కింగ్ టుగెదర్ సెపరేట్లీ’ అనే నినాదంతో కూడా ముందుకెళుతున్నాము. మతం ఆధారంగా కాకుండా జాతీయత, మాతృభూమి ఆధారంగా సమాజనిర్మాణం జరుగుతుందని వ్యవస్థాపకులు హెడ్గేవార్ నుంచి సంఘ్ నమ్ముతోంది. – భాగయ్య, అఖిల భారత కార్యకారిణి సభ్యులు, ఆర్ఎస్ఎస్ఇదీ వందేళ్ల పరిణామక్రమం...» 1925లో నాగపూర్లో కేశవ్ బాలీరామ్ హెడ్గేవర్ ఆధ్వర్యంలో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఆరంభంలో ఒక చిన్న వలంటీర్ సంఘంగా మొదలై, ఆ తరువాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన పెద్ద సామాజిక–రాజకీయ శక్తిగా ఎదిగింది» 1930లలో ఆర్ఎస్ఎస్ తన శాఖల రూపంలో విస్తరణ» 1939లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా వీటి ద్వారా యువతను శారీరక–మానసికంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది» 1940లో మహారాజ్ భగవత్ వంటి నేతలు సంఘ విస్తరణలో ప్రధాన పాత్ర పోషించారు» 1947–1950: స్వాతంత్య్రం తర్వాత కాలం» మహాత్మాగాంధీ హత్య (1948) తరువాత ఆర్ఎస్ఎస్పై నిషేధం విధింపు (మొదటిసారి నిషేధం)» అనంతరం కొత్త రాజ్యాంగానికి లోబడి సంఘాన్ని కొనసాగించేందుకు ప్రతిజ్ఞ, తద్వారా నిషేధం ఎత్తివేత» 1950–1960 దశకంలో సంఘ్ సేవా కార్యక్రమాలు విస్తరణ» 1960–63 మధ్య చైనా యుద్ధం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సేవలో పాల్గొన్నారు»1965 ఇండో–పాక్ యుద్ధ సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.» 1975–77: అత్యవసర పరిస్థితి» ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్ఎస్ఎస్పై మళ్లీ నిషేధం (రెండోసారి నిషేధం–వేలాది మంది స్వయంసేవకులు జైలు జీవితం» 1980–1990...మొదట జనసంఘ్, తరువాత బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుదల» 1992లో అయోధ్య రామజన్మభూమి ఉద్యమం సమయంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది» 1992లో బాబ్రీమసీదు కూలిన సందర్భంగా మూడోసారి నిషేధం» 2000ల నుంచి ఇప్పటివరకు...విద్య, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ విస్తృత కార్యకలాపాలు కొనసాగిస్తోంది» దేశ రాజకీయాల్లోనూ, ప్రత్యేకించి రాజకీయంగా బీజేపీ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర» 2020–21 – కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సహాయక చర్యలు» 2022–75వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆర్ఎస్ఎస్ శాఖల ప్రత్యేక కార్యక్రమాలు» 2025 – ఆర్ఎస్ఎస్ శతాబ్ది దిశగా అడుగులు. 100 ఏళ్ల పూర్తి వేడుకల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు -
కాళేశ్వరం పునరుద్ధరణకు డిజైన్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడా నికి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ బరాజ్ల పున రుద్ధరణ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించాలని కోరింది. బరాజ్ల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బరాజ్లకు ఉన్న సామర్థ్యం మదింపు, గేట్లు/ పియర్లు/ స్టిల్లింగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి బరాజ్లలోని కీలక విభాగా లను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించడం వంటి సేవలను అందించాలని పేర్కొంది. ప్రస్తుత డిజైన్లను పునఃసమీక్షించండి: బరాజ్ల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని కోరింది. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ద్వారా బరాజ్లలో ఉన్న అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బరాజ్లో కుంగిన 7వ బ్లాకును సుస్థిరం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్కు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆసక్తి గల సంస్థ/జాయింట్ వెంచర్ కంపెనీ గత 15 ఏళ్లలో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఇలాంటి పనులు చేసి ఉండాలంటూ అర్హతలను నిర్దేశించింది. -
మురిపించిన ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఈసారి నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలనిచ్చాయి. జోరు వానలతో సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత వారానికి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై మూడోవారం వరకు అదే పరిస్థితి కొనసాగింది. తర్వాత రుతుపవనాలు రాష్ట్రంపై అత్యంత చురుకుగా కదలటంతో మోస్తరు నుంచి భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పైకి ఎగబాకాయి. సీజన్ ముగిసేనాటికి సాధారణాన్ని దాటి అధిక వర్షపాతానికి చేరింది.33 శాతం అధిక వర్షపాతంజూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కాలాన్ని నైరుతి సీజన్గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్లో నాలుగు నెలల్లో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సీజన్ ముగిసే నాటికి ఈసారి 98.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు కంటే 33 శాతం అధికంగా నమోదైంది. గతేడాది నైరుతి సీజన్లో 96.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... ఈ సీజన్లో 3 శాతం అధికంగా నమోదైంది. నైరుతి సీజన్ తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో గణాంకాలు భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 84 శాతం నీటి వనరులతో పూర్తిగా నిండినట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రెండోవారంలోగా ఉపసంహరణప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ నెల రెండోవారం నాటికి రాష్ట్రం నుంచి నైరుతి విరమణ పూర్తవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విరమణ సమయంలోనూ వర్షాలు ఆశాజనకంగా ఉండనున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ వరకు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని చెబుతోంది.33 జిల్లాల్లో వానలు సంతృప్తికరంగా కురిశాయి. 7 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయి. 128 మండలాల్లో అత్యధిక వర్షాలు, 299 మండలాల్లో అధికం, 191 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 3 మండలాల్లో మాత్రం సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. అత్యధిక వర్షాలు: మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కామారెడ్డి, వనపర్తిఅధిక వర్షాలు: నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిర్మల్, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం.సాధారణ వర్షాలు: నిజామాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి -
మూసీ.. అందాల రాశి!
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి.. త్వరలోనే మూసీ సమగ్రాభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మూసీ 55 కి.మీ. మేర ప్రవహిస్తుండగా..తొలి దశలో 20.5 కి.మీ. మేర నదిని పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జంట జలాశయాలైన హిమాయత్సాగర్, గండిపేటల నుంచి బాపూఘాట్ వరకు రూ.5,641 కోట్ల వ్యయంతో మూసీ నది సుందరీకరణ చేపట్టనున్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ! తొలి దశ మూసీ అభివృద్ధి పనుల కోసం రుణం మంజూరు చేసేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సుముఖత వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీతీర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఇందుకోసం ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. తొలి దశలో 20.5 కి.మీ. అభివృద్ధి చేసేందుకు రూ.5,641 కోట్ల వ్యయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫేజ్–1ను రెండు సబ్ ఫేజ్లుగా విభజించిన అధికారులు ఫేజ్–1ఏలో హిమాయత్సాగర్ టు బాపూఘాట్ వరకు 9.5 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్సాగర్ టు బాపూఘాట్ వరకు 11 కి.మీ. అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏ కింద రూ.2,500 కోట్లు, ఫేజ్–1బీ కింద రూ.3,141 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. అంచనా వ్యయంలో రూ.4,100 కోట్లు ఏడీబీ నుంచి రుణం రూపంలో పొందనుండగా.. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనుంది. 493 ఎకరాలు అవసరం మూసీ తొలి దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి 493 ఎకరాల (199.89 హెక్టార్లు) భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 340 ఎకరాలు (137.72 హెక్టార్లు) పట్టా భూములు కాగా.. మిగిలిన 153 ఎకరాలు (62.17 హెక్టార్లు) ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. భూ సేకరణ, పునరావాసం, నాణ్యమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం (ఆర్ఎఫ్సీటీఎల్ఏఆర్ఆర్)–2013 కింద భూ సేకరణ చేపట్టనున్నారు. సేకరించే భూమిలో మూసీ చుట్టూ గ్రీన్ బెల్ట్ కోసమే సుమారు 270 ఎకరాలు (109.42 హెక్టార్లు) కేటాయించనున్నారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్లు మూసీకి పునరుజ్జీవం కల్పించాలంటే తొలుత ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నదిలో 2 మీటర్ల లోతు వరకు వ్యర్థాలు, పూడిక తీయనున్నారు. నదికి ఇరువైపలా రిటైనింగ్ వాల్లను నిర్మిస్తారు. ఆ తర్వాత నదిలోకి గోదావరి జలాలను వదులుతారు. ఈ నీళ్లు 24/7 ఉండేలా చూస్తూ గండిపేట నుంచి బాపూఘాట్ వరకు బోటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. నది సరిహద్దుల నుంచి 20 మీటర్ల వెడల్పు వరకు గ్రీన్ బెల్ట్ ఉంటుంది. ఇందులో గ్రీనరీ పెంపకంతో పాటు వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. వరదల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ నదికి ఇరువైపులా 50 మీటర్లు బఫర్ జోన్గా అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేస్తారు. మరోవైపు మూసీ వరదలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బఫర్ జోన్లో వరద నియంత్రణ కాల్వలు, నాలాలు, పంపింగ్ స్టేషన్లు, వరద నియంత్రణ గోడలు, వరద పర్యవేక్షణ భవనాలు, వరద నిరోధక డెక్ల వంటి పటిష్టమైన మౌలిక సదుపాయాలుంటాయి. త్వరలో ‘మూసీ ఉద్యోగాల’ భర్తీ మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్మాణ దశలో 100 శాశ్వత పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన 3 వేల మంది ఉద్యోగులను నియమించనున్నారు. కార్యాచరణ దశలో 200 శాశ్వత పోస్టులతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన మరో 200 పోస్టులు ఏర్పాటు చేసి నియామకాలు జరుపుతారు. మూసీని నైట్ (రాత్రి) ఎకానమీగా, అదనపు ఆదాయాన్ని సమకూర్చే వనరుగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు మూసీ చుట్టూ యాంఫీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లు, వీధి విక్రేతల దుకాణాలు, కియోస్్కలు వంటి వ్యాపార, వాణిజ్య నిర్మాణాలను చేపడతారు. లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్ స్పోర్ట్స్, మేళాలు, సాంస్కృతిక వేదికలు కూడా ఉంటాయి. -
విషాదంగా ముగిసిన మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు
సాక్షి,హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో సైబర్ నేరాలు.. సాఫ్ట్ టార్గెట్గా హైదరాబాద్?
భాగ్య నగరంలో సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నాయా..? ఈ–కేటుగాళ్లకు హైదరాబాద్ సాఫ్ట్ టార్గెట్గా మారుతోందా..? ఔననే అంటున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వర్గాలు. 2023కు సంబంధించిన డేటాను ఎన్సీఆర్బీ (NCRB) మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం సైబర్ నేరాల నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2023లో 4,855 కేసులు నమోదయ్యాయి. 17,631 కేసులతో మొదటి స్థానంలో బెంగళూరు ఉండగా.. 4,131 కేసులతో ముంబై మూడో స్థానంలో ఉంది. 2022లో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ (Hyderabad) ఏడాదిలోనే రెండో స్థానానికి వెళ్లింది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కేసులే అత్యధికం.. హైదరాబాద్లో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధిత మోసాల కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. 2,858 సంఖ్యతో మొత్తం కేసుల్లో 58.86 శాతం ఇవే ఉన్నట్లు ఎన్సీఆర్బీ స్పష్టం చేస్తోంది. బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేసే సైబర్ నేరగాళ్లు వినియోగదారులను నిండా ముంచుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు అప్డేట్ చేయాలని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) తప్పనిసరి అంటూ నమ్మిస్తున్నారు. ఈ పేర్లతో వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత వివరాలు, వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సంగ్రహిస్తున్నారు. వీటిని వినియోగించి ఎదుటి వారి ఖాతాలను గుల్ల చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఏటీఎం కార్డులు, కేంద్రాలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. 2023లో నగర వ్యాప్తంగా ఈ తరహా కేసులు 211 నమోదయ్యాయి. ‘క్లూ’ దొరకని కేసులే అధికం.. ఈ సైబర్ నేరాల్లో (Cyber Crimes) బాధితులు మోసపోవడం ఎంత తేలికో.. కేసు కొలిక్కి రావడం, నగదు రికవరీ అంత కష్టం. అత్యధిక కేసుల్లో దర్యాప్తు ముందుకు వెళ్లడానికి కనీసం ఒక్క ఆధారం కూడా దొరకదు. ఈ సైబర్ నేరగాళ్లు నేరాలు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు తమ పేర్లు, వివరాలతో లేకుండా నేరం చేస్తారు. వీళ్లు వినియోగించే ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ కూడా దర్యాప్తు సంస్థలకు తెలియకుండా ఉండేందుకు ప్రాక్సీ సర్వర్లు వినియోగిస్తారు. కొందరు పాత్రధారుల, దళారులు మినహా సూత్రధారులు అంతా విదేశాల్లోనే తిష్ట వేస్తుంటారు. అక్కడి వివరాలు సేకరించడానికి ఇక్కడి పోలీసులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఈ కారణంగానే అత్యధిక కేసుల్లో ఆధారాలు సేకరించడం పోలీసులకు సాధ్యం కావట్లేదు. దీంతో బాధితుడు మోసపోవడం, నష్టపోవడం నిజమైనప్పటికీ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. 2023లో నగరంలో నమోదైన 4,855 కేసుల్లో 2733 (56.29 శాతం) ఆధారాలు లేకపోవడంతో క్లోజ్ అయ్యాయి. ప్రతి ఫిర్యాదునూ నమోదు చేస్తున్నాంభవిష్యత్తులో సైబర్ నేరాలు, ఉగ్రవాదమే పెను సవాల్గా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదు చేస్తున్నాం. ఆర్థిక సంబంధిత నేరాల్లో రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన కేసులను సైబర్ క్రైమ్ ఠాణాలో, మిగిలిన వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయిస్తున్నాం. కొన్ని సున్నితమైన కేసుల్లో ఒకప్పుడు బాధితులు.. ప్రధానంగా మహిళలు బయటకు వచ్చి ఫిర్యాదు చేసేవాళ్లు కాదు. ఇటీవల కాలంలో అవగాహన పెరిగిన కారణంగా ఈ పరిస్థితి లేదు. దీంతో ప్రతి ఏడాది నగరంలో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలేజీలు, స్కూళ్ల వరకు వెళ్తున్నాం. – నగర పోలీసు అధికారిచదవండి: ఎన్సీఆర్బీ 2023 రిపోర్ట్.. పూర్తి వివరాలు -
Hyderabad మద్యం లారీలో మంటలు.. బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్లో మద్యం లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై లారీని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలు మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోగా.. మరో వైపు మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. -
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
బోరబండ యువకుల 'డాక్టర్ గార్డ్' కంపెనీ.. ఫస్ట్ కస్టమర్ కేటీఆరే!
హైదరాబాద్: తెలంగాణ యువతరాన్ని ఎప్పుడూ స్ఫూర్తి నింపడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) మాటలు మరోసారి నిజమయ్యాయి. 'ఉద్యోగాలు అడిగే వారుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఉండాలి' అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన బోరబండకు చెందిన తొమ్మిది మంది యువకులు కలిసి 'డాక్టర్ గార్డ్' పేరుతో వాటర్ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు.ఉద్యోగ ప్రదాతలుగా యువకులు: యువ మిత్రులు ప్రారంభించిన కంపెనీ ప్రాంగణాన్ని వారి కోరిక మేరకు కేటీఆర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా యువకులతో మాట్లాడిన కేటీఆర్.. ఉద్యోగాలు అడగడం కాకుండా, పది మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో వీరు ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. జేఎన్టీయూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు 'డాక్టర్ గార్డ్' బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినప్పటికీ, తమ కళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఒక సంవత్సరంలోగానే ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకపోయే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు కేటీఆర్కు వివరించారు. తమ వాటర్ప్రూఫ్ సొల్యూషన్స్లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను, టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకువచ్చినట్లు యువకులు కేటీఆర్కు తెలిపారు.కంపెనీకి మొదటి కస్టమర్గా కేటీఆర్కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ బృందంలోని సోదరుడు ఇమ్రోజ్ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పంపి, కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాము కంపెనీని ప్రారంభించామని, తాము సాధించిన చిన్నపాటి కార్యకలాపాలను సందర్శించి తమకు మరింత స్ఫూర్తిని ఇవ్వాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.యువకుల ప్రయత్నం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్, తమ కంపెనీకి మొదటి కస్టమర్గా తానే ఉంటానని సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్కు సంబంధించిన వాటర్ప్రూఫ్ పనులను వారికి అప్పగించారు. 24 ఏళ్ల లోపు వయసున్న ఈ మిత్ర బృందం ఎలాంటి నిరుత్సాహం లేకుండా తమ ఆలోచన పట్ల గొప్ప స్ఫూర్తితో ముందుకు పోతున్నారని కేటీఆర్ ప్రశంసించారు.చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం విజయం సాధిస్తుంది..ఎలాంటి ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకున్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్ పెయింట్స్ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తిని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ తెలిపారు. 'డాక్టర్ గార్డ్' భవిష్యత్తులో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మిత్ర బృందం ప్రయత్నాన్ని చూసి మరింత మంది యువత ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.తమ కార్యాలయానికి విచ్చేసిన కేటీఆర్ గారికి 'డాక్టర్ గార్డ్' బృందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆయన స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు. -
దసరాకు ఆకుకూరలేనా!
దుద్యాల్: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. విజయదశమి రోజు జంతుబలి, మాంసం ఒండుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మద్యం విక్రయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు జంతు బలులు నిషేధం. మద్యం విక్రయించరు. ఈ రెండూ దసరా రోజు దొరికే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ సారి పండుగను ఆకుకూరలతో జరుపుకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే అక్టోబర్ 2వ తేదీ మాంసం దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజు(అక్టోబర్ ఒకటవ తేదీ) మాంసం తీసుకెళ్లాలని దుకాణ యజమానులు బోర్డులు ఉంచారు. మాంసం విక్రయించొద్దు తాండూరు: మున్సిపల్ పరిధిలోని మాంసం దుకాణాలు, హోటళ్లను అక్టోబర్ 2న మూసి ఉంచాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తాండూరులో మాంసం విక్రయాలు జరప రాదన్నారు. నిబంధనలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధన పాటించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని మాంసం దుకాణ యజమానులకు, హోటల్ నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. -
రెడ్ బుక్, పింక్ బుక్ మాకు ఉండదు! మాకు తెలిసిందల్లా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 6వ డీజీపీగా శివధర్రెడ్డి(Telangana New DGP Shivadhar Reddy) బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారాయన. ఈ సందర్భంగా తనను నియమించిన సీఎం రేంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) సజావుగా నిర్వహించడమే మా లక్ష్యం. మాకు బలమైన టీమ్ ఉంది. ఈ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఎన్నికల భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తాం. టెక్నాలజీని మరింత సమర్థవంతగా వినియోగించుకుంటాం. మావోయిస్ట్ విధానాలు సక్సెస్ కాలేదు. ఆ విధానాలు ఆచరణలో విఫలం అయ్యాయి. పోరాట మార్గం వీడతామని గతంలో వాళ్లు లేఖలు రాశారు. అడవుల నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. మావోయిస్టులను స్వచ్చందంగా లొంగిపోవాలని సూచిస్తున్నా... శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. అలాగేని ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలే ఉంటాయి. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా పోస్టులు పెడితే ఊరుకోం. మాకు రెడ్ బుక్, పింక్ బుక్ ఉండదు.. మాదీ ఖాకీ బుక్(Khaki Book) అని స్పష్టం చేశారాయన. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలంగాణ పౌరులను కోరారాయన. తెలంగాణ పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయన్న నూతన డీజీపీ.. వాటి నియామకంపై ఫోకస్ పెడతామని తెలిపారు. ఇదీ చదవండి: కాళేశ్వరం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం -
కాళేశ్వరంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం(kaleshwaram Project) ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చిన డిజైన్ టెండర్లను ప్రభుత్వం సీల్డ్ కవర్లో పెట్టనుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం ఓపెన్ చేయనుంది. కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం అందుకుంది.ఇక, ఎన్డీఎస్ఏ ప్రకారం, వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పోలీసుల పైకి కుక్కను వదిలారు..
హైదరాబాద్: మద్యం మత్తులో న్యూసెన్స్కు పాల్పడుతుండగా డయల్ 100 కాల్తో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసుల పైకి కుక్కలను వదిలిన ఓ న్యూస్ రిపోర్టర్తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని అరోరా కాలనీలో ఓ ఇంటి టెర్రస్పై 20 మందికి పైగా యువకులు అర్ధరాత్రి దాకా మద్యం సేవిస్తూ గాలిలోకి మద్యం బాటిళ్లను విసురుతూ, పగులగొడుతూ గోల చేస్తుండగా చుట్టుపక్కల నివాసితులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్కుమార్, నైట్ డ్యూటీ ఎస్ఐ సంధ్యారాణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ జరుగుతున్న ఇంటి టెర్రస్ పైకి వెళ్లడానికి యతి్నంచగా వీరి పైకి కుక్కను వదిలి విధులను అడ్డుకున్నారు. దీనిపై బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ న్యూస్ రిపోర్టర్ సహా అజయ్, శివ, రవి తదితరులపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 126 (2), 291, 292, 352, 189 (5) కింద కేసు నమోదు చేశారు. తాము ఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో సుమారు 20 మంది వరకు తమను అడ్డుకోవడంతో పాటు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేయగా తన చేతికి గాయమైందని కానిస్టేబుల్ భరత్కుమార్ ఆరోపించారు. తాము ఘటనా స్థలం నుంచి మెట్టుదిగే క్రమంలో మరోసారి 10–15 మంది వరకు తమను చుట్టుముట్టి దుర్బాషలాడుతూ యూనిఫాం తీసేసి అవమానిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరిలో కుమార్ అనే వ్యక్తి తాను న్యూస్ చానల్ రిపోర్టర్నంటూ తీవ్రంగా దుర్బాషలాడాడని అజయ్, శివ, రవి సహా మరికొందరు కూడా తోడయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
VC Sajjanar: అప్పట్లో అరుదైన ఘట్టాలు...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు 62వ పోలీసు కమిషనర్గా విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (టీజీఐసీసీసీ) ఉన్న నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తన చాంబర్లో సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. టీజీఐసీసీసీ ఆవరణలో ఆయన శాంతి, స్వేచ్ఛకి సూచికంగా కొన్ని పావురాలను గాల్లోకి ఎగురవేశారు. కొత్త కొత్వాల్లు నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు కలిసి అభినందించారు. బదిలీపై వెళ్తున్న సీవీ ఆనంద్ సైతం సజ్జనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పట్లో అరుదైన ఘట్టాలు... నగర పోలీసు కమిషనరేట్కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ 1948 సెపె్టంబర్లో జరిగిన ఆపరేషన్ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 మంది పోలీసు కమిషనర్లుగా (కొందరు రెండేసి సార్లు విధులు నిర్వర్తించారు) పని చేశారు. అయితే కేవలం రెండు సందర్భాల్లోనే ఒకే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పనిచేశారు. 1990లో మాత్రం అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954 మే 14 వరకు ఈ స్థానంలో పని చేసిన ఎ.సుందరం పిళ్లై పదవీ విరమణ చేశారు. దీంతో ఆ మరుసటి రోజు బీఎల్ ఖేద్కర్ నగర కొత్వాల్గా బాధ్యతలు తీసుకుని సెప్టెంబర్ 25 వరకు పని చేసి రిటైర్ కావడంతో సి.రంగస్వామి అయ్యర్ పోలీసు కమిషనర్గా వచ్చారు.1989 ఫిబ్రవరి 15 నుంచి 1990 మే 4 వరకు వి.అప్పారావు పోలీసు కమిషనర్గా పని చేసి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి వచి్చన ఐ.పుల్లన్న అదే ఏడాది ఆగస్టు 15 వరకు విధులు నిర్వర్తించారు. మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన జి.గుర్నాథ్రావు అదే ఏడాది నవంబర్ 28 వరకు.. ఆ తర్వాత ఎంవీ భాస్కర్రావు కొత్వాల్ అయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదో సీపీ... వీసీ సజ్జనర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు ఏడో సీపీ. 2014 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మారగా...వీరిలో ఆనంద్ రెండుసార్లు పని చేశారు. తొలి కొత్వాల్ ఎం. మహేందర్రెడ్డి 2017 నవంబర్ 11న బదిలీ కావడంతో ఆయన స్థానంలో వీవీ శ్రీనివాసరావు 2017 నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఈయన నుంచి అంజనీకుమార్ 2018 నవంబర్ 12న చార్జ్ తీసుకోవడం ఇద్దరూ ఒకే తేదీన బాధ్యతలు స్వీకరించిన వారయ్యారు. 2023 ఏడాది అక్టోబర్ 13న సందీప్ శాండిల్య..అదే ఏడాది డిసెంబర్ 13న కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. గత ఏడాది సెప్టెంబర్ 08న ఆయన్ను బదిలీ చేసిన సర్కారు సీవీ ఆనంద్ను మరోసారి పోలీసు కమిషనర్గా నియమించింది. ఆనంద్ సైతం బదిలీ కావడంతో మంగళవారం సజ్జనర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇలా 2023–2025 మధ్య నగరానికి నలుగురు అధికారులు (సీవీ ఆనంద్ రెండుసార్లు) ఐదుసార్లు కొత్వాల్గా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన కొన్నేళ్లల్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్గా అతితక్కువ కాలం పని చేసింది సందీప్ శాండిల్య కావడం గమనార్హం. -
దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీజులు డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ (22) షేక్పేటలోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడ చేరినప్పటినుంచి డింపుల్, డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా రోజూ హింసిస్తున్నారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నంమంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కిందపడేసి పగలగొట్టాడని పేర్కొంది. తన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని భయాందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గల్ఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. యురేఖ, ఖిలాడి, రామబాణం సినిమాలు చేసింది. గద్దలకొండ గణేశ్లో స్పెషల్ సాంగ్లో మెరిసింది.చదవండి: నవంబరులో కొదమసింహం -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు. భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్ లేన్లోని ఆకాశ్ హోటల్ రూమ్ నెంబర్ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్మెంట్ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్రూమ్ డోర్ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు. పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
కుటుంబ సమస్యలే.. ఉరితాళ్లు
దేశంలో 2023లో మొత్తం 1,71,418 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2022తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. గత 5 ఏళ్లుగా చూస్తే.. ఏటా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) 2023వ సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కుటుంబ సమస్యలు, తట్టుకోలేని అనారోగ్య సమస్యలు; మాదక ద్రవ్యాలు, మద్యానికి బానిసలు కావడం, ప్రేమ వ్యవహారాలు, అప్పుల భారం, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్ కావడం.. ఇలా అనేక కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. మొత్తం మరణించినవారిలో దాదాపు 33 శాతం.. 18–30 ఏళ్లలోపు వారే. 2022తో పోలిస్తే (34.56 శాతం) ఇది తక్కువ. 2022లో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6 శాతం కాగా, 2023లో ఇవి 8.1 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తం మృతుల్లో 72.7 శాతం పురుషులు కాగా, 27.2 శాతం మహిళలు.టాప్ 10 రాష్ట్రాలు2021, 2022, 2023.. ఈ మూడు సంవత్సరాల్లోనూ ఆత్మహత్యల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్. మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 34 శాతం ఈ రాష్ట్రాల్లోనే జరిగాయి.అనేక కారణాలుదేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.. కుటుంబ సమస్యలే. అనారోగ్య సమస్యలను తట్టుకోలేక మరణాన్ని ఆశ్రయించేవారూ ఎక్కువగానే ఉన్నారు. పై రెండు కారణాలవల్లే దాదాపు 51 శాతం ఆత్మహత్యలు జరిగాయి.వృత్తి / ఉద్యోగాల పరంగా..: ఆత్మహత్యలు చేసుకున్నవారిలో గృహిణులు 14 శాతం కాగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు 6.3 శాతం. నిరుద్యోగులు 8.3 శాతం కాగా, విద్యార్థులు 8.1 శాతం. రోజువారీ కూలీలు అత్యధికంగా 27.5 శాతం ఉన్నారు.ఉరివేసుకుని..: ఆత్మహత్యల్లో అత్యధికంగా సుమారు 61 శాతం ఉరివేసుకుని మరణించారు. విషం తాగి 25 శాతం మంది, నీట మునిగి 4.1 శాతం, వాహనాల కింద పడి 2.8 శాతం మంది ప్రాణాలు తీసుకున్నారు. -
చేయూత ఇవ్వండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రికార్డుస్థాయిలో అత్యధికంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం తక్షణమే కొనుగోలు కోటాను పెంచి, డెలివరీ నిబంధనలు సడలించి అదనపు గోదాములు, రైళ్ల సదుపాయం కల్పించాలని కోరారు. ‘ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఒకే సీజన్లో ఈస్థాయిలో వరి కొనుగోలు చేయలేదు. గత రికార్డు 67 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈసారి 80 లక్షల టన్నులు కొనుగోలు అవుతాయి. అందులో 45–50 లక్షల టన్నులు సన్నాలు, 30–35 లక్షల టన్నులు దొడ్డురకాలు’ అని ఉత్తమ్ చెప్పారు. వరి మద్దతు ధర క్వింటాల్కు రూ.2,389గా ఉండటంతో ఖర్చు రూ.20 వేల కోట్లకుపైగా అవుతుందని, బోనస్, రవాణా వ్యయాలు కలిపి రూ.24–26 వేల కోట్లు అవుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఒకే పంటకు ఇంత భారీగా ఖర్చు చేయలేదని స్పష్టంచేశారు. సీఎంఆర్ డెలివరీపై అభ్యంతరం కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ గడువు నవంబర్ 12 వరకు పొడిగించినా, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం ఆదేశించడంపై ఉత్తమ్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఖరీఫ్ వరి రా రైస్కి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 7.80 లక్షల టన్నుల రా రైస్ మిల్లర్ల వద్ద ఉంది. 1.67 లక్షల టన్నుల వరి (సుమారు 1.13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్) మాత్రం బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉంది. రా, బాయిల్డ్ రైస్ రెండూ అందించేలా అనుమతించాలి. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్కి మార్చాలి’ అని చెప్పారు. ఇక ఖరీఫ్ 2024–25 నుంచి 5.44 లక్షల టన్నుల సీఎంఆర్, రబీ 2024–25 నుంచి 14.92 లక్షల టన్నుల సీఎంఆర్ ఇంకా డెలివరీ కాని స్థితిలో ఉన్నాయన్నారు. దీనివల్ల మిల్లులు మూతపడటంతో కూలీలు పనిలేక వదిలి వెళ్తున్నారని తెలిపారు. గోదాముల సంక్షోభం రాష్ట్రంలో ఎఫ్సీఐ నిల్వ సామర్థ్యం 22.61 లక్షల టన్నులు కాగా, ఇప్పటికే 21.72 లక్షల టన్నులు నిండిపోయి, కేవలం 0.89 లక్షల టన్నుల పట్టే స్థలం మాత్రమే ఖాళీగా ఉందని ఉత్తమ్కుమార్ తెలిపారు. నెలకు కనీసం 300 రైళ్లు అదనంగా కేటాయించి గోదాములు ఖాళీ చేయాలని, అదనపు గోదాములను ఎఫ్సీఐ అద్దెకు తీసుకోవాలని చెప్పారు. 2025–26 కొనుగోలు సీజన్లో వరి ఉత్పత్తి 148.30 లక్షల టన్నులుగా అంచనా వేసినప్పటికీ, కేంద్రం కేవలం 53.73 లక్షల టన్నుల వరి (36 లక్షల టన్నుల బియ్యం) కొనుగోలుకే ఆమోదం తెలిపిందన్నారు. ‘10 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేయాలి. మొత్తం లక్ష్యాన్ని 80 లక్షల టన్నుల వరి (53.60 లక్షల టన్నుల బియ్యం)కి పెంచాలి. లేకుంటే రైతులు నష్టపోతారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎఫ్సీఐ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద బియ్యాన్ని కిలోకు రూ.24కి అమ్ముతున్నందున, రైతులు పంటను కేవలం రూ.16–17కే విక్రయించాల్సి వస్తోందని, దీంతో ప్రైవేట్ కొనుగోళ్లు దెబ్బతింటున్నాయని ఉత్తమ్కుమార్ అన్నారు. -
సైబర్ నేరాల్లో రెండో స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : సైబర్నేరాల నమోదులో తెలంగాణ జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2023లో కేసుల సంఖ్య 18,236కి చేరినట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2023 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశవ్యాప్తంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ⇒ తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు సైతం స్వల్పంగా పెరిగాయి. 2022లో 937 హత్య కేసులు నమోదు కాగా..2023లో 954 కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక నేరాల్లోనూ తెలంగాణ జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2022లో 26,321 కేసులు, 2023లో 26,881 కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. -
హత్యలు తగ్గాయి.. కిడ్నాప్లు పెరిగాయి..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2023లో నేరాల్లో 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అన్ని రకాల నేరాలు కలిపి దేశవ్యాప్తంగా 2022లో 58,24,946 కేసులు నమోదు కాగా..2023లో 62,41,569 కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) 2023 నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది నమోదైన వాటిల్లో 27,53,235 కేసుల్లో చార్జ్ïÙట్ పూర్తయింది. ప్రతి లక్ష మంది జనాభాకు 2022లో 422.2గా ఉన్న నేర నమోదు శాతం..2023లో 448.3కి పెరి గినట్టు గణాంకాలు వెల్లడించాయి.తెలంగాణలో 2022లో 1,65,830 కేసులు నమోదు కాగా, 2023 నాటికి అది 1,83,644కి చేరినట్టు నివేదిక పేర్కొంది. ఈ మేరకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2023 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం దేశవ్యాప్తంగా పలు రకాల నేరాలకు సంబంధించిన గణాంకాలు ఇలా.. హత్యలు తగ్గాయి 2023లో మొత్తం 27,721 హత్య కేసులు నమోదదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 2.8 శాతం తగ్గుదల కనిపించింది. హత్య కేసుల్లో అత్యధికంగా వివాదాలు (9,209 కేసులు) ప్రధాన కారణంగా ఉన్నాయి, ఆ తర్వాత ‘వ్యక్తిగత శత్రుత్వం లేదా ద్వేషం’(3,458 కేసులు), ‘వ్యక్తిగత లబ్ధి లేదా లాభం (1,890 కేసులు) కారణంతో జరిగాయి. 5.6 శాతం పెరిగిన కిడ్నాప్ కేసులు 2022, 1,07,588 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2023లో 1,13,564 కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 5.6% పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2023లో కిడ్నాపైన వారిలో 1,40,813 మంది జాడను పోలీసులు గుర్తించగా, వీరిలో 1,39,164 మంది బతికి ఉన్నారు. మరో 1,649 మంది చనిపోయినట్టు గుర్తించారు. మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 2022లో 4,45,256 కేసులు నమోదు కాగా..2023లో 4,48,211 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో భర్త లేదా అత్తింటివారి దాడులకు సంబంధించి 1,33,676 కేసులు, మహిళల కిడ్నాప్నకు సంబంధించి 88,605 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి 83,891 కేసులు, పోక్సో యాక్టు కింద 66,232 కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై నేరాల నమోదులో 9.2 శాతం పెరుగుదలచిన్నారులపై నేరాల నమోదులో 2022తో పోలిస్తే 2023లో 9.2 శాతం పెరిగింది. 2023లో పిల్లలపై మొత్తం 1,77,335 నేరాలు నమోదయ్యాయి. వీటిలో పిల్లల కిడ్నాప్నకు సంబంధించినవి 79,884 కేసులు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద 67,694 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదు సైబర్ నేరాల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. 2022తో పోలిస్తే 2023లో సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 86,420 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 2023లో నమోదైన వాటిలో 68.9 శాతం మోసం, లైంగిక దోపిడీ 4.9 శాతం కేసులు, దోపిడీ 3.8శాతం కేసులు ఉన్నాయి. ఆరు శాతం పెరిగిన ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే..ఆరు శాతం పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ 2023 నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం 2,04,973 కేసులు నమోదయ్యాయి. వీటిలో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, మోసం కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఎంతో ఆలస్యంగా నివేదిక..: ఎన్సీఆర్బీ నివేదిక ‘క్రైం ఇన్ ఇండియా’సాధారణంగా ఏడాది మధ్యలో విడుదల చేస్తారు. కానీ, 2023 నివేదికల ప్రచురణ చాలా ఆలస్యమైంది. డేటా సేకరణలో ఆలస్యం కారణంగానే 2023 నివేదిక ఆలస్యం అవుతోందని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక సైతం డిసెంబర్ 2023లో విడుదలైంది. -
స్థానిక పోరులోకి పార్టీలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలనే లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు సర్వ శక్తులూ కూడదీసుకుంటున్నాయి. ఇతర పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి నిలిపాయి. 70–80 శాతం సీట్లు గెలిచేలా..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కనీసం 70 నుంచి 80 శాతం స్థానాలు సాధించి మిగతా పార్టీలపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, కచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ ఎన్నికల కోసం జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు తీసుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ బలపరిచేవారిని గెలిపించే పూర్తి బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలపైనే మోపేందుకు అధిష్టానం సిద్ధమైంది.ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జిల్లా కమిటీలను వేసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, సాదా బైనామాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన తదితరాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోనుంది. గత బీఆర్ఎస్ పాలన తీరును ఈ ఎన్నికల్లో ఎండగడతామని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి స్థానిక అంశాలపై కూడా ప్రధానంగా దృష్టిపెడతామని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను లేవనెత్తి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ప్రజలకు చూపించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటే, కాంగ్రెస్ వాటన్నింటినీ నిర్లక్ష్యం చేసిందని ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహంతోమంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసాన్ని ముఖ్యనేతలు వ్యక్తంచేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఎన్నికల కసరత్తు చేపట్టేలా టెలి కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలవారీగా ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర పథకాలపైనే ఆశలు స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా కేంద్ర పథకాలపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశంగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.కేంద్ర పథకాల వల్ల తెలంగాణకు వివిధ రూపాల్లో లభించిన ప్రయోజనాలు, వివిధ శాఖలు, రంగాలకు సంబంధించి అందిన సహాయం గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ముఖ్య నాయకులు హైదరాబాద్కు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని బలంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. -
రిజర్వేషన్లలో చిత్ర విచిత్రాలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కారణంగా చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల పంచాయతీలు ఏకగ్రీవమమయ్యే పరిస్థితి ఉండగా, మరికొన్ని చోట్ల ఆయా పంచాయతీలకు రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులే దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేయగా, 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ప్రాతిపదికన తీసుకొని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆ 11 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల్లేరుఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని జైత్రాంతండా, బాండావత్తండా, గోన్యతండా, బాలాజీనగర్తండా, మాన్తండా, నూనావత్తండాలో సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, అక్కడ బీసీ ఓటర్లే లేరు. అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండా బీసీ జనరల్కు రిజర్వు కాగా, అక్కడ ఒక్క బీసీ కూడా లేరు.మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో 881 మంది ఓట్లు ఉండగా, అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు. అనుముల మండలం పేరూర్ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అక్కడ 792 మంది ఓటర్లలో ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఓటరుగా ఉన్నాడు. తిరుమలగిరి(సాగర్)మండలంలో చింతలపాలెం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్కు రిజర్వు అయ్యింది. అయితే అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు. నేరేడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయ్యింది. అక్కడ బీసీలే లేరు. ⇒ వరంగల్ జిల్లా సంగెం మండల పరిధిలోని ఆశాలపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. అక్కడ వంగరి మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమే. ఇదే మండల పరిధిలోని వంజరపల్లి పంచాయతీ ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. ⇒ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా, ఇక్కడ ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్నగర్ సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఈ గ్రామాల్లో ఎస్టీలే లేరు. గత ఎన్నికల్లో కూడా ఈ గ్రామసర్పంచ్ స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ కాగా.. ఆ వర్గానికి చెందిన వారు లేరు. అయితే వార్డు స్థానాలకు కూడా పోటీ చేయకుండా ప్రజలు బహిష్కరించడంతో ఎన్నికలు జరగలేదు. చంద్రమ్మ కుటుంబానికే ‘చంద్రకల్’ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ ఎంపీటీసీ పరిధిలో చంద్రకల్, కుప్పగిరి గ్రామాలున్నాయి. ఈ ఎంపీటీసీ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వు అయ్యింది. ఈ రెండు గ్రామాల పరిధిలో 4030 ఓటర్లు ఉన్నారు. అందులో చంద్రకల్ గ్రామానికి చెందిన, చంద్రమ్మ, ఆమె కొడుకు, కోడలు, కూతురు మాత్రమే ఎస్టీలు. దీంతో ఈ ఎంపీటీసీ పదవి ఆ కుటుంబానికే ఏకగ్రీవం కానుంది. దంపతుల్లో ఒకరిని వరించనున్న సర్పంచ్ పదవి ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ గ్రామంలో కాంపల్లి కోటమ్మ ఒక్కరే ఎస్సీ మహిళ. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. కూసుమంచి మండలం ధర్మాతండా జీపీ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా అక్కడ కుమ్మరికుంట్ల నాగరాజు– శ్రావణి ఇద్దరే ఓటర్లు. వీరిది పక్కనున్న కేశ్వాపురం కాగా, ధర్మాతండాలో కోళ్ల ఫారం పెట్టుకుని ఓటు హక్కు పొందారు. మంగలి తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా తండా యువకుడు అనిత అనే బీసీ యువతిని వివాహం చేసుకోగా ఆమెకు ఓటు వచి్చంది. దీంతో అనిత ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. ఇదే మండలం లాల్ సింగ్ తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా అక్కడ ఒకే బీసీ కుటుంబం ఉండగా అత్తాకోడళ్లలో ఒకరికి సర్పంచ్ పదవి దక్కనుంది.అజ్మీరా హీరామాన్ తండాలోనూ బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఒక్కటే బీసీ కుటుంబం ఉంది. అక్కడ ఏకగ్రీవం ఖాయం కానుంది. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీ ఎస్టీ మహళకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. పెనుబల్లి మండలం గౌరారం పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వు అయ్యింది. ఇక్కడ ఇద్దరు ఓటర్లు ఉన్నారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. రఘునాథపాలెం మండలంలోని ఎన్.వీ.బంజర, రాములుతండాలో బీసీలే లేకున్నా ఎన్.వీ.బంజర బీసీ మహిళకు, రాములుతండా సర్పంచ్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. కారేపల్లి మండలం కొత్తకమలాపురం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్కు రిజర్వు అయ్యింది. ఇక్కడ వట్టం ఉమారాణి, సులోచన మాత్రమే పోటీకి అర్హులుగా తేలారు. గత ఎన్నికల్లో సర్పంచ్గా వట్టం ఉమారాణిని గెలిచింది. ఈసారి కూడా వీరిద్దరే పోటీ పడనున్నారు. లాటరీలో ఒక రిజర్వేషన్.. గెజిట్లో మరో రిజర్వేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామపంచాయతీ లాటరీ పద్ధతిలో జనరల్కు ఎంపికైంది. కానీ, జిల్లా కలెక్టర్ విడుదల చేసిన రిజర్వేషన్ గెజిట్లో మాత్రం జనరల్ మహిళగా నమోదు చేశారు. ఈ విషయం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్లగా, సరిదిద్ది మరో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచి్చనట్టు తెలిసింది.అక్కడ ఆ ఓటర్లు లేక...⇒ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లె పంచాయతీ ఎస్సీలకు రిజర్వు అయ్యింది. ఇక్కడ ఎస్సీ ఓటర్లే లేరు. కుభీర్ మండల పరిధిలోని ఫకీర్నాయక్తండా, దావూజీ నాయక్ తండాలో గిరిజనులే ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలు బీసీలకు రిజర్వు అయ్యాయి. పెంబి మండలం వేణునగర్లో కూడా ఎస్టీలే ఎక్కువ ఇది కూడా బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. 2019లో వేమనపల్లి మండలం రాజారం గ్రామం ఎస్సీ రిజర్వు కాగా, అక్కడ ఎస్సీలు ఎవరూ లేక ఎన్నిక జరగలేదు. తాజాగా ఎస్సీలకే కేటాయించారు. సారంగపూర్ మండలం హనుమాన్ తండా, పెండల్దరి గ్రామంలో బీసీ ఓటర్లు లేరు. ఈ గ్రామాలన్నీ బీసీలకు రిజర్వు అయ్యాయి. ⇒ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం తుమ్మలగూడలో ఎస్సీలే ఉండగా, ఈ గ్రామం బీసీ జనరల్ రిజర్వు అయ్యింది. ⇒ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గం, పీచర, ఆరేపల్లి గ్రామాలు బీసీలకు రిజర్వు కాగా, ఇక్కడ బీసీ ఓటర్లే లేరు. ⇒ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఏజెన్సీ గ్రామం. ఈ పంచాయతీ ఎస్టీలకు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీ ఓటర్లే లేరు. గిరిజన జనాభా లేక 40ఏళ్లుగా సర్పంచ్ ఎన్నిక జరగడం లేదు.3 గ్రామాలకు ఎంపీపీ..పట్టణీకరణతో పటాన్చెరు మండలంలోని కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలుగా, మరికొన్ని గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. దీంతో ఈ మండలంలో ప్రస్తుతం భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీలే మిగిలాయి. ఈ గ్రామాల నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక మండల పరిషత్ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. అయితే ఈ మూడు గ్రామ పంచాయతీలను కలిపి ఐదు ఎంపీటీసీ స్థానాలను చేసి ఎన్నికలకు వెళుతున్నారు. -
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన అన్ని పార్టీల నేతలు, మరోవైపు తాము పోటీ చేయాలనుకునే స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక వనరులను, మందీ మార్బలాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 9న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలై, నవంబర్ 11న ఫలితాల వెల్లడితో ఈ ప్రక్రియ ముగియనుండడంతో.. దాదాపు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చుల మోత మోగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దసరా, ఆ తర్వాత దీపావళి పండుగల మధ్యలో ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో విందు భోజనాలు, మందు పార్టీల జోరుతో ఎన్నికల హడావుడి పతాకస్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు. తొలుత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముందుగా రాజకీయ పార్టీల గుర్తులపై రెండు దశల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో.. ఆయా సీట్లలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా స్థానాలకు ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆ మేరకు ఓటర్లకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీకి ఎంపిక చేసుకున్న స్థానాల్లో ప్రజలను కలుసుకోవడం, పలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా వారికి తెలిసేలా ప్రాథమిక ప్రచార నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ముందుగా రాజకీయ పార్టీల జిల్లా స్థాయి నాయకత్వాలను ఒప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి రాజకీయంగా ఎదగాలనే తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలావుండగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీని అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రెండు స్థానాలకూ పోటీ చేయొచ్చు! ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికీ ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్టోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం ఉండదు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లా ఓటరుకు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసే వారు సంబంధిత మండలం ఓటరై ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు (రిజర్వేషన్ స్థానం వర్తింపును బట్టి) అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు పూర్తై ఉండాలి ⇒ నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తిచేసుకుని ఉండాలి ⇒ ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేయాలంటే.. తెలంగాణకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్టీలు ఏ వర్గానికి రిజర్వ్ కాని సీటు (జనరల్)కు కూడా పోటీ చేయొచ్చు. ⇒ ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ వర్గాల వారు కూడా ఏ విధంగానూ రిజర్వ్ కాని స్థానాలకు పోటీ చేయొచ్చు. ⇒ మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో వారే పోటీ చేయాలి. జనరల్ కేటగిరీ సీటుకు కూడా మహిళలు పోటీ పడొచ్చు. శిక్ష పడితే అనర్హులు ⇒ క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ముగిసిన తేదీనుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది. ⇒ 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడినవారు కూడా అనర్హులు. ⇒ 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. ⇒ మతస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు అనర్హులు ⇒ దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు లేదా అందుకు (ఇన్సాల్వెన్సీ) దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు. ⇒ మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు అనర్హులు. ⇒ ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్న వారు అనర్హులు. ⇒ 1973 నేర శిక్షా స్మృతి ప్రకారం మేజిస్ట్రేట్గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు అనర్హులు. ⇒ ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి, ఆ బకాయి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు అనర్హులు. ⇒ గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కానీ లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థల్లో ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా ఉండకూడదు. ⇒ అవినీతికి పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపబడిన వారు తొలగించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు పోటీకి అనర్హులు. ⇒ గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పిచనందుకు, సరైన పద్ధతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు. బ్యాంకు ఖాతా తెరవాల్సిందే.. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు వివరాల నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరిచి ఉండాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయాలి. ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఎన్నికల కోసం ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈ ఖాతాలోనే జమ చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అప్పగించింది. -
ఆయకట్టు.. ఆయువు కట్
సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టి డ్యాం వేదికగా కృష్ణా జలాలపై కర్ణాటకానికి తెరలేచింది. డ్యాం ఎత్తుపెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచే పనులను ఆ రాష్ట్రం వేగవంతం చేసింది. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, అచ్చంపేట తదితర ప్రాజెక్టులతోపాటు నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాగునీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడానికి కర్ణాటక కేబినెట్ సెప్టెంబర్ 17న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్కోట మునిసిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించడానికి ఆమోదం తెలిపింది. దీనికోసం 75,663 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.70 వేల కోట్లను మంజూరు చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మాగాణి భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 లక్షల పరిహారం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. తద్వారా డ్యాం నిల్వ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెంచనుంది. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించడానికి వీలుగా కాలువల వ్యవస్థను ఇప్పటికే పూర్తి చేసింది. తద్వారా డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఆయకట్టుకు తరలించడానికి కర్ణాటక సర్కార్ ప్రణాళికలు రచించింది. మనకు తాగునీటికీ ఇబ్బందులే... కర్ణాటక సర్కారు చర్యతో వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంవత్సరాల్లో ఆల్మట్టి, నారాయణ పూర్ డ్యాంలను దాటి కృష్ణా నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015–16లో శ్రీశైలానికి కనిష్టంగా 58.69 టీఎంసీల ప్రవాహం.. అందులో కృష్ణా నుంచి వచ్చింది కేవలం 24.97 టీఎంసీలేనని ఉదహరిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారడ్డ కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, అచ్చంపేట తదితర ప్రాజెక్టులతోపాటు నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టు ఎడారిగా మారుతుందని చెబుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే చెప్పారు. నాడు నోరు మెదపని చంద్రబాబు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టీఎంసీలను కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. దాంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం, హిప్పర్గి వియర్) పనులను 1964లో కర్ణాటక సర్కార్ చేపట్టింది. అప్పట్లో ఆల్మట్టి డ్యాంను 509.016 మీటర్ల ఎత్తుతో చేపట్టగా, తర్వాత 524.256 మీటర్లకు పెంచుతూ 1995లో నాటి దేవెగౌడ సర్కార్ పనులు ప్రారంభించినా అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నోరుమెదపలేదని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. 1996, సెప్టెంబరు 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి అవసరమైన నిధులను రుణంగా మంజూరు చేసేలా చక్రం తిప్పారు. దాంతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే పనులు వేగవంతమయ్యాయి. దీంతో తమ రాష్ట్రంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతాయంటూ అప్పట్లో మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆయకట్టుకు నీళ్లందవంటూ ఉమ్మడి ఏపీ రైతులు రోడ్డెక్కారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసి వాదన వినిపించాయి. దీంతో డ్యాంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 519.06 మీటర్లకు పరిమితం చేయాలంటూ 2000, ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గడువు 2000, మే 31తో ముగియనున్న నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఏర్పాటుచేసే కొత్త ట్రిబ్యునల్ వద్ద డ్యాం ఎత్తు పెంపుపై వాదనలు వినిపించుకోవాలని కర్ణాటకకు సూచించింది. ఇప్పటికే 524.256 మీటర్లకి ఎత్తు పెంపు కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేయడానికి 2004, ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్కుమార్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసింది. డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పనులను 2002 నాటికే కర్ణాటక సర్కార్ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2002–03లో 519.06 మీటర్ల ఎత్తుతో 129.72 టీఎంసీలను నిల్వ చేసింది. డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నిల్వ చేసేలా పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే.. ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన బ్రిజేష్ ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013, నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఎస్పెల్పీలు దాఖలు చేశాయి. దాంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టును ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ చేస్తుండటంతో ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేరింది. దీనిపై బలంగా వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి సైతం ఇటీవల అధికారులను ఆదేశించారు. మరోవైపు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. -
ఆన్లైన్ ఆచార్య!
సాక్షి, హైదరాబాద్: గత దశాబ్ద కాలంగా విద్యార్థుల పంథా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు స్థానాన్ని ఆన్లైన్ యాప్లతో భర్తీ చేసుకుంటున్నారు. కాలేజీ స్థాయిలో పాఠాలు వినడమూ కష్టమవుతోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లలు ఆన్లైన్ పాఠాలకు అలవాటు పడ్డారు. అకడమిక్ పాఠమైనా, మరో ఇతర అంశమైనా సెర్చ్ ఇంజిన్కే ప్రాధాన్యమిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే యాప్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విస్తృతమైన సమాచారం (కంటెంట్)తో ఇవి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్లైన్ ప్లాట్ఫాంల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. విద్యార్థులు ఐఐటీ ముంబై, మద్రాస్ సంస్థలు ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాలేజీలో మాస్టార్ పేరు తెలియని వాళ్ళు కూడా, ఆన్లైన్ యాప్ల పేర్లు ఇట్టే చెప్పేస్తున్నారనేది పరిశోధన సారాంశం. పాఠశాల విద్యలో నూటికి 68 మంది, ఉన్నత విద్యలో 83 మంది ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. మ్యాథ్స్లో మూ ల్యాంకనలకు, ఫిజిక్స్లో మ్యాగ్నటిక్ డైమెన్షన్స్, కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్, బోటనీలో బయలాజికల్ క్లాసిఫికేషన్కు ఆన్లైన్ శోధనే బెస్ట్ అంటున్నారు. అధ్యాపకుడు చెప్పే దానికన్నా మెరుగైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అందుతోందని చెబుతున్నారు. ఆన్లైన్తో దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి మెదడులో ముఖ్య భాగం న్యూరాన్ వ్యవస్థ. జ్ఞాపక శక్తికి ఇది కీలకం. ఈ వ్యవస్థ ఇప్పుడు ఆన్లైన్ చదువుకు అలవాటు పడుతోందని పరిశోధనల్లో తేలింది. ఆన్లైన్లో చదవడం వల్ల హిప్పో కాంపస్ (జ్ఞా పకశక్తిని నిల్వ చేయడం)కు సంబంధించి మెరుగైన ఫలితాలు ఇస్తోందని కెనడా యూనివర్సిటీ శాస్త్రవేత్త జాన్ విలియం ఇటీవల వెల్లడించారు. స్కూల్ లేదా కాలేజీలో చదివిన విషయం మెదడులో తాత్కాలిక జ్ఞాపక శక్తిగా ఉంటోందని, ఆన్లైన్ ద్వారా చదివేటప్పుడు మెదడులోని న్యూరాన్ వ్యవస్థ తేలికగా దీన్ని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిగా మారుస్తోందని ఆయన పరిశోధనలో తేలింది. క్లాస్ రూంలో పాఠం వినేప్పుడు సిగ్నల్ వ్యవస్థ అయిన మెదడు రసాయన చర్య కారణంగా కొంత ఒత్తిడి గురవుతోందని, అయితే ఆన్లైన్లో ఏకాగ్రత వల్ల సున్నితంగా మెదడు పొరల్లోకి విషయం చేరుతోందని గత ఏడాది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు క్లాస్ రూం బోధన కన్నా, ఆన్లైన్ చదువు తేలికగా ఉందని భావిస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించి వచ్చే సందేహాలు ఆన్లైన్లో నివృత్తి చేసుకునే క్రమంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. చాట్ జీపీటీ, ఇతర బ్రౌజర్లు విభిన్న సమాచారాన్ని అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ–పాఠాలు.. ఎన్నో యాప్లు ఈ–పాఠశాల: ఎన్సీఈఆర్టీ, సీఐఈటీ ఆధ్వర్యంలో నడిచే ఈ–పాఠశాల పాఠ్యపుస్తకాలు, ఆడియో, వీడియో, ఇతర విద్యా వనరులను అందిస్తోంది. డౌట్నట్ : గణితం, అణుశా్రస్తానికి సంబంధించిన సందేహాలను ఇది దృశ్యరూపాల్లో ఆప్లోడ్ చేసి అందిస్తోంది. ఈ యాప్ ద్వారా వీడియోలతో కూడిన అర్థవంతమైన సమాధానాలు పొందే వీలుంది. అన్అకాడమీ: జేఈఈ, నీట్, యూపీఎస్సీ, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉద్దేశించి దీన్ని రూపొందించారు. ప్రశ్నలకు సమాధానాలు, ఆన్లైన్ పరీక్ష విధానం, నిష్ణాతులైన అధ్యాపకుల లెక్చర్స్ ఇందులో ఉంటున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని అనుసరిస్తున్నారు. నీట్, జేఈఈ కోసం అమెజాన్ అకాడమీ కూడా పనిచేస్తోంది. ఇక యూనివర్సల్ బోధన పద్ధతులతో ఖాన్ అకాడమీ ప్రాక్టికల్ విద్య బోధనతో ఆన్లైన్ రంగంలో విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్థానిక భాషల్లో ప్రోగ్రామింగ్ చేసిన గువీ, టెక్ డేటా సైన్స్ నైపుణ్యాలతో ఎడ్యురేకా వంటి యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ బోధనకే పరిమితం కాకూడదు కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఆన్లైన్ విద్యా విధానం అనివార్యమైంది. అదనపు స్కిల్స్, సమాచారం కోసం ఆన్లైన్కు వెళ్ళడం మంచిదే. కానీ ఆన్లైన్ బోధనకే పరిమితం కావడం సరైన విధానం కాదు. దీనివల్ల క్లాస్ రూం కనెక్టివిటీ పోతుంది. అందువల్ల అంతర్జాతీయ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు, సంప్రదాయ అకడమిక్ బోధన పద్ధతులపైనా దృష్టి పెట్టాలి. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసియా కప్ ఫైనల్లో పాక్పై అద్భుతంగా ఆడి భారత్ను గెలిపించిన తిలక్ను.. సీఎం రేవంత్ సత్కరించి అభినందించారు. అనంతరం సీఎంకు తిలక్వర్మ బ్యాటును బహురించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి… pic.twitter.com/o8x5b9Eusc— Revanth Reddy (@revanth_anumula) September 30, 2025 -
ట్యాంక్బండ్పై 700 బతుకమ్మలతో సంబరాలు
సాక్షి,హైదరాబాద్: బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వందలాది మంది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 500 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. -
ప్రభుత్వానికి మెట్రో బదిలీ ఈజీ కాదు
మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే నిర్వహణ ఎలా ఉంటుంది..? సౌకర్యాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అలాగే మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీచేసే ప్రక్రియ కూడా అంత ఈజీ కాదు. వివిధ అంశాలపైన స్పష్టమైన అవగాహన, ఒప్పందం ఏర్పడిన తరువాత మాత్రమే ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఇందుకోసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ అంశాలపైన సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తోన్న 69.2 కి.మీల మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్అండ్టీ సంస్థకు ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించి ప్రభుత్వం ప్రాజెక్టును స్వాదీనం చేసుకోనుంది. అలాగే రూ.13000 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు నిర్వహణపరమైన అంశాలపైన కూడా ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.కేంద్రం అనుమతి తప్పనిసరి పీపీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగానే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవాలపైన ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాకేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరే ప్రతి ఒప్పందం వివరాలను కేంద్రానికి అందజేయాలి. అలాగే బ్యాంకు రుణాలను (Bank Loan) రాష్ట్రం భరించనున్న దృష్ట్యా అందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించవలసి ఉంటుంది. రెండోదశ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఎలా ముఖ్యమో, మొదటి దశ బదిలీకి కూడా అంతే ముఖ్యం అని అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్రాలతో పాటు ఎల్అండ్టీ (L&T) సంయుక్త ప్రాజెక్టుగా 2011లో మెట్రో మొదటిదశ చేపట్టిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ నుంచి మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చా యి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు 4.8 లక్షల మందికి పైగా పయనిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టీ తన వాటాను రాష్ట్రానికి విక్రయించనున్న దృష్ట్యా నిర్వహణపరమైన సాంకేతిక అంశాలపై న కూడా ఒప్పందాలు తప్పనిసరి.కియోలిస్కు ఇంకా గడువు ఉంది ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ (Keolis) సంస్థ హైదరాబాద్లో మెట్రో రైళ్లను నడుపుతోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. కియోలిస్ సంస్థ హైదరాబాద్తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థతో 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. ఈ మేరకు ఈ ఒప్పందాన్ని ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకొని పునరుద్ధరించవలసి ఉంది. ఒకవేళ కియోలిస్ను కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్తో మెట్రో రైళ్ల నిర్వహణలో కియోలిస్కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కియోలిస్తోనే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.ఆస్తులు–అప్పలు తేలాల్సిందే.. మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్అండ్టీకి లీజుకు ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతినిచ్చారు. కానీ ఎల్అండ్టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్లీజ్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతసమయం పట్టే అవకాశం ఉంది.చదవండి: ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిలో రోడ్డుఅలాగే సబ్లీజుకు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావలసి ఉంది. మరోవైపు రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్బీఐ (SBI) నేతృత్వంలో 12 బ్యాంకులు ఈ రుణాలను అందజేశాయి. ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల నుంచి రుణాలను ప్రభుత్వానికి బదిలీ అయ్యేందుకు కూడా కొంత గడువు అవసరం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు యాజమాన్య బదిలీకి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. -
చంచల్ గూడ జైలులో ఖైదీల నిరాహార దీక్ష?
సాక్షి,హైదరాబాద్: చంచల్ గూడ జైలులో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రజాసంఘాలు ఆరోపించాయి. జైలు అధికారుల తీరుకు నిరసనగా మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే.. తమ జైలులో ఏడుగురు మావోయిస్టు ఖైదీలున్నారని చంచల్గూడ్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. రొటీన్ ప్రాసెస్లో భాగంగా సోమవారం వారి బ్యారక్లను మార్చామని, అంతకు మించి ఏమీ జరగలేదని పేర్కొన్నారు. వారికి మద్దతుగా పలు ప్రజాసంఘాలు ఈరోజు ధర్నా చేశాయని, వారి తరఫున అడ్వొకేట్లు నలుగురు జైలులో పరిస్థితిని పరిశీలించారని వివరించారు. ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టు ఖైదీలకు ములాఖత్ ఏర్పాటు చేశామన్నారు. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల
సాక్షి,హైదరాబాద్: రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు.జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు.సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో
సెప్టెంబర్ 28న పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. తిలక్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్కు, అతని కోచ్ సలామ్ బయాష్కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అత్యుత్తమమైంది. ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.కాగా, 23 ఏళ్ల తిలక్కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్కు క్రికెట్లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.కోచ్ సలాం బయాష్ తిలక్ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్కప్కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండకపోవచ్చు.. ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. ‘‘తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ హెచ్చరించారు.‘‘బీసీలకు 42 శాతం కోటా పేరుతో రేవంత్ సర్కార్ డ్రామా ఆడుతోంది. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితేంటి?. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు’’ అంటూ ఈటల గుర్తు చేశారు.ఈటల వ్యాఖ్యలు.. మహేష్గౌడ్ కౌంటర్ ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు నోరు తెరవాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎక్కడ ఆగిందో ఈటల చెప్పాలి. ముదిరాజ్ బిడ్డను అంటావ్ ఇప్పుడు బీసీల కోసం మాట్లాడు.. నోటి దగ్గరి ముద్ద లాక్కుంటున్నా కానీ.. ఈటల, సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కోర్టులో పిల్స్ వేస్తున్నారు’’ అంటూ మహేష్ గౌడ్ మండిపడ్డారు. -
తెలంగాణ: రేపటి నుండి రేషన్ షాపులు బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి రేషన్ దుకాణాలు(Telangana Ration Shops) మూతపడనున్నాయి. పలు డిమాండ్లతో రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గత 5 నెలలుగా రేషన్ డీలర్లకు(Ration Dealers Commission) కమీషన్ అందలేదు. దీనికి తోడు రూ.5 వేల కనీస గౌరవ వేతనం డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించారు కూడా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని డీలర్ల సంఘం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో.. ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా కమీషన్ను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాఖలాలు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt Ration Shops) స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ షాపులు తెరుస్తామని అంటున్నారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. కమీషన్ పెంచాలి. దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి లాంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ బంద్ నిరవధికమా? లేదంటే రేపు ఒక్కరోజేనా? అనేదానిపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే! -
సజ్జనార్ ఆన్ డ్యూటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్గా వీసీ సజ్జనార్(VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కమాండో అండ్ కంట్రోల్ యూనిట్లో సీవీ ఆనంద్ నుండి సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీ ఉన్న ఆయన్ని ప్రభుత్వం సీపీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు డ్యూటీలో భాగంగా ఆయన సాధారణ పౌరుడిలా బస్సులో ప్రయాణించడం నెట్టింట వైరల్ అయ్యింది.వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి(IPS Sajjanar). గతంలో సైబరాబాద్ కమిషనర్గా పని చేశారు. ఆ సమయంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సైబర్ క్రైమ్ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. దిశా కేసు సమయంలో జరిగిన ఎన్కౌంటర్తో ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. డీజీపీ జితేందర్కు వీడ్కోలు పరేడ్తెలంగాణ డీజీపీగా డాక్టర్ జితేందర్ నేడు రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ఫేర్వెల్ పరేడ్లో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్ట్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేపు శివధర్రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఫేర్వెల్ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఇంత కాలం నాకు సహకరించిన ప్రతి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. 40 ఏళ్లలో 40 రోజులు కూడా సొంత రాష్ట్రానికి వెళ్లకుండా విధులు నిర్వహించాను. డీజీపీగా 14 నెలల నుంచి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా. నా తండ్రి మంచి విలువలు నేర్పాడు. ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి నా కుటుంబ సభ్యులు స్నేహితులు సహకరించారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారాయన. .. భారీ వర్షాల, వరదల సమయంలో పోలీసులు చేసిన సేవలు మర్చిపోలేనివి. పండుగల సమయంలో శాంతిభద్రతలకు విగాథం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రగ్స్ లాంటి చెడు వ్యవస్థను కంట్రోల్ చేయడానికి తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు, ఇంకా పని చేయాల్సి ఉంటుంది. శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీసులపై నాకు చాలా నమ్మకం ఉంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు వాడే టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్న శివధర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, ఆయన అద్భుతమైన సేవలు అందిస్తారనే నమ్మకం నాకుంది. తెలంగాణ శాంతిభద్రతల విషయంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మొదట్లో నాకు సలహాలు ఇచ్చిన సీనియర్ పోలీస్ అధికారులకు, గురువులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. -
అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే!
దసరా పండుగపై తెలంగాణలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. దీంతో.. మద్యం, మాంసం ప్రియులకు అసమంజస పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో.. హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) ప్రకారం ఈ నెల 24న జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఆ మేరకు సోమవారం జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. -
5 రూపాయలకే మధ్యాహ్నం భోజనమైనా.. ఉదయం టిఫినైనా
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఓవైపు కోటానుకోట్ల సంపదతో, ఆకాశహరామ్యల్లో నివసించే ఆగర్భ శ్రీమంతులతో పాటే కనీసం పూట భోజనానికి సైతం సరైన సంపాదన లేని వారూ ఉన్నారు. వారితోపాటు ఉన్నత చదువుల కోసం ఉన్న ఊళ్లను వదిలి వచి్చన విద్యావంతులు, ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారూ, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం వచ్చిన సహాయకులు, ప్రతిరోజూ పనులు దొరకని వివిధ రంగాల్లోని కార్మికులూ ఎందరో ఉన్నారు. ఇలాంటి వారందరికీ కనీసం ఒక్క పూటైనా ఆకలితీర్చే అమ్మలా ఆదుకుంది జీహెచ్ఎంసీ రూ.5కే భోజన పథకం. 11 ఏళ్ల క్రితం 2014 మార్చి 2న నాంపల్లి సరాయి వద్ద లాంఛనంగా ప్రారంభించిన రూ.5లకే భోజన పథకం పేరు రూ.5 లకే భోజన పథకంగా ఉన్నప్పటికీ, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అన్నపూర్ణ పథకంగా నామకరణం చేసింది. ఇప్పటి దాకా భోజనాన్నే అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ కూడా అదే రూ.5లకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతోపాటే సరఫరా కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చి, సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పిస్తోంది. ఆహారం తయారీలో నాణ్యతతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడంతో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందీ కార్యక్రమం. అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం ప్రభుత్వం ఏదైనా పథకాన్ని నిర్వఘ్నంగా కొనసాగిస్తున్నది జీహెచ్ఎంసీ కావడం విశేషం. మిగతా మునిసిపల్ కార్పొరేషన్లకు, జీహెచ్ఎంసీకి ఎంతో వ్యత్యాసం ఉంది. మిగతా కార్పొరేషన్లలో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉండగా, జీహెచ్ఎంసీ అందుకు భిన్నంగా కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేదల ఆకలి తీర్చే ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తోంది. ఇందిరమ్మ క్యాంటీన్లు ఇలా.. నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా సోమవారం రెండు ప్రారంభించారు. మరో పది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 50 రెడీగా ఉన్నప్పటికీ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ ఇతరత్రా సదుపాయాలకు మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావీ దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు. గతంలో నిలబడే తినాల్సి వచ్చేది. కొన్నింట్లో మాత్రం కూర్చునే సదుపాయం కలి్పంచారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో అన్నింటిలోనూ కూర్చునే సదుపాయంతోపాటు హ్యాండ్వాట, తాగునీటి సదుపాయంతోపాటు విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లు కల్పిస్తున్నారు. నగరవ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటుకుగాను జీహెచ్ఎంసీ రూ.11.43 కోట్లు ఖర్చు చేయనుంది. లబి్ధదారులకు రూ.5లకే భోజనం అందిస్తున్నప్పటికీ, ఒక్కో భోజనానికి రూ. 29.83 ఖర్చవుతోంది. ఆమేరకు మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తోంది. అలా ఇప్పటి వరకు అందజేసిన 12.30 కోట్ల భోజనాలకు జీహెచ్ఎంసీ ఖజానా నుంచి రూ.253. 87 కోట్లు ఖర్చయింది. ప్రతిరోజూ సగటున 30 వేల భోజనాలు సరఫరా చేస్తూ ప్రజల ఆకలి తీరుస్తోంది. మిల్లెట్ టిఫిన్స్.. ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బ్రేక్ఫాస్ట్లో భాగంగా మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా కూడా అందజేయనున్నారు.సీఎం ఆదేశాల మేరకు.. పేదలకు ఒక్కపూట భోజనమే కాక, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కూడా అందజేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాని కనుగుణగా జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక్కో ప్లేట్కు రూ.19 ఖర్చవుతుండగా, లబి్ధదారు చెల్లించే రూ.5పోను మిగతా రూ.14 జీహెచ్ఎంసీ ఖర్చు చేయనుంది. ఇందుకుగాను జీహెచ్ఎంసీకి సంవత్సరానికి మరో రూ.12.60 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. ఈమేరకు గ్రాంట్స్ ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. -
లిక్విడ్ క్యాష్ తీసుకెళ్తున్నారా?.. అయితే జాగ్రత్త!!
హైదరాబాద్: పండుగకి ఊరెళ్తున్నారా?.. ఎందుకైనా మంచిదని లిక్విడ్ క్యాష్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్త మీ కోసమే..!. పరిమితికి మించి డబ్బును తీసుకెళ్ళకండి. ఒకవేళ తీసుకెళ్లినా.. ఆ డబ్బును ఎందుకు తీసుకెళ్తున్నారో అనేదానికి సంబంధించిన డాక్యుమెంట్లను మోసుకెళ్లండి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ లిమిట్ ఎంతో తెలుసా?.. తెలంగాణ ‘స్థానికం’ కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో.. తక్షణ ఎన్నిక కోడ్(Election Code in Telangana) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నాం నుంచే.. పోలీసులు, ఆబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లాల వ్యాప్తంగా రోడ్లపై వాహనాలను సోదా చేయడం ప్రారంభించారు. మంగళవారం నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ డబ్బును పోలీసులు సీజ్(Telangana Police Money Seize) చేస్తారు. ఆపై ఆ డబ్బును రెవెన్యూ అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ నగదు మరీ ఎక్కువగా ఉంటే ఉంటే.. ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీకి సమాచారం అందించి ఆపై కోర్టులో జమ చేస్తారు. అయితే ఇదంతా సరైన పత్రాలు లేకపోతేనే జరుగుతుంది.మెడికల్ ఎమర్జెన్సీ, కాలేజీ ఫీజులు, పెళ్లి, వ్యాపారాల నిమిత్త అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలి. ఒకవేళ తనిఖీల సమయంలో చూపలేకపోయినా.. ఆ తర్వాత అయినా ఈ పేపర్లను సమర్పించి జప్తు అయిన డబ్బును తిరిగి పొందొచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో లిక్కర్ మోసుకెళ్లేవాళ్లు కూడా ఈ విషయం గమనించాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇలా.. -
‘బాకీ కార్డు’తో కాంగ్రెస్ను ఓడిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘బాకీ కార్డు’ఉద్యమంతో కాంగ్రెస్ సర్కార్ భరతం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్దే హవా అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్కు చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అబద్ధపు హామీలను ఎండగట్టేందుకే ‘బాకీ కార్డు’ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.హైదరాబాద్లో ఉన్న సమస్యలతోనే ఆగమవుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతామని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. చెత్త, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలతో నగరం అల్లాడుతోందని, రోడ్ల నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మితమైతే, కాంగ్రెస్ ఒక్క ఇటుకా పేర్చలేదన్నారు.కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల ఆగ్రహం..రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ అసమర్థ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని, రైతులు ఎరువుల కోసం వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత బంపర్ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని అన్నారు. కేసీఆర్ 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించి, 10 ఏళ్ల పాలనలో దేశంలో అగ్రస్థానంలో నిలిపారని కేటీఆర్ పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే పండుగ బతుకమ్మ: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరమ్మను భక్తితో కొలిచే సబ్బండ వర్ణాల సంబురం బతుకమ్మ పండుగ.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని తెలిపారు. -
అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న అప్పు ఒత్తిడి భారత్ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు. అమ్మో... అప్పా? కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్ కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్ డ్రా చేస్తున్నారు. ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్ (సిద్దిపేట) సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది. అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్ అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను. -
అలైన్మెంట్ మార్చండి.. పరిహారం పెంచండి
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో అలైన్మెంట్ మార్చడంతోపాటు భూ పరిహారం పెంచాలంటూ నిర్వాసితులు ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్–సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో సమస్య నివురుగప్పిన నిప్పులా ఉంది. చౌటుప్పల్కు కనీసం 50 కి.మీ. ఆవల ఆర్ఆర్ఆర్ ఉంటుందని తొలుత చెప్పి చివరకు పట్టణానికి 25 కి.మీ. దూరంలోనే అలైన్మెంట్ ఖరారవడం వెనుక ఓ బడా పరిశ్రమను కాపాడే ఉద్దేశం దాగి ఉందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముందుగా అనుకున్న అలైన్మెంట్ ప్రకారం ఆ పరిశ్రమ ఆర్ఆర్ఆర్ లోపలివైపు అవుతుందని.. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) లోపలి వైపు ఉన్న పరిశ్రమలను అవతలి వైపు తరలించాలన్న అంశం తెరపైకి వచ్చినట్లుగానే భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ లోపలి వైపు ఉన్న పరిశ్రమలను సైతం దూరంగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ పరిశ్రమకు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో అధికారులు అలైన్మెంట్ మార్చారని నిర్వాసితులు వాదిస్తున్నారు. దీనికితోడు గతంలో జాతీయ రహదారి కోసం భూమి కోల్పోయి, ఆ తర్వాత డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కోసం భూమి కోల్పోయి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కూడా భూమి కోల్పోతే ఇక తమకు మిగిలేదేమి ఉంటుందని నిర్వాసితుల్లో ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ ప్రభుత్వం పరిహారమన్నా ఎక్కువ ప్రకటించిందా అంటే భూముల ధరలతో పోలిస్తే ఎనిమిదో వంతు కూడా లేదని వారు వాపోతున్నారు. త్వరలో జిల్లా కలెక్టరేట్ ముట్టడితో ఆందోళనను మరోసారి ఉధృతం చేస్తామని చెబుతున్నారు. సంగారెడ్డి వద్ద కూడా.. సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న సదాశివపేట్, కొండాపూర్ మండలాల్లోని ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్కు చేరువగా ఉండే ప్రాంతాల్లో ఒక్కో ఎకరం మార్కెట్ రేటు ప్రకారం రూ. 2–3 కోట్ల దాకా పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రం రూ. 30 లక్షల్లోపే ఉంటుందన్న ప్రచారం జరగడంతో ఈ ధరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. పరిహారం పెంపు కోసం గతంలో ఆందోళనలు చేసిన నిర్వాసితులు తాజాగా ఆర్ఆర్ఆర్ టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేతో వారు చర్చించగా పరిహారాన్ని పెంచాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టాలని ఆయన సూచించారు. రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోందన్న వార్తలు వస్తుండటంతో కొందరు కాంగ్రెస్ నేతలు భూ నిర్వాసితుల ఆందోళనకు తెరదించేలా అనుకూల ప్రచారం ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో భూముల ధరల పెంపు ఎంత ఉన్నా రింగు అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూముల ధరలను మాత్రం ప్రభుత్వం భారీగా పెంచనుందని.. అందువల్ల ఆందోళనకు దిగొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు సహకారం తీసుకోనున్న ఎన్హెచ్ఏఐ.. వచ్చే నెలలో సుమారు రూ. 2 వేల కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి భూములను అ«దీనంలోకి తీసుకోవడానికి ఎన్హెచ్ఏఐ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి పంటలు వేసుకున్న భూములను వదిలేసి మిగతా వాటిని స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమవుతోంది. గెజిట్ విడుదలతో సాంకేతికంగా ఆ భూములన్నీ ఎన్హెచ్ఏఐ అధీనంలోకి వచి్చనప్పటికీ భౌతికంగా వాటిని స్వా«దీనం చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో నిర్వాసితులు ఆందోళన చేసే అవకాశం ఉన్నందున పోలీసుల సహకారం తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. -
ఇక పంట విక్రయాల్లో దళారులకు నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమ పద్ధతుల్లో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించే దళారులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. పండించిన రైతు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ ఇచ్చేలా రూపొందించిన ‘పీఎమ్–ఆశా’పథకం కింద ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని పెట్టుబడి, మద్దతు ధర విభాగం నుంచి ఈనెల 18న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవి అమల్లోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకే...బహిరంగ మార్కెట్లో ధర లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసే విధానం కొంతకాలంగా దేశంలో అమలవుతోంది. అయితే దీనిని దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. » వరి, పత్తి కందులు, మొక్కజొన్న, పెసర, జొన్నలు, మినుములు మొదలైన పలు రకాల పంటలకు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. » ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్సీఐ సేకరిస్తుండగా, పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుంది. ఇవి కాకుండా పెసలు, సోయా బీన్, మినుములు వంటి పంటలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ కొనుగోలు చేస్తాయి. » కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ జొన్నలు, మక్కలు మొదలైన పంటలను రైతుల నుంచి సేకరిస్తుంది. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేస్తోంది. పంట నాణ్యత లేదని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, ప్రైవేటు వ్యాపారులు తిరిగి ఆ పంటనే మార్క్ఫెడ్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐ వంటి సంస్థలతో కుమ్మక్కై రైతుల పేరిట మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. » గత సంవత్సరం పత్తి పంటకు సంబంధించి ఇలాంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ద్వారా ధ్రువీకరించి, కేంద్రానికి పంపించింది. » గతంలో మార్క్ఫెడ్ ద్వారా జరిగిన జొన్నల కొనుగోళ్లలో కూడా దళారులే రైతుల పేరిట విక్రయాలు జరిపినట్టు రుజువైంది.» దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ రైతులే లబ్ధిదారులుగా ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ...ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) ప్రత్యేక పోర్టల్లో రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కూడా రైతు డేటాను కేంద్రం సేకరిస్తుంది. » రాష్ట్ర పోర్టల్లో రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. డీసీఎస్/అగ్రి–స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా పంట వివరాలు ధ్రువీకరించాలి. లేనిచోట పాత పద్ధతిలోనే వెరిఫికేషన్ చేపడతారు.» రైతు ఆధార్, పట్టాదార్పాస్ పుస్తకంతో పాటు క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతు ఏ పంట వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ నుంచి సేకరించి, పంటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలతో రైతుల డేటాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. » డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రి–స్టాక్ డేటాతో ఆటో వెరిఫికేషన్ తప్పనిసరి. » ఒకవేళ రైతులు తమ పంటలను విక్రయించడానికి నేరుగా రాని పక్షంలో తన ఆధార్ నంబర్తో గరిష్టంగా ముగ్గురికి ఆథరైజేషన్ ఇచ్చి పంటల విక్రయానికి పంపించే అవకాశం ఉంటుంది. రైతు హాజరు కాకపోతే, అతడి అధీకృత ప్రతినిధి ఉత్పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చే వీలు ఉంటుంది. చెల్లింపు మాత్రం నేరుగా రైతు (యజమాని) బ్యాంక్ ఖాతాకు మాత్రమే వెళుతుంది. » ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు అనుమతి ఉండదు. తద్వారా రైతుల పేరిట దళారులు పంటలను బల్క్గా విక్రయించే అవకాశం ఉండదు.» రైతులకు చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఆధార్ వెరిఫైడ్ ఖాతాల్లోనే జరుగుతాయి. ఆధార్ చట్టం 2016 సెక్షన్ 7 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 30లోపు రాష్ట్రాలు దీనిని కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. » నిజమైన రైతులకే మద్దతు ధర ప్రయోజనం చేరేలా చూడటం, మధ్యవర్తుల జోక్యం తగ్గించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆల్మట్టిపై సుప్రీంలో పోరాటం
సాక్షి, హైదరాబాద్: ఎగువ కృష్ణా నదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో బలంగా పోరాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుసేన్, సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్తో మంత్రి సోమవారం జలసౌధలో సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సవరణ డీపీఆర్ రూపకల్పనను వేగిరం చేయాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన వెంటనే ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణ పనులు పునరుద్ధరించాలని ఆదేశించారు. కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజీ–6 పనుల సవరణ అంచనాలతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఖమ్మంలోని నీటిపారుదల శాఖ భూములకు సంబంధించిన ఫైళ్లను మంత్రివర్గ సమావేశం ముందు పెట్టేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. ‘కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్టుపై పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే అమల్లో ఉంది’ అని ఉత్తమ్ అన్నారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ను నియమించామని చెప్పారు. త్వరలో నీటి వినియోగ సంఘాలుక్రమపద్ధతిలో చెరువులు, కాల్వల నిర్వహణ కోసం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. తొలుత చెరువుల నిర్వహణకు వీటిని ఏర్పాటు చేసి క్రమంగా భారీ ప్రాజెక్టులకు విస్తరింపజేస్తామన్నారు. ప్రతి సంఘానికి సహాయకుడిగా లస్కర్తోపాటు కన్వీనర్గా నీటిపారుదల శాఖ అధికారిని నియమిస్తామన్నారు. జవాబుదారీతనంతో ముందస్తు చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండి ఉంటే చాలా చెరువులకు గండ్లతో పాటు ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలను నిలువరించగలిగేవారమని ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో గుర్తించామన్నారు. నీటి వినియోగ సంఘాలతో ఈ కొరతను తీర్చడంతో పాటు సాగునీటి వనరుల నిర్వహణ బాధ్యతల్లో స్థానికులకు చోటు కల్పించనున్నాయన్నారు. రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి, సభ్యులను సంప్రదించి సంఘాలను నియమించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. చెరువులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వర్షాకాలంలో వాటికి గండ్లుపడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతు కమిషన్ చెప్పిందన్నారు. ఇందుకోసం నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేసి లస్కర్లతోపాటు ఇతర వనరులను కల్పించాలని విజ్ఞప్తి చేసిందన్నారు. చెరువులు, కాల్వలను పటిష్టంగా ఉంచడంలో రైతులకు నీటి వినియోగ సంఘాలు భరోసా కల్పిస్తాయని ఉత్తమ్ అన్నారు. కొత్త విధానంతో క్షేత్రస్థాయిలో బాధ్యతల పునరుద్ధరణతోపాటు గండ్లుపడకముందే నివారణ చర్యలు సాధ్యమవుతాయన్నారు. సాగునీటి వనరులకు తొలి రక్షణ కవచంగా సంఘాలు వ్యవహరిస్తూ అత్యవసర మరమ్మతుల అవసరం లేకుండా చర్యలు తీసుకుని పంటలను కాపాడతాయన్నారు. -
1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారం జరుగుతున్న విధానం, మార్కె టింగ్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రకటించారు. వీరిలో ఓ నిందితుడు మూడేళ్లలో 550 సినిమాలు పైరసీ చేయగా... నలుగురితో కూడిన ముఠా ఐదేళ్లలో 500 సినిమాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ పైరసీతో చిత్ర పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి సీవీ ఆనంద్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ అశ్వని కుమార్ మామూలోడు కాదు... బిహార్కు చెందిన అశ్వినీ కుమార్ పదో తరగతి వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారానే హ్యాకింగ్ నేర్చుకున్న ఇతగాడి దృష్టి సినిమా పైరసీపై పడింది. విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన అశ్వినీ కుమార్ వాటి సర్వర్లను హ్యాక్ చేసి, విడుదలకు సిద్ధంగా ఉన్న, తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తాడు. మూడేళ్లలో వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేసి కొన్నింటిని విడుదలకు వారం రోజుల ముందే తస్కరించాడు. ఇలాంటి వాటిలో పుష్ప–2 కూడా ఉంది. పైరసీ ద్వారా లక్ష డాలర్లు (సుమారు రూ.88 లక్షలు) ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. పటా్నలోని సంపత్ చక్లో ఇతడి ఇల్లు 80 గజాల్లో ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్స్తో ఒప్పందాలు చేసుకుని... పైరసీ చేసిన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్వినీ కుమార్ వివిధ టెలిగ్రాం చానల్స్ అడ్మిన్లతోపాటు గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వీరి నుంచి ఒక్కో చిత్రానికి 10 వేల నుంచి 25 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాడు. టెలిగ్రాం చానల్స్లో నేరుగా సినిమా లింకు పెడుతుండగా... వెబ్సైట్స్లో యాడ్స్ రూపంలో ఈ లింకు ఇస్తున్నారు. పగటి పూట నిద్రపోయి, రాత్రి వేళల్లో మేల్కొనే ఇతడు తన హ్యాకింగ్ సత్తాను పరీక్షించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిహార్, జార్ఖండ్కు చెందిన వివిధ ప్రభుత్వ వెబ్సైట్లు, సర్వర్లను హ్యాక్ చేశాడు. దీనికోసం నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వినియోగించాడు. ఇతడు చిత్రాలను నేరుగా సర్వర్ల నుంచి పైరసీ చేస్తుండటంతో అవన్నీ హెచ్డీ ప్రింట్తో ఉంటున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఇతగాడికి అషి్మత్ సింగ్ ద్వారా చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడి హ్యాకింగ్ టాలెంట్ చూసి అవాక్కైన సీవీ ఆనంద్ నెలకు రూ.10 లక్షల జీతం ఇచ్చి అతడి సేవలు వినియోగించుకోచ్చన్నారు. క్యామ్ కార్డర్తో థియేటర్లలో... తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ క్యామ్ కార్డర్ ద్వారా థియేటర్లలో సినిమాలు రికార్డు చేసి పైరసీ చేస్తున్నాడు. దీనికోసం వనస్థలిపురంలో ఉంటున్న జాన కిరణ్ కుమార్, తమిళనాడుకే చెందిన సుధాకరన్, గోవాకు చెందిన అర్సలాస్ అహ్మద్లతో ముఠా ఏర్పాటు చేశాడు. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి అమలదాస్ రెండు సర్వర్లను ఖరీదు చేశాడు. కిరణ్ కుమార్ మిగిలిన ఇద్దరితో కలిసి సినిమా విడుదలైన రోజు థియేటర్లలో మధ్యలో ఉండే వరుసల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటాడు. తమతోపాటు చుట్టు పక్కల ఉన్న సీట్లను బుక్ చేస్తాడు. క్యామ్ కార్డర్లు లేదా సెల్ఫోన్లో ప్రత్యేక క్యామ్ కార్డర్ యాప్ల సహకారంతో వీరు సినిమా రికార్డు చేస్తారు. ఈ ప్రింట్ను అమలదాస్ కొన్ని టోరెంట్స్తోపాటు ఇతర వెబ్సైట్లలో హోస్టు చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కో సినిమాకు 3 వేల డాలర్ల వరకు వసూలు చేస్తూ అనుచరులకు వాటా ఇస్తున్నాడు. వీళ్లు ఐదేళ్లలో 500 సినిమాలు పైరసీ చేయగా... కొన్నింటిని హైదరాబాద్లోని థియేటర్లలో రికార్డు చేశారు. ఇలా ఇప్పటివరకు రూ.2 కోట్లు సంపాదించారు. హిట్, సింగిల్, కుబేర, హరి హర వీరమల్లు చిత్రాల పైరసీపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. సినీ ప్రముఖులతో సీపీ భేటీ సినిమా పైరసీ పూర్వాపరాలు, నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించడానికి హైదరాబాద్ పోలీసులు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు వివరించారు. క్యామ్ కార్డర్ పైరసీని నిరోధించడానికి థియేటర్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ యజమానులు నిఘా పెంచాలని కోరారు. పైరసీ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఏసీపీ ఆర్జీ శివమారుతితోపాటు ఇన్స్పెక్టర్లు ఎస్.నరేష్, సతీష్రెడ్డి, ఎన్.దిలీప్ కుమార్, కె.మధుసూదన్ రావులను అభినందించారు. -
బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడి ఉన్న అధికారులందరి బదిలీలు, పోస్టింగ్లపై పూర్తి నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తెలిపింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వ హిస్తు న్నట్టు ఎస్ఈసీ తెలిపింది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లను రప్పించినట్లు వెల్లడించింది. ఎన్నికల సమయంలో లౌడ్స్పీకర్ల వినియోగం, ఊరేగింపులు, బహిరంగ సభల నిర్వహణ, ఓటర్లను ప్రలోభపరిచే అవి నీతి చర్యలు, తదితరాలపై పోలీస్శాఖ కచ్చితమైన చర్యలు తీసు కోవాలని సూచించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసినందున, అప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరంద్ తెలియ జేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలోని సంబంధిత ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే..ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ముందస్తు కార్యకలా పాలను ముగించి, ముసాయిదా షెడ్యూల్ను పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం (కాంకరెన్స్)తో ఎన్నికల తేదీలను ఖరా రు చేసినట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల స్థానా లకు సంబంధించి మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ లకు రిజర్వేషన్లు తెలియజేసిందని తెలిపింది. ఆ తర్వాత సీఎస్, డీజీపీ, పీఆర్ఆర్డీ, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, పీఆర్ఆర్డీ డైరెక్టర్, ఎస్ఈసీ కార్యదర్శిలతో రాష్ట్ర ఎన్నికల కమి షనర్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ శాఖలకు చెందిన అధికారులంతా సూచించిన షెడ్యూల్ తేదీ లకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేసి నట్టు వివరించింది. స్థానిక ఎన్నికల నిర్వహణ గడువును సెప్టెంబర్ 30 నుంచి మరో 45 రోజుల పాటు పొడిగింపు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేసినట్టు వెల్లడించింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్షస్థానిక ఎన్నికలు జరగనున్న 31 గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు, శాంతి భద్రతల పరిస్థితి, ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. సోమవారం జిల్లా కలెక్టర్లు ( జిల్లా ఎన్నికల అధికారులు), కమిషనర్లు/ ఎస్పీలు, ఇతర జిల్లాస్థాయి ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ, పీఆర్శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ శాంతియుత వాతా వరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇద్దరు పిల్లలకు మించొద్దుమండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నట్టయితే పోటీ చేయడానికి అనర్హులు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ ఈ నిబంధన తీసుకువచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన ఎత్తి వేశారు. తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొనసాగుతోంది. రాష్ట్ర కేబినెట్లో ఈ అంశం చర్చకు రాగా, ఈ నిబంధనను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే పట్టణ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ హయాంలో ఈ నిబంధనను తొలగించారు. -
అదనంగా 23,973 పదవులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అను కున్న విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆయా వర్గాలకు అధికారికంగా 24 వేల అదనపు స్థానిక పదవులు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా స్పష్టంగా తేలకపోయినప్పటికీ 23,973 పదవులు అదనంగా బీసీలకు దక్కుతాయని చెపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని పేర్కొంటున్నాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కలిపి సుమారు 55,624 మంది బీసీ నాయకులు ఆయా పదవుల్లో కూర్చుంటారని, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశ ముందని అంటున్నాయి. 5,350కి పైగా సర్పంచులుగ్రామ పాలనకు అధ్యక్షులుగా ఉండే సర్పంచులుగా ఈసారి 5,350 మంది బీసీ నేతలు ఎన్నిక కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 సర్పంచ్ పదవుల్లో బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్లు అమలైతే ఈ మేరకు పదవులు దక్కనున్నాయి. గతంతో పోల్చుకుంటే 2,422 సర్పంచ్ పదవులు అధికంగా దక్కనున్నాయి. ఇక 1.12 లక్షలకు పైగా ఉన్న వార్డు సభ్యులకు గాను 47 వేలు, 5,749 ఎంపీటీసీ స్థానాల్లో 2,420 మంది బీసీలు ఎన్నిక కానున్నారు. అదే విధంగా చెరో 565 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు గతం కంటే 101 స్థానాలు అధికంగా చెరో 238 స్థానాలు దక్కుతాయని అంచనా. ఇప్పటివరకు రాష్ట్రంలోని 8 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఆ సంఖ్య 13కు పెరిగిన విషయం తెలిసిందే. ఇలా 31 జెడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు ఇప్పటికే 13 దక్కడం తెలిసిందే. కాగా గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 23కు తగ్గించడంతో పెద్ద ఎత్తున బీసీ నేతలు అధికారికంగా ప్రజాప్రతినిధులయ్యే అవకాశం కోల్పోయారు. ఇలా కోల్పోయిన వారు కనీసం 13,346 మంది ఉంటారని అంచనా. అయితే, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు అమలైతేనే బీసీలు కనీసం 50 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులు కానున్నారు. ఒకవేళ జనరల్ స్థానాల్లోనూ బీసీలను నిలబెడితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అధికారికంగా అమలు కాకపోతే ఎలాగూ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే అభ్యర్థులను నిలబెడతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇది తప్పనిసరి కాకపోవడంతో..ఆయా పార్టీలు బీసీలకు ఇచ్చే అవకాశాన్ని బట్టి వారికి లభించే పదవుల సంఖ్య ఆధారపడి ఉండనుంది. -
స్థానిక పోరుకు సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో దశ ఎన్నికలు అదే నెల 8న జరగనున్నాయి. మొత్తం మీద అక్టోబర్ 9న మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ, నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ (రెండు దఫాలకు) నవంబర్ 11న నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమే చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. మొత్తం ఐదు దశలు.. స్థానిక ఎన్నికల ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని చెప్పారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయంలో డీజీపీ జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్,పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పీఆర్ఆర్ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందలతో కలిసి ఆమె స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఖాళీల వివరాలతో కూడిన గెజిట్ను అధికారులు విడుదల చేశారని తెలిపారు. ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెప్పారు. ఇవి జారీ అయిన రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. హైకోరు ్టస్టే ఉత్తర్వులకారణంగా..14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలు, వీటిలోని 16 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని కమిషనర్ తెలియజేశారు. -
Hyd: గిన్నిస్ రికార్డులో ‘మన బతుకమ్మ కార్నివాల్’
హైదరాబాద్: దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన ఓ బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్నగర్ స్టేడియంలో ఈరోజ(సెప్టెంబర్ 29) నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూలయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగింది.. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి.. ఒకే వేదికపై సుమారు దివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశరు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్లో రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్నగర్ వేదికగా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్’కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇండోర్ సహా అవుట్ డోర్ స్టేడియాల్లో 64 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు.గ్రేటర్ జిల్లాలు సహా సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సుల్లో మహిళలను ఆదివారం ఉదయమే స్టేడియానికి రప్పించి, ఆయా పాటలకు శిక్షణ ఇప్పించారు. వేడుకలో భాగంగా పాడే పాటలు, ప్రదర్శనలపై ముందే రిహార్సల్స్ చేశారు. -
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో యథేచ్ఛగా భూ దందా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు, రాజకీయ పెద్దలే దళారులుగా మారి అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్న స్థలంలో పేదలు గుడిసె వేసుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో మాత్రం నిసిగ్గుగా వహిస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నేతల అనుచరులు ఏకంగా ఎకరాల కొద్దీ భూములు ఆక్రమిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా అధికారి అడ్డుకుంటే నాయకులే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూముల పరిస్థితి. జిల్లాలో అధికారులు ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టటం.. వారి వెంచర్ల కోసం ప్రభుత్వ, అసైన్డ్ భూములు, చెరువు, కుంటల బఫర్ జోన్, శిఖం భూములను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై అధికార యంత్రాంగ ఉదాసీనత భూ కబ్జాదారులకు వరంగా మారుతోంది.దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో బౌరంపేట రెవెన్యూలో సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి ప్రైవేట్ పట్టా ,అసైన్డ్ భూములలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆదేశాలను లెక్క చేయకుండా ప్రైవేటు వెంచర్ కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు రోడ్డులో ప్రైవేట్ ,అసైన్డ్ భూములను కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు రోడ్డు పనులకు అయ్యే వ్యయాన్ని వెంచర్ నిర్వాహకులే భరించేలా దళారులు ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత బిల్లులను సంబంధిత అధికారులు డ్రా చేసుకునేలా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించినట్లు సమాచారం. బండ్ల బాట విస్తరణ.. బౌరంపేట సర్వే నంబరు 166లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి గతంలో బండ్ల బాట ఉండేది. ఈ రోడ్డు సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి కుడి వైపు వెళ్లే దారిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో (HMDA Master Plan) 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన ఉంది. కానీ ఎడమ వైపు వ్యవసాయ పొలాలకు వెళ్లే బండ్ల బాటను మాస్టర్ ప్లాన్లో ఉన్నట్లుగా చూపించి 40 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. దాదాపు అరకిలో మీటరు పైగా రోడ్డు పనుల కోసం ఇరు వైపులా ఉన్న చెట్లను తొలగించారు.నిర్మాణ సంస్థ కోసమేనా..రోడ్డు వేస్తే మంచిదేనని కొందరు వాదిస్తుండగా.. దాని వెనుక ఓ పెద్ద మతలబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోడ్డులో కొంత భాగం పట్టా భూమి, మరి కొంత అసైన్డ్ భూమి ఉంది. ఈ రోడ్డు ద్వారానే ఓ బడా నిర్మాణ సంస్థ రైతుల నుంచి సుమారు 50 ఎకరాలు కొనుగోలు చేసి వెంచర్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు నిర్మాణ సంస్థ హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందటానికి 40 ఫీట్ల రోడ్డును చూపించాల్సి ఉండటంతో ప్రభుత్వ స్థలం నుంచి రోడ్డు వేసేలా సంబంధిత అధికారులతో బేరం కుదుర్చున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.కలెక్టర్కు ఫిర్యాదు.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ వెంచర్ కోసం, పంట పొలాలు, ప్రభుత్వ భూముల నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కలెక్టరేట్ ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ మల్కాజిగిరి ఆర్గీఓను విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ సదరు స్థలం పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కు కేటాయించినట్లుగా పేర్కొంటూ జిల్లా అధికార యంత్రాంగానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో ఆక్రమణలు ఇలా..పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెములలోని సర్వే నెం.739 నుంచి 749 వరకూ 147 ఎకరాల్లో 1985లో ఏకశిలానగర్ పేరుతో లే ఔట్ చేశారు. అందులోని 47 ఎకరాలను 2006లో వ్యవసాయ భూమిగా మార్చేసిన ఓ వ్యక్తి లే ఔట్ స్వరూపాన్నే మార్చారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లే ఔట్లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కబ్జా చేశారని పేర్కొన్నారు. అన్నోజిగూడలోని సర్వే నెంబర్లు 9,10లోని పదెక రాల లే ఔట్లో ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కును ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అన్నోజిగూడ సర్వే నెంబర్ 14లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయించగా, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి వదలివేశారు.దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసరలోని సర్వేనంబర్ 131లో 105.26 ఎకరాల ఫారెస్టు భూమి ఉండగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2 ఎకరాల స్థలంలో బండరాళ్లను పగులగొట్టి స్థలాన్ని చదును చేసి, భవన నిర్మాణ పనులు పారంభించారు. చీర్యాల గ్రామంలోని సర్వేనంబర్ 7,8లలో 12.5 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. ఇదే రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 152/2లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని అల్వాల్ మండలం జొన్న బండలోని వజ్ర ఎన్ క్లేవ్లో 900 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, దీంతో 236 ప్లాట్లకు పార్కు లేకుండా అవుతోందని స్థానికులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రా సర్కిల్ పరిధిలోని సర్వేనంబర్199/1 జమ్మిగడ్డలోని స్టేడియానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఫ్లాట్లు చేసి ఇళ్లు నిర్మించి, విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. -
రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగరంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రేపు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెన్రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్" (రోటరీ చిల్డ్రన్స్ పార్క్) వరకు అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న ఈ ఉత్సవాల కారణంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది.రేపటి ట్రాఫిక్ ఆంక్షలు- దారి మళ్లింప మార్గాలు ఇవే..తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ను రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అనుమతించరు.ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను తెలుగు తల్లీ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ప్రారంభం నుంచే కట్ట మైసమ్మ, డా. బీఆర్ అంబేద్కర్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. V.V. విగ్రహం నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్స్ హైమాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు.నల్లకుంట జంక్షన్ నుండి బుద్ధ భవన్ వైపు ట్రాఫిక్ను అనుమతించరు. అటు నుంచి వచ్చే వారిని నల్లకుంట X-క్రాస్ రోడ్, రాణిగంజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ 'యు' టర్న్ నుంచి తెలుగు తల్లీ జంక్షన్ నుంచి తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ - గాంధీ నగర్ టి జంక్షన్- గోశాల- ధోభి ఘాట్- స్విమ్మింగ్ పూల్- బండ మైసమ్మ- ఇందిరా పార్క్- కట్ట మైసమ్మ, తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది. ముషీరాబాద్, కవాడిగూడ నుండి చిల్డ్రన్స్ పార్క్ - అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. డా బీఆర్ అంబేదక్ర్ మిల్స్ నుంచి MRO ఆఫీస్, ధోభి ఘాట్స్వి, మ్మింగ్ పూల్, బండమైసమ్మ-,ఇందిరా పార్క్క, కట్టమైసమ్మ వైపు మళ్లించబడుతుంది.ఆర్టీసీ బస్సుల మళ్లింపుసికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్ వైపు వచ్చే అన్ని అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్-ఉపాకర్ జంక్షన్ వద్ద YWCA-సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట-ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్, -బర్కత్పురా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, చాదర్ఘాట్-రంగమహల్ మీదుగా ఎంజీబీఎస్ వైపు మళ్లించబడతాయి.ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో జంక్షన్ల వైపు ప్రజలు రాకుండా ఉండవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. V.V. విగ్రహం, ఖైరతాబాద్, పాత పిఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్ ,నెక్లెస్ రోటరీ, లిబర్టీ, రవీంద్ర భారతి, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్,, కట్టమైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లకుంట్ల జంక్షన్ల మీదుగా సాధ్యమైనంత మేర రాకండా ఉండటం మంచిదని పోలీస్ శాఖ కోరుతోంది. దీనిలో భాగంగా సాధారణంగా రోజూ ఈ మార్గాల్లో వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వారి వారి ప్రాంతాలు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని తమకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి చేసింది. పార్కింగ్ ఏర్పాటు ప్రాంతాలు ఇవే..స్నో వరల్డ్ఎన్టీఆర్ భవన్రేస్ రోర్స్ రోడ్బీఆర్కే భవన్ రోడ్హెఎమ్డీఏ పార్కింగ్సంజీవయ్య పార్కింగ్ ప్లేస్లుంబినీ పార్క్ ఎదురుగా -
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసిన ముఠా వివరాలన సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నాలుగు నెలలు దర్యాప్తు చేశాం. దేశంలో మొదటిసారి ఓ గ్యాంగ్ను పట్టుకున్నామని సీపీ తెలిపారు.‘‘పైరసీ వల్ల సినిమా నిర్మాతల కష్టం వృథా అవుతుంది. మూవీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 2023లో దేశంలో మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు పైరసీ వల్ల నష్టపోయారు. 2024లో తెలుగు ఇండస్ట్రీ 3700 కోట్లు నష్టపోయారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేశాం. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. టారెంట్ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు...సర్వర్స్ హ్యాకింగ్తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా తన యాప్లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే బృందాలను ఏర్పాటు చేశాముతమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్.. అత్తాపూర్లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమా కాపీ చేసాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించి జానా కిరణ్ కుమార్ నిందితుడని తేలింది. సింగిల్, అనేక మూవీని అత్తాపూర్లోని మంత్ర థియేటర్లో మొబైల్తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలభై మూవీలు థియేటర్ లో కాపీ చేసాడు.150 నుండి 500 డాలర్లు ప్రతి మూవీ కాపీ చేసినందుకు ఇస్తున్నారు. సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అర్సలన్ అహ్మద్ బీహార్ కు చెందిన వాడు. ఇతను కూడా హిందీ భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరల్కు పంపుతున్నాడు. సుధాకరన్ సత్యమంగళానికి చెందిన వ్యక్తి.. ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్కు ఇస్తాడు. కరూర్కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు. నాలుగు వెబ్సైట్లు 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసి ఈజీ మనీకి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు.’’ అని సీపీ వెల్లడించారు. -
హైదరాబాదీలకు గుడ్న్యూస్.. ‘రూ.5కే బ్రేక్ ఫాస్ట్’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పేదలు, కూలీలు, ఆటోడ్రైవర్లు, విద్యార్థులు వంటి వర్గాల భోజన భద్రతను మరింత బలోపేతం చేస్తూ ఇవాళ (సెప్టెంబర్ 29, సోమవారం) క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.భోజనం కేవలం రూ.5కే అందించే ఈ ప్రత్యేక పథకం ఇప్పటికే వేలాది మందికి ఆపన్నహస్తంగా నిలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 క్యాంటీన్లు నడుస్తుండగా, రోజుకు సగటున 30 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 12.3 కోట్ల భోజనాలు పంపిణీ చేయగా, రూ.254 కోట్లకుపైగా వెచ్చించారు. ఈ కొత్త క్యాంటీన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు, కూర్చునే సదుపాయం, తాగునీటి ఆర్వో ప్లాంట్, చేతులు శుభ్రం చేసుకునే వసతి, డ్రైనేజీ , ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కల్పించబడ్డాయి.లబ్ధిదారులకు రుచి, శుచితో కూడిన భోజనం అందించడం వీటి ప్రధాన లక్ష్యం. ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్ కూడా అందించే ప్రణాళికలు త్వరలో అమలులోకి రానున్నాయి. ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఆకలిలేని హైదరాబాద్ దిశగా మరొక అడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
ఆర్టీసీ ఎండీగా చివరి రోజు.. సజ్జనార్ ఏం చేశారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్(VC Sajjanar) తన చివరి రోజున విధుల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ, ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. సామాన్యుడిలా ఆర్టీసీ(TGSRTC) బస్సులో ప్రయాణించారు. బస్సులో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం చేశారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకున్నారు.ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ సోమవారం ఉదయం సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వరకు 113 I/M రూట్ సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీలో రవాణా సదుపాయాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో ముచ్చటించి.. సౌకర్యాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను టీజీఎస్ఆర్టీసీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.ఇక, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం.టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్… pic.twitter.com/qiBzq9odSI— TGSRTC (@TGSRTCHQ) September 29, 2025 -
TG: స్పీకర్ ముందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఈ విచారణకు తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ విచారణకు హాజరయ్యారు. కాసేపట్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరకానున్నారు.వచ్చే నెల ఒకటో తేదీన కూడా ఈ నలుగురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. ఆ షెడ్యూల్ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఒక్కో ఎమ్మెల్యే విచారణ గంటపాటు జరగనుంది. ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ ఈ విచారణ నిర్వహిస్తుంది.కఠిన ఆంక్షలు అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.👉ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి సందర్శకులకు అనుమతి ఉండదు👉మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదు. మీడియా పాయింట్తో పాటు అసెంబ్లీ భవనాల్లో ఎక్కడా ప్రెస్ మీట్ నిర్వహించకూడదు.👉మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా వారి శాసనసభాపక్ష కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది👉విచారణ జరిగే హాలులోకి పిటిషనర్లు, వారి న్యాయవాదులు, విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులెవరూ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకూడదు. ఎవరైనా విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు ప్రయత్నించినా, ఫొటోలు తీసినా ఆ ఉపకరణాలను అసెంబ్లీ వర్గాలు స్వా«దీనం చేసుకుంటాయి. ఇందుకు బాధ్యులైన వారి న్యాయవాదులను విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అనుమతించరు.ఏ ఎమ్మెల్యే ఎప్పుడంటే..!టి. ప్రకాశ్గౌడ్- ఉదయం 11–12 గంటల వరకుకాలె యాదయ్య 12 నుంచి ఒంటిగంట వరకు గూడెం మహిపాల్రెడ్డి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు బండ్ల కృష్ణమోహన్రెడ్డి 3 నుంచి నాలుగు గంటల వరకు (అక్టోబర్ ఒకటో తేదీన కూడా ఇదే సమయాల్లో ఆయా ఎమ్మెల్యేలను మరోమారు విచారించనున్నారు) -
టాలీవుడ్ నటికి కాబోయే భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: నేను జీవితంలో చాలా తప్పులు చేశాను... ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన ఓ నటికి కాబోయే భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్కు చెందిన సోహాని బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమెకు రాజస్తాన్కు చెందిన సవాయ్ సింగ్ అనే యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గత జూలైలో ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న సోహాని కుమారి అక్కడే ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. శనివారం ఉదయం సవాయ్ సింగ్ ప్రశాసన్నగర్లోని ఆమె ఇంటికి వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి గచి్చ»ౌలిలోని ఎవరి కార్యాలయాలకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం సోహాని ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆత్మహత్య చేసుకునే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. సోహాని కుమారితో పరిచయానికి ముందు సవాయ్ సింగ్కు మరో యువతితో స్నేహం ఉండేదని ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా శుక్రవారం ఉదయం 11.47 గంటలకు సవాయ్ సింగ్ ఆమె ఉంటున్న ఫ్లాట్ వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకునిని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నారు. -
నేడు స్థానిక నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ డా.జి.సృజన అందజేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (హైదరాబాద్, మేడ్చల్ మల్కా జిగిరి అర్బన్ మినహాయించి) సంబంధించిన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ), ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరా రు నివేదికను సమరి్పంచారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్లాలంటూ ఎస్ఈసీకి ‘కాన్సెంట్’చేరినట్టుగా చెబుతున్నారు. ఎస్ఈసీకి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు జీఓ, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా, రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయా లంటూ ఆదేశాలు అందినట్టుగా అధికారవర్గాల్లో చర్చసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం నోటిఫికేషన్ విడుదల చేస్తే, వెంటనే మూడురోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు సమాచారం. మొదట రెండు దశల్లో (గతంలో మూడు దశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేసి, ఆ తర్వాత వారం, పదిరోజుల అంతరంలోనే మూడు దశల్లో (గతంలోనూ మూడు దశల్లో) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.సోమవారం ఎస్ఈసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై రిటరి్నంగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పీఆర్ కమిషనరేట్ కార్యాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించి మూడేసీ చొప్పున రిజర్వేషన్ల ఖరారు సైన్డ్ కాపీలు చేరాయి. వీటిని ఎన్నికల కమిషనర్కు పీఆర్ డైరెక్టర్ చేరవేశారు. జిల్లా పరిషత్ల స్థాయిలో జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ), మండల, గ్రామ పంచాయతీల పరిధిలోని స్థానాల రిజర్వేషన్లను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ)లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.పీఆర్ డైరెక్టర్ సమరి్పంచిన రిజర్వేషన్ల జాబితాలపై రాత్రి పొద్దుపోయే దాకా ఎస్ఈసీ అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా అందిన రిజర్వేషన్ల సమాచారాన్ని క్రోడీకరించినట్టు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల స్థానాలు, ఎన్ని దశల్లో నిర్వహణ, తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎస్ఈసీ అధికారులు నోట్ ఫైల్ కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ ఫైల్పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతకం కాగానే వెంటనే సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. అయితే 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్కాన్డ్ కాపీలను ఎస్ఈసీ కోరడంతో...అర్ధరాత్రి దాకా ఈ పనిలో పీఆర్ అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం.నోటిఫికేషన్ జారీకి ముందే ఎస్ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. దీనిపై లేదు. స్పష్టత కొరవడింది. -
విమలక్క పాట.. సీతక్క కోరస్
సాక్షి, హైదరాబాద్/అంబర్పేట: అంబర్పేటలోని బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి విమలక్క, కనకవ్వ సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వేదికపై సీఎంరేవంత్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు మాత్రమే కూర్చునే అవకాశం కల్పించారు. తన స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి.. స్టేజ్ సమీపంలో నిల్చుని ఉన్న స్థానిక మహిళలు, కనకవ్వను గమనించారు. దీంతో తన పక్కన, వెనుక ఉన్న సీట్లను ఖాళీ చేయించి వారిని పైకి పిలిచి కూర్చోబెట్టారు.‘బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ, అమ్మ, అక్కల పండుగ. వారికే ప్రాధాన్యం ఇవ్వాలి’అని సీఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవం విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విమలక్క.. ఈ చెరువుపై రాసిన ఓ పాటను పాడారు. దీనికి కొందరు కోరస్ కావాలని కోరగా.. వేదికపై ఉన్న మంత్రి సీతక్క వెళ్లి కోరస్ అందించారు. ఆమె ఈ పాటతో పాటు కనకవ్వ పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటకూ కోరస్ ఇచ్చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం సెక్యులర్ పండుగగానూ ప్రకటించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
ఉగ్ర గోదారి.. మహోగ్ర కృష్ణా
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/బోధన్/బాల్కొండ/కాళేశ్వరం/దోమలపెంట/ధరూర్: నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఉపనదులు ఉప్పొంగి కృష్ణమ్మ మహోగ్రరూపం..గోదావరి ఉగ్రరూపం దాచ్చాయి. ప్రధానంగా నారాయణపూర్, తుంగభద్ర డ్యాం దిగువన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా ఉపనదులు మూసీ, హంద్రీ, తుంగభద్ర, బీమా వరదెత్తుతున్నాయి. దీనికి ప్రధాన పాయ నుంచి వస్తున్న వరద తోడుకాగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల ప్రాజెక్టులోకి 5.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లన్నీ ఎత్తేసి 5.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర, సుంకేశుల బరాజ్ల నుంచి తుంగభద్ర ద్వారా 79,268 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 27 వేల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయలోకి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,93,680 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 5,18,650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్లోకి 6,25,511 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా, 26 గేట్లు ఎత్తి అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు. » హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీనది కూడా మహోగ్రరూపం దాల్చింది. కృష్ణా వరదకు మూసీ ఉధృతి తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,86,906 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 6.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో 6,39,737 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరి ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తుతున్నాయి. తెలంగాణలో మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఎగువ నుంచి కూడా వరద వస్తుండంతో 19 గేట్లు ఎత్తి 4.59 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5.72 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 6.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీనికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లోకి 8.03 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఉన్న సీతమ్మ సాగర్లోకి 8.94 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టులోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బరాజ్లోకి భారీ వరద రాగా, 10,09,208 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అంత్రరాష్ట్ర రవాణా నిలిపివేత బోధన్ మండలంలోని ఖండ్గాం వద్ద మంజీర వంతెన మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి రవాణాను నిలిపివేశారు. కందకుర్తి వద్ద గోదావరి నది వంతెన మీదుగా వరద నీరు ప్రవహించడంతో కందకుర్తి – ధర్మాబాద్ (మహారాష్ట్ర) మధ్య రవాణాను అధికారులు నిలిపివేశారు. » గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతికి నిజామాబాద్–పండరీపూర్ ఎక్స్ప్రెస్ రైలును అధికారులు ఆదివారం తాత్కాలికంగా రద్దు చేశారు. నవీపేట మండలంలోని యంచ శివారులో గల గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జికి మూడడుగుల వ్యత్యాసంలో నది ప్రవహిస్తోంది.ఏడుపాయలను ముంచెత్తిన వరద పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు పెరిగింది. వరద ఉధృతికి ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఎదుట గల క్యూలైన్లు, షెడ్డు రేకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆలయాన్ని ముంచెత్తుతూ సమీపంలో గల యాగశాల నుంచి వరద పోటెత్తుతోంది. -
1న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దానికి సమీపంలోని మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం నాటికి అదే ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మంగళవారం నాటికి ఈశాన్యం అరేబియన్ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఒకటి పశి్చమ విదర్భ, దాని సమీపంలోని మధ్య మహారాష్ట్ర ప్రాంతంలోని అల్పపీడన కేంద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్రా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రెండ్రోజుల్లో ముగియనున్న నైరుతి సీజన్ నైరుతి రుతు పవనాల సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకున్న మధ్య కాలాన్ని నైరుతి రుతు పవనాల సీజన్గా పరిగణిస్తారు. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నైరుతి రుతు పవనాల ఉపసంహరణ పూర్తి కాగా, వచ్చేనెల రెండో వారం చివరి నాటికి భారత భూభాగం నుంచి పూర్తిగా తిరోగమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈసారి నైరుతి రుతు పవనాల సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. తొలి అర్ధభాగం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదైనా, ఆ తర్వాత రుతు పవనాల కదలికలు అత్యంత చురుగ్గా ఉండడంతో వానలు జోరందుకున్నాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటున 74.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 98.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 35 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలతో సీజన్ వర్షపాతం 100 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే... 147 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 291 మండలాల్లో అధిక వర్షపాతం, 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 2 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
చెరువుల్ని చెరబడితే తాటతీస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలను రక్షించడంతోపాటు మూసీకి పునరుజ్జీవం కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చెరువుల్ని చెరబడితే తాట తీస్తామని హెచ్చరించారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన అంబర్పేటలోని బతుకమ్మ కుంటను ఆదివారం సీఎం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదన మేరకు ఈ చెరువుకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పేరు పెట్టనున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనలతో మూసీ ప్రక్షాళన.. కోవిడ్ తర్వాత పర్యావరణ మార్పులతో దేశవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోందని, ఒకటి రెండు గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందని సీఎం తెలిపారు. దీన్ని ముందే ఊహించి చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ‘నిజాం హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచి్చన ప్రణాళిక ఆధారంగానే ఇప్పు డు మూసీని అభివృద్ధి చేయనున్నాం. నగరంలోని ఎమ్మెల్యేలు వారివారి పరిధిలో మూసీతోపాటు బఫర్జోన్లో నివసిస్తున్న పేదల వివరాలు సేకరించండి. వారందరికీ ప్రభు త్వం న్యాయం చేస్తుంది.హైడ్రా పెట్టినప్పుడు కొందరికి అర్థం కాలేదు. అర్థమైన కబ్జాకోరులు బురద చల్లాలని చూశారు. ఓర్పు, సహనం, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాం. గుంటూరు, గుడివాడ, అమెరికాలో చదివి వచి్చన వాళ్లకు పేదరికం అంటే విహారయాత్ర లాంటిది. బెంజ్ కార్లలో తిరుగుతూ పేదల కష్టాలు చూస్తున్నం అంటారు. నేను చిన్నప్పటి నుంచి పేదల మధ్యలో, వారి కష్టాలను చూస్తూ పెరిగాను. మూసీని అభివృద్ధి చేసిన తర్వాత చుట్ట చుట్టి ఇంటికి పట్టుకుపోతానా? విదేశాలకు తరలించేస్తానా? అభివృద్ధి చేసి అనర్థాలు తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తు న్నా.మూసీతోపాటు బఫర్జోన్లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం. దీనికోసం త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అధికారులను క్షేత్రస్థాయికి పంపిస్తాం. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా పునరావాస చర్యలు తీసు కుంటాం. అంబర్పేటలో అన్ని విభాగాల కార్యాలయాలతో ఓ మినీ సెక్రటేరియట్ నిర్మి స్తాం. డిసెంబర్ 9 లోపే అనుమతులు, నిధులు మంజూరు చేస్తాం’అని ప్రకటించారు. కబ్జా చేసిన వ్యక్తే ఆ నాయకుడికి పూలు చల్లాడు.. ‘బతుకమ్మ కుంటను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అతడే ఆ నాయకుడు (ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) వస్తే ఆకాశం నుంచి పూలు చల్లాడు. బతుకమ్మ కుంటను చెర విడిపించి కేవలం 100 రోజుల్లో అభివృద్ధి చేశాం. తమ్మిడికుంటలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ యజమాని నాగార్జున నాకు మంచి మిత్రుడు. ఖాళీ చేయమని చెప్పినా వినకపోవడంతో మా అధికారులు దానిని కూల్చేశారు. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చి రెండు ఎకరాలు అప్పగించారు. ఎవరైనా తక్కు వ రేటుకు ఇస్తున్నామని ప్రభుత్వ స్థలాలను అమ్మితే తీసుకోవద్దు. మూసీ నిర్వాసితులకు శాశ్వత ఇళ్లను నిర్మించి ఇస్తాం.ప్రగతి భవన్కు జ్యోతిరావు ఫూలే పేరు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వీహెచ్ సలహాలతో చేసినవే’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం కల్పించడం ఆరంభం మాత్రమేనని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువు చుట్టూ ఉన్న పేదల ఇళ్లను కూల్చకుండానే చెరువును అభివృద్ధి చేశామని వివరించారు. అంబర్పేట నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. -
గంజాయి రవాణాకు అడ్డుకట్ట!
సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంత నిఘా పెడుతున్నా ఈ ముఠాలు వారి కళ్లు గప్పి గంజాయి రవాణా చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుతోపాటు ఒడిశా ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి వస్తున్న గంజాయి రోడ్డు మార్గంలో తెలంగాణ మీదుగా గోవా, బెంగళూరు, ముంబయితోపాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలకు లారీలు, ట్రావెల్స్, క్యాబ్లలో తరలిస్తున్నారు.అయితే రోడ్డు మార్గాన గంజాయి తరలిస్తుంటే స్థానిక పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు నిఘా పెంచడంతో రైలు మార్గాన్ని ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై ఫోకస్ పెంచారు. రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న సప్లై ఛైన్కు అడ్డుకట్ట వేసేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.ఇటీవల ఆర్పీఎఫ్ డీజీ సోనాలి మిశ్రాతో ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఎన్సీబీ సంయుక్త దాడులు నిర్వహించాలని నిర్ణయించింది. 2047 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియానే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మత్తు పదార్థాలు గుర్తించేందుకు జాగిలాల వినియోగం రైళ్లలో రవాణా అవుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు అవసరం మేరకు జాగిలాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ముఠాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ గంజాయి వాసన బయటకు పొక్కకుండా జాగ్రత్తగా సీల్ చేసిన ప్యాకెట్లను తమ వద్ద పనిచేసే డీలర్లకు ఇచ్చి ఏసీ కోచ్లలో రవాణా చేయిస్తున్నట్టుగా కూడా అధికారులు ఇటీవల కొన్ని కేసుల్లో గుర్తించారు. కొన్నిసార్లు ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలకు కొంత కమీషన్ ఇచ్చి వారి లగేజీ బ్యాగులలో దుస్తుల మధ్య ప్యాకెట్లు దాచి రాష్ట్రా లు దాటిస్తున్నారు.ఈ తరహాలో జరుగుతున్న గంజాయి కట్టడికి ఆకస్మిక తనిఖీలు, ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారంతో దాడులు నిర్వహించే వ్యూహాలు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రైల్వే స్టేషన్లు, రైళ్లలోని ఎలక్ట్రానిక్ బోర్డులలో సూచనలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా గంజాయి రవాణా అవుతున్న మార్గాలు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమాచార వినిమయం కోసం ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మన బతుకమ్మ కార్నివాల్
హుడాకాంప్లెక్స్ (హైదరాబాద్): ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగనుంది. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమివ్వబోతున్నాయి. ఒకే వేదికపై పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేయబోతున్నారు. మన బతుకమ్మ కారి్నవాల్ పేరుతో నిర్వహించనున్న ఈ అద్భుత దృశ్య కావ్యానికి సరూర్నగర్ స్టేడియం వేదిక కాబోతోంది. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ఈవెంట్ నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్నగర్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్’కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇండోర్ సహా అవుట్ డోర్ స్టేడియాల్లో 63 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ జిల్లాలు సహా సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సుల్లో మహిళలను ఆదివారం ఉదయమే స్టేడియానికి రప్పించి, ఆయా పాటలకు శిక్షణ ఇప్పించారు. వేడుకలో భాగంగా పాడే పాటలు, ప్రదర్శనలపై ముందే రిహార్సల్స్ చేశారు. సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నిర్వహించనున్న బతుకమ్మ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డులో సంస్థ ప్రతినిధులు నమోదు చేయనున్నారు. సీఎం సహా పలువురు మంత్రుల రాక వేడుకలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎ ల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వా హనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజా, టూరిజం ఎండీ క్రాంతి, పలువురు అధికారులు స్టేడి యానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. -
అన్నింటా.. అందరిలోనూ మైక్రోప్లాస్టిక్స్ !
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం, పర్యావరణ వ్యవస్థలపై అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలైన మైక్రో ప్లాస్టిక్స్ పెనుప్రభావం చూపుతున్నాయి. గాలి, తాగునీరు, ఆహారం ద్వారా మనుషుల శరీరంలోకి చొరబడుతున్నాయి. ఊపిరితిత్తులు, రక్తం, మాయ కణజాలం (ప్లసెంటల్ టిష్యూ)లోకి చేరి వాపు, మంట (ఇన్ఫ్లమేషన్)కు, హార్మోన్ల అసమతౌల్యతకు కారణమవుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలకు కారణమయ్యే విషపూరిత రసాయనాలు, వ్యాధికారకాలను మోసుకేళ్లే వాహకాలుగా పనిచేస్తున్నాయి. అతిపెద్ద సవాళ్లలో ఒకటి... మైక్రో ప్లాస్టిక్స్ పర్యావరణంలోకి ప్రవేశించాక వాటిని తొలగించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఇవి ఒక మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య పరిమాణంలో ఉండటమే అందుకు కారణం. ప్లాస్టిక్ పాలిమర్లు మన్నికైనవిగా, రసాయన విచ్చిన్నానికి నిరోధకతను కలిగి ఉండేలా రూపొందించడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ వాతావరణంలో వందల, వేల సంవత్సరాలపాటు కొనసాగే గుణం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా భౌతిక, రసాయన వాతావరణం (యూవీ రేడియేషన్, వేడి మొదలైనవి) కారణంగా ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగ్ల వంటి పెద్ద ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా విచ్చిన్నమై వాతావరణంలో కలిసిపోతున్నాయి. దీంతో వాటిని భారీ స్థాయిలో శుభ్రపరిచే ప్రయత్నాలు దాదాపు అసాధ్యంగా మారాయి. వివిధ అధ్యయనాల్లో వెల్లడి... ప్రపంచంలో ఏటా 265 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. 2015 నాటి అంచనా ప్రకారం మహాసముద్రాల్లో 15 నుంచి 51 ట్రిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. ఇవి దాదాపు 93 నుంచి 236 మిలియన్ టన్నుల మైక్రోప్లాస్టిక్లకు సమానం. మైక్రోప్లాస్టిక్లు ఆహార వ్యవస్థలోకి చొచ్చుకుపోవడం లేదా చర్మం ద్వారా కూడా మనుషుల్లోకి చేరుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 11,845 నుంచి 1,93,200 మైక్రోప్లాస్టిక్ కణాలు మనుషుల్లోకి చేరుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.2021 నాటి అధ్యయనం ప్రకారం... యూరప్లోని 90% కంటే ఎక్కువ మంచినీటి సరస్సులు, నదులు మైక్రోప్లాస్టిక్లతో కలుషితమయ్యాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి హెక్టార్ వ్యవసాయ నేలల్లో 0.1 నుంచి 0.5 మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలు ఉండొచ్చని వెల్లడైంది. ఇది నేల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు పంటల ద్వారా ఆహార వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ 2020 అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని గాలి నమూనాల్లో నిత్యం చదరపు మీటర్కు 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని అంచనా. 2022లో ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 50% కంటే ఎక్కువ మంది (సర్వే చేసిన వారిలో) రక్తప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించారు.ఊపిరితిత్తులు, రక్తం ద్వారా అవయవాల్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరడం వల్ల ఆయా అవయవాల్లో వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కలుగుతుంది. అలాగే హార్మోన్ల అసమతౌల్యతకు దారితీస్తుంది. విషపూరిత రసాయనాలు, వ్యాధికారకాలను మోసుకేళ్లే వాహకాలుగానూ మైక్రోప్లాస్టిక్స్ పనిచేస్తున్నాయి. ప్రజలు వ్యక్తిగత స్థాయిలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై ఆధారపడడాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి మైక్రోప్లాస్టిక్స్– వాటి రూపాలు ఇలా...⇒ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: టూత్పేస్ట్లు, స్క్రబ్లు, ఎక్స్ఫోలియెంట్లు, మైక్రోబీడ్స్ ఉన్న లోషన్లు. ⇒ సింథటిక్ దుస్తులు: పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్తో తయారు చేసిన బట్టలు ఉతకడం వల్ల విడుదలవుతాయి. ⇒ ప్లాస్టిక్ గుళికలు: ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే చిన్న ప్లాస్టిక్ రెసిన్ గుళికలు (నర్డిల్స్) ⇒ వ్యవసాయ రసాయనాలు: ఎరువులు, పురుగుమందుల్లో (ఉదా. ప్లాస్టిక్ పూత పూసిన ఎరువులు) ఉంటాయి. ⇒ పెద్ద ప్లాస్టిక్ శిథిలాలు: కాలక్రమేణా చిన్నచిన్న ముక్కలుగా విరిగిపోయే ప్లాస్టిక్ సీసాలు, సంచులు, ప్యాకేజీలు. ⇒ చేపలు పట్టే పరికరాలు: వలలు, లైన్లు, మైక్రోప్లాస్టిక్లుగా క్షీణించే ఇతర పరికరాలు. ⇒ టైర్లు: వాహనాల టైర్లు అరిగిపోవడం వల్ల పర్యావరణంలోకి చిన్న ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. -
అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్: అంబర్ పేట బతుకమ్మ కుంటను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం(సెప్టెంబర్ 28వ తేదీ) ప్రారంభించారు. పాడు పడ్డ చెరువును ఏడున్నర కోట్ల రూపాయిలతో పునరద్ధరించింది హైడ్రా. ఈ మేరకు బతుకుమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించిన తర్వాత ప్రారంభించారు. బతుకమ్మ కుంటకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా బతుకమ్మ కుంటలో స్వయంగా మొదటి బతుకమ్మను వదిలారు. బతుకమ్మకు చీర, సారె అందజేశారు సీఎం రేవంత్.సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ హైడ్రా తీసుకొచ్చిమంచి పని చేస్తుంటే బురదజల్లారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు.. ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గంటలో 40 సెం.మీ వర్షం కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మూసీ మురికికూపంలా మారిపోయింది. ఈ బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాటం చేశారు. ఈ రోజు చాలా సంతోషకరమైన దినం’ అని పేర్కొన్నారు. -
వైభవంగా శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర
సాక్షి, జగిత్యాల: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఆభరణాలను యాకర్పల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల దర్శించుకుని, సాంప్రదాయ ప్రకారం స్వయంగా ఎత్తుకునీ ఐదడుగులు వేయడం జరిగింది. అమ్మవారు సారంగాపూర్ గ్రామంలో ఎంటర్ అయ్యే ముందు ఎస్పీ ఆభరణాలు ఎత్తుకోవడం సంప్రదాయంగా వస్తుంది. జాతర సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో వారి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన గంగనీళ్ల జాతర ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.అడెల్లి మహాపోచమ్మ ఆలయం గంగనీళ్ల జాతరకు ముస్తాబైంది. ప్రతి ఆదివారం అమ్మను భక్తులు కొలుస్తున్నప్పటికీ ఏడాదికోసారి జరిగే ఈ గంగనీళ్ల జాతర ఉత్సవాలు ప్రత్యేకమని చెప్పాలి. మహాలయ అమావాస్య తదుపరి వచ్చే శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. ఈ నెల 27, 28 తేదీల్లో గంగనీళ్ల జాతరను నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలితో పాటు దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 27న అడెల్లి గ్రామంలోని సేవాదారుల ఇంటి నుంచి అమ్మవారి ఆభరణాలు, వెండి కడవతో గోదావరికి పాదయాత్రగా పయనమవడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు అమ్మవారి ఆభరణాలను అనుకరిస్తూ అడెల్లి, సారంగాపూర్, యాకర్పల్లి, వంజర్, ప్యారమూర్ మీదుగా దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్, సాంగ్వి నుంచి సాయంత్రం గోదావరి తీరానికి చేరుకున్నారు.. అక్కడే రాత్రి జాగరణ చేసిన తిరిగి ఆదివారం వేకువజామున ఆభరణాలను పవిత్ర గోదావరిలో నీటితో శుద్ది చేశారు. తిరిగి అవే గ్రామాల మీదుగా రాత్రికి అడెల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక వెండి కడవలో తీసుకొచ్చి గోదావరి నీటిని స్థానిక కోనేటి నీటితో కలిపి అమ్మవారికి జలాభిషేకం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్గింది. ప్రతీ ఏటా జరిగే ఈ జాతరకు నిర్మల్ జిల్లా ప్రాంతవాసులే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, పక్కనే ఉన్న మహరాష్ట్ర ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగనీళ్ల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు.