Hyderabad
-
ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.గమనించిన చుట్టు పక్కల వారు డయల్ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మాక్డ్రిల్స్.. వెల్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ యుద్ధ సన్నద్ధత నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం సందర్భంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా, వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తూ కేంద్రం ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో మాక్డ్రిల్స్ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన మాక్డ్రిల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా.. గోల్కొండ: గోల్కొండ ఆరి్టలరీ సెంటర్ ఆధ్వర్యంలో నానల్నగర్ అవలాన్ కాంప్లెక్స్ వద్ద డీఎఫ్ఓ జై కృష్ణ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకుముందు అవలాన్ కంప్లెక్స్కు దారి తీసే అన్ని రోడ్లను మిలిటరీ, స్థానిక పోలీసులు దిగ్బంధనం చేశారు. అరగంట పాటు రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అవలాన్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ మాక్ డ్రిల్ను ప్రజలు ఉత్కంఠగా తిలకించారు. రియల్ లైఫ్లో మొదటిసారి సైన్యం మెరుపుదాడులు, సాహసోపేత సైన్య విన్యాసాలను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. మరోవైపు శత్రు స్థావరాలపై దాడులు చేయడం, తమకు తాము ఏ విధంగా రక్షించుకోవడం లాంటి సైనికుల విన్యాసాలు వారి ధైర్య సాహసాలను ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. సుమారు 29 నిమిషాల పాటు జరిగిన మాక్ డ్రిల్ దేశరక్షణ, శత్రు నిర్మూలన తదితరాలపై సైనికుల ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరో వైపు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిశ్శబ్దం ఆవహించింది. కొందరు తమ ఇళ్లలోని విద్యుత్ కనెక్షన్లను ఆఫ్ చేయగా మరికొందరు మాక్ డ్రిల్ సూచనలను పాటిస్తూ ఎల్రక్టానిక్ పరికరాలు, ఎల్పీజీ గ్యాస్ స్వీచ్లను ఆఫ్ చేశారు. మే ఫ్లవర్లో సైరన్ల మోత.. ఉప్పల్/మల్లాపూర్: ఉప్పల్ మల్లాపూర్ మే ఫ్లవర్ అపార్టుమెంట్లో బాంబుల మోత.. స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. అపార్టుమెంట్ వాసులు ఎక్కడికక్కడ తలుపులు వేసుకున్నారు. లైట్లు బంద్ చేశారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. చెలరేగిన మంటలు.. ఫైరింజిన్లు.. అంబులెన్స్లు.. వైద్య బృందం, పోలీసులు డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ సిబ్బంది.. ఉరుకులు.. పరుగులు.. క్షతగాత్రుల తరలింపు.. ఇలా మాక్డ్రిల్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. యుద్ధ సమయాల్లో అనుకోని విపత్తు వస్తే అపార్టుమెంట్లో నుంచి ఎక్కడ నుంచి బయట పడవచ్చు లాంటి అంశాలను మాక్డ్రిల్లో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మాక్డ్రిల్లో మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పొత్రూ, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి, జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, బీజేఈ అధికారి ప్రసన్న కుమార్, ఏడీఎఫ్ఎస్ ఫైర్ సరీ్వస్ అధికారి వి. శ్రీనివాస్, హైడ్రా అధికారి పాపయ్యతో పాటు 150 మంది ఎన్సీసీ విద్యార్థులు, 70 మంది పోలీస్ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కనీల నుంచి భయాందోళనతో.. సంతో‹Ùనగర్: ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ట్విన్ సిటీస్ బీపీఎస్లో బుధవారం సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అగి్నమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ను నిర్వహించారు. ట్విన్ సిటీస్ టవర్స్లో ఒక్కసారిగా బాంబులు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనతో బాల్కనీల నుంచి తమను కాపాడాలంటూ అరుపులు, కేకలు వేయడంతో స్థానిక పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు దాడిలో తీవ్ర గాయాలకు గురైన క్షతగాత్రులను ఒక్కొక్కరిని అగి్నమాపక శాఖకు చెందిన భారీ నిచ్చెనల ద్వారా జాగ్రత్తగా కిందికి దించడం... వారిని అంబులెన్స్ సహాయంతో వైద్య చికిత్సల నిమిత్తం కంచన్బాగ్ అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన అపార్ట్మెంట్లో ఉన్న బా«ధితులను ప్రత్యేక వాహనాలలో కేంద్రీయ విద్యాలయానికి తరలించారు. ఆ తర్వాత ఇదంతా మాక్డ్రిల్లో భాగమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. మాక్ డ్రిల్లో హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, సౌత్ జోన్ డీసీపీ అశోక్, సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ, జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న, మురళీమోహన్ రెడ్డి, సౌత్, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ రఘు, ట్రాఫిక్ డీసీపీ–2 అశోక్ కుమార్, డీసీపీ–3 ఆర్.వెంకటేశ్వర్లు, సౌత్, ఈస్ట్ జోన్ ఏసీపీ వి.చంద్ర కుమార్, వైద్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ బిర్జీస్ ఉన్నీసా, మొత్తం 12 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అంతటా అప్రమత్తం.. కంటోన్మెంట్: ఈస్ట్మారేడుపల్లి మన్భుమ్ అపార్ట్మెంట్ ఆవరణలో నిర్వహించిన మాక్డ్రిల్లో వివిధ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు అపార్ట్మెంట్ ముందు ఓ బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకున్నారు. రెండు ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు అపార్ట్మెంట్ వద్దకు వచ్చాయి. ఇంతలోనే ఎన్సీసీ క్యాడెట్లు పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ సిబ్బంది పరుగు పరుగున అపార్ట్మెంట్లోకి చేరిపోయారు. క్షతగాత్రులను ఒక్కొక్కరిగా స్ట్రెచర్లు, వీల్చైర్లపై కిందకు తీసుకొచ్చారు. అప్పటికే అపార్ట్మెంట్ ఎదుటకు చేరుకున్న అంబులెన్స్లలోకి వారిని చేర్చి ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఏదైనా ఆపద సంభవిస్తే ఎలా స్పందించాలో వివరిస్తూ చేసిన మాక్డ్రిల్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయా శాఖల సిబ్బంది పేర్కొన్నారు. మారేడుపల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ను నార్త్జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, ఫైర్ సేప్టీ ఆఫీసర్ శ్రీధర్, కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ పరిశీలించారు. సికింద్రాబాద్ స్టేషన్లో అలర్ట్ సికింద్రాబాద్: పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతను మూడింతలు పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో రెట్టించిన అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 50 మందికి ఒక బృందం చొప్పున మూడు బృందాలకు చెందిన 150 మంది రైల్వే రక్షణ ప్రత్యేక దళం (ఆర్పీఎస్ఎఫ్) పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మోహరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికే 100 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. 100 మంది ప్రత్యేక ఆర్పీఎఫ్ పోలీసులు మూడు షిఫ్టుల్లో (24 గంటలు) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పహారా కాస్తున్నారు. మరో 50 మంది పోలీసులు మొబైల్ టీంలుగా ఏర్పడి సేటషన్ పరిసరాల్లో గస్తీ నిర్వహించడంతోపాటు, స్టేషన్కు వచి్చవెళ్లే వ్యక్తులపై నిఘా వేస్తున్నారు. జీఆర్పీ పోలీసుల సహకారంతో ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న అన్ని రైళ్లలోనూ రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు, పది ప్లాట్ఫామ్లలో సంచరించే వ్యక్తుల లగేజీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరికొందరు పోలీసులను మఫ్టీలో ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, ప్రవేశమార్గాల పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించిన సందర్భాల్లో మొబైల్ ద్వారా రైల్వే కంట్రోల్ రూం (హెల్ప్లైన్) 139 నంబరు ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఆరు ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బుధవారం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించగా... ఆరు కీలక, సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్ జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిఘా వర్గాలు ఈ సంస్థల్ని ఎంపిక చేశాయి. ఈ ఆరూ రక్షణ శాఖకు సంబంధించివే కావడం గమనార్హం. సికింద్రాబాద్, తిరుమలగిరి, మారేడ్పల్లి, బోయిన్పల్లిల్లో ఉన్న కంటోన్మెంట్లతో పాటు మెహిదీపట్నం, గోల్కొండల్లో ఉన్న గారిసన్ ప్రాంతాలను సెక్యూరిటీ రిహార్సల్స్ కోసం రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మంగళవారమే డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ రిహార్సల్స్లో భద్రత బలగాలతో పాటు పోలీసు విభాగం నుంచి ఏసీపీ ర్యాంకు అధికారి, ఆక్టోపస్ కమాండోలు పాల్గొన్నాయి. ఈ సెక్యూరిటీ రిహార్సల్స్ నిర్వహణ కోసం హైదరాబాద్ పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఏసీపీలను కేటాయించారు. ఎలా జాగ్రత్తపడాలో బోధపడింది.. అత్యవసర సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేది మాక్ డ్రిల్తో అర్థమైంది. మే ఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో 370 ప్లాట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రెండుసార్లు ట్రయల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అపార్ట్మెంట్ మొత్తం మాక్డ్రిల్లో భాగస్వాములు అయ్యారు. – బీవీ రావు, మల్లాపూర్, మే ప్లవర్ గ్రాండ్ అధ్యక్షుడు కళ్లకు కట్టినట్లు చూపించారు బాంబులు పేలినప్పుడు, ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి, బాంబులు పేలి్చనప్పుడు సీన్ఎలా ఉంటుందో అచ్చం అలాగే మాక్డ్రిల్తో అవగాహన కలి్పంచారు. మహిళలు, చిన్నారులు ఎలా జాగ్రత్త పడాలో మాక్డ్రిల్తో అవగాహన కలిగింది. – జ్యోతి రాణి. మే ఫ్లవర్ అపార్ట్మెంట్ వాసిఎన్నో అంశాలు తెలిశాయి.. అనుకొని విపత్తు సంభవించినప్పుడు మనం ఎలా బయట పడాలి, ఆపదలో ఉన్న వారిని సైతం ఎలా గట్టేకించాలనే అంశాలు బోధపడ్డాయి. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఎటాక్ జరిగినప్పుడు ఎలా మెలగాలో చూపించారు. మాక్డ్రిల్ వల్ల మాలో భయం కూడా పోయింది. – మల్లేష్, మే ఫ్లవర్ అపార్టుమెంట్ వాసి -
బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో హౌస్కీపింగ్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కిన్ షో నుంచి స్కిల్ షోగా..
బ్యూటీ విత్ ఏ పర్పస్ (ఓ ప్రయోజనంతో కూడిన సౌందర్యం).. హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి నిర్వాహకులు పదేపదే చెబుతున్న మాట. ఎక్కడా అందాల పోటీలు అనే మాటే లేదు. 1951లో యూకేలో ఎరిక్ మోర్లే మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించినప్పుడు కేవలం శరీర సౌందర్యాన్ని ప్రదర్శించటానికే అవి పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు అదే పంథా కొనసాగగా, ఇప్పుడు పోటీల తీరు సమూలంగా మారిపోయింది. పోటీదారులను అన్నివిధాలా పరిశీలించే, పరీక్షించే విధానం వచ్చింది.ఇక సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే మన దేశంలో పోటీలనేసరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది ముంబైలో నిర్వహించినప్పుడు ‘ఒళ్లు’దగ్గర పెట్టుకుని వ్యవహరించారు. ఇప్పుడు హైదరాబాద్లో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం. ‘అందమే’ప్రదాన అంశంగా ఉన్నా.. అది అంతర్లీనంగా మాత్రమే ఉండేలా చూస్తున్నారు. సామాజిక బాధ్యత, మహిళా సాధికారత, వ్యక్తిగత ప్రతిభలే ప్రధాన అంశాలుగా పోటీలకు రూపకల్పన చేశారు. -సాక్షి, హైదరాబాద్ఇప్పుడు ప్రతిభకే పట్టం..బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యం అనే అంశం జనంలోకి వెళ్లేలా ఇప్పుడు కార్యక్రమాలను డిజైన్ చేశారు. పోటీదారులు సృజనాత్మక, కళాత్మక నైపుణ్యాలను, సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ప్రధాన రౌండ్ను రూపొందించారు. టాలెంట్ షోలో నృత్యం, గానం, వాయిద్య ప్రదర్శన, నాటకం, కవిత్వం, ఇతర సృజనాత్మక కళలు చేర్చారు. మే 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే నిర్వహిస్తున్నారు. దాదాపు 115 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దీనితో పాటు వారి మేధో సంపత్తి, ప్రపంచ విషయాలపై పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు. 1996 ప్రపంచ సుందరి పోటీలువేదిక: బెంగళూరు ‘మహిళను అంగడి బొమ్మగా చూపే పోటీలు వద్దు.. మహిళంటే శరీర ప్రదర్శన కాదు..’అంటూ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీసులు అడ్డుకునే సమయంలో కొందరు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు చనిపోయారు. ఈ ఘటనలు పోటీలపై పెద్ద దుమారమే రేపాయి. చివరకు భారీ సంఖ్యలో పోలీసు పహారా ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించాల్సి వచ్చింది. 2025 ప్రపంచ సుందరి పోటీలువేదిక: హైదరాబాద్అక్కడక్కడా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు తప్ప, ఎక్కడా నిరసన ప్రదర్శనలు లేవు. పైగా ఈ పోటీలు రాష్ట్రానికి మేలు చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అందాల పోటీల నిర్వహణ తీరులో వచ్చినమార్పే... ప్రజల ఆలోచన విధానంలో ఇలాంటి మార్పు తీసుకొచ్చిoది. ఆ పోటీలు వద్దేవద్దు అన్న తీరు నుంచి, వాటిని ఓ వేడుకలాగా నిర్వహించే స్థాయికి చేరింది.స్పోర్ట్స్ చాలెంజ్.. అందం కంటే ఆరోగ్యం ముఖ్యమన్న సంకేతం ఇస్తూ ఈ రౌండ్ను డిజైన్ చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి, అది సమకూరాలంటే ఆటలు ఆడగలగాలి, ఈ ఆటల్లో ముందున్న పోటీదారులు మంచి మార్కులు తమ ఖాతాలో వేసుకుంటారు. ఆటలతో పాటు నాయకత్వ లక్షణమనే మరో కీలక విషయాన్ని ఇందులో ప్రదర్శించాల్సి ఉంటుంది. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఇది ప్రేరణగా నిలు స్తుందని మిస్ వరల్డ్ లిమిటెడ్ చెబుతోంది. స్పోర్ట్స్ చాలెంజ్లో రన్నిoగ్, రిలే రేస్లు, ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫినాలే పోటీలు జరగనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలు.. మిస్ వరల్డ్ సంస్థ ‘బ్యూటీ విత్ ఏ పర్పస్‘ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. పోటీదారులు తమ దేశాలలో సామాజిక సమస్యలపై తాము చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. రొమ్ము క్యాన్సర్పై సమాజంలో అవగాహన కల్పించటమే కాకుండా, బాధిత పేద మహిళలకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్ను పోటీల వేదికపై ఘనంగా సన్మానించేందుకు మిస్వరల్డ్ లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోంది. సామాజిక సేవలో మిస్ వరల్డ్ లిమిటెడ్ మహిళల అందాన్ని ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శను దూరం చేసుకునేందుకు మిస్ వరల్డ్ సంస్థ గట్టిగా కృషి చేస్తోంది. ప్రస్తుతం దానికి చైర్ పర్సన్గా ఉన్న 86 ఏళ్ల జూలియా మార్లే ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తున్నారు. మిస్ వరల్డ్ సంస్థ దాదాపు 100 దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, యుద్ధ బాధితులకు చేయూత, విపత్తు నివారణ, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంక్షేమం, బాలికా విద్య వంటి అంశాలు వీటిల్లో ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలలో విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటి సరఫరా వంటి ప్రాజెక్టులు చేపట్టింది. నైజీరియా, ఘనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో సేవలందిస్తోంది. -
కాలేయ వ్యాధికి మధుమేహ మందుతో చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాలేయ వ్యాధిగ్రస్తులకు ఇప్పటివరకు సరైన మందు లేదు. కాలేయం చెడిపోతే ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. దీంతో సరైన మందు లేక తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఊరట కలిగించే శుభవార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధుమేహానికి వినియోగించే ‘సెమాగ్లుటైడ్’అనే మందు, ఇప్పుడు లివర్ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని లండన్ కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మందుతో కాలేయంలోని గాయాలు తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా ‘మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటో హెపటైటిస్’(సాధారణంగా మాష్ అని పిలుస్తారు) అనే కాలేయ వ్యాధిని నియంత్రించడమే కాకుండా కొంతవరకు తిరిగి సరిచేసే శక్తి కూడా ఈ మందుకు ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో పరిశోధన.. ప్రపంచంలోని 37 దేశాల్లో 800 మందిపై ఈ ఔషధ ప్రయోగం నిర్వహించారు. వారిని రెండు వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి ప్రతి వారం సెమాగ్లుటైడ్ మందును అందించగా, మరొక గ్రూపునకు ప్లాసెబో (నకిలీ మందు) ఇచ్చారు. 72 వారాల పాటు జరిపిన ఈ ప్రయోగం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. » సెమాగ్లుటైడ్ తీసుకున్న వారిలో 63 శాతం మందికి లివర్ మంట తగ్గినట్టు తేలింది. దాదాపు 37 శాతం మందిలో కాలేయంలోని గాయాలు (ఫైబ్రోసిస్) తగ్గినట్టు గుర్తించారు. » ఇదే సమస్య ప్లాసెబో (నకిలీ మందు) వాడిన వారిలో కేవలం 22 శాతం మందిలో మాత్రమే కనిపించింది. ఈ మందు వాడిన వారు సాధార ణంగా బరువు తగ్గినట్టు కూడా తెలిసింది. » సెమాగ్లుటైడ్ మందు వాడిన వారిలో కొందరికి వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తినప్పటికీ, ఆశాజనక ఫలితాల ముందు ఇవి తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. » ఈ మందును వాడిన కొంతమందికి వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి జీర్ణసంబంధిత స మస్యలు ఎదురయ్యాయి. అయితే ఇవి తాత్కాలిక మేనని, దీర్ఘకాల ప్రయోజనాలతో పోల్చితే తక్కు వేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. లివర్ సమస్యలకి కారణాలు అనేకం: అధిక కొవ్వు, మధుమేహం, అధిక రక్తపోటు, శరీరం చురుకుదనం లేకపోవడం వంటి కారణాలతో లివర్లో కొవ్వు పేరుకుని కాలేయం పాడవుతుంది. దీన్ని నాన్–ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి అని పిలుస్తారు. ఇది తీవ్రమై ‘మాష్’గా మారితే, కాలేయం పూర్తిగా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. » ‘ఇలాంటి మందు తయారవడం ద్వారా తీవ్రమైన కాలేయ వ్యాధులకు కొత్త మార్గం ఏర్పడింది. ము ఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ప్ర యోజనకరం’అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఫిలిప్ న్యూసమ్ తెలిపారు. -
ప్రైవేట్దే విత్తు... పత్తి రైతే చిత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విత్తన కంపెనీల చేతిలో ఏటా పత్తి రైతు చిత్తవుతూనే ఉన్నాడు. ఒకటి రెండు కంపెనీల పత్తి విత్తనాలకే కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, వాటిని బ్లాక్ చేస్తున్నారు. ఆపై రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. ఈ సీజన్లోనూ కృత్రిమ కొరత సృష్టించేందుకు కొన్ని విత్తన కంపెనీల ఏజెంట్లు రంగంలోకి దిగినట్టు తెలిసింది. మరోవైపు టాస్్కఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పలు జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా సాగిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఈ నెలాఖరు కల్లా తొలకరి వర్షం పడగానే పత్తి విత్తనాలు విత్తే అవకాశం ఉండడంతో కొన్ని విత్తన కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వ్యవసాయ శాఖ అనుమానిస్తోంది. ఈ మేరకు విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు... వాస్తవానికి బీటీ రకం హైబ్రిడ్ పత్తి విత్తనాలన్నీ ఒకే ఫార్ములాతో రూపొందినవే. బీటీ–1, బీటీ–2 విత్తనాలు మార్కెట్లో ఉన్నా, రైతులు బీటీ– 2 విత్తనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. బీటీ–3 విత్తనాలపై నిషేధం ఉన్నా, కొన్నిచోట్ల గుట్టుగా ఈ విత్తనాలను కూడా రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర ఈ సీజన్లో రూ. 37 పెరిగి రూ.901కి చేరింది. దీంతో పత్తి విత్తన కంపెనీలన్నీ ఇదే ధరకు రైతులకు విక్రయించాలి. అయితే ఏవో రెండు కంపెనీల విత్తన బ్రాండ్లకు అధిక డిమాండ్ సృష్టించి, రైతులంతా ఆ విత్తనాలు కొనుగోలు చేసేలా అనివార్య పరిస్థితులను సృష్టించి, వాటిని రైతులకు అందకుండా చేస్తారు. ‘ఫలానా కంపెనీ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం మా దగ్గర ఆ విత్తనాలు అందుబాటులో లేవు. బ్లాక్లో తెప్పిస్తాం’అంటూ రైతులకు ఆ బ్రాండ్ విత్తనాలపై ఆసక్తి పెరిగేలా చేసి, కృత్రిమ కొరత సృష్టించి, సొమ్ము చేసుకునే ఎత్తుగడ కొందరు దుకాణదారులు వేశారు. దీని వెనుక ఆయా కంపెనీల ఏజెంట్లు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తులసి, రాశి, అంబూజ, మహికో, యూఎస్ అగ్రిసీడ్ 7067, రేవంత్, సంకేత్, క్యాష్, ఏటీఎం సిమ్రాన్, బయోసీడ్, జయాగోల్డ్, చంద్రగోవా, సదానంద్, ప్రవర్ధన్, రేవంత్, యాక్స్ కంపెనీలు వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో పత్తి విత్తనాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని బ్రాండ్లకే డిమాండ్ సృష్టిస్తూ వస్తున్నారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ బ్రాండ్లకు డిమాండ్ కల్పించేలా కొన్ని కంపెనీలు ఏజెంట్లను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపించాయి. జిల్లా కేంద్రాల్లోని విత్తన దుకాణదారులు, హోల్సేల్ డీలర్ల సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది. అందుబాటులో 1.37 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 45 వేల క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలు అవసరమని లెక్కలు కట్టింది. కానీ ప్రైవేట్ కంపెనీల వద్ద ఇప్పటికే 1.37 లక్షల క్వింటాళ్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ అధికారులు తేల్చారు. ఈ విత్తనాల్లో డిమాండ్ అధికంగా ఉన్న బ్రాండ్ల విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి, రిటైల్ దుకాణదారులు, హోల్సేల్ వ్యాపారులతో కుమ్మక్కై రెట్టింపు ధరలకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిసింది. సీడ్ కార్పొరేషన్, ఆగ్రోస్ల ద్వారా విక్రయిస్తే... రాష్ట్రంలో వరి విత్తనాలను తెలంగాణ సీడ్ కార్పొరేషన్ రైతులకు అందుబాటులో ఉంచుతోంది. ఆగ్రోస్ సైతం ఇతర విత్తనాలను రైతులకు విక్రయిస్తోంది. కానీ బీటీ పత్తి విత్తనాల విషయంలో ఈ రెండూ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం పూర్తిగా ఈ విత్తనాలను ప్రైవేట్ వ్యక్తులకే ధారాదత్తం చేయడంతో ఈ సంస్థలు కూడా వాటి జోలికి పోలేదు. ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెడితే ప్రైవేట్ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేయొచ్చని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. -
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్ ఫ్రీ నంబర్ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్: సీఎం రేవంత్ ఆపరేషన్ సిందూర్లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్..’అని సీఎం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. -
గెజిట్పై స్టే ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)కు అప్పగించాలని ఆదేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ప్రస్తుత పరిస్థితిలో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన డివిజన్ బెంచి విచారణ జరిపింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు గాను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అదనపు మార్గదర్శకాలు (టీఓఆర్) జారీ చేసిన నేపథ్యంలో అంతకు ముందు జారీ చేసిన గెజిట్పై స్టే విధించాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు స్టేను కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, గెజిట్ ఇంకా అమల్లోకి రాలేదని బదులిచ్చారు. ‘అమల్లోకి రానప్పుడు స్టే ఎందుకు? అలాంటి ఉపశమనం ఇవ్వలేము’అని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో వాదనలు విని తుది తీర్పు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగలేదని, ఈ పరిస్థితిలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా బోర్డుకు అప్పగించడం సరికాదని తెలంగాణ న్యాయవాది కోర్టుకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఓ ప్రాతిపదికన లేనప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం తగదన్నారు. కాగా, నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చలేదని, ఈ పరిస్థితిలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు తుదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరిపేందుకు గాను కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం విచారించనుంది. -
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. మృతులను ఉత్తర్ప్రదేశ్కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గత నెల సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. కాగా, మెహదీపట్నంలోని ఆసిఫ్నగర్ ఠాణా పరిధి సంతోష్నగర్కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది. -
‘కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి’
హైదరాబాద్: ఆపరేష్ సిందూర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం.‘అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలి. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి’ అని సూచించారు.సైన్యానికి సంఘీభావంగా ర్యాలీభారత సైన్యానికి సంఘీభావంగా రేపు(గురువారం) సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిపైన సైతం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు చర్చించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం, డిప్యూటీ సీఎంలు. భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు. -
Hyderabad: ప్రపంచ సుందరీ పోటీలతో ప్రత్యేక వాతావరణం
సాక్షి, సిటీబ్యూరో: మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం కొత్త తళులకులు అద్దుకుంటోంది. దాదాపు 120 దేశాల సుందరీమణులతో పాటు ఎందరెందరో వస్తున్న తరుణంలో నగరంలో రహదారులు మెరవాలని, రాత్రుళ్లు విద్యుత్ ధగధగలతో సిటీ మెరిసిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు, తుది మెరుగులతోపాటు డివైడర్లపై పేరుకుపోయిన దుమ్ము దులిపి రంగులు వేస్తున్నారు. లేన్ మార్కింగ్లతో పాటు కాలినడకల బాటలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు.రోడ్లకిరువైపులా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం నుంచి మొదలు పెడితే, పోటీలను నిర్వహించే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వెళ్లే రహదారులను, అతిథులు బస చేసే హోటళ్ల మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. ఫ్లై ఓవర్ల క్రాష్ బారియర్స్కు, జంక్షన్లు, రోడ్ల వెంబడి కెర్బ్లకు పెయింట్స్ వేస్తున్నారు. రాత్రుళ్లు ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల విద్యుల్లతలతో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జంక్షన్లు, పోటీదారులు సందర్శించే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ ప్రత్యేక అలంకరణలు (Special Decoration) చేస్తున్నారు. 50 మార్గాల్లో పనులు గ్రేటర్లోని దాదాపు 50 మార్గాలు ఈ పనులతో ప్రత్యేకంగా కనిపించనున్నాయి. సాధారణ రోజుల్లో జరగని పనులు ఈ సందర్భంగానైనా జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇవాంకా ట్రంప్ నగరానికి వచ్చిన సందర్భంగా పలు రోడ్లు అద్దాల్లా మారడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చార్మినార్, లాడ్బజార్, ఫలక్నుమా ప్యాలెస్, మదీనా, సిటీ కాలేజీ, నయాపూల్, ఆరాంఘర్, మాసాబ్ట్యాంక్, గన్పార్క్, రేతిబౌలి జంక్షన్, ఐమ్యాక్స్ సర్కిల్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ట్యాంక్బండ్, తాజ్కృష్ణ, నాగార్జున సర్కిల్, కేబుల్ బ్రిడ్జి, ఓయూ కాలనీ క్రాస్రోడ్స్, ఐకియా జంక్షన్, టీహబ్, హైటెక్ సిటీ జంక్షన్, శిల్పారామం, బయో డైవర్సిటీ జంక్షన్, ఏఐజీ హాస్పిటల్ తదితర ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్లో భాగంగా ఎల్ఈడీ పవర్ క్యాన్స్, స్ట్రిప్లైట్స్, సిరీస్ లైట్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో 300 మీటర్ల మేర ప్రత్యేక లాంతర్లతో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్ల ఆర్చ్లు ఏర్పాటు, ఎల్ఈడీలతో క్రౌన్, ‘ఫెయిరీ క్వీన్’ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు.చదవండి: నాటి బికినీల పోటీ.. మిస్ వరల్డ్! చెత్తా చెదారం.. దోమలు లేకుండా చెత్త కనిపించకుండా వీధులు శుభ్రం చేసే కార్యక్రమాలు పెంచుతున్నారు. దోమలు లేకుండా నిల్వ నీరు లేకుండా చూడటంతో పాటు యాంటీలార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ ముమ్మరం చేశారు. రాత్రివేళ దోమలు కుట్టకుండా ప్రత్యేకంగా రెపెల్లెంట్ క్యాండిల్స్ తెప్పిస్తున్నారు. చార్మినార్– చౌమహల్లా ప్యా లెస్ మార్గంలో హెరిటేజ్ వాక్కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి. మాక్ డ్రిల్స్లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ, కంచన్బాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్👉విశాఖ వన్ టౌన్లో మాక్ డ్రిల్👉వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్👉ఎక్కడెక్కడ జరిగాయంటే..దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.మాక్డ్రిల్ వల్ల ప్రజలు ఎవరూ భయపడొద్దు: సీవీ ఆనంద్సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలిఇళ్లలో ఉన్నవాళ్లు ఇళ్లలోనే ఉండాలిబయట ఉన్నవాళ్లు సమీప భవనాల్లోకి వెళ్లాలి👉ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.👉ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.👉ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.👉జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం👉సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ చేస్తాం.👉4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహణ👉సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు మాక్ డ్రిల్👉హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ,కంచబాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్ 👉మోగనున్న పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు -
KarreGutta: కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. 22 మంది మావోల మృతి
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. బుధవారం భద్రతా బలగాలు జరిపిన భారీ ఎన్ కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోల మృతిపై బస్తర్ ఐజీ,సీఆర్పీఎఫ్ఐసీ ధృవీకరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు,పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్కు గట్టి గుణ పాఠం చెప్పాలి. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్! అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. میں ہماری دفاعی افواج کی جانب سے پاکستان میں دہشت گرد ٹھکانوں پر کیے گئے ہدفی حملوں کا خیرمقدم کرتا ہوں۔ پاکستانی ڈیپ اسٹیٹ کو ایسا سبق سکھانا چاہیے کہ پھر کبھی دوسرا پہلگام نہ ہو۔ پاکستان کے دہشت گردی کے ڈھانچے کو تباہ کر دینا چاہیے۔ جے ہند!#OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 -
ఓయో రూమ్కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి. -
Hydra: సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత
గచ్చిబౌలి(హైదరాబాద్): సంధ్యా కన్వెన్షన్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. అనుమతులు లేని కట్టడాలను నేలమట్టం చేసింది. మంగళవారం ఉదయం నుంచి అధికారులు భారీ బందోబస్తు మధ్య రోజంతా కూల్చివేతలు జరిపారు. గచ్చిబౌలిలో సరనాల శ్రీధర్ రావు ఐదెకరాల విస్తీర్ణంలో 17 వేల చదరపు మీటర్ల అనుమతితో సంధ్యా కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. దీనిని ఆనుకొని ఉన్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని కొన్ని ప్లాట్లను కొనుగోలు చేశారు. స్థలంలో కన్వెన్షన్ను ఆనుకొని రెండు షెడ్లను నిర్మించి కమర్షియల్గా వాడుకుంటున్నారు. రోడ్లను ఆక్రమించి ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారని ఫరి్టలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ల యజమానులు కొద్ది రోజులుగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లు కనిపించడం లేదని, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా శ్రీధర్ రావు నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. సదరు నిర్మాణాలను కూలి్చవేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సంధ్యా కనెవన్షన్కు కొనసాగింపుగా ఉన్నా బ్రైడల్ రూమ్లు, మినీ హాల్, రెస్ట్ రూమ్లను కూల్చి వేశారు.మరో రెండు షెడ్లు సైతం.. గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 125లలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట లేఅవుట్ చేశారు. దాదాపు 162 ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు కొన్నింటిని సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు అమ్ముకున్నారు. మిగిలిన ప్లాట్లకు హద్దులు, రోడ్లు లేకపోవడంతో ఆ యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ క్రమంలోను ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్లో రెండు భారీ షెడ్లను నేలమట్టం చేశారు. సంధ్యా కన్వెన్షన్, మ్యాంగో ఫుడ్ పేరిట ఉన్న ఆర్చ్లను కూల్చివేశారు. కొన్ని ప్లాట్లను వేసిన సిమెంట్ రోడ్డును ధ్వంసం చేశారు. సొసైటీలోని యజమానుల నుంచి దాదాపు 100కు పైగా ప్లాట్లను సరనాల శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. ప్లాట్లు కనిపించకుండా మట్టి, బండరాళ్లు వేసి, నిర్మాణాలు చేపట్టి, ఆ తర్వాత సదరు ప్లాట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ రావుపై గచ్చిబౌలిపోలీస్ స్టేషన్లో కబ్జా యత్నం కేసులు నమోదై ఉన్నాయి. మరిన్ని నిర్మాణాలపై ఆరా నిర్మాణంలో ఉన్న రెండు షెడ్లను మాత్రమే అక్రమ నిర్మాణాలుగా తేల్చిన హైడ్రా అధికారులు మిగిలిన నిర్మాణాలు, యునాక్స్ అనే డ్రైవ్ ఇన్ వివరాలను సేకరిస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ ద్వారం వద్ద ఉన్న హోటల్, వెనక భాగంలో ఉన్న హార్ట్ కప్ అనుమతులను పరిశీలిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కాగా.. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు శ్రీధర్ రావుకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని నిర్మాణాలకు శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందించినట్లు విమర్శలున్నాయి. 15 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి సుభా‹Ùనగర్: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో కబ్జాకు గురైన 15 ఎవరాల భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. సర్వే నం.354లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణల్ని మంగళవారం తొలగించింది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన ఐదు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని 2009లో ప్రభుత్వం రాజీవ్స్వగృహ నిర్మాణాలకు కేటాయించింది. ఆ నిర్మాణాల కార్యరూపం దాల్చకపోవడంతో స్థానికంగా నాయకులుగా చలామణి అవుతున్న కొందరి కన్ను ఈ భూమిపై పడింది. స్థలం చుట్టూ ప్రహరీలు నిర్మించిన వాళ్లు షెడ్లు వేసి ఆక్రమించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ప్రజావాణి ద్వారా ఫిర్యాదులందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారంచారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు నివేదిక సమర్పించారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆక్రమణలు తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆక్రమణలను మంగళవారం కూల్చేసిన అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. కాటేదాన్లోనూ హైడ్రా మంగళవారం కూలి్చవేతలు చేపట్టింది. ఇందిరా సొసైటీ కాలనీలోని రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించింది. రహదారులను ఆక్రమించి లేఔట్లలోని ప్లాట్లను కబ్జా చేసిన వారి ప్రయత్నాలను అడ్డుకుంది.శ్రీధర్రావుపై ఫిర్యాదుల వెల్లువ..శ్రీధర్ రావుపై పలు పోలీసుస్టేషన్లలో 30 కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా.. హైడ్రా కూల్చివేతల అనంతరం శ్రీధర్ రావు బాధితులు వివిధ మార్గాల్లో ఆయనపై ఫిర్యాదు చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. లేఅవుట్లోకి రాకుండా అడ్డుకున్నారని విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొంది. కొందరు బాధితులు వీడియోల రూపంతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. లేఅవుట్లో ప్లాట్ లేదని చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ నుంచి ఓ మహిళ ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై పలువురు శ్రీధర్ రావుపై ఫిర్యాదులు చేస్తున్నారు. -
బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
బంజారాహిల్స్: ట్రావెల్ ఏజెంట్ సహకారంతో బంగ్లాదేశ్కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్కు చేరుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్గోంజ్ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్ అనే ట్రావెల్ ఏజెంట్ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది. ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్ అనే వ్యక్తిని ఫోన్లో సంప్రదించింది. నాయక్ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్లోని మింట్ లీవ్స్ సరీ్వస్డ్ అపార్ట్మెంట్ రూం నెంబర్–112లో దించేందుకు క్యాబ్ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్మెంట్లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారు: సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఓబుళాపురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా పన్నెండున్నర సంవత్సరాలపాటు అవమానాలు భరించా. మానసిక వేదన అనుభవించా. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఇన్నాళ్లూ పోరాడా. అంతిమంగా న్యాయం గెలిచింది. వాస్తవాలను పరిశీలించిన సీబీఐ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం ఆనందంగా ఉంది’అని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ‘నన్ను ముందు పెట్టి అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా, న్యాయపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కేబినెట్ ఆమోదంతోపాటు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సైతం ఉన్నాయి. విధానపరమైన నిర్ణయంలో ఎక్కడా మేము తప్పు చేయలేదు. మాపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయారు. కాబట్టే న్యాయస్థానం నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అంతా చట్టబద్ధమే..: కృపానందం ‘ఓబుళాపురం మైనింగ్ లీజు విషయంలో చట్ట నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. ఎక్కడా పొరపాటు చేయలేదు. న్యాయపరంగా కూడా ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే న్యాయస్థానం ఈ కేసు నుంచి నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన బి. కృపానందం అనందం వ్యక్తం చేశారు. గనుల లీజు అంశం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనేది కాదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే మంజూరు అవుతాయని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొదటి రెండు చార్జిషీట్లలో తమ పేర్లు లేకపోయినా మూడో చార్జిషీట్లో సీబీఐ తన పేరు ఎందుకు చేర్చిందో ఆ సంస్థకే తెలియాలన్నారు. గనులను లీజుకిచ్చే విధానపరమైన నిర్ణయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మినందునే నిర్దోషిగా తనను, ప్రజాప్రతినిధిని ప్రకటించిందని ఆయన చెప్పారు. జైలుకు పోతానని ప్రత్యర్థులు హేళన చేసినా..‘కన్నీళ్లతో తొలిసారి ఇదే సీబీఐ కోర్టు మెట్లెక్కా. నేను అవినీతికి పాల్పడ్డానని.. జైలుకు పోతానని నా ప్రత్యర్థులు హేళన చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి చేశానని.. దోపిడీకి పాల్పడ్డానని ఎన్నో నిందలు, ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని, నన్ను దోషులుగా నిలిపేందుకు ప్రయత్నించారు. మా నైతికతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు, నిందలు మోపినా నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకొని నా వెంట నిలిచారు. నేను బాధపడ్డప్పుడు ఇంట్లోని వారంతా నాకు ఎంతో ఆప్యాయతతో సహకారం అందించారు. కోర్టుకు వెళ్లినప్పుడు నా ప్రజలు వెంట వస్తే లాఠీచార్జి చేసిన పరిస్థితులు ఉండేవి. మేము ఎలాంటి తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా. నా నమ్మకం గెలిపించింది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధ నుంచి బయటపడ్డా. ఇక మరింత ఉత్సాహంతో ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తా’అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. -
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు!: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలు.. తెలంగాణ, హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు, రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహద పడతాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి బృందం దావోస్, జపాన్లలో పర్యటించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సాధించిందని, ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో జరగటం ద్వారా మరిన్ని పెట్టుబడులకు అవకాశం చిక్కినట్టవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్ గురించి ప్రపంచ వ్యాప్తంగా సానుకూల ప్రచారం జరిగి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావటానికి అవకాశం లభిస్తుందని వెల్లడించారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర శక్తిని నిరూపించుకునే సమయం ‘మన ఘనమైన చరిత్ర, సంస్కృతిపై ప్రపంచ స్థాయిలో బలంగా ప్రచారం జరగటానికి ఈ పోటీలు కారణమవుతాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించే అవకాశం పొందేందుకు పలు దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాలు ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణకే చాన్స్ దక్కింది. పోటీలు ఘనంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర శక్తిని నిరూపించుకునే సమయం వచి్చంది. ఈ పోటీలు ఎలాంటి లోపాలు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం..’అని జూపల్లి తెలిపారు. సామాన్యులు తిలకించేందుకూ అవకాశం: జయేశ్ రంజన్ ఈ పోటీలు కేవలం ధనవంతుల కోసమే అన్న విమర్శను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నామని, సాధారణ ప్రజలు కూడా ఈ పోటీలను తిలకించేందుకు సీఎం ఆదేశం మేరకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ప్రారంభ వేడుకలు, పోటీదారుల స్పోర్ట్స్ ఈవెంట్, టాలెంట్ కాంటెస్ట్, హైటెక్స్లో 23, 25 తేదీల్లో జరిగే కార్యక్రమాలను సామాన్యులు కూడా తిలకించేందుకు కూడా వీలు కల్పిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సరైన వేదిక: జూలియా మోర్లే ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుతున్నారని, తెలంగాణను ఎందుకు ఎంచుకోవద్దని తాను అంటున్నానని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అన్నారు. ఈ పోటీలకు తెలంగాణ సరైన వేదికగా తాము భావించామని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ అప్యాయత చూపేవారని, గొప్ప పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బిర్యానీ, ఇరానీ చాయ్ ఇష్టం హైదరాబాద్, తెలంగాణ అంటే తనకు అమితమైన అభిమానమని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతను పంచుతున్నారని మిస్ వరల్డ్ ఇండియా నందినీ గుప్తా చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. ప్రముఖ నటుడు, ఈ పోటీల జ్యూరీ సభ్యుడు సోనూసూద్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, హైటెక్స్ నిర్వాహక వర్గం ప్రతినిధి శ్రీకాంత్, ట్రైడెంట్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ కే కుమ్రా తదితరులు పాల్గొన్నారు. అట్ట ముక్కలతో తోరణాలా? గచ్చిబౌలి: మిస్ వరల్డ్ అందాల పోటీల ప్రారంభ వేడుకలకు వేదికైన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్వాగత ఏర్పాట్లపై మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన షోబోట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్వాగత తోరణాలకు అట్ట ముక్కలను ఉపయోగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో తోరణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
వచ్చే 50 ఏళ్లకు తగ్గట్లుగా రోడ్ల అలైన్మెంట్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించి జంక్షన్లు, వాటి అనుసంధానం ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై మంగళవారం రాత్రి తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన అలైన్మెంట్ను పరిశీలించి పలు మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జలవనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాట్లకు తావివ్వరాదన్నారు. శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని చెప్పారు. గందరగోళానికి తావులేకుండా.. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగిన రీతిలో ‘ట్రంపెట్స్’నిర్మించాలని.. ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాలన్నారు. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్.. నూతన అలైన్మెంట్కు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు. సమీక్షలో రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, ఆర్అండ్బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం అదనపు సీఈవో ఇ.వి. నరసింహారెడ్డి, ఎన్హెచ్ ప్రాంతీయ అధికారి శివశంకర్ పాల్గొన్నారు. -
నాటు కోళ్లు, గుడ్లు ఇంటికే వస్తాయి
కోడి కూరతో రాగి సంగటి కలిపి ఆరగించి ఆనందించే వాళ్లు కొందరైతే.. బ్రేక్ఫాస్ట్లో కోడి కూరతో ఇడ్లీ ఆస్వాదించేవారు మరికొందరు. అది గ్రామమైనా, నగరమైనా.. నాటుకోడి కూర, బ్రౌన్ కోడి గుడ్లకు ఉన్న ఆదరణే వేరు. అలాంటి నాటు కోడి పిల్లలు, గుడ్లు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. అవి మీ ఇంటికే వస్తే.. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డిపీఆర్).. ఇప్పుడు ఈ పని చేస్తోంది.ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తేవటంతో పాటు, ఉపాధి అవకాశాలను సైతం అందించేది దేశీ ఉత్తమ జాతి కోళ్ల పెంపకం. ఈ కోళ్ల స్వచ్ఛతను కాపాడుతూనే, వాటిని మరింత మెరుగుపరచి దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెస్తోంది హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డీపీఆర్). డీపీఆర్ శాస్త్రవేత్తల కృషితో.. మెరుగైన ఫలితాలనిచ్చే 11 రకాల నాణ్యమైన దేశీ ఉత్తమ కోళ్ల జాతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోళ్లకు చెందిన నాణ్యమైన కోడి పిల్లలను డీపీఆర్ రైతులకు విక్రయిస్తోంది. పొదిగే గుడ్లను కూడా అమ్ముతున్నారు. వీటిని కొనుక్కొని పిల్లలు పొదిగించుకొని, పెంచుకోవచ్చు.యాంటీబయాటిక్స్ వాడకుండా.. ఈ సంస్థ అభివృద్ధి చేసిన వనరాజా, గ్రామప్రియ వంటి దేశీ జాతుల కోళ్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. యాంటీబయాటిక్స్ వాడకుండా సమతుల్యమైన దాణాలు, మునగ ఆకు వంటివి మేపి చక్కని ఫలితాలు సాధించారు. వీరు రైతులకు అందుబాటులోకి తెస్తున్న ఉత్తమ కోళ్ల రకాల్లో ముఖ్యమైనవి.. శ్రీనిధి, జనప్రియ, కృషిలేయర్, కృషిబ్రో, వనశ్రీ, అసీల్, కడక్నాథ్, ఘాగస్, నికోబారీ.మాంసం, గుడ్ల కోసం..⇒ వనరాజా, శ్రీనిధి, జనప్రియ కోళ్లను మాంసం, గోధుమ రంగు గుడ్ల కోసం పెరట్లో పెంచుకోవచ్చు. ఔషధ విలువలున్న నల్ల కోడి కడక్నా«థ్ను నల్ల గుడ్లు, మాంసం కోసం పెంచుకోవచ్చు.⇒ కృషిబ్రో మాంసం కోసం పెంచుకోదగిన కోళ్ల జాతి. గుడ్ల కోసం.. గ్రామప్రియ, వనశ్రీ, అసీల్ కోళ్లను పెరట్లో పెంచుకోవచ్చు. కృషి లేయర్ను గుడ్ల కోసం వాణిజ్యపరంగా పెంచుకోవచ్చు.వనరాజా, గ్రామప్రియలకు క్రేజ్వనరాజా, గ్రామప్రియ దేశీయ కోళ్ల జాతులు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. వనరాజా రోగనిరోధక శక్తి కలిగిన జాతి. ఆరు నెలల్లో 2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఏడాదికి 110 గుడ్లు పెడుతుంది. జత పెంచుకుంటే రూ.500 ఆదాయం వస్తుంది. ఇక గ్రామప్రియ జత కోళ్లు పెంచుకుంటే రూ.వెయ్యి ఆదాయం వస్తుంది. మా వద్ద నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు బుక్ చేసుకుంటారు.ఇంటికే పార్సిల్జాతిని బట్టి గుడ్డు ధర రూ. 9–23 మధ్య, పిల్ల ధర రూ. 22–120 వరకు ఉంటుంది. ముందుగా బుక్ చేసుకొని, నగదు చెల్లించిన వారికి ఏ రాష్ట్రానికైనా సరే, నేరుగా స్వస్థలాలకు పార్శిల్ పంపుతారు. బుకింగ్స్ రద్దీని బట్టి, బుక్ చేసుకున్న తర్వాత 1 నుంచి 3 నెలల్లో సరఫరా చేస్తున్నారు. -
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు. -
పోటీపడ్డ 138 దేశాలు.. CP సీవీ ఆనంద్కే అవార్డు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ పోలీస్ విభాగాల్ని వెనక్కి నెట్టి మరీ అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించిన సీవీ ఆనంద్.. ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్ జరుగుతున్న అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ లో భాగంగా ఈ అవార్డుకు సీవీ ఆనంద్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కోసం 138 దేశాలు పోటీపడగా, సీవీ ఆనంద్ కే ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మే 15వ తేదీ న దుబాయ్ లో సీపీ సీవీ ఆనంద్ అందుకోనున్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ఈడీ, ఎన్ సీఆర్బీ, డీఆర్ఐ, ఎక్స్ సైజ్, ఆర్ఆర్ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలతో సమన్వయం చేస్తున్న చర్యలను సీపీ సీవీ ఆనంద్ ఆన్ లైన్ వేదికగా వివరించారు.మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీని అవగాహన కోసం చేపడుతున్న చర్యలను సైతం వివరించారు. దానికి సంబంధించి ఫలితాలను కూడా అంతర్జాతీయ వేదిక ముందుపెట్టారు. వీటన్నింటిని పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నారకోటిక్స్ అవార్డుకు సీవీ ఆనంద్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘అప్పులు చెల్లింపుల కోసం నెలకు రూ. 6 వేల కోట్లు కడుతున్నాం’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఈరోజు(మంగళవాళం) బేగంపేట్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్ కు ముప్పుగా దాపురించిందని ధ్వజమెత్తారు.‘కేసీఆర్ నిర్వహాకం వల్ల నెలకు రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుంది. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా?, ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టింది ఎవరు కేటీఆర్?. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర మీది. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ది శూన్యం. మీరు చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాం’ అని మంత్రి సీతక్క తెలిపారు. -
‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’
హైదరాబాద్: 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానన్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఓబులాపురం మైనింగ్ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అనంతరం ఆమె మాల్లాడుతూ.. ‘న్యాయస్థానం నన్ను నిర్దోషి గా ప్రకటించింది, న్యాయస్థానంకి ధన్యవాదాలు. ఏ తప్పు చేయకపోయిన కోర్ట్ మెట్లు ఎక్కాను. పన్నెడున్నర సంవత్సరాలు నన్ను రాజకీయంగా అవమానించారు. ఈ కేసులను ముందు పెట్టి నన్ను రాజకీయంగా అణిచివేయాలనుకున్నారు న్యాయస్థానం మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఇవ్వాళ నాకు న్యాయం జరిగింది. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు నా వెంట నిలబడ్డారు’ అని అన్నారు. కేసు నమోదు అయిన తరువాత ఇదే సీబీఐ కోర్ట్ కి నేను కనీళ్లతో కోర్ట్ మెట్లు ఎక్కాను. నాపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారు. ఇన్నాళ్లకు నాకు న్యాయం జరిగింది’ అని అన్నారు సబితా ఇంద్రారెడ్డి.ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు -
TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు, అటు లేబర్ కమిషనర్కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి. -
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
సాక్షి,హైదరాబాద్: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది. -
ముంబైలోనూ లోకేంద్ర గ్యాంగ్ పంజా
వాచ్మెన్ పేరుతో సిమ్కార్డు తీసుకుని... హేమ్రాజ్ ఇంట్లో చోరీ చేయడానికి నగరానికి వచ్చిన లోకేంద్ర గ్యాంగ్ సైదాబాద్ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంది. తన ఖాళీ స్థలంలో కొన్ని గదులు నిర్మించిన దాని యజమాని వాచ్మెన్ ఆధీనంలో ఉంచారు. ఆ వాచ్మెన్ ద్వారానే ఓ గదిని అద్దెకు తీసుకున్న ఈ గ్యాంగ్ షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు పత్రాలు వారి వద్దా అందుబాటులో లేవు. నేరం చేయడానికి ముందు వినియోగించడానికి ఓ సెకండ్ హ్యాండ్ ఫోన్ను నగరంలోనే ఖరీదు చేసిన లోకేంద్ర.. ఆ స్థలం వాచ్మెన్ పేరుతో సిమ్కార్డు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. కాచిగూడలో నేరం తర్వాత హేమ్రాజ్ కారులో సంతోష్నగర్ వరకు వెళ్లిన ఈ ముఠా ఆ వాహనం అక్కడ వదిలేసింది. అక్కడ నుంచి ట్యాక్సీలో షోలాపూర్కు... అట్నుంచి మరో ట్యాక్సీలో పుణేకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి ఎటు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు. ఈ నేరంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నేరుగా పాల్గొన్న నలుగురితో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిలో బిమ్లతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు. సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ సూత్రధారి లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా చేసిన మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ నేరంలో లోకేంద్ర పాత్ర ఖరారు చేశామని, మిగిలిన వారి పాత్ర తేలాల్సి ఉందని నగర అధికారులకు మహారాష్ట్ర పోలీసుల తెలిపారు. కాచిగూడ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి వివిధ రాష్ట్రాల పోలీసులతో పాటు భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలగాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై అదును చూసుకుని తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. ఈ నేరంలోనూ లోకేంద్రతో పాటు కాచిగూడ కేసులో వాంటెడ్గా ఉన్న దీపేందర్, చతుర్భుజ్ పాత్రల్నీ అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. లోకేంద్ర అరెస్టు తర్వాతే దీనిపై క్లారిటీ కానుండటంతో అతడి కోసం గాలిస్తూ ఓ బృందాన్ని నేపాల్కు పంపారు. నగర పోలీసులకు చెందిన మూడు బృందాలు సైతం ఈ ముఠా కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. దళారిగా మాట్లాడిందీ దేవేంద్రే అని గుర్తింపు... ఇక్కడ చోరీ చేసిన సొత్తుతో నేపాల్ వెళ్లిపోయే లోకేంద్ర అక్కడ ఉన్న ఓ వ్యాపారి ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ మొత్తం నుంచి తన అనుచరులకు, నేరం చేయడానికి సహకరించిన వారిని వాటాలు ఇస్తున్నాడు. అనుచరులకు నేరుగా ఇస్తుండగా... సహకరించిన వారి కుటుంబీకులకు నేపాల్లోనే అందిస్తున్నాడు. ఆపై మరో నేరం చేయడానికి ఇంకో నగరాన్ని ఎంచుకుని లోకేంద్ర గ్యాంగ్ రంగంలోకి దిగుతోంది. ఇలానే హేమ్రాజ్ ఇంట్లో పని చేస్తున్న బిమ్లను సంప్రదించిన లోకేంద్ర ఆమె ద్వారా అర్పితను ఆ ఇంట్లో పనికి పెట్టాడు. మరో పనివాడు కావాలంటూ హేమ్రాజ్ ఆమెను కోరడంతో ఇంద్రన్ బహదూర్ అనే ఏజెంట్తో మాట్లాడించింది. అతడి ద్వారానే దీపేంద్ర హేమ్రాజ్ ఇంట్లో పనికి చేరాడు. ఆపై కేవలం వారం రోజుల్లోనే మిగిలిన వారితో కలిసి ఈ చోరీ చేశాడు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో కాచిగూడ పోలీసులు ఇంద్రన్ పేరుతో మాట్లాడింది కూడా దీపేంద్రే అని గుర్తించారు. లోకేంద్ర గ్యాంగ్కు సహకరించిన బిమ్లను పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన రిమాండ్కు తరలించారు. అక్కడ ఓ బడా వ్యాపారి ఇంట్లో భారీ చోరీ ఐదు కేజీల బంగారం ఎత్తుకుపోయిన గ్యాంగ్ కాచిగూడలో నేరం చేయడానికి 6 నెలల ముందు.. ఈ కేసులో బిమ్లను అరెస్టు చేసిన నగర పోలీసులు -
Hyderabad Metro: 30% మోత!
సాక్షి, హైదరాబాద్: మెట్రో చార్జీల పెంపు ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న చార్జీలను 30 శాతం వరకు పెంచనున్నారు. దీంతో ప్రయాణికులపైన రోజుకు సుమారు రూ.కోటి భారం పడనుంది. ప్రస్తుతం సగటున ఒక ప్రయాణికుడు రోజుకు రూ.40 చొప్పున చార్జీలు చెల్లిస్తున్నట్లు భావిస్తే పెరుగనున్న చార్జీల వల్ల మరో రూ.20 భారం పడనున్నట్లు అంచనా. అంటే కొత్త చార్జీల వల్ల సగటు ప్రయాణికుడు సుమారు రూ.60 వరకు చెల్లించవలసి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి రోజు సుమారు 4.8 లక్షల మంది ప్రయాణికుల నుంచి టిక్కెట్ల రూపంలో ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.1.92 కోట్ల ఆదాయం లభిస్తుండగా, చార్జీల పెంపుతో రూ.2.88 కోట్ల వరకు లభించనున్నట్లు అంచనా. ఈ మేరకు ప్రతి నెలా సుమారు రూ.87 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చు.కొంతమేర ఊరట..ప్రస్తుతం నగరంలో మెట్రో రైళ్లు సుమారు రూ.6500 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. మెట్రో రైళ్ల నిర్వహణ, విద్యుత్ వినియోగం, సిబ్బంది జీతభత్యాల చెల్లింపు, ఖర్చులను దృష్టిలో ఉంచుకొంటే టికెట్లపైన వచ్చే ఆదాయం తక్కువే అయినా చార్జీల పెంపు వల్ల కొంత మేరకు ఊరట లభించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి 26 కిలోమీటర్లకు పైగా గరిష్టంగా రూ.60ల వరకు చార్జీలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి కనిష్ట చార్జీలు రూ.12 నుంచి గరిష్టంగా రూ.75 వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. నగరంలోని మూడు కారిడార్లలో ప్రతిరోజు సుమారు 1200 ట్రిప్పులు నడుస్తున్నాయి. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీ బస్స్టేషన్ కారిడార్లో రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ మిగతా రెండు కారిడార్లలోనే ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు సాగిస్తున్నారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 2017 నవంబర్లో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చార్జీలను పెంచలేదు. ప్రతి సంవత్సరం వరుసగా నష్టాలు నమోదవుతూనే ఉన్నప్పటికీ చార్జీల పెంపుపైన ప్రభుత్వం నుంచి సానుకూలత లభించకపోవడం, 2023 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా చార్జీలను పెంచాలనే ప్రతిపాదనను హైదరాబాద్ మెట్రోరైల్ ఎప్పటికప్పుడు వాయిదా వేయవలసి వచ్చింది. ‘రవాణా ఆధారిత ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు. రైళ్ల నిర్వహణ భారంగా మారింది. దీంతో చార్జీలను పెంచకతప్పడం లేదు.’ అని ఎల్అండ్టీ మెట్రోరైల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.30 శాతం ఎందుకంటే....చార్జీల పెంపుపైన అన్ని విధాలుగా సమగ్ర అధ్యయనం చేసిన అనంతరమే 30 శాతం పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కనిష్ట దూరానికి ఇది 25 శాతమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు 4 నుంచి 6 కిలోమీటర్లకు ప్రస్తుతం రూ.15 ఉండగా ఇది రూ.20 వరకు పెరగనుంది. అలాగే ప్రస్తుతం 22 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల వరకు రూ.55 చార్జీ ఉంది. ఇది రూ.70 వరకు పెరుగనుంది. 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి ఇప్పుడు రూ.60 ఉంటే రూ.75 వరకు చార్జీలు పెరగనున్నాయి. బెంగళూరు మెట్రో చార్జీలపైన ప్రత్యేకంగా అధ్యయనం చేసిన అనంతరం నగరంలో 30 శాతం కంటే ఎక్కువ పెంచరాదని భావించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆ నగరంలో మెట్రో చార్జీలను 45 శాతానికి పెంచారు. కొన్ని స్టేజీల మధ్య ఇది 50 శాతం వరకు ఉంది. దీంతో అక్కడ 4 కిలోమీటర్లకు రూ.20లు, గరిష్టంగా 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి రూ.90 వరకు చార్జీలు పెరిగాయి. ఈ అనూహ్యమైన పెంపుపైన ప్రయాణికుల నుంచి విముఖత వ్యక్తమైంది. దీంతో సుమారు 7 శాతం వరకు ప్రయాణికులు తగ్గారు. ఆ నగరంలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో కొత్త చార్జీలను ఖరారు చేశారు. -
ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?
నగరంలో ప్రస్తుతం ప్రతి రోజు 4.8 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో మాత్రం 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు తగ్గింది. చార్జీల పెంపు ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపైన కూడా సీరియస్గా దృష్టి సారించారు. కొత్త చార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. బెంగళూరులో 45 శాతం పెంచడం వల్ల కొంత వ్యతిరేకత వచ్చిందని, హైదరాబాద్లో అలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చార్జీలను పెంచలేదనే అంశాన్ని ప్రధానంగా పేర్కొంటున్నారు. -
తనకు అడ్డు వస్తున్నాడని..
బంజారాహిల్స్: తనకు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి సొంత బావనే దారికాచి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఫస్ట్లాన్సర్కు చెందిన మహ్మద్ ఇలియాస్ (47) సెంట్రింగ్ పని చేసేవాడు. అతడి బావమరిది అబ్దుల్ సత్తార్ మాసబ్ట్యాంక్ సమీపంలో ఓ చికెన్ షాపులో తండ్రి షేక్ అబ్దుల్ వాహెబ్, సోదరుడు గౌస్తో కలిసి పని చేసేవాడు. మద్యానికి బానిసైన సత్తార్ కొంతకాలంగా డబ్బుల కోసం తండ్రి, సోదరుడితో తరచూ గొడవపడటమేగాక డబ్బులు లాక్కెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తండ్రిని, సోదరుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని, మద్యం తాగడం మానేయాలని అతడి బావ మహ్మద్ ఇలియాస్ పలుమార్లు సత్తార్కు హితవు పలికాడు. డబ్బులు ఇవ్వకుండా తండ్రిని నియంత్రించాడు. ఈ విషయమై ఆదివారం రాత్రి ఇలియాస్, సత్తార్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డబ్బుల కోసం తండ్రిని వేధించవద్దని, మరోమారు ఇబ్బందులకు గురిచేస్తే బాగుండదని బావమరిదిని హెచ్చరించిన ఇలియాస్ ఫస్ట్లాన్సర్లోని తన ఇంటికి వచ్చాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సత్తార్ పథకం ప్రకారం చికెన్ షాపులోని కత్తిని జేబులో పెట్టుకుని బావను వెంబడించాడు. ఇంట్లోకి వెళ్తున్న ఇలియాస్ను బయటికి లాగి పొత్తి కడుపులో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఇలియాస్ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్తార్పై కేసు నమోదు చేశారు. నాలుగు గంటల్లోనే పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బావను హత్య చేసిన బావమరిది -
మీటర్ల ‘గోల్’మాల్ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ మీటర్ల గోల్మాల్ వ్యవహారంలో బాధ్యులపై వేటు పడింది. ఏఈ సహా లైన్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్లను సస్పెండ్ చేసింది. మంజూరైన మీటర్లను సంబంధిత వినియోగదారుల నివాసాలకు అమర్చకుండా గుట్టుగా నిల్వ చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో చేర్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సైబర్సిటీ సర్కిల్ ఇబ్రహీంబాగ్ డివిజన్ చిత్రపురి కాలనీలోని ఓ కాంట్రాక్టర్ ఇంట్లో 42 విద్యుత్ మీటర్లు లభ్యమైన విషయం తెలిసిందే. దుండిగల్, ఇబ్రహీంబాగ్, సరూర్నగర్లో విద్యుత్ మీటర్లు పక్కదారి పట్టిన విషయంపై మూడు రోజుల క్రితం సాక్షిలో ‘మీటర్ల గోల్మాల్’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీఎండీ ముషారఫ్ ఫా రూఖీ సీరియస్ కావడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రంగారెడ్డిజోన్ సీజీఎం పాండ్యానాయక్ అంతర్గత విచారణ చేపట్టి సీఎండీకి సమగ్ర నివేదిక అందజేశారు. ‘తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటీవ్ సొసైటీ’ పేరున జనవరి 25న 42 విద్యుత్ మీటర్లు జారీ చేసినట్లు గుర్తించారు. డిస్కం మంజూరు చేసిన ఈ మీటర్లను వినియోగదారుల ఇంటికి అమర్చకుండా కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి తన ఇంట్లోనే నిల్వ చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో వీటికి బిల్లులు కూడా జారీ చేశారు. ఈ అంశంపై స్థానిక ఏఈ భాస్కర్రావు సహా లైన్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్ల ప్రయేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మీటర్ల గోల్మాల్కు కారణమవడంతో పాటు సంస్థ ఆర్థిక నష్టాలకు కారణమైన ఏఈ సహా మీటర్ రీడర్, లైన్ ఇన్స్పెక్టర్లను డిస్కం యాజమాన్యం సోమవారం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా సదరు కాంట్రాక్టర్పై ఇప్పటికే రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించింది. బ్లాక్ లిస్ట్లో చేర్చడంతో పాటు లైసెన్సును రద్దు చేయాల్సిందిగా కోరుతూ సీఈఐ జీకి లేఖ రాసింది. ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా, కోదాడకు చెందిన తుమాటి గోపీకృష్ణా రెడ్డి (27 అనే యువకుడు హాస్టల్ నిర్వహిస్తూ అన్నోజి గూడ ప్రేమలత అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. అతడికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని కలిసేందుకు చైతన్యపురి వెళ్లిన అతను సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. నాగోల్ మేట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఉప్పల్ నుంచి నాగోల్ వైపు వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. లారీ చక్రాల కింద పడిన అతడిని దాదాపుగా 10 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో అతని శరీరం నుజ్జు నుజ్జుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూటగట్టి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీకోసం గాలిస్తున్నారు.గంజాయి పట్టివేతకుత్బుల్లాపూర్: ఎస్టీఎఫ్బీ సిబ్బంది దాడి చేసి ఓ వ్యక్తి నుంచి రూ.1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్టీఎఫ్బీ ఎస్ఐ బాలరాజు నేతృత్వంలో సోమవారం శివారెడ్డినగర్లో దాడులు నిర్వహించిన సిబ్బంది షరీఫ్ అనే వ్యక్తి నుంచి 1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడి నువచి బైక్, సెల్ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో అఖిల్ అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం..లంగర్ హౌజ్ ప్రాంతంలో హెచ్డీఎఫ్బీ బృందం దాడులు నిర్వహించి 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మహమ్మద్ సులేమా అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు అతడి నుంచి డ్రగ్స్తో పాటు రెండు సెల్ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన షకీల్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని గోల్కొం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు.భార్య అనుమానించిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యసనత్నగర్: భర్త వేరే యువతితో కలిసి ఉన్న ఫొటోను చూసిన భార్య అనుమానంతో నిలదీయగా మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట అన్నానగర్లో సాయికుమార్ (23), పూజ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సాయికుమార్ తరచూ తమ పక్కింటి యువతితో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో అతను సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోను చూసిన పూజ అతడిని నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.10 కోట్ల విలువైన గంజాయి దహనం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ జిల్లా రైల్వే పోలీసులు వివిధ కేసుల్లో పట్టుకున్న రూ.10 కోట్ల విలువైన 2 వేల కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. యాదాద్రి జిల్లా, తొక్కాపూర్ గ్రామంలోని రోమో ఇండస్ట్రీస్ సహకారంతో గంజాయిని దహనం చేసినట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సికింద్రాబాద్ అర్బన్ డివిజన్లో 49 కేసుల్లో పట్టుబడిన 1419 కిలోలు, రూరల్ డివిజన్లో 5 కేసుల్లో పట్టుబడిన 100 కిలోలు, కాజీపేట డివిజన్ పరిధిలో పట్టుబడిన 490 కిలోల గంజాయిని దహనం చేశామన్నారు. గంజాయి ఉత్పత్తి చేసే ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే అన్ని రైళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. 74 కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసిన మీదట న్యాయ సలహాలు తీసుకుని గంజాయిని దహనం చేశామన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ అర్బన్ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, రూరల్ డీఎస్పీ శ్రీనివాస్, కాజీపేట డీఎస్పీ టి.కృపాకర్ పాల్గొన్నారు. -
బయోచార్ ఉత్పత్తులతో నేలలు సారవంతం
కొత్తూరు: బయోచార్ ఉత్పత్తులతో వ్యవసాయ పొలాలు, నేలలు మరింత సారవంతంగా మారుతాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ అన్నారు. నందిగామ మండలం, కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్నెస్, పాపెల్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తున్నారన్నారు. దీంతో పొలాలు, వాతావరణం కలుషితమవుతోందని తెలిపారు. దీనికి తోడు రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. బయోచార్ ఉత్పత్తులతో పొలాలు మరింత సారవంతంగా మారడంతో పాటు పంటల దిగుబడి సైతం పెరుగుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో చిరు వ్యాపారులు, రైతులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నారన్నారు. వారికి బయోచార్ ఉత్పత్తులు మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి తోడ్పడతాయన్నారు. గ్రామీణ స్థాయిలో బయోచార్ ప్లాంట్లను నెలకొల్పడానికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, లాభసాటిగా ఉండే పంటలసాగుపై రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఏటా పంటల వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారని, దీంతో కాలుష్యంతో పాటు ఇతర ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. బయోచార్ ఉత్పత్తులతో పంటల వ్యర్థాలను పొలాలకు బలం చేకూర్చే ఎరువులను తయారు చేసే అవకాశం ఉందన్నారు. బయోచార్ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా రైతులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్లాంట్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపకుడు కమ్లేష్ జీ పటేల్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నలోపం కూడా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలను చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ప్రపంచస్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఉపకరించే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పోటీదారులతోపాటు దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలన్నారు. మిస్వరల్డ్– 2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ జి.సుదీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.పోటీల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలని సీఎం సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగే ప్రారంబోత్సవం నుంచి... 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చార్మినార్, లాడ్బజార్, సచివాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు, భద్రత కల్పించాలన్నారు. అనుకోని అవాంతరాలు ఎదురైతే.. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతోపాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతోపాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున ప్రారంబోత్సవానికి ఆహ్వనించాలని సూచించారు. -
అందం.. సామాజిక బంధం
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడనున్న సుందరీమణులు సౌందర్యోపాసనకే పరిమితం కావడంలేదు. భావి ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారు. వారిలో ఎందరో వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంచుకున్న రంగంలో బిజీగా ఉంటూనే మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కోసం హైదరాబాద్ వస్తున్న 110 దేశాల సుందరీమణులు వృత్తి–ప్రవృత్తి పరంగా భిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సమాజానికి మంచి చేసేందుకు.. ⇒ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందినీ గుప్తా బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదువుతోంది. రాజస్తాన్లోని కోటా నగరానికి చెందిన ఆమె 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. భవిష్యత్తు వాణిజ్య సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని తపిస్తూనే ‘ప్రాజెక్ట్ ఏకతా‘ద్వారా వికలాంగులకు మంచి జీవితం అందించేందుకు కృషి చేస్తోంది. ⇒ మిస్ నమీబియా సెల్మా కమన్య ఓ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. నమీబియాలో మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తోంది. ⇒ టర్కీ సుందరీమణి ఇడిల్ బిల్జెన్, ఉక్రెయిన్లో యుద్ధ బాధితులకు చికిత్స చేస్తూ సామాజిక సేవారంగంలో ముందుకు సాగుతున్నారు. ⇒ ఫ్రాన్స్ సుందరి అగాథే కాయెట్, నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన హన్నా జాన్సన్, గయానాకు చెందిన జలికా సామ్యూల్స్ వైద్యులకు అండగా ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ⇒ నేపాల్ భామ స్రీచ్చా ప్రధాన్ పర్యావరణం మెరుగుపరిచేందుకు పనిచేస్తోంది. ⇒ కిర్గిజ్స్తాన్కు చెందిన ఐజాన్ చనచేవా, సెర్బియా సుందరి అలెగ్జాండ్రా రుటోవిక్ హోటల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ⇒ మిస్ కొలంబియా కాటలినా క్వింటెరో వ్యాపారంపై దృష్టి పెట్టింది. ⇒ అంగోలాకు చెందిన నూరియా అస్సిస్, వ్యాపారం, మార్కెటింగ్లో డిగ్రీలు కలిగిన పాప్ స్టార్ గాయని. బీట్లను బోర్డ్ రూమ్లతో మిళితం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ ఫిన్లాండ్ నుంచి పోటీలో నిలిచిన సోఫియా సింగ్ పీఆర్, మార్కెటింగ్ నిపుణురాలు. ⇒ మిస్ హంగరీ ఆండ్రియా కాట్జెన్బాచ్ మార్కెటింగ్ క్యాంపెయిన్లను నైపుణ్యంతో సమన్వయం చేçస్తున్నారు. ⇒ గ్రీస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టెల్లా మిచైలిడౌ, హైతీకి చెందిన క్రిస్టీ గురాండ్, మిస్ వియత్నాం హుయిన్ ట్రాన్యినీ భవిష్యత్తులో గొప్ప వ్యాపార సంస్థలకు సీఈఓలు అయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ⇒ దక్షిణాఫ్రికాకు చెందిన జోలైజ్ జాన్సెన్ వాన్ రెసబర్గ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ప్రొఫెషనల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాట, గ్లోబల్ అఫైర్స్ గ్రాడ్యుయేట్. ఆగ్నేయాసియా దేశాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. ⇒ మిస్ శ్రీలంక అనుది గుణసేకర, మిస్ కొరియా మిన్ జంగ్, పనామాకు చెందిన కరోల్ రోడ్రిగెజ్లు కూడా అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై అధ్యయనంలో బిజీగా ఉన్నారు. ⇒ కేమన్ ఐలాండ్స్కు చెందిన జాడా రమూన్ తన స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్తో కలిసి పనిచేçస్తున్నారు. ⇒ గ్వాడెలూప్నకు చెందిన నోమీ మిల్నే వైద్యురాలిగా రాణిస్తూనే రచయిత్రిగా కూడా ప్రతిభ చాటుకుంటున్నారు. ⇒ వేల్స్కు చెందిన మిల్లీ–మే ఆడమ్స్, బోస్నియాకు చెందిన ఎనా అడ్రోవిక్ వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. ⇒ ప్యూర్టోరికోకు చెందిన వలేరియా పెరెజ్ మెడికల్ టెక్నాలజీలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్. ⇒ బెల్జియంకు చెందిన కరెన్ జాన్సెన్, గ్వాటెమాలా నుంచి పోటీపడుతున్న జైమీ ఎస్కోబెడో, లెబనాన్కు చెందిన నాదా కౌస్సా, మలేసియాకు చెందిన సరూప్ రోషి, పోలాండ్కు చెందిన మాజా క్లాజ్డాలు మానసిక వైద్యులుగా ఎదిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ⇒ ఇంగ్లాండ్కు చెందిన మిల్లా మాగీ లైఫ్గార్డ్, సీపీఆర్ ప్రచారకర్త. ⇒ బ్రెజిల్కు చెందిన జెస్సికా పెడ్రోసో, అర్జెంటీనాకు చెందిన గ్వాడలూపే అలోమర్, ఆ్రస్టేలియా ప్రతినిధి జాస్మిన్ స్ట్రింగర్లు ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు. ⇒ మెక్సికో భామ మేరిలీ లీల్ విద్యా కార్యక్రమాలను నడుపుతున్నారు. ⇒ చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా లవాండెరో కమర్షియల్ పైలట్గా రాణిస్తుండగా సొమాలియాకు చెందిన జైనబ్ జమా ఏవియేషన్ అధ్యయనంలో ఉన్నారు. ⇒ అర్మేనియా సుందరి అడ్రిన్ అట్షెమ్యాన్ అర్మేనియా టీవీలో ప్రసారమయ్యే అత్యధిక రేటింగ్ టీవీ సిరీస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి. ⇒ అమెరికా తరఫున పోటీలో ఉన్న అథెన్నా క్రాస్బీ టీవీ తెరను ఏలుతోంది. ⇒ డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మైరా డెల్గాడో స్వదేశంతోపాటు అమెరికా, ఇత ర లాటిన్ అమెరికన్ దేశాల్లో యూనివిజన్ కోసం రిపోర్టర్గా పనిచేస్తోంది. ⇒ ఎస్టోనియాకు చెందిన ఎలీస్ రాండ్మా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎదుగుతోంది. -
Miss World 2025: కాస్ట్లీ కాంటెస్ట్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ రూ.700 కోట్లపైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థకు రూ. 400–500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్షిప్ ఆదాయంలో మాత్రం 90 శాతానికిపైగా ఆదాయం మిస్ వరల్డ్ సంస్థకే చెందనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్స్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని.. కేవలం రూ. 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. ఈ లెక్కన స్పాన్సర్షిప్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల మేర సమకూరుతోందన్నది దాని సారాంశం. ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలతోనూ.. మిస్ వరల్డ్ అందాల పోటీలను 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాటి ప్రసార హక్కుల కోసం పలు చానళ్లు ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ రూపంలోనూ ఆ సంస్థకు భారీ మొత్తం సమకూరనుంది. అలాగే పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే టికెట్ల (హైదరాబాద్ పోటీల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు) విక్రయాల రూపంలో సైతం ఆ సంస్థకు ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే ఒప్పందం మేరకు ఇందులో వాటా ఇస్తుంది. డిజిటల్, సోషల్ మీడియా హక్కులు ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా కొన్ని డిజిటల్, సోషల్ మీడియా చానళ్లలోనూ మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అలాంటి సంస్థలకు కూడా హక్కులు విక్రయించడం ద్వారా మిస్ వరల్డ్ సంస్థ ఆదాయం పొందనుంది. యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో వాణిజ్య ప్రకటనల ప్రసారం ద్వారా కూడా ఆదాయంలో మిస్ వరల్డ్ సంస్థ వాటా పొందుతున్నట్లు సమాచారం. ఆదాయ వివరాల్లో గోప్యత.. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు సంబంధించిన ఖర్చు వివరాలు మాత్రమే వెల్లడవుతుండగా ఆదాయ వివరాలను మాత్రం మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతోంది. ఇతర అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా స్పాన్సర్షిప్స్ ఆదాయంపై కొంత స్పష్టత ఉంటున్నా అందాల పోటీల విషయంలో మాత్రం సంపూర్ణ గోప్యతే కొనసాగుతోంది. పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. భారత్లోనే ఖర్చు తక్కువ.. 2023లో మిస్ వరల్డ్ పోటీలకు తొలుత యూఏఈని ఎంపిక చేశారు. ఆ సమయంలో పోటీల నిర్వహణ బడ్జెట్ను రూ. 250 కోట్లుగా అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో పోటీలు ముంబైకి మారాయి. ముంబైలో పోటీలకు చేసిన ఖర్చు, యూఏఈ అంచనాలో కేవలం 35 శాతంగా ఉన్నట్లు సమాచారం. రూ. 100 కోట్లలోపు ఖర్చుతోనే పోటీలను ముగించారు. ఇప్పుడు హైదరాబాద్లో అంతకంటే తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. అయితే నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దీనికి అదనం. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్పాన్సర్షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ సంస్థ చెల్లించనుందని సమాచారం. కానీ ఇందులో స్పష్టత లేదు.విజేతకు వజ్రాల కిరీటం..ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపచేస్తారు. గతేడాది ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనా పిజ్కోవాకు అందించిన కిరీటం విలువ రూ. 6.21 కోట్లని తెలుస్తోంది. ఈసారి విజేతకు ప్రైజ్మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. -
ఐటీ పార్కు@ గోపన్పల్లి..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు అభివృద్ధి ప్రణాళికలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలికి సమీపంలోని శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో భూసేకరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ఏర్పాటు చేసే ఐటీ పార్కుతోపాటు సంబంధిత రంగాల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు రెండ్రోజుల క్రితమే భూసేకరణ ప్రక్రియ సన్నాహాలు ప్రారంభించారు. భూసేకరణకు అవసరమైన సర్వే నంబర్లను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేరిలింగంపల్లి ఆర్డీవోకు లేఖ రాశారు. దీంతో గోపన్పల్లిలోని సర్వే నంబర్ 127 నుంచి 173, 263 నుంచి 286 సర్వే నంబర్ల పరిధిలోని 439.15 ఎకరాలను ఆర్డీవో నిషేధిత జాబితాలో చేర్చారు. త్వరలోనే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అయితే గోపన్పల్లిలో 439.15 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలపై టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్రెడ్డిని ‘సాక్షి’సంప్రదించగా అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దని లేదని వివరణ ఇచ్చారు. -
అక్కడక్కడా భూప్రకంపనలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. జగిత్యాల జిల్లాలో సుమారు మూడు సెకన్ల నుంచి ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మూడు నుంచి నాలుగు సెకన్లు కంపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ముందుగా ఉరుములతోనని అనుకున్న ప్రజలు.. భూకంపమని తెలుసుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో రాజుకు చెందిన పెంకుటిళ్లు పైకప్పు భూకంపం ధాటికి కూలిపోయింది. ⇒ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పులికుంట కేంద్రంగా సాయంత్రం 6.50 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని లక్ష్మణచాంద, పెంబి, ఖానాపూర్, దస్తూరాబాద్, జన్నారం, లక్సెట్టపేట, దండేపల్లి మండలాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. టేబుల్పై ఉన్న గ్లాసు కింద పడిందని జన్నారం మండలం పొనకల్ శ్రీలంక కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జాడి రాజన్న తెలిపారు. తపాలపూర్లో అంట్ల స్టాండ్ నుంచి గ్లాసులు కింద పడినట్టు విజయధర్మ తెలిపారు. – సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటతోపాటు దుబ్బాక పట్టణంలో సాయంత్రం 6.45 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో స్వల్పంగా భూమి కంపించినట్టు గ్రామస్తులు తెలిపారు. -
10.26 టీఎంసీలు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో మిగిలి ఉన్న నిల్వల నుంచి వేసవి తాగునీటి అవసరాల కోసం జూలై నెలాఖరు వరకు 10.26 టీఎంసీలను కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 88 రోజులపాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 300 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా 750 క్యూసెక్కులు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు కలుపుకుని మొత్తం 10.26 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. వేసవి తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసేందుకు సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, త్రిసభ్య కమిటీ కని్వనర్ డీఎం రాయిపూరే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ హాజరయ్యారు. ఏపీ మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరైంది. కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ లేఖ రాసినట్లు తెలిసింది. ఇకపై బోర్డు సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని ఏపీ కోరుతోంది. కోటాకు మించి ఏపీ వాడుకుంది.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్)కు ఎగువన ఉన్న 15 టీఎంసీల్లో ఆవిరి నష్టంగా 4.28 టీఎంసీలు పోగా కేవలం 10.81 టీఎంసీలే మిగులుతాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్ స్పష్టం చేశారు. అందులో తమకు 10.26 టీఎంసీలు కేటాయిస్తే ఇక 0.55 టీఎంసీలే మిగులుతాయన్నారు. ఇప్పటికే ఏపీ కోటాకు మించి కృష్ణా జలాలను వాడుకుందని.. అందువల్ల ఆ రాష్ట్రం శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి ద్వారా, నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని డిమాండ్ చేశారు. రెండు జలాశయాల్లో మిగిలిన నిల్వలు తమవేనని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నీళ్లు అవసరమో ఇండెంట్ సమరి్పంచాలని కమిటీ కనీ్వనర్ డీఎం రాయిపూరే సూచించారు. -
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రూ.330 కోట్లతో నిర్మించిన గోల్నాక–అంబర్పేట ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం.. బాగున్నారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కాలేదు. అక్కడి సమస్యలను కిషన్రెడ్డి నా దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో పదేళ్లలో 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేశాం. ఇండోర్– హైదరాబాద్ కారిడార్ దాదాపు పూర్తయ్యింది. రీజినల్ రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్–విజయవాడ రహదారి ఆరులైన్లుగా విస్తరిస్తాం. నాగ్పూర్లో డబుల్ డెక్కర్ ఎయిర్బస్ను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ఈ ఎయిర్ బస్ నడిపించాలని మంత్రులు కోరుతున్నారు.’’ జాతీయ రహదారులు రెట్టింపు చేశాం : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడకు వెళ్లినా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ వంతెనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో 65 ఏళ్లలో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తే, ఈ పదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం కొత్తగా మరో 2,600 కి.మీ నిర్మించింది. రూ.1.25 లక్షల కోట్లు జాతీయ రహదారులపై ఖర్చు చేసింది. నితిన్ గడ్కరీని ఫ్లైఓవర్ మంత్రి అంటారు. ఆయన పేరు మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతోంది’అని తెలిపారు. చౌటుప్పల్ – సంగారెడ్డి వరకు పనులను కేంద్రమే చేపట్టాలి : కోమటిరెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ..‘రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ సైడ్ 95 శాతం భూ సేకరణ అయ్యింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు పనులను కేంద్రమే చేపట్టాలి. అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి పరిహారం రాలేదని నాకు ఫిర్యాదు అందింది. వారందరికీ నెల రోజుల్లోపు సమస్యను పరిష్కారిస్తాం’అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అరి్వంద్, లక్ష్మణ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సూర్యనారాయణ, నగేశ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, శ్రీపాల్రెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి జాతికి అంకితం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి జాతీయ రహదారులను జాతికి అంకితం చేయడంతోపాటు రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గోడం నగేశ్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు హరీశ్బాబు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జుపటేల్, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. భెల్ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో రూ.138 కోట్ల వ్యయంతో నిర్మించిన భెల్ ఫ్లైఓవర్ వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఇక్రిశాట్ ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ ఎం.రఘునందన్రావు, కలెక్టర్ క్రాంతి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. గడ్కరీని కలిసిన మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ధంసలాపురం నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ఇరువైపులా సరీ్వస్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. జగ్గయ్యపేట నుంచి వైరా మీదుగా కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నుంచి కురవి అమరావతి నుంచి నాగపూర్ జాతీయ రహదారి వరకు రింగ్రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. -
ఎవరిపై మీ సమరం?: సీఎం రేవంత్
ఈ సమయంలో సమరం కాదు..సమయస్ఫూర్తి కావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను మనవి చేస్తున్నా. మనమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించొద్దు. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించుకుందాం – సీఎం రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: ‘ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదల్చుకున్నరు? ఎవరిని కొట్టదల్చుకున్నరు? ఉద్యోగా లిచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ యుద్ధం? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్లు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం. సమరం చేయడానికి లేము. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ‘తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డులు’ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 22 మంది పోలీస్ సిబ్బంది, అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నన్ను కోసినా రూపాయి రాదు.. ‘ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు. ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారవద్దని ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని.. ప్రభుత్వం సాఫీగా నడవొద్దని కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటది. మీరు వాళ్ల ఉచ్చులో పడి వాళ్ల చేతుల్లో పావులుగా మారొద్దు. రాజకీయ నాయకుల చేతుల్లో చురకత్తుల్లా మారి ప్రజల గుండెల్లో గుచ్చితే అది గాయంగా మారుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా రాదు. నెలకు రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. వాస్తవ పరిస్థితి ఇది. మరి నన్ను ఏం చేస్తరు? నన్ను కోసుకొని వండుకొని తింటరా?’అని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుబారా తగ్గిస్తున్నా.. ‘ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా రూ. 22,500 కోట్లు కావాలి. ప్రభుత్వానికి వస్తున్న రూ. 18,500 కోట్లలో ప్రతి నెలా అప్పులకు రూ. 7 వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 5,500 కోట్లు పోను నా దగ్గర మిగిలేవి రూ. 6 వేల కోట్లు. దీనిలో ఏయే పథకాలు అమలు చేయాలి? అవకాశం ఉన్న ప్రతి దగ్గర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. సీఎం హోదాలో ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానం తీసుకెళ్లే వెలుసుబాటు ఉన్నా మామూలు విమానాల్లో ఎకానమీ క్లాస్లో సాధారణ ప్రయాణికులతో కలిసే వెళ్తున్నా. దుబారా తగ్గిస్తున్నా’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఏది ఆపమంటారో మీరే ప్రజలకు చెప్పండి.. ‘మీ కోరికలు తీర్చాలంటే ఏం చేయాలి? కావాలంటే నేనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తా. 10 లక్షల మందిని కూడా తీసుకొస్తా. ఇట్లా చేస్తే బాగుంటదని సభలో మీ ఉద్యోగుల సంఘాల నాయకులే మాట్లాడండి. ఏ పథకం ఆపాలో మీరే ప్రజలకు చెప్పండి. ఫలానా పథకం ఆపేసి మేం జీతాలు పెంచుకుంటాం. బోనస్లు తీసుకుంటాం. మేం తిన్నాక మిగిలిందే మీకు ఇస్తామని ప్రజలకు చెప్పండి. లేదంటే రూ. 100 ఉన్న పెట్రోల్ రూ. 200 చేద్దామా? బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ధరలు రెండింతలు చేద్దామా? మీరే చెప్పండి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. నిరసనలు, ధర్నాలు, బంద్లు చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. నాకు పోయేది కూడా ఏమీ లేదు. చిన్న గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే ప్రజలు నాకిచి్చన గొప్ప గౌరవం అనుకుంటా. ఆ గౌరవం బతికి ఉన్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టేందుకు పనిచేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. అప్పంతా బకాయిలకే.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తెచి్చన అప్పు రూ. 1.58 లక్షల కోట్లు. అందులో రూ. 1.52 లక్షల కోట్లు పాత అప్పులు, అసలు, మిత్తికి చెల్లించాం. గత ప్రభుత్వం మొత్తం రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు పెట్టిపోయింది. మేం తెచ్చిన అప్పులో సొమ్మంతా పాత బకాయిలకు పోయింది తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఈ 16 నెలల్లో సరాసరిన నెలకు రూ. 9 వేల కోట్లు చెల్లించుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుందనే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పెంచింది. ఇప్పుడు రిటైరవుతున్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద రూ. 8,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. వాటిని ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. అదనంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 500 బోనస్, రూ. 500కే గ్యాస్ సిలిండర్లు, పేదల ఇళ్లకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 16 నెలల్లో కేవలం రైతులకే రూ. 30 వేల కోట్లను వాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశా’అని సీఎం పేర్కొన్నారు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే దొంగల్లా చూస్తున్నరు.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పు పుడతలేదు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే తెలంగాణ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నరు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. దేశం ముందు తెలంగాణది ఆ పరిస్థితి ఉంది. కుటుంబ పరువు తీయొద్దని కుటుంబ పెద్దగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ లెక్కలు కావాలంటే ఆర్థికశాఖ అధికారుల వద్ద కూర్చొని చూడండి’అని సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. కేసీఆర్ది పైశాచిక ఆనందం.. ‘డైలీ ఫైనాన్స్లో రూ. 10 మిత్తికి తెచ్చుకొనే వాడికంటే అద్వానంగా అప్పులు తెచి్చపెట్టిండు ఆయన (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి). రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మీ సావు మీరు సావండని హ్యాపీగా ఫాంహౌస్లో దుప్పటి కప్పుకొని పడుకుండు. మూడు నెలలకొకసారి బయటికి వచ్చి అది ఫెయిల్.. ఇది ఫెయిల్ అని తిడతడు. రైతుబంధు ఫెయిల్ అని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేటప్పుడు బాధతో కాదు.. ఆయన ముఖం వెయ్యి వోల్టుల బుల్బులా వెలుగుతది. ఇదేం పైశాచిక ఆనందం?’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. నిమిషం నిర్లక్ష్యంగా ఉన్నా పోలీస్ శాఖకు చెడ్డపేరు.. ‘శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. శాంతిభద్రతలు బాగున్నందునే 16 నెలల్లో రూ. 2.28 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాం. దీనంతటికీ కారణం పోలీస్ శాఖ అని నేను గర్వంగా చెబుతున్నా. విధుల్లో ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపి అణచివేయాలి, సైబర్ నేరాలను నియంత్రించాలి. పోలీస్శాఖకు అవసరమైన పూర్తి సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ సహా నగరాల్లో పోలీసులు చేపడుతున్న డ్రగ్స్ కట్టడి గ్రామీణ ప్రాంతాల్లోనూ పక్కాగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పలువురు సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు. -
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025 -
earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. -
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరం అంటున్నారు.. ఎవరిమీద?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారు. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా. సమరం కాదు.. సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిందాం. రాజకీయ నాయకుల్లో ఉద్యోగులు పావుగా మారొద్దు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా? అని ప్రశ్నించారు.కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు.స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం.ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనం.మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?.ప్రతీ నెలా ఏడు వేల కోట్లు ప్రతీ నెలా కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి.. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే. కేవలం పదహారు నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం.ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికిబకాయి పెట్టి వెళ్లారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు… మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం.ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అంటున్నారు. ఎవరిపై సమరం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
Walkers Troubles నడక..నరకమే..!
చార్మినార్: అసలే ఇరుకు రోడ్లు..ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్పాత్లు సైతం యథేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో పాతబస్తీలో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు కొందరు షోరూం యజమానులు షాపుల ముందున్న ఫుట్పాత్లు తమ సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరికి స్థానిక లోకల్ లీడర్లు, కొంతమంది ప్రభుత్వ విభాగాల సిబ్బంది, అధికారుల అండడండలు తోడవ్వడంతో ప్రశ్నించే వారే కరువయ్యారు. ఇప్పటికే చార్మినార్ పెడస్ట్రీయన్ ప్రాజెక్ట్ (సీపీపీ–చార్మినార్ కాలిబాట పథకం) పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా..ఇంకా పుట్పాత్లు అందుబాటులోకి రాలేదు. కొంతమంది సొంతంగా ఫుట్పాత్లపై వ్యాపారాలు కొనసాగిస్తుండగా..మరికొంత మంది షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు రోజు, వారం, నెలకు ఇంత...అంటూ అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశించినా.. ఫుట్పాత్ కబ్జాలు తొలగించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నగరంలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం.. పాతబస్తీలో మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యాటక కేంద్రమైన చార్మినార్, మక్కా మసీదు, లాడ్బజార్ తదితర ప్రదేశాలను సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాతబస్తీకి వస్తుంటారు. దీంతో ఇక్కడి రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారతాయి. అయితే ఫుట్పాత్లు లేకపోవడంతో వాహనాల మధ్య నుంచే రోడ్లపై బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని పాదాచారులు వాపోతున్నారు. రోడ్లుసైతం ఆక్రమణ.. పాతబస్తీలోఫుట్పాతులే కాదు..కొందరు రోడ్లను సైతం ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల చారి్మనార్ ట్రాఫిక్ పోలీసులు పత్తర్గట్టి నుంచి మదీనా వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. స్థానిక చిరువ్యాపారులు, షోరూం నిర్వాహకులు తమకు సహకరించడం లేదని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. సమన్వయంతో పని చేస్తే.. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో పని చేస్తేనే ఆశించిన ఫలితాలుంటాయి. అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఫుట్పాత్ కబ్జాలు పూర్తిస్థాయిలో తొలగించాలి. చార్మినార్–మదీనా రోడ్డులో ఫుట్పాత్పై వ్యాపారాలు, ఆక్రమణలను నియంత్రించాలి. రోడ్లపైనే నిల్చుని అమ్మకాలు చేస్తున్న వారిని క్రమపద్ధతిలో అనుమతించాలి. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చోట సిబ్బంది సంఖ్యని పెంచడంతో పాటు ఇరుకు చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాలి. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్ (25), ఎల్బీనగర్కు చెందిన చెన్నకేశవ గౌడ్ (23), వివేక్, సురేష, యశ్వంత్ నాయక్ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్ కారు నడుపుతుండగా, చార్లెస్ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర ఎగ్జిట్ దాటిన తర్వాత ముందున్న గ్యాస్ కంటెయినర్ లారీని కారు ఢీకొట్టి, డివైడర్కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్తో పాటు చార్లెస్ అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నకేశవ గౌడ్ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మిస్ వరల్డ్తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు -
ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్తో కలిసి పదేళ్లుగా మధురానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్కుమార్కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధ దంపతుల దారుణ హత్య
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్లో వాచ్మెన్గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
విమాన టికెట్కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్కు వచ్చిన థాయ్లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్లాండ్కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్లాండ్కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్లాండ్ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది. శ్రీనగర్ కాలనీలో ఓ ప్లాట్లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్ఫ్రెండ్ మోసం చేశాడని, హోటల్ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల(హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభా‹Ùనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్షి్మకి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచి్చన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
బయాలజీ ఈజీ... ఫిజిక్స్ టఫ్
సాక్షి ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పెన్–పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 550 పట్టణాల్లో 5వేలకుపైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. దాదాపు 22.7 లక్షల మంది నీట్ యూజీ– 2025కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...190 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 90 శాతానికి పైగా హాజరైనట్టు అధికారులు చెబుతున్నారు. 2024లో 77,849 మంది పరీక్ష రాయగా, 47,371 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జరిగిన పరీక్షకు హాజరైన విద్యార్థులు బయాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ నుంచి ఎక్కువ ప్రశ్నలు నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్ అత్యంత కఠినంగా, కెమిస్ట్రీ మధ్యస్తంగా, బయాలజీ తేలిగ్గా ఉన్నట్టు పరీక్షకు హాజరైన విద్యార్థులతోపాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. 11వ తరగతితో పోలిస్తే.. 12వ తరగతి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లోనూ థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. రీజన్, అసెర్షన్ ఆధారిత ప్రశ్నలు సైతం అడిగారు. మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ బేసిక్స్, కాన్సెప్ట్లు, ఫార్ములాలపై పట్టుతోపాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. బయాలజీ సులభం బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. బోటనీ, జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. జెనెటిక్స్, హుమ్యాన్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. థియరీ ఆధారిత, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. బోటనీ, జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. దీంతో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచి్చనట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమిస్ట్రీ మధ్యస్తం కెమిస్ట్రీ నుంచి అడిగిన 45 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండగా.. మొత్తమ్మీద ఈ విభాగం మధ్యస్తంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే మాత్రం ఈసారి కెమిస్ట్రీ విభాగంగా కొంత కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీల కాన్సెప్ట్ల నుంచి ప్రశ్నలు అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 ప్రశ్నలు, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వలిబ్రియంల నుంచి 1 ప్రశ్న చొప్పున అడిగారు. కెమిస్ట్రీలోనూ అధికంగా ఎన్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు అడిగారు. కొన్ని పశ్నలు మాత్రమే అప్లికేషన్ ఆధారితంగా, లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సినవి ఉన్నాయి. ఫిజిక్స్ క్లిష్టం ఫిజిక్స్ క్లిష్టంగా, ట్రిక్కీగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విభాగం నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో వీటికి సమాధానాలు సాధించడంలో సమయాభావం ఎదురైనట్టు చెప్పారు. ఫిజిక్స్ నుంచి అడిగిన 45 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు దాదాపు గంటర్నర సమయం పట్టినట్టు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. గతేడాది ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగితే.. ఈ ఏడాది ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ప్రశ్నలు ఎదురైనట్టు పేర్కొంటున్నారు. బయాలజీ, కెమిస్ట్రీతో పోలి్చనప్పుడు ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్లో కాన్సెప్ట్లతోపాటు ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కాన్సెప్ట్లపై స్పష్టత తప్పనిసరిగా మారింది. ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నటిక్ ఎఫెక్ట్, కైనమేటిక్స్, థర్మోడైనమిక్స్ల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున; మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, యూనిట్ అండ్ డైమెన్షన్, రొటేషనల్ నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు. -
మిస్ వరల్డ్లో మన హస్తకళలు!
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో మునిగితేలే సుందరీమణులు నిర్మల్ కొయ్య బొమ్మలను చెక్కనున్నారు.. పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు. చేర్యాల పెయింటింగ్స్కు రంగులద్దనున్నారు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ సంప్రదాయ హస్తకళలకు సంబంధించి కాసేపు ‘కళాకారులు’కాబోతున్నారు. పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ‘ప్రపంచ సుందరి’ 72వ ఎడిషన్ పోటీలకు వేదికైన హైదరాబాద్ కొత్త ‘అందం’తో తళుకులీనుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన పోటీదారులు నగరానికి చేరుకోగా, మరికొందరు సోమ, మంగళవారాల్లో వస్తున్నారు. వీరి రాకకు దాదాపు వారం ముందే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ, చైర్పర్సన్ జూలియా మోర్లే తన సిబ్బందితో నగరానికి చేరుకున్నారు. హైటెక్సిటీ సమీపంలోని ట్రైడెంట్ స్టార్ హోటల్లో ఆమె తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటీల నిర్వహణ పూర్తిగా మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లోనే జరగనుంది. పోటీల షెడ్యూల్, ఇతివృత్తాలను ఆ సంస్థే నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేసింది. ఇదే సందర్భంలో జూలియా మోర్లే రాష్ట్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంప్రదాయ హస్తకళలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, వాటిని పోటీల్లో భాగంగా చేర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయా హస్తకళలపై పోటీదారులకు అవగాహన కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రప్రభుత్వం శిల్పారామంలో ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. 22 రకాల హస్తకళల లైవ్ డెమానిస్ట్రేషన్ ఇక్కడ ఉండనుంది. ఈ నెల 21న వివిధ దేశాల పోటీదారులు అక్కడికి రానున్నారు. వారి ముందే నిపుణులైన కళాకారులు ఆయా కళాకృతులను తీర్చిదిద్ది, వాటి ప్రత్యేకతలను వివరించనున్నారు. వాటి తయారీలో పోటీదారులు కూడా స్వయంగా పాల్గొంటారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. స్టాళ్లు చూసి ఆసక్తి..మార్చి 20న మిస్ వరల్డ్ పోటీల వివరాలను తొలిసారి జూలియా మోర్లే పర్యాటక భవన్లో మీడియాకు వెల్లడించారు. మిస్ వరల్డ్–2024 విజేత, చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టీనీ పిజ్కోవా కూడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ హస్తకళలను స్వయంగా రూపొందిస్తూ కళాకారులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జూలియా, క్రిస్టీనీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రిస్టీనా పిజ్కోవా అయితే కాసేపు మగ్గం మీద కూర్చుని పోచంపల్లి చీర అల్లికను పరిశీలించారు. అప్పుడే వీటిపై మిస్వరల్డ్ సీఈఓకు ప్రత్యేకాసక్తి కలిగిందని సమాచారం. ఆమె సూచనతో అధికారులు ప్రత్యేకంగా వాటి లైవ్ డెమానిస్ట్రేషన్కు ఏర్పాట్లు చేశారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ చిత్రకళ, నిర్మల్ కొయ్య బొమ్మలు, బిద్రి వేర్, బంజారా ఎంబ్రాయిడరీ, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, గద్వాల హ్యాండ్లూమ్స్, పెంబర్తి ఇత్తడి బొమ్మలు, సిల్వర్ ఫిలిగ్రీ, సిద్ది పేట గొల్లభామ చీరలు, నకాషీ, మట్టికుండల తయారీ, కళంకారీ.. ఇలా పలు కళలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం విశేషం. -
ఇక సమరమే..
జేఏసీ తీర్మానాలు ఇవీ...⇒ పెండింగ్లో ఉన్న దాదాపు రూ.9 వేల కోట్ల బిల్లులు యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలి. ⇒ పెండింగ్లో ఉన్న ఐదు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి. ⇒ ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి. ⇒ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ⇒ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి. ⇒ స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి. ⇒ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. ⇒ ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి పూర్వ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలి. ⇒ 2025 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల సాధారణ బదిలీలను మే/జూన్లోనే నిర్వహించాలిసాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ పోరుబాట పట్టింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై 16 నెలలుగా చేసిన ఒత్తిడి ఫలించకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడటంతో ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. దశల వారీగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడమే కాకుండా జూన్ 9న హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వర్క్ టు రూల్, పెన్ డౌన్, సామూహిక సెలవులు వంటి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. జేఏసీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో 33 జిల్లాల జేఏసీ ప్రతినిధులు, సచివాలయ జేఏసీతో పాటు 206 అనుబంధ సంఘాల నేతలు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి షురూ.. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణ యం తీసుకున్న జేఏసీ..ఈనెల 15వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది. జిల్లాల వారీగా తేదీలు ఖరారు చేసుకుని ఆయా రోజుల్లో ఆందోళనలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి నాయకులు వీటిల్లో పాల్గొంటారు. ఇవి పూర్తయిన తర్వాత కొత్త జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లా నేతలతో ఆందోళన కార్యక్రమాలు చేపడ తారు. ఇవి పూర్తయ్యాక జూన్ 9వ తేదీన హైదరాబాద్లో సుమారు 50 వేల మంది ఉద్యోగులతో మహా ధర్నా నిర్వహిస్తామని టీజేఏసీ ప్రకటించింది.ఉద్యమంలో భాగంగా వర్క్ టు రూల్ (పనివేళలో మాత్రమే విధులు), మండలాలు, తాలూకా, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలు, ప్రభుత్వ కార్యా లయాల ముందు సామూహిక భోజనాలు, ఆ తర్వాత పెన్డౌన్ (హాజరు రిజిస్టర్లో సంతకం చేసి విధులకు గైర్హాజరు కావడం), అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 13.31 లక్షల మంది ఉద్యోగులు ఒకరోజు సామూ హిక సెలవుకు దిగడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. తమ సమస్యలకు సంబంధించి టీజేఏసీ 57 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఇందులో 45 డిమాండ్లు ఆర్థికేతరమైనవే.కేవలం 12 మాత్రమే ఆర్థికపరమైనవి. ఆర్థిక ఇబ్బందులున్నప్పడు కనీసం ఆర్థికేతర అంశాలనైనా పరిశీలించి వాటిని పరిష్కరించకపోవడంతోనే ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నట్లు ఉద్యోగ జేఏసీ స్పష్టం చేసింది. ఈ సదస్సులో ఉద్యోగ సంఘాల నేతలు జి.సదానందం గౌడ్, చావ రవి, కె. గౌతమ్కుమార్ పి.దామోదర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 20న జరిగే అఖిల భారత ఉద్యోగుల సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ప్రభుత్వం పట్టించుకోనందుకే.. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తక్షణ పరిష్కారం కోసం ఒత్తిడి చేశాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కొన్నిరోజులు వేచిచూడాలని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులున్నందున మేము కూడా ఓపిక పట్టాం. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తోంది. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీనిపై ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాం. కొందరు మంత్రులు గంటల తరబడి వెయిట్ చేయిస్తూ చివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయి ఉద్యోగులు మాపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. వారిలో ఓపిక నశించింది. కొందరిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనల బాట పట్టాం. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరిస్తే పునరాలోచన చేస్తాం. – మారం జగదీశ్వర్, టీజేఏసీ చైర్మన్ పరిష్కారం లేదు..చర్చల్లేవుమా సమస్యల పరిష్కారం కోసం 16 నెలలుగా ఎదురు చూశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు. సీఎంను ఒకట్రెండుసార్లు కలిసి పరిస్థితిని వివరించినప్పుడు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది? మా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది? – ఏలూరి శ్రీనివాసరావు, టీజేఏసీ సెక్రెటరీ జనరల్ -
సైబర్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు. దేశంలో పేట్రేగిపోతున్న సైబర్ కేటుగాళ్లకు అదే సైబర్ టెక్నాలజీతో చెక్ పెట్టే సరికొత్త వ్యవస్థ రూపుదిద్దుకోబోతోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి సైబర్ నేరాల దర్యాప్తులో చలాకీగా ఉన్న పోలీసులను గుర్తించి, ప్రత్యేక సైబర్ క్లాసులు చెప్పబోతున్నారు. దేశంలో సాంకేతిక విద్యలో అత్యున్నత సంస్థలైన పలు ఇండియ న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లు, ట్రిపుల్ ఐటీలు ఈ దిశగా కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం బాధ్యతలు తీసుకోబోతున్నాయి. పోలీసులకు ఇవ్వాల్సిన సైబర్ శిక్షణతో కూడిన పాఠ్యాంశాల సిలబస్ను ఐఐటీలే రూపొందించాయి. 4 వేల మంది డిజిటల్ అనలిస్టులు, 6 వేల మంది అంతర్జాతీయ సైంటిస్టులు, 500 మంది ఐఐటీ టాపర్స్ కలిసి డిజిటల్ కమాండో వ్యవస్థను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. అదుపు లేని మోసం: ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో 47 శాతం భారత్లోనే జరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఏడాదిలోనే రూ.20.68 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే, ఇదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. జాతీయ సైబర్ నేరాల రిపోరి్టంగ్ పోర్టల్కు ఏడాది కాలంలో 7.6 లక్షల ఫిర్యాదులు అందాయి. రూ.7,488 కోట్ల ప్రజల సొమ్మును సైబర్ నేరగాళ్లు లూఠీ చేశారు. తెలంగాణలో జరిగిన సైబర్ మోసాల విలువ రూ.759 కోట్లు. అయితే, ఈ మోసాలపై విచారణలో డబ్బు రికవరీ రేటు 18 శాతానికి మించడం లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పుడున్న పోలీసు వ్యవస్థకు సైబర్ క్రిమినాలజీపై సరైన పట్టు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఐఐటీలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రపంచవ్యాప్తంగా నేర సైకాలజీ, నేరాలను, వాటిని అడ్డుకునే సాంకేతికతలపై పోలీసులకు శిక్షణ ఇచ్చే సిలబస్ను రూపొందించాలని కోరింది. రెండేళ్లుగా సాగుతున్న ఈ కసరత్తు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. సిలబస్ ఇలా.. ఆన్లైన్ పెట్టుబడులు, షేర్ మార్కెట్లో లాభాలు వచ్చేలా చేస్తామని చెప్పే మోసాలు, ఓటీపీ ఆధారిత మోసాలు, గేమింగ్ బెట్టింగ్ యాప్ల పేరుతో దోచుకోవడం... ఇలా అనేక రకాల ప్రధాన డిజిటల్ మోసాలపై సమగ్ర సమాచారాన్ని విశ్లేశించారు. కాన్పూర్, మద్రాస్ ఐఐటీలు, నయారాయపూర్, కొట్టాయం ట్రిపుల్ ఐటీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. చాలా కేసుల్లో దర్యాప్తు బృందాలు మేల్కొనే లోపే సైబర్ నేరగాళ్లు ప్లాట్ ఫాం మకాం మార్చేస్తున్నారు. వాడిన ఫోన్, బ్యాంక్ లావాదేవీలన్నీ మారుతున్నాయి. ఈ వేగాన్ని తట్టుకునే లాంగ్ లరి్నంగ్ మాడ్యూల్స్ను (ఎల్ఎల్ఎం) ఐఐటీలు రూపొందించాయి. ఒక్క కమాండ్తో ఫ్రోటో వాయిస్ సిస్టమ్, కమాండో సిగ్నలింగ్ వ్యవస్థను, శరవేగంగా దూసుకెళ్తూ టార్గెట్ చేరుకునే మిసైల్ లాంగ్వేజ్ సిస్టమ్ను సిలబస్లో పొందుపర్చారు. మొత్తం ఆరు చాప్టర్లతో 200 సైబర్ నేరాల కమాండో వ్యవస్థతో సిలబస్ రూపొందించినట్టు ఐఐటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. శిక్షణ ఎవరికి? ఏటా 350 మందిని కమాండ్ సిస్టమ్లోకి తెస్తారు. వీరికి ఆధునిక సిలబస్తో కూడిన విద్యను బోధిస్తారు. రాష్ట్ర పోలీసు అధికారులే నిర్వహణ బాధ్యత తీసుకున్నా.. బోధన, ప్రణాళిక మొత్తం ఐఐటీలు రూపొందిస్తాయి. ఐదేళ్లపాటు సాగే ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు కొత్త సైబర్ నేరాలపై విశ్లేషణ ఉంటుంది. సైబర్ నేరగాడు వాడే ఐపీ అడ్రస్తో పాటు, దానికి అనుసంధానమైన టవర్, సిమ్ కదలికలపైనా సరికొత్త టెక్నాలజీతో దాడిచేసే విధంగా శిక్షణ ఉంటుంది. కొన్ని క్లాసులు ఆన్లైన్లో ఉంటే, మరికొన్ని ప్రయోగాత్మకంగా ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. ఐదేళ్లలో 5 వేల మంది నిష్ణాతులైన డిజిటల్ దర్యాప్తు అధికారులను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార కమిషన్లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్రెడ్డితో పాటు మరో ఏడుగురు సమాచార కమిషనర్ల నియామక ప్రతిపాదనలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్కు పంపించింది. కొందరు అభ్యర్థుల అర్హతల విషయంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత ఫైల్ను గవర్నర్ పెండింగ్లో ఉంచినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయంలో రాజ్భవన్ ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్నట్టు తెలిసింది. కొన్ని పేర్లపై అభ్యంతరం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల పోస్టుల భర్తీ కోసం 2023 జూలై 4న ఒకసారి, 2024 జూన్ 12న మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. సీఎం ఎ.రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన కమిటీ ఇటీవల సమావేశమై పలువురిని ఎంపిక చేసి రాజ్భవన్కు సిఫారసు చేసింది. ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్రెడ్డి, సమాచార కమిషనర్లుగా జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, న్యాయవాది పీఎల్ఎన్ ప్రసాద్తో పాటు రాములు, వైష్ణవి, మొహిసిన పర్వీన్ పేర్లను ప్రతిపాదించింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(5) ప్రకారం న్యాయశాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ, మెనేజ్మెంట్, జర్నలిజం, పరిపాలన రంగాల్లో విశేష కృషిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. సెక్షన్ 12(6) ప్రకారం వారు ఎమ్మెల్యే, ఎంపీ కారాదు. ఎలాంటి లాభదాయక పోస్టులో ఉండరాదు. రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం కలిగి ఉండరాదు. వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉండరాదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో కొందరికి రాజకీయ నేపథ్యం ఉండడంతో పలువురు వ్యక్తులు రాజ్భవన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫైల్కు ఆమోదం తెలపకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారు. అర్హతల విషయంలో స్పష్టత వచి్చన తర్వాతే గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. అవసరమైతే గవర్నర్ కొందరు అభ్యర్థుల పేర్లను మినహాయించి ఇతరుల పేర్లను ఆమోదించే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/చందానగర్: తెలంగాణ హైకోర్టు న్యా యమూర్తి మాటూరి గిరిజాప్రియదర్శిని (61) కన్నుమూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో ఆదివారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె హఠాన్మరణం పట్ల న్యాయవాద వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యా యవాదులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన నాగరత్నం – మారుతి అప్పారావు గిరిజాప్రియదర్శిని తల్లిదండ్రులు.మారుతి అప్పారావు తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు. నాగరత్నం గృహిణి. గిరిజాప్రియదర్శిని ఇంటర్ పూర్తి కాగానే కె.విజయ్కుమార్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్. వివాహం తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశారు. విశాఖపట్నం ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ, ఆంధ్ర వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో అత్యధిక మార్కులతో తొలి స్థానం సాధించారు. 1995లో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పి.ఉమాబాల వద్ద జూనియర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, లేబర్, కుటుంబ సంబంధిత కేసుల్లో వాదనలు వినిపించారు. పేదలకు ఉచిత న్యాయం కోసం విశేష కృషిఎంజీ ప్రియదర్శిని 2008లో జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఒంగోలు, ఆదిలాబాద్, కరీంనగర్, ప్రకాశంలో విధులు నిర్వర్తించారు. జిల్లాల్లో పనిచేసినప్పుడు పేదలకు ఉచిత న్యాయ సాయం అందించే జిల్లా న్యాయసేవాధికార సంస్థను తొలి స్థానంలో నిలపడంలో విశేష కృషి చేశారు. ఉచిత న్యాయం ప్రజల హక్కు అని ప్రచారం కల్పించారు. ఆమె సేవలను జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ప్రశంసించింది. 2022లో తెలంగాణ న్యాయమూర్తిగా పదో న్నతి పొందారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏడాది కాలంగా ఆన్లైన్ ద్వారా కేసుల విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయమూర్తిగా వేల తీర్పులు ఇచ్చారు.ఏసీజే నివాళులుజస్టిస్ గిరిజా ప్రియదర్శి మృతికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ సంతాపం ప్రకటించారు. ఆమె భౌతికకాయానికి నివాళులు అరి్పంచారు. ఎమ్మెల్సీ రాంచందర్రావు, తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి కె.మురళీమోహన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. న్యాయమూర్తిగా ఆమె చేసిన కృషిని కొనియాడారు. -
నిప్పుకు తెలుసు.. నీళ్లు రావని..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విశ్వనగరంలా మారుతోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశాన్నంటుతున్నాయా..అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హర్మ్యాలు.. అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణంతోనైనా, ఊహించని విధంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉంటోందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40–50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిల్లో ఉండే వారిని రక్షించగలిగే అధునాతన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడున్న అరకొర రక్షణ వ్యవస్థలు, ఆయా భవనాల్లోని సొంత భద్రతా ఏర్పాట్లు, వాటి పర్యవేక్షణ పరిగణనలోకి తీసుకుంటే హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలన్నీ ఒకింత డేంజర్లో ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంలా మారుతున్నా.. రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆపై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టమేనని, ఆయా భవనాల్లో ఉన్న సొంత రక్షణ వ్యవస్థపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎంత?, భవనాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి? పర్యవేక్షణ మాటేమిటి? యాజమానుల బాధ్యతలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. జీ ప్లస్ 5 దాటితే అనుమతి తప్పనిసరి హైదరాబాద్లో జీ ప్లస్ 5 అంతస్తులకు (నివాస సముదాయాలు) పైబడిన భవనాలన్నిటికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అదే వాణిజ్య, ఇతర భవనాలు జీ ప్లస్ 4 మించితే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నగరంలోని అన్ని హైరైజ్ భవనాలకూ అగ్నిమాపక శాఖే అనుమతులు ఇస్తోంది. భవనం డిజైన్, నిర్మాణం, తర్వాత ఆక్యుపెన్సీ తదితర అన్ని సందర్భాల్లో అన్నీ పరిశీలించాకే ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మంజూరు చేస్తున్నారు. ఒకసారి ఎన్ఓసీ వచి్చన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అయితే అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఈ పరిస్థితికి కారణమనే వాదన ఉంది. పత్రి నెలా 11వ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్ఓ), 23న డీఎఫ్ఓలు భవనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. సిబ్బంది కొరత నేపథ్యంలో భవనాల సంఖ్య మేరకు తనిఖీలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. మన అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎలా ఉంది? తెలంగాణ మొత్తం కలిపి 147 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి..జీహెచ్ఎంసీ పరిధిలో 34 ఫైర్ స్టేషన్లు, 3 అవుట్ పోస్ట్లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్లో 55 మీటర్ల ఎత్తు వరకు అంటే 18 అంతస్తుల వరకు వెళ్లగలిగే బ్రాంటో స్కై లిఫ్ట్లు రెండు ఉన్నాయి. వీటికి అదనంగా 133 వాటర్ టెండర్లు (ఫైర్ ఇంజిన్లు), 5 నీటి సరఫరా లారీలు, 56 మల్టీపర్పస్ టెండర్లు, 10 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు, 17 వాటర్ బౌజర్లు సహా కీలక పరికరాలు ఉన్నాయి. ఇక 18 అంతస్తులకు మించిన భవనాల్లో అంతర్గతంగా ఉండే ఫైర్ పంపులు, నీళ్ల ట్యాంకులు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది. బిల్డర్లు, నిర్వాహకుల బాధ్యతలేమిటి? – భవనం భద్రతను బిల్డింగ్ నిర్వాహకులు, యజమానులు విధిగా పర్యవేక్షించాలి. – సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ప్రైవేటు ఫైర్ ఆఫీసర్లు, ఫైర్ గార్డులను నియమించుకోవాలి. – బిల్డర్లు ప్రతి ఆకాశ హర్మ్యంలో విధిగా ఓ రెస్క్యూ ప్లేస్ పెట్టాలి. ఆ భవనంలో అంతస్తులను బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – ప్రత్యేకంగా ఫైర్ లిఫ్ట్ ఉండాలి. అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారు. దీనికి పవర్ సప్లై ప్రత్యేకంగా ఉండాలి. – నిర్వాహకులకు ఎమర్జెన్సీ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే ఎవరు ఎలా స్పందించాలనే ప్రణాళిక ఉండాలి. – భవనాల్లో నివాసం ఉండేవారికి, పనిచేసే సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై తరచూ శిక్షణ ఇవ్వాలి. – ఫైర్ అలారమ్లు, స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు సరిగా పనిచేస్తున్నాయా..లేదా చూసుకోవాలి. – అయితే చాలా భవనాల్లో.. నిర్మాణం, ఆక్యుపెన్సీ సమయంలో ఉండే ఫైర్ ఫైటింగ్ పరికరాలు...కొన్నాళ్ల తర్వాత పనిచేసే స్థితిలో ఉండడం లేదన్న విమర్శలు ఉండటం గమనార్హం. ఢిల్లీ, మహారాష్ట్రల్లో మెరుగ్గా.. ఫైర్ సేఫ్టీ అంశంలో మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన చట్టాల అమలు పక్కాగా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాల నియంత్రణ మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 110 మీటర్ల స్కైలిఫ్ట్లు నాలుగు అందుబాటులో ఉన్నాయి. పైర్ ఫైటింగ్ పరికరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో పటిష్ట వ్యవస్థలు సింగపూర్, దుబాయ్, అమెరికా, ఆ్రస్టేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్ దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత పక్కాగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఈ దేశాల్లో ఫైర్ స్టేషన్లు అన్ని ప్రాంతాలకు సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఫైర్ ఫైటింగ్లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందుంటున్నారు. పౌరులందరికీ అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కలి్పస్తారు. ఏదైనా భవనం వినియోగంలోకి వచి్చన తర్వాత కూడా అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తరచూ తనిఖీలు, ఫైర్ మాక్ డ్రిల్స్ పక్కాగా కొనసాగుతుంటాయి. ఫైర్ ఫైటింగ్ ఆఫీసర్లను నియమించుకోవాలి కార్యాలయాలు, ఆసుపత్రులు ఇలా ప్రతి బహుళ అంతస్తుల భవనాల్లోనూ అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే స్పందించేలా, ఫైర్ ఫైటింగ్కు సంబంధించిన పరికరాల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లను పెట్టుకోవాలి. వీరందరికీ అగ్నిమాపక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ వ్యవస్థ ప్రమాదం జరిగిన మొదటి రెండు గంటలపాటు ఫైర్ ఫైటింగ్కు ఉపయోగపడుతుంది. ప్రాణ నష్టం నివారించలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు పూర్తిస్థాయిలో ఆర్పే పనితో, ప్రజా రక్షణ చర్యలు చేపడతారు. రాష్ట్రంలో ఉన్న అగ్నిమాపక వాహనాలు, పరికరాలు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వై.నాగిరెడ్డి, డీజీ, అగ్నిమాపక శాఖ తరచూ తనిఖీలు ఎంతో అవసరం బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్ చేయడంలో ఫైర్ సేఫ్టీ అంశం కూడా అత్యంత కీలకమైనది. డిజైన్లో ఉన్నట్టుగా నిర్మాణం జరిగిందా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? అన్నది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో అధికారులు తనిఖీ చేయాలి. ఆ తర్వాత కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలి. నివాస సముదాయాల్లో కంటే హైరైజ్ కమర్షియల్ బిల్డింగ్స్లో అగ్ని ప్రమాదాల రిస్క్ ఎంతో ఎక్కువ. ప్రమాదం జరిగితే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్య భవనాల విషయంలో అదనపు జాగ్రత్తలు మరింత అవసరం. – భిక్షపతి, మాజీ డైరెక్టర్ జనరల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటినెన్స్ పట్టించుకోక పోతే కష్టమే.. మన దగ్గర వేగంగా అభివృద్ధి జరగడం, ఆ మేరకు బహుళ అంతస్తులు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. బిల్డింగ్ డిజైన్లలో, నిర్మాణంలో.. ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్సేఫ్టీని పట్టించుకోవడం లేదు. ఫైర్ ఫైటింగ్ పరికరాల మెయింటినెన్స్పై అటు ప్రభుత్వ విభాగాలు కానీ, ఇటు భవన యజమానులు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన హైరైజ్ భవనాలు డేంజర్లో ఉన్నట్టే. ఫైర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి డెవలపర్స్ నుంచి ఫీజులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునీకరించాలి. ప్రతి ఆరు నెలలకు ఫైర్ ఫైటింగ్ పరకరాలు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, భవనాల యజమానులకు బాధ్యత అప్పగించి ప్రభుత్వ విభాగాలు తప్పుకోవడం సరికాదు. – సీఏ ప్రసాద్, ప్రెసిడెంట్, ప్రీ ఇంజినీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైరైజ్ బిల్డింగుల్లో ఉండాల్సినవేమిటి? ⇒ నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం.. ఎత్తైన భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ (తక్షణ రక్షణ వ్యవస్థ), తగిన నీటి సరఫరా సౌకర్యం, ఫైర్ పంపులు, ఫైర్ ఎస్కేప్ మార్గాలు, ఫైర్మెన్ లిఫ్ట్, సర్వీస్ షాఫ్ట్ ఎన్క్లోజర్లు, ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తప్పక ఉండాలి. నివాస సముదాయాలైనా, ఇతర భవనాలైనా ఇవన్నీ తప్పనిసరి. ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నది అత్యంత కీలకం. వ్యవస్థ ఇలా పనిచేయాలి ⇒ భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పంపులు, నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఎలక్ట్రిక్ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి. ⇒ ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇదీ పని చేయకపోతే డీజిల్ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం రెండు గంటల పాటు మంటలను నిలువరించి, నివాసితులు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా ఉండాలి. -
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం
సనత్నగర్ (హైదరాబాద్): సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొన్నిసార్లు ఆదివారం కూడా కొందరు సిబ్బంది కార్యాలయానికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరు ఉద్యోగులు నాలుగో అంతస్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అగ్ని ప్రమాదం జరగక మునుపే బయటకు వెళ్లిపోగా, మరొకరు అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు వచ్చేసినట్లు సమాచారం.ఎగసిన మంటలతో భయాందోళనప్యాట్నీ సెంటర్ ప్రధాన రహదారిలో నగరానికి సంబంధించి ఎస్బీఐ అడ్మి నిస్ట్రేషన్ కార్యకలాపాలు ఇక్కడి నాలుగు అంతస్తుల భవనంలో కొనసాగు తాయి. నాలుగో అంతస్తులో లోన్ల విభాగం ఉంది. ఆ విభాగంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులతో అటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అగ్నికీలలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో.. మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక శకటాలను రప్పించారు. కాగా, ప్రమాదం జరిగింది నాలుగో అంతస్తులో కావడంతో.. భారీ క్రేన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో కీలక ఫైళ్లు, పెద్ద ఎత్తున ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఈ కార్యాలయంలో.. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ప్రాణనష్టమే తప్పింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమై ఉండవచ్చని సికింద్రాబాద్ ఫైర్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. -
అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం
హైదరాబాద్: వారాసిగూడ చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళను కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు సొమ్మును అపహరించుకుని వెళ్లిన ఘటనలో మేనకోడలే నిందితురాలిగా తేలింది. మేనత్త సొమ్మును కాజేయాలని మేనకోడలు జ్యోతి పథకం రచించి ఆ ఇంటికి యువకుడ్ని పంపించి చోరీకి పాల్పడేలా పురిగొల్పింది. ఈ కేసులో జ్యోతిపాటు మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానురాలిని కట్టేసి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్టలోని ఓ ఇంట్లోని మొదటి అంత స్తులో పారిజాతం (56) అనే మహిళ నివాసముం టోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.తలుపులు గ యపెట్టి ఆమెను కత్తితో బెదిరించి కుర్చీలో కట్టేశాడా ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు నగలు, 6 మే నగదు, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యారు. కొ సేపటికి కట్లు విప్పుకుని బయటికి వచ్చి పారిజాతం చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది స్థానికులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆమె వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టగా మేనకోడలే నిందితురాలు అయ్యింది. -
‘కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారం పోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు కవిత మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా?, మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా?, అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా?’ అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.రాహుల్ గాంధీ నాయకత్వంలో, సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని, నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజా పాలన అని స్పష్టం చేశారు.‘ఎవరికైనా నష్టం జరిగిదే... స్వేచ్ఛ గా ఇందిరాపార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛ ను ఇచ్చింది. ఇందిరాపార్కు మాత్రమే కాదు... ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెల్లినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే.. కులగణన చేసి సామాజిక తెలంగాణ సాదిస్తున్నాం. కొత్త సెలబస్ తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది.బిఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇంకో పదేళ్లు ఉంటుంది. బిఆర్ఎస్ అధికారంలోకి తెచ్చుకుని బందీలుగా ఉండాలని ఎవరూ అనుకోరు.కేసీఆర్ పదేళ్ల లో సామాజిక తెలంగాణ కోసం పనిచేయలేదని కవిత చెప్పకనే చెప్పింది.కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’ అని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. -
16న అమెరికాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరుకానున్నారు. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరి.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ.. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: రేపు(సోమవారం) తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్లో జాతీయ రహదారులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్లో సిర్పూర్ కాగజ్ నగర్కు చేరుకోనున్నారు.ఉదయం 10.15కి కాగజ్ నగర్ చేరుకోనున్న గడ్కరీ.. 10.30 నుంచి 11.30 వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.45 కు కాగజ్ నగర్ నుంచి కన్హా శాంతివనం పయనం కానున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు కన్హా శాంతి వనం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ విజిట్ అండ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట్ గ్రౌండ్లో సభలో పాల్గొన్ని.. పలు ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు. -
తెలంగాణ అమరుల స్మారకం ఆవిష్కరణకు రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: అది ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక జ్యోతి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని ఆవిష్కరించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు సందర్శకులకు అనుమతి లేకుండాపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా దీనిని ప్రారంభించింది. అమరుల మ్యూజియంతో పాటు మరికొన్ని పనులు వాయిదా పడ్డాయి. అలా పెండింగ్ జాబితాలో పడిపోయిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఫలితంగా సందర్శకులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. కానీ.. తెలంగాణ అమరుల స్మారకానికి మాత్రం ఇంకా తుది మెరుగులే దిద్దలేదు. సందర్శకులను అనుమతించడం లేదు. ఆ దిశగా అడుగు పడలేదు.. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు నెక్లెస్ రోడ్డుకు వస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వేలాది మంది ట్యాంక్బండ్, లుంబిని పార్కు, ఎనీ్టఆర్ పార్కు, అంబేద్కర్ విగ్రహం వంటి ప్రాంతాలను సందర్శిస్తాను. వీటితో పాటు అమరుల స్మారకాన్ని బయటి నుంచి వీక్షించాల్సిందే. కానీ.. ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అమరులైన వందలాది మంది జీవితాలను సమున్నతంగా ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకు ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు.అలంకారప్రాయంగా జ్యోతి.. హుస్సేన్సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో దీని నిర్మాణం చేపట్టారు. దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియానికి వినియోగించిన స్టీల్కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం దీన్ని నిర్మించింది. సందర్శకులు భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టరెంట్ను ఏర్పాటు చేయాలని భావించారు. ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకునేలా గ్రౌండ్ఫ్లోర్లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. మ్యూజియంలో అక్కడక్కడా కియోస్్కలు, టచ్్రస్కీన్లను ఏర్పాటు చేసి వాటిద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను, విశేషాలను భవిష్యత్తరాలకు తెలియజేయాలని ప్రతిపాదించారు. పై అంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్ ఇది. ఆర్ట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కాగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారక జ్యోతి అలంకారప్రాయంగానే ఉండిపోయింది.అంబేడ్కర్ మ్యూజియం తరహాలో ఏర్పాటు చేస్తే మేలు.. ప్రస్తుతం అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పార్లమెంట్ ఆకృతిలో ఉన్న వేదిక భవనంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో తెలంగాణ అమరుల స్మారకం వద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తే తక్కువ వ్యవధిలోనే సందర్శకులను అనుమతించేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించకుండా తెలంగాణ అమరుల స్మారకజ్యోతి, మ్యూజియం నిర్వహణకు స్వతంత్రంగా పని చేసే ఒక సొసైటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ప్రతిపాదిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందజేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
ప్రొటో'కాల్' ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ఆయన హోదా పెద్దది... ఆయన కూర్చునే సభ కూడా పెద్దదే... గవర్నర్, ముఖ్యమంత్రి తర్వాత రాజకీయ ప్రొటోకాల్ ఆయనదే. అటు హోదా, ఇటు ప్రొటోకాల్ ఒకదాని మించి మరోటి పెద్దవైనా నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ముఖ్య నాయకుడికి మాత్రం ప్రతీసారి ప్రొటోకాల్ సమస్య ఎదురవుతోంది. జిల్లా రాజకీయాల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయి పదవిని నిర్వహిస్తున్న ఆ ముఖ్యనేతకు జిల్లాలో జరిగే ప్రజా కార్యక్రమాల్లో లభించాల్సిన మర్యాద మాత్రం ఆమడదూరంలోనే నిలిచిపోతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన ప్రొటోకాల్ సమస్యకు స్థానిక రాజకీయాలే కారణమని, అప్పుడయినా, ఇప్పుడయినా జిల్లా మంత్రుల వైఖరితోనే ఆ ‘పెద్దాయన’మనస్తాపం చెందుతున్నారని అటు జిల్లా, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపాధి ‘హామీ’కి కూడా లేని ‘గ్యారంటీ’ ప్రొటోకాల్ మర్యాద దూరమైన ఈ నల్లగొండ ముఖ్య నేతకు ఉపాధి హామీ పనుల విషయంలోనూ రాజకీయ చుక్కెదురైంది. గతంలో రూ.4 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను తన ఎమ్మెల్సీ కోటాలో ఆయన ప్రతిపాదించారు. జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. సంబంధిత మంత్రి సీతక్క కూడా మంజూరు చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్కు మంజూరు పత్రాలు వెళ్లాయి. కలెక్టర్ వెంటనే ఈ ప్రతిపాదనల మేరకు పనుల ఆర్డర్కు సంబంధించిన కాపీని కూడా అందజేశారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతలోనే ఏమైందో కానీ వర్క్ ఆర్డర్లు రద్దయ్యాయి. కలెక్టర్ నుంచి ఉత్తర్వులు మారిపోయి పెద్దాయన ప్రతిపాదించిన పనుల స్థానే వేరే పనులు ప్రతిపాదించారు. దీనిపై ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మనస్తాపం చెందిన ఆయన అసెంబ్లీ కార్యదర్శి ద్వారా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వగా.. రాజకీయ జోక్యం కారణంగానే పనులను మార్చాల్సి వచ్చిందని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇది పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఈ ఉపాధి పనుల కథ మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు ప్రొటోకాల్ సమస్య వచ్చిపడింది. గత నెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో లిఫ్టు ఇరిగేషన్ పథకాల ప్రారంభం, కలెక్టరేట్లో నూతన భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగాయి. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమానికి పెద్దాయనకు పిలుపు రాలేదు. సీఎం గారూ... చూడండి జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు అటు మంత్రి, ఇటు కలెక్టర్ పిలవడం లేదని పెద్దాయన సన్నిహితుల వద్ద వాపోయారు. నల్లగొండలో మీడియాతో చిట్చాట్ పెట్టి మరీ తన ఆవేదనను వెలిబుచ్చారు. తనకు ప్రతిసారీ ప్రొటోకాల్ సమస్య వస్తోందని, ప్రభుత్వం మారినా ఈ సమస్య మారలేదన్నారు. తన విషయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన గురించి ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సందర్భంలో పెద్దాయన వివరించారని, అలా జరగకుండా చూడాలని కోరినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన సీఎం దీనిపై కచ్చితంగా మాట్లాడతానని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. -
ఇదీ తెలంగాణ బ్రాండ్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది. నాలుగు అంశాలు.. నలుదిక్కులా ప్రచారం ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ, ఈ హడావుడి కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా.. పోటీ దారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. నాగార్జునసాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్నగర్ పిల్లలమర్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం.. తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రిక వారసత్వం, ఆధునిక వైద్యం..అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సురక్షిత ప్రాంతంప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరి పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటనా జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్త పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏరాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1,200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. మౌలిక వసతులుపోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన, మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్ సిటీలోని స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు, మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్లో మౌలిక వసతులపై ప్రపంచ వ్యాప్తంగా కొంత అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాలతో ఉన్న కనెక్టివిటీని వివరించడంతో పాటు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సచివాలయ భవనం లాంటి వాటిని వారికి చూపించనున్నారు. మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఆధునిక వైద్యవసతి హైదరాబాద్లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు, విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య పద్ధతులు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏయే దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నదీ, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ రుచులు మెడికల్ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్ఫుడ్ టూరిజం కూడా విస్తృతమవుతోంది. స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సంప్రదాయ భోజనం ఆస్వాదించటాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్ చేసే దిశలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందు (డిన్నర్) ఏర్పాటు చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ ఫైవ్స్టార్ హోటల్కు అప్పగించారు. ఇక తాజ్ ఫలక్నుమా, చార్మినార్ ప్రాంతాలను చూపటం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. పోటీలకు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష మిస్ వరల్డ్ పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీనియర్ పోలీస్, ఇతర అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాటిపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చెప్పారు. అతిథుల బస విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత, బందోబస్తుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద, అంతర్జాతీయ కార్యక్రమాల వేదికల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ తరఫున పోటీదారులకు అందజేయడానికి వివరణాత్మక బుక్లెట్ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాలను సుందరీకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎంఓ) జయేశ్ రంజన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఐఅండ్పీఆర్ ఇన్చార్జి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పిల్లలతోపాటు తల్లిదండ్రులూ కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మైనర్ డ్రైవింగ్ నిరోధంపై దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ఉల్లంఘనకు పాల్పడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు (వాహన యజమానులైతే)/వాహన యజమానిపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లను జువెనైల్ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సాధారణ కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) వీరికి పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ‘సాక్షి’కి తెలిపారు. మైనర్ డ్రైవింగ్పై ట్రాఫిక్ విభాగం అధికారులు గత నెల 5 నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. శనివారం వరకు నిర్వహించిన తనిఖీల్లో 2,067 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కారని, వీరిపై కేసులు నమోదు చేశామని జోయల్ డెవిస్ పేర్కొన్నారు. వాహనాలను స్వా«దీనం చేసుకుంటున్న పోలీసులు మైనర్తో పాటు తల్లిదండ్రులు/వాహన యజమానిని టీటీఐకి రప్పిస్తున్నారు. అక్కడ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అభియోగపత్రాలు సిద్ధం చేసి మైనర్ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయమూర్తులు మైనర్లకు సామాజిక సేవ వంటి శిక్షలు విధిస్తుండగా... తల్లిదండ్రులు/వాహన యజమానులకు భారీ జరిమానాలు వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వీరికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనంతో పాటు ఆ మైనర్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఏ అధికారులు పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ విభాగం వాహనం రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేస్తోంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెరి్నంగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్కు మాత్రం 25 ఏళ్లు నిండేవరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు. -
కరువు ఎరుగని 'కృషీవలురు'!
కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్డ్యాంను నిర్మించారు. ఈ చెక్డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. సొంత భూమిలో చెరువు తవ్వించి.. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ విలీన గ్రామం శ్రీనివాస్నగర్కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. వట్టిపోని వట్టివాగు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. 9 చెక్డ్యాంలతో నీటి సమస్య దూరం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది. వాననీటిని ఒడిసి పట్టి.. మెదక్ జిల్లా రత్నాపూర్ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్ లైనింగ్ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు. జహీరాబాద్ ప్రాంతంలో జలకళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్షెడ్ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్ హన్మంత్రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్షెడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి. -
సైబర్కాండ్రియా.. నెట్ వైద్యం
అన్నింటినీ గూగుల్లో వెతకడం అలవాటైపోయిన చాలామంది.. అనారోగ్య సమస్యలకు వైద్యం, మందులను కూడా నెట్లోనే వెతికేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. దాని గురించి లోతుగా చదివి, తమకు ఏదో పెద్ద జబ్బే వచ్చిందని తెగ ఆందోళన పడిపోతున్నారు. వెతికింది జబ్బో కాదో తెలీదు గానీ.. ఇలా అనవసరంగా వెతకడం మాత్రం పెద్ద జబ్బే. దీనిపేరు సైబర్కాండ్రియా లేదా కంప్యూకాండ్రియా. ఇదో విచిత్రమైన వ్యాధి. పిల్లలు, యువతలో ఇప్పుడిది ఎక్కువైపోయింది. -సాక్షి, స్పెషల్ డెస్క్పత్రికలూ లేదా మేగజైన్లలోనూ ఆరోగ్య సమాచారాన్ని చదువుతూ ఆందోళన చెందడాన్ని ‘హైపోకాండ్రియా’గా చెబితే.. ఇప్పుడు ఇలా ఇంటర్నెట్లో చదువుతూ ఆందోళన చెందడాన్ని ‘సైబర్’ కాండ్రియాగా పేర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు.. తమ ఆరోగ్య సమస్యల గురించి సమాచారాన్ని ఆన్లైన్లో వెతికి.. బాగా లోతుగా చదివి, తమకు ఏదో పెద్ద జబ్బే వచ్చిందని భ్రమ పడుతుంటారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి మామూలుగా తలనొప్పి వచ్చిందనుకోండి. ఆన్లైన్లో వెతికేటప్పుడు దొరికిన సమాచారంలో దాన్ని ‘బ్రెయిన్ ట్యూమర్’ తాలూకు ఓ మ్యానిఫెస్టేషన్గా చదివాక.. తనకూ బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ క్యాన్సర్ ఉందేమోనని అనవసరంగా అపోహపడటం, ఆ భయాలతో ఆందోళనపడటం చేస్తుంటారు. ఇలా తమకున్న గోరంత సమస్యను కొండంత చేసుకుంటారు. వైద్యపరిశోధకులైన డాక్టర్ రయెన్ వైట్, డాక్టర్ ఎరిక్ హార్విట్జ్ 2009లో నిర్వహించిన ఓ అధ్యయనంలో.. ఇలా వెతికేవారు కేవలం మామూలు లక్షణాలకే పరిమితం కాకుండా.. అరుదైన, తీవ్రమైన వ్యాధుల తాలూకు పేజీలనూ ఎక్కువగా క్లిక్ చేసినట్టు తేలింది. వీరిలో స్వల్ప లక్షణాలున్నా పెద్ద వ్యాధి ఉందేమో అని ఆందోళన చెందడం సర్వసాధారణమైందని ఆ అధ్యయనవేత్తలు వెల్లడించారు. సెర్చ్ ఇంజిన్ ల లాగ్స్ను ఉపయోగించి, 515 మందిపై వీరు ఈ సర్వే నిర్వహించారు. పెద్దలూ అతీతులు కారు... సైబర్ కాండ్రియాకు పెద్దలూ అతీతులు కాదు. ఉదాహరణకు ఓ కొత్త బ్రాండ్ వాషింగ్ పౌడర్ వాడాక ఒంటి మీద అలర్జీ వచ్చినప్పుడు ఇంటర్నెట్లో వెదుకుతారు. ఆ లక్షణాలను బట్టి అది లూపస్ లేదా లైమ్ వ్యాధి అని చెబితే దాని గురించి మరింత భయపడతారు. అవసరం లేని పరీక్షలు చేయించడంతో పాటు అవసరం లేని మందులూ వాడతారు. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి మీదా దుష్ప్రభావం చూపవచ్చు. ఆరోగ్య భయం ఎక్కువగా ఉన్నవారు ఇంటర్నెట్లో ఆరోగ్య సమాచారం కోసం మరింత ఎక్కువ వెతుకుతారు. ఆ తర్వాత అది వారిలో మరింత ఆందోళనకు దారితీస్తుంది. ఇలా ఇదొక విష వలయంలా కొనసాగుతూ ఉంటుంది. కొంత మంచి సమాచారమూ..ఇంటర్నెట్లో దొరికే ప్రతి విషయమూ చెడ్డది కాదు. మయో క్లినిక్, కిడ్స్ హెల్త్, నేషనల్ ఇన్స్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) వంటి వెబ్సైట్లు అందరికీ అర్థమయ్యే రీతిలో నమ్మదగిన ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి. అవి మంచి వెబ్సైట్లే అయినా అందులోని విషయాన్ని చదివి తప్పుగా అర్థం చేసుకుంటే అదీ ప్రమాదమే. అందుకే ప్రతి అనారోగ్య సమస్య గురించీ ఆన్ లైన్లో ఎక్కువసేపు వెతకడం తగ్గించాలి. అది త్వరగా తగ్గకపోతే ముందుగా తమ పెద్దవారికి చెప్పడం లేదా మంచి డాక్టర్ని సంప్రదించాలి.సైబర్కాండ్రియా.. ఇప్పుడు కొత్త జనరేషన్లో కనిపిస్తున్న సమస్య. చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో మనకు ఎంతైనా సమాచారం అందుబాటులో ఉండవచ్చు. కానీ దాన్ని విజ్ఞతతో ఉపయోగించుకోవడం తెలియనప్పుడు ఎదురయ్యే సమస్య ఇది. ఆ విజ్ఞత నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తెరగాలి. వైద్యులపైనా నమ్మకం పోవచ్చు! సైబర్ కాండ్రియా వల్ల జరిగే మరో ప్రధాన నష్టం ఏంటంటే.. ఇలా ఇంటర్నెట్లో వెదకడమన్నది వైద్యులపై ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు. ఆన్ లైన్ లో చదివిన దానికి డాక్టర్ చెప్పిన అంశాలు భిన్నంగా ఉంటే, వైద్యుని మాటనూ నమ్మకపోవచ్చు, డాక్టర్ను అనుమానించవచ్చు. కొంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ‘‘నేనే నిర్ధారణ (సెల్ఫ్ డయాగ్నోస్) చేసుకున్నా’’ అనేలా ప్రవర్తిస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరం. దీనివల్ల ఏమాత్రం ముప్పు కలిగించని ఓ చిన్న సమస్యను పెద్దదిగా భావించడం, పెద్ద సమస్యను చిన్నదిగా భావించడం జరగవచ్చు. నిజానికి ఓ వ్యక్తి తాలూకు పూర్తి వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఇంటర్నెట్కు తెలియదు. అలా అది చిన్న జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్నింటికీ.. అందరికీ ఒకే రకమైన పరిష్కారాలు చూపిస్తుంది. పిల్లలు, యువతలోనే ఎక్కువ సైబర్కాండ్రియా సమస్యకు లోనవుతున్న వారిలో ముఖ్యంగా టీనేజ్ పిల్లలతో పాటు కౌమార యువత (అడాలసెంట్ యూత్) ఎక్కువగా ఉంటున్నారు. తమ సమస్యను బయటకు చెప్పుకోలేనప్పుడు వారు ఇంటర్నెట్నే ఆశ్రయిస్తున్నారు. పైగా తమకు ఉండే ఉత్సుకతకు తోడుగా ఆ వయసు పిల్లల్లో సహజంగా టెక్నాలజీ వాడకంలో ఉన్న నైపుణ్యాలు వారిని ఇంటర్నెట్ వైపునకు మళ్లేలా చేస్తున్నాయి. అయితే అక్కడ లభ్యమయ్యే సమాచారాన్ని ఏమేరకు తీసుకోవాలన్న విజ్ఞతగానీ, విజ్ఞానంగానీ ఆ వయసులో ఉండకపోవడమే వారిని అపార్థాలూ, అపోహల వైపునకు నెడుతోంది. ఉదాహరణకు, స్కూల్ ముగిసేసరికి తాను అలసిపోతుండటాన్ని ప్రస్తావిస్తూ ఓ బాలిక.. అదే విషయాన్ని గూగుల్ను అడిగింది. నిజానికి అది మామూలు అలసట మాత్రమే. కానీ గూగుల్ తన సమాచారంలో ‘‘ల్యూకేమియా లేదా గుండె సమస్యల వల్ల ఇలా జరగవచ్చు’’ అనే సమాధానం ఇచ్చింది. దాంతో ఆమె చాలా ఆందోళనకు లోనైంది. నిజానికి ఆమె అలసటకు మరెన్నో మామూలు కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు తగిన నిద్ర లేకపోవడం లేదా మొబైల్ ఎక్కువ సేపు చూడటం వంటివి. కానీ గూగుల్ సమాధానంతో ఆమెలో కొత్తగా గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి వంటి ఇతర లక్షణాలు కనిపించవచ్చు. వాటి గురించి మళ్లీ వెదికినప్పుడు దొరికే సమాధానాలు ఆ చిన్నారి లేత మెదడును మరింత గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉంది. మిడిమిడి జ్ఞానంతో వీడియోలుఇటీవలి కాలంలో ఆరోగ్య సమాచారాలకు మంచి వ్యూవర్షిప్ ఉండటంతో వీడియోలు, రీల్స్ తయారు చేసే కొందరు రేటింగ్ కోసం తమ మిడిమిడి జ్ఞానంతో ఆందోళన పెంచే అభూత కల్పనలనూ వైరల్ చేస్తుండటంతో ‘సైబర్కాండ్రియా’కు లోనయ్యేవారి సంఖ్య పెరుగుతోంది.సైబర్కాండ్రియా నివారణకు.. సెర్చ్ ఇంజిన్ కంటే వైద్యులను నమ్మడమే మేలు. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నిజానికి కొన్నిసార్లు ఆందోళన వల్లే శారీరక సమస్యలు కనిపిస్తాయి.ధ్యానం, శ్వాస వ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సైజెస్), నలుగురితో కలిసి వినోదాత్మకమైన కార్యకలాపాల్లో పాల్గొనడం, ఏదైనా పనితో తమను తాము బిజీగా ఉంచుకోవడం వంటివి సైబర్కాండ్రియా సమస్యను చాలావరకు నివారిస్తాయి. – డాక్టర్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ -
హక్కుల రక్షణ ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: మానవ హక్కులను కాపాడటంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) అట్టడుగు ర్యాంక్కు చేరింది. హక్కుల రక్షణ కోసం ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. కేసులు నమోదైనా పరిష్కరించేవారే లేరు. ఒకటి కాదు..రెండు కాదు.. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం చైర్మన్, సిబ్బంది లేకపోవడమే. వ్యక్తి ప్రాథమిక హక్కులతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛను హరించకుండా చూసేందుకు ఈ కమిషన్ ఏర్పాటైంది. జాతీయత, లింగం, జాతి, మతం సహా ఇతర ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు అందేలా చూడాలి. మానవ హక్కుల రక్షణపై ఇండియా జస్టిస్ రిపోర్టు (ఐజేఆర్) అధ్యయనంలో తెలంగాణ 17వ స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రభుత్వం చైర్మన్, ఇతర సిబ్బందిని నియమించింది. ఐజేఆర్ నివేదిక మేరకు ప్రత్యేక కథనం.. » పదికి 3.4 స్కోర్తో తెలంగాణ 17వ స్థానానికి పడిపోగా, పశ్చిమబెంగాల్ 6.99 స్కోర్తో ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది.ఆంధ్రప్రదేశ్ 2.08 స్కోర్తో దిగువన ఉంది. » దేశవ్యాప్తంగా సుమోటోగా కేసులు తీసుకుంటున్న శాతం : 4 » దేశవ్యాప్తంగా మహిళా చైర్పర్సన్లు: 0 » తెలంగాణలో దర్యాప్తు బృందంలో ఖాళీల శాతం: 50 » 2023–24లో ఎస్హెచ్ఆర్సీలు స్వీకరించిన కేసులు : 1,09,136 » కేసుల క్లియరెన్స్ రేట్: 83 శాతం » తెలంగాణలో ఈ రేట్: 0 » తెలంగాణలో విచారణాధికారుల్లో మహిళలు: 0 » జైళ్ల సందర్శన: 0 ఇతర చోట్ల ఎస్హెచ్ఆర్సీలు వెబ్సైట్లను కేసులు సహా అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండగా, తెలంగాణలో అధ్యయనం జరిగే నాటికి ఎలాంటి వివరాలు లేవు. ఏర్పాటు జరిగిందిలా.. 1990లో మానవ హక్కుల రక్షణ ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో చర్చ జరిగింది. హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి బలమైన, దేశీయ సంస్థలు అవసరమని గుర్తించింది. 1993లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల భేటీలో పారిస్ సూత్రాలను స్వీకరిస్తూ వ్యవస్థలు రావాలని తీర్మానించారు. స్వతంత్రంగా, విస్తృతంగా పనిచేసే సామర్థ్యం వాటికి ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదే ఏడాది మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఆ తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)లు ఏర్పడ్డాయి. ఆర్భాటం ఘనంగానే ఉన్నా..కమిషన్లకు విస్తృతమైన అధికారాలు కల్పించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై ఫిర్యాదులొస్తే.. విచారణ చేసి నేరుగా చర్యలు చేపట్టొచ్చు. ∙కోర్టు ముందు పెండింగ్లో ఉన్న విషయాల్లోనూ జోక్యం చేసుకోవొచ్చు. » ఖైదీల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రజలను నిర్బంధించిన ఏదైనా జైలును సందర్శించొచ్చు. » చట్టాలను సమీక్షించి.. మానవ హక్కులను సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలను సిఫార్సు చేయొచ్చు. » బాధితుల నుంచి నేరుగా పిటిషన్లు స్వీకరించి లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు. ఆర్భాటం ఘనంగానే ఉన్నా.. ఆర్థిక, మానవ వనరుల కొరతతో లక్ష్యాల సాధనలో ఇంకా బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లకేళ్లు చైర్పర్సన్లు, సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోనూ కొద్దిరోజుల క్రితం వరకు ఇదే పరిస్థితి. తీర్పు ఇచ్చేవారు, పరిపాలన మద్దతు, దర్యాప్తు చేపట్టేవారు.. ఇలా మూడు రకాల సిబ్బంది నియామకంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యయనం అభిప్రాయపడింది. -
కాంగ్రెస్ కుల సర్వేతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. ఈ కులాల సర్వేతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి.. బీసీలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతోపాటు పక్కాగా కులగణనను చేపట్టనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బీఆర్ఎస్ నేతల్లో ఒకరు రిటైర్మెంట్లో ఉన్నారు. ఒకరు లీవ్లో ఉన్నారు. ఒకరు నడుము విరగ్గొట్టుకొని రెస్ట్లో ఉన్నారు (కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్లను ఉద్దేశించి)’అని ఎద్దేవా చేశారు. 5న రూ.5 వేల కోట్ల పనులకు ప్రారంబోత్సవాలు ఈ నెల 5న ఆదిలాబాద్, హైదరాబాద్లో రూ.5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారం¿ోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణతో ముడిపడి ఉన్న 5 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. 2014 వరకు తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారులుంటే, ప్రస్తుతం 5,200 కి.మీలకు పెంచామని వెల్లడించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములను అప్పగిస్తే.. అంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని చెప్పారు. -
విదేశీ విద్యలో బీసీలకు కత్తెర
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం కోటా పెంపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేతులెత్తేసింది. ఈ పథకం కింద వెయ్యి మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామంటూ ఏడాదిన్నరగా చెప్పుకొచ్చిన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా పరిమిత కోటాతోనే పథకానికి ఎంపికైన అర్హుల జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో కేవలం 300 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో పథకం కింద లబ్ధి కలుగుతుందని ఎన్నో ఆశలతో విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను తాజా అర్హుల జాబితా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఏటా 300 మందిని బీసీ సంక్షేమ శాఖ ఎంపిక చేస్తుంది. ఎంపికైన ఒక్కో లబి్ధదారుకు రూ.20 లక్షల వరకు గరిష్టంగా ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర శాఖలతో పోలిస్తే కోటా తక్కువగా ఉండటంతో కనీసం వెయ్యి మందికి అవకాశం కల్పిoచాలని బీసీ సంఘాలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు వెల్లువెత్తడంతో బీసీ సంక్షేమ శాఖ ఈ పథకం కింద కోటాను పెంపు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. ఈ క్రమంలో 2023, ఆగస్టు నుంచి దరఖాస్తుల స్వీకరణ తప్ప ఎంపిక ప్రక్రియ పూర్తిచేయకుండా నిలిపివేసింది. ముగింపు దశలో కోర్సు.. విద్యానిధి పథకం కింద సంక్షేమ శాఖలు ప్రతి విద్యా సంవత్సరం రెండుసార్లు దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఫాల్ సీజన్లో భాగంగా ఆగస్టు–సెప్టెంబర్ లో, స్ప్రింగ్ సీజన్లో భాగంగా జనవరి–ఫిబ్రవరిలో దరఖాస్తులు స్వీకరించి వాటిని నెలరోజుల్లో పరిశీలన చేసి అర్హతలు నిర్ధారిస్తాయి. అర్హత సాధించిన విద్యార్థులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.50 వేలు కూడా ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. ఈ క్రమంలో 2023 ఫాల్ సీజన్లో, 2024 స్ప్రింగ్ సీజన్లో 6 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల అనంతరం మెరిట్ జాబితాలను ప్రకటించిన బీసీ సంక్షేమశాఖ.. తుది జాబితాను విడుదల చేయలేదు. పథకం కింద వెయ్యి మందికి అవకాశం కల్పిస్తామని అధికారులు పలు సందర్భాల్లో చెప్పకొచ్చారు. కోటా పెంపు ప్రతిపాదనలు సీఎం వద్దకు చేరాయని, ఆదేశాలు వచ్చిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కానీ తుది జాబితా విడుదల ఏడాదిన్నర ఆలస్యమైంది. ఇంతలో మెరిట్ జాబితాను పరిశీలించుకుని అంచనాకు వచ్చిన పలువురు విదేశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. వీరిలో 2023 ఫాల్ సీజన్లో దరఖాస్తు చేసుకున్న పలువురు విద్యార్థులు ఒకట్రెండు నెలల్లో కోర్సు కూడా పూర్తి చేసుకోనున్నారు. మరికొందరు కోర్సు చివరి దశకు చేరుకున్నారు. అయితే ఇంత కాలం తుది జాబితా విడుదలను నాని్చన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా గతంలో నిర్దేశించిన కోటా ఆధారంగా 300 మంది విద్యార్థులనే ఎంపిక చేస్తూ వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆశలపై నీళ్లు.. బీసీ ఓవర్సీస్విద్యానిధి పథకం కింద కోటా పెరుగుతుందనే ప్రచారంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ తర్వాత మెరిట్ జాబితాను విడుదల చేయగా.. చాలామంది మెరిట్లో ముందున్నామన్న భావనతో విదేశాల్లో పీజీ కోర్సులో చేరారు. కొంతమంది విద్యార్థుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉన్నా.. అర్హత సాధిస్తామన్న నమ్మకంతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిపోయారు. కోటా పెంపు చేయకపోవడంతో మెరిట్లో ఉన్న వారికి అవకాశం దక్కకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. విదేశాల్లో పీజీ కోర్సు కోసం ఒక్కో విద్యార్థికి సగటున రూ.30 లక్షలకు పైబడి ఖర్చు చేశామని, ప్రభుత్వ సహకారం అందుతుందని కోర్సులో చేర్చామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటా పెంపు చేసే పరిస్థితి లేదని తెలిస్తే విదేశాలకు పంపించేవారమే కాదంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
గ్రామీణ రోడ్లకు ‘హామ్’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతోపాటు వాటి ఆధునీకరణకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ రోడ్ల సౌకర్యం లేని గ్రామ పంచాయతీలకు రహదారి నిర్మాణం చేపట్టడంతోపాటు, జీపీల నుంచి మండల కేంద్రాలను కలుపుతూ జిల్లా కేంద్రాలకు అనుసంధానించే రహదారుల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. దీనిని అమలు చేయడం ద్వారా త్వరితగతిన గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద 17,300 కి.మీ. పొడవు గల పంచాయతీరాజ్ రోడ్లు 12 వేల కి.మీ. పొడవు గల ఆర్అండ్బీ రోడ్లను చేపట్టాలని నిర్ణయించారు. దీనిని చేపట్టేందుకు పీఆర్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా, కనీ్వనర్గా ఈఎన్సీ పంచాయతీరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కొంత వాటాను ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన వాటాను టెండర్ దక్కించుకునే కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్యారంటీ ఉండదు. పదిహేనేళ్లపాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళిక, సాంకేతిక, ఆరి్థక, న్యాయపరమైన అంశాల అధ్యయనానికి... ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లుగా ఆర్వీ అసోసియేట్స్, ఎల్ఈఏ అసోసియేట్స్ను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసింది. సిద్ధమవుతున్న డీపీఆర్లు హామ్ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్లను కన్సల్టెంట్లు సిద్ధం చేస్తున్నారు. దానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించి కేబినెట్ ఆమోదం తీసుకుంటారు. దీనిపై కేబినెట్లో చర్చించాక ఈ ప్రాజెక్టు విధివిధానాల ఖరారు కానున్నట్టు పీఆర్ అధికారుల సమాచారం. అయితే సమయం వృథా కాకుండా సమాంతరంగా సర్వే కొనసాగుతోందని, ప్రతిపాదిత రోడ్లకు సంబంధించి ఉమ్మడి 9 జిల్లాల్లో ఇప్పటికే నాలుగు వేల కి.మీ. మేర సర్వే పూర్తయినట్టు వారు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదం పొందాక రహదారుల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఖరారు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ను మూడుదశల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జనవరిలో మొదటి దశ పనులు, 2026 మార్చిలో రెండవదశ, 2026 జూన్లో మూడవ దశ నిర్మాణ పనులు ప్రారంభించాలని అనుకుంటున్నారు. తదనుగుణంగా కన్సల్టెంట్లు, అధికారులు అంచనాలు తయారు చేసి టెండర్లు, ఒప్పందాలు వివిధ పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి సూచనలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆయా అంశాలను పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఖరారైన రహదారుల నిర్మాణ పనులను జనవరి 2026న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత టెండర్ ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ మొదలుపెట్టనుంది. ఇందుకు అనుగుణంగా నిర్దేశిత గడువులోపు హామ్ పనులు చేపట్టి పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హామ్ పనుల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫీస్లో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు సమాచారం. -
అన్‘లిమిట్’ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలు, డబ్బు సర్దుబాటు కోసం ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, క్రెడిట్ కార్డుల వాడకంలో వినియోగదారుల్లో ఉన్న అవగాహన లేమిని ‘సొమ్ము’చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మీ క్రెడిట్కార్డు లిమిట్ను పెంచుతామని, మీ పేరిట ఫలానా ఆఫర్లు వచ్చాయని, మీ క్రెడిట్కార్డు ప్రొటెక్షన్ను ఎనేబుల్ చేసుకునేందుకు వివరాలు ఇవ్వాలని, కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే క్రెడిట్కార్డు పనిచేయదని.. ఇలా ఎన్నో రకాలుగా వినియోగదారులను ఫోన్కాల్స్లో బెదిరించే ఘటనలు పెరుగుతున్నాయి. ఇవన్నీ సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్స్ అని, కస్టమర్ కేర్ నుంచి క్రెడిట్కార్డు కంపెనీ చేసే నిజమైన కాల్స్ కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్కార్డు లిమిట్ పెంచుతామని వచ్చే ఫోన్కాల్స్ నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఈ మోసాల నుంచిఎలా రక్షించుకోవాలి?» ఫోన్కాల్స్ ద్వారా లేదంటే ఈమెయిల్స్ ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడిగితే అది సైబర్ మోసగాళ్ల పనే అని అనుమానించి జాగ్రత్తపడాలి. » మీ క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్, సీవీవీ లేదా ఓటీపీని ఎవరికీ చెప్పవద్దు. » ఈ వివరాలు బ్యాంకు ప్రతినిధుల పేరిట కాల్ చేసి అడిగితే అస్సలే ఇవ్వవద్దు. » మీ బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. » ఈ–మెయిల్లు లేదా ఎస్ఎంఎస్లలో అనుమానాస్పద లింక్లు లేదాఅటాచ్మెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటిపై క్లిక్ చేయవద్దు. » మీ ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు బలమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలి. -
ఎస్సీ గురుకులంలో మళ్లీ బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో బదిలీల లొల్లి మొదలైంది. గత ఏడాది సాధారణ బదిలీల సమయంలోనే అర్హత ఉన్న పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని బదిలీ చేయగా.. తాజాగా బాలికల విద్యా సంస్థల నిబంధనలకు లోబడి గురుకుల సొసైటీ అధికారులు మరోమారు బదిలీలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1274 ఉత్తర్వులను అనుసరించి బాలికల విద్యాసంస్థల్లో పూర్తి స్థాయిలో మహిళా అధికారులు, మహిళా ఉద్యోగులే ఉండాలని నిర్ణయించిన సొసైటీ అధికారులు, ఈ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జనరల్ విద్యా సంస్థలు, బాలికల విద్యా సంస్థలకు ప్రత్యేక రోస్టర్ను అనుసరిస్తున్నారు. ఇప్పటికే బాలికల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను గుర్తించిన సొసైటీ అధికారులు.. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి జనరల్ పాఠశాలల్లో పని చేసే విధంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఖాళీలున్నచోట పోస్టింగ్ ప్రస్తుతం ఎస్సీ బాలికల విద్యా సంస్థల్లో దాదాపు 500 పైబడి బోధన, బోధనేతర పురుష సిబ్బంది ఉన్నట్లు అంచనా. వీరికి జనరల్ విద్యా సంస్థల్లో ఖాళీలకు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ కార్యదర్శి జోనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జోనల్ అధికారులు పలువురు జూనియర్ లెక్చరర్లు, పోసు్ట్రగాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.అయితే ఈ ఏకపక్ష బదిలీలపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. గతేడాది సాధారణ బదిలీల్లో స్థానచలనం కలిగిన వారిని ప్రస్తుతం ఏకపక్షంగా బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జీఓ 1274 నిబంధనలను గత సాధారణ బదిలీల సమయంలోనే అమలు చేస్తే సరిపోయేదని, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ఖాళీలు లేకుండా పోయాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. కోరుకున్న చోట బదిలీ అయ్యేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా, అధికారులు వారికి నచ్చిన చోట ఏకపక్షంగా పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశంపై పలువురు ఉద్యోగులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల కోసం పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ పథకానికి మంచి స్పందన లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏడాది కాలంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పురపాలక శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025–26 సంవత్సరానికి 5 శాతం రాయితీని ఉపయోగించుకొన్న ప్రజలు గత నెలలోనే రూ. 400.36 కోట్లు చెల్లించారు. మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 2,264.84 కోట్లు ఉండగా, ఒక్క నెలలోనే ముందస్తుగా 17.68 శాతం చెల్లించడం గమనార్హం. ఇది పురపాలక శాఖలో ఒక రికార్డుగా సీడీఎంఏ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో రూ. 900.9 కోట్లు ఎర్లీబర్డ్ కింద వసూలు కాగా, జీహెచ్ఎంసీ మినహా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో రూ. 400.36 కోట్లు వసూలు కావడం పట్ల పురపాలక శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం ఎర్లీబర్డ్ కింద రూ. 317.84 కోట్లు (14.80 శాతం) వసూలు కాగా, ఈ సంవత్సరం మరో 3 శాతం పెరిగింది. మొత్తం సంవత్సరానికి వసూలు చేసే పన్నుల్లో జమ్మికుంట మునిసిపాలిటీలో ఎర్లీబర్డ్ కింద 54.78% , హుజురాబాద్ 51.85% వసూళ్లుచేసి 50 శాతం కన్నాఎక్కువగా వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచాయి. అధికారులను అభినందించిన సీడీఎంఏ కాగా బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడలలో 30 శాతం కన్నా ఎక్కువగా వసూళ్లు చేసినట్లు సీడీఎంఏ శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు గుమ్మడిదల (42%), మద్దూర్ (34.2%), గడ్డపోతారాం (26.24%), మొయినాబాద్ (21.41%), చేవెళ్ల (21.26%) ఎర్లీబర్డ్ వసూళ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తగిన సమయంలో స్పందించి ముందస్తు పన్ను వసూళ్లు చేసిన కమిషనర్లను, ఇతర అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా 10 శాతం కన్నా తక్కువ వసూళ్లు సాధించిన పురపాలికల్లో వరంగల్ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల, వైరా, పోచంపల్లి, భైంసా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఉన్నాయి. -
‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీకే చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే టైమ్ పాస్ మీటింగ్ లతో అలసిపోయామని, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, రేపు( ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారాయి.కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గత నెలలో రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో రాజాసింగ్ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటూనే , రాష్ట్రంలోని నాయకత్వం సరిగా లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు.హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ గౌతంరావును అభ్యర్థిత్వాన్ని తొలుత నిరాకరించారు రాజాసింగ్. అయితే కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ చొరవతో రాజాసింగ్ కాస్త దిగివచ్చారు. పార్టీ లైన్ లోనే పనిచేస్తానని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. అయితే మరొకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటో కీలక నేతలకు అర్థం కావడం లేదు. -
రేవంత్ సర్కార్కు కిషన్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్రెడ్డి వివరించారు.‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్లో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు. -
హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉప్పల్, చిలూకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లలో భారీ వర్షం కురిసింది. #Hyderabadrains!!Now scattered isolated rains lashes in few parts of Hyderabad City place at Ramanthapur pic.twitter.com/B1ljpuHMiU— Telangana state Weatherman (@tharun25_t) May 3, 2025సికింద్రాబాద్, బేగం పేట్ కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్లు తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. నగరంలో కురిసిన వర్షానికి వావాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. -
Hyd: మైనర్ల తల్లిదండ్రులూ.. ఇది మీకోసమే!
హైదరాబాద్: ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు అమలు చేయడానికి నడుంబిగించారు. ఇక నుంచి మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా ఏడాది పాటు ఆ వాహనం లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధించనున్నారు. అదే సమయంలో ఎవరైతే వాహనాలు డ్రైవింగ్ చేసిన మైనర్లున్నారో వారికి 25 ఏళ్ల వరకూ లైసెన్స్ జారీ కాకుండా చర్యలకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
జీడిమెట్ల: సుభాష్నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్నగర్లో ఇండోర్ షటిల్ కోర్టును జీహెచ్ఎంసీ నిర్మించడంపై ఎస్.ఆర్.నాయక్నగర్, అపురూపాకాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో షటిల్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుకుంటున్నారు. గతంలో కాలనీవాసులు షటిల్ ఆడాలంటే బాచుపల్లి, చింతల్, సుచిత్ర వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కాలనీలో సదుపాయం కలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు మంచినీటితో పాటు టాయిలెట్స్ సదుపాయం కలుగజేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు. కాలనీ స్థలంలో రూ.3 కోట్లతో నిర్మాణం నవంబర్ 2022లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ హేమలతా సురే‹Ùరెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సూరిబాబు కాలనీ అసోషియేషన్, కాలనీ ప్రజల ప్రోత్సాహంతో 23 నెలల్లో ఇండోర్ కోర్టు పనులను పూర్తి చేశారు. ఎకరం స్థలంలో ఇండోర్ స్టేడియం ఇండోర్ కోర్టు లోపల ఒకేసారి 12మంది క్రీడాకారలు ఆడుకునేల మ్యాటింగ్తో మూడు సింథటిక్ కోర్టులను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం కోర్టు లోపల ఎల్ఈడీ లైటింగ్లో పాటు టేబుల్ ఫ్యాన్లను అమర్చారు. కోర్టుల చుట్టూ క్రీడాకారులు కురీ్చల్లో కూర్చునేలా కొంత మేరకు స్థలాన్ని వదిలారు. 7వేల చదరపు ఆడుగుల్లో మూడు సింథటిక్ షటిల్ కోర్టులు నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్స్, క్రీడాకారులు ప్రతి నెల కొంత చెల్లించేలా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఒక సిస్టం తీసుకువస్తామని కాంట్రాక్టర్ అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయించిన షటిల్ ఇండోర్ కోర్టు మా కాలనీలో నిర్మించడం అనందంగా ఉంది. మా కాలనీ, అపురూపాకాలనీలో షటిల్ ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. యువ క్రీడాకారులు ఇక్కడ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది మా అకాంక్ష. మా ఇరు కాలనీల తరపున మేము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – టీటీకే శ్రీనివాస్ (ఎస్ఆర్.నాయక్నగర్ అధ్యక్షుడు) సంతోషంగా ఉంది ఫిట్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మనం పట్టు సాధించాలి. అలా అని రోడ్లపైన ఆడలేం. మాకు దగ్గరలో మా కాలనీలో ఇండోర్ షటిల్ కోర్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ షటిల్ ఆడాలని నిర్ణయించుకున్నాం. -సుస్మిత, అపురూపాకాలనీ మేము ఊహించలేదు మాకు షటిల్ ఆటపై మక్కువతో ఇంతకు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆడేవాళ్లం. ఇప్పుడు మా ఇళ్ల మధ్యలోనే షటిల్కోర్టును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించలేనిది. – రాఘవయ్య, కాలనీవాసిజీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు నాకు షటిల్ ఆడాలనే కోరిక ఉండేది కాని మాకు దగ్గలో ఎక్కడ ఇండోర్ స్టేడియం లేదు. మా కాలనీలో ఇండోర్ కోర్టు ఏర్పాటు కావడం మాకు వరం. మూడ్రోజులుగా ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుతున్నాం. మా కాలనీలో షటిల్ కోర్టు నిర్మించిన జీహెచ్ఎంసీ వారికి కృతజ్ఞతలు. – దివ్య, అపురూపాకాలనీ -
ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు. ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్సీఆర్ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది. డెలివరీలో వేగవంతం.. 2018–19 మధ్య కాలంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కం హౌసింగ్(ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి. -
బిర్యానీ తిని భార్యా మృతి.. భర్త పరిస్థితి విషమం
రాజేంద్రనగర్(హైదరాబాద్): ఫుడ్ పాయిజన్తో తన సోదరి మృతి చెందిందని రాజేంద్రనగర్ పోలీసులకు ఓ మహిళ శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు... ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేశ్(48), రాజేశ్వరి(38)లు భార్యాభర్తలు. రమేశ్ బాలానగర్లోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చే సమయంలో బాలానగర్లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి అదే రోజు రాత్రి భుజించి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజాము నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. గురువారం రాజేశ్వరి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ సైతం అనారోగ్యంతో ఉండటంతో ఉప్పర్పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ ఫాయిజన్ కారణంగా తన సోదరి మృతి చెందిన రాజేశ్వరి అక్క శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వైన్ షాపు పర్మిట్రూమ్లో గొడవ.. యువకుడి మృతి
మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్ గౌడ్ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్ 5న తన స్నేహితులు అభినవ్ గౌడ్ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్పల్లిలోని దారువాలా వైన్ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. కావటి కేశవ్ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్ కూడా తన స్నేహితులతో పర్మిట్రూమ్లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్ గౌడ్ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్ ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్గౌడ్కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్ను శుక్రవారం అరెస్టు చేశారు. -
పోలీసు వాహనాలపై 17,391 చలానాలు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదేపదే చెప్పే పోలీసులే.. ఆ నియమాలు తమకు పట్టవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు వాడే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇలా డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 17,391 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ చలానాల కింద మొత్తం రూ.68,67,885 చెల్లించాల్సి ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ మన్గా పేరుపొందిన లోకేంద్రసింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా, ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. ‘ఇది నిజంగా ప్రజలకు చెడ్డ ఉదాహరణ. నేను ట్రాఫిక్ పోలీసులను చాలా గౌరవిస్తాను. అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారుల పారదర్శకత, జవాబుదారీతనం పట్ల నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అభ్యరి్థస్తారని నేను ఆశిస్తున్నాను’అని లోకేంద్రసింగ్ పేర్కొన్నారు. పోలీసు వాహనాలపై పెద్ద ఎత్తున చలాన్లు పెండింగ్లో ఉండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘చలాన్ల చెల్లింపుపై ట్రాఫిక్ వాళ్లు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లు వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తోంది’అని ఒకరు. ‘ఈ వాహనాలను కూడా ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే వాహనాలను ముందుకు అనుమతించాలి’అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఈ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి చెల్లిస్తారు. కానీ, జరిమానాలను ఆ వాహనాలు నడిపిన డ్రైవర్ల నుంచి వసూలు చేయాలి’అని మరొకరు కామెంట్ పెట్టారు. -
నన్నే నీ భర్త అనుకో.. భర్త ఎదుటే భార్యపై వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు తాగిన మత్తులో రెచ్చిపోయి హల్చల్ చేశారు. రాత్రి వేళ దారిలో వెళ్తున్న భార్యాభర్తలను అడ్డుకుని.. మహిళను వేధింపులకు గురిచేశారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.. అంటూ వేధించారు. టచ్లో ఉండాలంటూ ఓవరాక్షన్కు దిగారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్–8 పబ్కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.మరింత ఓవరాక్షన్ చేస్తూ.. నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధింపులకు గురిచేశారు. ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. అనంతరం, వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తుండగా.. బేగంపేట నుంచి రహ్మత్ నగర్కు వచ్చే దాకా వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.అయితే, వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెకండ్ హ్యాండ్ ఇళ్లకు గిరాకీ
స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోమ్ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో సెకండ్ హ్యాండ్ హోమ్స్ వాటా 38 శాతంగా ఉండగా.. 2024–25 నాటికి 43 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోడెవలపర్ నుంచి నేరుగా కొనుగోలుదారులు కొనుగోలు చేసే ప్రాపర్టీలను ప్రైమరీగా, ఇంటి యజమాని మరొక కస్టమర్కు రీసేల్ చేస్తే దాన్ని సెకండరీ ప్రాపర్టీగా పరిగణిస్తారు. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.07 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 1.22 లక్షల రీసేల్ ప్రాపర్టీలు ఉండగా 2024–25 నాటికి మొత్తం 5.44 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. సెకండ్హ్యాండ్ ప్రాపర్టీలు ఏకంగా 2.33 లక్షలకు పెరిగాయి. ప్రైమరీ యూనిట్లు 2018–19లో 1.84 లక్షలుగా ఉండగా.. 2024–25 నాటికి 3.11 లక్షలకు చేరాయి. అంటే రీసేల్ ప్రాపర్టీలలో 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగితే.. ప్రైమరీ యూనిట్లు 62 శాతం నుంచి 57 శాతానికి తగ్గాయి.లగ్జరీ పెరగడమే రీసేల్కు బూస్ట్.. కరోనా కంటే ముందు వరకూ బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉండేవి. డెవలపర్లు కూడా అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఏటేటా భూముల ధరలు పెరుగుతుండటంతో చౌక ఇళ్ల నిర్మాణ వ్యయప్రయాసంగా మారింది. దీంతో లగ్జరీ, విశాలమైన గృహ నిర్మాణాల వైపు ఆసక్తి పెరిగింది. కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్స్ పరిమిత స్థాయిలో ఉండటం, అందు బాటు గృహాల స్థానంలో ఖరీదైన గృహాల సరఫరా పెరగడంతో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీల వైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.గ్రేటర్లో ఇదీ పరిస్థితి.. హైదరాబాద్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 35 వేలు ప్రైమరీ, 36 వేలు సెకండరీ యూనిట్లు ఉన్నాయి. అదే 2018–19లో మొత్తం 63 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో ప్రైమరీ 29 వేలు, సెకండరీ యూనిట్లు 34 వేలు ఉన్నాయి. 2018–19లో ప్రైమరీ యూనిట్ల వాటా 46 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 54 శాతంగా ఉంది. అదే 2024–25లో ప్రైమరీ యూనిట్ల వాటా 49 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 51 శాతంగా ఉంది.ఐటీ హబ్కు చేరువలో..రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ వంటి మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలలో రీసేల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, హబ్సిగూడ, ఉప్పల్, పోచారం వంటి ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని సెకండ్ హ్యాండ్ హోమ్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని నాణ్యమైన ఇళ్లకు ధర కాస్త ఎక్కువైనా కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రయోజనాలివీ» కొత్త నిర్మాణాల కంటే రీసేల్ ప్రాపర్టీల ధరలు అందుబాటులో ఉంటాయి. » రోడ్లు, విద్యా, వైద్య సంస్థలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలతో స్థిరమైన మౌలిక వసతులు ఉంటాయి. » నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా గృహ ప్రవేశం చేసేయవచ్చు. » రీసేల్ ప్రాపర్టీలకు జీఎస్టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవుతుంది. » కొత్త ప్రాజెక్ట్లు పెద్దగా లేని ప్రాంతాలలో సెకండ్హ్యాండ్ హోమ్స్ యజమానితో బేరసారాలకు అవకాశం ఉంటుంది. » రీసేల్ ప్రాపర్టీలకు సైతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లు తక్కువ వడ్డీలోనే గృహ రుణాలను అందిస్తున్నాయి. » కొత్త ఇంటి కొనుగోలు సమయంలో డెవలపర్కు ముందుగా చెల్లించే 10–15 శాతం డౌన్ పేమెంట్ను చెల్లించి, బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపర్టీలో అయితే ఇదేమీ అక్కర్లేదు.జాగ్రత్తలివీ..» సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీలు కొనేముందు ఇంటి వాస్తవ విలువ, మార్కెట్ ధరలను పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం ఉత్తమం. » సాధారణంగా రీసేల్ ప్రాపర్టీలు వ్యవస్థీకృత రంగంలో విక్రయాలు జరగవు కాబట్టి మధ్యవర్తుల మాటలు నమ్మకూడదు. ఒకటికి రెండుసార్లు పునఃసమీక్ష చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. » లీకేజీలు, నిర్వహణ సమస్యలను గృహ యజమాని దాచిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి థర్డ్పార్టీతో సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాత కొనుగోలు చేయడం బెటర్. » 10–15 ఏళ్లకు పైబడి పాత ఇంటిని కొనకపోవడమే ఉత్తమం. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే పాత ఇంటిని కొన్నా.. దాని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించుకుంటేనే కలిసొస్తుంది. » లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, ఆస్తి పన్ను పత్రాలు ఇతరత్రా డాక్యుమెంట్లను న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
ఫోర్త్ సిటీ ముచ్చర్లలో 200 ఎకరాల జూ పార్కు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
విదేశీ జంతు జాతులను కనులారా చూసి ఆనందించాలని ఉందా? వేరే దేశంలోనో, దూర ప్రాంతాలకు వెళ్లో ఈ వన్యప్రాణులను చూసి రావటం అసాధ్యమని భావిస్తున్నారా? అయితే.. మీరు ఏమాత్రం చింతించనవసరంలేదు. రెండేళ్లు ఆగితే మన వద్దే ఎగ్జోటిక్ జూ పార్కు (విదేశీ జంతు ప్రదర్శన శాల) అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నగర శివారులోని ముచ్చర్లలో ఇది ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో విదేశీ (అన్యజాతి) జంతు ప్రదర్శన శాల సందర్శకులకు కనువిందు చేయనుంది. సింగపూర్ జూ తరహాలో దీనిని రూపుదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఈ జూ పార్కును ఏర్పాటు చేయనున్నారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలం కేటాయించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన జంతువులను మాత్రమే ఇక్కడ ఉంచుతారు. ఇతర జూ పార్కులతో పాటు పెద్ద పెద్ద ఫామ్స్లలో పెంపకం చేపట్టే వారి వద్ద నుంచి వివిధ రకాల జంతువులను ఇక్కడికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రెండేళ్లలో ఈ ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు అందుబాటులోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తోడు నాలుగో సిటీగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీకి దగ్గరల్లో విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు కారిడార్ ఎక్స్టెన్షన్ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడనున్న ఈ జూ పార్కుకు రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్)తో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) తదితర అత్యంత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ జూ పార్కుతో పాటు మరో 1,500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జూ సఫారీ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 380 ఎకరాల్లో 2,200 జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జూ పార్కుకు అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. ఏయే దేశాల నుంచి.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆ్రస్టేలియా దేశాలకు చెందిన జంతు జాతులను ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కుకు తరలించనున్నారు. నెహ్రూ జూ పార్కులోని జంతువులు అక్కడే ఉండనున్నాయి. ఒకవైళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువుల సంతానం పెరిగితే వాటిని మాత్రమే అక్కడికి తరలించనున్నారు. జంతు మార్పిడిలో భాగంగా ఇతర దేశాల్లోని జూ పార్కుల నుంచి అవసరమైన జంతు జాతులను కొత్త జూ పార్కుకు తరలించనున్నారు. అలాగే.. ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడికి తీసుకురానున్నారు. నెహ్రూ జూ పార్కులో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణకు భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్దగా.. 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు దేశంలో అతి పెద్దది కానుందని జూ పార్కు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం మైసూర్లోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాల (మైసూర్ జూ)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల జంతువులకు ఆవాసంగా కొనసాగుతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ జరుగుతోంది. దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకులకు వినోదం లభిస్తోంది. ఈ తరహాలోనే నగర శివారు ముచ్చర్లలో విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు కానుంది. అయితే ముచ్చర్ల జూ పార్కు మైసూర్ జూ పార్కు కన్నా.. విశాలంగా ఏర్పాటు కానుంది.పనులు చకచకా.. విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ముచ్చర్లలో ఈ జూ పార్కు రూపుదిద్దుకోనుంది. దీంతో పాటు అక్కడే దాదాపు 1,500 ఎకరాల అటవీ స్థలాన్ని సైతం సఫారీ పార్కుకు కోసం పరిశీలిస్తున్నాం. రానున్న రెండేళ్లలో కొత్త జూ పార్కు సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ సునీల్ ఎస్.హీరేమత్, డైరెక్టర్, తెలంగాణ జూ పార్క్స్. -
30 ఏళ్ల క్రితం కబ్జా.. మూడ్రోజుల్లో విముక్తి
సాక్షి, హైదరాబాద్: ముప్పై ఏళ్ల క్రితమే కబ్జాకు గురైన రూ.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి మూడు రోజుల క్రితం విముక్తి కల్పించారు రెవెన్యూ అధికారులు. ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయడంతో పాటు భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సరూర్నగర్ మండలం లింగోజిగూడ డివిజన్ సర్వే నంబర్ 86లో 1.21 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికార పార్టీకికి చెందిన ఓ నేత భూమిపై కన్నేశాడు. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు పట్టాదారును ఉసిగొలిపి ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలిపేందుకు యత్నంచాడు. ఇప్పటికే ఆ భూమిలో నాలుగు తాత్కాలిక గదులు నిర్మించి, కూలీలకు అద్దెకు ఇచ్చాడు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో ఈ భూమికి విముక్తి కల్పించాలని నిర్ణయించారు.కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ వెంకట్రెడ్డి సహా తహసీల్దార్ వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మూడు రోజుల క్రితం చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్ వైర్లను చుట్టారు. తాత్కాలిక గదుల్లో అద్దెకున్న వారంతా వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లిపోయవాల్సిందిగా ఆదేశించారు. ఈ భూమికి సమీపంలో మరో 250 గజాల స్థలాన్ని కూడా అధికారులు కాపాడారు. -
బాలుడిపై బాలిక లైంగిక దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మైనర్ అయిన తన కుమారుడిపై బ్రదర్ అంటూనే ఓ బాలిక లైంగిక దాడికి పాల్పడిందంటూ బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఓ మహిళ తన భర్తతో పాటు కుమారుడితో కలిసి అక్కడే సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటుంది. స్కూల్ సెలవులు (School Holidays) కావడంతో కుమారుడు ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా వీరి క్వార్టర్స్ పక్క గదిలో ఉండే మరో పనిమనిషి అయిన బాలిక ఉంటుంది. సదరు బాలిక మహిళ కుమారుడిని బ్రదర్ అని, ఆమె కుమారుడు ఆ బాలికను సిస్టర్ అంటూ పిలుచుకునేవారు. ఒకసారి సదరు బాలిక తన కుమారుడిని ముద్దు పెట్టుకోవడంతో అతడిని నిలదీసింది. మార్చి నెలలో తాను గదిలో ఒంటరిగా ఉండగా బాలిక తనను ముద్దు పెట్టుకుందని చెప్పాడు. నిన్ను ఇష్టపడుతున్నానని, నిన్ను ఏమి చేసినా మౌనంగా ఉండాలని, లేకపోతే దొంగతనం కేసు పెట్టి మీ తల్లి ఉద్యోగం తీయిస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె చెప్పినట్లు బాలుడు (Boy) చేసేవాడు. ఈ క్రమంలో బాలుడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి మీద పోక్సో కేసు నమోదు చేశారు.చదవండి: నన్నే నీ భర్త అనుకో.. వివాహితకు వేధింపులు -
5 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: మే 5 నుంచి జూన్ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5, 12 19, 26, జూన్ 2 తేదీల్లో కేసుల ఫైలింగ్, మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్ల వద్ద ఫైలింగ్ చేయొచ్చని చెప్పారు. లంచ్ మోషన్ కేసులు, అత్యవసర పిటిషన్ల మెన్షన్ (విచారణ కోరడం)లపై డివిజన్ బెంచ్లో సీనియర్ న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. మే 7న.. సింగిల్ బెంచ్: జస్టిస్ పుల్ల కార్తీక్ డివిజన్ బెంచ్: జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జె.శ్రీనివాస్రావు మే 14.. సింగిల్ బెంచ్: జస్టిస్ జె.శ్రీనివాస్రావు డివిజన్ బెంచ్: జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు మే 21.. సింగిల్ బెంచ్: జస్టిస్ జె.శ్రీనివాస్రావు డివిజన్ బెంచ్: జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు మే 28.. సింగిల్ బెంచ్: జస్టిస్ కె.శరత్ డివిజన్ బెంచ్: జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి జూన్ 4.. సింగిల్ బెంచ్: జస్టిస్ కె.సుజన డివిజన్ బెంచ్: జస్టిస్ కె.శరత్, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావు -
గ్రూప్–1 నియామకాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలకు అనుమతిస్తే ఇక ఆ తర్వాత విచారణ జరిపినా అర్థం లేదని అభిప్రాయపడింది. ఎంపికైన వారు, ఎంపిక కాని వారినీ దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సమగ్ర విచారణ చేపట్టకుండా, వాదనలు పూర్తిగా వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు జూన్ 11కు వాయిదా వేసింది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చు: న్యాయమూర్తి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కోర్టు సమయం ముగిసినా రెండు గంటలకు పైగా విచారణ కొనసాగించారు.తొలుత వాదనలు వినిపించేందుకు అరగంట సమయం కావాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి కోరగా, న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాదనలు వినిపిస్తూ పోతే ఇక అంతు ఉండదన్నారు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చని.. వాదనలు సంక్షిప్తంగా విన్పించాలని సూచించారు. రీకౌంటింగ్లో మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొంటున్న పూజితారెడ్డి సమాధాన పత్రాలు సహా ఇతర వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని టీజీపీఎస్సీకి సూచించారు. నకిలీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరుపక్షాలను హెచ్చరించారు. వాదనలు ఇలా.. రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెబుతున్న కమిషన్ వద్ద మెయిన్స్ పరీక్షలు ఎందరు రాశారో కచ్చిత్చమైన వివరాలు ఇప్పటికీ లేవు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత కూడా లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? కొన్ని సెంటర్ల నుంచి 10 శాతం మంది ఎంపికయ్యారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం మీడియాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆయా మీడియం పేపర్లను ఆ సబ్జెక్టుల్లో నిపుణులైన వారే దిద్దారా? వారి వివరాలు లేవు. మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు వచ్చిన వారు ఎందరున్నారు? ఇలాంటి వివరాలు కమిషన్ ఎక్కడా పేర్కొనలేదు..’అని చెప్పారు.టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ‘కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో పిటిషన్లు వేస్తున్నారు. ఇలా వేసిన కొందరు పిటిషనర్లకు ఇదే హైకోర్టులోని మరో బెంచ్ జరిమానా కూడా విధించింది. ఓ పిటిషనర్కు 60 మార్కులు తగ్గాయని పిటిషనర్ న్యాయవాది చెబుతున్నారు. అది తప్పుడు డాక్యుమెంటు. కొందరు పిటిషనర్లు వకాలత్పై సంతకమే పెట్టలేదు. తప్పుడు సంతకాలతో పిటిషన్లు వేస్తున్నారు. నియామకాలపై ఇచ్చిన స్టేని ఎత్తివేయాలి..’అని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ‘నాపై విచారణను ఉపసంహరించండి’గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో తప్పుడు మార్కుల మెమో పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ షబ్నం ఆర్యా(అభ్యర్థి) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్కు లేఖ రాశారు. మెయిన్స్ పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ఓ వాట్సాప్ గ్రూప్ రూపొందించి, తనను కూడా అందులో చేర్చారన్నారు. టీజీపీఎస్సీపై పోరాడటం కోసమంటూ రూ.5 వేలు అడిగితే పంపానన్నారు. ఆ తర్వాత ఇటీవల డబ్ల్యూపీ 12431/2025 పిటిషన్ ఉత్తర్వుల కాపీని గ్రూప్లో పోస్టు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ల జాబితాలో తన పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయానన్నారు. తాను కేసు వేయలేదని, ఎలాంటి వకాలత్పై సంతకం పెట్టలేదని, తన పేరు తొలగించాలన్నారు. -
చిన్న పరిశ్రమకు అప్పు కరువు
సాక్షి, హైదరాబాద్: భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య సంస్థ (ఎంఎస్ఎంఈ)లు అప్పులు పుట్టక, పెట్టుబడులు రాక కునారిల్లుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నా, అప్పులు ఇవ్వాలని లక్ష్యాలు నిర్దేశించినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వటంలేదు. ఎంఎస్ఎంఈలకు రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా.. బ్యాంకులు ఇచ్చింది మాత్రం 19 శాతమేనని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఎంఎస్ఎంఈ రంగంలో పోటీతత్వం పెంపునకు సంబంధించిన నివేదికను ఈ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ (ఐఎఫ్సీ) సహకారంతో ఈ నివేదికను రూపొందించింది. భారతీయ ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక సవాళ్లను ఈ నివేదిక విశ్లేషించింది. రుణ వితరణ 19 శాతమే: దేశంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు బ్యాంకుల ద్వారా రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇప్పించాలని 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించింది. కానీ, బ్యాంకులు ఇచ్చింది మాత్రం లక్ష్యంలో 19 శాతమేనని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో బ్యాంకుల నుంచి చిన్న సంస్థలకు రుణాలు 14 నుంచి 20 శాతానికి పెరగ్గా, మధ్య తరహా సంస్థలకు 4 నుంచి 9 శాతానికి పెరిగాయి. ఎంఎస్ఎంఈలకు రుణ వితరణను పెంచేందుకు ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ)ను విస్తరించినా పరిమిత ఫలితాలే సాధించినట్లు నివేదిక పేర్కొంది. పీడిస్తున్న నైపుణ్య లేమి నైపుణ్య లేమి ఎంఎస్ఎంఈలను వేధిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసేవారిలో ఎక్కువ మందికి సాంకేతిక శిక్షణ లేకపోవడం సంస్థల ఉత్పాదకత, నిర్వహణపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అనేక ఎంఎస్ఎంఈలు నాణ్యత పెంపు కోసం అవసరమైన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నిధులు వెచ్చించడం లేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో భారతీయ ఎంఎస్ఎంఈలు నిలదొక్కులేకపోతున్నాయని నీతి ఆయోగ్ విశ్లేషించింది.నాణ్యమైన విద్యుత్, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఆధునిక సాంకేతికతను ఈ రంగం అందిపుచ్చుకోలేకపోతోంది. అధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలపై ఈ సంస్థలకు అవగాహన ఉండటం లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను స్థానిక ఎంఎస్ఎంఈలు అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది. భాగస్వామ్యాలతోనే పోటీతత్వం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం, సంస్థల నడుమ భాగస్వామ్యాలు, అంతర్జాతీయంగా పోటీ పడటం ద్వారా ఎంఎస్ఎంఈలు సుస్థిర ఆర్థిక ప్రగతి సాధిస్తాయని నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ, భాగస్వామ్య ఒప్పందాలు, మార్కెట్తో ప్రత్యక్ష అనుసంధానం తదితరాల ద్వారా ఎంఎస్ఎంఈల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొంది. ఈశాన్య, తూర్పు భారత్లో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. -
ముంచెత్తిన నష్టం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు నష్టపోతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. ఖమ్మంలో నష్టం అధికంగా జరిగినట్టు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. కొనుగోళ్లలో ఆలస్యంతోనే... యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా కోతలు పూర్తయినా, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. లారీల కొరత, మిల్లర్ల కొర్రీలు, గోనె సంచులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాలు మిల్లర్ల మీద ఆధారపడి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.లారీలు రావడం లేదని, మిల్లర్లు క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లులకు ధాన్యం ఇవ్వాలంటున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే చెప్పే పరిస్థితి కరీంనగర్, ఖమ్మం, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. తిరిగి ఆ ధాన్యాన్ని ఎండబెట్టి, తేమ శాతం 17 శాతం వచ్చిన తర్వాత విక్రయించాలంటే ఎన్ని రోజులు ఆగాలో తెలియని పరిస్థితి. ఆయా జిల్లాల్లో ఇలా.... ⇒ ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డులో ఆరబోసిన 3 వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయ్యింది. కూసుమంచి మండలంలోనూ ధాన్యం తడిసింది. ⇒ మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, బయ్యారం, గార్ల మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ⇒ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయ్యింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి. ⇒ పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది.మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యంలో చేరిన వర్షపు నీటిని శుక్రవారం ఎత్తిపోస్తూ రైతులు కనిపించారు. పోచమ్మవాడ కొనుగోలు కేంద్రంతోపాటు గోపాల్పూర్లోనూ ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడితే.. చేతికందిన పంట కళ్ల ముందు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతు బండారి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డివిజన్లోని అయా మండలాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. -
బోగీలు భగభగ.. ఏసీలో చల్లగా..
సికింద్రాబాద్–హౌరా మధ్య తిరిగే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్కే వీల్లేకుండా ఉంది.ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్ లిస్ట్లో 47వ నంబర్ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్ప్రెస్లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్ ఎకానమీ క్లాస్ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ కోచ్లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్లు నెల ముందే నిండిపోతున్నాయి.దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్లోని ఓ కూపేలో 8 బెర్త్లుంటే, ఎకానమీ ఏసీ కోచ్లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ కోచ్ కంటే తక్కువ చార్జీ సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్ కోచ్ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్ పరిధిలో ఎకానమీ కోచ్లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో ‘రిగ్రెట్’ (ఐఆర్సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది. సరిపడా రేక్స్ లేవు వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్ జారీ చేసింది. రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్ కోచ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్ కోచ్లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి. థర్డ్ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్ బస్సులో తీసుకున్నామార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్ బస్సులో బుక్ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్లింగంపల్లి (హైదరాబాద్) -
‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్చగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు పొంగులేటి. ఈరోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. ‘ ఆనాడు మంత్రులను కేసీఆర్ పని చేయనియ్యలేదు. భూ భారతి వల్ల 70శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా మేము సక్సెస్ అయినట్లే. భూ భారతిలో కొత్త సాఫ్ట్ వేర్ రాబోతోంది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు. జరగనివ్వను. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జూన్ లో సర్వే మ్యాప్ పైలెట్ ప్రాజక్టు ద్వారా రిజస్ట్రేషన్లు చేస్తాం. ఆరువేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయి. భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది.. ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుంది’ అని అన్నారు. -
రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుదారుల పరేషాన్కు ఇక తెరపడనుంది. లబ్ధిదారులకు శుభవార్త. సరిగ్గా ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షం లభిస్తోంది. పాత రేషన్కార్డుల్లో కొత్త సభ్యుల(యూనిట్) ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. అయితే రేషన్కార్డు (Ration Card) కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు 20 శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది. మిగతా దరఖాస్తులను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.ఆరు లక్షలపైనే కొత్త సభ్యులు.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లో పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రేషన్కార్డుల్లోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం అతీగతీ లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు.సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా, మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే రేషన్కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కొత్త సభ్యులు చేర్పుల ఆప్షన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్న్ల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామంఅర్హుల పేర్లకు ఆమోదంపాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోంది. మీ సేవా (Mee Seva) ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త యూనిట్లకు నెలవారీ రేషన్ కోటా కేటాయించాం. మరి కొన్ని కొత్త యూనిట్లకు వచ్చే నెల నుంచి రేషన్ కోటాకేటాయిసాం. ఆందోళన చెందవద్దు – రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి, హైదరాబాద్ -
TG: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 4లక్షలకు పెంపు
హైదరాబాద్: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 50 వేలు ఉంటే దాన్ని రూ. 4 లక్షలకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు హీట్ వేవ్ పై 12 విభాగాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. వడగాల్పులపై హీట్ వేవ్ యాక్షన ప్లాన్ ను రూపొందించారు. దీనిలో భాగంగా వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొంగులేటి. -
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వుడ్స్, ట్రైల్స్ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్ బే నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్ టూర్లో ఆడియో, వీడియో హాల్లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్పై 75 థీమ్ పార్క్లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్ వైల్డ్లైఫ్ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్గార్డ్స్, ఈస్ట్రన్స్ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్ అక్వైరియం, థీమ్ ఫారెస్ట్ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్ పార్క్కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో బర్డ్స్ వాక్ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్)బొటానికల్ గార్డెన్లో సమ్మర్ డే క్యాంప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్ వాక్, స్నేక్ షో, థీమ్ పార్క్లు, వైల్డ్ లైఫ్ సఫారీలను చూపిస్తారు. వివరాల కోసం ఫోన్: 9493549399, 9885298980. -
ప్రయాణికులకు అలర్ట్: ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి,తిరుపతి (07257) ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి, చర్లపల్లి (07258) ఈ నెల 9 నుంచి 30 వరకు, కాజీపేట, తిరుపతి (07253) ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి, కాజీపేట (07254) ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.తెనాలి మార్గంలో .. తెనాలి స్టేషన్ యార్డ్లో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 4న రద్దు చేశారు. అందులో గుంటూరు, రేపల్లె (67249/67250), గుంటూరు, రేపల్లె (67223/67224), తెనాలి,రేపల్లె (67231/67232), తెనాలి,రేపల్లె (67233/67234), విజయవాడ, తెనాలి (67221) రైళ్లు ఉన్నాయి. -
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన మొయినుద్దీన్ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్రెడ్డి, బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను తప్పుల తడక అనడం ఈ ఇద్దరు నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం వీరికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీ సంకల్పం సిద్ధించిందని, రాహుల్ ఆలోచన మేరకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని పేర్కొన్నారు. శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీల కులగణనకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ము కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, సంజయ్లకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమన్న విషయం మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని మహేశ్గౌడ్ దుయ్యబట్టారు. పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయం అని, కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు నిర్వహిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. చరిత్రాత్మక కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికీ ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు. -
ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థను గాడిన పెట్టేందుకు మరో ఏడాది సమయం పడుతుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం జరిగిందని, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రా న్ని రూ.8.29 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ.50 వేల కోట్లు బకాయిలు పెట్టారని, ఇతర విభాగాల్లో రూ.1.20 లక్షల కోట్ల మేర చెల్లింపులు చేయలేదని అన్నారు. అనవసరమైన ఖర్చుతో ఆర్థిక దోపి డీకి పాల్పడ్డ గత పాలకులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.ఫామ్హౌస్లు, పేపర్లు, టీవీ లు అంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నారన్నా రు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని, పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని తెలిపారు. మే డే పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో సీఎం పాల్గొని కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. 15 నెలలుగా నిద్రలేని రాత్రులు.. ‘రాష్ట్ర అభ్యున్నతి కోసం 15 నెలలుగా నేను, నా సహచర మంత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. కార్మికుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగరేణి లాభాల్లో వాటా కింద కార్మికులకు బోనస్ ఇచ్చాం. ఆరీ్టసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని భావిస్తున్నాం. కార్మికుల విషయంలో గత ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది..’అని రేవంత్ ఆరోపించారు. సమ్మె చేస్తే నష్టాలు తప్పవు ‘ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య ఏదైనా మంత్రి దృష్టికి తీసుకురండి. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తోంది. ఇలాంటి సమయంలో సమ్మె చేస్తే సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుంది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దు. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ప్రజల ముందుంచాం. మీరేం చెబితే అదే చేస్తాం. ఇది మీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.22,500 కోట్ల రాబడి ఉంటే అన్ని పథకాలను అమలు చేయవచ్చు.కానీ ప్రస్తుతం వస్తున్న ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే. ఏడాదిన్నరలో రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో రూ.1.52 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించడానికే సరిపోయింది. మరో ఏడాది పాటు వేచి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది. అప్పటివరకు ఒపికగా ప్రభుత్వానికి అండగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. గత పాలకులు విషం చిమ్ముతున్నారు.. ‘పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కపట నాటక సూత్రధారి ఇప్పుడు మళ్లీ బయలుదేరాడు. కేసీఆర్ చేసిన గాయాల్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. పదేళ్ల పాటు ప్రజలను పట్టించుకోకుండా మరోమారు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో గత పాలకులు విషం చిమ్ముతున్నారు. ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపితే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రజలు వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినా అవకాశం ఇవ్వాలి..’అని రేవంత్ అన్నారు. శ్రమశక్తి అవార్డుల ప్రదానం కార్మిక శాఖ ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డుల కోసం ఎంపిక చేసిన సంస్థలు, వ్యక్తులకు గురువారం రవీంద్రభారతిలో వాటిని ప్రదానం చేశారు. మొత్తం 11 సంస్థలు, 37 మంది వ్యక్తిగతంగా అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, క్రిమెటివ్ స్కైజ్/ టెన్సిల్ స్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర సంస్థలు సీఎం నుంచి అవార్డులు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, రాజ్ఠాకూర్, కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సవాళ్ల మధ్య హైదరాబాద్ 'ఐటీ'
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు, స్థానిక విధానాలు కలిసి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమకు సవాళ్లు విసురుతున్నాయి. అమెరికా, యూర‹ప్ మార్కెట్లలో ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం హైదరాబాద్లోని ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనం వల్ల ఐటీ సేవల వినియోగదారులు (క్లయింట్లు) ఖర్చును తగ్గించుకుంటూ, కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు లేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నైపుణ్యం, మౌలిక వసతుల లేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ వంటి కొత్త టెక్నాలజీల మూలంగా ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, స్థానికంగా నిపుణుల కొరత కంపెనీలకు సవాలుగా మారింది. బెంగళూరు, పుణె, చెన్నై వంటి ఇతర ఐటీ హబ్లు నైపుణ్యంగల మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులు, ఆకర్షణీయ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. టాలెంట్ పూల్కు గండిఐటీ ఉద్యోగులు అధిక వేతనాలు, మెరుగైన పని వాతావరణం, కెరీర్లో వృద్ధిని కోరుకుంటున్నారు. కానీ, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కొన్ని కంపెనీలు వేతనాలు పెంచకుండా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. దీంతో మంచి నిపుణులుఇతర నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఐటీ హబ్లు ఉన్న హైటెక్ సిటీ, గచి్చ»ౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ సరఫరాలో సమస్యలు కూడా ఉద్యోగులు, కంపెనీల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్నాయి. ఐటీ రంగంలో చిన్న, మధ్య తరహా కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పాలసీలు అమలు కావడంలేదనే అసంతృప్తి కూడా పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది. పన్ను రాయితీలు, సబ్సిడీలపై ప్రభుత్వంనుంచి స్పష్టత కావాలనికోరుతున్నారు. ఐటీ ఎగుమతుల్లో మందగమనం ఐటీ ఎగుమతుల్లో 2023–24లో జాతీయ వృద్ధిరేటు 3.3 శాతం ఉండగా, తెలంగాణలో 11.28 శాతం ఉంది. 2024 జూన్ నాటికి రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.2.69 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే, 2022–23లో ఐటీ ఎగుమతుల్లో రూ.57,706 కోట్ల వృద్ధి (31.44 శాతం) నమోదు కాగా, 2023–24లో రూ.26,948 కోట్ల మేర మాత్రమే వృద్ధి (11.28 శాతం) నమోదైంది. 2022–23తో పోలిస్తే కొత్త ఉద్యోగాల సృష్టిలోనూ 2023–24లో తగ్గుదల నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో రేవంత్ సర్కారు ఐటీ హబ్లలో మౌలిక వసతుల కల్పన, నైపుణ్య శిక్షణ, విదేశీ సంస్థలతో నైపుణ్య శిక్షణ భాగస్వామ్య ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ టెక్నాలజీలను ప్రోత్సహించడంతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటును రెట్టింపు చేయాలని భావిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధిని 25 శాతానికి పెంచేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. స్థిరత్వం దిశగా.. 2023–24లో చిన్న సంస్థల ప్రాజెక్టుల్లో ఆలస్యం, ఖర్చు తగ్గింపుతో మందగమనం కనిపించినా, ఇప్పు డు అన్నిరకాల కంపెనీలు ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్పై వ్యూహాత్మక పెట్టుబడుల వైపు మళ్లాయి. నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ ఐటీ రంగం ప్రస్తుతం కోలుకునే దశ నుంచి దీర్ఘకాలిక స్థిరత్వం వైపు సాగుతోంది. – రాజశేఖర్ పాపోలు, మేనేజింగ్ డైరెక్టర్, బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ చిన్న కంపెనీల్లో సంక్షోభం తీవ్రం రెండేళ్లుగా మాంద్యం పరిస్థితులు కొనసాగుతుండటంతో కంపెనీలు నిర్ణయాల్లో వేగం తగ్గించాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న కంపెనీలను ప్రోత్సహించడం లేదు. పెద్ద కంపెనీలతో పోటీపడి ప్రాజెక్టులను సాధించినా 18 శాతం జీఎస్టీ వల్ల చిన్న కంపెనీలపై పెనుభారం పడుతోంది. ఉద్యోగులను నిలుపుకోవడమే పెను సవాలుగా మారుతోంది. – శాతంరాజు శ్రీవర్ధన్, సీఈఓ, ఐపాస్ సొల్యూషన్స్ -
సెమీకండక్టర్.. అవకాశాల సెక్టార్!
సాక్షి, స్పెషల్ డెస్క్: సెమీకండక్టర్ తయారీ వ్యవస్థలో భారత్ కు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.. వాటిని అందుకోవడమే తరువాయి అని ఇండియా ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) అంటోంది. ‘ప్రపంచ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ విలువ 2022లో 240 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఇది 420 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ డిమాండ్లో భారత్ 8–10% వాటా దక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా 2030 నాటికి 40 బిలియన్డాలర్ల వ్యాపార అవకాశాలను అందుకోవచ్చు’అని (ఐఈఎస్ఏ) నివేదిక తెలిపింది. ప్రపంచ సంస్థలను ఆహ్వానించడం ద్వారా సెమీకండక్టర్ ఫ్యాబ్, ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ (ఓఎస్ఏటీ) విభాగాల్లో పెట్టుబడులను పెంచడానికి కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ ప్రాముఖ్యత పట్ల అవగాహనను సృష్టించాయి. అలాగే దేశీయ సరఫరాదార్లలో ఆసక్తిని పెంచాయని నివేదిక పేర్కొంది. మానవ వనరులు: సెమికండక్టర్ రంగంలో 2026–27 నాటికి 15 లక్షల మంది నిపుణులు, 50 లక్షల మంది పాక్షిక–నైపుణ్యం గలవారు అవసరం. సరఫరా వ్యవస్థను నిర్మించడం ద్వారా భారత సెమీకండక్టర్ వ్యూహం చిప్ తయారీని దాటి పూర్తి సరఫరా వ్యవస్థను నిర్మించడం వరకు విస్తరించింది. ముడి పదార్థాల నుంచి హై–ఎండ్ ప్యాకేజింగ్, టెస్టింగ్ వరకు కవర్ చేస్తోంది. బలమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థకు సిలికాన్ వేఫర్స్, స్పెషాలిటీ గ్యాసెస్, రసాయనాల వంటి కీలక పదార్థాల స్థిర సరఫరా అవసరం. వీటిని ప్రస్తుతం ప్రపంచ సరఫరాదార్ల నుంచి సేకరిస్తున్నారు. దేశీయంగా ఈ ముఖ్యమైన ముడిపదార్థాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పాలసీల రూపకల్పనకు కృషి చేస్తోంది. వెల్లువెత్తుతున్న పెట్టుబడులు దేశీయ సెమీకండక్టర్ తయారీకి వెన్నుదన్నుగా నిలవడానికి భారత ప్రభుత్వం రూ.76,000 కోట్లతో ప్రోత్సాహక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిప్, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలు, అలాగే టెస్టింగ్ మౌలిక సదుపాయాలకు ప్రాజెక్ట్ ఖర్చులలో దాదాపు 50% సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని రాష్ట్రాలు 20% వరకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రాజెక్టు వ్యయంలో మొత్తం ఆర్థిక మద్దతు 70%కి తీసుకువస్తున్నాయి. ఈ చర్యలు గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించాయి. తైవాన్ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ సహకారంతో టాటా ఎల్రక్టానిక్స్ 11 బిలియన్ డాలర్ల చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్తో సహా ఐదు ప్రధాన ప్రాజెక్టులలో దాదాపు 18 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ సంస్థలైన యూఎస్కు చెందిన మైక్రాన్, జర్మనీకి చెందిన ఇన్ఫినియాన్ సైతం దేశీయ కంపెనీలతో జత కట్టాయి. ప్రాసెసింగ్ ఇక్కడే.. ఇప్పటికే బలమైన స్థానాన్ని కలిగి ఉన్న సెమీకండక్టర్ డిజైన్పై భారత్ దృష్టి సారిస్తోంది. సరఫరాదార్లు, విడిభాగాల తయారీదార్లు, లాజిస్టిక్స్ ప్రొవైడర్ల నెట్వర్క్ను సృష్టించడం ద్వారా భారత్ స్వయం–ఆధారిత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటెల్, క్వాల్కామ్, ఎన్విడియా వంటి గ్లోబల్ చిప్ దిగ్గజాలు భారత్లో ప్రధాన డిజైన్ కేంద్రాలను కలిగి ఉన్నాయి. ఈ నైపుణ్యాన్ని స్థానిక తయారీ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తయారైన చిప్లను చివరి దశల కోసం విదేశాలకు పంపకుండా దేశంలోనే పూర్తిగా ప్రాసెస్ చేసేందుకు అధునాతన చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం భారత్ ప్రత్యేకత. సిలికా¯న్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్లో హైదరాబాద్కు చెందిన మాస్చిప్ టెక్నాలజీస్ 25 ఏళ్లకుపైగా సేవలందిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన 75కుపైగా దిగ్గజ సంస్థలకు డిజైన్ సర్వీసెస్ అందిస్తోంది. 600లకుపైగా ప్రాజెక్టుల్లో తనదైన ముద్రవేసింది. -
పట్టుతప్పిన పౌర సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో పదోన్నతులపై ప్రతిష్టంభన నెలకొనడంతో గ్రేటర్లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఆరు నెలలకుపైగా ఇన్చార్జుల ఏలుబడిలో కొనసాగుతున్నాయి. దీంతో పౌరసేవల నిర్వహణలో వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. పరిపాలన అధికారులు, ఉద్యోగులకు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లకు నడుమ సమన్వయం లేకపోవడంతో పలుచోట్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు, ఫిట్నెస్ పరీక్షలు, యాజమాన్య బదిలీ వంటి పలు సేవల్లో వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అన్ని చోట్ల ఏజెంట్ల కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసిస్టెంట్లకు అడ్డాలుగా.. వాహనదారులు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని ఫీజులు చెల్లించినప్పటికీ లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైళ్లు సత్వరమే పరిష్కారమవుతుండగా, స్వయంగా వెళ్లే వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు మధ్యవర్తులకు ప్రధాన అడ్డాలుగా మారాయి. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నిర్వహించాల్సిన విధుల్లో వాళ్లకు అసిస్టెంట్లుగా వ్యవహరించే దళారులే స్వయంగా ఆఫీసుల్లో తిష్టవేసి పనులు కానిస్తున్నారని హబ్సిగూడకు చెందిన ఓ వాహనదారు విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టిఓలు విధులు నిర్వహించే చోట ఇలా ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లో పాగా వేసే పరిస్థితి లేదు. ప్రాంతీయ రవాణా అధికారుల పర్యవేక్షణ లేని కొన్ని కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా మారింది. కొర్రీలతో బెంబేలెత్తించి.. మరోవైపు కొన్ని రవాణా కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా వెళ్లే వాహనదారులను సిబ్బంది రకరకాల కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇటీవల కూకట్పల్లి యూనిట్ కార్యాలయంలో కొత్త ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా వెళ్లిన వ్యక్తిని సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వాహనానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు సహా దరఖాస్తు స్వీకరించి రసీదు అందజేసి.. నాలుగు రోజులైనా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో సదరు వాహనదారు అధికారులను సంప్రదించారు. చిరునామా ధ్రువీకరణ కోసం విద్యుత్ బిల్లు, అఫిడవిట్ వంటి ఆధారాలను అందజేసినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికెట్ జత చేస్తే తప్ప ఫైల్ను అప్రూవల్ చేయలేమని చెప్పడంతో సదరు వాహనదారు విస్తుపోయారు. సాధారణంగా దళారుల ద్వారా వస్తే ఇలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే పనులు పూర్తి చేసి పంపిస్తారు. కానీ స్వయంగా వెళ్లేవాళ్లకు మాత్రం ఇలాంటి కొర్రీలు తప్పడం లేదు. అడ్రస్లు ఏమారుస్తారు.. కొన్ని కార్యాలయాల్లో దళారులు యథేచ్ఛగా నకిలీ చిరునామాలను సృష్టించి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల బదిలీలు, రిజిస్ట్రేషన్లు వంటి పనులు చేయిస్తున్నారు. తప్పుడు చిరునామాలపై ఏకంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం, వాహనాల రిజి్రస్టేషన్ చేయడంతో ప్రభుత్వం అందజేసే విలువైన డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
అయోమయం.. ఆగమాగం
సాక్షి, సిటీబ్యూరో: కోటి మందికిపైగా ప్రజలకు వివిధ సేవలు, నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీకి పది నెలల్లో నలుగురు కమిషనర్లుగా రావడంతో పరిస్థితి అయోమయంగా మారింది. పాలన గందరగోళంగా తయారైంది. పది నెలల వ్యవధిలో రోనాల్డ్రాస్, ఆమ్రపాలి, ఇలంబర్తి తర్వాత ప్రస్తుతం కర్ణన్ కమిషనర్గా వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ను తరచూ మారుస్తుండటం రాజకీయంగా విమర్శలతో పాటు పాలన పరంగా సమస్యలు సృష్టిస్తోంది.ఒక కమిషనర్ తనదైన శైలిలో కార్యక్రమాలను పట్టాలెక్కించే లోపునే మారిపోతుండటంతో పరిస్థితి ఎప్పటికప్పుడు మొదటికి వస్తోంది. రోనాల్డ్రాస్ తర్వాత ఆమ్రపాలిని కమిషనర్గా నియమించినప్పుడు ఉన్నవారిలో సీనియర్ అయినందున నియమించినట్లు సీఎం అప్పట్లో విలేకరులతో ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం సీనియాటికీ సైతం తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోనాల్డ్రాస్, ఆమ్రపాలి మారడానికి కారణాలున్నాయి కానీ ఇలంబర్తిని మార్చడానికి కారణాలంటూ కనిపించడం లేదు. పైపెచ్చు ఇప్పుడిప్పుడే తగిన చర్యలతో జీహెచ్ఎంసీలో క్రమశిక్షణతోపాటు, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్నట్లుండి మార్చడంతో ఎందుకిలా చేస్తున్నారో తెలియడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వస్తారో.. రారో.. » తనకంటే జూనియర్ను కమిషనర్గా నియమించడంతో ఆయన వద్ద అడిషనల్ కమిషనర్గా పని చేయలేననే తలంపుతో కిల్లు శివకుమార్ నాయుడు సెలవుపై వెళ్లినట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన జీహెచ్ఎంసీకి వస్తారో.. రారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ తిరిగి విధుల్లో చేరారు. ఆమెకు ఇంకా బాధ్యతలు కేటాయించలేదు. ఆమె సెలవులో వెళ్లడంతో ఆమె బాధ్యతల్ని ఇతరులకు అప్పగించారు. వారు తమదైన ప్రణాళిక, లక్ష్యాలతో పనులు చేస్తున్నారు. తిరిగి వారికా విధులు తప్పిస్తే మళ్లీ గందరగోళమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » ఒకవేళ.. శివకుమార్ నాయుడు జీహెచ్ఎంసీకి ఇక రాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న విద్యుత్, చెరువులు, ఎస్ఎన్డీపీ, భూసేకరణ విభాగాలను స్నేహశబరీష్కు అప్పగించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆమె వివిధ విభాగాలను సమర్థంగా నిర్వహించడంతో వీటిని ఆమెకు అప్పగిస్తారని భావిస్తున్నారు. లేని పక్షంలో మళ్లీ కొత్త గందరగోళాలు తలెత్తుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ నాయుడు వద్ద ఉన్న హౌసింగ్ విభాగాన్ని ఇప్పటికే నళినీ పద్మావతికి అప్పగించారు. బదిలీపై జీహెచ్ఎంసీకి తిరిగి వచి్చన భోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, సంస్కరణలు జరుగుతున్నా.. మరోవైపు.. జీహెచ్ఎంసీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ని సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. రెగ్యులర్ సీపీఆర్ఓ లేకపోవడంతో మొక్కుబడి ప్రకటనలు తప్ప జీహెచ్ఎంసీలో ఎన్నో సంస్కరణలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టినా తెలియడం లేదు. పైపెచ్చు తరచూ తప్పుడు సమాచారం అందుతోందనే ఆరోపణలున్నాయి. గతంలో సీపీఆర్ఓ కార్యాలయం సమర్థంగా పనిచేసేది. ప్రస్తుతం ఆ విభాగాన్ని గాలికి వదిలేశారని చెబుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై పై ప్రత్యేక శ్రద్ధ ‘మిస్ వరల్డ్ –2025’ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతో అందరి చూపూ నగరంపై పడింది. ఈ నేపథ్యంలో వివిధ మార్గాల్ని, ఆయా ప్రాంతాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిడంపై ప్రస్తుతం దృష్టి సారించారు. పోటీల్లో పాల్గొనే వారు చార్మినార్, లాడ్బజార్, చౌమహల్లా ప్యాలెస్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శిల్పారామం, ఫలక్నుమా ప్రాంతాలను సందర్శించనుండటంతో ఆయా ప్రాంతా ల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. -
బల్దియా పాలన గందరగోళం
సాక్షి, సిటీబ్యూరో: కోటి మందికిపైగా ప్రజలకు వివిధ సేవలు, నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీకి పది నెలల్లో నలుగురు కమిషనర్లుగా రావడంతో పరిస్థితి అయోమయంగా మారింది. పాలన గందరగోళంగా తయారైంది. పది నెలల వ్యవధిలో రోనాల్డ్రాస్, ఆమ్రపాలి, ఇలంబర్తి తర్వాత ప్రస్తుతం కర్ణన్ కమిషనర్గా వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ను తరచూ మారుస్తుండటం రాజకీయంగా విమర్శలతో పాటు పాలన పరంగా సమస్యలు సృష్టిస్తోంది. ఒక కమిషనర్ తనదైన శైలిలో కార్యక్రమాలను పట్టాలెక్కించే లోపునే మారిపోతుండటంతో పరిస్థితి ఎప్పటికప్పుడు మొదటికి వస్తోంది. రోనాల్డ్రాస్ తర్వాత ఆమ్రపాలిని కమిషనర్గా నియమించినప్పుడు ఉన్నవారిలో సీనియర్ అయినందున నియమించినట్లు సీఎం అప్పట్లో విలేకరులతో ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం సీనియాటికీ సైతం తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోనాల్డ్రాస్, ఆమ్రపాలి మారడానికి కారణాలున్నాయి కానీ ఇలంబర్తిని మార్చడానికి కారణాలంటూ కనిపించడం లేదు. పైపెచ్చు ఇప్పుడిప్పుడే తగిన చర్యలతో జీహెచ్ఎంసీలో క్రమశిక్షణతోపాటు, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్నట్లుండి మార్చడంతో ఎందుకిలా చేస్తున్నారో తెలియడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వస్తారో.. రారో.. ● తనకంటే జూనియర్ను కమిషనర్గా నియమించడంతో ఆయన వద్ద అడిషనల్ కమిషనర్గా పని చేయలేననే తలంపుతో కిల్లు శివకుమార్ నాయుడు సెలవుపై వెళ్లినట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన జీహెచ్ఎంసీకి వస్తారో.. రారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ తిరిగి విధుల్లో చేరారు. ఆమెకు ఇంకా బాధ్యతలు కేటాయించలేదు. ఆమె సెలవులో వెళ్లడంతో ఆమె బాధ్యతల్ని ఇతరులకు అప్పగించారు. వారు తమదైన ప్రణాళిక, లక్ష్యాలతో పనులు చేస్తున్నారు. తిరిగి వారికా విధులు తప్పిస్తే మళ్లీ గందరగోళమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● ఒకవేళ.. శివకుమార్ నాయుడు జీహెచ్ఎంసీకి ఇక రాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న విద్యుత్, చెరువులు, ఎస్ఎన్డీపీ, భూసేకరణ విభాగాలను స్నేహశబరీష్కు అప్పగించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆమె వివిధ విభాగాలను సమర్థంగా నిర్వహించడంతో వీటిని ఆమెకు అప్పగిస్తారని భావిస్తున్నారు. లేని పక్షంలో మళ్లీ కొత్త గందరగోళాలు తలెత్తుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ నాయుడు వద్ద ఉన్న హౌసింగ్ విభాగాన్ని ఇప్పటికే నళినీ పద్మావతికి అప్పగించారు. బదిలీపై జీహెచ్ఎంసీకి తిరిగి వచ్చిన భోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, సంస్కరణలు జరుగుతున్నా.. మరోవైపు.. జీహెచ్ఎంసీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ని సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. రెగ్యులర్ సీపీఆర్ఓ లేకపోవడంతో మొక్కుబడి ప్రకటనలు తప్ప జీహెచ్ఎంసీలో ఎన్నో సంస్కరణలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టినా తెలియడం లేదు. పైపెచ్చు తరచూ తప్పుడు సమాచారం అందుతోందనే ఆరోపణలున్నాయి. గతంలో సీపీఆర్ఓ కార్యాలయం సమర్థంగా పనిచేసేది. ప్రస్తుతం ఆ విభాగాన్ని గాలికి వదిలేశారని చెబుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై పై ప్రత్యేక శ్రద్ధ ‘మిస్ వరల్డ్ –2025’ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతో అందరి చూపూ నగరంపై పడింది. ఈ నేపథ్యంలో వివిధ మార్గాల్ని, ఆయా ప్రాంతాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిడంపై ప్రస్తుతం దృష్టి సారించారు. పోటీల్లో పాల్గొనే వారు చార్మినార్, లాడ్బజార్, చౌమహల్లా ప్యాలెస్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శిల్పారామం, ఫలక్నుమా ప్రాంతాలను సందర్శించనుండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. -
అందంగా.. సుందరంగా..
సాక్షి, హైదరాబాద్: నగర విశిష్టతల్లో తలమానికంగా చేరనున్న మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలు. ఇందులో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగడం నగరానికే గర్వకారణం. ఇందులో భాగంగా పలు ప్రత్యేక ప్రాంతాల్లో క్రౌన్ రూపంలో ప్రతిమలు, లైటింగ్ ఎఫెక్టులు, అధునాతన హంగులను రూపొందించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు జరిగే ప్రధాన ప్రాంతమైన హైటెక్స్ వేదిక సమీప ప్రాంతాలను అంతర్జాతీయ ప్రముఖులు హౌరా అనేలా రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పలు ప్రాంతాల్లో కళ్లు మిరుమిట్లుగొలిపే థీమ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు, ఏఎంబీ మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నూతనంగా రూపొందించిన మిస్ వరల్డ్ లోగోను కూడా ఈ ప్రచారంలో వినియోగిస్తున్నారు.సందడి చేయనున్న గ్లోబల్ సెలబ్రెటీలు..మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో దాదాపు 130 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు నగరానికి రానున్న్నారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ రోడ్లో 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ అతిథుల కోసం ఇప్పటికే ట్రైడెంట్ హోటల్ను నెల రోజుల పాటు ముందస్తుగానే బుక్ చేయడంతో పాటు పలు 5 స్టార్, 3 స్టార్ హోటళ్లను వినియోగించుకోనున్నారు. మాజీ ప్రపంచ సుందరీమణులు, గ్లోబల్ సినీ ప్రముఖులు, విదేశాంగ ప్రముఖులు ఇతర విభిన్న రంగాలకు చెందిన సెలబ్రెటీలు నగరానికి విచ్చేయనున్నారు. శుక్రవారం (ఈ నెల 2న) నగరంలోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సోనూసూద్, మాజీ మిస్ ఇండియా నందినీ గుప్తా ముఖ్య అతిథులుగా వస్తున్నట్టు సమాచారం. 10న జరగనున్న ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. -
డిజిటల్ డిస్ప్లేకు నో
స్టాండింగ్ కమిటీ తిరస్కారం సాక్షి, సిటీబ్యూరో: దుకాణాలు, బ్యాంకులు తదితర సంస్థలకు ఎల్ఈడీ డిజిటల్ స్టాటిక్ బోర్టుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ బ్రేక్ వేసింది. ఈ ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదు. గతంలో తిరస్కరించిన చెరువుల పునరుద్ధరణకు నామినేషన్పై ‘నీరి’ని టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించే ప్రతిపాదనను మళ్లీ పెండింగ్లో పెట్టింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం వివిధ రహదారుల విస్తరణకు సిఫారస్ చేసింది. సమావేశంలో 9 అంశాలతో పాటు 2 టేబుల్ అంశాలకు ఆమోద ముద్ర వేసినట్లు మేయర్ తెలిపారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆయా విభాగాలకు సంబంధించిన టెండర్లు తదితర నిర్ణయాలన్నింటినీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. సమావేశంలో కమిషనర్ కర్ణన్, స్టాండింగ్ కమటీ సభ్యులు, ఆయా విభాగాల ఉన్నతాధకారులు పాల్గొన్నారు. -
నష్టాలను అధిగమించే యోచన
కొద్దిరోజుల్లోనే స్పష్టత.. ఇప్పుడున్న చార్జీలపై గరిష్టంగా 20 శాతం వరకు పెంచే యోచన ఉంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 వరకు మెట్రో చార్జీలు ఉన్నాయి. 20 శాతం పెంచితే రూ.15 నుంచి రూ.75 వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మెట్రో చార్జీలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని అధికారులు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంతవరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ● చార్జీల పెంపునకు కసరత్తు ● త్వరలో 20 శాతం వడ్డింపు సాక్షి, సిటీబ్యూరో: త్వరలో మెట్రో చార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా చార్జీలను పెంచేందుకు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైల్ కసరత్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుస నష్టాలను అధిగమించేందుకు చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో నగరంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రయాణికుల రాకపోకల్లోనూ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా ఉన్నప్పటికీ తరచూ 4.8 లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మహాలక్ష్మి ఎఫెక్ట్.. సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు సైతం మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్లినట్లు సమాచారం. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్– రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఉన్నా జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వీరి సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఈ క్రమంలో నష్టాలను ఎదుర్కొనేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ అనుమతితో.. నగరంలో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో బెంగళూరు, చైన్నె, ఢిల్లీలో రెండు నుంచి మూడుసార్లు చార్జీలు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే చార్జీలను పెంచాలని ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే చార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు తెలిసింది. -
జలమండలికి ‘ఉత్తమ యాజమాన్యం’ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ పురస్కారాన్ని అందుకోగా.. తాజాగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, స్నేహ పూర్వక సంబంధాలకు గానూ ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్మిక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అందుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో జలమండలికి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ (పర్సనల్) మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో బాదుడే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో మెట్రో చార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా చార్జీలను పెంచేందుకు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైల్ కసరత్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుస నష్టాలను అధిగమించేందుకు చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో నగరంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రయాణికుల రాకపోకల్లోనూ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా ఉన్నప్పటికీ తరచూ 4.8 లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మహాలక్ష్మి ఎఫెక్ట్.. సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు సైతం మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్లినట్లు సమాచారం. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్– రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఉన్నా జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వీరి సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఈ క్రమంలో నష్టాలను ఎదుర్కొనేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ అనుమతితో.. నగరంలో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో రెండు నుంచి మూడుసార్లు చార్జీలు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే చార్జీలను పెంచాలని ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే చార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు తెలిసింది. కొద్దిరోజుల్లోనే స్పష్టత.. ఇప్పుడున్న చార్జీలపై గరిష్టంగా 20 శాతం వరకు పెంచే యోచన ఉంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 వరకు మెట్రో చార్జీలు ఉన్నాయి. 20 శాతం పెంచితే రూ.15 నుంచి రూ.75 వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మెట్రో చార్జీలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని అధికారులు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంతవరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. -
మహిళలే జట్టుకట్టి..
మియాపూర్: భవన నిర్మాణాల వద్ద విలువైన సామగ్రి, సెంట్రింగ్ వస్తువుల చోరీకి పాల్పడుతున్న మహిళల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7లక్షల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, డీఐ రమేష్ నాయుడుతో కలిసి వివరాలు వెల్లడించారు. సైదాబాద్లోని సింగరేణి కాలనీకి చెందిన ముడావత్ పద్మ, నెనావత్ విజయ, బిల్లావత్ లక్ష్మీ, నెనావత్ అమృత, సభావత్ సునిత, వాడిత్య అనిత, ఆటోడ్రైవర్ నెనావత్ చందర్ ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో భారీ భవన నిర్మాణ సముదాయాల వద్ద సెంట్రింగ్ సామగ్రి, ఇతర విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్నారు. వీరిలో ఒకరు ఉదయం వేళల్లో కాలనీల్లో తిరుగుతూ సెక్యూరిటీ లేని భవనాలను ఎంచుకుని ముఠా సభ్యులకు సమాచారం అందిస్తారు. రాత్రి అందరూ కలిసి ట్రాలీ ఆటోలో తాము ఎంచుకున్న భవనం వద్దకు చేరుకుంటారు. అదను చూసుకుని సెంట్రింగ్ సామగ్రి, ఇతర విలువైన వస్తువులను ఆటోలో వేసుకుని తరలించేవారు. అనంతరం దానిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. గత నెల 19న వీరు అర్ధరాత్రి మియాపూర్లోని ఓ భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి చోరీకి పాల్పడ్డారు. భవన యజమాని ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు పద్మ, విజయ, లక్ష్మీ, అమృత, సునిత, అనిత, చందర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ముడావత్ పద్మపై 16, విజయపై 7, అమృతపై 1, సునిత 2 కేసులున్నట్లు తెలిపారు. వీరు గతంలో జైలుకు వెళ్లి వచ్చినా తమ వైఖరి మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు రూ.7లక్షల సెంట్రింగ్ సామగ్రీ, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెంట్రింగ్ దొంగల ముఠా ఆటకట్టు రూ.7లక్షల విలువైన సామగ్రి, రెండు ఆటోలు స్వాధీనం ఆరుగురు మహిళలతో సహా ఆటో డ్రైవర్ అరెస్ట్ -
అలా ఎస్కేప్... ఇలా అరెస్టు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన కేసులో వాంటెడ్గా ఉన్న నేరగాడిని పట్టుకోవడానికి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్లో ఉంచారు. అదను చూసుకున్న అతగాడు పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని సవాల్గా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ.. వారి సహాయం లేకుండానే 48 గంటల్లో పట్టుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఎపిసోడ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో నిందితుడిగా... ఎస్సార్ నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి (55) గత ఏడాది డిసెంబర్ 1న సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ ద్వారా తనకు ఎర వేసిన సైబర్ నేరగాళ్లు తాము చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పారని, వారి మాటలు నమ్మిన తాను తొలినాళ్లల్లో లాభపడినా చివరకు రూ.72.4 లక్షలు కోల్పోయానని అందులో పేర్కొన్నాడు. 2024 సెప్టెంబర్–నవంబర్ మధ్యలో ఆ స్కామ్ జరిగినట్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని జామియానగర్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్న మహ్మద్ ఉమర్, షహీన్బాగ్కు చెందిన విద్యార్థి ఇంతియాజ్ అహ్మద్ ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు. పీటీ వారెంట్ తీసుకున్నాక పరారీ... ఈ నిందితులను అరెస్టు చేయడానికి సైబర్ క్రైమ్ ఠాణా ఇన్స్పెక్టర్ ఎస్.నరేష్ నేతృత్వంలోని బృందం గత నెల మూడో వారంలో ఢిల్లీ వెళ్లింది. ఏప్రిల్ 19న ఇద్దరు నిందితుల ఆచూకీ కనిపెట్టిన అధికారులు వారిని అరెస్టు చేశారు. మరుసటి రోజు అక్కడి సాకెట్లోని కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తరలించడానికి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకున్నారు. ఆ రోజు రైలు టిక్కెట్లు దొరక్కపోవడంతో మరుసటి రోజుకు (ఏప్రిల్ 21న) బుక్ చేసుకున్నారు. నిందితులిద్దరినీ తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు అక్కడి రూం నం.304లో బస చేశారు. అదే రోజు రాత్రి అదను చూసుకుని ఉమర్ పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కాలకృత్యాలు తీసుకోవడానికంటూ వెళ్లిన ఉమర్.. ఎస్కార్ట్ కానిస్టేబుల్ను తొసేసి పారిపోయాడు. పట్టవదలకుండా గాలింపు దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తిలక్మార్గ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఉమర్పై మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఠాణాలో కేసు నమోదైనప్పటికీ.. తమ కస్టడీ నుంచి పారిపోయిన నిందితుడిని తామే పట్టుకోవాలని నగర పోలీసులు భావించారు. హైదరాబాద్లో ఉన్న బృందం సాంకేతిక సహకారం అందించగా... ఢిల్లీలోని టీమ్ క్షేత్రస్థాయిలో గాలించింది. ఎట్టకేలకు 48 గంటల్లో ఉమర్ ఆచూకీ కనిపెట్టి పట్టుకోగలిగింది. ఆపై నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఢిల్లీలోని తిలక్మార్గ్ ఠాణాలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు త్వరలో పీటీ వారెంట్పై తరలించనున్నారు. ఉమర్, అహ్మద్ను ప్రధాన సూత్రధారులకు బ్యాంకు ఖాతాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో సైబర్ నేరగాడిని పట్టుకున్న పోలీసులు తెలంగాణ భవన్ నుంచి తప్పించుకున్న ఉమర్ సవాల్గా తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ కాప్స్ స్థానిక పోలీసుల సహకారం లేకుండానే పట్టివేత -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కవాడిగూడ: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, దోమలగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ 8 పవని లింగయ్య అపార్ట్మెంట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు హిమాయత్నగర్కు చెందిన శ్రీరాజ్బూబ్, చిక్కడపల్లికి చెందిన సాయినాఽథ్, రేగళ్ల గోపీనాఽథ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.2 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నడి రోడ్డుపై కారు దగ్ధం హయుత్నగర్: రోడ్డుపై వెళుతున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో దగ్ధమైన సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా ఎలిమినేడు గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి రేనాల్డ్ కై ్వట్ కారులో భార్యతో కలిసి నగరానికి వస్తున్నాడు. హయత్నగర్ అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో కారు ఇంజిన్లో నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన వేణుగోపాల్రెడ్డి అతడి భార్య కారు దిగారు. క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీపీకి చెప్పి కేసు పెట్టిస్తా మణికొండ: నా వాహనం నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా.. అడగడానికి నీవెవరు... హైదరాబాద్ పోలీస్ కమిషనర్(సీపీ)కు చెప్పి నీపై కేసు పెట్టిస్తా.. అంటూ ఓ ద్విచక్రవాహన దారుడు నార్సింగి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న హోం గార్డుపై వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత నెల 29న నార్సింగి ట్రాఫిక్ హోంగార్డు రహమతుల్లా బండ్లగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో రిలయన్స్ స్మార్ట్ మాల్ పక్కనున్న కాలనీ నుంచి ఓ వ్యక్తి బైక్పై మెయిన్ రోడ్డు పైకి వచ్చాడు. అయితే ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సైడ్ రూట్లో వెళ్లాలని హోంగార్డు అతడికి సూచించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతను నేను ఎవరనుకుంటున్నావు.? నన్నే ఆపుతావా.? అంటూ హోంగార్డును బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ సీపీకి చెప్పి నీపై కేసు పెట్టిస్తా.. అంటూ మొబైల్లో సీపీ నెంబర్ చూపి బెదిరించాడు. అతను వెళ్లగానే అతడి కుమారుడు వచ్చి మరో మారు హోంగార్డును అసభ్యంగా దూషించాడు. దీంతో హోంగార్డ్ రహమతుల్లా గురువారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనం నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. బైక్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి కేపీహెచ్బీకాలనీ: ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మౌనికా రెడ్డి సమాచారం మేరకు... కేపీహెచ్బీ కాలనీ రోడ్లపై తిరుగాడే ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో ఫోరం మాల్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు దాటుతుండగా హైటెక్ సిటీ నుంచి జేఎన్టియు వైపు వేగంగా దూసుకువచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి ద్విచక్ర వాహనదారుడు అనిల్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ, ఇతర వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు హస్తినాపురం: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తనను బెదిరిస్తున్నాడని అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి గురువారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల హస్తినాపురం కార్పొరేటర్ సుజాతనాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, సుజాతనాయక్కు తాను అండగా ఉంటున్నానని ఎమ్మెల్యే కోపంగా కోపంగా ఉన్నాడన్నారు. గురువారం తాను వనస్థలిపురంలో గ్రంథాలయసంస్థ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి హాజరుకాగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ● నా ఇష్టం వచ్చినట్లు బైక్ నడుపుతా ● అడగడానికి నీవెవరు ● హోంగార్డుపై వాహనదారుడి వీరంగం ● నార్సింగి పోలీసులకు ఫిర్యాదు -
నకిలీ పత్తి విత్తనాల కట్టడికి టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్తి విత్తన ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు పత్తి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తన ముఠాల ఏజెంట్లు వస్తున్నారు. తక్కువ ధరను ఆశగా చూపి రైతులకు మొలకెత్తని, ఊరుపేరు లేని నాసిరకం విత్తనాలు అంటగట్టే ముఠాల పని పట్టేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశారు. వ్యవసాయ, పోలీస్ అధికారులతో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు ఈ బృందాలతో తనిఖీలు ప్రారంభించారు. సీజన్ ఊపందుకోనున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసగా మూడుసార్ల కంటే ఎక్కువ పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్లు సైతం నమోదు చేస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలు ప్రధానంగా వస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంత సరిహద్దుల్లోనూ నిఘా పెంచారు. మరోవైపు రైతుల్లోనూ నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. విత్తన కొనుగోలు సమయంలో లేబుల్స్ సక్రమంగా ఉండేలా..అధికారి డీలర్ వద్ద నుంచే విత్తనాలు కొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నకిలీవి విక్రయించే అవకాశం ఉన్నట్టు బీజీ–3 పత్తి విత్తనాల అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇదీ టాస్క్ఫోర్స్ టీం నకిలీ విత్తనాలను గుర్తించడంతోపాటు విత్తన ముఠాలపై చర్యలకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన సర్టిఫికేషన్ అధికారులు, సీడ్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఏడాది మే 1 వరకు నమోదైన కేసులు ఇలా... ఆదిలాబాద్ జిల్లా: మార్చి 3న మల్లిడి గ్రామంలో నకి లీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు గురిని అరెస్టు చేశారు. రూ.6.85 లక్షల విలువైన 2.74 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వా«దీనం చేసుకున్నారు. » మార్చి 9న సుర్జాపూర్లో రూ. 3.50 లక్షల విలువైన 1.40 క్వింటాళ్ల పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: కర్ణాటక నుంచి మంచిర్యాలకు నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న రాకెట్ను మార్చి 19న శామీర్పేట్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) ఛేదించింది. ట్రక్ డ్రైవర్ను అరెస్టు చేయడంతోపాటు, రూ.98.75 లక్షల విలువైన 3,750 కిలోల విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా టాస్్కఫోర్స్, కరణ్కోట్ పోలీసులు ఏప్రిల్ 12న రూ.44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. -
గొంతెండిపోతోంది!
సాక్షి, హైదరాబాద్ / సాక్షి న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో తాగునీటి ఎద్దడి మొదలయ్యింది. వివిధ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. రాబోయే నెల రోజుల్లో వేసవి తీవ్రత పెరిగితే ఆ మేరకు తాగునీటి సమస్యలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు జిల్లాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జలశయాలు, చెరువులు లేనిచోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా భగీరథ ఓవర్హెడ్ ట్యాంకులకు మంచినీటిని సరఫరా చేస్తారు. అయితే జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం, చాలాచోట్ల చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో సమస్య తలెత్తుతోంది. ప్రస్తు తం ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాలు, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి కష్టాలను ‘సాక్షి’పరిశీలించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీరు సరిగా సరఫరా కాక ముఖ్యంగా ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంద్రవెల్లి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ మండలాల్లో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల బోర్లు, ట్యాంకులతో సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారంలో బోర్ మోటార్ చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయకపోవడంతో వాటర్ ట్యాంక్తో నీటిని సరఫరా చేస్తున్నారు. అరకొరగానే భగీరథ నీళ్లునిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, మోపాల్ మండలాల్లో నీటి సమస్య ఉంది. దీంతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మోపాల్ మండలంలోని పలు తండాలు ముంపు గ్రామాలు కావడంతో ఇక్కడ మిషన్ భగీరథ పైపులైన్లు వేయలేదు. బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. గాంధారి, తాడ్వాయి, లింగంపేట, రామారెడ్డి మండలాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో దాదాపు 17 వేల మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో రోజు విడిచి రోజు గంట సేపు నీటి సరఫరా చేస్తున్నారు. అవి గృహ అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలైన భాషా నాయక్ తండా, పిల్లలమర్రి బీబీ గూడెం, కాసింపేట, రామకోటి తండా, అంజనాçపురి కాలనీల్లోనూ నీటి కొరత ఉంది. కొన్నిచోట్ల భగీరథ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు ఎండిపోయాయి.. సూర్యాపేట పట్టణంలోని అంజనాçపురి కాలనీ దగ్గర వజ్ర టౌన్షి ప్కు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఒట్టిపోయాయి. కాలనీ మొత్తం మంచినీటి సమస్య ఎదుర్కొంటోంది. అధికారులు స్పందించి మా కష్టాలు తీర్చాలి. – గుగులోతు మంగమ్మ, వజ్ర టౌన్షిప్ వాగునీళ్లే శరణ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామ పంచాయతీ ఎర్రబోరు గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా నీళ్లు రావడం లేదు. ఉన్న చేతిపంపు పనిచేయడం లేదు. దూరంలో ఉన్న వాగు నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారం తండాలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. గ్రామపంచాయతీకి సంబంధించిన బోర్లు సైతం రిపేర్ లో ఉండడంతో వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. కొత్త గ్రామాలకే కొద్దిగా ఇబ్బంది ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరాలో పెద్దగా ఇబ్బందులేవీ ఎదురుకావడం లేదు. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున (మూడునెలలకు సరిపడేలా) మా పథకానికి ఎలాంటి సమస్యలు లేవు. కొత్తగా ఏర్పడిన గ్రామాలకు తప్ప దాదాపుగా అన్నింటికీ బల్క్ సప్లయ్ జరుగుతోంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడడం, పవర్ పోవడం వల్ల మోటార్లను ఆపేయడంతో స్వల్పంగా అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ 98 శాతం గ్రామాలకు కుటుంబానికి 100 లీటర్ల చొప్పున సరఫరా అవుతోంది. మిషన్ భగీరథకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి సరఫరాలో సమస్యలుంటే వెంటనే మాకు సమాచారం వస్తుంది. ఉదయం పూట గంట పాటు తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షిస్తాం. సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – జి.కృపాకర్రెడ్డి, ఈఎన్సీ, మిషన్ భగీరథ -
త్వరలో కృష్ణా ట్రిబ్యునల్–2 అమల్లోకి..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్కుమార్ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన తీర్పును అమల్లోకి తీసుకురావడంలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 7న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్.పాటిల్ సంబంధిత రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల పంపిణీపై 2013 నవంబరు 29న కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వెలువరించింది. తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయరాదని కోరుతూ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్–2కే కేంద్రం అప్పగించింది. దీనిపై ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి మాత్రమే విచారణ జరుగుతున్న ట్రిబ్యునల్ తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్ ప్రకటన జారీ చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో ఈనెల 7న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గెజిట్ ప్రకటన జారీ చేసే అవకాశముంది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి రానుంది. ప్రధానంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచడం, ఇతర బేసిన్లో ఉన్న కోయిన ప్రాజెక్టుకు 92 టీఎంసీల నీటిని కేటాయించడంపై ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది. ఇంకా కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులే.. కృష్ణా ట్రిబ్యునల్–1 (బచావత్ ట్రిబ్యునల్) కృష్ణాలో 2,060 టీఎంసీల లభ్యత ఉందని నిర్ధారించి మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఏపీకి 800 టీఎంసీల కేటాయింపులు జరిపింది. దీనికి అదనంగా రీజనరేట్ అయిన 11 టీఎంసీలను కూడా జోడించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి రాకపోవడంతో 1976లో అమల్లోకి వచ్చిన కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులే ఇంకా అమలవుతున్నాయి. వందేళ్లలో కచ్చితంగా 75 ఏళ్ల పాటు వచ్చే వరద (75 శాతం లభ్యత) ఆధారంగా 2,060 టీఎంసీల నీటిలభ్యత కృష్ణాలో ఉందని కృష్ణా ట్రిబ్యునల్–1 తేల్చింది. 65 శాతం లభ్యత ఆధారంగా కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత ఉందని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ధారించి ఉమ్మడి ఏపీకి 1,005, కర్ణాటకకు 907, మహారాష్ట్రకు 666 టీఎంసీల కేటాయింపులు చేసింది. 65 శాతం లభ్యతతో నీటి కేటాయింపులు చేస్తే దిగువ రాష్ట్రాలు నష్టపోతాయని ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో 7న జరగబోయే సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితేనే కృష్ణా ట్రిబ్యునల్–2ను అమల్లోకి తెస్తూ గెజిట్ ప్రకటన వస్తుంది. -
ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కులగణన విధివిధానాలేమిటో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రహస్యంగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అందర్నీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని, నిపుణులతో కూడిన అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తూతూమంత్రంగా కాకుండా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్ఠాకూర్, బీర్ల ఐలయ్య వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే.. రాహుల్ ప్రతిపాదనను గౌరవించడం గొప్పతనం మా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ పహల్గాం దాడి నుంచి పక్కదారి పట్టించడానికో, బిహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నా సరే. దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు.. ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఇందుకు పూర్తిగా సహకరిస్తాం. మా అనుభవాలను పంచుకోవడానికి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్జోడో యాత్రలో రాహుల్గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కులగణన చేపడ్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్గాంధీ ప్రతిపాదనను మోదీ గౌరవించడం గొప్పతనం. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారో తేదీలను ప్రధాని ప్రకటించాలి. కులగణన సమాజానికి ఎక్స్రే లాంటిది కులగణన సమాజానికి ఎక్స్రే లాంటిది. దీనివల్ల సంక్షేమ పథకాలు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆయా కులాలకు కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. దాదాపు వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కులగణన చేశాం. రాహుల్గాంధీ సూచనలు తీసుకుని ఎలాంటి వివాదాలు, తప్పులు లేకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర స్టేక్ హోల్డర్లందరినీ భాగస్వాములను చేస్తూ.. 57 ప్రశ్నలతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సమగ్రంగా వివరాలు సేకరించి నివేదిక రూపొందించాం. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా భద్రత కల్పించాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. సీఎస్ నుంచి ఎన్యూమరేటర్ వరకు, మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఇలా.. 1.5 లక్షల మందితో ఈ ప్రక్రియ నిర్వహించాం. రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం.. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేశాం. దేశంలో జనగణనతో పాటు కులగణన తక్షణమే చేపట్టాలి అనేది మొదటిది. రెండోది బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపించాం. ఇదే డిమాండ్తో కుల సంఘాల మద్దతుతో ఢిల్లీ జంతర్ మంతర్లో ఒకరోజు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అయినా కులగణన చేయబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు ఇప్పుడు అంగీకరించడానికి మా ఒత్తిడే ప్రధాన కారణం. ఏది ఏమైనా కేంద్రం నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. అభినందిస్తున్నాం. పారదర్శకంగా ముందుకు వెళ్లాలి ఈ ప్రక్రియ అమలులో సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో వెల్లడించాలి. కేంద్రం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ముందుకు వెళ్లాలి. అన్ని రాష్ట్రాల్లో సమాచార సేకరణ చేయాలి. మేం అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. కులగణన పూర్తి చేసి ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది. మేము కుల గణన చేసినప్పుడు ఎదురైన సవాళ్లను కేంద్రంతో పంచుకోవడానికికి సిద్ధం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మా సంకల్పం. రాహల్గాంధీ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా నివేదికను ఇప్పటికే ఢిల్లీకి పంపించాం. ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమే. ఇక్కడకు వచి్చనా సరే.. మమ్మల్ని ఢిల్లీ రమ్మనా సరే.. ఒక మెట్టు దిగడానికి మేము రెడీ. పకడ్బందీగా చేసే ఆలోచన కన్పించడం లేదు మాది రాజకీయ ఉద్దేశంతో చేసిన కుల గణన అంటూ విమర్శలు చేసే నాయకులను ఒకే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో, 16 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కుల గణన చేసి ఆదర్శంగా నిలిచి ఉంటే.. మేము తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి (బీజేపీ) మాటల్లో కనిపిస్తోంది. పకడ్బందీగా కులగణన, జనగణన చేయాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. 2021లో జనగణన చేయకుండా వాయిదా వేశారు. మోదీ.. రేవంత్రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కక్కలేక మింగలేకపోతున్నారు. రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు.. ఒక రాష్ట్రంలో బీసీ ఉండి, మరో రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులాలకు సంబంధించి కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినప్పుడు సమాధానం లభిస్తుంది. రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు అమలవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దీనితో సంబంధం లేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. మాకంటే మెరుగ్గా వారు కులగణన చేస్తే మంచిదే. ఆస్తులు, అప్పులు, పొలాల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. కానీ కులం విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. కులాల లెక్క పక్కాగా తేలితే సంక్షేమ పథకాల అమలు సులభం. వీటికి కేంద్రం డేటానే ప్రామాణికం. అది లేనప్పుడు మేము చేసిన సర్వే డేటానే ప్రామాణికం. తెలంగాణ సేకరించిన సమాచారం దేశానికి రోల్మోడల్. 400 సీట్లు వచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసేవారు బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. రిజర్వేషన్లు ఎత్తేసేవారు. ఇప్పుడు ఈ కులగణన చేపట్టేవారు కూడా కాదు. ఎన్నికల సమయంలో మేముప్రజలను అప్రమత్తం చేయడం వల్ల వారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకు పరిమితం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగానే వారి ఎజెండాను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతోందో ఈ బచ్చాలకు తెలియదు ఢిల్లీలో ఏమి జరుగుతోందో గల్లీలో తిరిగే కిషన్రెడ్డి, బండి సంజయ్ బచ్చాలకు తెలియదు. నరేంద్రమోదీ ఎవరిని ఫాలో అవుతున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరి సలహా తీసుకుంటున్నారు. ఈ గల్లీల్లో తిరిగే పిల్లలకు తెలియదు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు తప్పుపట్టింది తప్ప.. 50 శాతం సీలింగ్ను కాదు. ఈడబ్ల్యూఎస్తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి. నమోదు చేసుకోనివారు లెక్కల్లో లేనట్లే.. కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు లెక్కలో లేనట్లే. కేసీఆర్ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక మాట అన్నారు. ‘ఉన్నోడే ఉన్నట్లు ..లేనోడు పోయినట్లే అని..’. వారికి ఆ స్పష్టత ఉంది. మా పార్టీ, ప్రభుత్వం హింసకు (ఆపరేషన్ కగార్పై మాట్లాడుతూ) వ్యతిరేకం. అది రాజ్యహింస అయినా, వ్యక్తులు చేసినా.. సంఘాలు చేసినా..తప్పే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. -
బీజేపీ ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన చేసిన అభ్యర్థన పిటిషన్ను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. ఘట్కేసర్లోని కొర్రెములలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచిస్తూ పిటిషన్ను కొట్టేసింది. -
వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: సమ్మె యోచనలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన వీడాలని.. ఏదైనా సమస్యలు ఉంటే చర్చిద్దామని.. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని అన్నారాయన. రవీంద్రభారతిలో గురువారం జరిగిన మేడే ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మంత్రితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. అంతా మీ కోసమే ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు అండగా ఉంటా అని సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి అన్నారు. ఇంకా ఆయన మే డే ప్రసంగంలో ఏం చెప్పారంటే.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకం. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే మీ సహకారం ఎంతో ఉంది.సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం. అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోందిగత పదేళ్లలో విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారు.రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలింది. ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి. కపటనాటక సూత్రధారి(కేసీఆర్ను ఉద్దేశించి..) మళ్లీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు అని రేవంత్ ప్రసంగించారు. -
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్స్టేషన్కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. -
థాయ్లాండ్లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ థాయ్లాండ్లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్ను ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్లాండ్లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్లో కస్టమర్కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్గా ఉన్న హర్షవర్థన్కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. -
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్లో భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 144 మందికి స్థానచలనం కల్పించిన కొత్వాల్ సీవీ ఆనంద్..సస్పెన్షన్లో ఉన్న ముగ్గురికీ పోస్టింగ్స్ ఇచ్చారు. 42 శాంతిభద్రతల పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) మారగా...కొత్తగా ఏర్పడిన టోలిచౌకి ఠాణా తొలి ఎస్హెచ్ఓగా లావూరి రమేష్ నాయక్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం రెయిన్బజార్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, సీసీఎస్ విభాగాల్లోనూ కీలక మార్పులు జరిగాయి. ఇన్స్పెక్టర్ బదిలీల్లో ముఖ్యమైనవి ఇలా... -
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
సాగర్కు ఓనర్ తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్జైన్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏకు సంబంధించిన ‘డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్’ వెబ్సైట్ (http://dharma.cwc.gov.in)లో డ్యామ్ ఓనర్గా ఎవరి పేరుతో ఉంటే.. వారే ఓనర్గా ఉంటారని తెలిపారు. దీని ప్రకారం సాగర్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని తేల్చి చెప్పారు. ఏపీ పర్యటన ముగించుకొని తెలంగాణ పర్యటనకు వచ్చిన అనిల్జైన్తో బుధవారం ఈఎన్సీ జి.అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం వాలంతరిలో సమావేశమైంది. రాష్ట్రంలో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం అమలు తీరును అనిల్జైన్ అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డ్యామ్కు సంబంధించిన డ్యామ్ బ్రేక్ అనాలసిస్ తయారు చేస్తున్నామని ఈఎన్సీ అనిల్కుమార్ తెలియజేశారు. వర్షాలకు ముందు, తర్వాత డ్యామ్లకు తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతి డ్యామ్, బరాజ్కు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) నియమావళి (మాన్యువల్)ని సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అనిల్జైన్ సూచించారు. నాగార్జునసాగర్ డ్యామ్కు మరమ్మతులు చేయకపోతే డ్యామ్ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ విభజన తర్వాత నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి వెళ్లిందని అనిల్కుమార్ జైన్కు వివరించారు. 2023 నవంబర్లో ఏపీ ప్రభుత్వం పోలీసు బలగాలతో బలవంతంగా నాగార్జునసాగర్ కుడివైపు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుందని తెలిపారు. దీంతో డ్యామ్కు మరమ్మతుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. చట్ట ప్రకారం సాగర్ డ్యామ్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని ఎన్డీఎస్ఏ చైర్మన్ బదులిచ్చారు.కాళేశ్వరం బరాజ్లపై దిశానిర్దేశం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు ఎన్డీఎస్ఏ తుది నివేదికలో ఎలాంటి సిఫారసులు చేయలేదని ఈఎన్సీ అనిల్కుమార్ అన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వస్తే నిపుణుల కమిటీని పిలిపించి తగిన సిఫారసులు చేయిస్తామని అనిల్జైన్ బదులిచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) టి.శ్రీనివాస్, రామగుండం సీఈ సుధాకర్రెడ్డి, కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, దిగువన ప్రమాదకర స్థాయిలో ప్లంజ్ పూల్ విస్తరించిందని, వర్షాలు ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాలని ఈఎన్సీ అనిల్కుమార్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని అనిల్జైన్ బదులిచ్చారు. నాగార్జునసాగర్ స్పిల్వేకు శాశ్వత మరమ్మతుల కోసం టవర్ క్రేన్ ఏర్పాటు చేశామని అనిల్కుమార్ చెప్పారు. సాగర్ కట్టపై ఏపీ ఆక్రమణను తొలగించి, మరమ్మతులకు సహకరించాలని కోరారు. -
నిర్లక్ష్యం జరిగితే సహించం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–1.. ఇది చాలా సీరియర్ అంశం. ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. మళ్లీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఆస్తులు అమ్ముకుని కొందరు, కుదవపెట్టుకుని మరికొందరు ఏళ్లుగా శిక్షణ పొందుతున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా న్యాయస్థానం సహించదు’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష ముల్యాంకనం చేసిన వారికి జవాబు పత్రాలు ఇచ్చారా?.. దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారెందరు?.. తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?.. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఆదేశించారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రూప్–1 పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సురేందర్, విద్యాసాగర్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ సెంటర్లను ఎలా ఎంపిక చేశారు.. ‘ప్రిలిమ్స్, మెయిన్స్కు హాల్ టికెట్లు మార్చారు. కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే ఇలా చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఎక్కడ ఏ పరీక్ష నిర్వహించినా ఇలా హాల్టికెట్ల నంబర్లలో మార్పు ఉండదు. ఎంపిక చేసిన మహిళా అభ్యర్థులను సెంటర్ నంబర్ 18, 19లో వేశారు. ఈ రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థులను ఎలా ఎంపిక చేసి, సెంటర్లు ఇచ్చారో చెప్పాలి. మరికొన్ని చోట్ల మహిళా కాలేజీల్లో సెంటర్లు కేటాయించినా అక్కడ పురుషులు, మహిళా అభ్యర్థులను వేశారు. మొత్తం పోస్టుల్లో 4 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించగా, కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదు. 16, 17, 18, 19లో పరీక్ష రాసిన వారు ఎక్కువ శాతం అర్హత సాధించారు. పక్కపక్కనే కూర్చున్న వందలాది మందికి ఒకేలా మార్కులొచ్చాయి. అధికారిక వెబ్సైట్లో మొత్తం మార్కుల జాబితా మార్చి 10న పెట్టగా.. పేపర్ల వారీగా మార్కులను మాత్రం వారం తర్వాత పెట్టారు. ఇదంతా అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఆస్కారం ఇస్తోంది’అని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొన్నారు.జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ.. మీడియం వారీగా దిద్దేవారికి జవాబు పత్రాలు ఇచ్చారా అని టీజీపీఎస్సీ కౌన్సెల్ రాజశేఖర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. మెయిన్స్ వ్యాస రూపంలో జరుగుతుందని, ఈప్రశ్నలకు జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యంకాదని బదులిచ్చారు. సబ్జెక్టు నిపుణులే పేపర్లు దిద్దుతారని.. వారికి జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హులైతే అభినందించాలని ఆయన కోరగా.. న్యాయమూర్తి తప్పుకుండా అని సమాధానమిచ్చారు.పిటిషన్లు వేసిన వారు నిరుద్యోగులు కాదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులని రాజశేఖర్ చెప్పారు. కాగా, గ్రూప్–1 నియామకాలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ దాఖలుచేసిన అప్పీల్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తోసిపుచ్చింది. -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. అటు ఉత్తీర్ణతా శాతంలోనూ, ఇటు అత్యధిక మార్కుల్లోనూ అసాధారణ ప్రతిభను కనబర్చి ఔరా అనిపించారు. తొలి 10 స్థానాల్లో ఏకంగా 8 మంది అమ్మాయిలుండగా, ఇద్దరు మాత్రమే అబ్బాయిలున్నారు. మొత్తమ్మీద బాలురు 91.32 శాతం ఉత్తీర్ణులైతే, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ‘సాక్షి’కి అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన సిర్ప కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అన్షిత 600కు గాను 596 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచారు.టాప్–10 స్థానాల్లో నిలిచిన వారి మార్కుల మధ్య తేడా కేవలం రెండు మార్కులే కావడం గమనార్హం. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కన్నా గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈమేరకు బుధవారం టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలకు 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,733 మంది ప్రైవేటు (కంపార్ట్మెంట్) విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో మొత్తం 4,60,519 మంది పాస్ కాగా, 92.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మెమోలో గ్రేడింగ్తోపాటు మార్కులు టెన్త్ ఫలితాల వివరాలను పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు. 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఫలితం వచ్చిందన్నారు. మహబూబాబాద్ 99.29 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని, వికారాబాద్ 73.97 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని తెలిపారు. ఇతర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ 92.78 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. ఈసారి గ్రేడింగ్తోపాటు మార్కులను కూడా మెమోలో పొందుపర్చారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య పరీక్షల విభాగం వెల్లడించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియకు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. -
ప్రక్షాళన దిశగా సీఎం పేషీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి తన కార్యాలయ (సీఎంఓ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో తన కార్యాలయంలోని అధికారుల పనితీరును సమీక్షించి మార్పులు, చేర్పులకు నడుం బిగించారు. ఇటీవల ఆయన ఐఏఎస్ అధికారుల పనితీరు, వ్యవహారశైలి పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల 27న 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి, కీలక శాఖలకు కొత్త అధిపతులను నియమించారు. జయేశ్రంజన్ ‘స్పీడ్’ పెంచుతారా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎంకు సంయుక్త కార్యదర్శి గా పనిచేసిన ఎస్.సంగీత సత్యనారాయణను వైద్యారోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈ ఓగా బదిలీ చేశారు. ఆమె సీఎంఓలో వైద్యారోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్సీల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఇదే బదిలీల్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ను సీఎంఓలోని ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్తోపాటు స్మార్ట్ ప్రొ యాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ సీఈఓగా నియమించారు. రాష్ట్రంలో పెట్టుబడు లను రప్పించడానికి నేరుగా సీఎంఓ నుంచే ప్రయ త్నాలు చేసేందుకు జయేశ్రంజన్ను అక్కడకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాసరాజు ఇన్... చంద్రశేఖర్రెడ్డి, ఖాసిం ఔట్సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్రెడ్డిని త్వరలో ప్రభుత్వం రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్గా నియమించనుంది. మరో మూడు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన సీఎంఓలో అట వీ, వ్యవసాయం, పశుసంవరక, పౌర సరఫరాలు, రవాణా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల వ్యవహారాలను చూస్తున్నారు.» సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షానవాజ్ ఖాసింను ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్గా బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. ఆబ్కారీ శాఖ డైరెక్టర్గా ఆయనకు అద నపు బాధ్యతలు అప్పగించారు. షానవాజ్ సీఎంఓలో బీసీ, మైనారిటీల సంక్షేమం, విపత్తు ల నిర్వహణ, క్రీడలు, సీఎం భద్రతకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించారు.» రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా నియమి స్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీఎంఓ నుంచి వెళ్లిన సంగీత సత్యనారాయణ, షానవాజ్ ఖాసింల కు మంచి పోస్టింగ్స్ లభించగా, త్వరలో వెళ్లను న్న చంద్రశేఖర్రెడ్డికి సైతం కీలకమైన ప్రధాన సమాచార కమిషనర్ పోస్టు వరించనుంది. సీఎంఓలో వీరు పర్యవేక్షించిన శాఖల్లో కొన్నింటిని శ్రీనివాసరాజుకు కేటాయించనున్నారు. ఒకరిద్దరిని సీఎం కార్యదర్శులుగా సీఎంఓలోకి తీసుకునే అవకాశముంది. సీఎంఓలో వీరే కీలకంసీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని కొనసాగించే అవకాశాలున్నాయి. ఆయన కీలకమైన సాధా రణ పరిపాలన, శాంతిభద్రతలు, హోం, ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, శాసనసభ వ్యవహారాలు, రెవె న్యూ శాఖల వ్యవహారాలతో పాటు సీఎం కార్యా లయ ఓవరాల్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు.» సీఎం కార్యదర్శి కె.మాణిక్రాజ్ ఇంధన, నీటి పారుదల, విద్య, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, గనుల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు. » ఐడీఈఎస్ అధికారి బి.అజిత్రెడ్డి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీఎం అపాయింట్ మెంట్స్తోపాటు సీఎంఆర్ఎఫ్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, కార్మిక, ప్రజాసంబంధాల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు. అజిత్రెడ్డి సీఎంకు సన్నిహితంగా ఉంటారని పేరుంది.» సీఎం ఓఎస్డీ హోదాలో వేముల శ్రీనివాసులు దేవాదాయ, పర్యాటక శాఖలతోపాటు సీఎంకు వచ్చే విజ్ఞప్తులు, ప్రజావాణి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వీరిని సీఎంఓలో కొనసాగించే అవకాశముంది. -
ఈఎన్సీ హరిరామ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలులో ఉన్నారు.ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరిరామ్కు సంబంధించిన 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు గుర్తించాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, షేక్పేటలో ఒక విల్లా, కొండాపూర్లో ఒక విల్లా, మాదాపూర్లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్లో, మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్టు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. -
‘జాతీయ కులగణన వ్యతిరేకి కాంగ్రెస్’
హైదరాబాద్: జాతీయ కులగణనకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ కేంద్ర హెంశాఖ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తమ ఘనతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు బండి సంజయ్ చురకలంటించారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే నిదర్శనం. కులగణన చేయాలంటూ అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్సే. మోదీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతేనని చెప్పడం సిగ్గుచేటు. అదే నిజమైతే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. దేశవ్యాప్త కులగణన మోదీ సర్కార్ ఘనతే. రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకే. కేసీఆర్ సమగ్ర సర్వేకు, రేవంత్ సర్కార్ సర్వేకు పొంతన లేకపోవడమే నిదర్శనం. కేంద్ర కులగణన అత్యంత శాస్త్రీయమైది. కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతోంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించండి’ అని బండి సంజయ్ కోరారు. -
రోజు రోజుకీ పెరుగుతున్న చింత చిగురు ధర
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు అని పాత తెలుగు సినిమా పాట. చింత చిగురు రేటు చూడు.. ఆకాశాన్నంటున్న ధర చూడు అంటూ ఇప్పుడు పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే చింత చిగురు ధర అమాంతం పెరిగి ఆహార ప్రియులను కలవరపెడుతోంది. దాని రేటు మటన్ ధరతో పోటీ పడుతుండడంతో వినియోగదారులు చింత చిగురు (Chinta Chiguru) కొనడానికి జంకుతున్నారు. చింత చిగురు కూరలు ఈసారి కుదరకపోవచ్చని నిట్టూరుస్తున్నారు.హైదరాబాద్: చింత చిగురు మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. రోజు రోజుకీ చింత చిగురు పసిడి ధరలాగా పైకి ఎగబాకుతుందే తప్ప కిందకు దిగిరావడం లేదు. భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో జరిగే వారాంతపు సంతల్లో కిలో చింతచిగురు రూ.650 పలికింది. కానీ, ఈ ధర మంగళవారం రూ.800 చేరుకుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేయకలేక చాలామంది వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. వర్షాలు (Rains) లేక చింత చిగురు రావడం లేదని విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం, కొనుగోలుదారులు ఆసక్తిని కనబరచకపోవడంతో విక్రయదారులు చింత చిగురును అమ్మడానికి ముందుకు రావడం లేదు. చదవండి: జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా? -
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
హైదరాబాద్: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో కులగణనపై నిర్ణయం తీసుకున్న అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.‘దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది’ అని ఆయన అన్నారు.కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాందేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారు. రాహుల్ గాంధీ పోరాటం.. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం.. రాహుల్ గాంధీ సాధించిన విజయం. దేశ వ్యాప్తం గా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయం ఇది. రాహుల్ గాంధీ పోరాటానికి భయపడే బీజేపీ ప్రభుత్వం కులగణన కోసం ముందుకు వచ్చింది. రాహుల్ , రేవంత్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు ముందుకు వచ్చారు. 56.36 శాతం బీసీలు ఉన్నారని తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క తీశారు.బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే నేను బలపర్చాను.. అది నా అదృష్టం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. జంతర్ మంతర్ ధర్నా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. మా ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ ఆ నాడు మద్దతు ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి దేశానికి మార్గదర్శనం చేశాడు. తెలంగాణ బీసీ కులగణనకు దిక్సూచిగా మారింది. కులగణన చేయకపోతే బడుగు బలహీన వర్గాల ఆగ్రహం తప్పదని బీజేపీకి అర్థమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు వారి వాటా వారికి అందాల్సిందే. జనగణన లో కులగణన పకడ్బందీగా నిర్వహించి రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉత్త విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన(కేసీఆర్ను ఉద్దేశించి..) వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్ను విమర్శించిండు. వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారుఫామ్ హౌజ్లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్కు లేదు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. ఏ అంశంపైన అయినా సరే చర్చకు సిద్ధం. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి.. కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎలా అవుతుంది?. పదేళ్లు దోచుకున్న మీకు కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారుబసవేశ్వరుడి స్ఫూర్తితో ‘రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు’’ అని రేవంత్ అన్నారు. -
వేసవి సెలవులు...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు
ఘట్కేసర్: వేసవి సెలవులు అనగానే విద్యార్థులను అమ్మమ్మ, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేరి్పంచాలని తల్లితండ్రులు భావిస్తున్నారు. ఫీజులు చెల్లించి మరీ వారి ప్రతిభకు సానబెడుతు పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుండగా పేద పిల్లలకు ఆ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం నూతనంగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని, శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాము, వైస్ ప్రిన్సిపాల్ రాములు తెలిపారు. ప్రతిభకు సాన... పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు సుశిక్షుతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లలిత కళల పాఠశాలలో రాష్ట్రంలోని ఒక్కో గురుకులం నుంచి ప్రతిభగల ఐదుగురి చొప్పున సుమారు 1200 మంది విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మలు, కార్డున్, ఫొటోగ్రఫీ, నకాసీ పెయింటింగ్, అల్లికలు, జర్నలిజం వేద గణితం, చేతిరాత, బంజారా ఎంబ్రాయిడరీ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అదనపు నైపుణ్యం పెంపొందుంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. సమయం వృథా చేయకూడదని... వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకూడదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రోద్భలంతో వేసవి శిబిరానికి వచ్చాను. బంజారా ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్నా. అందరితో కలిసి నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – రిషిత, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆలేరు నైపుణ్యం పెంచుకునే అవకాశం... వేసవి శిబిరంలో అరుదైన కళ నకాసీ పెయింటింగ్, వేదిక్ మ్యాథ్స్లో శిక్షణ పొందుతున్నాను. వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభింంది. జీవితంలో మరిపోలేని శిబిరం. వేసవి శిక్షణ శిబిరం నిర్వాహణ చాలా బాగుంది. –లోహిత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆలేరు ప్రతిభను వెలికి తీయాలని... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభకు సానబెట్టడానికి వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు రాణించడానికి శిబిరం తోడ్పడుతుంది. సెలవులు సద్వినియోగం చేసుకునే వారికి బంగారు అవకాశం లభించింది.– వింధ్యారాణి, జోనల్ ఆఫీసర్ -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో చెక్ చేస్కోండిలా
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్ట్ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్పార్కు కాలనీ రోడ్నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
క్యాబ్.. క్యా సాబ్!
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలతో పాటు క్యాబ్లు, ఆటోలు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి. రద్దీ వేళల నెపంతో అడ్డగోలుగా సర్చార్జీలు విధిస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా చార్జీల వసూళ్లకు దిగుతున్నాయి. మరోవైపు ప్రయాణికుల నుంచి తీసుకొనే చార్జీల్లో కమిషన్ల పేరిట క్యాబ్ సంస్థల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో చేరుతున్నాయని, రాత్రింబవళ్లు వాహనాలు నడిపే తమకు ఎలాంటి మిగులుబాటు ఉండడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 5,000 క్యాబ్లు.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సుమారు 5,000 క్యాబ్లు రాకపోకలు సాగిస్తాయి. బంజారాహిల్స్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా అయితే రూ.450 నుంచి రూ.500 వరకు చార్జీ అవుతుంది. ప్రస్తుత వేసవి రద్దీని సాకుగా చూపుతూ క్యాబ్ సంస్థలు రూ.750 నుంచి రూ.800 వరకు చార్జీలు విధిస్తున్నాయి. ఇలా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ ఎయిర్పోర్టుకు క్యాబ్లు నడిపేందుకు డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ సంస్థలు విధించే చార్జీల వల్ల ఒకవైపు ప్రయాణికులు, మరోవైపు క్యాబ్ డ్రైవర్లు కూడా అన్యాయానికి గురవుతున్నట్లు ఆర్టీఏ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. రద్దీ లేకున్నా సర్చార్జీలు.. సాధారణంగా ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో వాహనాలు అందుబాటులో లేనప్పుడు సర్చార్జీలను విధిస్తారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ఇలా అదనపు వడ్డింపులకు పాల్పడుతున్నారు. నిజానికి మోటారు వాహన చట్టం ప్రకారం ప్రజారవాణా వాహనాలకు రద్దీ సమయాలు, రద్దీ లేని సమయాలు అంటూ ప్రత్యేకమైన తేడాలు లేవు. అన్ని వేళల్లోనూ ఒకే విధమైన చార్జీలను వసూలు చేయాలి. కానీ.. ఇందుకు భిన్నంగా కొన్ని క్యాబ్ సంస్థలు సర్చార్జీలను విధిస్తున్నాయి. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు నమోదైన చార్జీలకు అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు విధిస్తున్నారు. క్యాబ్లకు ఎక్కువ డిమాండ్ ఉండే హైటెక్సిటీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమైన ఆటోల్లో ఒక్కోసారి క్యాబ్ల కంటే ఎక్కువ చార్జీలు నమోదు కావడం గమనార్హం. సాధారణంగా తిరిగే ఆటోల్లోనూ మీటర్ రీడింగ్తో నిమిత్తం లేకుండా వసూళ్లకు దిగుతున్నారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు విధించే చార్జీలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఆటో, ట్యాక్సీ చట్టాలు అమలు కావడం లేదు.త్వరలో ‘సహకార్ ట్యాక్సీ’ దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ తదితర క్యాబ్ సంస్థలకు పోటీగా కేంద్రం సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. ‘సహకార్ ట్యాక్సీ’ పేరుతో రానున్న ఈ యాప్ డ్రైవర్ల సహకార సంస్థగా పని చేయనుంది. ఈ యాప్లో నమోదైన డ్రైవర్ల సేవలకు తగిన ఫలితం వారి ఖాతాల్లో చేరిపోతుంది. సహకార్ ట్యాక్సీ నిర్వహణ కోసం మాత్రం నామమాత్రంగా కొంతమొత్తాన్ని డ్రైవర్ల నుంచి తీసుకుంటారు. ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఊరట లభించనుంది. -
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లోని తన సంస్థ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, "దేశంలోని ఎక్కడ జరిగిన ఘటన అయినా, అది మొత్తం దేశానికే సంబంధించినదే.అమాయకులు అయిన ప్రజలు విహార యాత్రకు వెళ్లి మరణించడం బాధాకరమన్నారు. సరిహద్దు భద్రత పటిష్టంగా లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి. సరిహద్దులను కాపాడడం అత్యంత క్లిష్టమైన పని. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయం కాకుండా దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి" అన్నారు. ఇకపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై దేశ ప్రజలంతా నిలబడాలని, బాధిత కుటుంబాలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువశక్తి సభ్యులు పాల్గొన్నారు. -
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్నగర్కు చెందిన వ్యాపారవేత్త కమల్జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్లో కమల్జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు. -
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..! రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్లో నిరాసక్తత! రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వేదికగా మే 10 నుంచి జరగనున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్–2025) అందాల పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. లోటుపాట్లులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ప్రపంచ సుందరి పోటీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చే సుందరీమణులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇబ్బందిలేని రీతిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం ఆదేశించారు.విమానాశ్రయం, పోటీలు జరిగే వేదికలు, ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వారు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాల పర్యవేక్షణకు విభాగాలవారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 4న మరోసారి సమీక్షిస్తానని.. ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్తోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.మూడంచెల భద్రతా ఏర్పాట్లు!మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న మొత్తం 120 దేశాల ప్రతినిధులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. వారు ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి బస చేసే హోటళ్లు, పోటీల వేదిక ప్రాంతం వరకు ప్రభుత్వం మూడంచెల భద్రత కల్పించనున్నట్లు తెలిసింది. మొత్తం భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణను అదనపు డీజీ ర్యాంకులో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించారు. ఆయన నేతృత్వంలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో విదేశీ అతిథుల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 2017లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన, అంతర్జాతీయ సదస్సులకు భద్రతా విధులు చేపట్టిన అనుభవంగల అధికారులు, సిబ్బందిని మిస్ వరల్డ్–2025 భద్రతా ఏర్పాట్లలో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 31న జరిగే ఫైనల్స్లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. -
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఐదారేళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–ఎన్ఈడబ్ల్యూ) రట్టు చేసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తంగా రూ. 1.4 కోట్ల విలువైన 1.38 కిలోల ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా (ఓజీ) పిలిచే హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథిలమైడ్) బ్లాట్లు, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ (సైలోసైబిన్ డ్రగ్), మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. టాస్్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.కస్టమర్ నుంచి పెడ్లర్గా మారి... సికింద్రాబాద్కు చెందిన అభిషేక్ ఛత్తీస్గడ్లోని రాయ్పూర్ ఐఐఐటీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. రాయ్పూర్లో ఉండగా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన అతను.. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం పెడ్లర్గానూ మారాడు. అభిషేక్కు డార్క్ వెబ్లో ఉన్న డ్రెడ్ మార్కెట్ అనే కమ్యూనిటీ ద్వారా ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన ఓజీ, ఎల్ఎస్డీ కోసం సిగ్నల్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చేవాడు.జబల్పూర్కు చెందిన హర్షవర్థన్ శ్రీవాస్తవ బీ–ఆర్క్ పూర్తి చేసినప్పటికీ ఆ రంగంపై ఆసక్తిలేక ఓ స్టార్టప్ కంపెనీ తెరవడానికి డబ్బు కోసం డ్రగ్ పెడ్లర్ అవతారం ఎత్తాడు. డ్రెడ్ మార్కెట్ ద్వారానే ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’కి లోకల్ ఏజెంట్గా మారాడు. అయితే అతనికి డ్రగ్స్ అలవాటు లేకపోవడం గమనార్హం. సికింద్రాబాద్కు చెందిన మరో ఆర్కిటెక్ట్ ధావల్ కూడా హర్షవర్థన్కు మరో పెడ్లర్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే డ్రగ్స్ సప్లయిర్ అయిన చెన్నైవాసి బి. శ్రీనివాస రాహుల్ను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న అభిషేక్ అతన్నుంచి డ్రగ్స్ కొని విక్రయిస్తున్నాడు. ఈ దందాపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్రావు తమ బృందాలతో వలపన్ని హర్షవర్థన్, రాహుల్, ధావల్, అభిషేక్లను నగరంలో పట్టుకున్నారు. రాహుల్ చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరా... థాయ్లాండ్ నుంచి ఓడల ద్వారా డ్రగ్స్ భారత్లోకి.. అక్కడి నుంచి జబల్పూర్లో ఉంటున్న హర్షవర్థన్ వద్దకు చేరుతున్నాయి. అతను వినియోగదారుడికి కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పార్శిల్ బుక్ చేసేటప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ ఐడీని మాత్రం అభిõÙక్ వంటి వినియోగదారులకు పంపుతున్నాడు. ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరగానే అక్కడకు వెళ్లి వారు తీసుకొనేవారు. హ్యాండ్లర్ నుంచి డ్రగ్స్ను ఔన్స్ (28.34 గ్రాములు)కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తెప్పించుకొని వినియోగదారులకు ఔన్స్కు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల మధ్య విక్రయిస్తున్నారు. -
పాస్బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సాక్షి, హైదరాబాద్: భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కుల బదలాయింపు (విరాసత్) విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చిoది. విరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీపీఎల్ఏ) కార్యాలయం సర్క్యులర్ పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. వారసత్వ హక్కుల బదిలీ కోరే సమయంలో ఆ భూమికి పాసు పుస్తకం ఉన్నట్టైతే తహసీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సీసీఎల్ఏ పంపిన ఆర్వోఆర్/3069215/2025 సర్క్యులర్ ప్రకారం విరాసత్ ప్రక్రియను ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం ఉంటే» విరాసత్ ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. »ఆపరేటర్ లాగిన్లో దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకుని సదరు దరఖాస్తును తహశీల్దార్కు పంపుతారు. »ఈ వారసత్వ హక్కుల బదిలీ కోసం సంబం«దీకులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. సంబంధీకుల నుంచి అభ్యంతరాలు వచ్చి ఉంటే వాటిపై విచారణ జరుపుతారు. అన్నీ సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను తహసీల్దార్ పూర్తి చేస్తారు. పాసు పుస్తకం లేకపోతే»విరాసత్ ప్రక్రియ కోసం తొలుత భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. »భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్డీవో నోటీసులు ఇస్తారు. వీటిని తహసీల్దార్ ద్వారా సంబందీకులకు పంపి అభ్యంతరాలను కోరతారు. »నోటీసు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్డీవోకు పంపుతారు. ఈ నివేదిక ఆధారంగా సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదిస్తారు. ఒకవేళ ఆధారాలు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు. సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే తిరస్కరించేందుకు గల కారణాలను కూడా తన ఉత్తర్వుల్లో ఆర్డీవో పేర్కొనాల్సి ఉంటుంది. »సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదించిన పక్షంలో దరఖాస్తుదారులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. »అప్పుడు దరఖాస్తు ఆపరేటర్ లాగిన్కు వెళుతుంది. తర్వాత దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు. »అనంతరం మళ్లీ సంబం«దీకులకు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరతారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఈ అభ్యంతరాలను తహసీల్దార్ పరిశీలించి మరోమారు విచారిస్తారు. »అప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే డిజటల్ సిగ్నేచర్ చేసి తహసీల్దార్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. -
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తొలి రోజు అగ్రి, ఫార్మా సెట్ జరిగింది. ఈఏపీ సెట్పై ఎక్కువ మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. బోటనీ, జువాలజీ పేపర్లలో ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగామని చెప్పారు. కెమిస్ట్రీలో ఈసారి మూలకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టు ఉన్న విద్యార్థులు చాలా ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. ఫిజిక్స్లో కొన్ని ప్రశ్నలు తేలికగా ఉంటే, మరికొన్ని మధ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నవే ఇచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని ప్రశ్నలు తిప్పి ఇచ్చినట్టు చెప్పారు. మొత్తంగా రెండు సెషన్లలో పేపర్లు ఈజీగా ఉన్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలనఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి పేపర్ సెట్ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్కుమార్ రెడ్డి, ఈఏపీ సెట్ కన్వీనర్ దీన్కుమార్, కో కన్వీనర్, యూనివర్సిటీ రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లిన అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉదయం, సాయంత్రం రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం షిప్టులో 28,834 మంది సెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, వారిలో 26,741 మంది పరీక్ష రాశారు. సాయంత్రం షిప్టులో 28,830 మందికి స్లాట్ అలాట్ చేయగా, 26,964 మంది హాజరయ్యారు. మొత్తంగా ఉదయం 92 శాతం, సాయంత్రం 95 శాతం విద్యార్థులు పరీక్ష హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచేహైదరాబాద్లో నాలుగు జోన్లు ఏర్పాటు చేయగా, ఎక్కువ మంది ఈ ప్రాంతాల నుంచే దరఖాస్తు చేశారు. పరీక్ష హాజరు శాతం కనిష్టంగా 91.3 శాతం, గరిష్టంగా 95 శాతం నమోదైంది. జిల్లాల్లో పరీక్షకు దరఖాస్తు చేసింది తక్కువే అయినా ఎక్కువ మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 97 శాతం, సాయంత్రం 100 శాతం హాజరు నమోదైంది. అన్నిచోట్లా హడావుడితొలి రోజున అన్నిచోట్లా హడావుడి కన్పించింది. పరీక్ష కేంద్రాలను ముందే చూసుకునేలా సెట్ అధికారులు ఈసారి క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచారు. మరోవైపు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద కొద్దిసేపు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని టెన్షన్ పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్లు సకాలంలో ఆన్ అవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోనూ పలుచోట్ల కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. -
'వేతన యాతన'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్లో ఏర్పాటై 2016 నవంబర్తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్లో నియమించింది. ఏయే బోర్డులు ఏం చేశాయి? అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్స్కిల్డ్ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేతన సవరణ లెక్క సూత్రం... ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు. – ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్భరంగా కార్మీకుల జీవితాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి. – సుంకరి మల్లేశం, ఈపీఎఫ్ఓ సీబీటీ మెంబర్, భారత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఇది శ్రమ దోపిడీయే ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు. – దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగుఅన్స్కిల్డ్ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు.