Hyderabad
-
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు.. మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది. -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
కొత్వాల్గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.ఒక్కో షాప్లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రజావాణిలో 55 ఫిర్యాదులు
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు 36 వినతిపత్రాలు అందజేశారు. జోన్ వారీగా అందిన ఫిర్యాదుల్లో శంషాబాద్ జోన్లో 2, రాజేంద్రనగర్ జోన్లో 6, చార్మినార్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 2, సికింద్రాబాద్ జోన్లో 6 ఫిర్యాదులు అందాయి. మొత్తం 55 ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో అందినట్లు అధికారులు తెలిపారు. రాంగోపాల్పెట్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభా వేదిక వద్ద సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి అభయ్ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, సభకు 2 లక్షలమందిపైగా హాజరవుతారని రాంచందర్రావు తెలిపారు. -
ప్రేమ పేరుతో నయవంచన
● సంపన్న యువతులే లక్ష్యంగా మోసాలు ● పోక్సో నిందితుడిని స్వయంగా విచారించిన సీపీ బంజారాహిల్స్: సంపన్న యువతులే లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి వ్యాపారం పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన చీటర్ను జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువచ్చారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా నిందితుడిని విచారణ చేశారు. కూకట్పల్లిలో నివసిస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్న కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (22) ఇన్స్ట్రాగామ్లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు క్లబ్లు, పబ్ల్లో మద్యం తాగుతున్నట్లు ఫొటోలు పెడుతూ యువతులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలో వెంకటగిరికి చెందిన ఓ బాలిక చంద్రశేఖర్ ఉచ్చులో పడింది. స్టార్టప్ పేరుతో ఆమె నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మాయ మాటలతో యువతులను ఆకర్షిస్తూ చాలా మందిని మోసం చేసినట్లుగా విచారణలో తేలడంతో సోమవారం స్వయంగా సీపీ సజ్జనార్ ఇక్కడికి విచ్చేసి నిందితుడితో మాట్లాడారు. ఎంత మందిని మోసం చేసిన విషయాన్ని కూడా ఆరా తీశారు. సుమారు గంట పాటు సీపీ సజ్జనార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుపై దృష్టిసారించారు. కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. చంద్రశేఖర్ తల్లి మీనాకుమారితో పాటు మేన మామను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు. -
రేపటి నుంచి యువ నాటకోత్సవాలు
గన్ఫౌండ్రీ: నాటక రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో యువ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో యువ నాటకోత్సవాల బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 6న డింభక రాజ్యం వీధి, సిరిసిరి మువ్వ కల్చరల్ సంస్థ కళాకారులు గేమ్ సామాజిక నాటకం, నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు శ్రీ మహిషాసుర మర్దిని పద్య నాటకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 7న నిషాహి నిషి వీధి నాటకం, స్వప్నం రాల్చిన అమృతం, స్వామియే శరణం అయ్యప్ప పద్య నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. 8న మాయాజాలం డాట్ కామ్, అమ్మ చెక్కిన బొమ్మ, యయాతి అనే పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రదర్శించనున్న నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
ఉత్సాహంగా బాల సమ్మేళనం
సుల్తాన్బజార్: బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వక్తలు అన్నారు. సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు నుంచి బాల సాహితీ వేత్తలు, బాల సాహిత్య వికాసం కోసం ఉత్తమ అభిరుచితో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొని బాల సాహిత్యాన్నికి ఉన్నత భవిష్యత్తు కల్పించే వివిధ అంశాలపై చర్చలు సాగించారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన శాంత వసంత ట్రస్ట్ సౌజన్యంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమ్మేళనంలో పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బాల సాహిత్య మిత్ర, బాల సాహితీమూర్తి పురస్కారాలను ప్రధానం చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన బాల సాహితీవేత్తలు -
జీఓ నెం.7 రద్దు చేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాంపల్లి: జీఓ నెం.7ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జిఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్పష్టత లేని జిఓను వెంటనే రద్దు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాత్రి గన్పార్కు ఎదుట విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ వస్తే మంచి చదువులు వస్తాయని, మా బతుకులు ఎంతో బాగుపడుతాయని ఆశిస్తే విద్యార్థులకు చదువులే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నరసింహా నాయక్, విద్యార్థి నేతలు సానియా, అంకిత, వైష్ణవి, సాయి, అర్చన, రమ్య, అశ్విని, కీర్తి, అక్షయ పాల్గొన్నారు. -
బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
మణికొండ: బాలలంతా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునే భరోసా ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎం.రమేష్లు అన్నారు. నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్లో వలస కార్మికుల పిల్లల కొరకు వర్క్ సైట్ స్కూల్ను వారు ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని, ఇది దేశంలోనే మొదటి పాఠశాల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, రాజపుష్ప ఫౌండేషన్ ప్రతినిధి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి..
మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్ అసోసియేషన్లకు టోకరా ఉప్పల్: మంత్రులు, న్యాయమూర్తుల పేరును వాడుకుంటూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల టికెట్లను సంపాదించడంతో పాటు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 3న ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్టేడియం పార్కింగ్ వద్ద టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డి బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మహీంద్రా థార్ వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ కేవలం బ్లాక్లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. గూగుల్ నుండి న్యాయమూర్తలు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్న్ లోడ్ చేసేవారు. వాటిపై సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ’కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడ్డారు. చైన్నె ప్రాంతానికి చెందిన ముగ్గురి సహకారంతో వీరు టికెట్లను సంపాదించే వారు. ఈ సీజన్లో ఉప్పల్లో రెండు మ్యాచ్లకు, బెంగుళూరులో రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను పోందారు. ఉప్పల్కు వచ్చే సరికి ఒకసారి టికెట్ను ఇచ్చిన హెచ్సీఏ అధికారులు రెండవ సారికూడా టికెట్లను అందజేసి చివరకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన గట్టమనేని అశోక్(20) రియల్ ఎస్టేట్ వ్యాపారి, కంకనాల దినేష్(25)పార్టీల జెండాలను తయారు చేసే వ్యాపారం, సింగమనేని వేణుమాధవ్(26)ప్రైవేట్ ఉద్యోగి. ఈ ముగ్గురూ ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం పల్కూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చైన్నెకి చెందిన మరో ముగ్గురు నిందితులు ఆశిష్, సెంథిల్, తాన్సిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు, మహీంద్రా థార్ వాహనం. 5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ టికెట్లు పొంది బ్లాక్లో విక్రయం ఉప్పల్ స్టేడియం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్ -
జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ చాంబర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో ల్యాప్ టాప్తో పాటు ఫర్నిచర్ దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. సెలవు దినం కావడంతో కార్యాయలంలో ఎవరు లేరు. హై వోల్టేజీతో రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో ఈఈ చాంబర్ పక్కనే ఉన్న కేబుల్స్ కాలిపోయాయి. అక్కడి నుంచి రెండో అంతస్తులో జడ్సీ చాంబర్లో మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్, ఫర్నీచర్, విద్యుత్ లైట్లు, ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జడ్సీ అమిత్ కాన్ఫరెన్స్ హల్లోనే సోమవారం విధులు నిర్వహించారు.ఇదిలా ఉండగా హై వోల్టేజీ కారణంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోను కేబుల్స్ కాలిపోయినట్లు తహసిల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎంఈఓ కార్యాలయం బయట కూడా కొన్ని విద్యుత్ వైర్లు కాలిపోయాయయి. -
వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి
విజయనగర్కాలనీ: ఎండ వేడిమికి తాళలేక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సఘటన సోమవారం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిమల్కాపూర్ విజయశ్రీ అపార్టుమెంట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
విమానాలు.. సాంకేతిక చిక్కులు
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి కన్నూర్ బయల్దేరిన ఇండిగో విమానం వెనక్కి వచ్చింది. ఆదివారం 76 మందితో ప్రయాణమైన 6ఈ–7225 విమానంలో కొన్ని నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించారు. పైలట్ తిరిగి తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేసింది. అలాగే.. 180 మందితో బెంగళూరు బయల్దేరిన ఐఎక్స్–1345 విమానంలోనూ సాంకేతిక సమస్యను గుర్తించి రద్దు చేశారు. ప్రయాణికులను మరో విమానంలో పంపారు. హైదరాబాద్ నంచి జల్గావ్ వెళ్లాల్సిన విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో: వేసవి డిమాండ్ దృష్ట్యా రైళ్ల నిర్వహణ, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలు, భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలపై జీఎం దిశానిర్దేశం చేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన మేరకు ట్రాక్లను కంకరతో నింపాలని సూచించారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్ను సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ప్రవేశాలకు ఆవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. -
హైదరాబాద్
చెత్త ఏరుకునేవారిలాగ వచ్చి.. చీరల చోరీ బంజారాహిల్స్: చెత్త సేకరించే మహిళలు లాగా భుజాలపై సంచులు వేసుకుని వచ్చిన నలుగురు మహిళలు ఓ చీరల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహ్నుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన ఎండీ సాదిక్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లో చీరల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మహిళలు భుజాలపై చెత్తను ఏరుకునే సంచులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీరల దుకాణం వద్దకు వచ్చి చెత్త ఏరుతున్నట్లు నటిస్తూ షోరూం తాళాలు పగులగొట్టారు. లోనికి వెళ్లి రూ.2 లక్షల ఖరీదైన చీరలను మూటగట్టుకుని మెల్లగా జారుకున్నారు. సోమవారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన సాదిక్ తాళాలు పగులగొట్టి ఉండడం గమనించాడు. లోపల దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉండడం అనుమానం వచ్చింది. చాలామంది చీరలను వర్క్ పనుల కోసం ఆయనకు ఇస్తుంటారు. వాటిని కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా నలుగురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నరు. -
ఐస్క్రీమ్ తేకపోతే బదిలీ చేస్తా!
ఎస్ఐకి జోన్ ఉన్నతాధికారి హుకుం సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఖరీదైన జోన్లో ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు బూతులు మాట్లాడతారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకూ కమిషనర్ అన్ని జోన్ల ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఓ జోన్ ఉన్నతాధికారి తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కు ఫోన్ చేసి ఐస్క్రీమ్ తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ‘మనమే షాప్లను బంద్ చేయిస్తున్నాం కదా సార్. ఈ సమయంలో ఐస్క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది?’ అని సదరు ఎస్ఐ సమాధానం ఇవ్వగా.. చెప్పింది చేయకుంటే మల్టీ జోన్కు బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక గల్లీ గల్లీ తిరిగి ఆ ఎస్ఐ అధికారులందరికీ ఐస్ క్రీమ్ తీసుకెళ్లక తప్పలేదు. ఇదే జోన్ అధికారి మరో సందర్భంలో ఓ భూ తగాదా కేసులో తాను ఆదేశించినట్లు చేయనందుకు మరో ఎస్ఐపై ఆగ్రహానికి గురై ఫోన్లోనే బూతు పురాణం వినిపించాడు. తిట్ల దండకాన్ని సదరు ఎస్ఐ ఫోన్లో రికార్డ్ చేసి సహచరులకు, పలువురు ఉన్నతాధికారులకు వినిపించి, తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. గంటలో రిలీవ్ కావాలంటూ.. కాగా.. సైబరాబాద్ కమిషనరేట్లో ఒకేసారి 32 మంది ఎస్ఐలను చార్మినార్ జోన్కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్ఐలు గంటలోపు రిలీవ్ కావాలని సెట్లో కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్ణీత గంట వ్యవధి విధిస్తూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ (ఎస్హెచ్ఓ)లకు ఆదేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. బాస్ ఆదేశాలతో చేసేదేం లేక ఎస్ఐలను రిలీవ్ చేసే పనిలో ఎస్హెచ్ఓలు నిమగ్నమయ్యారు. వివిధ కేసుల్లో కోర్టుకు వెళ్లిన ఎస్ఐలకు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ అయిన వారిలో కొందరు ఎస్ఐలు డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్ధరాత్రి గల్లీ గల్లీ తిరిగి పట్టుకొచ్చిన ఎస్ఐ కేసు దర్యాప్తులో మరో ఎస్ఐపై దుర్భాషలు సైబరాబాద్లో చర్చనీయాంశం -
ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం
రాజేంద్రనగర్: రోజూ ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీ హబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్రనగర్ ఐఐఎంఆర్లో ‘‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’’ జాతీయ మిషన్కు వర్చువల్గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ తాను చిరుధాన్యాల అహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోగలిగానన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి మాట్లాడుతూ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. -
వృక్షాలకు నివాళులర్పించి..
ఆక్సిజన్ మాస్కులు ధరించి..బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు, వాకర్లు రోజుకో రీతిన వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు 1,320 వృక్షాలు కొట్టేస్తుండటంతో పచ్చదనం పూర్తిగా కరువవుతోందని, భవిష్యత్తులో ఆక్సిజన్ అందక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తామంటూ సోమవారం ఆక్సిజన్ మాస్క్లు ధరించి నిరసనకు దిగారు. నేలకొరిగిన వృక్షాలకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పార్కు చుట్టూ వాక్వేలో ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణవేత్తల వినూత్న నిరసన -
శిల్పారామంలోసమ్మర్ ఆర్ట్ క్యాంప్
● ఈనెల 22 వరకు శిబిరం మాదాపూర్: మాదాపూర్లోని శిల్పారామంలో సోమవారం సమ్మర్ ఆర్ట్ క్యాంపును ప్రారంభించారు. పాటరీ, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్,ఆక్రలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాప్ట్, వాటర్ కలర్స్, క్లే టాయ్స్, లిప్పన్ ఆర్ట్ తదితర అంశాలలో చిన్నారులకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఇటువంటి సాంప్రదాయ పెయిటింగ్స్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
విద్యార్థిని అవయవాల దానం
బంజారాహిల్స్: ఇటీవల వెలువడ్డ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఆమె కళ్లతోపాటు ఇతర అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి తమ కూతురు మరికొందరికి ప్రాణం పోయాలన్న సంకల్పం నెరవేర్చుకున్నారు. ఫిలింనగర్లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన లావణ్య సాయి(16) ఇంటర్ ఫెయిల్ అయింది. తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు మట్టిలో కలిసిపోకూడదని మరికొందరికి చూపు నివ్వడమే కాకుండా ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంగరాల మూర్తి–సుబ్బలక్ష్మి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురి అవయవాలను దానం చేస్తూ నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. -
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగో ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ ’(ఈ2ఈ) అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్గా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ..2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఏలో పైరవీల జోరు
మెసేజ్లకే పరిమితమైన ‘సిలిండర్’ బుకింగ్ తర్వాత 15 రోజులు ఎదురుచూపులు కిలో లెక్కన.. ఆకాశమే హద్దు! డొమెస్టిక్,కమర్షియల్ గ్యాస్ ధరలను కిలోల లెక్కన బేరీజు వేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్ కిలో ధర సుమారు రూ. 66.55 పైసలు పలుకుతుండగా, వాణిజ్య గ్యాస్ కిలో ధర సుమారు రూ. 174.47 అంటే, వాణిజ్య గ్యాస్ ధర గృహ వినియోగ ధర కంటే దాదాపు 2.6 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ లాభాల కోసమే కంపెనీలు కమర్షియల్ ఆర్డర్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా డొమెస్టిక్ రీఫిల్స్ లోడ్ సరిగా రావడం లేదని గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో మహా నగరంలో వంటగ్యాస్ పంపిణీ వ్యవస్థ పడకేసింది. చమురు సంస్థల నిర్లక్ష్యం, డీలర్ల ధనదాహం వెరసి సామాన్యుడి వంటింట్లో ‘గ్యాస్’ మంటలు రేపుతోంది. రీఫిల్ బుక్ చేస్తే మూడు, నాలుగు రోజుల్లో వస్తుందని ఊదరగొడుతున్న చమురు సంస్థలు ఆచరణలో మాత్రం వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బుకింగ్కూ బుకింగ్కూ మధ్య గడువు పెంచిన సంస్థలు, తీరా బుక్ చేశాక 15 రోజులు గడిచినా సిలిండర్ను గడప దాటించకపోవడం పంపిణీ వైఫల్యానికి పరాకాష్టగా మారింది. ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాలు (ఎస్ఎంఎస్) తేదీల మార్పుతో కాలక్షేపం చేస్తుంటే, అటు డీలర్లు స్టాక్ లేదంటూ కాలయాపన చేయడంతో గ్యాస్ కోసం సామాన్యులు నిరీక్షణ మంత్రం జపిస్తున్నారు. బుకింగ్ ఉంటే.. డెలివరీ గగనం ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య 25 రోజుల కనీస గడువు ఉండాలి. అయితే.. బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందన్న చమురు సంస్థల ప్రకటనలు కేవలం ఫోన్ మెసేజ్లకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి బుకింగ్ చేసిన తర్వాత 15 రోజులు గడిస్తే తప్ప సిలిండర్ గడపకు చేరని పరిస్థితి నెలకొంది. రీఫిల్ బుక్ చేసిన వెంటనే ఒక తేదీని, వారం తర్వాత మరో తేదీని సూచిస్తూ కంపెనీలు పంపుతున్న సంక్షిప్త సమాచారం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తోంది. కమర్షియల్ లాభం.. డొమెస్టిక్పై నిర్లక్ష్యం చమురు సంస్థలు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ కంటే వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల సరఫరాకే మొగ్గు చూపుతున్నా యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. తాజాగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 993 పెరిగి రూ. 3,315కి చేరింది. 14.5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 965 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల అసమానత సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బదిలీల జాబితాపై మొదలైన కసరత్తు పక్కదారి పడుతున్న ‘రీఫిల్’ బండి సరఫరా తగ్గిన తరుణంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టాక్ను కూడా ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వాణిజ్య సంస్థలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్ల అక్రమ దందాతో సామాన్య గృహిణులు గ్యాస్ అయిపోయిన వేళ ప్రత్యామ్నాయం లేక అవస్థలకు గురి కావాల్సివస్తోంది. -
ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు
నలుగురికి గాయాలు.. పగిలిన ఇళ్ల అద్దాలు, పహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు సంభవించింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వివరాల ప్రకారం.. జల్పల్లి బాబాకాంట సమీపంలో అబ్దుల్ కరీం, అబ్దుల్ గౌస్, షేక్ మహ్మద్ రిజ్వాన్ అహ్మద్లు లైఫ్ కేర్ మెడికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల గోదాం నిర్వహిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కర్నూలు, పటాన్చెరు నుంచి భారీ కంటైనర్లను తీసుకువచ్చి, చిన్న కంటైనర్లు, అందులోంచి సిలిండర్లలోకి నింపి ఆస్పత్రులు, పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కంటైనర్ నుంచి గ్యాస్ లీకై , భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రభావంతో మరో కంటైనర్ నుంచి వాయువు విరజిమ్మింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ప్రహరీ కూలి డీసీఎం, పది బైక్లు ధ్వంసమయ్యాయి. గోదాం కప్పు దెబ్బతిన్నది. ఇళ్ల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. కంపెనీ ఆపరేటర్ బృందావన్ దాస్, పక్క షెడ్లోని కార్మికులు తౌఫిక్, సయ్యద్ ఖలీం గాయపడ్డారు. వీరిని మైలార్దేవ్పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కరెంట్ అక్రమాలపై సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా..వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. జస్టిస్ లోకూర్ నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించింది. సీఎం ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 9 నెలల క్రితం సీబీఐ విచారణను కోరిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా విద్యుత్ రంగ నిర్ణయాలపై సైతం సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి..మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. కొనుగోళ్లు, నిర్మాణం పేరిట నిధుల దుర్వినియోగం ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల యాదాద్రి, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జూలైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, అదే ఏడాది అక్టోబర్లో ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. కాగా నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు..’ అని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆదాయ వనరుల నివేదికపై చర్చ ‘ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి 4 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యం సిఫారసుల మేరకు శాస్త్రీయ విధానంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి కొత్త ధరలు, చార్జీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. పరిహారం రేట్లపై అసంతృప్తి వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తి ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల పరిహారం ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరించనున్నాయి. హిల్ట్ పీ దరఖాస్తుదారులకు అవకాశం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేలోపు హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించేలా వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి..’ అని మంత్రి చెప్పారు. ఎన్డీడీబీకి నార్మాక్ ‘నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల సహకార సంస్థ (నార్మాక్)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంఓయూను ఆమోదించింది. – యాసంగిలో పండిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావద్దని సూచించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంట నష్టం అంచనాలను తెప్పించాలని ఆదేశించింది. – 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బకాయిల వసూళ్లకు ఓటీఎస్ – క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడిన పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,864 కోట్ల బకాయిలుండగా.. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలికి ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉన్న నీటి బకాయిలపై వడ్డీలు, జరిమానాలు రద్దు చేయాలని నిర్ణయించింది. – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లో అధునాత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు గాను 42 ఎకరాలను అప్పగించాలని తీర్మానించింది. ‘స్కిల్స్’ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్లు – రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. – ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి తెలిపారు. -
మరో రూ. 4 వేల కోట్ల అప్పు
సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్లను వేలం వేసి, రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణ సేకరణకు సిద్ధమైంది. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అప్పు తీసుకోనుంది. 30 ఏళ్ల కాలపరిమితితో 8.07 శాతం వడ్డీ చెల్లించే విధంగా రూ.2 వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో 7.97 శాతం వడ్డీ చెల్లించేలా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం తీసుకోనుంది.దీంతో గత నెలలో చేసిన రూ.6,900 కోట్ల అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాల మొత్తం రూ.10,900 కోట్లకు చేరనుంది. ఏప్రిల్ నెల ఏడో తేదీన రూ.3,900 కోట్లు, అదే నెల 21న రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఇప్పుడు మరో రూ.4 వేల కోట్లను తీసుకోనుంది. దీంతో పాటు ఈ నెల, వచ్చే నెల కలిపి మరో రూ.5,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీఐకి షెడ్యూల్ ఇవ్వడం గమనార్హం. -
మానసికంగా కుంగిపోయేలా.. ముందస్తు ప్రణాళిక?
హైదరాబాద్: హుసేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారాం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారమే భార్య రేణుక భర్తను మానసికంగా కుంగిపోయేలా చేసిందనే అనుమానాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రైవేటు వీడియోలు ఉద్దేశ్యపూర్వకంగానే భర్తకు చేరేలా చేశారనే అంశంపై కూడా విచారణ జరుగుతోందని తెలిసింది. ఇదిలా ఉండగా జనవరి 26నే రేణుక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భార్య అదృశ్యమైన విషయంపై సీతారాం.. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన ఉండేది కాదని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు మృతుడి భార్య రేణుక, నిందితుడు రమణారెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా.. డీజీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: డీజీపీ బా ధ్యతలు చేపట్టిన తర్వాత తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు సీవీ ఆనంద్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నవంబర్ నుంచి జనవరి నెలల్లో అనా రోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మంచానికే పరిమితమైనప్పటికీ కోలుకున్నారు. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. ఆమె ఎంతో సంతోషించారు. నేను కూడా అంతే..’ అంటూ కొన్ని ఫొటోలను సీవీ ఆనంద్ పంచుకున్నారు. -
ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్కు ఓ బాలిక కృతజ్ఞత
హైదరాబాద్: ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్న ఓ బాలిక నాటి మంత్రి కె. తారక రామారావు అందించిన సాయంతో కోలు కొని ప్రస్తుతం కొత్త జీవితం అనుభవిస్తోంది. హైదరాబాద్లోని ప్యారడైజ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్తో బాధపడగా ప్రైవేటు ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు రూ. లక్షల వైద్య ఖర్చు భరించడం సాధ్యంకాలేదు. ఆ కష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ చేసిన ట్వీట్కు స్పందించిన కేటీఆర్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శరణ్యకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారు. కాలక్రమంలో శరణ్య పూర్తిగా కోలుకొని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 384 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్ను తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించగలగడం నా అదృష్టం. శరణ్య ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు.. కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబంఆరేళ్ల క్రితం ఎక్స్ వేదికగా.. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తమ కుమార్తె శరణ్యను కాపాడాలని కేటీఆర్ను కోరిన ఫ్యామిలీఈ ట్వీట్కు వెంటనే స్పందించడమే కాదు.. ఆపరేషన్కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించిన… pic.twitter.com/KHdO3ONe2I— PulseNewsBreaking (@pulsenewsbreak) May 3, 2026 -
ఐఫోన్.. ఆవేశం.. విషాదం
హైదరాబాద్: ఐఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుద్భిగూడ ప్రాంతానికి చెందిన బక్కి ప్రియ (42)కు 20 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ముస్తాపూర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొత్తగా తీసుకొచ్చిన ఐ ఫోన్ను తన కజిన్కు భర్త ఇచ్చాడు. ఈ విషయంపై ఆదివారం ఉదయం భార్యాభర్తులు గొడవపడ్డారు. ఆవేశంలో ప్రియ ఇంట్లో ఉన్న చెదల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను కాచిగూడలోని సీసీ ష్రాఫ్ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు
హైదరాబాద్: బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు. వివాహమై రెండు నెలలు గడవక ముందే దంపతులు ఆత్మహత్య చేసుకోవటం మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సరదాగా ఉన్న కార్తీక్, మంజుల మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్ ఉదయం ఉరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.చదవండి: ఐఫోన్.. ఆవేశం.. విషాదం -
ధర లేకుండా టెండర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్, హాస్టల్ విద్యార్థులకు విద్యా సంవత్సరంలో అవసరమయ్యే వస్తువులను కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా టెండర్లు ఖరారు చేయగా.. ఈసారి రాష్ట్రస్థాయిలో ఒకే గొడుగు కింద కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నాణ్యత, సమయపాలన, సులభతర పర్యవేక్షణలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఈ టెండర్ల ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.అయితే ఎలాంటి ధరను ప్రకటించకుండా టెండర్లు పిలిచిన అధికారులు..గత నెల 17వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. ఇప్పటికే సాంకేతిక బిడ్లను పరిశీలించి అర్హత పొందిన కాంట్రాక్టర్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఆర్థిక బిడ్లో కాంట్రాక్టర్లు పేర్కొన్న ధరలను ప్రస్తుతం పీఎంయూ సమీక్షిస్తోంది. సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంయూ సభ్యులైన సంక్షేమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు కొనసాగుతోంది. అతిత్వరలో టెండర్లు ఖరారు చేసి, న్యాయశాఖ అనుమతి తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ధర ప్రకటించకుడా టెండర్లు పిలవడం చర్చనీయాంశమయ్యింది. ఏయే విద్యాసంస్థలు.. కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో దాదాపు పది రకాల విద్యాసంస్థలున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎంఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఆర్ఈఐఎస్), కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు వీటిలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 9,24,107 మంది విద్యార్థులున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏయే వస్తువులు... కామన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, సాక్స్, బ్యాగ్, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు, రగ్గులు, దుప్పట్లు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్, ట్రాలీబ్యాగ్స్, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్ తదితర 22 రకాల వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. ధర ఏది మరి? ఆయా వస్తువుల నాణ్యత, పరిమాణం తదితర పూర్తి వివరాలు, పక్కా కొలతలతో కూడిన డిమాండ్ను టెండర్లో పొందుపర్చారు. కానీ ఆయా వస్తువులకు సంబంధించి కనీస ధరను మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. సాధారణంగా టెండర్లో ఒక ధరను నిర్దేశించి అందుకు అనుగుణంగా బిడ్లు స్వీకరిస్తారు. తర్వాత అందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎంపిక చేస్తారు. కానీ అధికారులు భారీఎత్తున వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. టెండర్ పత్రాల్లో ఎక్కడా ప్రాథమిక ధరలు స్పష్టం చేయలేదు. దీన్ని ఆసరా చేసుకున్న కాంట్రాక్టర్లు ఏకమై ఇష్టమొచి్చన ధరలతో బిడ్లు సమర్పించారనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక కాంట్రాక్టర్లకు చెక్ గతంలో డీపీసీల కాంట్రాక్టర్లను ఎంపిక చేసినప్పుడు దళితులు, గిరిజనులకు 25 శాతం కోటా ఉండేది. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు ఇది ఒక మంచి అవకాశంగా ఉండేది. కానీ ప్రస్తుత విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకించి రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. కానీ టెండరు ప్రక్రియలో పాల్గొనే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సరి్టఫికెట్ (ఆర్థిక బలనిరూపణ) సమరి్పంచాలనే నిబంధన విధించారు. నోట్బుక్స్ టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్ రూ.40 కోట్ల, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ల కాంట్రాక్టర్ రూ.25 కోట్ల మేర, స్కూల్బ్యాగ్, షూ, సాక్స్, టై, బెల్ట్ పంపిణీ చేసే కాంట్రాక్టర్ రూ.50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ సమరి్పంచాలి. అలాగే ఐడీకార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్ కాంట్రాక్టులో రూ.20 కోట్ల మేర, ట్రాలీ బ్యాగ్ కాంట్రాక్టుకు సంబంధించి రూ.2 కోట్లు, ట్రంక్బాక్స్ కాంట్రాక్టుకు సంబంధించి రూ.10 కోట్ల మేర, యూనిఫామ్ క్లాత్ కాంట్రాక్టులో రూ.25 కోట్ల సాల్వెన్సీ సరి్టఫికెట్ సమరి్పంచాలి. ఇలా ప్రతి కేటగిరీలోనూ కోట్ల రూపాయలమేర కమర్షియల్ బ్యాంకుల నుంచి సాల్వెన్సీ సరి్టఫికెట్లు సమర్పించడం ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు సాధ్యమయ్యే విషయం కాదు. మరోవైపు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈలకు సైతం అత్యంత కష్టసాధ్యం కావడంతో వీరంతా ఈ కామన్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టుకు దూరంగా ఉండిపోయారు. వస్తువుల ధరలకు సంబంధించి వివరణ కోరేందుకు పీఎంయూలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ సెక్రెటరీని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్ వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెన్నుపోటు పొడిచేందుకే ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేలా చీకటి జీఓ నం.7ను తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. విద్యను విధ్వంసం చేసేందుకే ఆ శాఖను నీ దగ్గర పెట్టుకున్నావా?.. కేసీఆర్ స్కీంలకే కాదు.. వైఎస్ఆర్ పథకాలకు పాతరేస్తావా..? అంటూ రేవంత్ను నిలదీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. దుర్మార్గమైన జీఓను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 7ను వెనక్కి తీసుకోకుంటే 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. క్షమించరాని పాపం ‘రెండున్నరేళ్ల అసమర్థ పాలనలో విద్యావ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేలా మీరు కుట్ర చేస్తున్నారు. జీఓ 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. పిల్లల భవిష్యత్తు కోసం కలలుగంటున్న తల్లిదండ్రుల ఆశలపై మీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా కేసీఆర్ కూడా కొనసాగించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్కు గ్రహణం పట్టింది. జీఓ 7 వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమవేస్తామంటే ఎవరు నమ్ముతారు’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. -
ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదికను 4 సంపుటాలుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనాభా దామాషా ప్రకారం సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తోందా? అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయిన కులాలు ఏవి? వంటి కీలక అంశాలు ఇందులో బహిర్గతమవుతాయని చాలామంది ఎదురు చూశారు. సర్వే ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సైతం పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలను ఈ నివేదికలో పొందు పరిచిన ప్రభుత్వం కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 56 రకాల ప్రశ్నలకు సమాచారం సేకరించినా.. సర్వేలో భాగంగా 56 రకాల ప్రశ్నలకు సమాధానాలను ప్రభుత్వం ప్రజల నుంచి సేకరించింది. రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభా సర్వేలో పాల్గొని ప్రభుత్వం కోరిన వివరాలను అందించింది. మొత్తం 242 కులాలు, ఉపకులాల వారితో పాటు ఏ కులానికి చెందనివారు కూడా వీరిలో ఉన్నారు. దాదాపుగా 4 శాతం మంది తాము ఏ కులానికి చెందని వారిగా పేర్కొనగా, మిగిలిన వారు తమ కులం, ఉపకులం వివరాలు ఇచ్చారు. – 46వ ప్రశ్న కింద కుటుంబంలోని వ్యక్తుల రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కుటుంబంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసినవారు ఉన్నారా? ప్రస్తుతం/గతంలో ప్రజాప్రతినిధిగా సభ్యత్వం పొందారా? ప్రస్తుతం/గతంలో మంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, తదితర ఆఫీస్ బేరర్ పదవుల్లో పనిచేశారా? ఎన్ని దఫాలు పనిచేశారు? ప్రజాప్రతినిధిగా మొత్తం ఎన్నేళ్లు పనిచేశారు? వంటి వివరాలను నమోదు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే 242 కులాలు, ఉప కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం కలిగి ఉన్న కులాలు, ఉప కులాలు ఏవి? వాటి జనాభాతో పోల్చితే ప్రాతినిధ్య నిష్పత్తి ఎంత? ఏ కులాలు, ఉప కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి? వంటి అంశాలపై స్పష్టత వచ్చేది. ప్రధానంగా రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప కులాలు ఏవో తెలిసిపోయేది. – నివేదిక రెండో సంపుటిలో రాజకీయ ప్రాతినిధ్యంపై సంక్షిప్త సమాచారాన్ని మాత్రం పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రామ, మండల స్థాయి ఎన్నికలు, బహిరంగ సభలు, ఫిర్యాదుల వేదికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల స్థాయి కమిటీలు, కుల సంఘాలు, సంక్షేమ కమిటీలు, కుల సంఘాలు వంటి రాజకీయ కార్యకలాపాల్లో ఈ వర్గాలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంత రాజకీయాల్లో మాత్రం ఓసీలు, ఓబీసీల్లోని ఉన్నతవర్గాలు పట్టణ స్థానిక సంస్థలతో పాటు పార్టీ నాయకత్వ పదవుల్లో అధిక ఉనికి కలిగి ఉన్నాయని పేర్కొంది. ఆ సమాచారం ఉపయోగించలేదు? కులాలు, ఉప కులాల వారీగా రాజకీయ నేపథ్యానికి సంబంధించి సర్వేలో సేకరించిన సమాచారాన్ని నివేదిక తయారీలో వినియోగించలేదని ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సర్వేలో ఇందుకు సంబంధించిన సరైన సమాచారం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన ప్రశ్నలు కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి సరిపోలేదని స్పష్టం చేశారు. అయితే అస్పష్టత, గందరగోళాన్ని నివారించడానికే ఈ గణాంకాలను నివేదికలో బహిర్గతం పర్చలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వే నివేదిక తయారీలో పాల్గొన్న స్వతంత్ర నిపుణుల బృందంలోని సభ్యుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా కులాల వారీ రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవచ్చని, ఉప కులాల ప్రాతినిధ్యం తెలుసుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాజకీయ పారీ్టలే తమ పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ఉపకులాల వారీగా ఇస్తున్న ప్రాతినిధ్యాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
ఆదాయం పెంపు ఎజెండాగా..
సాక్షి, హైదరాబాద్: అనివార్య ఖర్చులు, నెలనెలా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తట్టుకుని నిలబడేందుకు అవసరమైన ఆదాయ మార్గాలపై చర్చ ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికపైనే చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపునకు గ్రీన్సిగ్నల్ లభించనుందని సమాచారం.భూముల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియను రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసిన నేపథ్యంలో మంత్రివర్గం ఆమోదిస్తే ఈనెలలోనే, లేదంటే జూన్1వ తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు రుణాల రీస్ట్రక్చర్ కోసం కేంద్రానికి చేయాల్సిన ప్రతిపాదనలు, రాబడి శాఖల్లో లీకేజీలను అరికట్టడం లాంటి అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనుంది.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.14 వేల కోట్ల బకాయిల విషయంలోనూ ఓ రోడ్మ్యాప్ తయారు చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విషయంలో ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గం ఓ కార్యాచరణ రూపొందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం.. తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. -
మెండోరా.. ఎండలు మండేరా
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: వేసవి ఎండలతో రాష్ట్రం అగ్నిగుండంలా మండుతోంది. దీంతో ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరలో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రానున్న రెండ్రోజులు కూడా వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వడదెబ్బ తగిలి నల్లగొండ జిల్లాలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని సంగారం గ్రామానికి చెందిన మాతంగి మదారు, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు మాతంగి విక్రం (16)గా గుర్తించారు. -
ఉత్తర ‘రింగు’.. రైట్ రైట్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. భారీ జాప్యం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఉత్తర భాగం బడ్జెట్కు ఆమోదముద్ర వేసి, అనుమతులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 8 నెలలుగా పెండింగులో ఉన్న టెండర్లను తెరిచేందుకు మార్గం సుగమం అయ్యింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ, రోడ్డు నిర్మాణానికి వీలుగా ఎలాంటి పురోగతి లేక ప్రాజెక్టు దాదాపు ఏడాదిగా పెండింగులో ఉంది. భారీగా పెరిగిన బడ్జెట్ తొలుత రూ.15 వేల కోట్లతో 161.518 కి.మీ. నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్టు అంచనాలు రూపొందించినప్పటికీ, తాజాగా పీపీపీఏసీ ఏకంగా రూ.23,935.60 కోట్ల బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. అంటే అంచనాలు దాదాపు రూ.9 వేల కోట్ల మేర పెరిగిపోయాయి. కాగా మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జాప్యం జరిగితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే దక్షిణ భాగం నిర్మాణానికి రూ.35 వేల కోట్ల వ్యయమయ్యే అవకాశం కన్పిస్తోంది. దక్షిణ భాగం విషయంలో ఇంకా అలైన్మెంటు కూడా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 208 కి.మీ.తో ఓ అలైన్మెంటును రూపొందించినా, ఎన్హెచ్ఏఐ దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఖరారై డీపీఆర్ సిద్ధమైతే వ్యయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భాగం రెండు ప్యాకేజీలుగా.. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం మొత్తం నిడివి161.518 కి.మీ.లు. తొలుత 8 వరసలతో నిర్మించాలని భావించినప్పటికీ, 6 వరసలకే ప్రస్తుతం కేంద్రం పరిమితం చేసింది. దీనిని రెండు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ప్యాకేజీ–1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు (83.518 కి.మీ) నిర్మిస్తారు. ప్యాకేజీ–2 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి–భువనగిరి జిల్లా తంగేడ్పల్లి గ్రామం వరకు (78 కి.మీ.లు) వరకు నిర్మిస్తారు. 90 మీటర్ల వెడల్పే.. తొలుత 8 వరసల రోడ్డుగా ప్రతిపాదించడంతో ఎన్హెచ్ఏఐ 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంటును రూపొందించి, 1,933 హెక్టార్ల భూమి కావాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు భూమిని అప్పగించింది. తర్వాత రోడ్డును 6 వరసలకే కుదించటంతో, ఇప్పుడు 90 మీటర్ల వెడల్పు అలైన్మెంటు సరిపోతుందని కేంద్రం తేచ్చింది. మిగిలే 10 మీటర్ల అలైన్మెంటు భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ వినియోగానికి అప్పగించాలని నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ఉత్తర భాగం కోసం పీపీపీ, బీఓటీ నిర్మాణ పద్ధతులను పరిశీలించి చివరకు హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ను ఎంపిక చేశారు. కేంద్రం 40% నిధులు నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా, 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోనుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి ఎన్హెచ్ఏఐ ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే. -
హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్!
ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా. ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు. ఉద్యోగం చేసే చోట సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు. మరి స్వేచ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్ చూపెడుతున్నప్పుడు అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన నోట్ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొందుపరిచాడు. డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని, కారు డోర్ను నెమ్మదిగా మూయాలని కోరాడు. మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు. ఇది హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ నోట్గా తెలుస్తోంది. హైదరాబాద్ క్యాబ్లు వెనుకాడవు అనే క్యాప్షన్తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్’లో ఆ నోట్ను ఫోట్ తీసి పోస్ట్ చేశాడు. ఇది వైరల్గా మారిన వైనంలో వార్త అయ్యింది. Hyderabad cabs do not hesitate pic.twitter.com/oWuJUtwRkB— Aman (@AmanHasNoName_2) May 2, 2026 -
అక్షర యోధులకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్: పగలూ రాత్రీ తేడా లేకుండా కాలంతో పరుగులు పెడుతూ పనిచేయాల్సి వచ్చే కఠోరశ్రమతో కూడుకున్న రంగం జర్నలిజం అని.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఆదర్శాలు, విలువలతో వచ్చి, ఆచరణలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.‘హైబిజ్ టీవీ’ మీడియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒకప్పుడు అలా కష్టాలు అనుభవించినవాణ్ణే. అయితే, ప్రగాఢమైన అభిరుచితో వదలకుండా కృషి చేస్తే గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఇవాళ మీడియా ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా ఉందన్నారు.జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు లోతుగా ఆలోచించి, మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అందుకు ప్రభుత్వం ఓ వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు దశాబ్దాల క్రితమే చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, “1992లో హైదరాబాద్లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేసిందే... మా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు మేము చేస్తున్న మంచి పనులను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నాం. అంతెందుకు... మా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అనుకూల, క్రియాశీలక విధానాల వల్ల గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కమర్షియల్ స్పేస్ నూటికి నూరుపాళ్ళు నిండిపోయింది.అలాగే, గత రెండేళ్ళలో ప్రతి 3 రోజులకు ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (‘జీసీసీ’ - ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో విదేశీ సంస్థల తాలూకు అనుబంధ సంస్థలు భారత్లో రావడం) హైదరాబాద్లో నెలకొనడం జరిగింది. ఒక్క గత ఏడాదిలోనే 70 జీసీసీలు వచ్చాయి. అలాగే, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామం ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్తో అనుసంధానమైంది. ఎక్కడికైనా సెకనులో వెయ్యో వంతులో సమాచారాన్ని పంపే వీలు కలిగింది. ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పరాకాష్ఠ” అని శ్రీధర్ బాబు వివరించారు.శనివారం అట్టహాసంగా సాగిన ఈ మీడియా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ అధ్యక్షుడు – రాజ్యసభ మాజీ సభ్యుడు వివేక్ గుప్తా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘లైఫ్ స్పాన్’ అధినేత నరేంద్ర రామ్ నంబుల, ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి, అలాగే ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు.2026కు గాను నిర్వహించిన తాజా అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల కుటుంబాలలోని ప్రతిభావంతులైన పిల్లల చదువులకు ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయల చొప్పున హైబిజ్ టీవీ - లైఫ్ స్పాన్ సంస్థలు ఆర్థికంగా చేయూత అందించడం విశేషం. అలా తమ ప్రతిభతో స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల్లో ఏ. వికాస్ గౌడ్ (97.02% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణుడు), ఏ. స్రవంతి (ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని), ఎన్. సమీక్ష (97.10% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి)..ఎస్. అనుశ్రిజ (బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని), ఎస్. అశ్వంత్ కుమార్ (97% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి), టి. తరళశ్రీ (97% మార్కులతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పూర్తి), ఎస్. సిరి (97.1% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), ఇ. వినీత్ (98% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), సహస్ర (ఇంటర్మీడియట్ పూర్తి), హెచ్. సాయి కిరణ్ (పదో తరగతి పూర్తి) తదితరులున్నారు. ఉపకార వేతనాల చెక్కును మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం, ఆ కుటుంబాల సంతోషంతో సభావేదిక కళకళలాడింది.‘హైబిజ్ టీవీ - మీడియా అవార్డ్స్ 2026’లో భాగంగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఐదుగురికి ‘లెజెండరీ పురస్కారాలు’ అందజేశారు. ఈ ‘లెజండరీ పురస్కారాలు’ అందుకున్న వారిలో... జాతీయ జర్నలిస్టు భూపేంద్ర చౌబే (మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్ఎన్ - న్యూస్18, ఇండియా ఎహెడ్, ఎన్డీ టీవీ), తెలుగువారైన వెటరన్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు (ఆలిండియా రేడియో), ఆంగ్ల పత్రికా ప్రపంచంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సీహెచ్. సుశీల్ రావు (టైమ్స్ ఆఫ్ ఇండియా - దక్కన్ క్రానికల్), పలు మీడియాల్లో ప్రసిద్ధురాలైన సి. మృణాళిని, ప్రకటనల రంగంలో విస్తృత సేవలు అందించిన శ్రీనాథ్ అయ్యర్ (హిందూ, హిందుస్థాన్ టైమ్స్) ఉన్నారు.ఈ సందర్భంగా భూపేంద్ర చౌబే మాట్లాడుతూ, “ఒక రకంగా ఇవాళ జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ భాషల్లోని మీడియాయే చాలా శక్తిమంతంగా ఉంది. అదే సమయంలో, రానున్న రోజుల్లో మీడియా సంస్థల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం ఎక్కువ కానుంది” అని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ నగరంలో ఓ తెలియని ఆత్మీయత ఉంది. నేను యూపీకి చెందినవాడిని అయినప్పటికీ, తెలుగు భాష, తెలుగు సినిమా, తెలుగు సంగీతం అంటే మక్కువ ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ అవార్డుల ఉత్సవానికి అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టెస్ట్ మ్యాచ్ల నుంచి వన్డేలు, 50 ఓవర్లు, ఇప్పుడు టీ20లకు క్రికెట్ మారినట్టే... కాలంతో పాటు మీడియా సైతం ఎంతో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా... ఏ రంగంలోనైనా గుర్తింపు అనేది మరింత శ్రమించడానికి ప్రేరణనిస్తుంది. దాదాపు 20 ఏళ్ళు యూత్ లీడర్గా ఎన్.ఎస్.యు.ఐ లాంటి వాటిలో నిరంతరం పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అదే విధంగా మీడియా మిత్రులు తమ రంగంలో మరింత కృషి చేయడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.అందుకు తగ్గట్టే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కేటగిరీలో కలిపి 60 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులను ‘హైబిజ్ టీవీ’ మీడియా పురస్కారాలతో సత్కరించింది. లోతైన పరిశోధనతో ఎన్నో విశేషాలను వెలికితీసి, తెలుగు సినీ రంగ చరిత్రను అక్షరబద్ధం చేయడంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తూ, గతంలో ప్రభుత్వ నంది, గద్దర్ అవార్డులను అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ – రచయిత డాక్టర్ రెంటాల జయదేవను “తెలుగు సినీ చరిత్రకు ఉత్తమ డాక్యుమెంటేషన్ చేస్తున్న అరుదైన జర్నలిస్టు”గా గుర్తించి, అవార్డుతో గౌరవించింది. జయదేవను మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి, ఉత్తమ ‘తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం’గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన రచన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం గురించి తెలుసుకున్నారు.‘సాక్షి’ మీడియా గ్రూపు నుంచే మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలలో బొంబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గుండాల శ్రీనివాసరావు (ప్రింట్ స్పెషల్ జ్యూరీ- అప్ కంట్రీ), అలాగే ప్రకటన, మార్కెటింగ్ రంగాలకు చెందిన శ్రీనివాస్ (ఎడ్యుకేషన్ స్పెషల్స్), వెంకటేశ్ (రిటైల్ యాడ్స్), వేణు (ఇంజనీరింగ్ కాలేజెస్) ఉన్నారు.ఇక, వ్యవసాయ రంగంపై విశేష కృషి చేస్తున్న అంకితభావం గల జర్నలిస్ట్ వలేటి గోపీచంద్ (ఆకాశవాణి), సినీ రంగ పాత్రికేయానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చల్లా శ్రీనివాస్ (జ్యోతి), ఎడిటోరియల్ విభాగంలో సీనియరైన భాస్కర్ తాటికొండ (హన్స్ ఇండియా), పొలిటికల్ రిపోర్టింగ్లో సీనియరైన గూడ ఆంజనేయులు గౌడ్, టీవీ రంగంలో పాపులరైన కాట్రగడ్డ అజిత (99 టీవీ), న్యూస్ యాంకర్లు స్వర్ణ రోజా (రాజ్ టీవీ), అపర్ణ (వి6), వినోదరంగంలో పేరు తెచ్చుకున్న టీవీ జర్నలిస్ట్ తారక్ (ఎన్టీవీ), టీవీ రిపోర్టర్ సత్యనారాయణ, ప్రింట్ జర్నలిస్ట్ పి. జగదీశ్వర్ (నవ తెలంగాణ), అలాగే మంగుమూరి శ్రీనివాస్, వి. సురేశ్ తదితరులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.విసుగూ, విరామం లేకుండా విజేతలందరికీ మంత్రే స్వయంగా అవార్డులు అందించడం గమనార్హం. అవార్డు అందుకున్న విజేతలందరూ తమ సంతోషం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి ‘హైబిజ్ టీవీ’ తగిన గుర్తింపునిచ్చిందనీ, ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తోందనీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి మీడియా అవార్డ్స్ విజేతలకు ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలు సైతం అందించేందుకు ‘క్రెడాయ్’ ముందుంటుందని ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి ప్రకటించడం విశేషం. “హైదరాబాద్ నగరంలోని ఈ ప్రాంతం (హైటెక్ సిటీ)లో స్థిరాస్తి విలువ గత పాతికేళ్ళలో వంద రెట్లు పెరిగింది. కేవలం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదీ అతి తక్కువగా కేవలం 12.5 శాతమే ఉన్నది స్థిరాస్తి రంగమే. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే స్థిరాస్తుల రంగంపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేలా మీడియా మరిన్ని కథనాలు అందించా”లని జైదీప్ రెడ్డి అభ్యర్థించారు.విజేతలను ఎంపిక చేసిన విశేష అనుభవజ్ఞుల బృందం పక్షాన సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ గత ఆరేళ్ళ అవార్డుల ప్రస్థానాన్ని వివరించారు. “మీడియా రంగంలో అందరికీ తెలిసేది జర్నలిస్టులే. కానీ, అడ్వర్టయిజింగ్, సర్క్యులేషన్ వారు ఈ పరిశ్రమలో అన్ సంగ్ హీరోస్” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘సాక్షి’ మీడియా గ్రూప్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, మార్కెటింగ్ విభాగంలో ఉన్నత పదవి నిర్వహించిన రమణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయి శేఖర్, ‘మిసిమి’ సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక అధిపతి – ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘ఆలిండియా రేడియో’ విశ్రాంత ఉన్నతోద్యోగి సి.ఎస్. రాంబాబు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, ‘హైబిజ్ టీవీ’కి చెందిన సుశిక్షితులైన సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆర్ఆర్టీఎస్.. మెట్రో రైలా?
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్).. మెట్రో రెండో దశకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంతో వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును హైదరాబాద్లో చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో కంటే ఆర్ఆర్టీఎస్ ఎక్కువ వేగంతో పరుగులు తీస్తోంది. ప్రయాణికులకు హైస్పీడ్ రైల్ అనుభూతిని అందజేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగానే ప్రభుత్వం మొదటి దశ ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసింది. కానీ.. ప్రస్తుత మెట్రో కంటే ఢిల్లీ నుంచి మీరట్కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్ఆర్టీఎస్ తరహాలో హైదరాబాద్లో నిర్మించాలని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించిన రెండో దశ డీపీఆర్లకు అనుమతి లభిస్తుందా లేక, ఆర్ఆర్టీఎస్కే కేంద్రం కట్టుబడి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మెట్రో రెండో దశకు భారీ వ్యయం.. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్,(36,8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ, ) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు (13.4 కి.మీ.),ఎల్బీనగర్–హయత్నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ వరకు.. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ (22 కి.మీ.), జేబీఎస్– శామీపేర్పేట్ (22కి.మీ,) కారిడార్లలో మరో 86.1 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.48 వేల కోట్లు.. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదటి దశ కొనుగోలు కోసం వెచి్చంచే సుమారు రూ.15000 కోట్ల వ్యయంతో కలిపి రూ.63000 కోట్లకు చేరనుంది. మెట్రో రెండో దశకు అవసరమైన నిధులను జైకా,ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కేవలం 2 శాతం వడ్డీకి నిధులను సేకరించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమికంగా జైకాతో ఒప్పందం కూడా ఏర్పడింది. కేవలం రూ.48000 కోట్లతో 192.2 కి.మీ వరకు ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపట్టవచ్చని కేంద్రం ప్రతిపాదిస్తోంది. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. పటాన్చెరు–లక్డీకాపూల్– ఆరాంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్– హయత్నగర్, ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్ట్–ఫ్యూచర్సిటీ, జేబీఎస్–మేడ్చల్, జేబీఎస్– శామీర్పేట్ రూట్లలో ఆర్ఆర్టీఎస్ చేపట్టాలని మెట్రోరైల్ సంస్థకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. కానీ.. ప్రతిపాదిత ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ పేర్కొంది. అయితే.. భూగర్భ కారిడార్లను నిర్మించి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు భిన్నంగా మెట్రో నిర్మాణ దిశగానే రాష్ట్రం ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువే.. ప్రస్తుతం మెట్రో రైళ్లు గంటకు గరిష్టంగా 80 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఆర్ఆర్టీఎస్ రైళ్లు గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఈ రైళ్లు యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ఈటీఎస్సీ) సిగ్నలింగ్ వ్యవస్థతో నడుస్తాయి. ఇది మెట్రో రైళ్లలో వినియోగించే సిగ్నలింగ్ వ్యవస్థ కంటే అత్యాధునికమైనది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 82.15 కి.మీ మార్గంలో ఆర్ఆర్టీఎస్ నడుస్తోంది.‘నమో భారత్’ పేరుతో ఈ రైళ్లను నడుపుతున్నారు. -
ఏం కష్టం వచ్చిందో..!
హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28)కు గత మార్చి 8న ప్రశాంత్నగర్ రాజీవ్గాంధీ నగర్కు చెందిన మంజుల ఎలియాస్ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది. కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచి్చంది. అనంతరం ప్రశాంత్నగర్లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచి్చంది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్ తలుపుపై ఉన్న వెంటిలేటర్కు వైర్తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్పై నోట్లో నురగలతో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. -
‘ఫాస్ట్’గా అనర్థాలు
సాక్షి, హైదరాబాద్: ఫాస్ట్, జంక్ ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్)తో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. యూపీఎఫ్లను అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ మరణాల ప్రమాదం 50 శాతం పెరగడంతోపాటు గుండెపోటు, పక్షవాతం, ఆంజైనా వంటి అధిక ముప్పు కూడా పొంచి ఉంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న వారిలో మరణాల రేటు 21 శాతం పెరగడంతోపాటు ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు తలెత్తుతున్నట్లు వెల్లడైంది. కొన్ని రకాల కేన్సర్లతో ముడిపడి ఉన్నట్టు కూడా ఆధారాలున్నాయి.ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉండటంతోపాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), ఇతర సమస్యలకు మూలంగా దీనిని భావిస్తున్నారు. భారత్లో యూపీఎఫ్లు ప్రత్యక్షంగా ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని 2025–26లో నిర్వహించిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత వైద్య విద్యార్థులపై 2025లో జరిపిన ఒక అధ్యయనంలో... 87.2% మంది అధిక మొత్తంలో యూపీఎఫ్లను వినియోగిస్తున్నారని , దీనివల్ల వారిలో ఒత్తిడి పెరిగిందన్న విషయాన్ని కనుగొన్నారు. యూపీఎఫ్లు ఇవీ.. బ్రెడ్డు, చిప్స్, చక్కెర కలిపిన పానీయాలు, సోడాలు, ప్యాక్ చేసిన కేకులు, స్నాక్స్, ఇన్స్టంట్ మీల్స్, నగ్గెట్స్, హాట్ డాగ్లు, బేకన్, డెలి మీట్స్ తదితరాలు ఏ అధ్యయనం ఏం చెప్పిందంటే... ⇒ కేంద్రప్రభుత్వ ఎకనమిక్ సర్వే 2025–26: భారత్లో ఊబకాయం పెరుగుదలకు యూపీఎఫ్ను ప్రధానకారణంగా గుర్తించింది. ఈ ఉత్పత్తుల ధరలను అత్యధిక జీఎస్టీ స్లాబ్లో పెట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలని సిఫార్సు చేసింది. ⇒ ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్లైన్స్–2026: యూపీఎఫ్లో ముఖ్యమైన న్యూట్రియెంట్స్ లేవని, ఆరోగ్యానికి హానికరంగా పరిణమించే ఎమల్సిఫైర్స్, స్టెబిలైజర్స్ వంటివి ఉన్నాయంది. ⇒ లాన్సెట్ అధ్యయనం 2026: యూపీఎఫ్లు టైప్ 2 డయాబెటీస్కు, కుంగుబాటుకు, గుండె సంబంధిత జబ్బులకు కారణమవుతున్నట్టు ఆధారాలు లభించాయని చెప్పింది. ⇒ డబ్ల్యూహెచ్వో సౌత్–ఈస్ట్ ఏషియా రిపోర్ట్: భారత్లో యూపీఎఫ్ల వినియోగం ఏటా 13.3 శాతం పెరుగుతోందని, అత్యవసరంగా ప్రభుత్వ విధానాలను సవరించి ఫ్రంట్–ఆఫ్ ప్యాకేజీలపై హెచ్చరికల లేబుళ్లు ప్రచురించాలని సూచించింది. ⇒ సేపీయన్ ల్యాబ్స్–2026: భారత్లో 44 శాతం యువత (18–34 ఏళ్లలోపు వారు) యూపీఎఫ్లు రెగ్యులర్గా తింటున్నారు. ఇది మెదడు ఆధారిత మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపడానికి లంకె ఉన్నట్టుగా తెలిపింది.ఇంటి ఆహారం బెస్ట్..ముఖ్యంగా అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్య కొవ్వు, ఇతర పదార్థాలు ఓవర్లోడ్ అయ్యి కాలేయంపై ప్రతికూల ప్రభావంతో ఫ్యాటీలివర్, ఇన్ఫ్లమేషన్తో కాలేయ దీర్ఘకాలిక డ్యామేజీకి దారితీస్తుంది. ఈ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే ఆస్తమా, వీజింగ్, క్రానిక్ బ్రాంకైటిస్, సీవోపీడీ, స్లీప్ ఆప్నియాకు దారితీస్తాయి. ఇవి స్కూల్ పిల్లలు మొదలుకుని పెద్దవారిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి.పిల్లల్లో ఎదుగుదల సమస్యలతోపాటు అన్నివర్గాల వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. వీటికంటే కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, ప్రొటీన్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. షుగరీ డ్రింక్స్కు బదులు మంచినీళ్లు తాగాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుళ్లపై చక్కెర, ఉప్పు, ట్రాన్స్ఫాట్, ఇతర పదార్థాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామాలు, మంచినిద్ర తదితరాల ద్వారా కాలేయం, గుండె, శ్వాసకోశాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద -
నిమిషం లేటైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దీనిని ఈ నెల 11వ తేదీ వరకూ రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ ఉంటుంది. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈఏపీసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ సెట్కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు కీలక సూచనలు⇒ ఉమ్మడి ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఉదయం సెషన్లో పరీక్ష ఉన్న వాళ్లు 7.30 గంటలకు, సాయంత్రం సెషన్లో పరీక్ష ఉంటే మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ⇒ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులకు బయో మెట్రిక్ పరీక్ష ఉంటుంది. కుడిచేతి బొటన వేలి ముద్ర తీసుకుంటారు. దీంతో పాటు ఫొటో కూడా పరిశీలిస్తారు. ⇒ చేతులకు మెహిందీ, టాటూస్, ఇంక్ ముద్రలు ఉంటే పరీక్ష కేంద్రానికి అనుమతించరు. బ్లాక్ లేదా బ్లూ పెన్, హాల్ టికెట్, గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ను దృష్టిలో ఉంచుకుని చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ క్యాలిక్యులేటర్, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, సెల్ఫోన్లు, చేతి గడియారాలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. -
గంట ముందే సెంటర్కు..
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ) ఆదివారం జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్–పేపర్ విధానం ద్వారా జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.రాష్ట్రంలో 73 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి విధానాలు అమలు చేస్తున్నారు. ఎల్రక్టానిక్ పరికరాలు నిషేధం: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష రాసేందుకు వచ్చేటప్పుడు అడ్మిట్ కార్డ్, ఫొటో ఐడీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందే హాజరు కావాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. ఫుల్హ్యాండ్స్ దుస్తులు, షూస్ ధరించరాదు.ట్రాన్స్పరెంట్ పెన్ మాత్రమే అనుమతిస్తారు. మెటల్ వస్తువులు, ఆభరణాలు నిషేధం. ఇక అమ్మాయిలు హెయిర్పిన్లు, క్లిప్లు, మెటల్ రబ్బర్ బ్యాండ్లు ధరించి వస్తే అనుమతించరు. పెద్ద చెవిపోగులు, గొలుసులు, బంగారు ఆభరణాలు ధరించరాదు. హైహీల్స్, అలంకరణలున్న షూస్ నిషేధం. సాధారణ చెప్పులు/శాండల్స్ మాత్రమే ధరించాలి. ముసుగు లేదా సంప్రదాయ దుస్తులు ధరించే వారు ముందుగా రిపోర్ట్ చేయాలి. అదనపు తనిఖీ జరుగుతుంది. మేకప్ పరిమితంగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులు తీసుకురావొద్దు. పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు వేసవి కాలం కావడంతో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, విజిలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. పరీక్షను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
సాదాబైనామాలపై ‘కుస్తీ’
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్లు సాదాబైనామా దరఖాస్తులతో కుస్తీ పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించిన 9 లక్షలకు పైగా దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవడం, నియమ నిబంధనల్లో మార్పులు జరగడం, వీలున్నంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ముమ్మరమైంది. హైకోర్టు తీర్పు అనంతరం నిర్వహించిన పరిశీలన ప్రక్రియలో అమ్మకందారుని అఫిడవిట్తోపాటు నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి అఫి డవిట్ అవసరం లేదని, కొనుగోలుదారుడు మాత్రం అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధన మా ర్చింది. దీంతో గతంలో అమ్మకందారు కూడా అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనతో తిరస్కరించిన వాటితో సహా మొత్తం దరఖాస్తులను ఈసారి పున:పరిశీలిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే కొంత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అన్నీ.. రీఓపెన్ వాస్తవానికి, ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్చిన నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను గత నెల మొదటి వారంలో రెవెన్యూ శాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు సాదాబైనామాలను పరిష్కరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. అయితే, గతంలో అమ్మిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్ లేని వాటితోపాటు కొన్ని దరఖాస్తులను సాంకేతిక కారణాలతో కూడా తిరస్కరించారు. కొన్ని ప్రభుత్వ భూములు ఉండడం, కోర్టు కేసులు పెండింగ్లో ఉండడం లాంటి కారణాలతో ఈ దరఖాస్తులను తిరస్కరించారు. మార్గదర్శకాలు కొత్తగా వచ్చినా, ఇలాంటి దరఖాస్తులను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదు. కానీ, అన్ని దరఖాస్తులను పునఃపరిశీలన చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నింటినీ రీఓపెన్ చేశామని తహసీల్దార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం జరుగుతోందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు తుది నిర్ణయం కోసం కేవలం 20 శాతం లోపు దరఖాస్తులు మాత్రమే ఆర్డీఓలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సాదాబైనామా దరఖాస్తుల పూర్తిస్థాయి పరిష్కారానికి 3, 4 నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
ఆర్టీసీ @ ఎలక్ట్రిక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, ఇక సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో 3 వేల లోపు సంఖ్యలో మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. నగర జనాభా ప్రకారం దాదాపు 6 వేల బస్సులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బస్సుల సంఖ్యను కనీసం 5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి 2,300 బస్సులు మంజూరు చేసింది. ప్రస్తుతమున్న ఎలక్ట్రిక్ బస్సులతో కలుపుకొంటే మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలకు చేరుకుంటుంది. దీంతో మరో 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి అందుబాటులోకి కొన్ని సొంత బస్సులు విజన్ 2047 కోసం ఆర్టీసీ కూడా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో 2027 నాటికి గ్రేటర్ నగరం (ఔటర్ రింగురోడ్డు లోపల)లో ఆర్టీసీకి డీజిల్ బస్సులు ఉండకూడదన్నది లక్ష్యం. అంటే వచ్చే ఏడాది నాటికి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉంటాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని బస్సులు అందుతాయి. దీంతో అప్పటికి డీజిల్ బస్సులన్నింటిని ఔటర్ వెలుపలి డిపోలకు బదిలీ చేస్తారు. ఇక 2030 నాటికి జనాభా దామాషా ప్రకారం బస్సులను సమకూర్చుకోవాలన్నది రెండో లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో బస్సులను సమకూర్చుకుంటుండగా, అవి జనాభా దామాషా పద్ధతిలో కావాల్సిన సంఖ్యలో ఉండవు. దీంతో అదనంగా 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలన్నది ఆ లక్ష్యంలో భాగం. వేయి వరకు మినీ బస్సులు: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులన్నీ 9 మీటర్ల కంటే పొడవైన పెద్ద బస్సులు. ఇంత పరిమాణంలో బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు తిరగలేవు. పాత నగరంలోని రోడ్లపై మరీ కష్టం. దీంతో ఆయా ప్రాంతాల్లో తిరిగే విధంగా మినీ ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఆర్టీసీ బస్సులను మెట్రో రైలు సర్వీసులతో అనుసంధానించబోతున్నారు. మెట్రో రెండు దశ కూడా రాబోతున్నందున ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫార్ములాను అమలులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాలనీలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించాలి. అంటే కాలనీల్లో బస్సెక్కి మెట్రో స్టేషన్ వరకు వెళ్లేలా, మెట్రో రైలు దిగి బస్సెక్కి కాలనీల వరకు చేరేలా ఈ అనుసంధానం ఉంటుంది. మినీ బస్సులను ఇందుకు కూడా వాడాలన్నది ప్లాన్. వెరసి ఈ రెండు అవసరాలకు వేయి వరకు మినీ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు లోన్తో అనుసంధానం ఎలక్ట్రిక్ బస్సులు ఖరీదైనవి కావటంతో ఇంతకాలం ఆర్టీసీ సొంతంగా కొనటం కంటే అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవటం మెరుగైన విధానంగా భావిస్తోంది. భవిష్యత్లో మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలు తయారు కాబోతున్నందున ఎలక్ట్రిక్ బస్సుల ధరలు కూడా తగ్గనున్నాయి. దీనికి తోడు, మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం భారీగా రుణాలు పొందబోతోంది. మెట్రో రైలు ప్రాజెక్టులో ఆర్టీసీ బస్సులకు కూడా భాగస్వామ్యం ఉండనున్నందున, మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకునే రుణంలో కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కూడా వాడనున్నారు. ఉద్యోగాలకు భరోసా... ప్రస్తుతం జీసీసీ పద్ధతిలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు సంస్థలే సమకూరుస్తాయి. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి ఉంటారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని నగరం వెలుపలికి బదిలీ చేయనున్నారు. కొంతమందిని ఇతర అవసరాలకు వాడుకోనున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. భవిష్యత్లో ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, వెలుపలికి వెళ్లే సిబ్బంది తిరిగి నగరానికి వస్తారన్న భరోసాను ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తోంది. -
100 రోజులు.. 6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రిటైరైన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రానున్న వందరోజుల్లో కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీఈజేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్ హుస్సేన్, జి.సదానందంగౌడ్, చావ రవి, వి.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను జేఏసీ నేతలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ‘వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.6 వేల కోట్లు చెల్లిస్తాం. రెండో పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించా. అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం. జూన్ 1లోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలి’ అని చెప్పారు. ఉద్యోగుల కోసం చేస్తున్నాం... ‘ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలు గుతున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టింది’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదీ: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రభుత్వం చాలా వరకు పరిష్కరించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఉండకుండా చేస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. దీనిపై కసరత్తు చేసి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు పెన్షన్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదీ. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి మానవీయ దృక్పథంతో ఆలోచించారు. మీ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సీఎంకు నాయకుల కృతజ్ఞతలు సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాల పట్ల టీఈజేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గతంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 5న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతోపాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. -
ORR: నిలిపి ఉంచిన వాహనాలే మృత్యు శకటాలు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. దారుణాలకు ఇవీ కారణాలే.. 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ.. ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే ఆకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అదుపుతప్పిన అతివేగంతోనూ.. ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీసు లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్కమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. -
కాసేపట్లో దుబాయ్కి.. సినీఫక్కీలో అడ్డగింత
బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మహ్మద్ రాహీల్ ఆమిర్ చట్టవిరుద్ధంగా దుబాయ్కి వెళ్లడానికి ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహీల్ 2022 మార్చి 17న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 మీదుగా కారులో బయలుదేరాడు. కారు బెలూన్లు అమ్మే మహిళను ఢీకొట్టగా, ఆమె చేతిలోంచి చిన్నారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తన స్నేహితుడు అఫ్రాన్ కారు నడిపాడంటూ పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చాడు. ఆ తెల్లవారే దుబాయ్ పారిపోయాడు. ఆ రోజు కారు నడిపింది రాహీల్ అని పోలీసులు విచార ణలో తేలింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం రాహీల్ హైకోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ స్పష్టం చేసింది. దీంతో గత నెల 17న జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం దుబాయ్కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇమ్మి గ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసి అతడిని మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరోమారు రాహీల్ విచారణకు రాగా, దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. -
అత్తను చంపిన అల్లుడు
మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు అత్తను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ(39)కు ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న కుమార్తె కావ్య(19) గతేడాది కరీంనగర్ చందన్పూర్కు చెందిన కర్రు స్నేహిత్(28)ను ప్రేమ వివాహం చేసుకుంది. గత నెల 29వ తేదీ రాత్రి అరుణకు స్నేహిత్ ఫోన్ చేసి ‘బాసాన్లు తోమే నీ కూతురిని పెళ్లి చేసుకున్నా.. నేను పెద్ద కంపెనీలో ఆఫీసర్ని. నీ కూతురు చిన్న విషయాలకే అలుగుతుంది’ అని మాటలతో వేధించాడు. మరుసటిరోజు మధ్యాహ్నం అరుణ దుకాణానికని బయటకు వెళ్లి వస్తుండగా స్నేహిత్ ఆమెను తన బైక్పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటికే కావ్యకు ఫోన్ చేసి.. అత్తమ్మ ఫిట్స్తో కింద పడిందని, ఆసుపత్రికి తరలించానని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్న కావ్య.. స్నేహిత్ ప్రవర్తనలో తేడా ఉండటంతో వెంటనే చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలోని హనుమాన్ ఆలయ సమీప సీసీ ఫుటేజీలను పరిశీలించింది. స్నేహిత్ అరుణతో గొడవ పడి హెల్మెట్తో బలంగా కొట్టగా రన్నింగ్ బైక్ పైనుంచి ఆమె కిందపడినట్లు గుర్తించింది. తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదేరోజు అరుణ మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్లో శునకాల రక్తంతో వ్యాపారం..!
పంజగుట్ట/హిమాయత్నగర్: కుక్కల రక్తం విక్రయిస్తున్నవారిపై కఠినమైన చర్య తీసుకోవాలని ఆరుద్ర ఫర్ ఎనిమల్స్ అండ్ ఎని్వరాల్మెంట్ ఫౌండేషన్ డైరెక్టర్ హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్గా ఉంటూ జూబ్లీహిల్స్లో ప్రైవేట్ కుక్కల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడుపుతున్నారని, అతనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జంతు సంరక్షకుడు శివ మాట్లాడుతూ ఒక ప్రైవేట్ పెట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు తనతో కుక్కల రక్తం తీయించి 350 ఎంఎల్ బ్యాగ్ను రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముకునే వారని తెలిపారు. ఈ దారుణాలు చూడలేక ఉద్యోగం మానేసి అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. సదరు ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకుల నుంచి తనకు ప్రాణ భయం ఉందన్నారు. ఆరోపణలు అవాస్తవం ఇటీవల ‘శునకాల రక్తంతో వ్యాపారం’అని మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ కె.వెంకట్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద గతంలో పనిచేసిన కొందరు వ్యక్తులు హాస్పిటల్ను అప్రతిష్టపాలు చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. అధికారులు హాస్పిటల్ను తనిఖీ చేసి రక్తం విక్రయిస్తున్నట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. -
చెత్త లారీ ఢీ.. ర్యాపిడో డ్రైవర్ మృతి
హైదరాబాద్: చెత్త లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి (35) ర్యాపిడో రైడర్. కొంతకాలంగా హయత్నగర్లోని కుంట్లూరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ర్యాపిడో రైడ్ రావడంతో తుర్కపల్లికి చెందిన కె.పౌల్ అనే వ్యక్తిని తన బైక్ ఎక్కించుకొని మహేంద్రాహిల్స్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. లాలాపేట మీదుగా వెళ్తుండగా చెత్తలోడ్తో జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. లక్ష్మారెడ్డి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అతడు ధరించిన హెల్మెట్ సైతం ముక్కలై, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కస్టమర్కు తీవ్ర గాయాలయ్యాయి. -
అతివేగం.. 6 ప్రాణాలు బలి
శంషాబాద్ రూరల్/ సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శంషాబాద్ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని సర్దార్నగర్కు చెందిన కొడెం శ్రీనివాస్ (40), సనత్నగర్లో నివాసముండే బొల్లి శివకుమార్(37) వరుసకు బావబామ్మర్దులు.శుక్రవారం తెల్లవారుజామున రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి సనత్నగర్ నుంచి శివకుమార్కు చెందిన వ్యాగనార్ కారులో యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత స్వర్ణగిరి ఆలయానికి వచ్చి సనత్నగర్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో ఔటర్ రింగు రోడ్డుపై పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.లారీ కిందకు దూసుకెళ్లిన కారు..అతి వేగంతో ఉన్న కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కిందకు దూసుకెళ్లిన కారును అతి కష్టం మీద వెనక్కి తీసి అందులోని ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన కొడెం శ్వేతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును శివకుమార్ నడుపుతున్నట్టు గుర్తించారు.లారీ ఆగిన ఐదు నిమిషాల్లోనేచౌటుప్పల్లోని రైస్మిల్లు నుంచి నూకల లోడుతో నంద్యాలలోని లిక్కర్ ఫ్యాక్టరీకి లారీ బయలుదేరింది. ఔటర్ మీద పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలోకి రాగానే లారీ బ్రేక్లైనర్లు మొరాయించడంతో డ్రైవర్ శ్రీనివాస్ గమనించి రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్ బ్రేక్లను పరిశీలిస్తుండగా.. క్లీనర్ లారీపై ఉన్న తాడును సరి చేస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు లారీని నిలపగా, ఐదు నిమిషాల తర్వాత కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్నట్టు లారీ డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు.మృతులు వీరే..బొల్లి శివకుమార్ (37), బొల్లి లాస్య అలియాస్ రెనికిండి రాజేశ్వరి (30) దంపతులు, వీరి కూతురు బొల్లి రిషిత (7)తో పాటు కొడెం శ్రీనివాస్(40), ఆయన కుమారులు కొడెం కృష్ణచంద్ర (13), కొడెం మాధవ్ (10) దుర్మరణం చెందగా, శ్రీనివాస్ భార్య శ్వేత (35) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది. శివకుమార్కు శ్వేత సోదరి అవుతారు.⇒ బొల్లి శివకుమార్ కామారెడ్డికి చెందిన లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాస్య హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఫుడ్ ఇన్స్పెక్టర్.⇒ కోడం శ్రీనివాస్ వేములవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరిగింది.ప్రమాద కారణాలు విశ్లేలిస్తున్నాం: డీసీపీ యోగేశ్గౌతంఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతం పరిశీలించారు. డ్రైవర్ అలసిపోవడంతో నిద్రలోకి జారి ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కారులో మరైదేనా సాంకేతిక సమస్యతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరిశీలన చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన కారుపై అతి వేగంతో కారు నడిపినట్టు రెండు చలాన్లు ఉన్నాయి.ఇదే ఆఖరి సెల్ఫీ..రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులంతా కలిసి చివరిసారిగా స్వర్ణగిరి దేవాలయం వద్ద సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ సెల్ఫీ వారి జీవితంలో చివరి ఫొటోగా మిగిలింది.కేటీఆర్ దిగ్భ్రాంతిఆరుగురు సిరిసిల్లవాసుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తాము అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడి
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణ, సాంకేతికత వినియోగంలో దేశంలో నంబర్వన్గా నిలిచిన తెలంగాణ పోలీస్ స్థానాన్ని నంబర్వన్గా కొనసాగించేందుకు కృషి చేస్తానని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ..నేర దర్యాప్తులో సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం మరింత పెంచుతామని చెప్పారు. మత్తు పదార్థాల కట్టడి, సైబర్ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సీవీ ఆనంద్ శుక్రవారం లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.తొలుత డీజీపీ కార్యాలయ సిబ్బంది నుంచి గౌరవ వందనం తీసుకున్నారు. డీజీపీ సతీమణి లలితా ఆనంద్, కుమారులు మిలింద్, నిఖిల్, కోడళ్లు ఐశ్వర్య, వాసంతి, మనుమరాలు మిషిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీవీ ఆనంద్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల కట్టడికి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మత్తు పదార్థాల కట్టడికి ప్రత్యేకంగా ఈగల్ను ఏర్పాటు చేశామన్నారు. అయితే కేవలం ఈ ప్రత్యేక విభాగాలే కాకుండా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సైతం సైబర్ నేరాలు, మత్తు పదార్థాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్తోపాటు విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోరోడ్డు ప్రమాదాల్లో మరణాలు, ట్రాఫిక్ చిక్కులు తగ్గించేలా, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసేలా, రోడ్ ఇంజినీరింగ్, ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై దృష్టి పెట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రకృతి విపత్తులు, భారీ అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో సహాయక చర్యల్లో సమన్వయం పెంచేలా పోలీస్శాఖలో శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.గతంలో నక్సల్స్ నియంత్రణకు గ్రేహౌండ్స్, ఎస్ఐబీ విభాగాలను ఏర్పాటు చేసి కేటాయించిన సిబ్బందిని ప్రస్తుతం అవసరమైన సైబర్, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామని, 19 వేల పోలీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందులో ఇప్పటికే 5 వేల నియామకాలకు ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన సీసీ కెమెరాల మరమ్మతులకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని, దర్యాప్తులో సాంకేతిక లోపాల వల్ల నేరస్తులు తప్పించుకోకుండా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ద్వారా డాక్యుమెంటేషన్ను పక్కాగా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, మిగిలి ఉన్నవారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.తుది దశలో ఫోన్ ట్యాపింగ్ కేసుఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, త్వరలోనే సమీక్షించి దానికి అనుగుణంగా చార్జ్ïÙట్ వేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు. చివరగా, తాను ’మెక్రో మేనేజ్మెంట్’ విధానాన్ని అనుసరిస్తానని, క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్ మీటింగ్స్ ద్వారా వారి పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. సమావేశంలో శాంతి భద్రతల డీజీ మహేశ్ భగవత్, టీఎస్ఎల్పిఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సీఐడీ విభాగ డీజీ చారుసిన్హా, ఐజీలు రమేశ్రెడ్డి, రమేశ్నాయుడు పాల్గొన్నారు. -
టిఫిన్ తినలేం.. కాఫీ తాగలేం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల ‘పొయ్యి’పై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరతను సాకుగా చూపిస్తూ సామాన్యుడి నడ్డి సైతం విరిచే నిర్ణయం తీసుకుంది. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.3,315కి చేరుకుంది. హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర యుద్ధానికి ముందు రూ. 2,217 ఉంటే.. మార్చి 1న (మొదటి పెంపు) రూ.2,322కు, మే 1న (తాజా పెంపు) రూ.3,315కు చేరింది.అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.1,098 అదనపు భారం పడిందన్న మాట. ముఖ్యంగా పెరిగిన సిలిండర్ రేటు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు, కొందరు డీలర్లు..ఇప్పటికే ఒక కమర్షియల్ సిలిండర్కు బ్లాక్లో రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.ఇప్పుడు భారీగా ధర పెరగడంతో, ఈ సాకుతో బ్లాక్లో అమ్మే రేటు కూడా భారీగా పెంచే అవకాశం ఉండటంతో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కేటరర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 2 సిలిండర్లు వాడే టీ బంకులు, చిన్న హోటళ్ల యజమానులపై రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 అదనపు భారం పడుతుందని అంచనా.ఇప్పటికే మెనూలో కోత..మూతగ్యాస్ కొరత, పెరిగిన ధరతో ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో వంటకాల్లో కోత విధించారు. గ్యాస్ ఆదా కోసం కొన్ని వంటకాలు తగ్గించేశారు. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొత్తగా పెరిగిన గ్యాస్ ధర హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగాలను అతలాకుతలం చేసే అవకాశం కన్పిస్తోంది.రోజువారీ వినియోగం 65 వేల సిలిండర్లపైనేహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ప్రధాన చమురు సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలకు సంబంధించి సుమారు 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు సుమారు 65 వేల సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.15%–20% వరకు ధరల పెరుగుదలప్రస్తుతం ఒక్కో సిలిండర్ రీఫిల్ ధరపై రూ. 994 పెంపుతో రోజుకు రూ.6.46 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.193.8 కోట్ల భారం పడుతుందన్నమాట. ఇది హోటళ్లలో ఆహారం ధరలపై ప్రభావం చూపించడం ఖాయం. హోటళ్ల యజమానులు ఈ భారాన్ని వినియోగదారులపైనే వేస్తారు. దీంతో హోటళ్లలో ఇడ్లీ మొదలుకుని బిరియానీ వంటి ఆహార పదార్థాల ధరలు 15% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మహా హైదరాబాద్ పరిధిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఇలా..జిల్లా వాణిజ్య కనెక్షన్లు (సుమారు) రోజువారీ డిమాండ్ రోజువారీ అదనపు భారంహైదరాబాద్ 4,20,000 35,000 రూ. 3,47,90,000రంగారెడి 2,10,000 18,000 రూ. 1,78,92,000మేడ్చల్–మల్కాజిగిరి 1,85,000 12,000 రూ. 1,19,28,000 -
సబ్స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు
సాక్షి,హైదరాబాద్: సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద భూమి అందుబా టులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడకుండా చూడాలని ఆదే శించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడ లు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. గ్రీన్ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు వెంటనే ఇవ్వాలని చెప్పారు.భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్ల (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో.. జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. సోలార్ స్టవ్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్మిట్టల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ ఎస్.హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్.వి.పాటిల్, మూడో డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు . -
కిరాణా షాపు.. బడ్డీ కొట్టు
⇒ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో 220, ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో 200 కంటే ఎక్కువగా, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండల పరిధిలో 190 వరకు బెల్టుషాపులు ఉన్నాయి⇒ నల్లగొండ జిల్లాలోని చిట్యాల, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలాల్లో 100 చొప్పున, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో 120కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి.⇒ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో 10–15 బెల్టుషాపులున్నాయి. ఇక్కడ ఒక్కో బెల్టుషాపులో రోజుకు లక్ష రూపాయలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా.⇒ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, జక్రాన్పల్లి, మోపాల్ మండలాల్లో వరుసగా 22, 18, 16 గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. ఆర్మూర్ మండలంలోని చాలా గ్రామాల్లో24 గంటలూ మద్యం దొరుకుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి సెంటర్లో మద్యం బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, చిన్న చిన్న దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్లు అమ్మినట్టే, ఆ సమయాని కంటే ముందే ఈ బెల్టు షాపుల్లో క్వార్టర్ బాటిళ్లు, బీర్ సీసాలు దొరుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు.తెల్లవారుజామున మొదలుపెట్టి.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా తలుపు కొట్టి అడిగిన వారికి కాదనకుండా కావాల్సిన బ్రాండ్ మద్యం అందుబాటులో ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మండలంలో కనీసం 100 నుంచి 200 వరకు బెల్టు షాపులు ఉంటున్నాయంటే ఏ స్థాయిలో దందా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అడుగడుగునా అందుబాటులో ఉంటున్న బెల్టు షాపుల కారణంగా కుటుంబాలు, యువత నాశనమవుతున్నా పట్టించుకునే నాధుడే లేడని, టార్గెట్ల ఒత్తిడి, మామూళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.అధిక రేట్లతో అడ్డగోలు దోపిడీ.. మద్యం కోసం ఎగబడేవారి నుంచి బెల్టు షాపుల యజమానులు అడ్డగోలు రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం లైసెన్సు ఇచ్చి నడిపే మద్యం దుకాణాలు (వైన్స్) కంటే క్వార్టర్కు రూ.10 నుంచి రూ.40–50 వరకు అదనంగా చెల్లించాల్సిందే. బీరుకు కూడా రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్ట్షాపుల్లో ఎక్కువగా క్వార్టర్ బాటిళ్లే అమ్ముడవుతాయి.వివిధ బ్రాండ్లకు సంబంధించి ఒక్కో క్వార్టర్ బాటిల్ మీద ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 అధిక రేటుకు బెల్ట్ షాపులకు మద్యం సిండికేట్ అమ్ముతుంది. దీనిపై తన లాభంగా బెల్ట్షాప్ నిర్వాహకుడు మరో రూ.20 లేదా రూ.25ను కలిపి విక్రయిస్తాడు. అంటే క్వార్టర్ బాటిల్పై కనీసం రూ.40 అదనంగా చెల్లించాలన్న మాట. ఇక బీరు విషయానికి వస్తే ప్రస్తుతం వేసవి కావడంతో ఒక్కో బీరు బాటిల్కు ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.ఎక్సైజ్..సైలెన్స్! అనధికారికంగా విస్తృత స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మద్యం అమ్మకాలకు సంబంధించిన లక్ష్యాలు సాధించాలంటే గ్రామాల్లో మద్యం ఏరులై పారాల్సిందేనని కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. లేదంటే ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పవని చెబుతున్నారు. మరోవైపు వైన్ సిండికేట్లు, బెల్టుషాపుల నిర్వాహకులు ఇచ్చే నెలవారీ మామూళ్ల వల్ల కూడా అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే పోలీసులు కూడా బెల్టుషాపుల జోలికి వెళ్లరనే విమర్శలున్నాయి.వివిధ జిల్లాల్లో బెల్టు షాపులు ఇలా..⇒ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచే తెరుచుకుంటాయి. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఒక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలోనే ఆరు బెల్టుషాపులున్నాయి. ముబారక్ నగర్, గౌతమ్ నగర్, అమలువాడి, పాములబస్తీ, పోచమ్మ గల్లీ, చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్ పూలన్చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట, మిర్చి కాంపౌండ్ , నాందేవాడ తదితర ప్రాంతాల్లో బెల్టుషాపులున్నాయి. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీలకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఒక్క రెంజల్ మండల కేంద్రంలోనే 16 బెల్టుషాపులున్నాయి. దోమకొండ మండలంలోని బెల్టుషాపుల్లో ఒక్కో బీరుపై రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.⇒ నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, ఏపూరు, పేరేపల్లి గ్రామాల పరిధిలో పదుల సంఖ్యలో వివిధ రకాల పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కారి్మకులు వేలాదిమంది పనిచేస్తున్నారు. వీరు ఎక్కువగా బెల్టుషాపులకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఇదే జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బెల్టుషాపుల మూసివేతకు కొంత చొరవ తీసుకున్నారు. ఇక్కడ కొంత నియంత్రించగలిగారు కానీ పూర్తిగా నిలిచిపోలేదు. ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి బార్లను తలపించేలా బెల్టు దుకాణాలు నడుపుతున్నారు. తాళ్లవెళ్లెంల, ఎలికట్టె తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో నడుస్తున్నాయి.⇒ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్షాపులు గ్రామాల్లో బెల్టుషాపుల కోసం పోటీలు పడుతుంటాయి. ఈ మండలంలో చాలాచోట్ల అర్ధరాత్రి 12 గటంల వరకు సిట్టింగ్లు సాధారణంగా మారాయి. జనావాసాల మధ్య రాయగిరి–మోత్కూర్ ప్రధాన రహదారి వెంట వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుల్బాటిల్కు రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు.⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామంలో కిరాణం షాపులు, ఇతర వ్యాపార దుకాణాలు బెల్టుషాపులుగా మారిపోతున్నాయి. ఇక్కడ క్వార్టర్కు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 4 వేల వరకు బెల్టుషాపులుంటాయని అంచనా. వరంగల్, కాజీపేట, హనుమకొండ ట్రైసిటీలో స్లమ్ ఏరియాల్లో బెల్టుషాపులు ఎక్కువగా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండల పరిధిలో ఒక క్వార్టర్పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకుంటున్నారు.⇒ ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలోనే 50కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. వైరాలో వైన్షాప్ల సిండికేట్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇక్కడ సిండికేట్ మొత్తం ఆబ్కారీ శాఖ కనుసన్నల్లోనే నడుస్తోందని సమాచారం. ప్రతి క్వార్టర్ బాటిల్పై వైన్షాపులు రూ.20, బెల్టుషాపులు మరో రూ.20 అదనంగా వేసి అమ్ముతున్నారు. నేలకొండపల్లి మండలంలో 150 వరకు బెల్టు షాపులున్నాయి. ప్రతి షాప్లో 10కి పైగా రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం టౌన్ పరిధిలోనే సుమారుగా 100, కొత్తగూడెం శివార్లలో 150, పాల్వంచ పరిధిలో మరో 150 వరకు కలిపి మొత్తం 400 బెల్టుషాపులున్నాయి. ఒక్కో బెల్ట్షాప్ నిర్వాహకుడు రూ.10 వేలు వైన్స్ సిండికేట్కు ఇస్తే మద్యం దుకాణాల నుంచి సరుకు ఇస్తారు.కేసులు నమోదు చేస్తున్నాం బెల్ట్ షాపులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఈ బెల్టుషాపులు మా దృష్టికి వచ్చినా, ఫిర్యాదు వచ్చినా కేసులు నమోదు చేస్తున్నాం. గత ఏడాది 22 కేసులు పెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు కేసులయ్యాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాం.– సంతోశ్, ఎక్పైజ్ సూపరింటెండెంట్, నల్లగొండబెల్టుషాపులు వద్దని తీర్మానం చేశాం:మాది చిట్యాల మండలం ఏపూరు. మా గ్రామంలో పది వరకు బెల్టుషాపులుండేవి. యువత, కారి్మకులు మద్యానికి బానిసలవుతుండటంతో మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నేను సర్పంచ్ అయిన తర్వాత బెల్టుషాపుల నిర్వాహకులతో చర్చలు జరిపా. షాపులు నిర్వహించబోమని లిఖితపూర్వక హామీ తీసుకున్నా. ఈ మేరకు తీర్మానం చేసి అమలు చేస్తున్నాం.– పాలెం మహేష్ గౌడ్, సర్పంచ్ (ఇదే మండలంలోని పేరేపల్లి, పెద్దకాపర్తి గ్రామాల్లో కూడా బెల్టుషాపులు వద్దంటూ ఇటీవల తీర్మానాలు చేశారు)ఇస్తాలపురం.. అందరికీ ఆదర్శంసూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని ఇస్తాలపురంలో 2015 నుంచి బెల్టుషాపులు నడవడం లేదు. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయన్న కారణంతో బెల్టుషాపులు ఊర్లో ఉండొద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. దీంతో తమ సంసారాలు చక్కబడ్డాయని ఈ గ్రామ మహిళలు చెబుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగ్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోనెపల్లి గ్రామస్తులు కూడా ఇటీవల స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం ప్రకటించుకున్నారు. ఇదే విధంగా మరికొన్ని గ్రామాలు కూడా బెల్టుషాపుల్ని నిషేధిస్తూ తీర్మానం చేసుకున్నాయి. -
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్-16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు సిరిసిల్ల పట్టణానికి చెందినవారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఒకే కుటుంబసభ్యులు యాదగిరి గుట్ట నుంచి వస్తుండగా శంషాబాద్ వైపు వెళ్తున్న కారు (నంబర్ TS 23 F 2298) అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది.కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులున్నారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రయాణికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. -
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇతర ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానన్నారు.సీవీ ఆనంద్ నేపథ్యంఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది.తన సర్వీస్ ఆరంభంలోనే వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు పోలీసుశాఖలో మరెన్నో కీలక పదవులు అధిరోహించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలుఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు.అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్లైన్స్పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
మెట్రో రెండోదశకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండోదశ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఏడాది క్రితమే రెండోదశ కోసం ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సాంకేతిక చిక్కుముళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతిని నిరాకరించింది. మొదటిదశ ప్రాజెక్టు ఎల్అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉండగా, రెండోదశను ప్రభుత్వం నిరి్మస్తే మొదటి, రెండోదశ రైళ్ల నిర్వహణల మధ్య సమన్వయం కొరవడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం..ఎల్అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను టేకోవర్ చేసింది. దీంతో రెండో దశకు కేంద్రం నుంచి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.దశలవారీగా విస్తరణ..రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి దశలో నాగోల్ నుంచి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు (36.8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు(11.6 కి.మీ.), ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు(13.4 కి.మీ.), ఎల్బీనగర్–హయత్నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ. వరకు నిర్మించనున్నారు. ఆ తరువాత రెండోదశలో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ వరకు (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ వరకు (22 కి.మీ.), జేబీఎస్–శామీపేర్పేట్ వరకు(22 కి.మీ.) చొప్పున మరో 86.1 కి.మీ., నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు.పాతబస్తీలో మొదటగా... మెట్రో రెండోదశకు వివిధ కారిడార్లలో భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాలపై హెచ్ఎంఆర్ఎల్ ఇప్పటికే దృష్టి సారించింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదిత 7.5 కి.మీ. మార్గంలో రహదారుల విస్తరణతోపాటు ఆస్తుల సేకరణ చేపట్టింది. ప్రస్తుతం ఇది తుదిదశలో ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట ఈ మార్గంలో నిర్మాణం చేపడతారు. -
ఏసీలోనే యమ డేంజర్!
మనకేం చల్లగా ఏసీలో కూర్చుంటున్నాం. మనకెందుకు వడదెబ్బ తగులుతుంది? మనమెందుకు డీహైడ్రేషన్కు గురవుతాము.. అంటూ ధీమాగా కూర్చునే పరిస్థితి ఉందా? అంటే.. లేదనే అంటున్నారు వైద్యులు. ఇంకా చెప్పాలంటే ఎండలో తిరిగే వాళ్లకంటే శీతల గదుల్లో ఉండేవాళ్లే ఎక్కువ డేంజర్లో ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ఆఫీసుల్లో చల్లగా, సౌకర్యవంతంగా కూర్చుంటున్న వ్యక్తే డీహైడ్రేషన్ బాధితుడిగా మారుతున్నాడు. ఈ తరహా రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని, బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్స్లో నెఫ్రాలజీ విభాగపు క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పి.విక్రాంత్రెడ్డి అంటున్నారు. డీహైడ్రేషన్ (శరీరంలో ఎలక్ట్రోలైట్స్తో పాటు ముఖ్యంగా నీటి శాతం తగ్గిపోవడం) పరిస్థితిలో శరీరానికి బలమైన హెచ్చరిక సంకేతం దాహం. వేడి, చెమట, వేసవి వల్ల బయట వాతావరణంలో కలిగే అసౌకర్యం దీనికి దారితీస్తుంది.అయితే వడదెబ్బకు గురైనా.. ఏసీ వాతావరణంసౌకర్యవంతంగా ఉండి చెమట పట్టక, చర్మం ఎర్రబడక, గొంతు ఎండిపోనప్పుడు శరీరం పంపాల్సిన హెచ్చరిక సంకేతాలు మందగిస్తాయి. దాంతో శరీరంలో ద్రవాలు కోల్పోతూనే ఉన్నా అది కంటికి కనిపించదు. ‘చల్లని గాలి సౌకర్యవంతంగా అనిపిస్తుంది, కానీ అది శరీరాన్ని బాగా పొడిబారేలా కూడా చేస్తుంది. మరోవైపు చర్మం శ్వాస ద్వారా ద్రవాలు తగ్గుతూనే ఉంటాయి. కాకపోతే చెమట కనిపించక పోవడంతో నీరు తాగడం అవసరమని అనిపించదు. దాంతో నీటి లోటు నెమ్మదిగా పెరుగుతూ పోతుందని వైద్యులు వివరిస్తున్నారు. కెఫిన్..మరో ముప్పు ఏ కార్యాలయంలోనైనా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య టీ రౌండ్లు, నిరి్వరామంగా పనిచేసే కాఫీ, టీ వెండింగ్ మెషీన్లు కనిపిస్తాయి. ‘అలసటను, నీరసాన్ని దూరం చేస్తున్నట్టు అనిపింపజేసే టీ, కాఫీ శరీరానికి కొంత ద్రవాన్ని అందిస్తాయి, కానీ ఒక వ్యక్తి అనేక కప్పుల కెఫిన్ తాగినా శరీరానికి అవసరమైన నీరు అందదు..’అని వైద్యులు వివరిస్తున్నారు. కప్పుల కొద్దీ చాయ్, భోజనం తర్వాత ఒక కాఫీ, లేదా ఒక శీతల పానీయం ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉండడం వల్ల ఆ రోజుకు తగినంత నీరు తాగలేదనే విషయం చాలా మంది మదిలో నమోదు కాదని అంటున్నారు. సాధారణ మార్పులతో నిర్లక్ష్యంఈ పరిణామాల నేపధ్యంలో ఏసీలో ఉండే ఉద్యోగులలో డీహైడ్రేషన్ చాలా సాధారణమైన మార్పుల రూపంలో బయటపడుతుంది. మధ్యాహ్నం పూట తేలికపాటి తలనొప్పి, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏకాగ్రత తగ్గడం, శరీర మార్పుల వల్ల కాకుండా పనిభారం వల్ల వచి్చనట్లు అనిపించే అలసట వస్తాయి. దీనికి పనిభారం, స్క్రీన్ టైమ్, లేదా నిద్రలేమి కారణాలని భావిస్తారు. కానీ నీరు తాగకపోవడం కారణంగా గుర్తించరు. పెదవులు ఎండిపోవడం లేదా తలలో కొద్దిగా బరువుగా అనిపించడం వంటి వాటిని కూడా పట్టించుకోకుండా, రోజువారీ పని ఒత్తిడి వల్ల అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.కూర్చునే ఉండొద్దు.. గంటల కొద్దీ కూర్చుని ఉండకుండా.. లేచి ఎక్కడికైనా నడిచి, చుట్టూ పరిసరాలను గమనించినప్పుడు.. నోరు ఎండిపోయిందని, చాలా సేపటి నుంచి నీళ్లు తాగలేదని గుర్తించే అవకాశం పెరుగుతుంది. కేవలం స్క్రీన్పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఎక్కువ సేపు కూర్చుంటే ఇది సాధ్యం కాదు. ‘ఎక్కువ సేపు ఒకే చోట ఉండటం వల్ల శరీరం అందించే సంకేతాలను గమనించే అవకాశాలు, నీళ్లు తాగడానికి అవకాశాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఇది ఒక అలవాటుగా మారి డెస్్కపై ఉన్న నీళ్ల సీసా ఖాళీ అవ్వదు. ఇలాంటి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని, ఏసీలో ఉన్నామనే భరోసాతో ఉండకుండా..తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
హిమాయత్నగర్ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్న్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు. జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ పదవీ విరమణ సాక్షి, సిటీ బ్యూరో: జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్ పదవీ విరమణ చేశారు. గురువారం ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎండీ అశోక్ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించారు. డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టాల కింద పైప్లైన్ లీక్
అప్రమత్తమైన అధికారులు ● యుద్ధప్రాతిపదికన పనులు సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి సర్కిల్ మిర్జాలగూడ వార్డు పరిధి దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ నీటి లీకేజీ గమనించిన రైల్వే అధికారులు జల మండలికి సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి ఎండీ అశోక్రెడ్డి ఆదేశాల మేరకు యంత్రాంగం గురువారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. సరఫరా సమయంలోనే లీకేజీ బయటపడడంతో ప్రధాన పైప్లైన్ నుంచే జరుగుతోందని నిర్ధారించారు. లీకేజీ కొనసాగితే ట్రాక్ దెబ్బతినొచ్చని భావించి మరమ్మతులు పూర్తయ్యే వరకు సరఫరా నిలిపివేశారు. రైల్వే పరిధి వెలుపల రిసెప్షన్ పిట్ వద్ద తవ్వకాలు చేపట్టగా, 20 అడుగుల లోతులో 300 మి.మీ. ఎంఎస్ క్యారియర్ పైప్, 800 మి.మీ. కేసింగ్ పైప్ అమర్చినట్లు గుర్తించారు. భారీ ట్రస్ట్ బ్లాక్ ఉండడంతో పనులు క్లిష్టంగా మారాయి. అందుకని జేసీబీ, ఎయిర్ కంప్రెషర్లు, డీ–వాటరింగ్ పంపులు వాడుతూ పనులు చేపడుతున్నారు. కొత్త పైప్లైన్ ఏర్పాటు ప్రస్తుత 300 మి.మీ. ఎంఎస్ పైప్లైనన్ను పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారం అ జలమండలి అధికారులు నిర్ణయించారు. రూ.48 లక్షల వ్యయం అంచనా వేశారు. మరమ్మతులతో వాణీనగర్, భవానీనగర్కు సరఫరా అంతరాయం కలిగింది. దీంతో జలమండలి పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వాణీనగర్లో దాదాపు 200 కనెక్షన్లకు పాక్షికంగా సరఫరాను పునరుద్ధరించారు. మిగతా ప్రాంతాలకు ఉచిత ట్యాంకర్లు పంపుతున్నారు. -
పంథా మార్చి.. ఏమార్చి
● కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ ● తాజాగా సికింద్రాబాద్లో క్రిస్టల్ మెథ్ స్వాధీనం, అదుపులో ఇద్దరు మహిళలు బంగారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో క్యారియర్లుగా మహిళలుసాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్మగ్లర్లు పంథా మార్చారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాకు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల దృష్టి మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ గడిచిన కొన్నాళ్లల్లో 11 మంది మహిళలు పట్టుబడటమే దీనికి నిదర్శనం. తాజాగా మంగళవారం సికింద్రాబాద్లో ఇద్దరు మహిళా క్యారియర్లను అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.4 కోట్ల విలువైన 11.4 కేజీల క్రిస్టల్ మెథ్ స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, అందునా నిండుగర్భం, చంకలో పసిపిల్లలు, అంగవైకల్యంతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం అరుదు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపి క్యారియర్లుగా మార్చుకుంటున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటిబిడ్డలతో వస్తున్నవారికి అప్పగించి పంపిస్తున్నారు. మెటల్ డిటెక్టర్లనూ ఏమార్చ వచ్చని.. వివిధ రూపాలు, పంథాల్లో ఒంటిపై బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డీఎఫ్ఎండీ) కూడా కొంతవరకు కలిసి వస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగా ధరించే నగల వల్ల శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుందని బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు.. ఈ తరహా దందాలో చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా, ముఠా సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టమవుతోందని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళా క్యారియర్లకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. గతంలోనూ ఉదాహరణలు ఎన్నో.. దుబాయ్ నుంచి కొకై న్ క్యాప్సుల్స్ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్స్ దొరికింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన ఓ మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
విద్యాబోధనలో ఏఐ వినియోగం
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలసాక్షి, సిటీబ్యూరో : విద్యా బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడంతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత పాటించడంతో పాటు మెనూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు అవసరమైన చోట తరగతి గదుల విస్తరణ, అభివృద్ధి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల పురోగతిని సమీక్షించేందుకు తరచూ పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా వసతులు కల్పిస్తున్నందున, ఫలితాలు కూడా అదే స్థాయిలో రావాలని ఆదేశించారు. విద్యాధికారులు, ఉప విద్యాధికారులు పాఠశాలలను నిరంతర తనిఖీలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యవేక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఏడీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓలు, సెక్టోరియల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మేయర్కు ఓటు!
క్యూర్లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ ● నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యంలో.. ● కార్పొరేటర్కు ఒకటి, మేయర్కు మరో ఓటు ● పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్ ● ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా.. ● 2002లో ఎంసీహెచ్ మేయర్ ఎన్కిక జరిగిందలాగే.. సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కార్పొరేషన్లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. సిటీకి కొత్త కాదు.. హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్కు ఒక ఓటు, మేయర్కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. -
అరుదైన కళాకారుడు ‘ఎల్లా’
సూరీడి కర్ఫ్యూ సూరీడి ప్రతాపంతో నగరం ఉడుకుతోంది.. ప్రజలు బయటకు రావాలంటేనే వణికే పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమయంలోనైనా నిత్యం రద్దీగా కనిపించే రహదారులు సైతం బోసిపోతున్నాయి. గురువారం చార్మినార్ వద్ద కనిపించిన దృశ్యమిది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గన్ఫౌండ్రీ: ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు అరుదైన, అద్భుతమైన కళాకారుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమశేఖర మ్యూజిక్ డాన్స్ కల్చరల్ సొసైటీ, కిన్నెర ఆర్ట్ థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఎల్లా వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన భట్టి మాట్లాడుతూ..కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న గొప్ప కళాకారుడు వెంకటేశ్వరరావు అని కొనియాడారు. 36 గంటల పాటు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారని గుర్తు చేశారు. 83 సంవత్సరాల వయసులోనూ తన మృదంగంతో ప్రేక్షకులను కనువిందు చేయడం ప్రశంసనీయమన్నారు. అంతకు ముందు చిన్నారుల సినీ గీతాలాపన ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సంగీత దర్శకుడు విశ్వనాథ్, ఏపీ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, కిన్నెర కార్యదర్శి రఘురాం, బాలమురళి తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి సనత్నగర్ టిమ్స్లో ట్రయల్ రన్
సాక్షి,సిటీబ్యూరో: సనత్నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు. 2న విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం సాక్షి, సిటీబ్యూరో: యుద్ధ వాతావరణం తదితర సంక్షోభాల నేపథ్యంలో ‘‘అన్నమాచార్య భావనా వాహిని’’ ఆధ్వర్యంలో ‘విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం‘ నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా.నందకుమార్ తెలిపారు. ఈ నెల 2న 618వ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఉదయం ట్యాంక్ బండ్పై అన్నమయ్య విగ్రహం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 5న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష అబిడ్స్: తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మే 5న లక్డీకాపూల్లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్ష చేపడుతామని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ పేర్కొన్నారు. గగన్విహార్లోని టీఎన్జీఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎఫ్ రద్దుతో పాటు మరో 64 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. టీఎన్జీఓస్ నాయకులు కుర్రాడి శ్రీనివాస్, విక్రమ్ కుమార్, కేఆర్.రాజ్కుమార్ పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన రోజే పీపీఓలు సాక్షి, సిటీబ్యూరో: పదవీ విరమణ చేసిన రోజే సభ్యుల పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులను జారీ చేయడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘ప్రయాస్’ కార్యక్రమంలో భాగంగా గురువారం పలువురు ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపు ఉత్తర్వుల (పీపీఓలు)ను అందజేశారు. కూకట్పల్లిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ’ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995’ కింద బాలానగర్కు చెందిన మెస్సర్స్ మల్హోత్రా షేవింగ్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆర్టిసి సంస్థల ఉద్యోగులకు ఈ పిపిఓలను పంపిణీ చేశారు. గత నెలలో ప్రాసెస్ చేసిన 08 పెన్షన్ దరఖాస్తులకు సంబంధించిన ఉత్తర్వులను సహాయక పీఎఫ్. కమిషనర్ బాబుల్నాథ్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ● రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారు జితేందర్ రెడ్డి గచ్చిబౌలి: ఒలింపిక్ స్థాయి క్రీడాకాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారులు ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ నిర్వహించారు. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ విద్యతో పాటు శిక్షణ అందిస్తూ స్థిరమైన క్రీడా వ్యవస్థను నెలకొల్పేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మెన్,ఎండీ సోనీ బాల మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ స్థాయి నుంచి పోటీలు నిర్వహంచి ప్రతిభ వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కిశోర్ గోపీనాథన్, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘గుండె చికిత్స’పై చర్చా కార్యక్రమం సాక్షి, సిటీబ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో నగరం గణనీయ పురోగతి సాధించిందని ప్రముఖ కార్డియాలజిస్ట్లు పేర్కొన్నారు. ‘తీవ్రమైన గుండె వ్యాధుల చికిత్సలో నగరం’అంశంపై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏఐజి హాస్పిటల్ కు చెందిన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుజ్ కపాడియా పాల్గొని మాట్లాడారు. కవాట వ్యాధుల విషయంలో, అతి తక్కువ కోతతో చేసే గుండె చికిత్సా విధానాల దిశగా నిరంతర మార్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు. -
సరోజీని దేవి కంటి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ రూమ్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్పేషంట్ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్పేషంట్కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్వో వి.భానుప్రతాప్ తెలిపారు. -
పని చేస్తున్న చోటే దొంగతనం
మియాపూర్ : భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ సామాగ్రిని చోరీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపిన మేరకు.. నిజామాబాద్ నవీపేట్కు చెందిన కల్లూరి లక్ష్మణ్ (39) జీడిమెట్ల రాంరెడ్డినగర్లో నివాసముంటూ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీననం కొనసాగిస్తున్నారు. డబ్బు సరిపోకపోవడంతో చోరీలబాట పడ్డాడు. ఈ క్రమంలో ఓ నిర్మాణ సంస్థలో ఎలక్ట్రికల్ సామాగ్రి మాయమవుతుండటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసింది కల్లూరి లక్ష్మణ్ అని గుర్తించారు. అతని వద్ద నుండి రూ.1.50 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. -
తండ్రి కాలేయంతో బాలుడికి ప్రాణం
అఫ్జల్గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రెండేళ్ల కుమారుడు మహ్మద్ అఫాన్ కండరాల బలహీనతతో తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడు కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. కాలేయదానం చేయడానికి తండ్రి అంగీకరించడంతో అతని నుండి 240 గ్రాముల కాలేయాన్ని సేకరించి దాదాపు 14 గంటల పాటు శ్రమించి బాలుడికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అయ్యే ఇలాంటి శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించామని.. దాదాపు లక్షమందిలో ఒకరికి ఇలాంటి అరుదైన వ్యాధి ఉండే అవకాశం ఉంటుందని ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. వైద్యుల కృషిని మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ -
గోనె సంచులు రాక.. గోదాములు లేక
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా మక్కలను విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర రూ.2,400 నిర్ణయించగా, బహిరంగ మార్కెట్లో రూ.1,700 మించి రావడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఒత్తిళ్లు, రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్ల బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించింది. అయితే మార్క్ఫెడ్కు జిల్లాల్లో పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, విక్రయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్ –ప్యాక్స్) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల మేనేజర్లు ఇప్పుడు ప్యాక్స్ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయించేందుకు ప్రయతి్నస్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు. రికార్డు స్థాయిలో సాగు రాష్ట్రంలో యాసంగిలో మక్కల సాధారణ సాగు వి స్తీర్ణం 4 లక్షల ఎకరాలుగా ఉంటే ఈసారి ఏకంగా 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 43.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల ప్రైవేటు విక్రయాలు, సొంత అవసరాలు పోగా 15 లక్షల మెట్రిక్ టన్ను ల మక్కలను విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉత్పత్తి కావడంతో వాటిని ఎలా విక్రయించాలో తెలియని స్థితిలో మార్క్ఫెడ్ కొట్టుమిట్టాడుతోంది. అన్నీ సమస్యలే... మక్కల కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను మార్క్ఫెడ్ ముందుగానే సమకూర్చుకోవాలి. ఒకసారి వాడిన (సెకండ్ హ్యాండ్) గోనె సంచులను మక్కల కొనుగోళ్లకు వినియోగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచి, ఒక్కో గోనెసంచికి రూ.22 చొప్పున కాంట్రాక్టులు అప్పగించినా, కాంట్రాక్టర్లు సమయానికి గోనెసంచులు అందించడం లేదు. దీంతో భూపాలపల్లి, నాగర్కర్నూలు, మహబూబాబాద్, వరంగల్ వంటి చోట్ల రైతులే గన్నీ బ్యాగులను సమకూర్చుకొని మక్కలను విక్రయించేందుకు ప్యాక్స్ సెంటర్లకు వస్తున్నారు. ప్యాక్స్ నిర్వాహకులు కూడా గోనెసంచులతో వచ్చిన రైతుల మక్కలనే కాంటా వేస్తున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి జిల్లా మేనేజర్లు, కాంట్రాక్టర్లు, గోనెసంచులు సమకూర్చే ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చోటకు గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మక్కలను సంచుల్లో నింపి, తూకం వేసి, లారీల్లో గోదాములకు తరలించేందుకు అవసరమైన హమాలీల సమస్య కూడా అన్ని జిల్లాల్లో ఎదుర్కొంటున్నారు. మరోవైపు సేకరించిన మక్కలను నిల్వ చేయడం ఇప్పుడు మార్క్ఫెడ్కు ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గోదాములన్నీ ఇప్పటికే బియ్యం, ఇతర నిల్వలతో నిండి ఉన్నాయి. తాజాగా రబీ పంట మిల్లింగ్కు వస్తుండడంతో కొత్త బియ్యం నిల్వలకే గోదాములు సరిపోని పరిస్థితి ఉంది. పత్తి నిల్వకు సంబంధించిన గోడౌన్లు ఖాళీగా ఉన్నా, ఖరీఫ్లో సాగయ్యే పత్తి పంట సెపె్టంబర్ నాటికి మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరనుంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్లోగా మక్కల నిల్వలను ఖాళీ చేస్తామని హామీ ఇస్తే తప్ప గోదాములు ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం. 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు మక్కల కొనుగోళ్లకు ఇప్పటి వరకు 246 ప్యాక్స్ సెంటర్లను ఎంపిక చేశారు. 74వేలకు పైగా రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించారు. నల్లగొండ, నారాయణపేట, భువనగిరి, మల్కాజిగిరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నాగర్కర్నూలు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అంతా నాణ్యమైనవే అయ్యుండాలని.. అవన్నీ జూన్ 15లోగా స్కూళ్లకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సామగ్రి అందాక వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖతోపాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందించే సామగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై సీఎం రేవంత్రెడ్డి గురువారం సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ సేకరణ, సరఫరా చేపట్టడంతో నాణ్యత లోపంతోపాటు అక్రమాలు జరిగేవని.. వాటిని అరికట్టేందుకే కేంద్రీకృత సేకరణ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పా రు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి గడువులోగా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మండలానికో నోడల్ అధికారి... విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని.. సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, గురుకులాల కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పనిభారం పెరిగిందని సమ్మె.. సమ్మె తర్వాత మరింత పని
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ చేయాలన్నది సాధారణంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్గా ఉంటుంది. కానీ, ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో వేతన సవరణ కంటే కార్మీకుల నుంచి ప్రధానంగా వినిపించిన డిమాండ్ ‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి’అన్నదే. ప్రభుత్వంలో విలీనం అయితే పనిఒత్తిడి నుంచి కొంత ఊరట లభిస్తుందన్న ఆశతో అదే ప్రధాన డిమాండ్గా సమ్మెకు దిగారు. అయితే సమ్మె ముగిసిన తర్వాత వెంటనే మరింత పనిఒత్తిడి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రోజువారీ టికెట్ ఆదాయాన్ని కనీసం రూ.2 కోట్ల మేర పెంచాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపోలకు మౌఖిక ఆదేశాలందాయి. ఇటీవలి సమ్మె నేపథ్యంలో, ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న 2021 వేతన సవరణ చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని వల్ల సంస్థపై రూ.35 కోట్ల వరకు నెలవారీ భారం నమోదు కానుంది. రోజువారీ ఆదాయం–రోజువారీ ఖర్చులను పరిశీలిస్తే రోజుకు రూ.2 కోట్ల లోటు నమోదవుతోందని అధికారులు లెక్కలేశారు. నెలకు ఆర్టీసీకి వస్తున్న ఆదాయం రూ.630 కోట్లు కాగా, ఖర్చు రూ.655 కోట్లుగా ఉందని ఇటీవల డిపోలకు సమాచారం అందించారు. అంటే ఇప్పటికే నెలకు రూ.25 కోట్ల లోటు ఉండగా, వేతన సవరణతో కొత్తగా రూ.35 కోట్ల భారం పెరుగుతోంది. వెరసి రూ.60 కోట్ల లోటు పెరగనుంది. దీంతో రోజువారీ ఆదాయాన్ని రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లకు పెంచాలంటూ కిందిస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో మళ్లీ కార్మీకులపై ఒత్తిడి పెరగబోతోంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించండి ! ‘2018లో కొండగట్టు వద్ద 65 మంది ప్రాణాలు బలిగొన్న బస్సు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదంతోపాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం కూడా ఓ కారణమని విచారణలో తేలింది. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్న సిఫారసులు జారీ అయ్యాయి’ ⇒ ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో వంద నమోదవుతోంది. చాలా రూట్లలో అది 110 శాతాన్ని కూడా మించుతోంది. దీంతో తదుపరి నెలల్లో ఆక్యుపెన్సీ రేషియో అంతకుమించి ఉండాలని స్వయంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలకు లక్ష్యం నిర్ధారిస్తున్నారు. అంటే, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోమని నేరుగానే చెబుతున్నారన్నమాట. వంద శాతాన్ని మించి ఓఆర్ నమోదైనా... అది టార్గెట్ కంటే తక్కువ ఉంటే డిపో మేనేజర్లను ప్రశ్నిస్తున్నారు. కొందరు మెమోలు జారీ అవుతున్నాయని తెలిసింది. దీంతో డిపో మేనేజర్లు కార్మీకులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామం. ⇒ 2019లో రికార్డుస్థాయిలో 52 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు, విధుల్లోకి రాని ఉద్యోగులు, కార్మీకులను తొలగిస్తామని, వారి స్థానంలో ప్రైవేట్ సిబ్బందిని తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించటంతో అప్పట్లో సమ్మె ఆగిపోయింది. ఆ తర్వాత సమ్మె అంటేనే కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అలాంటిది పని ఒత్తిడిని తట్టుకోలేక మళ్లీ తెగువతో సమ్మెకు దిగారు. ప్రశ్నించలేక.. కార్మీకులపై ఒత్తిడి పెంచుతున్న డీఎంలు... ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు డిపో మేనేజర్లు అంతా పదోన్నతుల ద్వారా వచ్చిన వారే, డైరెక్ట్ రిక్రూటీస్ లేరు. పదోన్నతుల ద్వారా డీఎంలు అయిన వారు డిపో ఇబ్బందులు, ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల అమలు సమస్యల మీద ఉన్నతాధికారులను ప్రశ్నించలేకపోతున్నారు. దీంతో ఆదేశాలను అమలు చేయాల్సి రావటంతో నేరుగా కార్మికులపై ఒత్తిడి పెంచాల్సి వస్తోంది. తాజాగా రూ.2 కోట్ల అదనపు ఆదాయం విషయంలో కార్మీకులకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తుంటే, ‘సమ్మె చేసినా మాపై ఒత్తిడి తగ్గించరా’అంటూ కార్మీకులు డిపో మేనేజర్లను ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఉన్నతాధికారులకు చెప్పలేక, ఇటు కార్మీకులతో పని చేయించలేక డిపో మేనేజర్లు సతమతమవుతున్నారు. -
మే ఆఖరుకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా మే నెల చివరికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని రూ.ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్ల డించారు. అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్కే ఇళ్లను పూర్తి చేయడా నికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయించినట్టు తెలిపారు.ఈ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్చానల్లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హెచ్.వేణుగోపాల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్, హౌసింగ్ కార్యదర్శి వీపీ గౌతం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో ఆయా అంశాలపై సమీక్షించారు.చాలా ఇళ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని, ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల్లో రూ.400 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. భూముల పరిరక్షణలో రాజీపడంప్రభుత్వ భూముల ఆక్రమణల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్ సర్వేకు ఆదేశించారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాల యంలో 30 కేవీ ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్ను పొంగులేటి ప్రారంభించారు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : మంత్రి శ్రీధర్బాబుఇందిరమ్మ ఇళ్ల పథకంలో గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోలేని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హెచ్చరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని శ్రీధర్బాబు సూచించారు. -
కవిత పార్టీ కొత్త పేరు ‘తెలంగాణ రక్షణ సేన’
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’ పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పచ్చజెండా ఊపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన ఈసీ.. నిబంధనల ప్రకారం పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 28న కవితకు ఈసీ అధికారిక లేఖ పంపింది. బంజారాహిల్స్ చిరునామాతో ఉన్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏప్రిల్ 23న కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం.. దరఖాస్తులో ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పార్టీ రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రంలో రెండు జాతీయ, రెండు స్థానిక దినపత్రికల్లో పార్టీ పేరును తెలుపుతూ వరుసగా రెండు రోజులపాటు పబ్లిక్ నోటీసు ప్రచురించాలి. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రకటన ప్రచురించిన నాటి నుంచి 30 రోజుల వ్యవధిలో తెలపాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యంతరాలను సాధారణ కాగితంపై రాసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ (పొలిటికల్ పార్టీ)కి పోస్టు ద్వారా లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని ప్రజలకు తెలియజేయాలి.పబ్లిక్ నోటీసుపై వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ పేరుకు ఈసీ తుది ఆమోదం తెలుపుతుంది. ఈసీ ఆమోదించిన పేరిట పార్టీ రాజ్యాంగాన్ని, నిబంధనలను పొందుపరుస్తూ అనుబంధం–1లో తాజా దరఖాస్తును దాఖలు చేయాలని లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఈ పత్రాలు అందిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుంది.‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట దరఖాస్తుకేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అధ్యక్షురాలి హోదాలో కవిత కొత్త పార్టీ పేరు కోసం అనుమతి కోరుతూ ఐదు పేర్లు ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను ప్రతిపాదించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రత్యుత్తరాలు నడుస్తున్నా కొత్త పార్టీ పేరుపై స్పష్టత రాకపోవడంతో ఈ నెల 25న జరిగిన ఆవిర్భావ సమావేశంలో కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు.బీఆర్ఎస్ పూర్వపు పేరు టీఆర్ఎస్ను పోలిఉండేలా కవిత ఈ పేరును ప్రకటించారు. ఇదిలా ఉంటే ‘ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఐదు పేర్లతో దరఖాస్తు చేస్తే మూడో ప్రాధాన్యతగా ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో’ అని కవిత గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.‘తెలంగాణ రాజ్యాధికార సమితి’ అభ్యంతరంటీఆర్ఎస్ సంక్షిప్త నామంతో ఇప్పటికే తమ పార్టీ ఉన్నందున అదే అక్షరాలను పోలి ఉండే కొత్త పార్టీని రిజిస్టర్ చేయొద్దని తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షులు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇలాఉండగా, తిరిగి టీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చుకుంటామని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాలలో జరిగిన మీడియా భేటీలో వెల్లడించారు. నెల రోజుల్లోగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని కవితకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ సంక్షిప్త నామంపై పరస్పర ఆరోపణల పర్వం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
ఐపీఎస్గా శివధర్ రెడ్డివి విశిష్ట సేవలు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిగా బి.శివధర్రెడ్డి అందించిన సేవలు విశిష్టమైనవని డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కొనియాడారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కీలక బాధ్యతల్లో ఆయన పనిచేశారన్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో పనిచేసిన నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. గురువారం శివధర్రెడ్డి డీజీపీగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో గౌరవసూచకంగా ప్రత్యేక పరేడ్ కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పోలీస్ అధికారిగా 32 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజ లకు అమూల్యమైన సేవలందించారన్నారు. నక్సల్ సమ స్యను ఎదుర్కోవడంలో జిల్లా ఎస్పీగా, ఎస్ఐబీ అధికారిగా కీలకపాత్ర వహించారని చెప్పారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లతోపాటు లొంగుబాట్లలోనూ కీలకంగా ఉన్నారన్నారు. సాంకేతికతను వాడటంలో తెలంగాణ పోలీసు దేశంలో ముందంజలో ఉందన్నారు.ఇప్పుడు డ్రగ్స్, సైబర్నేరాలు, ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, వీటిని ఎదుర్కొనేందుకు పోలీస్శాఖ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ, వృత్తిగత జీవితంలో ప్రోత్సహించిన, తన విజయాల్లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పోలీస్, ప్రజలకు మధ్య వచ్చిన అంతరాన్ని తగ్గించేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకున్నామని గుర్తు చేశారు. యువ అధికారులు పోలీస్శాఖకు పేరు తేవాలని సూచించారు. సాదరంగా వీడ్కోలురాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా నిర్వహించిన వీడ్కోలు వేడుక ఆత్మీయతతో కూడిన వాతావరణంలో సాగింది. కార్యక్రమ ఆరంభంలో శివధర్రెడ్డి తన బాధ్య తలను శాంతిభద్రతల డీజీ మహేశ్ ఎం. భగవత్కు అప్ప గించారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు, ఇన్చార్జి డీజీపీగా మహేశ్ భగవత్ వ్యవహరించనున్నారు.అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం, వీడ్కోలు పలికేందుకు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో నిలబడి, అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పోలీసు సంప్రదాయం ప్రకారం ఐపీఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ కార్యాలయ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. కార్యక్రమంలో టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు
హైదరాబాద్: నగరంలోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆటోకు కూడా మంటలు అంటుకుని అది దగ్ధమైంది. మంటలను సిబ్బంది అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు, పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో ఉన్న తాడ్బన్లోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. -
ఎన్నో కీలక వ్యూహాలతోనే నక్సలిజం అంతం
⇒ మొదట్లో నక్సలిజం అనేది కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది.⇒ సాంకేతికతను వాడుతూనే బేసిక్ పోలీసింగ్ను మరవొద్దు. కేవలం సీసీటీవీలు, టెక్నాలజీపైనే ఆధారపడకుండా ప్రజలతో మమేకమైతేనే పోలీసింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ⇒ 2025లో హత్యలతో 800 మంది చనిపోతే రోడ్డు ప్రమాదాల్లో 2,500 మందికిపైగా చనిపోయారు. అకారణంగా ఏటా ఇంత మంది చనిపోవడం బాధాకరం. పని మీద బయటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి?⇒ పబ్లిసిటీ కోసం మన పనులు ఉండొద్దు. పబ్లిక్ కోసం పనిచేస్తే పబ్లిసిటీ అదే వస్తుందన్న విషయాన్ని మరవొద్దు. ⇒ పోలీసులకు ఇంటిగ్రిటీ ముఖ్యం..ఎవరూ చూడనప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలి. హీరోయిజం కోసం కాకుండా రియల్గా సేవచేయాలి. సాక్షి, హైదరాబాద్: బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లడంతోనే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసి.. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందని డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్ల కల్పన, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సైతం ప్రజలపై ప్రభావం చూపాయని.. ఈ అంశాలు సైతం నక్సలిజం అంతానికి దోహదపడ్డాయని చెప్పారు.ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరినప్పటి నుంచి డీజీపీగా పదవీ విరమణ పొందే వరకు వృత్తిగతంగా ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన శివధర్రెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమితులైన సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో శివధర్రెడ్డి మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. వ్యూహాత్మక నిర్ణయాలతోనే... నక్సలిజం ఎంతో ప్రభావంతంగా ఉన్న పరిస్థితిని నుంచి తాజా పరిస్థతుల వరకు అన్ని స్థాయిల్లో నేను చూశాను. మొదట్లో నక్సలిజాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం చూసింది. కానీ ఇది సామాజిక, రాజకీయ కోణాలు, ఆర్థిక అసమానతలు, సిద్ధాంతాలతో ఇమిడి ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్నాక అందుకు తగ్గట్టుగానే చర్యలు ప్రారంభించింది. తొలుత ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ను స్థాపించడం.1993లో తెచ్చిన సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ, స్థానిక సంస్థల్లో బీసీ, మహిళా రిజర్వేషన్లతో కొన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడం, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అడ్డుకునేందుకు తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ పక్కాగా అమలు చేయడంతో ఆ వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగడం.. పెత్తందారుల ఒత్తిళ్లు తగ్గడం.. ఇలా రాజకీయ, సామాజిక మార్పులతో చాలా వర్గాలు నక్సలిజానికి దూరమయ్యాయి. మరోవైపు పోలీసు ఆపరేషన్లు పెరగడంతో 2007 నాటికే తెలంగాణలో మావోయిజం తగ్గింది. అప్పుడప్పుడు ఉనికి చాటుకున్నా.. యాక్టివిటీ ఏమీ లేదు. ఆ తర్వాత వేగంగా క్షీణించింది. వైఎస్సార్ కీలక నిర్ణయాలతో ప్రభావం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వృద్ధులు, బీడీ కారి్మకులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ పథకం ఇలా అనేక నిర్ణయాలూ సమాజంలో మార్పు తెచ్చాయి. ప్రభుత్వాలు మనకోసం పనిచేస్తున్నాయి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అ లాంటప్పుడు నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్న ప్రజల్లో వచ్చింది. అది కూడా నక్సలిజం అంతానికి పనిచేసింది. డీజీపీగా రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిచ్చా.. నేను డీజీపీగా ఏడు నెలల్లో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్తోపాటు ఫెయిర్, ఫర్మ్, ప్రొఫెషనల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇచ్చాను. అన్నింటితోపాటు నేను రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. దీంతో ఈ ఏడాదిలో నాలుగు నెలల్లో 400 రోడ్డుప్రమాద మరణాలు తగ్గించాం. రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం పోలీసుల పోస్టింగ్లు, రోజువారీ పనుల్లో గతంతో పోలిస్తే రాజకీయ జోక్యం తగ్గిస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సు లెటర్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పోస్టింగ్లు ఇవ్వడం లేదు. ఆ అధికారి సమర్థత, గతంలో చేసిన సర్విస్ను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ ఆ అధికారి సమర్థుడు కాకపోతే వెంటనే సదరు ప్రజాప్రతినిధికి చెబుతున్నాం. గతంతో పోలిస్తే పోలీసు విధుల్లో, కేసుల నమోదులో రాజకీయ జోక్యం బాగా తగ్గించగలిగాం. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పోలీసు అధికారి కాగానే మనం ఏదో సాధించేశాం అన్నట్టుగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎన్నో సమస్యలతో బాధితులు మన దగ్గరికి వస్తుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం మన పరిధిలో ఉండకపోవచ్చు. అయినా సరే వాళ్ల సమస్యను సావధానంగా వినాలి. అప్పుడు వాళ్లకు కొంత ఊరట లభిస్తుంది. యువ అధికారులు, సిబ్బంది అనవసర ప్రచారం పక్కన పెట్టి, పోలీస్ అధికారులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలని నేను సూచిస్తుంటాను. కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం సవాలే.. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. ఒకవైపు కెరీర్.. మరోవైపు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద సవాలే. ఆ సమస్య నాకు ఉండేది. నాకు కూతురు, కొడుకు. నేను వాళ్లు స్కూళ్లలో ఉన్నప్పుడు కేవలం ఒక్క సందర్భంలో తప్ప మరెప్పుడూ వాళ్ల స్కూల్కి వెళ్లలేదు. వాళ్లు ఏం చదువుతున్నారో.. ఎలా చదువుతున్నారో తెలియదు. కానీ, నా భార్యనే అన్ని విషయాలు చూసుకునేది. అందుకే ఏ విషయంలోనైనా నాపై కుటుంబపరమైన ఒత్తిడి లేకుండా చూసుకునేది. ఏ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడేవాడిని. ప్రజా క్షేమం కోసం పనిచేస్తా.. ప్రభుత్వం నన్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. కొంత విరామం తర్వాత బాధ్యతలు తీసుకుంటాను. అయితే, నాకు ఏ బాధ్యత ఇచ్చినా వ్యవస్థ పురోగతి కోసం పనిచేస్తాను. గతంలో చేసినట్లుగానే సంస్థలను బలోపేతం చేసేందుకు కృషిచేస్తా. నన్ను సడెన్గా బదిలీ చేసినా బాధపడలేదు... పోలీసు అధికారిగా రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు ఏనాడూ నేను పట్టించుకోలేదు. పనిగట్టుకుని కొందరు చేసే విమర్శలు పట్టించుకునేవాడిని కాదు. హాయిగా నవ్వుకునే వాడిని. గత ప్రభుత్వంలో కూడా నన్ను ఇంటెలిజెన్స్ నుంచి అకస్మాత్తుగా బదిలీ చేసినప్పుడు కూడా బాధపడలేదు. బదిలీ చేసిన కారణాలు తెలిసి నవ్వుకున్నా. ఆ బదిలీపై ఆ రోజు మా ఇంట్లో వాళ్లు అడిగితే కూడా నేను.. ‘నాకు ప్రెజర్ పోయింది. చాలా హాయిగా ఫీల్ అవుతున్నా..’అని చెప్పా. ఏ బాధ్యత ఇచ్చినా నిజాయితీగా పనిచేశాను. -
మానవత్వంతో రష్యన్ మహిళ వీసా పొడిగించండి
సాక్షి, హైదరాబాద్: అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మార్గదర్శకాలను యాంత్రికంగా అమలు చేయకుండా.. కొంత మానవత్వం అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. మన దేశానికి చెందిన వ్యక్తిని వివాహమాడి భర్త మరణంతో తీవ్ర బాధలో ఉన్న రష్యన్ మహిళ వీసా పొడిగింపునకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం తెలుపడాన్ని తప్పుబట్టింది. సంతానంలేని వితంతువుకు వీసా పొడిగింపు ను నిరాకరించడం ఆలోచనారహిత మని వ్యాఖ్యానించింది. బాధిత మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా పొడిగించాలని అధికారులను ఆదేశించింది.రష్యన్ మహిళ అలెనా ఎవ్జెనియెవ్నా పావ్లోవా.. గత 8 ఏళ్లు గా భారత్, రష్యా తిరుగుతూ సత్యసాయి సంస్థలో సేవ చేస్తున్నారు. భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదిస్తున్నా రు. 2024లో భారతీయుడిని వివాహం చేసుకోగా.. ఏడా ది తర్వాత అతను అనారోగ్యంతో మరణించారు. ఈ నేప థ్యంలో కార్యక్రమాలు పూర్తి చేయడానికి, అత్తకు తోడు ఉండటానికి వీలుగా వీసా గడువు పొడిగించాలని ఆమె కోరారు. వీసా పొడిగింపునకు చేసుకున్న దరఖాస్తును అధి కారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలెనా హైకోర్టు ను ఆశ్రయించారు.ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. భర్త మరణంతో వితంతువుగా మారిన విదేశీ వని త వీసా పొడిగింపునకు నిబంధనల పేర బాధపెట్టడం సరికాదన్నారు. అధికారులు చెబుతున్న మార్గదర్శకాలు సరైనవే అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విచక్షణ వినియోగించాలని అభిప్రాయపడ్డారు. మానవత్వంతో ఆమె దరఖాస్తు పరిగణనలోకి తీసుకుని వీసా గడువును పొడి గించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. -
వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్’!
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడలు నేర్చుకోవడానికి హైదరాబాద్లో సమ్మర్ క్యాంపుల బాటపట్టే విద్యార్థులపై జీహెచ్ఎంసీ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొ రేషన్లు చార్జీల భారం మోపాయి. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని స్టేడియాలు, ప్లేగ్రౌండ్లలో సమ్మర్ కోచింగ్లకు యూజర్ ఫీజులు పెంచాయి. గతంలో బేస్బాల్, బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ వంటివి ఆడుకోవడానికి రూ. 50గా ఉన్న నెలవారీ ఫీజును రూ. 200 చేశాయి. సైక్లింగ్, క్యారమ్స్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, క్రికెట్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, టెన్నికాయిట్ తదితర ఇన్డోర్/ఔట్డోర్ గేమ్స్పైనా ఫీజులు పెంచాయి.క్రికెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 400కు పెంచగా జిమ్ ఫీజు రూ. 200 నుంచి రూ. 400కు, లాన్ టెన్నిస్ (క్లే) ఫీజు రూ. 450 నుంచి రూ. 1,500కు పెంచేశాయి. వాటన్నింటికీ ఏడాదికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీలు ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపాయి. అయితే సమ్మర్ క్యాంపుల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇచ్చాయి. పాఠశాల విద్యార్థులకూ భారం: పాఠశాలల విద్యార్థులు ప్లేగ్రౌండ్లు బుక్ చేసుకోవడంపైనా ఫీజుల భారం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,000కి పెరగడంతోపాటు విస్తీర్ణాన్ని బట్టి గ్రౌండ్ల ఫీజులు పెరిగాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లేగ్రౌండ్ను ఒక విద్యా సంవత్సరంలో 11 నెలల్లో 75 గంటలపాటు వినియోగించుకోవడానికి రూ. 10 వేలుగా ఉన్న ఫీజును మూడు రేట్లతో రూ. 15 వేలు చేశారు. అదే గ్రౌండ్ను 150 గంటలు వాడేందుకు రూ. 20 వేలుగా ఉన్న ఫీజును రూ. 30 వేలకు పెంచారు.వెయ్యి చదరపు మీటర్ల గ్రౌండ్ను 11 నెలల్లో 150 గంటలు వాడుకోవడానికి రూ. 40 వేలుగా ఉన్న ఫీజును రూ. 60 వేలు చేశారు. మరోవైపు వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకపూట ఆయా గ్రౌండ్లను వినియోగించుకునేందుకు ప్రస్తుతమున్న రూ. 4 వేల ఫీజును రూ. 6 వేలకు, రోజు ఫీజు (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) రూ. 7,500 నుంచి రూ. 11,000కు పెంచారు. వాలీబాల్ కోర్టు ఒకపూట ఫీజును రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, క్రికెట్ నెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 200కు, బాస్కెట్బాల్ కోర్టు రోజు ఫీజును రూ. 7500 నుంచి రూ. 11,000కు పెంచారు. -
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రిడిటేషన్ల జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. గురువారం నాడు సమాచార శాఖ ఆధ్వర్యాన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రిగారు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులను ఇంతవరకు పొడిగించామని, దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకు పరిశీలన సాగిందని అందువల్లే ఈ కార్డుల జారీలో ఆలస్యం చోటుచేసుకుందన్నారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రిడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352 కే పరిమితం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా మార్పులు చేసిందని తెలిపారు. ఇప్పటికే సుమారు 2800 వరకు కార్డులను ఆమోదించడం జరిగిందని వివరించారు. జర్నలిస్టుల సూచనల మేరకు జీవోలలో మార్పులు చేర్పులు చేశామని, అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరులో వెనకడుగు ప్రసక్తే లేదని అన్నారు. మే 1వ తేదీన అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.ఈ ప్రక్రియలో మే 10 వతేదీని ఒక కటాఫ్ డేట్గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు సంఖ్య తేలితే జర్నలిస్టులకు ఆరోగ్యం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చునని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా పలు సూచనలు చేశారని వెల్లడించారు. అంతేగాక జర్నలిస్టులు వివిధ సంస్దలలో ఉద్యోగాలు మారినప్పటికీ అక్రిడిటేషన్ల మంజూరు ఓ నిరంతర ప్రక్రియగా సాగుతుందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సుపాస్ల గడువు ముగుస్తున్నందున మరో 15 రోజుల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ సంస్థలకు తెలంగాణ సివిల్ సప్లయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టకూడదని.. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని.. 21,295 కిలో లీటర్లు పంపిణి చేసినట్లు తెలిపారు.పెట్రోల్ సరఫరా 118 పెంచామని తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందన్న స్టీఫెన్ రవీంద్ర.. బ్లాక్ మార్కెటింగ్పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
ప్రజావాణి.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి వ్యవస్థను ప్రభుత్వం విస్తరించనుంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలకు ప్రజావాణి విస్తరణకు ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సర్కార్.. అన్ని ఫిర్యాదులు ప్రజావాణి పోర్టల్లో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారులకు యూనిక్ రిఫరెన్స్ నంబర్తో రసీదు ఇవ్వనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్టంగా 30 రోజులు గడువును ప్రభుత్వం నిర్ణయించింది. గడువు లోపల పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఎస్కలేషన్ ఇవ్వనున్నారు.ఆన్లైన్లో ఫిర్యాదు స్థితి ట్రాకింగ్ సౌకర్యం, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ (ATR) ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజలతో పారదర్శకత, బాధ్యత పెంచే చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. ప్రతి విభాగంలో ప్రత్యేక ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేయనుంది. అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. ప్రజల అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచే వారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని రెండో సిట్ వేశారు’’ అంటూ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.‘‘ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు..కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిశాంక్పై కేసు పెట్టి జైలుకు పంపారు.కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను దైర్యంగా ఎదుర్కొంటాము. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను’’ అని ప్రవీణ్కుమార్ తెలిపారు. -
మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంత రావుకు రేవంత్ ప్రభుత్వం కీలక పదవులను అప్పగించింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంత రావును, తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డి.. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర భద్రతా సలహాదారుగా సేవలు అందించనున్నారు. చట్టం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై ప్రభుత్వానికి శివధర్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు చీఫ్ సెక్రటరీ హోదాతో పాటు నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది. -
గాంధీభవన్ ముందు భిక్షాటన.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు గురువారం మెరుపు నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వాళ్లను లోపలికి చోచ్చుకుని పోకుండా నిలువరించగలిగారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లైనా ఇప్పటిదాకా ఆ హామీని నెరవేర్చలేదని చెబుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ వద్ద గురువారం చిప్పలు చేతబట్టి తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన ద్వారా నిరసన చేపట్టారు. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఇక సర్కారీ మెట్రో.. పూర్తయిన ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) లిమిటెడ్ అధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తెలంగాణ ప్రభుత్వం స్వాదీనంలోకి వచ్చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో సర్కారీ మెట్రోగా మారింది. హెచ్ఎంఆర్ఎల్ ఫేజ్–1ను స్వాధీనం చేసుకోవాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. ఎల్అండ్టీతో కొద్దిరోజులుగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈమేరకు ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్)తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ తరఫున డీకే సేన్, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ హామీతో ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించింది. ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్అండ్టీ చైర్మన్, ఎండీ ఎస్ఎన్. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రయాణికులకు అనుకూలంగా.. ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. నెట్వర్క్తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవడంతో ఫేజ్–1, ప్రతిపాదిత ఫేజ్–2 నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
చమురెటు పోతోంది!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజు వారీ పెట్రోల్ డిమాండ్ 5,883 కిలోలీటర్లు..డీజిల్ డిమాండ్ 7,348 కిలోలీటర్లు. అయితే గత కొద్ది రోజులుగా ఈ డిమాండ్కు రెండింతలకు పైగా ఆయిల్ కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కూడా విడివిడిగా అధికారులు, ఇంధన సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తేల్చి చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, రోజువారీ అవసరాల కన్నా రెండింతలు అధికంగా చమురు సరఫరా అవుతుంటే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు ఎందుకు ‘నోస్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మంగళవారం తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల ముందు వందలాది వాహనాలు క్యూలు కట్టి ఉండడం చమురు సమస్యను కళ్లకు కట్టింది. అయితే హైదరాబాద్లో పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించినప్పటికీ, శివారు ప్రాంతాలు, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మంగళవారం కూడా మూత పడే ఉండడం గమనార్హం. హైదరాబాద్లో పెట్రోల్ సమస్య! ఇంధన సంస్థలు బల్క్ డీజిల్ ధరను లీటర్కు రూ.152 చేయడంతో పరిశ్రమలు, పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే ఇతర సంస్థలు రిటైల్ ఔట్లెట్లలో భారీగా డీజిల్ కొనుగోలు చేస్తుండడంతో కొరత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖతో పాటు ఇంధన సంస్థలు చెపుతున్నాయి. ఒకవేళ అదే నిజమని అనుకుంటే పెట్రోల్ కొరత ఎందుకొచ్చిందనే దానికి అధికారుల వద్ద సమాధానం లేకపోవడం విస్మయం కలిగించే విషయం. వాస్తవానికి హైదరాబాద్లో పెట్రోల్ విషయంలోనే వాహనదారులు సమస్య ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ సరఫరా తగినంతగా లేకపోవడమే కొరతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాల్లో డీజిల్ కోసం రైతుల క్యూలు రాష్ట్రంలో డీజిల్ కొరత కూడా మంగళవారం ఎక్కువగా కనిపించింది. మండల కేంద్రాల్లోని పెట్రోల్ బంకుల్లో రైతులు క్యాన్లతో క్యూలు కట్టారు. యాసంగి కోతల నేపథ్యంలో డీజిల్ లేక గత రెండు మూడు రోజులుగా వరికోత యంత్రాలు పొలాల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది. తెరిచి ఉన్న బంకుల వద్ద డీజిల్ను పరిమితంగానే క్యాన్లలో నింపుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాలు జిల్లాల్లోని హైవేలు, రహదారులపై క్యూలో నిలబడుతూ కనిపించాయి. నిరాటంకంగా సరఫరా: పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలో ఇంధన సరఫరా నిరాటంకంగా సాగుతున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 3,817 ఇంధన ట్యాంకర్ల ద్వారా 36,404 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ను సరఫరా చేసినట్లు పేర్కొంది. రోజువారీ పెట్రోల్ డిమాండ్ 5,883 కిలో లీటర్లు కాగా 13,622 కిలో లీటర్లు , డీజిల్ డిమాండ్ 7,348 కిలో లీటర్లకు గాను 22,782 కిలో లీటర్లు పంపించినట్లు తెలిపింది. -
అమ్మాయిలు అదరహో!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలు అదరహో అనిపించారు. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధికంగా ఫలితాలు సాధించారు. బుధవారం టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇ.నవీన్ నికోలస్, విద్యాశాఖ అదనపు సంచాలకుడు పీవీ శ్రీహరి, జి.రమేశ్ తదితరులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ క్యాంపస్లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగాయి. సీబీఎస్ఈ టైమ్టేబుల్ మోడల్లో ఈసారి పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు, పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల విరామం ఉండేలా నిర్వహించడంతో పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు విద్యార్థులకు ఎంతగానో దోహదపడింది. దీంతో ఉత్తీర్ణత కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,16,815 మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,351 మంది వన్టైమ్ ఫెయిలైన విద్యార్థులున్నారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల్లో 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో 4,91,774 మంది రెగ్యులర్, 5,538 మంది వన్టైమ్ ఫెయిల్ విద్యార్థులున్నారు. రెగ్యులర్ కేటగిరీలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 2.37 శాతం పెరిగింది. తాజా ఫలితాల్లో బాలికలు 96.26 శాతం మంది, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణులయ్యారు. జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులు ఆందోళన చెందొద్దని విద్యాశాఖ సూచించింది. జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పీవీ శ్రీహరి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలు రాయాలనుకుంటే మే 14 కల్లా ఫీజును సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలి. హెడ్మాస్టర్లు ఇ–ఎన్ఆర్లను డీఈఓకు మే 15లోగా సమరి్పస్తారు. డీఈఓలు ఇ–ఎన్ఆర్లను మే 16లోగా ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందజేయాలి. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ములుగు ఫస్ట్... హైదరాబాద్ లాస్ట్2026 టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్లో నిలిచింది. 99.30 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలబడగా... అట్టడుగు స్థానంలో హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో ఉండిపోయింది. టెన్త్ ఫలితాలను విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన వెబ్సైట్లలో చూసుకోవచ్చు. రానున్న 15 రోజులు ఈ ఫలితాలు అందు బాటులో ఉంటాయి. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 30 నుంచి మే 14 వరకు https://bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్కుల రీకౌంటింగ్ కోసం రూ.500 ఫీజు, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
కాంగ్రెస్ డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల ద్వారా సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్.. మరో వైపు క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవల జగిత్యాల బహిరంగ సభతోపాటు, రెండు రోజుల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘డిక్లరేషన్ల’పై సమర భేరి మోగించనుంది. కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలను నిర్వహించి వాటి అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మే 6న వరంగల్లో ‘రైతు డిక్లరేషన్’ అమలు వైఫల్యంపై సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మే 9న హైదరాబాద్లో ‘యూత్ డిక్లరేషన్’అమల్లో డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇదే తరహాలో ఏడాది పాటు కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన తేదీల్లో, ఆ పార్టీ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఆరు డిక్లరేషన్లు.. ఆరు చోట్ల సభలు 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకొని 2023 నవంబర్ వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. – వరంగల్లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’సభకు రాహుల్గాంధీ హాజరయ్యారు. – హైదరాబాద్లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్ ’సభకు ప్రియాంకగాంధీ వచ్చారు. –చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. – 2023 నవంబర్ 9న హైదరాబాద్లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’సభకు కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, మరుసటి రోజు నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు. ఈ సభల్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ డిక్లరేషన్ల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్ఎస్ ప్రస్తుతం మినీ సభలు లేదా సమావేశాలకే పరిమితం కావాలని భావిస్తోంది. కేటీఆర్ ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2028లో కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోట పోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. డిక్లరేషన్ల వారీగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పేలా ప్రచార సామగ్రిని కూడా బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 6న వరంగల్లో జరిగే ‘రైతు డిక్లరేషన్’పై నిరసన సభను హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానం లేదా సమీపంలోని ఏదైనా హాల్లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ఆ లోపే మే 2, 3, 4, 5 తేదీల్లో పార్టీ నేతలు జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. కార్పొరేషణ్ల ఎన్నికల నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు మణుగూరు, మందమర్రి, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సభ్యత్వ నమోదుపైనా కసరత్తు గతంలో 60లక్షలకు పైగా సభ్యతాన్ని నమోదు చేసిన బీఆర్ఎస్ ఈసారి రాశి కన్నా వాసి ముఖ్యమని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ల జాబితాను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సర్ పర్యవేక్షణకు బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను ఇవ్వాలని నియోజకవర్గ ఇన్చార్జ్లను ఆదేశించింది. -
కిషన్ రెడ్డికి లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ముంపు ప్రభావం తక్కువగా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే 11 వేల కోట్లు ఖర్చు చేశామని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల పనులు పూర్తయ్యాయని సమీక్షలో చర్చించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యక్షంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జియో టెస్టింగ్ పనులను వర్షాల కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజ్ పూర్తయితే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్. రమేష్కి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం హైదరాబాద్కి బదిలీ చేసింది. బి. ప్రవీణాను ములుగు ఫారెస్ట్ కాలేజ్ డీన్గా నియమించగా.. బాలమణికి కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఎఫ్వోగా పోస్టింగ్ ఇచ్చారు.బోగా నిఖిత.. వరంగల్ డీఎఫ్వోగా బదిలీ అయ్యారు. వికాస్ మీనా ములుగు డీఎఫ్వోగా నియమితులయ్యారు. శివ్ ఆశీష్ సింగ్ మహబూబ్నగర్కు బదిలీ కాగా, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్కు నిజామాబాద్ డీఎఫ్వోగా పోస్టింగ్ ఇచ్చారు. రాహుల్ కిషన్ జాదవ్ మంచిర్యాల డీఎఫ్వోగా నియామకం కాగా, నరిజ్ కుమార్ తిబ్రేవాల్ కామారెడ్డి డీఎఫ్వోగా బదిలీ అయ్యారు. అనుజ్ అగర్వాల్ ఖమ్మం డీఎఫ్వోగా పోస్టింగ్ ఇవ్వగా.. సత్యనారాయణ.. రాజన్న సిరిసిల్ల-కరీంనగర్కు బదిలీ అయ్యారు. జి. జ్ఞానేశ్వర్ను హోఎఫ్ఎఫ్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.1,461.47 కోట్లకు 100% షేర్లను స్వాధీనం చేసుకుంది, దీంతో ఫేజ్-I, ఫేజ్-II విస్తరణ, సేవల సమన్వయం మెరుగుపడనుంది. దీంతో ఇప్పుటి నుంచి మెట్రో నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. కాగా మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్గా హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా... స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్(HEINEKEN) నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.హైదరాబాద్ను కేవలం ఐటీ డెస్టినేషన్గా కాకుండా, ప్రపంచ శ్రేణి వ్యాపార పరిష్కారాలకూ చిరునామాగా మారుతోందన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు... మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ... ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్ గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందన్నారు.హైనెకెన్ స్ఫూర్తితో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్ వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హేనెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల మంచి మనసు.. నిరాశ్రయులకు ఆశ్రయం
సాక్షి,హైదరాబాద్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటారని చాదర్ఘాట్ పోలీసులు నిరూపించారు. రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడి ఉన్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారికి తగిన ఆశ్రయం కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం (29.04.2026) ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో మలక్పేట్ గంజ్ మార్కెట్ సమీపంలోని ఫుట్పాత్పై కొందరు అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నట్లు చాదర్ఘాట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వివరాలు.. వేణుగోపాల్ (46 సం),నరసింహ (60 సం),కృష్ణ (70 సం),భరత్ ఛెత్రి (35సం),అనిల్ (35 సం)లుగా గుర్తించారు.తీవ్రమైన ఎండలో, సరైన ఆహారం, వసతి మరియు ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వీరిని చూసి చలించిన పోలీసులు, మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, సురక్షితమైన సంరక్షణ కోసం ఐదుగురిని నగరంలోని ఒక షెల్టర్ హోమ్కు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతి మరియు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఈ చొరవను స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి. ఖాకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపించాయి. -
తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత.. కిషన్రెడ్డి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్ను ఎవరూ ఇళ్లలో నిల్వ చేసుకోవద్దన్న కిషన్రెడ్డి.. చమురు నిల్వలు లేకపోతే ప్రభుత్వమే ప్రకటిస్తుందని తెలిపారు.ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దు. పెట్రోలు ధరలు పెరుగుతాయని రాహుల్ స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం. కేంద్రం ముందు చూపుతో దేశంలో చమురు కొరత లేదు. తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది. పానిక్తో ఎవరూ పెద్ద ఎత్తున పెట్రోల్ కొని నిల్వ చేసుకోవద్దు’’ అని కిషన్రెడ్డి సూచించారు. -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలను ఆర్థిక శాఖ చెల్లించింది.గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య బిల్లులు ఒక్కరోజు ఆలస్యం లేకుండా, అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఊరట లభించింది. -
ములుగు ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ 89.23 శాతం ఉత్తీర్ణత నమోదయింది. నాగర్ కర్నూలు (99.03), నిర్మల్ (98.96), జగిత్యాల (98.87), మహబూబాబాద్ (98.81) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మొత్తం 99.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలురు 2,45,027 (94.04 శాతం), బాలికలు 2,46,747 (96.26 శాతం) మంది ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 5,16,815 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 4,91,774 మంది విద్యార్థులు పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 74,099 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 66,115 మంది ఉత్తీర్ణులయ్యారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 3,287 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,264 మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 52,946, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 48,855 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. (Telangana SSC Results 2026) ములుగు తర్వాత అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,541 మంది పిల్లలు టెన్త్ పరీక్షలు రాశారు. వీరిలో 3,483 మంది పాసయ్యారు. జనగాం జిల్లాలో 6,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. మంత్రి సీతక్క హర్షంపదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం ప్రకటించారు. జిల్లా యంత్రంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జిల్లాల వారీగా ఫలితాల వివరాలు -
పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్29) ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. టెన్త్ ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్స్ కాకుండా మార్కులను కూడా ఫలితాల్లో వెల్లడించనున్నారు.👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇక, తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 👉 sakshieducation.com👉 https://results.bsetelangana.org👉 https://results.bse.telangana.gov.in👉 https://bse.telangana.gov.in👉 https://schooledu.telangana.gov.in పదవ తరగతి పరీక్షా ఫలితాల వివరాలు ఉత్తీర్ణత శాతం -95.15శాతంబాలురు - 94.07శాతంబాలికలు -96.26 శాతం100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -57310 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -0699.30 శాతంతో ములుగు జిల్లా ఫస్ట్.89.23శాతంతో హైదరాబాద్ లాస్ట్సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత -99.10శాతంప్రభుత్వ పాఠశాలల్లో 86.18శాతంజిల్లా పరిషత్ పాఠశాల్లో 93.53శాతంమోడల్ స్కూల్స్లో 97.83శాతంకేజీబీవీల్లో 98శాతంప్రైవేట్ పాఠశాలాల్లో 95.81శాతంతో పాస్2065 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100శాతం పాస్ పర్సెంటేజ్మార్కుల రీ కౌంటింగ్ ,రీ వెరిఫికేషన్ ఈనెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు అధికారులుపదవతరగతి సప్లిమెంటరీ ..జూన్ 5 నుంచి 12 వరకు నిర్వాహాణ.ఈనెల 30 నుంచి మే 16 తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. -
పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారాయన. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.. మోదీని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబం ఇటీవల ప్రధాని మోదీని కలిసింది. అంతకు కొన్నిరోజులు ముందే.. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. తాము మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించబోయే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రధానిని కలిశామని.. బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తామని ప్రీతిరెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తనకు ఇంకా టైం ఉందన్న ఆమె.. బీఆర్ఎస్ అంటే తమ కుటుంబానికి గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
మూసివేసిన రేషన్ షాపులను తెరిపించండి
ఉప్పల్: ఉప్పల్ వివిధ కారణాలతో సర్కిల్–2 పరిధిలో మూసివేసిన రేషన్ షాపులను మళ్లీ తెరిపించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్రెడ్డి కలెక్టర్ మనుచౌదరిని కోరారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు రేషన్షాపులను మూసి వేయించడంతో ఆయా ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసివేసిన రేషన్షాపులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, వృద్ధులు, దివ్యాంగులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగంరెడ్డి, పూజారి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. -
పైలెట్ రోహిత్ రెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్రెడ్డి బుధవారం ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్తో పాటు ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. మొయినాబాద్ పీఎస్ ఎస్హెచ్ వో ఎదుట 8 వారాలు లేదా చార్జిషీట్ దాఖలు చేసే వరకు.. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని షరతులు విధించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 483(2) లోని షరతులన్నీ పాటించాలని, పాస్పోర్టును ట్రయ ల్కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో గత నెల అను మతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతు న్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన విషయం విదితమే. రోహిత్రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్కు కూడా పోలీసులకు చిక్కారు. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో బెయిల్ కోరుతూ రోహిత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు పూర్తి చేసిన జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం ఈ నెల 21న తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం రోహిత్రెడ్డి బెయిల్కు అనుమతిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది. -
నేడు పదో తరగతి ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ క్యాంపస్లోని గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్నికోలస్ ఫలితాలను విడుదల చేస్తారు.రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. https://results.bsetelangana.org, https://schooledu.telangana.gov.in, sakshieducation.com వెబ్సైట్లలో కూడా చూసుకోవచ్చు. -
అత్తకు భారీ షాక్.. ఐదేండ్లు జైలు శిక్ష..!
హైదరాబాద్: గృహ హింస కేసులో భర్తకు 5 ఏండ్లు, అత్తకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం నాంపల్లిలోని మనోరంజన్లో ఉన్న 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు జడ్జి డి.అజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పహాడిషరీఫ్కు చెందిన షభాన బేగంను అక్టోబర్ 10, 2014న చాంద్రాయణ గుట్టకు చెందిన అన్వర్పాషా వివాహం చేసుకున్నాడు. వరకట్నం కింద రూ.60 వేలు, 10 తులాల బంగారం, 30 తులాల వెండీ, రూ.5 లక్షల విలువైన వస్తువులను ఇచ్చారు. కొద్దికాలం అనంతరం అదనపు కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులతో రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ వేధింపులకు గురిచేయడంతో ఆగష్టు 20, 2015లో రాజేంద్రనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎసై బాలునాయక్, ఎన్.శ్రేయ విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో చార్జిషిట్ను కోర్టులో అందజేశారు. బాధితురాలి తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు ఏపీపీ వాదనలను ఏకీభవిస్తూ నిందితులిద్దరికి శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పెళ్లి ఇష్టం లేక.. చదువుపై మక్కువ వీడక..
మేడ్చల్ జిల్లా: నిశ్చయమైన పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన బక్కతట్ల మునిత కుటుంబంతో కలిసి మేడిపల్లికి వలస వచ్చి సీపీఆర్ఐ సమీపంలో భార్యభర్తలిద్దరూ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె మమత(18) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, మమతకు మహబూబాబాద్కు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించి మే 13న వివాహ ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే ఉన్నత చదువులు చదువుకుంటానని, ఇప్పుడే వివాహం వద్దని మమత నిరాకరించినప్పటికీ తల్లిదండ్రులు బలవంతం చేశారు. ఈ నెల 23న సాయంత్రం కుటుంబమంతా కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మమత బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచి్చన చెల్లెలు వైష్ణవి తలుపు తట్టింది. స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా మమత చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ సోమవారం తెల్లవారుజామున మమత చనిపోయింది. మృతురాలి తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చమురు అక్రమ, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఏజెన్సీ నిర్వాహకులు, డి్రస్టిబ్యూటర్లతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటి సరఫరా, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజిన్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్, రీఫిల్లింగ్ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకే సిలిండర్ కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పౌరులు వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, సంక్షేమ అధికారులు జి.ఆశన్న, ప్రవీణ్ కుమార్, ఇలియాస్ అహ్మద్, ఆర్టీఓ పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
పోలీస్ బాస్.. పక్కా హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ).. రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్.. యూనిఫాం ధరించిన ప్రతి ఐపీఎస్ అధికారి కల.. ఇంతటి కీలక పోస్టులో నియమితులైన సీవీ ఆనంద్ ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి అన్నట్లు పూర్తిగా నగరంతో అనుబంధం పెనవేసుకున్నారు. ఆనంద్ తల్లిదండ్రులది నగర శివారులోని కుంట్లూరు. అయితే, ఆయన సిటీలోనే పుట్టారు. ఇక్కడే చదువుకున్నారు. ఈ ప్రత్యేకతకు తోడు.. ఐపీఎస్ అధికారిగా ఈస్ట్జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా, సైబరాబాద్ పోలీసు కమిషనర్గా, రెండుసార్లు నగర కొత్వాల్గా పని చేశారు. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పనిచేసిన నేపథ్యంలో సిటీపై మంచి పట్టు ఉంది. నాలుగైదేళ్లు కేంద్ర సరీ్వసుల్లో డిప్యుటేషన్పై విధులు నిరి్వర్తించినా.. నగరం కేంద్రంగానే పని చేశారు. సీపీ టు డీజీపీ... ఇక అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు విభజన తర్వాత డీజీపీలుగా నియమితులైన వారిలో అత్యధికులకు సిటీతో ‘అనుబంధం’ ఉంటోంది. వీరిలో ఎక్కువమంది సిటీ పోలీస్ కమిషనర్లుగా పని చేసినవారే. ఈ పరంపరకు కొనసాగింపుగా మంగళవారం సీవీ ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పక్కా హైదరాబాదీ కావడం.. సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు కావడం విశేషం. నాలుగు దశాబ్దాల్లో ..1986 నుంచి ఇప్పటివరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత మహేందర్రెడ్డితో కలిపి మొత్తం 25 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీ సీటులో కూర్చున్నారు. వీరిలో 14 మందికి నగర పోలీసు కమిషనర్లుగా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు, అంజనీకుమార్ తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీలుగా నియమితులైన ఏడుగురిలో నలుగురు సిటీ నుంచే వెళ్లారు.ఆ అనుభవంతో లేక్ పోలీసు సృష్టి.. చిన్నతనంలో ఆనంద్ కుటుంబం ఆదర్శ్నగర్లో ఉండేది. అక్కడినుంచి తరచూ ట్యాంక్బండ్ నుంచి రాకపోకలు సాగించేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్సాగర్లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచి్చంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నగర కొత్వాల్గా పని చేసినప్పుడు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక ఆవిష్కరణలు ఆనంద్ ఖాతాలోకే వెళ్తాయి. సీపీ టు డీజీపీలు వీరే.. సీజీ సల్దాన్హ ఆర్.ప్రభాకర్రావు టి.సూర్యనారాయణరావు ఎంవీ భాస్కర్రావు హెచ్జే దొర ఎస్ఆర్ సుకుమార పేర్వారం రాములు వి.దినేష్రెడ్డి ఏకే మహంతి బి.ప్రసాదరావు అనురాగ్శర్మ ఎం.మహేందర్రెడ్డి అంజనీకుమార్ సీవీ ఆనంద్ -
పెట్టుబడికి 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్సిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నియుద్ధాలు వచ్చినా.. ఇక్కడ ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాలుగా రక్షణతో కూడిన ప్రదేశం ఇదే. పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ భవనం సహా ఆక్టోపస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలకు సంబంధించిన శిలాఫలకాలనూ ఆవిష్కరించారు. గిరిదర్శక్ పథకంలో భాగంగా 20 మంది మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తీర్మానం చేసి పంపండి.. మూసీనది పునర్నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కితగ్గం. శంషాబాద్ కేంద్రంగా అమరావతి మీదుగా చెన్నై వరకు, అటు బెంగళూరు, ఇటు పుణే నుంచి ముంబై ఇలా మూడు బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయి. ఇక్కడే అతిపెద్ద బస్ టెర్మినల్ రాబోతోంది. అభివృద్ధిలో మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న నగరాలతో పోటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. 160 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డు దేశంలో ఏ నగరానికీ లేదు. అదేస్థాయిలో రీజినల్ రింగ్రోడ్డును అందుబాటులోకి తేనున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్సిటీలో కలపాలని కోరుతున్నారు. తీర్మానం పంపితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఫ్యూచర్సిటీ అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో కూర్చొని ఒప్పందాలు చేసుకోవాలి. జూన్ 2లోపే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. మీరు ఏడ్చుకుంటూ ఉండండి... శంషాబాద్, ఔటర్ రింగ్రోడ్డు, హైటెక్ సిటీలను నాడు అవహేళన చేశారు. ఊహాచిత్రంగా భావించి, అనుమానించారు. అదేవిధంగా నేడు కొంత మంది ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ కడతాడట అని విమర్శిస్తున్నారు. మీరు ఏడ్చుకుంటూ ఉండండి. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతుంటా. మీ ఏడుపు నాకు శంకరాభరణంలోని సంగీతం విన్నట్లు ఉంటుంది. వారిది అసురజాతి. వాళ్లు పోయినా నష్టం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. రైతులను ఎంత రెచ్చగొట్టినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గం. లీగల్ చిక్కులకు అవకాశం లేకుండా పక్కాగా నోటిఫికేషన్లు ఇచ్చి, రైతులను ఒప్పించి, మెప్పిస్తాం. వారికి నచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించిన తర్వాతే ముందుకెళ్తాం. అభివృద్ధి పనుల కోసం ఈ రోజు కాకపోయినా రేపైనా భూసేకరణ తప్పదు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని వేరేచోట పెట్టుబడి పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు, ఉద్యోగ అవకాశాలకు సహకరించండి. జనజీవన స్రవంతిలో కలవండి.. అన్నలూ అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలకు పూర్తి రక్షణ, ఆరోగ్య బాధ్యత మాది. ఆశయ సాధన పేరుతో అడవుల్లో ఉండి అసువులు బాసే కన్నా జనారణ్యంలో భాగస్వాములు కావడం ఉత్తమం. ఇటీవల లొంగిపోయిన గణపతి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలిసింది. ఆయన ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గిరిజన, ఆదివాసీ బిడ్డలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే గిరిదర్శన్ పథకాన్ని తీసుకొచ్చాం’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాం«దీ, డీజీపీ బి.శివధర్రెడ్డి, ఫ్యూచర్సిటీ సీపీ సుదీర్బాబు, మల్కాజ్గిరి సీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతో ఫ్యూచర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే తెలంగాణ లక్ష్యం. అన్ని హంగులతో భారత్ ఫ్యూచర్సిటీని తీర్చదిద్దబోతున్నాం. పరిశ్రమలు, వాణిజ్యం ముందంజలో ఉండటానికి పోలీసుల కృషి అభినందనీయం. డ్రగ్స్రహిత సమాజం కోసం పోలీసు శాఖ ఎంతగానో కృషిచేస్తోంది. సాంకేతిక వినియోగంలోనూ ముందంజలో ఉంది. 20 మంది గిరిదర్శక్ల నియామకం: డీజీపీ శివధర్రెడ్డి తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అద్భుత అడ్వెంచర్లు ఉన్నాయి. పర్యాటకులకు వీటిని చూపించేందుకు ప్రభుత్వం గిరిదర్శన్ పేరుతో ప్రత్యేక గైడ్లను నియమించింది. అడవిబాటను వీడి జనం బాటపట్టిన గిరిజన, ఆదివాసీ యువకులను ఇందుకు ఎంచుకుంది. ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలను చూపించనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 20 మంది ఆదివాసీలను గిరిదర్శక్లుగా నియమించి శిక్షణ ఇచ్చాం. ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తాం. ప్రత్యేక యూనిఫాంలో ఉండే వీరు.. పోలీసులు, ఫారెస్ట్, టూరిజం శాఖల సమన్వయంతో పనిచేస్తారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుంది. -
డేంజర్ జోన్లో సొరంగం!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 6 కి.మీ.ల దూరంలో ‘నల్లవాగు’ మేజర్ ఫాల్ట్ జోన్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నల్లవాగుకి 2 కి.మీ.ల తూర్పు, పడమర దిశలోని సొరంగ మార్గంలో మరో రెండు ఫాల్ట్ జోన్లు కూడా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 50–300 మీటర్ల లోతుల్లో దక్షిణ దిశగా వాలుతూ ఈ ఫాల్ట్ జోన్లు కనిపించాయి. అక్కడి పొరల నిర్మాణంలో చీలికలూ ఉన్నాయి. సొరంగ మార్గం వెంబడి భూగర్భ జలాల ప్రవాహానికి ఈ చీలికలు ప్రధాన మార్గంగా పనిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లవాగు ప్రాంతం పరిధిలోనే సొరంగ నిర్మాణం జరుగుతుండడంతో ఈ ఫాల్ట్ జోన్లు ఏర్పడ్డాయి. సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు 2025 అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో అత్యాధునిక హెలీబోర్న్ వీటెమ్ సాంకేతికతతో ఆకాశం నుంచి భూగర్భంలో పరిశోధనలు నిర్వహించగా, పైన పేర్కొన్న రీతిలో పలు ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ఈ సర్వే నివేదికను ఇటీవల ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అత్యాధునిక పరికరాల ద్వారా విద్యుదయస్కాంత సంకేతాలను భూగర్భంలోకి పంపించి వాటి వ్యాప్తిని గమనించడం ద్వారా భూ పొరల్లో ఫాల్ట్స్, ఫ్రాక్చర్లు, షీర్ జోన్లతో పాటు భూగర్భ జలాల ప్రవాహాన్ని ఈ పరిశోధన ద్వారా నిర్థారిస్తారు. పగుళ్ల మధ్య ప్రవహిస్తున్న నీళ్లు సొరంగం కుప్పకూలిన ప్రాంతంలో 13.65– 13.95 కి.మీ.ల మార్గంలోని శిలల మధ్య తీవ్రమైన పగుళ్లు ఏర్పడి ఉండగా, వాటి మధ్య మట్టి నిక్షిప్తమై బలహీన నిర్మాణాన్ని కలిగి ఉంది. అక్కడి శిలలు చీలిపోయి నిటారున మడతపడి ఉండగా, పగుళ్ల మధ్య నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతోనే సొరంగం కుప్పకూలినట్టు భావిస్తున్నారు. ⇒ సొరంగం కూలిన ప్రాంతానికి పక్కన తీవ్ర పగుళ్లతో మరో రెండు ప్రమాదకర జోన్లను కూడా గుర్తించారు. ఈ పగుళ్ల మధ్య కూడా భూగర్భ జల ప్రవాహం కొనసాగుతోంది. ⇒ సొరంగం మధ్య ప్రాంతంలో నల్లవాగు ఫాల్ట్ జోన్ ఉంది. ఇక ఉత్తర భాగంలో పగుళ్లు/చీలికలున్నాయి. ఉత్తరాన విద్యుదయస్కాంత క్షేత్రం ⇒ సొరంగం కూలిన ప్రాంతానికి ఉత్తరాన అసాధారణ రీతిలో అత్యల్ప విద్యుదయస్కాంత క్షేత్రం ఉన్నట్టు కనుగొన్నారు. (నల్లవాగు ఫాల్ట్ జోన్) ⇒ సొరంగ మార్గంలో 13.2 కి.మీలు, 13.6 కి.మీలు, 13.9కి.మీ.ల వద్ద పగుళ్లు, చీలికలు ఉన్నాయి. వీటి మధ్య జలాలు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి ⇒ సొరంగ మార్గం 21–23 కి.మీ.ల మధ్య 250 మీటర్ల లోతుల్లో శిలల నిర్మాణం లోహ ఖనిజాల నుంచి గ్రనైట్కు మారుతోంది. దీంతో ఇక్కడ తవ్వకాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నివేదిక స్పష్టం చేస్తోంది. ⇒ నల్లమలలోని తిరుమలపూర్కి ఉత్తరాదిన.. ఈశాన్యం నుంచి నైరుతి దిశగా మరో రెండు సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ⇒ సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతాల్లో పగుళ్లు, చీలికలు పలు దిశల్లో విస్తరించి ఉన్నాయి. ఉపరితలం నుంచి 250 మీటర్ల లోతు వరకు ఇలాంటి నిర్మాణాలుండగా, వీటి గుండా భూగర్భ జలాలు ప్రవహిస్తున్నాయి. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. సుమారు రూ. 2.15 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచే ఈ డ్రగ్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన సదరు వ్యక్తి హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడ్డాడు. 6.15 కిలోల ఈ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ రూ. 2. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఎయిర్ ఆసియా విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు దీన్ని 16 సీల్డ్ ప్యాకెట్లలో దాచిపెట్టి తెచ్చాడు. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అది కూడా బ్యాంకాక్ నుంచే వచ్చింది. 25 కిలోల 45 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకువచ్చారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.8.9 కోట్లు. -
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఐపీఎస్ సీవీ ఆనంద్ను రాష్ట్ర డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసింది.దీంతో హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. యూపీఎస్సీ కమిటీ సిఫార్సుల మేరకు నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది. తన సర్వీస్ ఆరంభంలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలు ఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు. అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్టెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
వైఎస్ భాస్కర్రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు
హైదరాబాద్: వైఎస్ వివేకా కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 28వ ఏ తేదీ) పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండిషన్ బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. తాజాగా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది.ఇక విచారించాల్సిందేమీ లేదని సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేయడంతో షరతులను హైకోర్టు సడలించింది. ఫలితంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. -
జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 కార్పొరేషన్ల ఏర్పాటులో కీలకపాత్ర
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్గా గత సంవత్సరం ఏప్రిల్ 29న ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టారు. నేటికి ఏడాది పూర్తవుతోంది. జీహెచ్ఎంసీ వంటి పెద్ద కార్పొరేషన్లో ఏడాది కాలం అంటే స్వల్ప సమయమే. కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎవరికైనా జీహెచ్ఎంసీ పాలనవ్యవస్థ, వివిధ విభాగాలు, అర్థం చేసుకునేందుకే ఎంతలేదన్నా ఆర్నెళ్లు పడుతుంది. అందుకే గతంలో కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న సీనియర్లనే జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించేవారు కాగా, ఆ పరిస్థితి మారింది. ఓవైపు కమిషనర్గా రెగ్యులర్ బాధ్యతలతో పాటు కర్ణన్కు మిగతా వారికంటే అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి.వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది 150 వార్డుల నుంచి 27 స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులకు, పరిధి సైతం మూడురెట్లు పెరిగింది. రాజకీయంగా బలమైన ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ, ఎలాంటి రాద్ధాంతాలు, వివాదాలకు తావులేకుండా ఈ రెండు పనుల్ని అతి స్వల్ప సమయంలో విజయవంతంగా పూర్తిచేశారు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకొనే జనగణన కార్యక్రమానికి సైతం క్యూర్ వరకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నియమించారు. అన్ని పార్టీలకూ ఎంతో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను జిల్లా ఎన్నికల అధికారిగా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించారు. ‘నగదు’ లేకుండా పనులు బల్దియా పరిపాలనలో ఎన్నో సంస్కరణలు చేపట్టినప్పటికీ, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నగదు రహిత సేవలు. ఆస్తిపన్ను చెల్లింపుల నుంచి మొదలు పెడితే జీహెచ్ఎంసీలో అన్ని సేవలకు ఫీజుల చెల్లింపులకు ఆన్లైన్లో సదుపాయం కల్పించారు. రెండు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అవినీతికి తావులేకుండా పారదర్శక చెల్లింపులు. ఆయా అవసరాల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల దాకా రాకుండా సదుపాయం.డిజిటల్ వినియోగంపై ఎక్కువ శ్రద్ధ చూపారు. ప్రజలు తమ సమస్యల్ని ఫిర్యాదు చేసేందుకు సైతం క్యూఆర్ కోడ్ వినియోగం వంటివాటితో సాంకేతికతతో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వివిధ సర్వేల ద్వారా పన్ను పెంచకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగేలా చేయడంతో పాటు వసూళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించి గత రికార్డుల్ని బ్రేక్ చేశారు. క్యూర్ వరకు వరద సమస్యల పరిష్కారానికి మాస్టర్ప్లాన్, వీధిదీపాల సమస్యల పరిష్కారానికి సర్వే, తదితరమైన వాటిని చేపట్టారు. ఏఎంఓహెచ్ల విధులు మార్చారు.వీటిపై దృష్టి పెట్టాలి..నాలాలు, రోడ్లు, వీధిదీపాలు, రోడ్లపై చెత్త, అవినీతి వంటి సమస్యల్ని మాత్రం కర్ణన్ పూర్తిగా పరిష్కరించలేకపోయారు. దీర్ఘకాలంగా ఉన్నవాటి పరిష్కారానికి సమయం పట్టనుంది. ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో చూపిన శ్రద్ధ ఏటీఆర్లపై చూపలేదనే ఆరోపణలున్నాయి. ‘సర్’పై సమీక్ష ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్న ఈ సమావేశంలో సర్ మ్యాపింగ్ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బీఎల్ఓ రోజుకు వంద మంది ఓటర్లను, ఒక్కో సూపర్వైజర్ రోజుకు వెయ్యి మంది ఓటర్లను మ్యాప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించారు. మే 5వ తేదీలోపు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.హెల్ప్డెస్క్ ఏర్పాటు ఓటర్లకు సర్ గురించి అవగాహన కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్డెస్క్ (Help Desk) ఏర్పాటు చేశారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ వివరిస్తారు.చదవండి: సీఎం వస్తున్నారని ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత -
పెట్రోల్, డీజిల్ కొరత.. స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి అని వాహనదారులకు సూచించారు.తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. పబ్లిక్ ఆందోళన వల్లే ఈ కొరత ఏర్పడింది. ఒక రోజుకు 13వేల కిలో లీటర్ల సప్లై చేసేది.. నిన్న ఒక్క రోజే 30వేల కిలో లీటర్ల సరఫరా చేశాం. పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ నో స్టాక్ పెట్టిన, రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆన్లైన్లో మానిటరింగ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతాయని భయంతో ప్రజలు ఇలా చేస్తున్నారు.దాదాపు 70, 80 రోజుల వరకు స్టాక్ అందుబాటులో ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు మాకు సహకరిస్తున్నారు. గతవారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో లాస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ బంకులలో డీజిల్ బయింగ్ చేయడం వల్ల మనకు కొరత ఏర్పడింది. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి. క్రెడిట్ లిమిట్పై జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. అందరు డీలర్లకు అన్ని రకాలుగా సరఫరా జరుగుతుంది. -
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఏప్రిల్ 29వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హాజరై ఫలితాలను విడుదల చేయనున్నారు.మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది. -
‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?
తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీకు ఇచ్చింది. హిమాచల్లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న భావన కలుగుతోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అషురెడ్డి ‘చీటింగ్’పై సీసీఎస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్ల మేర మోసం చేసిన కేసులో సినీ నటి అషురెడ్డికి (కొయ్య వెంకట అశ్విని రెడ్డి) త్వరలో నోటీసులు జారీ చేయాలని నగర సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. లండన్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైవీ ధర్మేంద్ర తరఫున ఆయన తండ్రి ఎనుముల సత్యనారాయణ మూర్తి ఇచి్చన ఫిర్యాదు మేరకు అషురెడ్డిపై ఈ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం... ధర్మేంద్ర 2018లో ఇక్కడ ఉన్నప్పుడు అషు రెడ్డిని కొందరు పరిచయస్తుల ద్వారా కలిశాడు. పరిచయమైన రెండు నెలల్లోనే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. ధర్మేంద్ర తనకు అప్పటికే వివాహమైందని, విడాకులు ప్రక్రియలో ఉన్నాయని చెప్పినా... అది సమస్య కాదని చెప్పిన అషురెడ్డి సంబంధాన్ని కొనసాగించింది. తన హెచ్1బీ వీసాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, విద్యా రుణం ఉందని, తండ్రికి ఆర్థికంగా సహాయం చేయడానికే చదువును ఆపేశానని వివరించింది. తాను నటిగా ఎదగడానికి భారత్కు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని ధర్మేంద్రను కోరింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడు నమ్మి ఆమె ఖర్చులను భరించడం మొదలెట్టాడు. కొన్నాళ్లకు అషురెడ్డి తన నెలవారీ ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనం కోసం డబ్బులు అడగటం మొదలుపెట్టింది. అలాగే కార్లు, బంగారం, ఆస్తులు తన పేరుతో కొనిపెట్టమని కోరింది. అయితే 2020 జూలైలో ధర్మేంద్ర పెళ్లి ప్రస్తావన తెచి్చనప్పుడు చేసుకోనని అషురెడ్డి చెప్పింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరాడు. అయితే రూ.70 లక్షలు తిరిగి ఇస్తానని అంగీకరించి ఖాళీ చెక్కులు ఇచ్చి ఆ తరువాత పట్టించుకోలేదు. కొద్ది రోజుల తరువాత మళ్లీ పెళ్లి ప్రస్తావన రావడంతో అతడు నమ్మి వారితో సంబంధాన్ని కొనసాగించాడు. భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు, దాదాపు ఐదు కిలోల బంగారం ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడిని అల్లుడిగా సంబోధిస్తూ, వారి ఖర్చులు భరించమని ఒత్తిడి చేశారు. మొత్తం ఐదేళ్లలో సుమారు రూ.9.35 కోట్లు ఇలా ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. దీనికి అదనంగా అషురెడ్డి చెల్లెలు రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు తొలుత ధర్మేంద్ర తండ్రి నుంచి అవసరమైన అన్ని పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆపై ఈ కేసులో నిందితులుగా ఉన్న అషురెడ్డితో పాటు ఆమె తండ్రి, సోదరి, తల్లి తదితరులకు నోటీసులు జారీ చేయనున్నారు. -
ఐదు గంటలు వెంటాడి దొంగను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: ఓ కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లో నివసించే వినోద్కుమార్ బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్కుమార్ వద్దకు వచ్చి అర్జెంటుగా ఫోన్కాల్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీరు సీసాలతో దాడి చేశాడు. బెదిరించి, కొట్టి ఫోన్తోపాటు రూ.3 వేలు లాక్కొని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్డులోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్ట వేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి రెండువైపుల నుంచి వెతుకుతుండగా ఒకచోట బీరు తాగుతూ కనిపించాడు. పట్టుకునేందుకు యత్నించగా బీరు బాటిల్ పగులగొట్టి పొడుస్తానంటూ.. కత్తితో బెదిరిస్తూ వారిని తప్పించుకుని ఎమ్మెల్యే కాలనీలోకి పరారయ్యాడు. ఐదు గంటల్లో పట్టివేత... రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అక్కడ ఓ ఇంటి ప్రహరీ దూకి రోడ్డు వైపు వచ్చేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో జవహర్నగర్ డంపింగ్యార్డు సమీపంలో ఉండేవాడని, అతడు పాత నేరస్తుడైన తురేకర్ అజయ్ అలియాస్ బబ్లూ(27)గా గుర్తించారు. ప్రస్తుతం సనత్నగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తేలింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న బబ్లూ రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. గంజాయికి, మద్యానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. -
హైదరాబాద్లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. భారీ క్యూలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ దొరకదంట.. అర్జంట్గా పోయి ట్యాంకు ఫుల్ చేయించుకోవాలి అంటూ బంకు దగ్గరికి వెళ్లిన రామారావుకి జనం కాస్త ఎక్కువగా కనబడ్డారు. కాస్త ముందుకు వెళ్తే మరో బంక్ ఉంది కదా అనుకుని వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపించింది. చూస్తే కిలోమీటర్పైగా బండ్లు క్యూ కట్టాయి. పోనీలే ఇంకో బంక్ అనుకుంటూ మరో రెండు కిలోమీటర్లు వెళ్లి చూస్తే అక్కడ ‘‘నో స్టాక్ బోర్డు’’.హైదరాబాద్లో సోమవారం నుంచి పెట్రో బంకుల వద్ద పరిస్థితి ఇది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్రతరంగా మారింది. పెట్రోల్ బంకుల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు భారీగా వరుస కట్టాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాతే పెట్రోల్, డీజిల్ అంటూ చెబుతున్నారు బంకు నిర్వాహకులు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద దృశ్యాలు ఇవే. తొలుత ఏపీలో కేవలం డీజిల్ కొరత మాత్రమే ఉందని చర్చ జరగ్గా.. ఆ వెంటనే అది పెట్రోల్కు కూడా పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా నెమ్మదిగా అంతటా ‘పెట్రో కొరత వైరస్’ వ్యాపించేసింది. కంపెనీల నిర్వాకమా?యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లకు సరఫరాను తగ్గించగా.. మరికొన్ని ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడుతోంది. ఒకేసారి డిమాండ్ పెరగడంతో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతుండగా.. సాధారణంగా రెండు మూడు రోజులకు సరిపడే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు. ‘‘పెట్రోల్, డీజిల్ అయిపోతోంది’’, ‘‘ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా ఇక కష్టమే’’, ‘‘ధరలు పెరుగుతాయి” ఇలాంటి వదంతులతో ప్రజలు అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. ఫలితంగా.. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే కాదు వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమ.. ఇతర రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్!తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందనే ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమైందని ప్రభుత్వం అంటోంది. అలాగే తగినంత నిల్వలు.. సరఫరా సాఫీగానే ఉందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులను రంగంలోకి దించినట్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్నది జనం మాట. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తిట్టిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరైన సమాచారం అందించి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ భయాందోళనలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.Again I could see big queues at Petrol bunks #Hyderabad— Vinay (@vinay_a9) April 27, 2026Visited 3 petrol bunks in Hyderabad after 9PM, no service anywhere. Shortage again? 🤨#Hyderabad #PetrolShortage— Rishi. (@Rushiver_k) April 27, 2026Long queues in front of all petrol bunks in hyderabad . Shooting was interrupted today because of scarcity of diesel. 🙏🙏🙏— Sateesh Botta (@bkrsatish) April 27, 2026@TelanganaCMO @TelanganaCS @PetroleumMinToday almost all petrol Bunks in #Hyderabad have displayed "no stock" boards.And which bunk the stock is available have kilometres of Queue line for #petrol and #diesel.Is this a real shortage of fuel? pic.twitter.com/0xenXCN8dj— JALIGAMA PAVAN 🇮🇳 (@JaligamaPavan) April 27, 2026petrol crisis in hyderabad, most of the petrol bunks are closed and there's a huge rush wherever it's opened! pic.twitter.com/TjZws7nZwn— Vipul (@vipul_devis) April 27, 2026 -
ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘ఇది ఒక చిల్లర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి, ఆ కూతలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్ధం కావడం లేదు. బొందలో పడినట్లు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏ ర్పాటు అంటూ ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. దళారుల ప్రమేయం లేకుండా వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతుబంధు పథకాన్ని నిర్వీర్యం చేసి ఒక్కో దఫాలో ఒక్కో ఎకరాకు డబ్బులు ఇస్తూ రైతులను ప్రభుత్వం వంచిస్తోంది..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం కోసం నడుం బిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం ఉధృతం చేయాలన్నారు. భారత్ రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400 మంది పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి నుంచి వివిధ అంశాలపై కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి ‘బీఆర్ఎస్కే తెలంగాణ పట్ల తడి, ఆర్తి ఉంది. తేజస్వీ సూర్య అనే వెధవ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా నిశ్చలంగా మారారు. వారి ని్రష్కియాపరత్వం స్పష్టంగా కనిపించింది. అదే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు కనిపించింది. బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. మహిళలకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక రకాలుగా అవమానాలు, క్షోభను అనుభవించా. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరిస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత సోనియా చెప్పినా నేను అంగీకరించలేదు. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..’ అని కేసీఆర్ చెప్పారు. ‘సర్’లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్, బిహార్ తరహాలో లక్షలాది మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో బూత్ స్థాయిలో పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు కావడం వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైనట్లు గుర్తించాం. ‘సర్’లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా గ్రామ స్థాయి మొదలుకుని అన్నిరకాల కమిటీలు రద్దు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్లైన్, ఆఫ్లైన్ విధానంలో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు నియోజకవర్గానికి 200 మంది చొప్పున శిక్షణ ఇచ్చి తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా తీర్చిదిద్దుతాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తాం. జీవన్రెడ్డి సేవలు వినియోగించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల పార్టీలో చేరిన టి.జీవన్రెడ్డిని కేవలం జగిత్యాలకు పరిమితం చేయకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటాం. రాజ్యసభ ఎంపీగా ఇటీవల రిటైరైన కేఆర్ సురేశ్రెడ్డి బాగా పని చేశారు..’ అంటూ కేసీఆర్ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఇటీవల పారీ్టలో చేరిన జీవన్రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. -
కాసుల కోసమే కృత్రిమ కొరత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు, వ్యవసాయ అవసరాల కోసం రైతులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలు, జిల్లాల్లోని పలు పెట్రోల్ బంకుల ముందు కార్లు, టూవీలర్ల క్యూలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. తెరిచిన పెట్రోల్ బంకుల వద్ద వాహనాలను క్రమబదీ్ధకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లిబర్టీ వద్ద గల ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏకంగా ఎస్సై స్థాయి అధికారితోపాటు ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కనిపించారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతుండగా మరి బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. డీలర్ల సంఘం మాత్రం చమురు కంపెనీల వల్లే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఆరోపిస్తుంది. నష్టాలు తగ్గించుకొనే వ్యూహం? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగ్గా దేశంలో మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పెట్రో చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. దీంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీ), భారత్ పెట్రోలియం (బీపీ) తీవ్ర నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రెండోదశ పోలింగ్ ప్రక్రియ ఈ నెల 29న సాయంత్రం ముగుస్తుండటంతో ఆ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సంకేతాలు ముందే అందడంతో చమురు సంస్థలు ఇప్పటి నుంచే నష్టాలను నివారించుకొనే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే సరఫరాను తగ్గించి ‘కృత్రిమ కొరత’సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లు పెట్టిన ఇండెంట్ ప్రకారం కాకుండా కావాలనే తగ్గించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత నెలకొనడంతో రాష్ట్రంలోని వాహనదారులు ముందుజాగ్రత్తగా తమ వాహనాలను ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి బంకుల ముందు క్యూకట్టడం వల్ల కూడా ఇంధనం ముందే నిండుకుంది. దీంతో చాలా చోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీలర్ల గోల్మాల్తో పెరిగిన కొరత.. రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు డీలర్లు ఇంధన కొరత పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ధరలు పెరిగాక విక్రయించి మరింతగా సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో కొందరు డీలర్లు కావాలనే పెట్రోల్, డీజిల్ను నిల్వ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో ఆదివారం వరకు లేని ఇంధన కొరత సోమవారం ఒక్కసారే కనిపించడం వెనుక డీలర్ల ‘ముందు చూపు’కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము డబ్బు చెల్లించినప్పటికీ చమురు సంస్థల నుంచి ఇంధనం రావట్లేదని డీలర్ల సంఘం నేత అమరేందర్రెడ్డి పేర్కొన్నారు. కంపెనీల సరఫరా గొలుసులో లోపాల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇంధన కొరత లేదు: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని.. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో అధికారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు రాష్ట్రంలో 74.43 లక్షల లీటర్ల పెట్రోల్, 1.10 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా అయిందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా బాధ్యతగా వ్యవహరించాలని.. అవసరానికి మించి ఇంధనం కొని నిల్వ చేయొద్దని సూచించారు. బంకుల సిబ్బంది, పోలీసులకు సహకరించి రద్దీని నివారించాలని కోరారు. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు లేదా భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు, సమస్యల కోసం 1967 హెల్ప్లైన్ను సంప్రదించాలన్నారు. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్హౌస్లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్హౌజ్లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్లో లేరు. కేసీఆర్కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై కేసీఆర్, హరీశ్రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
పోలీసులకు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి సెలవులు
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉండే పోలీసులకు ఊరటనిచ్చేలా తెలంగాణ పోలీస్శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం, ఉద్యో గం మధ్య సమ తుల్యత పెంపొందించాలనే లక్ష్యంతో వారి పుట్టిన రోజు, వివాహ వార్షి కోత్సవాల సందర్భంగా సెల వులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ బి.శివధర్రెడ్డి ఒక సర్క్యులర్ను విడుదల చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం..పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించ డమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నట్టుగా సర్క్యు లర్లో తెలి పారు. ఈ సెలవులను హక్కుగా పరిగణించరాదు. అత్యవసర పరిస్థి తులు మినహా సాధ్యమైనంత వరకు మంజూరు చేయాలని యూనిట్ అధికారు లకు సూచించారు. సర్వీస్ రికార్డు ప్రకారం సరైన ధ్రువీక రణ ఉండాలి. అదేవిధంగా సెలవు కోరు తున్న సిబ్బంది ముందస్తు లిఖితపూర్వక అభ్యర్థన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో సెలవు నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం ద్వారా పోలీసు సిబ్బందిలో మనోధైర్యం పెంపొందడమే కాకుండా కుటుంబ బంధాలు బలపడతాయని అధికారులు భావిస్తున్నారు. -
22 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేర కు డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికా రు లను ఆయా యూనిట్ అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డ్రగ్స్ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు ల్లో ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉంటే అంత వేగంగా స్పందించండి. ఈ రకమైన వ్యవహారాల్లో ఎంత పెద్ద వారున్నా, ప్రముఖులు ఉన్నా డోంట్ కేర్ ఎనీ వన్ (ఎవర్నీ ఖాతరు చేయకండి).. డోంట్ స్పేర్ ఎనీ వన్ (ఎవర్నీ వదిలిపెట్టకండి). సామాన్యులు వెయ్యి మందిని అరెస్టు చేయడం కన్నా ప్రముఖులు ఇద్దరిని జైల్లో వేస్తే ప్రజలకు బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ పోలీసు విభాగం కొత్తగా అమల్లోకి తీసుకు వచ్చిన ‘స్పందన’ బృందాలను సీఎం సోమవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీ వద్ద ప్రారంభించి మాట్లాడారు.మహిళల భద్రతకు పెద్దపీట వేస్తే అభివృద్ధి: ‘వివిధ కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఈ స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. నేరగాళ్ల గుర్తింపు, వారికి శిక్ష పడేలా చేయడం కాలక్రమంలో జరిగినా.. బాధితులకు తక్షణ భద్రత కల్పించడానికి ఈ బృందాలు పని చేస్తాయి. మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ నేను వస్తున్నానంటే..అది మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందనే సందేశం, ఆదేశం అన్ని స్థాయిల అధికారులకు ఇవ్వడమే.ఏ దేశంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తారో ఆయా దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలి ప్రధాని నెహ్రూ దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడి మహిళలు ఓటు హక్కు సాధించుకోవడానికి 150 ఏళ్లు పట్టింది. కానీ మన దేశంలో రాజ్యాంగంలోనే మహిళలకు ఓటుహక్కు సంబంధిత అంశాలన్నీ పొందుపరిచాం. విద్యా, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ 2013 లోనే బిల్లు ప్రవేశపెట్టింది..’ అని రేవంత్ చెప్పారు. పీస్ కమిటీలకు డ్రగ్స్ నియంత్రణ బాధ్యతలు: మత కలహాల సమయంలో పోలీసులకు సహకరించడానికి పీస్ కమిటీలు ఏర్పాటు చేశారు. అవి అద్భుతమైన పనితీరుతో పోలీసులకు చేదోడువాదోడుగా నిలిచాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో వీరికి చేతి నిండా పని లేకుండా పోయింది. దీంతో వీరిని డ్రగ్స్, గంజాయి నియంత్రణకు వినియోగించుకోవాలని పోలీసు విభాగాన్ని ఆదేశిస్తున్నా. ఆయా ప్రాంతాల్లో జరిగే అంశాలపై సమాచారం సేకరణ, కొన్ని నిర్ణయాలను అమలు చేయడానికీ వీరి సహాయం తీసుకోండి. డీసీపీ, ఏసీపీ స్థాయిల్లో సమన్వయ సమావేశాలు పెట్టి ముందుకు వెళ్లండి. మహిళలపై జరిగే దారుణమైన నేరాల్లో అనేకం డ్రగ్స్, గంజాయి మత్తులో జరిగేవే. రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి.దీనికోసమే ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఇటీవల అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను కూడా అరెస్టు చేశాం. ఈ అంశంలో తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలోనే ఎలాంటి డ్రగ్స్ తదితరాలను తీసుకోమనే అండర్టేకింగ్ ఇచ్చేలా అప్లికేషన్లో కాలమ్ ఉండాలని ఇటీవల గవర్నర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రీహ్యాబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, డీజీపీ బి.శివధర్రెడ్డి, నగర కొత్వాల్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన నిరుపేదలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయటమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా జరిగేందుకు వీలుగా అధికార వికేంద్రీకరణతో జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంతోపాటు పనుల పురోగతిలో సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇందిరమ్మ, రెవెన్యూ అంశాలపై ఇన్చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి లోతైన సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో నిర్మాణా నికి సిద్ధంకాని వారు.. తమకు ఇల్లు అవసరం లేదని తెలిపితే వారి స్థానంలో ఇతర అర్హులకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంతోపాటు ఆయా కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలని చెప్పారు. ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన ఇళ్లకు రూ. లక్ష మంజురు చేశాక.. సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలని.. మౌలికవసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం...భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సర్వే మ్యాపు నంబర్, భూధార్ నంబర్ కేటాయిస్తు న్నామని తెలిపారు. సాదాబైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్క రిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని.. దరఖా స్తుల పరిష్కారం వేగవంతానికి ఆర్డీవోలకే అధికారాలు కల్పించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని.. తొలివిడతలో శిథిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ భూముల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని.. ఉమ్మడి సర్వే నిర్వహించి ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్రెడ్డి, పోచారం శ్రీనివా స్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా ఎంపీలు, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోలీసులకు శుభవార్త
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు శుభవార్త. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కవిత పార్టీపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్: కొత్తగా వచ్చే పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి అంటూ కేటీఆర్ తనదైన శైలిలో పేర్కొన్నారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. పైవిధంగా పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ తెలంగాణలో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. రైతుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం’ అని తెలిపారు.‘బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణను అవమానిస్తే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే తేజస్వితో క్షమాపణలు చెప్పించేవాళ్లం’ అని పేర్కొన్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను: కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు.. ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్ కింద పడి ముగ్గురు కార్మికులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శంకర్ పల్లి మండలం, మహాలింగాపురంలో ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు క్రేన్ కింద పడింది. క్రేన్ కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. -
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్పేటలోని మహేంద్ర, రెనాల్ట్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కార్ల పార్క్ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలు పార్క్ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. -
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్), బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రతి పనికి పర్సస్ ఉంటుంది.. పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.అహంకారం పెరగడంతో 2023లో బీఆర్ఎస్ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాను. కేసీఆర్ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. -
తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ జీవన్రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం జీవన్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు చేరుకన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు!
హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతోంది. ఐటీ కారిడార్లోని పశ్చిమ హైదరాబాద్లో గజం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తక్కువ ధరలో అనువైన ఇళ్లు లభించే ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం.. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కాస్తంత తక్కువలో దొరికే ఓ ఐదు ప్రాంతాలను ఈ కథనంలో పరిశీలిద్దాం..పటాన్చెరుపటాన్చెరు ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ముంబై హైవేకు సమీపంలో ఉండటం దీనికి పెద్ద ప్లస్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,800 – రూ.7,200రూ.55 - రూ.75 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: ఐటీ కారిడార్కు (గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) కేవలం 20-30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.ఉప్పల్ - పోచారంతూర్పు హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉప్పల్ ఐటీ పార్క్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,500 – రూ.6,500ఇక్కడ రూ.45 - రూ.60 లక్షల మధ్య 2BHK ఫ్లాట్ లభిస్తుంది.అనుకూలతలు: మెట్రో రైల్ కనెక్టివిటీ, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీల క్యాంపస్లు ఉండటం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఇది సరైన ఎంపిక.కొంపల్లినార్త్ హైదరాబాద్లో కొంపల్లి ప్రశాంతమైన, కాస్త తక్కువ ధరలో ఇళ్లకు నిలయంగా మారింది. ఇది రిటైల్ హబ్గా కూడా ఎదుగుతోంది.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.5,000 – రూ.6,500రూ.40 - రూ.55 లక్షల లోపే ఇక్కడ అన్ని సౌకర్యాలతో 2BHK ఫ్లాట్ వస్తుంది.అనుకూలతలు: తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, నాణ్యమైన విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్యామిలీస్ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.నిజాంపేట్ - బాచుపల్లిఐటీ నిపుణులకు సమీపంలో, తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాలు హాట్ ఫేవరెట్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,200 – రూ.5,800రూ.50 - రూ.70 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: మియాపూర్ మెట్రో స్టేషన్కు దగ్గరగా ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.ఆదిభట్లవిమానాశ్రయం, టీసీఎస్ (TCS), ఏరోస్పేస్ పార్క్లకు సమీపంలో ఉండటం ఆదిభట్ల ప్రత్యేకత. పెట్టుబడి కోణంలో చూస్తే ఇది అద్భుతమైన ప్రాంతం.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.3,800 – రూ.4,800ఈ ప్రాంతంలో రూ.55 - రూ.75 లక్షలు పెడితే 2BHK ఫ్లాట్ కొనవచ్చు.అనుకూలతలు: ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల నగరం నలుమూలలకూ సులభంగా చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ ప్రాపర్టీ విలువలు బాగా పెరిగే అవకాశం ఉంది.పైన పేర్కొన్న ధరలు కొనుగోలుదారుల అవగాహన కోసం మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఇచ్చిన సగటు అంచనా ధరలు మాత్రమే. బిల్డర్, ఫ్లోర్, ఎంచుకునే సౌకర్యాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. -
హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. హైదరాబాద్ సైకిల్ ట్రాక్లో ఓ మహిళా రన్నర్కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది. భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. This Is Hyderabad! Isn’t This Supposed To Be Safe?? A very agitated runner was seen asking in this video. She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!! Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37— Revathi (@revathitweets) April 27, 2026 -
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశ రాజకీయ చరిత్రలోనే పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమేనని.. అందులో భారత రాష్ట్ర సమితి ఒకటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన ఆయన.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్. గత రెండున్నరేళ్లుగా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతుంది. కేసీఆర్ సైనికులుగా బలగంగ కలిసికట్టుగా కదం తొక్కుతాం. ‘‘మరికాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్ రానున్నారు. నేతలకు దిశ నిర్దేశం చేస్తారు’’ అని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన విముఖత ప్రదర్శించారు.నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్!బీఆర్ఎస్ రాజకీయ… pic.twitter.com/1vrQbOtCqL— KTR (@KTRBRS) April 27, 2026 -
జూనియర్స్.. జిగేల్
గచ్చిబౌలి/శేరిలింగంపల్లి : ‘సాక్షి’ కిడ్స్ హ్యాపీ ఈవినింగ్ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. వన్ మినెట్ టాక్లో ప్లాస్టిక్–సైలెంట్ డెమాన్, మదర్ ఎర్త్ అండ్ పోల్యూషన్ ఛాలెంజెస్పై చిన్నారులు అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. కాలుష్యం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. రోబోటిక్స్ వర్క్షాప్లతో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు అబ్బురపరిచారు. సాక్షి హ్యాపి కిడ్స్ ఈవినింగ్లో (Sakshi Happy Kids Evening) భాగంగా సాక్షి జూనియర్ జర్నలిస్టు, రోబోటిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని అపర్ణ సైబర్ జోన్లో ఆదివారం సాయంత్రం ఈకార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాలు, ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో ఏమేమి నేర్చుకోవచ్చు, ఏఐతో సొంత ఆలోచనలు ఉండవని చెబుతూనే టీచర్లు చెప్పే సమాధానాలు ఎమోషనల్గా, విలువలను పెంచే విధంగా ఉంటాయని చిన్నారులు ఆలోచింపజేసేలా మాట్లాడి మంత్రముగ్ధుల్ని చేశారు. 150 మంది చిన్నారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. వన్ మినిట్ టాక్లో విజేతలుగా నిలిచిన సహేజ ధవారే, అర్మాన్, శ్రీవిద్య కాత్యాయిని లకు బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు రోబోటిక్స్దే ..మనుషులు చేయాల్సిన పనులన్నీ రానున్న రోజుల్లో రోబోలే చేస్తాయి. రోజు రోజుకూ అన్ని రంగాలలో వాటి పాత్ర పెరుగుతోంది. వాటిని మనం సరిౖయెన దిశలో సది్వనియోగం చేసుకోవాలి. ఇలాంటి వర్క్ షాప్లు మరింత ఆసక్తిని పెంపొందిస్తాయి. – సహేజ ధవారేఏఐతో సమస్త సమాచారం ఏఐతో విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. అయితే ఏఐతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ అధికంగా వాడితే వ్యసనంగా మారే ప్రమాదముంది. – అర్మాన్కాలుష్యంతో సమస్య... గాలి, నీటి కాలుష్యంతో అనేక సమస్యలు ఎదరువుతున్నాయి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అదే విధంగా ఎలక్ట్రానిక్ ఈ–వేస్ట్లతో వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఈ–వేస్ట్ను తగ్గించడంతోపాటు రీయూజ్, రీసైకిల్ పై అవగాహన కల్పించాలి. – శ్రీవిద్య కాత్యాయినిప్లాస్టిక్తో క్యాన్సర్ ప్రమాదం ప్లాస్టిక్ వాడకంతో శరీరంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురువుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులను వాడరాదు. ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ప్లాస్టిక్ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. – సాయి చరణ్, అపర్ణ సైబర్జోన్ స్టోరీ బుక్స్తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది విద్యార్థులు స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్స్ చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 15 ఏళ్ళలోపు ఉన్న చిన్నారులు ఏ విషయాన్ని చెప్పినా గ్రహిస్తారు. వాళ్లలో పోటీతత్వం నెలకొల్పితే భవిష్యత్తు బాగుంటుంది. చిన్న వయస్సులోనే ఏఐపై చాలా బాగా మాట్లాడారు. – శ్రీకాంత్, తెలంగాణ బ్యూరో చీఫ్, సాక్షి పిల్లల్లో జర్నలిజంపై ఆసక్తి సాక్షి జూనియర్ జర్నలిస్టు, రోబోటిక్స్ కార్యక్రమం పిల్లల్లో జర్నలిజంపై ఆసక్తి కలిగిస్తుంది. స్కూల్ స్థాయిలోనే జర్నలిజంపై అవగాహన కలి్పంచడం శుభపరిణామం. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి. – సాంబశివరావు, టెలికాం రిటైర్డ్ డీజీఎం చిన్నారుల్లో ఉత్సాహంసాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంతో చిన్నారుల్లో ఎంతో ఉత్సాహం కలిగించింది. ఇలాంటి కార్యక్రమాలు వీకెండ్లలో మరిన్ని నిర్వహించాలి. ముఖ్యంగా ఏఐ, రోబోటిక్ జూనియర్ జర్నలిస్టు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. – సిద్ధార్థ రెడ్డి, అపర్ణ సైబర్ జోన్ ‘జే’ బ్లాక్ ఇదో మంచి అవకాశం... జూనియర్ జర్నలిస్టు కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒక నిమిషంలో ఒక అంశంపై ఎలా మాట్లాడాలో పిల్లలకు బాగా అర్థం అయ్యింది. ఇలాంటి కార్యక్రమాలు అనర్గళంగా మాట్లాడేందుకు దోహదం చేస్తాయి. విద్యార్థులకు స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. – ప్రియా, పునీత్ దంపతులు -
BRS Party: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
టీడీపీ నేత ఇంట్లో పెళ్లి రగడ.. ఇరు కుటుంబాలపై కేసులు
హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు. భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముఖ్యమంత్రి అయితే.. వారానికి మూడుసార్లు ఇదేనా?
హైదరాబాద్: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Hyderabad Mail (@hyderabadmail) -
ఇటు బాధ్యతలు స్వీకరించి.. అటు సీఎంను కలిసి..
హైదరాబాద్ నూతన కలెక్టర్గా ప్రియాంక అల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం: కలెక్టర్కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక అల మాట్లాడుతూ.. నగరంలో విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల విద్య బలోపేతంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయతి్నస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల దరిచేరేలా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి తమ విభాగాలో పెండింగ్ పైళ్లు లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు కలెక్టరేట్, సీఎం ప్రజావాణితోపాటు ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ద్వారా వస్తున్న దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూస్తానని ప్రియాంక అల స్పష్టంచేశారు. View this post on Instagram A post shared by Priyanka Ala (@priyankaala__ias) -
నీట్–2026కు కౌంట్డౌన్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు గేట్వేగా నిలిచే ‘నీట్–యూజీ 2026’ పరీక్షకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్లో ఆఫ్లైన్ (పెన్–పేపర్) విధానంలో పరీక్ష జరగనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ప్రధాన ప్రవేశ పరీక్ష. గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. నేడు 10 గంటల నుంచి..నీట్–2026 అడ్మిట్ కార్డులు సోమవారం (ఏప్రిల్ 27) ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం, సమయం వంటి కీలక వివరాలు అందులో ఉంటాయి. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. నిషేధిత వస్తువులు తీసుకొస్తే డిస్క్వాలిఫికేషన్ తప్పదని హెచ్చరించింది. అలాగే కేంద్రాల్లో ఫ్రిస్కింగ్ విధానం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.అవకతవకలకు తావులేకుండా.. నీట్–యూజీ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవ కలకు తావులేకుండా నిర్వహించేందుకు కీలక చర్యలు చేప ట్టారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నందున జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ముందు జాగ్రత్తగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. గతంలో నీట్ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న ఇంపర్సనేషన్, చీటింగ్, ప్రశ్నపత్రాల లీక్ వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది.ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల ప్రమేయంతో జరిగే అవకతవకలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సరైన కారణాలు ఉంటేనే సంబంధిత కాలేజీ యాజమాన్యాలు సెలవులు మంజూరు చేయొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ రెండు రోజుల్లో విద్యార్థులను కళాశాలల్లోనే ఉంచుతూ అకడమిక్ కార్యక్రమాలు లేదా ఇతర పనుల్లో నిమగ్నం చేయాలని సూచించింది. అవసరమైతే బోధన, నాన్–టీచింగ్ సిబ్బందిని కూడా విధుల్లో ఉంచాలని పేర్కొంది. -
‘సన్’డే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా... ఈసారి ముందస్తుగానే నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మరోవైపు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రుం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని చెప్పింది. -
చెరువులకు హెల్త్ చెకప్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా గతంలో ఉన్న నీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు కొత్తగా నామినేటెడ్ పద్ధతిలో చెరువుల పరిరక్షణ కమిటీ (టీపీసీ)లను ఏర్పాటు చేసే దిశలో కీలక అడుగుపడింది. చిన్న నీటిపారుదల రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నివేదికలో పలు కీలకాంశాలను ప్రస్తావించిన కమిషన్.. సాగునీటి చెరువుల సమగ్ర పునరుద్ధరణ, నిర్వహణ, సంరక్షణ కోసం స్వయంసంవృద్ధితో కూడిన నమూనాను రూపొందించింది. ఏఐసీసీ కిసాన్ సెల్ జాతీయ నాయకుడు ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన రైతు కమిషన్ పలు సిఫారసులు చేసింది. ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ చెరువుల పరిరక్షణ కమిటీలను ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటు చేయాలి. ప్రతి మైనర్ ఇరిగేషన్ చెరువు, దాని ఆయకట్టు పరిధిలో ఈ కమిటీ పనిచేస్తుంది. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ సలహా మేరకు జిల్లా కలెక్టర్లు ఈ కమిటీ సభ్యులను నామినేట్ చేస్తారు. చైర్మన్తోపాటు కన్వీనర్ లేదా మెంబర్ సెక్రటరీ, 9 మంది సభ్యులు ఉంటారు. పదవీకాలం రెండేళ్లు. ⇒ ఈ కమిటీ చెరువుల పూడికతీత, కట్ట పటిష్టం చేయడం, తూముల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తుంది. సాంకేతికేతర పనుల కోసం సమాజ భాగస్వామం దిశలో శ్రమదానం నిర్వహణ, రైతుల మధ్య నీటి వివాదాల పరిష్కారం, ఆర్థిక లావాదేవీలు, నీటి వినియోగ రికార్డుల నిర్వహణ, పనుల సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామపంచాయతీలకు సమర్పించడం లాంటి విధులు నిర్వహిస్తాయి. ⇒ చెరువు గర్భం, ముంపు ప్రాంతాల్లో ఆక్రమణల నిరోధం కోసం ఈ కమిటీ చెరువు పోలీస్గా పనిచేస్తుంది. ఈ కమిటీతోపాటు వ్యవసాయ శాఖ నిర్దేశించిన విధంగా ఆ చెరువుల పరిధిలోని రైతులు పంటలు సాగు చేసుకోవాలి. చెరువుల్లో చెత్త, పూడిక వేయకుండా నివారించాలి. ఈ కమిటీలకు పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటి పారుదలశాఖలు సహకరిస్తాయి. ⇒ చెరువులను నాలుగు రకాలుగా వర్గీకరించాలి. సాగునీటి చెరువు, బహుళ ప్రయోజన జీవనోపాధి చెరువు, పట్టణ శివారు/రీచార్జ్ చెరువు, ఎకోటూరిజం లేదా జీవవైవిధ్య చెరువులుగా వర్గీకరించి నిర్వహణ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ⇒ ప్రతి చెరువుకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. అంటే ఆయా చెరువుల్లో పూడిక, కట్ట పరిస్థితి, తూము లేదా అలుగు స్థితి నిర్ధారించేందుకు నీటిపారుదల శాఖతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలి. డ్రోన్లు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్), నీరు విస్తరించే ప్రాంతం, ఆయకట్టును డిజిటల్ మ్యాపింగ్ చేయాలి. ⇒ పోషకాలు అధికంగా ఉండే పూడిక మట్టిని స్థానిక రైతులకు ఉచితంగా ఇస్తారు. రవాణా ఖర్చులు రైతులు భరించాలి. ఇటుకబట్టీలు, రహదారుల నిర్మాణానికి పోషకాలు లేని మట్టిని ఉపయోగించుకోవచ్చు. పనికిరాని పూడిక విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును టీపీసీ ఖాతాలో జమ చేయాలి. ⇒ చెరువు కట్టలకు మరమ్మతులు చేయడంతోపాటు కోతను నిరోధించేందుకు వెటివర్, ఇతర లోతైన వేర్లు కలిగిన గడ్డి మొక్కలను నాటాలి. తూము గేట్లు, అలుగులు, ఇన్లెట్, అవుట్లెట్ చానెళ్లకు మరమ్మతు చేయాలి. ⇒ పనుల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి నెలా టీపీసీ సమావేశమవుతుంది. టీపీసీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మండలపరిషత్ అధికారి నేతృత్వంలోని గ్రీవెన్స్ సెల్ పర్యవేక్షిస్తుంది. ⇒ అడాప్ట్ ఎ ట్యాంక్ విధానంలో చెరువు అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు దత్తత ఇవ్వొచ్చు. విద్యాసంస్థల భాగస్వామ్యంతో చెరువుల పట్ల అవగాహన కల్పించడం, చెరువు రక్షణ దళం (స్టూడెంట్స్ క్లబ్) ఏర్పాటు చేయడం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ లాంటి విభాగాల సహకారంతో మొక్కలు నాటడం, విశ్వవిద్యాలయాల ద్వారా మరిన్ని పరిశోధనలు, వార్షిక చెరువు మేళాల నిర్వహణ లాంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.


