Hyderabad
-
మా యూనిట్లు మార్చండి..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్లో యూనిట్ల మార్పు, కేటగిరీల సవరణ కోసం అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు అర్జీదారులు వాటిలో మార్పులు కోరుతూ ఆ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తులో మార్పులు చేసేందుకు సంబంధించిన లాగిన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఉండడంతో వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన తొలి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కానీ చివరి నిమిషంలో ఎంపిక ప్రక్రియ, మంజూరు కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తొలి రెండు కేటగిరీ లకే ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనుందనే ప్రచారంతో.. తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యే ఉద్దేశంతో తొలుత చివరి రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది, ప్రస్తుతం తమ కేటగిరీలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.చివరి రెండు కేటగిరీలకు అధిక దరఖాస్తులురాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువి వికాసం పథకం కింద వివిధ రకాల యూనిట్ల కోసం మొత్తం 4 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఆన్లైన్ పద్ధతిలో మార్చి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖలు..ఏప్రిల్ 14వ తేదీ 11.59 గంటల వరకు కొనసాగించింది. మొత్తం 16,23,764 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.50 వేల లోపు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్షలోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది. తొలి విడతలో కేటగిరీ–1,. కేటగిరీ–2లోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ క్రమంలో తొలి రెండు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ–1లో 1,58,650 మందికి అవకాశం కల్పించాలని భావించగా.. కేవలం 39,401 దరఖాస్తులే వచ్చాయి. కేటగిరీ–2లో 1,22,540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,48,556 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కానీ కేటగిరీ–3, కేటగిరీ–4 కింద మాత్రం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.అయితే ప్రభుత్వం తొలుత మొదటి రెండు కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలనే చేపట్టడం, ఆయా కేటగిరీలకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. కేటగిరీ–3, కేటగిరీ–4 కింద దరఖాస్తు చేసుకున్న వారు తొలి విడతలోనే అర్హత సాధించేందుకు, ఆ మేరకు ఆయా యూనిట్లకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుంటున్నారు. సుమారు లక్షకు పైబడి దరఖాస్తుదారులు ఈ విధంగా మార్పులు కోరుకుంటున్నట్లు సంక్షేమ శాఖల వర్గాలు తెలిపాయి. -
మార్చిలోనే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం (2025–26) టెన్త్ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహించాలని విద్యాశా ఖ నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నాటికి మొత్తం సిలబస్ బోధన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. విద్యాశాఖ 2025–26 విద్యా సంవత్సరం కేలండర్ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీన మొదలయ్యే పాఠశాలలు 2026 ఏప్రిల్ 23వరకు నడుస్తాయని, మొత్తం 230 పనిదినాలు ఉంటాయని వెల్ల డించింది.స్కూళ్లలో ప్రతిరోజూ 5 నిమిషాలపాటు విద్యా ర్థులకు మెడిటేషన్ చేయించాలని సూచించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలువులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. 2026 జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. -
ఎండకు ‘కంది’పోదు!
సాక్షి, హైదరాబాద్: గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని.. హెక్టార్కు 2 టన్నుల దిగుబడిని ఇచ్చే కంది వంగడాన్ని ఐసీపీవీ 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. కేవలం 125 రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ వంగడాన్ని ఖరీఫ్, రబీలో ఎప్పుడైనా సాగు చేయొచ్చు. కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పెరిగే ఈ కందిని మిషన్ ద్వారా కోయొచ్చు. కూలీల సమస్య, ఎరువుల అవసరం తగ్గుతుంది. ఈ మేరకు ఇక్రిశాట్ అధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి మీడియాను పటాన్చెరులో సంస్థ అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 రకం కంది చేల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, ప్రోగ్రాం డైరెక్టర్ షాన్ మైట్స్, లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాష్ గంగశెట్టి, అసోసియేట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రుతి బెలియప్ప తదితరులు ఐసీపీవీ 25444 కంది వంగడం గురించి వివరించారు. అత్యధిక వేడిని తట్టుకునే పంట కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఐసీపీవీ 25444 వంగడాన్ని విజయవంతంగా పరీక్షించామన్నారు. 2021లో దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించి, 2024 నాటికి స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో పూర్తి చేశామని తెలిపారు. కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే 15 సంవత్సరాల పనిని కేవలం ఐదేళ్లలో పూర్తి చేసినట్టు వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కందిపప్పుకు ఒక కొత్త దశను తీసుకొచ్చే అద్భుత ఆవిష్కరణగా వారు పేర్కొన్నారు. దేశీయ పప్పుదినుసుల లోటును తీర్చే శుభవార్తభారత్లో కందిపప్పు వినియోగం 5 మిలియన్ టన్నులుగా ఉండగా, దేశీయంగా 3.5 మిలియన్ టన్నుల కందిపప్పు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ గంగశెట్టి తెలిపారు, దేశ అవసరాలకు మరో 1.5 మిలియన్ టన్నులు అవసరం కాగా, ఇందుకోసం సంవత్సరానికి రూ. 6,700 కోట్ల దిగుమతుల భారం పడుతోందని తెలిపారు. ఇక్రిశాట్ ద్వారా అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 వంగడంతో ఈ లోటు తీరే అవకాశముందన్నారు. తాండూరు, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమని చెప్పారు.భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా...భారత్తోపాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఈక్వడార్ దేశాల్లోనూ ఈ కందిని ఉత్పత్తికి వినియోగించేందుకు అవకాశముందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ స్థిరత్వ పంటగా ఐసీపీవి 25444కి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే శక్తి ఉందన్నారు. -
అన్ని నిర్ణయాలూ మంత్రివర్గ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగిందని నీటిపారు దల శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతోనే డీపీఆర్ తయారీ పనులను వ్యాప్కోస్కు అందించినట్టు తెలిపారు. బరాజ్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం తన కార్యాలయంలో హరీశ్రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు సంధించింది.సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిధి ఏమిటి? అని కమిషన్ ప్రశ్నించగా, హరీశ్రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో.. వాటి నిర్మాణాన్ని పునఃసమీక్షించి రీఇంజనీరింగ్పై సిఫారసులు చేసేందుకు గత ప్రభుత్వం తన నేతృత్వంలో నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావుతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల ఆధారంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించడం జరిగిందని, ఒక భాగాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేయగా, రెండో భాగాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించడం జరిగిందని తెలిపారు. అందుకే మేడిగడ్డకు బరాజ్.. మహారాష్ట్ర అభ్యంతరాలు, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ పేర్కొనడంతో బరాజ్ లొకేషన్ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు హరీశ్రావు చెప్పారు. ‘2014 జూలై 23న నేను మహారాష్ట్ర వెళ్లి అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీఫ్ను కలవగా, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పారు. అక్కడ బరాజ్ నిర్మాణానికి అంగీకరించమబోని, పనులు చేపట్టి నిధులు వృధా చేసుకోవద్దని కోరుతూ నాటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి రాసిన లేఖ ప్రతిని ముష్రీఫ్ నాకు అందజేశారు.బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ధర్నాలు చేస్తుండడంతో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర రాజ్భవన్లో ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తాను స్వయంగా ఆందోళనలు చేసిన నేపథ్యంలో అనుమతించడం సాధ్యం కాదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు..’ అని హరీశ్రావు వివరించారు.అలాగైతే 48 టీఎంసీల లభ్యతే.. ‘మహారాష్ట్ర అనుమతించిన మేరకు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 48 టీఎంసీల లభ్యతే ఉంటుంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను తరలించుకోగలం. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత మాత్రమే ఉండగా, అందులో 63 టీఎంసీలపై ఎగువ రాష్ట్రాలకు హక్కులున్నట్టు తేల్చుతూ 2015 ఫిబ్రవరి 18న సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 160 టీఎంసీల నీళ్లు అవసరం. ఆ మేరకు నీళ్లను నిల్వ చేసుకోవడానికి బరాజ్ల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని 2008 ఆగస్టు 12న సీడబ్ల్యూసీ ఇంకో లేఖ రాసింది. అందుకే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది.మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని 2017 నవంబర్ 12న సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. అక్కడ బరాజ్ నిర్మించాలని 2016 జనవరి 17న వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది..’ అని మాజీమంత్రి చెప్పారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మార్చాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసిందా? అని కమిషన్ అడగగా.. ఇలాంటి సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ నిర్ణయాలు తీసుకుందని బదులిచ్చారు. ఇంజనీర్ల సూచనలను గౌరవించారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని హరీశ్ చెప్పారు. సైట్ పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టుల లొకేషన్లు మారడం సహజమేనని, నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ వంటి ప్రాజెక్టుల విషయంలో సైతం అలానే జరిగిందని అన్నారు. కేఐపీసీఎల్ ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉండడంతోనే రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేశాం. కేఐపీసీఎల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, దాని రుణాలు, వడ్డీలను ఎలా తిరిగి చెల్లించాలనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు..’ అని హరీశ్ తెలిపారు. రుణాలకు ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇచ్చి వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించిందని వివరించారు. నీటి నిల్వ ఇంజినీర్లకు సంబంధించిన బాధ్యత ఎవరి ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిరంతరంగా నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. ఇది ఇంజనీర్లకు సంబంధించిన బాధ్యత అని హరీశ్ చెప్పారు. ఈ విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదన్నారు. నీటి నిల్వ కోసమే బరాజ్లు నిర్మించారా? అని కమిషన్ అడగగా, ఇది పూర్తిగా సాంకేతిక పరమైన అంశమని జవాబిచ్చారు. బరాజ్లలో ఏ పరిమాణంలో నీళ్లను నిల్వ చేయాలి అని కమిషన్ ప్రశ్నించగా, మొత్తం 141 టీఎంసీలను నిల్వ చేసేందుకు వాటిని నిర్మించామని చెప్పారు.కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక కొత్తగా ఫ్లడ్ బ్యాంకులు, డిశ్చార్జి ఛానల్స్ నిర్మాణం పనులు అప్పగించడం ప్రణాళిక లోపం కాదా? అని కమిషన్ అడగగా, సాంకేతిక అంశాలపై సమాధానమివ్వలేనని హరీశ్ బదులిచ్చారు. టెండర్లు పూర్తై కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక నిబంధనలు మార్చవచ్చా? అని ప్రశ్నించగా, క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా నీటిపారుదల శాఖ సిఫారసులు చేస్తే మార్చవచ్చని వివరణ ఇచ్చారు. నిపుణుల కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ అడగగా, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపుపై సిఫారసులు చేసేందుకని బదులిచ్చారు. ఎన్టీపీపీసీ పవర్ ప్లాంట్తో పాటు బొగ్గు గనులుండడంతో నేరుగా నీటి తరలింపు సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. హిందీలో చెప్పండి పరవాలేదు.. దాదాపు గంట పాటు హరీశ్రావు క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో చదివిన తనకు ఆంగ్లంపై పట్టులేదని ప్రారంభంలోనే హరీశ్రావు తెలపగా, హిందీలో సమాధానమిస్తే ఆంగ్లంలో తర్జుమా చేసుకుంటామని జస్టిస్ ఘోష్ చెప్పారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలకు సైతం కోర్టు హాల్లోకి కమిషన్ అనుమతినిచ్చింది.న్యాయవాదులకు అనుమతి లేదని కమిషన్ సిబ్బంది తెలియజేయగా, లిఖిత పూర్వక ఆదేశాలు తీసుకొస్తేనే బయటకు వెళ్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ వ్యక్తులుగా కూర్చోవడానికి వారికి కమిషన్ అనుమతినిచ్చింది. క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బీఆర్కేఆర్ భవన్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన హరీశ్రావు వివరాలను వెల్లడించారు. -
టీపీసీసీ జంబో కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్ విప్, రెండు విప్ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్ విప్ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు 1) టి.కుమార్ రావు 2) కె.రఘువీర్ రెడ్డి, ఎంపీ 3) నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 5) బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ 6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 8) బండి రమేశ్ 9) కొండ్రు పుష్పలీల 10) కోట నీలిమ 11) బి. కైలాష్ కుమార్ 12) నమిండ్ల శ్రీనివాస్ 13) ఆత్రం సుగుణ 14) గాలి అనిల్ కుమార్ 15) చిట్ల సత్యనారాయణ 16) లకావత్ ధన్వంతి 17) ఎం. వేణుగౌడ్ 18) కోటంరెడ్డి వినయ్ రెడ్డి 19) కొండేటి మల్లయ్య 20) ఎం.ఏ.ఫహీమ్ (సంగారెడ్డి) 21) ఎస్. సురేష్ కుమార్ 22) బొంతు రామ్మోహన్ 23) అఫ్సర్ యూసుఫ్ జాహీ 24) ఎస్. జగదీశ్వర్ రావు 25) నవాబ్ ముజాహిద్ ఆలంఖాన్ 26) గుమ్ముల మోహన్ రెడ్డి 27) చిన్నపటాల సంగమేశ్వర్ పీసీసీ ప్రధాన కార్యదర్శులు 1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 2) సీహెచ్ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 4) సీహెచ్.రాంభూపాల్ 5) ఏ. సంజీవ్ ముదిరాజ్ 6) బొజ్జా సంధ్యా రెడ్డి 7) మల్లాది రాంరెడ్డి 8) అబ్దేశి సదాలక్ష్మి 9) ఎం. బేబి స్వర్ణ కుమారి 10) దారాసింగ్, తాండూరు 11) జి. శశికళా యాదవ రెడ్డి 12) ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి 13) ముహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ 14) సంతోష్ కుమార్ రుద్ర 15) దుర్గం భాస్కర్ 16) ముహమ్మద్ ఖాజా ఫఖ్రుద్దీన్ 17) వి.జగదీశ్వర్ గౌడ్ 18) నరేశ్ జాదవ్ 19) అల్లం భాస్కర్ 20) డా. గిరిజ షెట్కార్ 21) కొప్పుల ప్రవీణ్ కుమార్ 22) ఏ. జంగా రెడ్డి 23) కస్బా శ్రీనివాస్ రావు 24) దుడ్డిల్ల శ్రీనివాస్ 25) బద్దం ఇంద్రకరణ్ రెడ్డి 26) చరగాని దయాకర్ 27) పీసారి మహిపాల్ రెడ్డి 28) గజ్జెల కాంతం 29) ఏడుపుగంటి సుబ్బా రావు 30) చకిలం రాజేశ్వర్రావు 31) ఎర్ల కొమరయ్య 32)డా.ఏ.రవిబాబు 33) నాగ సీతారాములు 34) సనెం శ్రీనివాస్ గౌడ్ 35) పృథ్వి చౌదరి వేణుల 36) అంబడి రాజేశ్వర్ 37) డి.డి.వెంకట్ రాజ్ 38) బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 39) పల్లె శ్రీనివాస్ గౌడ్ 40) మొహమ్మద్ సబీర్ అలీ 41) కట్ల రంగారావు 42) పి. శ్రీనివాస్ రెడ్డి 43) మడు సత్యనారాయణ గౌడ్ 44) టోపాజీ అనంత కిషన్ 45) వి. రామారావు గౌడ్ 46) అచ్యుత్ రమేష్ బాబు 47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 48) ఎం. రాజీవ్ రెడ్డి 49) ఆదంరాజ్ దేకపాటి 50) షమీం ఆఘా 51) ఈ.వి.శ్రీనివాస్ రావు 52) మిథున్ రెడ్డి 53) అమొగోత్ వెంకటేశ్ పవార్ 54) రాయగిరి కల్పనా యాదవ్ 55) రాజేష్ కాశిపాక 56) రహమత్ హుస్సేన్ 57) పి. ప్రసన్న కుమార్ శర్మ 58) ముహమ్మద్ అసదుద్దీన్ 59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్ 60) దైదా రవీందర్ 61) ఉప్పల శ్రీనివాస్ గుప్తా 62) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 63) జి. నాగభూషణం 64) ఉపేందర్ రెడ్డి 65) ధర్మారావు 66) నూతి సత్యనారాయణ గౌడ్ 67) దుర్గాప్రసాద్ 68) డా. సి. వేంకటగోవింద్ రావు 69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి -
TPCC: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండా పోమవారం రాత్రి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. తాజా టీపీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా 27 మందిని నియమించింది. అదే సమయంలో ప్రధాన కార్యదర్శులుగా 69 మంది నియమించింది. -
నాలుగో నగరి భవిష్యత్.. మూడో నగరిలో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ భవిష్యత్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు. అయితే.. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్) నానక్రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కలల ప్రాజెక్టు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ అవసరమని రేవంత్ ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కేవలం స్కిల్ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయని చెప్పవచ్చు. సిబ్బంది కొరత.. 765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఎఫ్సీడీఏ ప్రధాన కార్యాలయం నానక్రాంగూడలోని ఉంది. వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. కానీ.. ఇప్పటివరకు ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్పై ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు.మాస్టర్ ప్లాన్ హెచ్ఎండీఏదే.. ఫోర్త్సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు.చదవండి: హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక! గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లాన్ (ఏఏపీ) మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏనే అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎఫ్సీడీఏ (FCDA) పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు. -
‘వారికి తెలియకుండా నేను ఏ పనీ చేయలేదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఎస్ఐబీ(special intelligence bureau) మాజీ చీఫ్ ప్రభాకర్రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆయన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు.. ఇవాళ్టి విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. సిట్కే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు తాను ఆదేశాలు ఇవ్వలేదని.. అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. తాను ఎఫ్ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని.. తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సిట్ కోరింది. తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు. అయితే ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా ఉండి ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకాలం అమెరికాలో ఉన్న ప్రభాకర్రావు సుప్రీం కోర్టు ఆదేశాలతో నిన్న (ఆదివారం, జూన్8) హైదరాబాద్ చేరుకున్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. బస్పాస్ చార్జీలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక, పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. బస్ పాస్ ఛార్జీలు పెరగడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం.. రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ రూ.1600లకు పెంపురూ.1,150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ రూ.1400లకు పెంపు. బస్ పాస్ చార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాలేజీలకు ఎలా వెళ్లాలని విద్యార్థులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్.. సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుండి డేటాను సిట్ అధికారులు తెప్పించుకున్నారు. -
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని పోలీసులను నిలదీయడం గమనార్హం.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని కొమ్మినేని అడిగారు. దీంతో, పోలీసులు.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అరెస్టు చేసి వాహనంలో తరలించారు. ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే చూపించి.. ఆయనను వాహనంలో తీసుకువెళ్లారు. అరెస్ట్ సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం విశేషం. మరోవైపు, ఇంటి వద్ద అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధించారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?. ముందస్తు నోటీసులు ఇచ్చారా? లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా?.. అని అడిగారు. అందుకు ఏపీ పోలీసులు నోరు మెదపలేదు. కానీ అరెస్ట్ అనంతరం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు తుళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం, కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఒక సీనియర్ జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితా? కొమ్మినేనిఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్పై కొమ్మినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సీనియర్ సిటిజన్ని.. ఎలా అరెస్ట్ చేస్తారు? సీనియర్ జర్నలిస్ట్ ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి?. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే యత్నం’ జరుగుతోందని అన్నారు.కొమ్మినేనిపై నమోదైన సెక్షన్లుకొమ్మినేని శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 79,196(1) 353 (2),299,356(2),61(1),bns 67 ఐటీఏ 3(1), ఎస్సీఎస్టీ పీవోఏ యాక్ట్ నమోదైంది.సంబంధం లేదని చెప్పినా పట్టించుకోని ఏపీ ప్రభుత్వంమరోవైపు, ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్, విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక, సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు సర్ధి చెప్పారు. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిన్న, ఇవాళ తన లైవ్ షోలో కృష్ణంరాజు తరుఫున.. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేనిపై ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ ప్రయోగించింది.జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిన సాక్షి టీవీగత శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
బీఆర్కే భవన్కు హరీష్రావు.. లీగల్ టీమ్తో పోలీసుల వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్.. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు. -
సండే ఆన్ సైకిల్ : సైకిల్ మన దినచర్యలోభాగం కావాలి!
దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్జైన్ ప్రారంభించారు. రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆయన కూడా సైకిల్ తొక్కారు. ‘ఫిట్ ఇండియా సైక్లోథీన్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే అదనపు జీఎం నీరజ్ అగర్వాల్, డీఆర్ఎం భర్తేష్ కుమార్, దక్షిణమధ్య రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్ సైక్లింగ్తో ఆరోగ్యం, ఫిట్నెస్, పర్యావరణ బాధ్యత లాంటి ప్రయోజనాలు ఉంటాయని, దీన్ని దిన చర్యలో భాగం అలవర్చుకోవాలన్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ ఎ.చిన్న సీతారామిరెడ్డి, వైస్ చైర్మన్ గిరిధారిలాల్ తోషిన్వాల్ అన్నారు. చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగిలోని ఔటర్రింగ్ రోడ్డు సైకిల్ ట్రాక్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్, సమాజహితం సాధించాలంటే సైక్లింగ్ చేయాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఐక్యతని పెంపొందించేందుకు సైక్లింగ్ ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు డీఎంకే టీమ్ నిర్వహించిన వార్మప్ సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నార్సింగి నుంచి అప్పా సర్కిల్ వరకూ సైక్లింగ్ చేశారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సహాయంతోపాటు హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చార్టర్డ్ అకౌంటెంట్ల కుటుంభాలు పాల్గొన్నాయి. భాగం చేసుకోవాలి. -
నెక్లెస్ రోడ్లో తెలంగాణా రన్ 2025
ఖైరతాబాద్ : సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో రన్– 2025 పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి 3కే, 5కే, 10కే, హాఫ్ మారథాన్ ఆదివారం నిర్వహించారు. ఆరోగ్యకరమైన, చురుకైన తెలంగాణ సాధనే లక్ష్యంగా నిర్వహించిన మారథాన్లో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. మారథాన్, రన్ను డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఏ రామ్కిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడా రంగాన్ని సాధనంగా మలుచుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిట్ తెలంగాణ సాధన కోసం యావత్ క్రీడా సమాజం కృషిచేయాలన్నారు. మానసిక, శారీరక వికాసానికి దోహదపడే క్రీడలు ఐక్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. అవంతి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సభ్యులు పన్నాల హరీష్ చంద్రరెడ్డి, శ్రీనివాస్ మగ్గారి, డాక్టర్ మహేష్ పాల్గొన్నారు. మారథాన్, రన్లో విజేతలను సన్మానించి, మెడల్స్ అందజేశారు. ఇదీ చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ -
ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయాల్లో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎనీ్టఆర్ మీద అభిమానంతో మాగంటి గోపీనాథ్ 1983లో టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. కొద్ది కాలానికే ఎనీ్టఆర్ ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పని చేశారు. 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించిన మాగంటి గోపీనాథ్.. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. పార్టీల జిల్లా అధ్యక్షుడిగా... టీడీపీలో ఉండగానే తొలుత 2014లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో చేరడానికి ముందు గోపీనాథ్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్లో సైతం 2022 నుంచి పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నగరంలో ఎందరో నేతలున్నప్పటికీ, కేసీఆర్ ఆయనకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించారంటే ఆయనకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారో అంచనా వేసుకోవచ్చు. సినీ నిర్మాతగా.. మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా సినీ నిర్మాతగానూ గుర్తింపు పొందారు. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004,) నా స్టైలే వేరు (2009) సినిమాలను నిర్మించారు. బుల్లెట్ వాహనాలతో ర్యాలీలు.. బుల్లెట్ బండ్లతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా మాగంటి తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. 1984లో ఎనీ్టఆర్ను సీఎం పదవి నుంచి దించినప్పుడు, అనంతరం 1985లో ఎనీ్టఆర్ తిరిగి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు బుల్లెట్ ర్యాలీలు నిర్వహించారు. ఏ పారీ్టలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల వేళ విభిన్న ప్రచారాలతోనూ ప్రత్యేకంగా నిలిచారు. ఆయా సందర్భాల్లో తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్, కేటీఆర్ల కటౌట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్పై గెలిచారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే ఎదిగి గోపీనాథ్ 1963, జూన్ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటరీ్మడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అన్నం పెట్టి...ఆశ్రయం ఇచ్చి..
బంజారాహిల్స్: రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడిని యువతిని లిప్ట్ ఇస్తానని బైక్పై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన యువతి(22) ఇష్టంలేని పెళ్లి చేస్తుడటంతో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకుని. శనివారం రాత్రి ఆమె జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఒంటరిగా నిలుచుని ఉండగా అదే సమయంలో బైక్పై వస్తున్న మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి అమెను మాటల్లో పెట్టి ఆశ్రయమిస్తానని చెప్పి కమలాపురికాలనీలోని తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు అన్నం పెట్టి ఆకలితీర్చాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి యతి్నంచగా ఆమె కేకలు వేసింది. దీంతో పక్కప్లాట్లో నివసిస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆరా తీయగా ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మల్లికార్జునరెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తికాగా, ఓ కొరియోగ్రాఫర్ వద్ద అసిస్టెంట్గా పని చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల సమాచారంతో నగరానికి చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లారు. బంజాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు.. ఎయిర్పోర్టులో బౌన్సర్ల ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్సైబీ) ఓఎస్డీ ప్రభాకర్రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్కు దిగారు.శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫాంలో ధరించి.. మరి కొంత మంది సివిల్ డ్రెస్లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్కు దిగారు. ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Em Ganakaryam chesinav Ani siggupaduthunav Prabhakar Rao! Khaaki Paruvu Theesindi Kaakunda!🗣️ pic.twitter.com/VMpKSj2OWn— Rishi Karan Reddy (@Rishi_Karan_) June 8, 2025ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రభాకార్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులు అరెస్టయి దీర్ఘకాలం రిమాండులో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్రావు.. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్కు తిరిగి రావడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వచ్చింది. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. -
పిలియన్.. పారాహుషార్!
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు పట్టుమని పాతిక కిలో మీటర్లు కూడా లేదు. మరి హెల్మెట్లు ఎందుకు?’ ఇది అనేక మంది చేసే వ్యాఖ్య. ‘వాహనం నడిపే వ్యక్తి పెట్టుకుంటే చాలు. వెనక కూర్చునే వారికి హెల్మెట్ ఎందుకు?’ ఇది పలువురి నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పటికీ నగరంలో అనేక మంది హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా... వాహనం వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధారణ అనేది అరుదైన దృశ్యమే. ఇదే సిటీలో ఏటా పదుల సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. 2019–2025 ఏప్రిల్ మధ్య ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేస్తే ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొత్తం 17,506 ప్రమాదాలు జరగ్గా.. వీటిలో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవి 8,582గా ఉన్నాయి. వీటిలో మొత్తం 1,081 మంది మృత్యువాతపడగా.. 691 మంది రైడర్లు, 236 మంది పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించని కారణంగా చనిపోయారు. అత్యధికులు కేసులకు భయపడే.. నగరంలో ఇప్పటికీ అనేక మంది వాహన చోదకులు ట్రాఫిక్ పోలీసులకు భయపడే హెల్మెట్లు ధరిస్తున్నారు. చౌరస్తాలు, చెకింగ్ పాయింట్లు ఉన్నప్పుడు మాత్రమే హెల్మెట్ పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని తీసి బండికి తగిలించే వాళ్లు కోకొల్లలు. పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకోవాలని భావించే వారిలో కొందరు ఏమాత్రం రక్షణ ఇవ్వని హాఫ్ హెల్మెట్లు, కర్మాగారాల్లో వినియోగించేవి పెట్టుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు తలకు దెబ్బతగలడం వల్లే సంభవిస్తుంటాయి. ఇలా చనిపోయిన వారికంటే ఎక్కువగా జీవచ్ఛవాలుగా మారిన వాళ్లూ ఉన్నారు. ఈ పరిణామాలకు కారణం వాహన చోదకులతో పాటు పిలియన్ రైడర్లు హెల్మెట్ ధారణను పట్టించుకోకపోవడమే అన్నది పోలీసుల మాట. తీవ్రతలో పెద్దగా తేడా ఉండదు.. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ ధరించాల్సిందే. కొన్నేళ్ల క్రితం చేసిన సవరణల ప్రకారం నాలుగేళ్లు వయసు దాటిన వారు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే హెల్మెట్ తప్పనిసరి. అయితే సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల నేపథ్యంలో పోలీసు విభాగం కేవలం రైడర్కు మాత్రమే హెల్మెట్ మస్ట్ నిబంధన అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు చనిపోవడానికి, తీవ్రంగా గాయపడటానికి ఎదుటి వాహనం కంటే రోడ్డు దెబ్బే ఎక్కువగా కారణం అవుతోంది. ఈ గాయాలు కావడంలో రైడర్, పిలియన్ రైడర్ అనే తేడాలు లేవని, ప్రమాదం జరిగినప్పుడు వీరిద్దరికీ అయ్యే గాయాల్లో పెద్దగా తేడా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని కొన్ని నగరాల్లో పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచి్చతంగా అమలవుతోందని పేర్కొంటున్నారు.కొన్నేళ్ల క్రితం సైబరాబాద్లో అమలు... వాహనం నడిపే రైడర్తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ సైతం కచి్చతంగా హెల్మెట్ ధరించాలనే విధానాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నేళ్ల క్రితం అమలు చేసినా ప్రస్తుతం అటకెక్కింది. మరోపక్క ద్విచక్ర వాహన చోదకులు కచి్చతంగా ఫుల్సైజ్ హెల్మెట్లు ధరించాల్సి ఉంది. దీంతో హాఫ్ హెల్మెట్లు ధరించిన వారికి అడపాదడపా చలాన్లు విధిస్తున్నారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు, పిలియన్ రైడర్ కచి్చతంగా హెల్మెట్లు ధరించాలంటూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ‘వాహనం ప్రమాదానికి గురైనప్పుడు చోదకుడిపై ఎంత ప్రభావం ఉంటుందో.. పిలియన్ రైడర్కూ అదే స్థాయిలో ఉంటుంది. ద్విచక్ర వాహనం వెనుక కూర్చునే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహన చోదకుడు దీన్ని అమలు చేయాలి. కచి్చతంగా ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లే ఖరీదు చేయాలి’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంతో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత సోదరి నివేదితకు ఓటమి ఎదురైంది. సీనియర్ నాయకుడు జి.సాయన్న మరణంతో ఆయన వారసురాలిగా లాస్యనందిత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నారాయణ్ శ్రీగణేశ్ గెలిచారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక రెండేళ్లలోపునే రెండు ఉప ఎన్నికలు.. హైదరాబాద్లోనే కాదు.. బహుశా ఏ జిల్లాలోనూ జరిగి ఉండవు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్నాథ్ కోవింద్ ఉత్తర్ప్రదేశ్లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
నేడు సిట్ ముందుకు ప్రభాకర్రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఆయనపై ఎల్ఓసీ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్పోర్టునూ రద్దు చేయించారు.గత నెల్లో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇవ్వడంతో ప్రభాకర్రావు భారత్కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన అమెరికాలోని భారత ఎంబసీకి పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుని, గత శుక్రవారం ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందారు. దీని ఆధారంగా ఆయన ఆదివారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. నిరీ్ణత గడువులోగా సిట్ ఎదుట వి చారణకు హాజరుకావాల్సి ఉండటంతో సోమ వారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాల యానికి రానున్నారని సమాచారం. అక్కడే అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారు. అన్ని నివేదికలు క్రోడీకరించి... ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు నలుగురు నిందితులు పి.రాధాకిషన్రావు, ఎన్.భుజంగరావు, ఎం.తిరుపతన్న, డి.ప్రణీత్రావులను అరెస్టు చేశారు. మరో నిందితుడు శ్రవణ్కుమార్రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురితోపాటు పదుల సంఖ్యలో సాక్షుల్ని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టెలికం సరీ్వసు ప్రొవైడర్లతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి అనేక నివేదికలు పొందారు. వీటన్నింటినీ క్రోడీకరించిన పోలీసులు ప్రభాకర్రావును ప్రశ్నించడానికి ప్రశ్నావళి సిద్ధం చేశారు.వీటి ఆధారంగా ఆయన్ను సుదీర్ఘంగా విచారించాల్సి ఉందని, అవసరమైతే ఆయన రెండు మూడుసార్లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మరోసారి విచారించనుంది. ఈలోపు ప్రభాకర్రావు విచారణకు సహకరించకుంటే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కస్టోడియల్ విచారణకు అనుమతి కోరతామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు.హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్శంషాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్రావు హైదరాబాద్ చేరుకున్నారు. పదిహేను నెలల తర్వాత ఆయన ఆదివారం రాత్రి 7.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అనంతరం సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. -
నయా మోసం.. కాల్ఫార్వర్డింగ్ ఫిషింగ్
సాక్షి, హైదరాబాద్: కాల్ఫార్వర్డింగ్ ఫిషింగ్ మోసం ఇప్పుడు తెరపైకి వస్తోంది. కొరియర్ సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసం ఎలా జరుగుతుంది.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలతో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇలా వల వేస్తారు... కొరియర్ సంస్థల పేరుతో, ముఖ్యంగా బ్లూడార్ట్ వంటి సంస్థల పేరిట మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. మీ పేరిట కొరియర్ వచి్చందంటూ బాధితులకు కాల్ చేస్తారు. మా కొరియర్ బాయ్ మీకు దగ్గర్లో ఉన్నాడని, లొకేషన్ గుర్తులు అవసరమని చెప్పి నమ్మకం కలిగిస్తారు. తర్వాత మీకు పంపిన లింక్పై క్లిక్ చేయాలని సూచిస్తారు. అలా పంపిన లింక్పై క్లిక్ చేయగానే ఫోన్లో వైరస్ను పంపి బాధితుల ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుంటారు. లేదా 21 ఫోన్ నంబర్ వంటి ప్రత్యేక కోడ్ డయల్ చేయాలని చెబుతారు.ఆ తర్వాత ఫోన్కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేస్తారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిన తర్వాత, బాధితుల ఫోన్ను మోసగాళ్లు హైజాక్ చేస్తారు. ఆ తర్వాత బాధితుల ఫోన్కు వచ్చే కాల్స్, ఓటీపీలు, వెరిఫికేషన్ కోడ్లు తెలుసుకుంటారు. అదేవిధంగా వాట్సాప్ సహా అన్ని సోషల్ మీడియా యాప్లు, ఫోన్ గ్యాలరీపైన నియంత్రణ సైబర్ మోసగాళ్లకు వెళుతుంది. బాధితుడికి ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సహా ఇతర యాప్లేవీ పనిచేయవు. ఇలా బాధితుడి ఫోన్లోని కాంటాక్టు నంబర్లకు బాధితుడిగా నటిస్తూ, వారి కాంటాక్ట్స్ లో ఉన్న వ్యక్తులకు మెసేజులు పంపించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అభ్యర్థిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడతారు.ఈ జాగ్రత్తలు పాటించండి..: ⇒ మీ ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ను డిసేబుల్ చేయండి. ⇒ మీ నెట్వర్క్ ప్రొవైడర్ను సంప్రదించి కాల్ ఫార్వర్డింగ్ ఆపేయండి. ⇒ కొరియర్ కంపెనీలకు వారి అధికారిక వెబ్సైట్లో ఉన్న నంబర్లకే కాల్ చేయండి. ⇒ తెలియని లింకులపైన క్లిక్ చేయకండి. ⇒ లేదా ఉన్న కోడ్లు డయల్ చేయకండి. ⇒ ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దు. ⇒ మీ ఫోన్ కాల్ సెట్టింగ్స్, బ్యాంక్ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ⇒ ఒకవేళ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ 8712672222 వాట్సాప్ నంబర్లో ఫిర్యాదు చేయండి. -
కేబినెట్కు దూరంగా.. ఆ మూడు జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చోటు లభించగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రాతినిధ్యం ఇంకా పెండింగ్లోనే ఉంది. తొలి విడత కేబినెట్లో చోటు దక్కని నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్ నుంచి వివేక్ మంత్రిగా ప్రమాణం చేయగా, గతంలో ప్రాతినిధ్యం ఉన్న మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల నుంచే మరో ఇద్దరు మంత్రులయ్యారు.అయితే కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కేబినెట్లో ఇప్పటికే ఇద్దరు చొప్పున ఉండగా, ఇప్పుడు ఒకొక్కరి చేరికతో ఆ రెండు జిల్లాల ప్రాతినిధ్యం మూడుకు పెరిగింది. కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తోడుగా ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ చేరారు. సీఎం రేవంత్తోపాటు జూపల్లి కృష్ణారావులు మహబూబ్నగర్ నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉండగా కొత్తగా వాకిటి శ్రీహరి చేరారు. దీంతో ఇప్పటికే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా (భట్టి, పొంగులేటి, తుమ్మల) సరసన కరీంనగర్, మహబూబ్నగర్లు కూడా చేరాయి. భవిష్యత్లో ఏమవుతుందో..? మరోమారు కేబినెట్ విస్తరణ జరిగితే మాత్రం నిజామాబాద్ జిల్లాకు స్థానం ఖాయమని..సీనియర్ నేత పి.సుదర్శన్రెడ్డి పేరును ఈసారే ప్రకటించాల్సి ఉన్నా సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాక చివరి క్షణంలో తొలగించారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే స్పీకర్ పోస్టు ఉన్న రంగారెడ్డి జిల్లా ఈసారికి చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకోవాల్సిందేనని, మంత్రి పదవికి అనుకూల సమీకరణలు ఈ జిల్లాలో లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రంగారెడ్డి జిల్లాకు మంత్రిపదవి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్లోనూ నేతల కొరత కారణంగా కేబినెట్ బెర్తు ఎలా భర్తీ చేయాలో ఆ పార్టీ అధిష్టానానికి కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. -
అసంతృప్తులు.. బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతల్లో పార్టీ పట్ల అసంతృప్తికి తావివ్వకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్చార్జ్ సెక్రటరీలు విశ్వనాథన్, విష్ణునాథ్ సహా రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు ఆదివారం మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి కీలక సూచనలు చేశారు. భవిష్యత్లో కచ్చితంగా అవకాశాలు దక్కుతాయనే భరోసా ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో అసంతృప్తులు చల్లారే వరకు ఇన్చార్జ్తో సహా సెక్రటరీలు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.దీంతో మంత్రి పదవి ఆశించి..విస్తరణలో చోటు దక్కని నేతలను బుజ్జగించే పని ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. కేబినెట్లో చోటు దక్కిన వారి పేర్లు బయటకు వచ్చిన అరగంటలోపే టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అప్రమత్తమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను తీసుకొని ఆయన ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించారు. నిజామాబాద్ సీనియర్ నేత పి.సుదర్శన్రెడ్డి, ఆదిలాబాద్కు చెందిన ప్రేమ్సాగర్రావు, రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, భవిష్యత్లో వచ్చే అవకాశాల్లో కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ⇒ సుదర్శన్రెడ్డితో అర గంటకుపైగా మీనాక్షి, మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్లు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను సుదర్శన్రెడ్డి వెలిబుచ్చగా, మరోమారు తప్పకుండా అవకాశం ఇస్తామని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది. ⇒ ఆ తర్వాత ప్రేమ్సాగర్రావు నివాసంలో మీనాక్షి, మహేశ్గౌడ్లు గంటకు పైగా చర్చలు జరిపారు. గత కొన్ని దశాబ్దాలుగా పారీ్టకి తాను చేస్తున్న సేవలను వివరించిన ప్రేమ్సాగర్రావు.. అకారణంగా తనను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ⇒ రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణలే కారణమయితే తాను రాజీనామా చేస్తానని, తన స్థానంలో ఎవరినైనా గెలిపించి వారికైనా మంత్రిపదవి ఇవ్వా లని కోరినట్టు సమాచారం. రాష్ట్రంలోనే 42 శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలాకు మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడాన్ని మల్రెడ్డి ప్రశి్నంచారు. గతంలో అరుగురు మంత్రులు ఈ జిల్లాల్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడొచ్చని మల్రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వారంలోనే కార్యవర్గంమంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినందున టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని మొదట ప్రకటించి, తర్వాత జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు. దొరకని రాజగోపాల్ సుదర్శన్రెడ్డితో బుజ్జగింపుల అనంతరం నేరుగా రాజ గోపాల్రెడ్డి ఇంటికి వెళ్లాలని మీనాక్షి, మహేశ్గౌడ్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఇద్దరు నేతలు ఆ తర్వాత కూడా రాజగోపాల్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రేమ్సాగర్రావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాజగోపాల్ ఇంటికి వెళ్దామనుకున్నా రాత్రి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
ఆ శాఖలతోనే సర్దుబాటు?
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేప థ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది.కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్ణాటక తరహాలో పురపాలికల విభజన కర్ణాటకలో బెంగళూరు, పరిసర పట్టణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రిగా ఉండగా, మిగిలిన కర్ణాటక రాష్ట్రానికి మరో మంత్రి ఉన్నారు. కర్ణాటకలో ఉన్న తరహాలోనే కోర్ ఏరియాకు ఒకరు, మిగిలిన మున్సిపాలిటీ లకు మరొకరిని మంత్రులుగా నియమిస్తారని సమాచారం. అయితే, కోర్ ఏరియాను తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మూసీ పునరి్నర్మాణం, ఫోర్త్ సిటీ ఏర్పాటు తదితర కీలకాంశాలు చేపట్టాల్సి ఉన్నందున, హెచ్ఎండీఏ తోపాటు తాను నిర్మించతలపెట్టిన ఫోర్త్సిటీ పరిధిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలను ఒక మంత్రికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పురపాలక శాఖ కార్యదర్శులకు కూడా ఇదే తరహాలో పని విభజన చేయడం గమనార్హం.ఎవరికి.. ఏ శాఖ!సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణల నేపథ్యంలో కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై చర్చ జరుగుతోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్థక శాఖతో మరో ముఖ్యమైన శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇవ్వొచ్చని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కూడా సింగరేణి బెల్ట్ కావడం, గతంలోనూ ఈ శాఖను ఆయన సోదరుడు వినోద్ చూసిన నేపథ్యంలో కార్మిక శాఖ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు మరో ముఖ్యమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. -
సామాజిక న్యాయానికే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న కేబినెట్ కూర్పును బేరీజు వేసుకొని మరీ సామాజిక న్యాయం కల్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా మంత్రులను ఎంపిక చేసింది. ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ నాయకుడికి మాత్రమే విస్తరణలో అవకాశం కల్పించింది. విస్తరణకు ముందు రాష్ట్ర కేబినెట్లో ఉన్న 12 మంది మంత్రుల్లో (ముఖ్యమంత్రితో సహా) నలుగురు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏడుగురు అగ్రవర్ణాలకు చెందిన మంత్రులున్నారు.వీరితోపాటు ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీసీ, ఎస్సీ నేతలకు కేబినెట్లో అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుతం కేబినెట్లోని 15 మంది సభ్యు ల్లో అగ్రవర్ణాల కంటే అధికంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు స్థానం కల్పించినట్టయ్యింది. ఓసీ నేతలను ఏడుగురికి మాత్రమే పరిమితం చేసింది. కేబినెట్లో ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ద్వారా సగానికిపైగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలుండేలా జాగ్రత్త తీసుకుందని స్పష్టమవుతోంది.గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిట శ్రీహరి, సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గాల నేతల్లో మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హులైన సుదర్శన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, వెలమ వర్గానికి చెందిన ప్రేమ్సాగర్రావు లాంటి నేతలను కూడా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్, ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం భట్టిల విజ్ఞప్తులు, మంత్రి పదవి ఇస్తామని అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలకు ముందు రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం గమనార్హం. కీలక పదవులూ వారికే మంత్రివర్గం సంగతి అటుంచితే.. అసెంబ్లీలో మిగిలిన పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ (ఎస్సీ) ఉండగా ఎస్టీ (లంబాడా) వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ (ఎస్సీ)కి మంత్రివర్గంలో అవకాశం కల్పించగా, మిగిలిన ఇద్దరు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యలు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానంలో ఖాళీ అయిన విప్తోపాటు చీఫ్ విప్ పదవులు మాత్రమే అగ్రవర్ణాలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.లేదంటే అడ్లూరి లక్ష్మణ్ స్థానాన్ని మరోమారు ఎస్సీ నేతతో భర్తీ చేస్తే..ఒక్క చీఫ్ విప్ మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి వస్తుంది. ఈ పదవిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డిలలో ఒకరిని వరించే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం మరోమారు కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివారం జరిగిన విస్తరణ అనంతరం కేబినెట్లో నియమించుకునేందుకు వీలున్న మూడు స్థానాలను అప్పుడు భర్తీ చేయొచ్చు.అప్పుడు కూడా కేవలం ఒక్కటి మాత్రమే అగ్రవర్ణాలకు వస్తుందని, ఒకటి బీసీ, మరోటి ఎస్టీ లేదా మైనార్టీ సామాజికవర్గాలకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాజా విస్తరణ తరహాలోనే భవిష్యత్లో జరిగే విస్తరణలోనూ అగ్రవర్ణాలతో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్రవర్ణాలకు ఇతర పదవులు కేటాయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు అర్థమవుతోంది. -
ముగ్గురికే పట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్ ఇంగ్లిష్లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలు, కేబినెట్ మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. రాజ్భవన్లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్ మరో మూడు బెర్తులు ఖాళీగానే... కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, మరో 11 మంది కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్ 7న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్లో తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. -
మిస్ యూనివర్స్లో.. తెలుగు అందాలు
మరో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్కు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి నిర్వహించనున్న మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి మిస్ ఇండియా ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ స్టేట్గా ఎంపిక చేసి, మిస్ యూనివర్స్ ఇండియా పోటీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపిక అయ్యారు. హైదరాబాద్ అజీజ్ నగర్లోని ధారా రిసార్ట్లో నిర్వహించిన మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలేలో ఈ అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. – సాక్షి, సిటీ బ్యూరోమిస్ యూనివర్స్ ఎంపికలో భాగంగా నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులు పాల్గొని ర్యాంప్ వాక్ చేసి అహూతులను అలరించారు. డిజైనర్ చారు పరాశర్, గత ఏడాది మిస్ యూనివర్స్ రన్నర్ అప్ రూపూజనే విసో, మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజ్ హెడ్ అంజద్ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ గ్రాండ్ ఫినాలేలో తెలంగాణ రన్నరప్లుగా సృష్టి, రితిక నిలువగా.. సలోని, తనుశ్రీ ఆంధ్రప్రదేశ్ పేజెంట్ రన్నరప్లుగా నిలిచారు. ఈ ఫ్యాషన్ ఈవెంట్కు సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వనరుల వల్లే.. హైదరాబాద్లో ఉన్న వనరులు సమయానుకూలంగా ఉన్నందుకే ఈ షోను కేవలం రోజుల వ్యవధిలో సూపర్ సక్సెస్ చేయగలిగామని తెలంగాణ ఎడిషన్ డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు. రేస్లో తెలుగు అమ్మాయిలు.. మిస్ వరల్డ్ పోటీల తర్వాత అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మిస్ యూనివర్స్ పేజెంట్కి హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా సహకరించిందని ఈవెంట్ నిర్వాహకురాలు, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీత తెలిపారు. చాలా తక్కువ సమయమే ఉన్నా.. పోటీదారులు అందరూ చాలా శ్రమించి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను చూపారని కొనియాడారు. వారం రోజుల పాటు జరిగిన ఫ్యాషన్, టాలెంట్, డ్రెస్సింగ్ వంటి విభిన్న రౌండ్స్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది పాల్గొని తమ నైపుణ్యాలను గ్లామర్ ఇమేజ్ను అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు మోడలింగ్లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పేజెంట్లో తమ సత్తా చాటుతున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ ఇండియా ఎంపికలో తెలుగు మోడల్స్ టాప్లో ఉన్నారు. ఈ గ్లోబల్ పేజెంట్కు పోటీనిచ్చేలా మన అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ అందించాం. ఇందులో భాగంగా విదేశాల్లో మోడట్స్కు ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ బ్యూటీ పేజెంట్స్ ట్రైనర్, కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజ్వాలెస్తో శిక్షణ అందించాం.విజేతగా నిలవడమే లక్ష్యం.. మిస్ యూనివర్స్ ఇండియాతో పాటు, మిస్ యూనివర్స్లోనూ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. వారం రోజుల పాటు జరిగిన రౌండ్స్ మరింత అవగాహన కల్పించాయి. – కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణమన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం.. ఈసారి మిస్ యూనివర్స్లో తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ గ్లోబల్ పేజెంట్కు తగినట్టుగా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాను. నా చిరకాల కోరికకు కొద్ది దూరంలో ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. – ప్రకృతి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ -
సందడి షురూ..
జూన్ తొలి వారంలోనే నగరంలోని ప్రముఖ బుక్ స్టోర్లు, స్టేషనరీ షాపులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో క్రిక్కిరిసిపోయాయి. నోటుబుక్స్, కవర్లు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్లు, పెన్సిల్ బాక్స్లు ఇలా ఒక్కో ఐటెమ్ కోసం క్యూలో నిలబడే పరిస్థితి. కొన్ని స్టోర్ల వద్ద ప్రత్యేకంగా ‘బ్యాక్ టు స్కూల్’ ఆఫర్లు, కాంబో డీల్స్ అందించడంతో కొనుగోలుదారుల ఉత్సాహం మరింత పెరిగింది. కొత్త ఆశలు, పాత అలసటలు.. చదువు అంటే కొత్త ఆవిష్కరణలకు నాంది. స్కూల్ అంటే కేవలం పుస్తకాలే కాదు – స్నేహితులు, ఆటలు, అసైన్మెంట్లు, టీచర్ల పనిష్మెంట్లు అన్నీ కలిపే ఒక ప్రత్యేక అనుభవం. కొంతమంది విద్యార్థులు ‘ఈసారి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నా’ అనే ఉత్సాహంతో స్కూల్ బ్యాగ్ సిద్ధం చేస్తుంటే, మరికొందరు ‘ఇంకా సెలవులు కావాలి’ అనే భావనలో ఉన్నారు. తల్లిదండ్రులకైతే రోజువారి జీవనశైలిలో మరోసారి క్రమపద్ధతిలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది.టైమ్ టేబుల్స్, టిఫిన్ బాక్స్లు..వేసవి సెలవుల్లో రాత్రివేళల ఫిలింలు, ఉదయపు ఆలస్యమైన నిద్రలు ఇప్పుడు మళ్లీ అలారం ధ్వనితో ముగిసిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇప్పుడు మళ్లీ ఉదయం 6 గంటలకే లేచి టిఫిన్లు తయారు చేయాల్సి వస్తోంది. సిటీ ట్రాఫిక్ మళ్లీ స్కూల్ బస్సులతో రద్దీగా మారింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారైతే ట్రాఫిక్ టైంకు తగ్గట్టుగా తమ పని సమయాన్ని మార్చుకుంటున్నారు. మరో శిక్షణ ప్రయాణం..పిల్లల జీవితాల్లో పాఠశాలలు శారీరక, మానసిక అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. సెలవుల్లో అనుచితమైన స్క్రీన్ టైమ్ తగ్గించుకొని, మళ్లీ పఠనంలో, ఆటల్లో భాగస్వామ్యం కావడం పిల్లల ఆరోగ్యానికి మంచిది. తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం, సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. -
చేప ప్రసాదం పంపిణీతో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతి
అబిడ్స్/గన్ఫౌండ్రీ: చేప ప్రసాదం పంపిణీతో హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వ్యాప్తి చెందిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బత్తిని కుటుంబీకులు ఏటా లక్షలాది మందికి ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాద కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్, రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కీలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలామంది నమ్మకమన్నారు. విశ్వాసానికి మరో పేరు చేప ప్రసాదం పంపిణీ అన్నారు. ప్రభుత్వ పక్షాన 15 రోజులుగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి వివిధ శాఖల అధికారులు కలిసి 48 గంటల పాటు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 178 సంవత్సరాలుగా లక్షలాది మందికి సేవాభావంతో సేవలందిస్తున్న బత్తిని కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ 1995 నుంచి చేపప్రసాదాన్ని తన కుటుంబం తీసుకుంటుందని, తమకు ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ తరఫున 1.50 లక్షల చేపపిల్లలను అందించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎగ్జిబిషన్ సొసైటీ, ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించాయన్నారు.కర్ణాటక ఎమ్మెల్సీ మంజునాథ్, స్థానిక కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 46 వేల చేపపిల్లల విక్రయాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం రాత్రి వరకు 46 వేల చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో విక్రయించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం వరకు 60 వేల వరకు విక్రయాలు జరగొచ్చన్నారు. గుండెపోటుతో వ్యక్తి మృతిమెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ(75) చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చాడు. క్యూ లైన్లో నిలబడిన సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. తక్షణమే ఆయన్ను ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసినా, ఫలితం లేకపోయింది. సత్యనారాయణ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నేపాల్ నుంచి రాక..ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ నుంచి కూడా చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చారు. ఆ దేశానికి చెందిన గోఖులు కాత్రే కుటుంబ సభ్యులు చేపప్రసాదాన్ని తీసుకున్నారు. మూడేళ్లు గా తాము క్రమంగా తప్పకుండా వస్తున్నామని చెప్పారు. భారీ బందోబస్తు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర పోలీస్ జాయింట్ సీపీ విక్రమ్సింగ్ మాన్, సెంట్రల్జోన్ డీసీపీ శిల్పవల్లితో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు. అడిషనల్ డీసీపీ ఆనంద్, అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్కుమార్, ఇన్స్పెక్టర్లు భరత్కుమార్, ఏడుకొండలుతో పాటు అదనపు పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడంపై పెట్టే దృష్టి అనుబంధ గుర్తింపు తెచ్చుకోవడంపై పెట్టడం లేదు. నిబంధనలన్నీ పాటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి కాలేజీలపై ఇంటర్ బోర్డు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మరో వారం రోజుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. ఈలోగానే కాలేజీలు బోర్డు అనుమతి తీసుకోవాలి. కాలేజీల్లో చేరికలు, బోర్డ్ అనుమతులు, సీట్ల వివరాలను వెబ్సైట్లో నిత్యం అందుబాటులో ఉంచాలి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బోర్డు అధికారులు కూడా ఈ కాలేజీలపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గుర్తింపు విషయంలో కంగారు వద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు. సగం కూడా పూర్తవ్వని అఫిలియేషన్ రాష్ట్రవ్యాప్తంగా 4,089 ఇంటర్ కాలేజీలున్నాయి. 3,254 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో అనుబంధ గుర్తింపు పొందినవి 1,312 మాత్రమే. 1,483 కాలేజీల దరఖాస్తులను బోర్డ్ తిరస్కరించింది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలని కోరింది. సరైన లొకేషన్ లేదని 1,216 కాలేజీలను పెండింగ్లో ఉంచారు. ప్రతీ ఏటా అఫ్లియేషన్కు దరఖాస్తు చేసే కాలేజీలు సైతం సరైన విధానంలో వెళ్లడం లేదని, ధ్రువపత్రాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బోర్డు అధికారులు అంటున్నారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాతే క్లాసులు నిర్వహించాలనే నిబంధన విధించాలని బోర్డు నిర్ణయించినా, జిల్లా అధికారులు మాత్రం దీన్ని అమలుచేయడం లేదు. ఈ కారణంగానే అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవ్వడం లేదు. రాజధాని పరిసరాల్లోనే సమస్యలు రాజధాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిల్లో చాలావరకు బహుళ అంతస్తుల భవానాల్లోనే నడుస్తున్నాయి. వీటిని జిల్లాలకు దూరంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాలేజీలు దీనికి అడ్డుపడ్డాయి. కాలేజీలు దూరంగా ఉంటే విద్యార్థులను చేర్చుకోవడం కష్టమని భావిస్తున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితాను అధికారులు తెప్పించారు. ప్రభుత్వానికి కూడా ఇటీవల నివేదించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. గుర్తింపు రాకుండానే విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈసారీ అదే తంతా? బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీ వల్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని ఫైర్ సేఫ్టీ విభాగం 2020లోనే స్పష్టం చేసింది. ఇలాంటి భవనాలు ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి ఎన్వోసీ తీసుకోవాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 6–15 మీటర్ల ఎత్తున్న కాలేజీ భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ఫైర్ సేఫ్టీ విభాగం అనుమతినివ్వాలి. కానీ రాజధాని పరిసరాల్లో ఎక్కువగా 15 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాల్లో నడుస్తున్నాయి. రెండేళ్లుగా ఫైర్సేఫ్టీ విభాగం ఎన్వోసీ ఇవ్వడం లేదు. అయినా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. పరీక్షల సమయం వరకూ విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంటోంది. చివరకు ఒక్క సంవత్సరం కోసం అనుమతి ఇవ్వడం, వచ్చే ఏడాది నుంచి ఇవ్వబోమని చెప్పడం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి ఇలాంటి కాలేజీల అనుమతి నిలిపివేయాల్సి ఉంది. కానీ ఇలాంటి చర్యలేమీ బోర్డు తీసుకోలేదు. అఫ్లియేషన్ల విషయంలో తాత్సారం తగదని తల్లిదండ్రులు అంటున్నారు. -
చిన్నకారు చిన్నబోతోంది!
చిన్న కారు.. చిన్నబోతోందా? అవుననే అంటున్నాయి గణాంకాలు. భారతీయ ప్యాసింజర్ కార్ల రంగాన్ని పరుగెత్తించడంలో ఒకప్పుడు కీలక ‘ఇంజిన్ ’గా నిలిచిన చిన్న కార్ల అమ్మకాల్లో వేగం ఏటా తగ్గుతూ వస్తోంది. వీటి ఖరీదు ఏటా పెరుగుతూ వస్తుండడమే ఇందుకు కారణం. 2019–20లో ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 46.5%గా ఉన్న చిన్న కార్ల వాటా 2023–24 నాటికి 27.7%కి వచ్చి చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొనసాగుతున్న ఈ క్షీణతపై దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత వాహన పరిశ్రమకు పునాదిగా గతంలో నిలిచిన ఈ విభాగంలో డిమాండ్ను తిరిగి రేకెత్తించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అంతవరకు ద్విచక్ర వాహనంతో తన కుటుంబాన్ని తీసుకెళ్లిన ఒక సామాన్యుడు.. చిన్న కారు కొనుక్కొని దాంట్లో తన కుటుంబాన్ని షికారుకో, ఊరికో వెళ్లడం ఒక ప్రెస్టీజ్గా భావించేవాడు. ధరలు కూడా తక్కువగా ఉండటంతో అప్పో సప్పో చేసి కారు కొనేసేవాడు. 5 ఏళ్ల కిందటి వరకు చిన్నకార్ల అమ్మకాలు ఇలాగే పెరిగాయి. కానీ, గత 5 ఏళ్లలో అనేక కారణాల వల్ల ధరలు పెరగడంతో చిన్న కార్ల అమ్మకాలకు పెద్ద బ్రేకే పడింది.భారీగా తగ్గిన చిన్నకార్ల వాటాదేశంలో 2018–19లో 15,53,598 చిన్నకార్లు అమ్ముడయ్యాయి. 2023–24లో ఈ సంఖ్య 11,68,592కి పడిపోయింది. మొత్తం ప్యాసింజర్ వాహనాల పరంగా చూస్తే.. 2018–19లో 33,77,389 అమ్ముడైతే.. 2023–24లో 42,18,746 వాహనాల అమ్మకాలు జరిగాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో చిన్న కార్ల వాటా 46 నుంచి 27.7 శాతానికి తగ్గిపోయింది. ఇందులోనూ ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు భారీగా క్షీణిస్తున్నాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం 2018–19లో ఎంట్రీ లెవల్ కార్లు (3.6 మీటర్ల వరకు పొడవు ఉండేవి) అన్ని కంపెనీలవి కలిపి దేశీయంగా 4,60,772 రోడ్డెక్కాయి. 2024–25లో ఈ సంఖ్య 1,33,397కు పడిపోయింది. భారత్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ కూడా అమ్మకాలు తగ్గినట్టు వెల్లడించింది. 2025 మే నెలలో ఆల్టో, ఎస్–ప్రెస్సో అమ్మకాలు.. గతేడాదితో పోలిస్తే 9,902 నుంచి 6,776 యూనిట్లకు పడిపోయాయి. క్రమంగా కనుమరుగు..చిన్న కార్ల అమ్మకాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వ జోక్యం చాలా కీలకం. ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల వాహనాలకు మారాలనుకునే మొదటిసారి కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు, పన్ను ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కార్ల కొనుగోలు సమయంలో మూడు సంవత్సరాల థర్డ్–పార్టీ బీమా ఇప్పుడు తప్పనిసరి. పెద్ద కార్ల కొనుగోలుదారులకు ఇది భారం కాదు. కానీ, మొదటిసారి చిన్న కారు కొనే బడ్జెట్ కస్టమర్లను ఈ మొత్తం ఇబ్బంది పెడుతుంది. నియంత్రణ సంబంధ ప్రమాణాలను పాటిస్తూనే పోటీ ధరలను అందించడానికి, అమ్మకాల పరిమాణాన్ని పెంచడానికి వాహన తయారీ సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేయాలని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరిగేనా?ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ–లెవల్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ ఆశిస్తోంది. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయిస్తూ ఇటీవల బడ్జెట్లో చేసిన ప్రతిపాదన కారణంగా ఈ ఆదాయ వర్గాలు ఎక్కువగా ఖర్చు చేస్తాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి, ఏప్రిల్, తాజాగా ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. తద్వారా లోన్లపై వడ్డీ భారం ఆ మేరకు తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చే అంశం. అయితే కొత్త మోడళ్లు భారం అని భావించే ఎంట్రీ లెవల్ కొనుగోలుదారులు పాత కార్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు కొత్త మారుతీ ఆల్టో కే10 బేసిక్ వేరియంట్ ధర హైదరాబాద్ ఎక్స్షోరూమ్లో 2019లో సుమారు రూ.3.4 లక్షలు. 2025లో ఇది రూ.4.23 లక్షలకు చేరింది. అంటే ధర 25% పెరిగిందన్నమాట. కొత్త సబ్ కాంపాక్ట్ మోడళ్లకు వెచ్చించే ధరలో పెద్ద, మరిన్ని ఫీచర్లు కలిగిన పాత కార్లు ఇప్పుడు లభిస్తున్నాయి. జపాన్ ను అనుసరిస్తే..భారత్లో 1,000లో కేవలం 34 మంది వద్ద మాత్రమే ప్రస్తుతం కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు పెంచేందుకు.. కొనుగోలుదారులు ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు అప్గ్రేడ్ అయ్యే విషయంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులు కార్లకు అప్గ్రేడ్ అవ్వడానికి జపాన్ లో ‘కేయ్’ కార్లు సహాయపడ్డాయి. పెద్ద కార్లతో పోలిస్తే జపనీస్ కొనుగోలుదారులు కేయ్ మోడళ్లపై తక్కువ పన్ను, బీమా చెల్లిస్తున్నారు. దీనివల్ల యాజమాన్య ఖర్చులు తగ్గుతాయి. జపాన్ లో అమ్ముడవుతున్న అన్ని కార్లలో కేయ్ మూడవ వంతు కలిగి ఉన్నాయంటే మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొనుగోలు సవాళ్లను పరిష్కరించడానికి చిన్న, పెద్ద కార్లను ప్రభుత్వం వేర్వేరుగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు. ‘భారత్లో కార్ల కొనుగోళ్లు ఎక్కువగా రూ.12 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న 12% కుటుంబాలకే పరిమితం అయ్యాయి. మిగిలిన 88% మంది కుటుంబాలు చిన్న కారును కూడా సొంతం చేసుకోలేని స్థితిలో ఉన్నాయి’ అని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. -
‘నేను కమిషన్ దగ్గరకు దోషిగా వెళ్లలేదు.. సాక్షిగా వెళ్లాను’
హైదరాబాద్: తానే కాళేశ్వరం కమిషన్ ముందుకు దోషిగా వెళ్లలేదని, సాక్షిగా మాత్రమే వెళ్లానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటంతో తప్పకుండా విచారణకు హాజరుకావాలని పిలిస్తే కమిషన్ ముందుకు సాక్షిగా వెళ్లానన్నారు. బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘నన్ను కమిషన్ పిలిచింది.. కమిషన్ కూడా సాక్షిగా రమ్మని పిలిచింది తప్ప దోషిగా పిలవలేదు. నేను తప్పకుండా వస్తాను. మా పార్టీ ,కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి వెళ్లాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎక్కడ వెతికినా ఒక్క స్కాం కూడా కనపడదు. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ. సొంత మంత్రులే జైలుకు పోయారు.కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు.. ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టండి, మీకు చేతకాకపోతే సిబిఐ కి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తాము. ఇప్పుడున్న కమిషన్ను ఆరుసార్లు పొడిగించారు... దోషులను బయట పెట్టకపోతే నీకు శిక్ష తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు మన మీద మాటల దాడి చేస్తారు. ఈ ఆరోపణలను, దాడులను తిప్పి కొట్టే సత్తా బీజేపీ కార్యకర్తలకు ఉండాలి’ అని ఈటల పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైదరాబాద్కు ప్రభాకర్రావు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్రావు హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు(ఆదివారం, జూన్8వ తేదీ) అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్రావు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ(special intelligence bureau) చీఫ్గా ఉండి ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్రావు సిట్ విచారణకు హాజరు కావడానికి నగరానికి వచ్చారు. రేపు(సోమవారం, జూన్9 వతేదీ ) సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్రావు. ప్రభాకర్రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరుగనుంది. ఇక ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయనన్నారు. ప్రధానంగా రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. -
నా స్కూల్ మీ వద్దే అని ప్రధాని మోదీకి చెప్పాను: సీఎం రేవంత్
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం( జూన్8) ఘనంగా నిర్వహించారు 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్గా ఎన్నో రాజకీయ ఓడి దుడుకులు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మొన్న నీతి అయోగ్ మీటింగ్లో ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడును చూపించి అప్ కి సాతి యా వా హై(మీ స్నేహితుడు అక్కడున్నారు) అన్నారు. నేను ప్రధానికి చెప్పాను నేను స్కూల్ మీ దగ్గర చదివాను , కాలేజీ వారి(టీడీపీ) దగ్గర చదివి, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానని అన్నాను. అన్ని రాజకీయ పార్టీల నేతలు అరుదుగా ఒక వేదికపై కనిపిస్తారు అంటే అది అలయ్ బలయ్ వేదిక. మా మంత్రి వర్గం అంత ఇక్కడే ఉంది. నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో పి. జనార్ధన్ రెడ్డి, దత్తాత్రేయలది చెరగని ముద్ర. దత్తాత్రేయ ముక్కు సూటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకి వెళ్ళాలి. కిషన్ రెడ్డితో నాకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకి తీసుకెళ్తాను’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
నాంపల్లి: చేప ప్రసాదం పంపిణీలో విషాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. క్యూలెన్లలో గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని మెదక్ జిల్లాకు చెందని సత్యనారాయణ(75)గా గుర్తించారు. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి గుండెపోటు రాగా.. ఆయన స్పృహ తప్పి పడిపోయారు.. వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు పంపిణీ మొదలు కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు చేప మందు కోసం భారీగా తరలివచ్చారు. 42 క్యూ లైన్లలో కౌంటర్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. -
మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి ఈరోజు(ఆదివారం) ఉదయం మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడ గంటల ప్రాంతంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడమ మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కేటీఆర్, హరీష్ రావు తదితర నేతలు గోపీనాథ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.హైదరాబాద్ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్ -
Hyderabad: మేయర్కు బెదిరింపులు!
బంజారాహిల్స్(హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి గత మూడు రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నిందితున్ని పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆమె పీఆర్ఓ అఖిల్ బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మేయర్కు మూడు రోజులుగా ఒకే వ్యక్తి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. దీంతో మేయర్ పీఆర్ఓ ఫిర్యాదు చేయగా, ఈ నంబర్ కోసం ఆరా తీస్తున్నారు. అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. నిదింతుని జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మేయర్ ఇంటికి గతంలోనూ ఓ వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడగా, అప్పుడు నిదింతునిపై చర్యలు తీసుకున్నారు. -
రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్లో కొత్త మంత్రులు మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్(ధర్మపురి) ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఎవరికి ఏ శాఖ?కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తుంది. ఇవాళ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, విద్య, సంక్షేమ శాఖలు ఉండగా.. ఆ శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. 👉వివేక్ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి.అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసింది👉శ్రీహరి రాజకీయ ప్రస్థానంకర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.👉లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానంధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. -
నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. చేప ప్రసాదం పంపిణీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత మానిటరింగ్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తన శ్రీమతి కుటుంబం ఢిల్లీ నుండి వచ్చి ఆ కాలంలోనే చేప మందు తీసుకున్నారని.. ఇది బ్రహ్మాండమైన ఔషధం అని కితాబు నిచ్చారు నేచురల్ ఔషాధాలతో కూడిన మందు అని.. ఈ ప్రసాదాన్ని ప్రోత్సహించాలన్నారు. దాదాపు 170 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ మందు అందిస్తుందన్నారు. -
‘వీకెండ్’ కోసం వచ్చి అనంతలోకాలకు...
ఘట్కేసర్(హైదరాబాద్): ఓ ఐటీ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరారు ఆ యువకులు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో ఉత్సాహంగా పార్టీ చేసుకునేందుకు శుక్రవారం సాయంత్రం ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్లోని విహారి నెస్ట్ ఫాంహౌస్కు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చి మిగతా స్నేహితులతో కలిసి రెండు కార్లలో ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును చూసేందుకు వెళ్లారు. తిరిగి ఫాంహౌస్కు చేరుకునే క్రమంలో ఓ కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన మేరకు గచి్చ»ౌలిలోని అసెన్షన్ ఐటీ కంపెనీలో పనిచేసే మిత్రులు కుంట్లూరుకు చెందిన భార్గవ్యాదవ్ (23), సైనిక్పురికి చెందిన వర్షిత్ (22), పటాన్చెరుకు చెందిన దినేశ్ (22), అల్వాల్కు చెందిన ప్రవీణ్ (30) నలుగురు ఒక కారులో, మరొక కారులో మరో నలుగురు కలిసి మొత్తం ఎనిమిది మంది శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఫౌహౌంస్కు చేరుకున్నారు. రాత్రి వరకు విందు చేసుకొని అర్థరాత్రి దాటిన తర్వాత కారులో బయటకు వచ్చి లక్ష్మీనారాయణ చెరువు తిలకించారు. తిరిగిఫాంహౌస్కు చేరుకునే క్రమంలో కిలోమీటర్కు ముందే రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో రెండు స్తంభాలు విరిగిపోయాయి. వెనక కూర్చున్న భార్గవ్, వర్షిత్ బెల్ట్ పెట్టుకోకపోవండతో కారు డోర్లు తెరుచుకొని రోడ్డుపై పడి అక్కడికక్కడే మృంతిచెందారు. కారులో ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న దినేశ్కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ వైపు నుంచి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నడుపుతున్న ప్రవీణ్కు తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు వెనకాల మరో కారులో ఉన్న స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ప్రవీణ్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనుమతి లేకుడా మద్యం?కాగా ఫాంహౌస్లో యువకులు మద్యం సేవించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఫాంహౌస్లలో అనుమతి లేకుండానే మందు పార్టీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు∙జరిగి మరణాలు సంభవిస్తున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాపం జుబేదా!
మైలార్దేవ్పల్లి(హైదరాబాద్): సమీపంలోని నివాసంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకునేందుకు వారింటికి వెళ్లిన మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన సలీమ్, రేష్మ దంపతులు. బక్రీద్ పండగను పురస్కరించుకొని ఇక్కడ ఉంటున్న కూతురి దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సలీమ్ మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. పెద్దగా అరుపులు వినిపిస్తుండటంతో పక్కనే ఉంటున్న జుబేదా (26) అనే మహిళ అక్కడికి వెళ్లింది. అప్పటికే సలీం కొట్టడానికి రావడంతో భార్య రేష్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. సలీం కూరగాయలు కోసే కత్తిని చేతపట్టుకొని ఆమె కోసం గాలిస్తున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన జుబేదాను తన భార్య అనుకొని కత్తితో పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సలీం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని గాలించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జుబేదాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో.. అమ్మాయి!
సాక్షి, హైదరాబాద్: విద్య మనిషిలో వివేకాన్ని, చైతన్యాన్ని పెంచుతుందంటారు. కానీ, మనదేశంలో చదువుకున్నవాళ్లు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యతతోపాటు మూఢత్వం కూడా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో బాలురతో పోల్చితే బాలికల శాతం వేగంగా పడిపోవటమే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్)–2021 గణాంకాలు దేశంతోపాటు తెలంగాణలో బాలికల జనాభా, మొత్తం జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతున్న వైనాన్ని బయటపెట్టాయి.జననాల రేటులోనూ అథమమే.. జననాల రేటు కూడా తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక మహిళ తన గర్భస్థ సామర్థ్య కాలపు సాధారణ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) తెలంగాణలో 1.5కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత తక్కువగా 1.4కి పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇది జనాభా స్థిరీకరణకు కావాల్సిన కనీస స్థాయి (2.1) కంటే చాలా తక్కువ. దేశవ్యాప్తంగా 1986లో ఎఫ్టీఆర్ 4.2గా ఉండగా, 2021 నాటికి 2.0కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 నుంచి 2.2కి తగ్గింది.పట్టణాల్లో తగ్గిన బాలికా జననాలుదక్షిణ భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత ఉన్న కేరళలో మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో లింగ నిష్పత్తిలో తేడా గణనీయంగా పెరిగిందని ఎస్ఆర్ఎస్ సర్వేలో తేలింది. తెలంగాణలో జననాల రేటు ప్రమాదకరంగా 1.5 శాతానికి పడిపోయింది. అందులో బాలికల జననాలు మరింత తక్కువగా ఉన్నాయి. దేశంలో లింగనిష్పత్తి 913 (1,000 మంది పురుషులకు 913 మంది స్త్రీలు) ఉండగా, తెలంగాణలో అది 902కే పరిమితమైంది.రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో లింగనిష్పత్తి మరింత తగ్గింది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో లింగ నిష్పత్తి 1,000కి 896 మాత్రమే ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పం. ఈ గణాంకాలు రాష్ట్రంలో బాలికల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే శ్రామిక సామర్థ్యం, లింగ సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.త్వరలో వృద్ధ భారతంఈ గణాంకాల ప్రకారం చూస్తే త్వరలోనే తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ఉత్పాదకత తగ్గి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అధికం అవుతాయి. లింగ వివక్షతో పాటు తక్కువ ఫర్టిలిటీ రేటు ఉన్న రాష్ట్రాలు భవిష్యత్తులో పెళ్లిళ్లు ఆలస్యమవడం, ఉద్యోగ విభాగాల్లో యువ శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నిధుల సమీకరణకు హౌసింగ్ బోర్డు భూముల వేలం
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయం ద్వారా సేకరించిన నిధులను ఓఆర్ఆర్ పరిసరాలు, జిల్లాల్లో ఇళ్లను నిర్మించి సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడానికి వినియోగించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీన వీటి వేలానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ వేలానికి ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లను, ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నట్లు చెప్పారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కోదాంట్లో దాదాపు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లను ఏక మొత్తంగా విక్రయించనున్నట్లు వివరించారు. బిల్డర్లు, ఒక గ్రూపుగా ఏర్పడి కొనుగోలు చేయాలనుకునేవారు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు అవసరం ఉన్న సంస్థలు వీటిని కొనుగోలు చేసే వీలు కల్పిçస్తున్నట్లు చెప్పారు. వేలం వేయనున్నవి ఇవే..రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్గూడలో 20, చందానగర్లో 3, బహదూర్పల్లిలో 69 ఓపెన్ ప్లాట్లు, బండ్లగూడలో పూర్తయిన 159 ఫ్లాట్లు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని ఐదు టవర్లలో పూర్తికాని కట్ట డాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ స్థాయిలోని ఫ్లాట్లు వేలం వేయను న్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని పోతుల మడుగులో 111, అమిస్తాపూర్లో 45 ఓపెన్ ప్లాట్లు, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా విక్రయించనున్నారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డులో 7.33 ఎకరాలు..కూకట్పల్లిలోని హౌసింగ్బోర్డు 4వ ఫేజ్లో ఖాళీగా ఉన్న 7.33 ఎకరాలు, అదే కాలనీలో ఉన్న మరో రెండు ప్లాట్లను (4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు) కూడా ఈ వేలంలో విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డినగర్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్కు చెందిన 2,605 చదరపు గజాలను విక్రయిస్తామన్నారు. సంజీవరెడ్డినగర్లోని కమ్యూనిటీ హాల్ (సెల్లార్, స్టిల్ట్, జి+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణం, 37,030 అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉన్నదని, దీనిని ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసమే వేలం వేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. -
సొరంగంలో నడుస్తూ.. చేపలను చూస్తూ!
సాక్షి, హైదరాబాద్/బహదూర్పురా: గాజు తొట్టెల్లో రంగురంగుల చేపలు కనిపిస్తే ఎవరైనా భలే ఉన్నాయని ముచ్చటపడతారు.. చిన్నారులైతే ఎగిరి గంతేస్తారు. అలాంటిది మనమే ఓ భారీ గాజు తొట్టె లోపల నడుస్తూ ఇరువైపులా వింత ఆకారాల్లో, వివిధ సైజుల్లో ఉండే చేపలను చూస్తే..! ఆ అనుభూతే వేరు కదూ. హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు విచ్చేసే సందర్శకులకు త్వరలోనే ఈ అనుభూతి కలగనుంది. జూపార్క్లోని ఎకరం స్థలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే జూ బోర్డు అనుమతి పొందిన ఈ ప్రాజెక్టుకు రూ. 50 కోట్ల నిర్మాణ వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. గుజరాత్లోని అక్వాటిక్ గ్యాలరీ, కేరళలోని మెరైన్ వరల్డ్ మాదిరిగా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు.2026 నాటికి సమగ్ర మాస్టర్ ప్లాన్..ప్రస్తుతం బహదూర్పురాలోని జూపార్క్లో మంచినీటి, సముద్ర జలచరాలతో కూడిన 15 చిన్న అక్వేరియంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి సమీపంలోనే ప్రతిపాదిత అక్వేరియాన్ని సుమారు 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. గుజరాత్లోని అక్వాటిక్ గ్యాలరీ తరహాలో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2026 నాటికి మాస్టర్ ప్లాన్ పూర్తవుతుంది. సింగపూర్, ఆస్ట్రేలియాకు చెందిన బహుళజాతి సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.వందలాది చేపల రకాలు..సందర్శకులు నడవడానికి వీలుగా ఉండేలా సొరంగ శైలిలో అక్వేరియం నిర్మాణం ఉంటుంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాల నుంచి స్టింగ్ రే, స్టార్ ఫిష్, లయన్ ఫిష్, షార్క్ వంటి 100కుపైగా చేపల రకాలను దిగుమతి చేసుకొని అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం జూపార్క్కు సగటున రోజుకు 30 వేల మంది సందర్శకులు వస్తుండగా అక్వేరియం అందుబాటులోకి వస్తే రోజుకు 50 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.కేంద్ర జూ అథారిటీ అనుమతులే తరువాయి..ప్రస్తుత జూపార్క్ను, పక్కనే ఉన్న మీరాలం చెరువు సుందరీకరణ పనులతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. అందులో భాగంగా పార్క్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. అక్వేరియం నిర్మాణానికి కేంద్ర జూ అథారిటీ అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలుపెడతాం. – డాక్టర్ సునీల్ ఎస్. హీరేమత్, డైరెక్టర్, రాష్ట్ర జూపార్క్లుపులితో సెల్ఫీ..గుజరాత్లోని వన్తార వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మాదిరిగా.. మన జూపార్క్లోనూ టైగర్ గ్లాస్ ఎన్క్లోజర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎన్క్లోజర్ ప్రాజెక్ట్కు ఇప్పటికే జూబోర్డు రూ. 1.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సందర్శకులు పులులను దగ్గరగా చూడటానికి వీలు కల్పించే విధంగా 50 మీటర్ల వెడల్సాటి గాజు ఎన్క్లోజర్ ఉంటుంది. సందర్శకులు పులులను దగ్గరగా చూస్తూ ఎంచక్కా సెల్ఫీ దిగొచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సింహం, చిరుత బోన్లకు కూడా గ్లాస్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. -
అప్రమత్తతే రక్ష
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ కోవిడ్–19 యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇటీవల కాలంలో మృతుల సంఖ్య సైతం ఏడుకు చేరుకోవడంతో (ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే మొత్తం 55 మరణాలు) మరో ‘కరోనా వేవ్’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐదు వేలకు పైబడి యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్లో 107, పశ్చిమబెంగాల్లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త యాక్టివ్ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పోర్టల్లో పొందుపరిచిన వివరాల ప్రకారం చూస్తే.. గత 24 గంటల్లో దేశంలో 391 యాక్టివ్ కేసులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 5,755 చేరుకుంది. కరోనా మళ్లీ ప్రారంభమైన జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 59 మంది మరణించారు.కాగా శుక్రవారం ఒక్కరోజే నలుగురు చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళ 1,806, గుజరాత్ 717, పశ్చిమబెంగాల్ 622, ఢిల్లీ 665, మహారాష్ట్ర 577, కర్ణాటక 451, తమిళనాడు 379, యూపీ–208, ఆంధ్రప్రదేశ్ 72, తెలంగాణలో 5 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మహారాష్టలో 18, కేరళలో 12 మంది, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏడుగురు చొప్పన మొత్తం 14 మంది చనిపోయారు.పెద్దగా భయపడాల్సిన పనిలేదుప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్వేరియెంట్లు, లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదు. రోగులు స్వల్ప లక్షణాలతోనే కొద్దిగా అనారోగ్యానికి గురవుతారు. దీని ట్రీట్మెంట్లో భాగంగా యాంటీ బయోటిక్స్ వాడొద్దు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, తీవ్రమైన మధుమేహ రోగులు జాగ్రత్తగా ఉండాలి. చైనా, థాయ్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో బూస్టర్ డోస్లు ఇస్తున్నారు.కానీ ఈ వైరస్కు సంబంధించి ఎలాంటి వ్యాక్సిన్లు తయారు కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ‘మాస్ వ్యాక్సినేషన్’చేయాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ దశ కూడా నెమ్మదిగా ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీయకుండా తొలగిపోతుందనేది నా నిశ్చితాభిప్రాయం. – డా. జీసీ ఖిల్నానీ, చైర్మన్ పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్, పూర్వ హెడ్, పల్మనాలజీ ఎయిమ్స్ ఢిల్లీస్వల్ప లక్షణాలు.. తక్కువ స్థాయి జ్వరం..ప్రస్తుత కేసుల పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లు ఎల్ఎఫ్ 7, ఎన్బీ 1.8.1 తదితరాలు కారణం. ఈ స్ట్రెయిన్లు స్వల్ప లక్షణాలతో తక్కువ స్థాయి జ్వరం, గొంతులో గరగరలతో సాధారణ జలుబు, సీజనల్ ఫ్లూ మాదిరిగా కనిపిస్తాయి. ఈ కారణంగా టెస్టింగ్కు ఆలస్యమై అనుకోకుండా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యం ఉన్న వారు, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్న వారిపై అధిక దుష్పరిణామాలు చూపే అవకాశాలున్నాయి. అందువల్ల ఎక్కువమంది గుమిగూడే చోట్లు, ప్రజారవాణా, మూసి ఉంచిన ప్రదేశాల్లో మాస్క్లు పెట్టుకోవాలి. చేతుల పరిశుభ్రత పాటించాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి -
‘కట్టలు’ తెగిన కష్టం
ఊరు కళతప్పింది.. ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది. అది తెగడంతో చుక్కనీరు లేదు. రెండు పంటలు అయినా, ఇంకా మరమ్మతులు చేయలేదు. పంటలు లేక రైతులు, చేతి పనివారు ఊరు విడిచి వలస వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సందడే లేదు. చెరువు తెగడంతో ఊరు కళ తప్పింది. – కడారి ఐలయ్య, రావిరాల, మహబూబాబాద్ జిల్లాసాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాకాలం వచ్చేసింది. నైరుతి మేఘ ఘర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణలో వర్షాలు దంచికొడితే, వాగులు, వంకల్లోని నీటి నంతా ఒడిసిపట్టేది చెరువులు, కుంటలే. కానీ, చాలా చోట్ల ఈ చిన్ననీటి వనరులు ఇప్పుడు నీటిని నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేల సంఖ్యలో చెరువులు దెబ్బతిన్నాయి. గండ్లు పడటంతోపాటు తూములు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినా పనుల్లో పురోగతి లేదు. మరికొన్ని చెరువులు దీనస్థితిలో ఉన్నాయి. దీంతో ఈ చెరువులకు మరమ్మతులు ఎప్పుడు పూర్తిచేస్తారోనని ఆయకట్టు రైతులు ప్రభుత్వ అధికారులవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీజన్ మొదలైనా.. ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు. కానీ, కట్టలు తెగిన, తూములు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే కట్టలు తెగిన అనేక చెరువుల్లోకి వస్తున్న నీటిని లాక్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ప్రారంభమై.. వర్షాలు కురిసిన సమయంలో లాక్లు ఎత్తితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. లాకులు ఎత్తకపోయినా నీరు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో చెరువుల కింద వేలాది ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లోని చెరువుల పరిస్థితి ఇదీ.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 146 చెరువులకు కట్టలు తెగడంతోపాటు తూములు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.9.55 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. రూ.48.61 కోట్లతో 45 చెరువులకు మరమ్మతులు చేశారు. 42 చోట్ల పనులు జరుగుతున్నాయి. 17 చోట్ల పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడగా.. 25 చెరువులకు గండ్లు పూడ్చారు. అశ్వారావుపేట మండలంలో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడగా రూ.3 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కోతకు గురైన కట్టను మాత్రం వదిలేశారు. ఈ పెద్దవాగు తెలంగాణ, ఏపీ మధ్య ఉండటంతో వివాదం నెలకొంది. రీ డిజైన్ కోసం రూ.19 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను ఇంకా ఆమోదించలేదు. దీంతో రీడిజైన్కు మోక్షం లభించలేదు. ⇒ ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలోని గచ్చుబంధం చెరువు కట్ట గత సెప్టెంబర్ వరదలకు తెగింది. దీంతో మూడు గ్రామాల్లోని 228 ఎకరాల ఆయకట్టుకు కొంత నష్టం వాటిల్లింది. మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 లక్షలు విడుదల చేయగా, ఇరిగేషన్ అధికారులు నేటికీ పనులు చేపట్టలేదు. చెరువులో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో లాకులు ఎత్తి బయటకు పంపుతున్నారు. చెరువు కట్టకు మరమ్మతులు చేయకపోతే ఆయకట్టు పరిధిలోని తమ భూములను బీళ్లుగా వదిలేయాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ⇒ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎంపిక చేసిన 25 చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన పంపారు. ఇప్పటివరకు నయా పైసా నిధులు మంజూరు కాలేదు. మోర్తాడు మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు, కమ్మర్పల్లిలోని పల్లె చెరువు తూముల మరమ్మతు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. అందుకోసం రూ.50 లక్షల వరకు అవసరమని అంచనా. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం ఊర చెరువు మత్తడి వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తాత్కాలిక మరమ్మతులే చేపట్టారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నిండితే ఆయకట్టు ప్రాంతంలోని 10 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ⇒ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం చెరువు 152 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 650 ఎకరాలు నేరుగా, మరో 500 ఎకరాలు బోర్లు, బావుల ద్వారా సాగవుతుంది. గత ఏడాది వచ్చిన వరదలకు చెరువు తెగిపోయింది. ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్లు లేవు. దీంతో రైతులు, కూలీలతోపాటు చేతి వృత్తుల వారు వందకుపైగా కుటుంబాలు వలస వెళ్లాయి. నీళ్లు వస్తే కానీ ఊరికి రాలేమని చెబుతున్నారు. ఈ చెరువు మరమ్మతుల కోసం రూ.1.43 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పుడు రూ.53 లక్షల మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తగ్గనున్న భూగర్భ జలాలు.. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం చెరువులు దెబ్బతినడంతో వాటిలో నీరు నిల్వలేదు. దీంతో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులకు సకాలంలో మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో తమ భూములు సాగుచేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. చెరువుల్లో నీరు లేకపోవటంతో మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే వలస వెళ్లారుమా ఊళ్లో 121 ముదిరాజు, 40 గంగపుత్రుల కుటుంబాలు చెరువునే నమ్ముకొని జీవిస్తున్నాయి. పోయిన వానాకాలం చెరువు తెగడంతో పనులు లేక, ఇక్కడ ఉండి పస్తులు పడలేక హైదరాబాద్ వెళ్లి అడ్డా పనులు చేస్తున్నారు. చెరువు గండ్లు తొందరగా పూడిస్తేనే మా కష్టాలు పోతాయి. – డేగల యాకయ్య, మత్స్యకారుడు, రాజుల కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా -
తప్పుడు ప్రచారం మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై వాస్తవాలు వివరించినా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని ఆపడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై స్పందిస్తూ మంత్రి ఉత్తమ్ చేసిన విమర్శలను హరీశ్రావు ఖండించారు. ‘ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు మాత్రమేనని చెబుతున్న ఉత్తమ్.. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు లిఫ్ట్ చేసిన నీటి వివరాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్హౌస్ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల వివరాలు దాచిపెడుతున్నారని విమర్శించారు.కాళేశ్వరం కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది మేడారం పంప్హౌస్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఎత్తిపోశామన్నారు. మంత్రికి తెలియకుంటే ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా తొలి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదనే విషయంతోపాటు కాల్వలు తవ్వుతున్నకొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు.ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, కల్వకుర్తి దేవాదుల సహా ఏ ప్రాజెక్టులో అయినా మొదట హెడ్ వర్క్స్ పూర్తి చేసి టెయిల్ వర్క్స్ తర్వాత పూర్తి చేస్తుంటారని.. కానీ కాంగ్రెస్ మాత్రం కమీషన్ల కోసం తోక పనులు ముందు మొదలుపెట్టి, హెడ్ వర్క్స్ వదిలి పెట్టిందని హరీశ్రావు విమర్శించారు. తలాతోక లేని మాటలు మానుకొని అబద్ధాల ప్రచారం మానాలని హితవు పలికారు. -
రెండున్నరేళ్లలో 2 ఎయిర్పోర్టులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణలో ఒకేసారి రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉండగా, 2027 చివరికల్లా మూడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండనున్నాయి. వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న నిజాం కాలంనాటి ఎయిర్ర్స్టిప్, ఆదిలాబాద్ పట్టణ శివారు శాంతినగర్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఉన్న హెలిపోర్టుల స్థానంలో ఈ కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కాబోతున్నాయి. ఈ సంవత్సరం చివరికల్లా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చర్యలు ప్రారంభించింది. దాదాపు వేయి ఎకరాల విస్తీర్ణంలో వరంగల్ విమానాశ్రయాన్ని స్వయంగా ఏఏఐ నిర్మించనుండగా, ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నైట్ ల్యాండింగ్.. బోయింగ్ 737కు సరిపడా రన్వే.. ఈ విమానాశ్రయాలను ఆధునిక ఎయిర్పోర్టులుగా నిర్మించనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు నిర్మించేటప్పుడు తొలుత చిన్న విమానాలు దిగేలా రూపొందించి, భవిష్యత్తులో వాటిని విస్తరిస్తారు. కానీ, వీటిని ఒకేసారి పెద్ద విమానాశ్రయాలుగానే నిర్మించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపాదనకు ఏఏఐ సమ్మతించింది. రాత్రివేళ కూడా విమానాలు వచ్చిపోయే వసతులుండాలని సీఎం కోరగా, దానికీ ఓకే చెప్పింది. బోయింగ్ 737, ఎయిర్బస్ 320 లాంటి పెద్ద విమానాలు కూడా వచ్చిపోయేందుకు వీలుగా దాదాపు 3 వేల మీటర్ల పొడవైన రన్వేలను నిర్మించనున్నారు. నైట్ల్యాండింగ్, టేకాఫ్కు వీలుగా ఆధునిక మెకానిజం ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు వేయి ఎకరాల్లో, ఆదిలాబాద్ విమానాశ్రయం 600 ఎకరాల విస్తీర్ణంలో రూపొందుతాయి. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఒకేసారి 500 మంది ప్రయాణించేలా వీటిని నిర్మిస్తున్నారు. ఉడాన్ రీజినల్ కనెక్టివిటీ స్కీంతో వీటిని అనుసంధానిస్తారు. మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ను కేంద్రం అందిస్తుంది. విమానాశ్రయ నిర్వహణ వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం భరిస్తాయి. వరంగల్లో చకచకా భూ సేకరణ నిజాం కాలంలో మామునూరులో ఎయిర్ర్స్టిప్ నిర్మించారు. ఇక్కడ 1,400, 1,000 మీటర్ల వెడల్పుతో రెండు శిథిల రన్వేలున్నాయి. ఇప్పుడు వీటి స్థానంలో 3 వేల మీటర్ల భారీ రన్వే రూపొందనుంది. పాత ఎయిర్ర్స్టిప్నకు సంబంధించి ఏఏఐ అధీనంలో 696.14 ఎకరాల భూమి ఉంది. ప్రతిపాదిత భారీ విమానాశ్రయానికి మరో 280 ఎకరాల భూమి అవసరం. సమీపంలోని ఉన్న రెండు ఊళ్లను ఖాళీ చేయించి ఆ భూమిని సేకరించే కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను ఇందుకోసం విడుదల చేసింది. ప్రస్తుతం అధికారులు ఆ రెండు గ్రామాల ప్రజలను ఒప్పించే పనిలో ఉన్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిహారంగా నిర్వాసితులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి రెండు ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్తులు ఎంచుకున్న దానికి అమలు చేయనున్నారు. వరంగల్–ఖమ్మం, మరో రోడ్డును దారి మళ్లించనున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు ఎన్ఓసీ నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్లో చిన్న ఎయిర్ర్స్టిప్ సేవలందించింది. ప్రస్తుతం అది ఐఏఎఫ్ అదీనంలో ఉంది. అక్కడ రన్వే బదులు హెలిప్యాడ్ మాత్రమే ఉంది. దీన్ని ప్రస్తుతం హెలిపోర్టుగా వినియోగిస్తున్నారు. దీన్ని భవిష్యత్తులో ఎయిర్ఫోర్స్ జెట్ల వినియోగానికి వీలుగా అభివృద్ధి చేయాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తాజా నిర్ణయంలో ఆ కల సాకారం కానుంది. ఇందుకు సమ్మతిస్తూ తాజాగా ఐఏఎఫ్ ఎన్ఓసీ జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ఫోర్స్ అదీనంలో 369 ఎకరాల భూమి ఉంది. మరో 250 ఎకరాలు సేకరించి విమానాశ్రయం నిర్మించనున్నారు. రెండు విమానాశ్రయాలను 24 నెలల్లో సిద్ధం చేయనున్నట్టు తాజాగా ఏఏఐ పేర్కొంది. అయితే, 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. దీంతో రెండేళ్లలోపు అవి సిద్ధమవటం ఖాయంగా కనిపిస్తోంది. -
బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు అవాస్తవిక ప్రచారం చేపడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రచారానికి అంశాలవారీగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరే. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తవగా 2023–24 వరకు మొత్తంగా 162 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చావో చెప్పు?’అని హరీశ్రావును మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో నిలదీశారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్హౌస్ నీటమునిగిందని.. అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్హౌస్ ట్రెస్ట్వాల్ కూలి పంప్హౌస్లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపు కోసమే బీఆర్ఎస్ బ్యారేజీలు.. ‘ఫరక్కా బ్యారేజీ కట్టింది నీటి మళ్లింపు కోసమే. రాతి పునాది వల్లే ఆ బ్యారేజీ మనుగడ సాగిస్తోంది. ఫరక్కా బ్యారేజీని 1975లో కట్టినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రతిపాదించింది.. కట్టింది.. బీఆర్ఎస్ హయాంలోనే. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజీలను నిధుల మళ్లింపు కోసం కట్టారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యం’అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా? ఆ తర్వాత బ్యారేజీ కట్టకుండా ఎందుకు పక్కనపెట్టారు? తుమ్మిడిహెట్టి వద్ద కడితే పేరు కాంగ్రెస్కు, పైసలు రావనేది ప్రధాన కారణం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కి.మీ. ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 100 కి.మీ. దాకా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవి. కానీ మేడిగడ్డ బ్యారేజీ వల్ల 100 కి.మీ. కిందకు వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం చేశారు. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకం’అని ఉత్తమ్ మండిపడ్డారు.వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్రావే కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్రావేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దురి్వనియోగం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని... నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ రూ. 38 వేల కోట్లతో పూర్తై ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు.కానీ బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి శాశ్వత నష్టం జరిగిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్ల తెలంగాణ ప్రజలు నీటిపారుదల ప్రాజెక్టుల అప్పులకు ఏటా రూ. 16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అన్ని మోటార్లు పనిచేసి ఉంటే విద్యుత్ భారమే ఏడాదికి రూ. 10 వేల కోట్లు అయ్యేదన్న మంత్రి ఉత్తమ్.. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం రూ.1000 కోట్లే అయ్యేదన్నారు. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణకు ఆర్థిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందని విమర్శించారు. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి కలిసి అటు ఆలంపూర్లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
ఆసుపత్రులకు డాక్టర్లు, నర్సులు కావలెను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దవాఖానాల్లో వైద్యులు, నర్సుల కొరత వేధిస్తోంది. దీంతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగులకు మెరుగైన చికిత్స అందించడం కష్టంగా మారింది. వైద్యుల కొరత వల్ల పేదలు సాధారణ జ్వరం మొదలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్స కోసం జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. కొన్ని ఆసుపత్రుల్లో కనీసం ఒక రెగ్యులర్ డాక్టర్ కూడా ఉండటం లేదు. తాత్కాలిక సర్దుబాటు ద్వారా కొంత మేర భారం తట్టుకొనే ప్రయత్నం చేస్తున్నా పేదలకు సేవలు పూర్తిగా అందడం లేదు. వేలల్లో ఖాళీలు.. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న 178 ఆసుపత్రుల్లో 12,270 పడకలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రుల్లో 350 పడకల సామర్థ్యం ఉండగా 99 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 30, 50, 80 పడకల సామర్థ్యం ఉంది. 71 ఏరియా ఆసుప్రతుల సామర్థ్యం 100 నుంచి 250 వరకు ఉంది. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్లు 4,357 కాగా ప్రస్తుతం ఉన్నది 1,369 మంది మాత్రమే. అంటే 2,988 మంది డాక్టర్లు ఆయా ఆసుపత్రుల్లో లేరు.అలాగే ఈ ఆసుపత్రుల్లో 4,200 మంది నర్సులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా 2,995 మందే పనిచేస్తున్నారు. అంటే 1,205 మంది నర్సులకు కొరత ఏర్పడింది. ఇక పారామెడికల్ పోస్టులు 1,880కిగాను 532 మాత్రమే భర్తీ అవగా ఇంజనీరింగ్ విభాగంలో 48కిగాను 6 పోస్టులే భర్తీ అయ్యాయి. 743 మినిస్టీరియల్ పోస్టుల్లో 137 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో 12,588 మంజూరు పోస్టులకుగాను 6,586 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేడర్ పోస్టులను కేటాయించకపోవడంతో.. రాష్ట్రంలోని 33 జిల్లాలలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆసుపత్రులే ప్రధానంగా పేదలకు, గ్రామీణ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. టీవీవీపీ పరిధిలో ప్రస్తుతం 178 ఆసుపత్రులు ఉండగా అందులో రోగులకు సేవలు అందిస్తున్నవి 156 మాత్రమే. మిగతా ఆసుపత్రులు నిర్మాణ దశలో కొన్ని, కాగితాలపై మరికొన్ని ఉన్నాయి. మరో ఐదు ఆసుపత్రులను కూడా టీవీవీపీ పరిధిలోకి తెచ్చినప్పటికీ వాటి సేవలు మొదలు కాలేదు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలో గతేడాది వరకు కొనసాగిన దాదాపు 90కిపైగా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్సీ)లను తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోకి మార్చగా ఆ ఆసుపత్రులకు కేడర్ పోస్టులను కేటాయించకపోవడంతో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువైంది. అదే సమయంలో టీవీవీపీ పరిధిలో ఉన్న 31 జిల్లా ఆసుపత్రులను వైద్య బోధనా ఆసుపత్రులుగా మార్చి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకు ప్రభుత్వం తీసుకొచి్చంది. డీఎంఈ పరిధిలోకి 31 ఆసుపత్రులు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లా ఆసుపత్రులలో 31 ఆసుపత్రులను ప్రభుత్వం బోధన ఆసుపత్రులుగా మార్చింది. దీంతో హైదరాబాద్లోని కింగ్కోఠి, వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఆసుపత్రులు మాత్రమే టీవీవీపీ కింద మిగిలాయి. అయితే కొడంగల్లో మంజూరైన మెడికల్ కళాశాల కోసం తాండూరు ఆసుపత్రిని కూడా డీఎంఈ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టీవీవీపీ కింద మిగిలిన జిల్లా ఆసుపత్రి కింగ్కోఠి హాస్పిటల్ ఒక్కటే. ఈ తరలింపుతో టీవీవీపీకి సంబంధించిన ఆసుపత్రుల సంఖ్య తగ్గినా, డీహెచ్ నుంచి టీవీవీపికి అటాచ్ చేసిన సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ, నియామకాలు జరపడం లేదు.టీవీవీపీని సెకండరీ డైరెక్టరేట్గా మారిస్తేనే..వైద్య విధాన పరిషత్కు స్వతంత్ర హక్కులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో అదో ప్రత్యేక కేటగిరీగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో టీవీవీపీని ప్రత్యేకంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్గా గుర్తించి ప్రత్యేక నియామకాల ద్వారా సిబ్బంది కొరత తీర్చాలన్న డిమాండ్ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ద్వారా టీవీవీపీని రద్దు చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితమే నిర్ణయించినా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. -
అబద్ధాలను పటాపంచలు చేస్తాం: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీఆర్ఎస్కు మంచిపేరు రావడంతోపాటు లబ్ధి జరుగుతుందనే దురుద్దేశంతో నాడు ప్రతిపక్షంలో, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బురద జల్లుతోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిజమని నిరూపించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. తెలంగాణ జీవధార. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణకు కల్పతరువు. అలాంటి ప్రాజెక్టును రీఇంజనీరింగ్ను చేయడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు నిజాలు వివరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందుకు వెళ్లి నిజాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను పటాపంచలు చేస్తాం. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ నాయకత్వం బెదరదు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేసి సాగునీటిని అందించాలి. లేనిపక్షంలో ప్రజాఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం’అని హరీశ్రావు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం–వాస్తవాలు అనే అంశంపై హరీశ్రావు సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సహా పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. సీఎం, మంత్రులది దుష్ప్రచారం.. ‘మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాళేశ్వరం కుప్పకూలిందంటూ దుష్ప్రచారం చేస్తున్న వారు ఈ ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాలువలు, పంప్హౌస్ల సమాహారమని గుర్తించాలి. కానీ ఈ అంశాన్ని విస్మరించి ప్రాజెక్టు వ్యయం పెంపు, ఆయకట్టు మొదలుకొని అనేక విషయాలపట్ల సీఎం, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోంది. రాష్ట్ర అవతరణకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు చెప్పినా ఒక్క అనుమతి సాధించలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. పనులు చేపట్టకుండానే అంచనాలను రూ. 17,875 కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచింది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడం, నీటి లభ్యత కేవలం 44 టీఎంసీలు ఉండటం, పర్యావరణ, అటవీ అనుమతులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టు రీడిజైనింగ్పై ఆలోచన చేశాం’అని హరీశ్రావు వివరించారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రయత్నాలు విఫలమైనందునే.. ‘తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు మహారాష్ట్రలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు విఫలమయ్యాయి. తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచన మేరకు మేడిగడ్డను ఎంపిక చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టును విస్తరించడం వల్లే అంచనా వ్యయం పెరిగింది. దేశంలో అతితక్కువ అంచనా వ్యయం పెంపుతో, అతితక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే. పోలవరం ప్రాజెక్టు కుప్పకూలినా ఎన్నడూ సందర్శించని ఎన్డీఎస్ఏ.. ఇప్పుడు ఈడీ, సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలి’అని హరీశ్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందలు, దందాలు, చందాల నినాదంతో రేవంత్ పాలన: కేటీఆర్ ‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలకు పాతరేసిన సీఎం రేవంత్ దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నాడు. బీఆర్ఎస్పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు అనే నినాదంతో పాలన సాగిస్తున్నాడు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా సీఎం, మంత్రులు, బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రాజక్టులు, బ్రిడ్జీలు కూలినా స్పందించని ఎన్డీఎస్ఏ.. కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్లలో కేవలం ఒక్కచోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్ధాంతం చేస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట బీజేపీ ఆఫీసులో ఎన్డీఏ రిపోర్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నివేదిక చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికీ పనికి రాదని ఎల్ అండ్ టీ సంస్థ తేల్చిచెప్పింది. పార్లమెంటు నూతన భవనం, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది కూడా ఎల్ అండ్ టీ సంస్థే. కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తెలంగాణ రైతుల గొంతు నొక్కే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు కూడా వెళ్లి వాస్తవాలు చెప్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ముగ్గురా? నలుగురా?
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు) పేర్లు ఖరారయ్యాయి. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని సమాచారం. అడ్లూరివైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. రోజంతా ఉత్కంఠ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే విస్తరణ ఉంటుందని, కాదుకాదు మధ్యాహ్నం అంటూ విస్తృతంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, విస్తరణపై ఏఐసీసీ కానీ, టీపీసీసీ కానీ శనివారం అర్ధరాత్రి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం ఢిల్లీలోనే ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో జరిగే హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మక«థ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం మినహా మరో కార్యక్రమం గవర్నర్ షెడ్యూల్లో లేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీంతో ఈ కార్యక్రమం అనంతరం రాజ్భవన్లో మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి కానీ, రాజ్భవన్కు కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు విస్తరణ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎన్ని బెర్తులు భర్తీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. శనివారం అర్ధరాత్రి ఈ అంశంపై స్పష్టత వచ్చింది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో నేటి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందుబాటులో ఉండండి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు రేగిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, కాలె యాదయ్య, వేముల వీరేశంలు సీఎం రేవంత్ను కలిసి తమ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్.. కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, ఆదివారం ఐదుగురు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు అధిష్టానానికి తాను ప్రతిపాదనలు మాత్రమే పంపగలనని, తుది నిర్ణయం ఢిల్లీ పెద్దలదేనని ఆ ఎమ్మెల్యేలతో సీఎం చెప్పినట్టు సమాచారం. -
హైదరాబాద్లో పెరిగిన ఆఫీస్ అద్దెలు.. అయినా తక్కువే..
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఆఫీసు స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ నగరాలలో కార్యాలయ స్థలాలు హాట్స్పాట్గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన పెరుగుదల నమోదు చేస్తోందని అనరాక్ సంస్థ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోదాదాపు అన్ని బహుళ జాతి, దేశీయ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. పూర్తి స్థాయిలో కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆఫీసు స్పేస్కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో కార్యాలయాల అద్దె విలువలు వృద్ధి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడల్ పని విధానాలు మరింత సంప్రదాయక, నిర్మాణాత్మక కార్యాలయ కార్యకలాపాలకు దారి తీసింది. కంపెనీలు ప్రధాన నగరాలలో తమ ఉనికిని రెట్టింపు చేశాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ దిగ్గజాలు, బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు గ్రేడ్–ఏ కార్యాలయ స్థలాల లీజులు, కొనుగోళ్లకు మొగ్గు చూపించాయి. మన దేశంలో ఆఫీసు స్పేస్ విభాగంలో జీసీసీలు చోదకశక్తిగా మారాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే జీసీసీలు ఏకంగా 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు.అమెరికాలో అనిశ్చితితో.. యూఎస్ కంపెనీలు మన దేశంలోని గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లీజులపై ఆసక్తి చూపిస్తుంటాయి. ప్రస్తుతం దేశీయ ఆఫీసు స్పేస్ విభాగంలో అమెరికాకు చెందిన సంస్థల వాటా 45 శాతం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో వ్యాపార విధానంలో అనిశ్చితి ఏర్పడటంతో ఇండియా లోని ఆఫీసు స్పేస్కు మరింత డిమాండ్ ఏర్పడింది. ముంబైలోని ఆఫీసు స్పేస్ లీజులలో అమెరికాకు చెందిన బ్యాంక్లు, ఆర్థిక సంస్థల వాటా ఏకంగా 48 శాతంగా ఉంటుంది.అత్యధికంగా ముంబైలో.. నాలుగేళ్లలో అత్యధికంగా ముంబైలో అద్దెలు 28 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్లో 24.1 శాతం వృద్ధి చెందాయి. ఇక ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, బెంగళూరులో 15.8 శాతం, పుణెలో 11.1 శాతం, చెన్నైలో 9.1 శాతం మేర పెరిగాయి. 2022లో ముంబైలో చ.అ. అద్దె నెలకు రూ.131గా ఉండగా.. 2025 నాటికి రూ.168కి చేరింది. హైదరాబాద్లో నాలుగేళ్ల క్రితం రూ.58గా ఉండగా.. ఇప్పుడది రూ.72కు చేరింది.మన దగ్గరే తక్కువ.. హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ అద్దెలు గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్లలో 24.1 శాతం మేర వృద్ధి చెందాయి. నాలుగేళ్లలో ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అయినా కూడా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇప్పటికీ మన దగ్గరే అద్దెలు తక్కువగా ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, చురుకైన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ వంటివి నగరంలో ఆఫీసు స్పేస్ అద్దెల వృద్ధికి ప్రధాన కారణాలు. -
కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ
హైదరాబాద్: శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కోవర్ట్ ఆపరేషన్.. డ్రగ్స్ ముఠా అరెస్టు
సాక్షి,హైదరాబాద్: గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో నాలుగు డ్రగ్ ముఠాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. గోవాలో డ్రగ్స్ తయారీ, హైదరాబాద్ పబ్లలో విక్రయిస్తున్న డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్ అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. గోవాలో సూర్యప్రభ ఫార్మా కంపెనీలో ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న మరో ముఠా గుట్టురట్టు చేశాం. ఇటీవల కాలంలో కల్తీ కళ్ళు తాగి 70 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గోవా ఆపరేషన్ చేపట్టాం.ఈ ఆపరేషన్లో నగరానికి డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం. హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలపై నిగా పెట్టాం. దేశంలో ఎక్కడున్నా సరే డ్రగ్ పెడ్లర్స్ను వెతికి వెంటాడి పట్టుకుంటాం. హైదరాబాద్కు డ్రగ్స్ ఎవరెవరు సప్లై చేస్తున్నారో సమాచారం ఉంది. కొన్ని పబ్బులలో పనిచేస్తున్న డీజే లే కీలక సూత్రధారులుగా ఉన్నారని తెలిపారు. -
ఈటల అసత్యాలే చెప్పారు.. మంత్రి తుమ్మల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్కు ఈటల అసత్యాలు చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఈటల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని.. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిటీ వేశారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్కు, సబ్ కమిటీకి సంబంధం లేదని తుమ్మల స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారు. నేనే సుమోటోగా కమిషనర్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నా. సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతా’’ అని తుమ్మల తెలిపారు.‘‘చాలా రోజులు అయింది కాబట్టి అనాలోచితంగా ఇచ్చారో తెలీదు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటు కోసం వేసిన సబ్ కమిటీ కాదు. మేడిగడ్డ, ప్రాణహిత, కడ్కో పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ లేదు.. రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీకి.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు ఈటల రాజేందర్ చెప్పారు.. అది వాస్తవం కాదు. కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదు. కేబినెట్ ఆమోదానికి కాళేశ్వరం ఏ రోజూ రాలేదు’’ అని తుమ్మల పేర్కొన్నారు.ఈటలకు తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 43 ఏళ్లుగా పద్ధతితో, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఈటల రాజేందర్కు తెలుసు. ఈటల రాజేందర్ స్టేట్మెంట్ చూశాక కొంత బాధేసింది. ఈటల రాజేందర్ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలీదు. సబ్ కమిటీ రిపోర్ట్ను కమిషన్కు ఇస్తాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ వాంగ్మూలం చాలా బాధాకరం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ.. ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. వర్షం పడటంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఖైరతాబాద్, అబిడ్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది.తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించింది. -
రియల్ఎస్టేట్ మోసాలకు ‘రెరా’ రెడ్ లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2023 జూన్లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి? ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.రెరా ప్రధాన బాధ్యతలేంటి? ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు. ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్/ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్పెట్టే విధానం ఉందా? రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్ చేసిగానీ, 9000006301 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్కు వెళ్లిన కేసులెన్ని? 2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్కు వెళ్లారు.ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది. వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్ఆర్ యాక్ట్ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం. రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
అమీర్పేట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మూడు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. బీకే గూడలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీసీఎస్ యాంటీ ట్రాఫికింగ్ వింగ్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు.యూసుఫ్గూడకు చెందిన స్పా సెంటర్ నిర్వాహకురాలు నడిమింటి అనూష, కార్మికనగర్కు చెందిన విటుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్బాబుతో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. అదే విధంగా అమీర్పేట విఠల్ చాంబర్స్లోని 2వ అంతస్తులో గ్లోరీ ఫిజియోథెరపీ హాస్పిటాలిటీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బోరబండకు చెందిన స్పా సెంటర్ యజమాని టి.కళ్యాణి, ఐడీపీఎల్ చింతల్కు చెందిన అశోక్కుమార్, మియాపూర్ నివాసి సాంబశివరెడ్డితో పాటు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.అమీర్పేట గురుద్వారా సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఎన్.ఎస్.బ్యూటీ సెలూన్ ఆండ్ స్పా సెంటర్లో ఎస్ఆర్నగర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్కు చెందిన నిర్వాహకురాలు సుధ, వెస్ట్ గోదావరికి చెందిన విటుడు సాగిరాజు దినేష్ వర్మ, వరంగల్కు చెందిన గౌతమ్, కుత్బుల్లాపూర్ నివాసి రవికుమార్, బంజారాహిల్స్కు చెందిన చవన్ సురేందదర్, గుంటూరుకు చెందిన పిన్ని ప్రవీణ్ కుమార్, వెస్ట్ బెంగాల్కు చెందిన ఒక యువతిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. -
భర్తతో గొడవలు.. డెలివరీ బాయ్ అంటూ ఫోన్.. చివరకు హోటల్ రూమ్లో..
సాక్షి, సనత్నగర్: భర్తతో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్న వివాహితను బలవంతంగా హోటల్కు పిలిపించాడు. మత్తు మందు కలిపిన పండ్ల రసం ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రాంతానికి చెందిన మహిళ (37)కు 2013లో వివాహం కాగా, భర్తతో కలిసి మహారాష్ట్రలో నివాసం ఉండేది. భర్తతో మనస్పర్థల కారణంగా గొడవ పడి ఐదు నెలల క్రితం బేగంపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి ఉంటోంది. కాగా జనవరిలో నిజాముద్దీన్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి డెలివరీ బాయ్నని చెప్పగా, తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదని ఫోన్ పెట్టేసింది. అప్పటి నుంచి నిజాముద్దీన్ తరచూ మహిళకు ఫోన్ చేస్తూ, సందేశాలు పంపుతూ బయటకు రమ్మని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. చివరకు అతని వేధింపుల తట్టుకోలేక బాధితురాలు ఓ రోజు నగరంలోని పబ్లిక్ గార్డెన్స్లో కలిసింది.ఈ క్రమంలో భర్తతో గొడవలు ఉన్నందున అతడికి విడాకులు ఇవ్వాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె ఆధార్కార్డు తీసుకున్నాడు. అనంతరం ఓ న్యాయవాదిని కలిసేందుకని గుడిమల్కాపూర్ సమీపంలోని ఓ హోటల్కు తీసుకుపోయాడు. హోటల్లో బాధితురాలికి మత్తు కలిపిన పండ్ల రసం ఇచ్చాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత న్యాయవాది రాలేదని ఆమెను పంపించేశాడు.కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన మహిళ ఏప్రిల్లో లక్ష రూపాయలు అతనికి ఇచ్చింది. మళ్లీ కొన్ని రోజులకు ఫోన్ చేసి తనను కలవాలని, లేకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపుతానని హెచ్చరించాడు. ఆమె అంగీకరించలేదు. ఓ రోజు స్నేహితురాలితో కలిసి వస్తుండగా బాధితురాలిని కారులో బలవంతంగా తీసుకుపోయాడు. ఓ హోటల్కు తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలు గురువారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నిజాముద్దీన్పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. -
మండే ఎండ.. విపరీతంగా ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ను జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పరిగణిస్తారు. కానీ ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలి నాలుగు రోజులు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. కానీ వాస్తవ సీజన్ ప్రారంభం(జూన్ 1వ తేదీ) నుంచి రుతుపవనాల కదలికలు కాస్త మందగించాయి.దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా రోహిణి కార్తె చివర్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం పొద్దంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వర్షాలు మాత్రం కురవటంలేదు. ఈ నెల తొలి వారంరోజుల్లో 26 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. అందులో సగం కూడా కురవలేదు.రెండోవారం తర్వాతే..: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా లేవు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. జూన్ రెండోవారం తర్వాతే వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతోనే నైరుతి సీజన్ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు.ప్రస్తుతానికి వాతావరణ శాఖ సైతం ఎలాంటి అంచనాలను విడుదల చేయలేదు. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హనుమకొండలో 23ల డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఎప్పుడేం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్కు చేరుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్రావు, 11న కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.‘కవిత ఎపిసోడ్’పైనా పార్టీలో ఉత్కంఠఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో కేసీఆర్కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాగే గత నెల 29న కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొలి మాసమైన 2025, ఏప్రిల్ నెలలో రూ.4,023.11 కోట్ల ద్రవ్యలోటు నమోదైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రూ.1,020 కోట్ల ద్రవ్య మిగులుతో ప్రారంభం కావడం గమనార్హం.ఈ ఏడాది ఏప్రిల్లో పన్ను రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని కాగ్ నివేదిక చెబుతోంది. ఆ నెలలో రూ.10,916.68 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో పన్నుల రూపంలో రూ.11.464.17 కోట్లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది అప్పులతో కలిపి ఏప్రిల్లో రూ.16,473.99 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పు రూ. 5,230.99 కోట్లు. ఖర్చులు అనివార్యంఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.15,262 కోట్లుగా నమోదైంది. ఇందులో గత అప్పులకు వడ్డీల చెల్లింపులు రూ.2,260 కోట్లు, వేతనాలకు రూ.3,968 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.1,569 కోట్లు, సబ్సిడీల కింద రూ.4,187 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.3,275 కోట్లు ఖర్చయ్యాయి. మూలధన వ్యయం కింద రూ.1,204 కోట్లు కలిపి మొత్తం ఖర్చు రూ.16,466.63 కోట్లుగా నమోదైంది. -
బనకచర్లపై కేంద్రం కీలక హామీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గత జనవరి 22న రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెల 28న మరో లేఖ రాశారు. ‘ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఏపీ నుంచి ఇంకా కేంద్రానికి అందలేదు.అందిన తర్వాత సంబంధిత నియమ నిబంధనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతోపాటు ఏపీ పునర్విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆ ప్రతిపాదనలను మా శాఖ పరిధిలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకుంటాం’అని ఈ లేఖలో సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ శుక్రవారం సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్టు గుర్తు చేశారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ద్రోహం సాగునీటి విషయంలో తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, ద్రోహం జరిగిందని స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నాటికి శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం 47,850 క్యూసెక్కులను మాత్రమే తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ కలిగి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో 2023 డిసెంబర్ నాటికి 1,11,400 క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని ఆరోపించారు. ఈ కాలంలో రోజుకు నీటి తరలింపు సామర్థ్యం 4.1 టీఎంసీల నుంచి 9.6 టీఎంసీలకు పెరిగిందన్నారు.రాష్ట్ర విభజనకు ముందు 10 ఏళ్లలో శ్రీశైలం జలాశయం నుంచి 727.15 టీఎంసీలను ఏపీ తరలించుకోగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 12,01 టీంఎసీలను తరలించుకుందని లెక్కలు బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.64 వేల కోట్ల వృథా ఖర్చులను కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై చేసి ఉంటే మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద 25,64,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ఏపీ, తెలంగాణ మధ్య నీటి విభజనపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకునే వరకు ఇదే తాత్కాలిక సర్దుబాటు కొనసాగుతుందని చెప్పి వచ్చారని ఆరోపించారు.గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఈ తాత్కాలిక కోటాకు అంగీకరించడంతో దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్–2లో దాఖలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఏపీలోని ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం 44వేల క్యూసెక్కుల నుంచి 92,592 క్యూసెక్కులకు పెరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ సహకారంతోనే నాటి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించుకోవడానికి రాయలసీమ లిఫ్టును చేపట్టిందన్నారు.ఈ ప్రాజెక్టు టెండర్లను అడ్డుకోవాల్సింది పోయి సజావుగా జరిగేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని, ఇందుకోసం టెండర్లకు ముందు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ రాసిందన్నారు. బీఆర్ఎస్ వారు తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్కు వారసులు కావడంతో వారి పేర్లను ‘గోబెల్స్ రావు’గా మార్చాలని ఎద్దేవా చేశారు. -
నాటి కేబినెట్ ఆమోదంతోనే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ బరాజ్ల ఏర్పాటుపై చేసిన సిఫారసులపై నాటి ఆ శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, తనతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి ఆమోదించిందని గుర్తుచేసుకున్నారు.ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో ఈటల రాజేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. పలు కీలక ప్రశ్నలు సంధించింది. కేవలం 20 నిమిషాలపాటు ఆయన్ను కమిషన్ విచారించింది. ఆయనతోపాటు వచ్చిన కొందరు బీజేపీ నేతలు, అనుచరులను కమిషన్ కోర్టు హాల్లో కూర్చోవడానికి అంగీకరించింది. ప్రాంతం మార్పుపై నిర్ణయం సీఎందే.. ఎవరి ఆలోచన ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం చేపట్టారని కమిషన్ తొలుత ప్రశ్నించగా ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘రూ. 38 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ రాష్ట్రంలో ముంపు నివారణకు బరాజ్ ఎత్తును 150 నుంచి 148 మీటర్లకు తగ్గించాలని కోరింది. వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతోపాటు అక్కడ నీటిలభ్యత సైతం లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు పట్టణ తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ తాగునీటికి 15 టీఎంసీలు, పరిశ్రమలకు 10 టీఎంసీల నీళ్లు అవసరం.తుమ్మిడిహెట్టి వద్ద అంత నీటి లభ్యత లేకపోవడంతోనే అక్కడి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ను మార్చాం. నాటి సీఎం (కేసీఆర్) నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక కమిటీ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం అప్పట్లో రూ. 63 వేల కోట్లు. సాగునీటి కోసం వేర్వేరు ప్రాంతాల రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీర్చడానికి అంచనా వ్యయాన్ని రూ. 83 వేల కోట్లకు పెంచడం జరిగింది. ఆ తర్వాత అంచనా వ్యయం పెరుగుతూ పొయింది. ఇప్పుడు ఎంతో తెలియదు’అని ఈటల పేర్కొన్నారు. బరాజ్ల లొకేషన్లను సూచించింది ఎవరు? ప్రాజెక్టుల రీఇంజనీరింగ్పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై సంతకాలు చేశారా? అని మళ్లీ కమిషన్ ప్రశ్నించగా అవునని ఈటల బదులిచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్లను నిపుణుల కమిటీ సూచించిందా? అని కమిషన్ ప్రశ్నించగా గోదావరిపై వేర్వేరు చోట్ల అధ్యయనం జరిపి చివరకు ఆ మూడు లొకేషన్లను నిపుణుల కమిటీ అంగీకరించిందని ఈటల బదులిచ్చారు. ఆ లోకేషన్ల వద్ద బరాజ్లను నిర్మించాలన్న నిర్ణయం ప్రభుత్వానిది కాదా? అని కమిషన్ మళ్లీ అడగ్గా ఆర్థిక శాఖతో సంబంధం లేకపోవడంతో సమాధానం ఇవ్వలేనని ఈటల పేర్కొన్నారు. డీపీఆర్ తయారీ కోసం వ్యాప్కోస్ సంస్థకు రూ. 5.94 లక్షలు చెల్లించాలని 2015 ఏప్రిల్ 13న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందా? అని కమిషన్ అడగ్గా తనకు గుర్తు లేదన్నారు. ‘కాళేశ్వరం’తో ఆశించిన ఆదాయం రాలేదు... కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు లేకపోవడంతో రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేయాలని నాడు నిర్ణయించామని ఈటల రాజేందర్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. కేఐపీసీఎల్ ఆర్థిక శాఖ పరిధిలోకి రాదని.. నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ దీనికి అధిపతిగా వ్యవహరించారని గుర్తుచేశారు. అన్ని శాఖల రుణాలకు ఇచ్చినట్లే కేఐపీసీఎల్ రుణాలకు సైతం ఆర్థిక శాఖ పూచీకత్తు ఇచ్చిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే రుణాలను తిరిగి చెల్లించాలని విజయ బ్యాంకు రాసిన లేఖను కమిషన్ ప్రస్తావించగా.. ప్రాజెక్టు ద్వారా తాగు, పరిశ్రమల అవసరాలకు నీటి సరఫరాతో వచ్చే ఆదాయంతో రుణాలు తిరిగి చెల్లిస్తామని కాగితాల్లో చూపినా వాస్తవికంగా అంత ఆదాయం వసూలు కాలేదని ఈటల వివరణ ఇచ్చారు. బడ్జెటేతర రుణాలతో బరాజ్లను నిర్మించారా? అని కమిషన్ అడగ్గా ఆ వ్యవహారాలతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని బదులిచ్చారు. నీటిపారుదలశాఖతోపాటు కేఐపీసీఎల్లు ఈ వ్యవహారాలు చూశాయన్నారు. బరాజ్ల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదా? అని కమిషన్ ప్రశ్నించగా దీనితో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు. నీటిపారుదల శాఖలోని అకౌంట్స్ విభాగం ఈ వ్యవహారాలు పర్యవేక్షిందన్నారు. -
పదేళ్లు పగ్గాలివ్వండి
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్ఎస్ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్ఎస్)గా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్లైన్ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్చాట్లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
తార్నాక జంక్షన్ క్లోజ్
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రయోగాత్మకంగా తెరిచిన తార్నాక జంక్షన్ను ఇక మూసివేయనున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులతో పాటు ఇతక కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ చౌరస్తా అటు పోలీసులు, ఇటు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది. బుధవారం ‘జంక్షన్లో ‘జామ్’జాటం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ గురువారం ఆ ప్రాంతానికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో అనేక అంశాలను అధ్యయనం చేశారు. దీంతోపాటు వివిధ మార్గాల్లో అధ్యయనం చేసిన అధికారులు శుక్రవారం నుంచి తార్నాక జంక్షన్ను మూసేయాలని, పాత పద్ధతిలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. -
ఇంకుడు గుంతలు..కళ్లకు గంతలు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో భవన (ఇళ్ల) నిర్మాణంలో భాగంగా ఇంకుడుగుంతలు తవ్వుతున్న వారే కొందరు. వారిలోనూ చాలామంది కేవలం ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు మాత్రం తూతూమంత్రంగా ఇంకుడుగుంతలున్నట్లు చూపుతున్నప్పటికీ, అనంతరం చాలామంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో ఉన్న ఇంకుడు గుంతలు సైతం కాగితాల్లో తప్ప వాటితో ఎటువంటి మేలూ జరగడం లేదు. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్లడం లేదు. దీనికంతటికీ కారణం అధికారుల అశ్రద్ధ, పర్యవేక్షణ లేకపోవడమే. గత ఐదేళ్లలో జీహెచ్ంసీ 69,575 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, అందులో ఇంకుడు గుంతలు నిర్మించింది 23,239 భవనాల్లోనే. అంటే 33.40 శాతమే. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడేందుకు, మరోవైపు వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లి రోడ్లు, కాలనీలు మునిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే అన్ని ఇళ్లకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది. ఓసీల కోసమే.. ● వాల్టా చట్టం మేరకు 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో భవనాలకు ఓసీ జారీ చేసేముందు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, ఇంకుడుగుంత ఉంటేనే ఓసీ ఇవ్వాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో ఓసీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో జీహెచ్ఎంసీ 11,509 భవన నిర్మాణాలకు అనుమతులు జా రీ చేయగా, వాటిలో 4,578 భవన నిర్మాణదారులు మాత్రమే ఇంకుడు గుంతలు నిర్మించారు. ● వారిలో 2,036 మంది ఓసీలు పొందారు. అలా గడచిన ఐదేళ్లలో 1,0001 మంది మాత్రమే ఓసీలు పొందారు. నీటి వనరులు, భూమి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చినప్పటికీ, అమలులో అటు అధికారులు, ఇటు ప్రజలు శ్రద్ధ చూపడం లేదు. 200 చదరపు మీటర్ల కంటే తక్కువ స్థలం, ఏడు మీటర్ల లోపు భవనాలకు ఓసీల అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు అమ్ముకోవాలనుకున్నప్పుడు, లేక బ్యాంకు రుణం అవసరమైప్పుడు చూపించేందుకు మాత్రమే ఓసీలు తీసుకుంటున్నవారూ ఉన్నారు. గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీలో ఇళ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు ఇలా.. ఆర్థిక భవన ఓసీలు ఇంకుడు సంవత్సరం అనుమతులు జారీ గుంతలు 2020–21 12,306 1,216 5,378 2021–22 17,604 1,606 3,284 2022–23 14,665 2,560 4,881 2023–24 13,491 2,683 5,218 2024–25 11,509 2,036 4,578 మొత్తం 69,575 10,001 23,239 ఓసీలు పొందే వరకే పరిమితం.. ఆ తర్వాత పట్టించుకోని వైనం ఐదేళ్లలో తవ్వినవి 33 శాతమే 69 వేలకుగాను 23వేల ఇళ్లలోనే.. వాటికి సైతం కొరవడిన నిర్వహణ బల్దియాలో భూగర్భజలాలు పెరిగేదెలా? -
నాలాల కబ్జాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నాలాల కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టి సారించారు. సోమవారం ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై గురువారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తొలుత హస్మత్పేట్ పికెట్ నాలా, ప్యాట్నీ సెంటర్ వద్ద హస్మత్పేట్, పికెట్ నాలాలు కుంచించుకుపోవడంతో మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయి, విమాన్నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఆధారాలతో చూపించారు. నాలా కబ్జాలకు గురికావడంతో వేలాది ఇళ్లు ప్రతిసారీ మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. నగరంలోని నాలాలపై కిర్లోస్కర్ కమిటీ, ఓయెంట్స్ కమిటీ నివేదికలతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చీకోటి గార్డెన్స్లోనూ.. ప్రకాష్నగర్ మెట్రోతో పాటు చీకోటి గార్డెన్స్ ప్రాంతాలు 3 సెం.మీ వర్షం కురిస్తే నీట మునుగుతున్నాయి. ఇక్కడ అర మీటర్ల వెడల్పు వరద కాల్వ కొన్ని చోట్ల 4.5 మీటర్ల మేర కబ్జా అయ్యిందని స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఎవరికి నచ్చినట్లు వారు నాలాను డైవర్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో సమీప ప్రాంతాలు, అపార్ట్మెంట్లు చిన్నపాటి వర్షానికే నీట మునుగుతున్నాయన్నారు. అధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్
అబిడ్స్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసాద పంపిణీకి అన్ని శాఖల వారీగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఈ నెల 8న ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణి చేయనున్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, రవాణా, మత్స్య తదితర ప్రభుత్వ శాఖలతో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి చేప ప్రసాదం పంపిణీకి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు, షెడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. భారీ బందోబస్తు: ఏసీపీ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అబిడ్స్ డివిజన్ ఏసీపీ పి.ప్రవీణ్కుమార్ వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా చేడతామన్నారు. అబిడ్స్, బేగంబజార్ పోలీస్స్టేషన్ల సిబ్బందితో పాటు సెంట్రల్జోన్ సిబ్బంది, ఇతర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల సహాయం కూడా తీసుకుంటామన్నారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు జీఎం జాన్ షరీఫ్ తెలిపారు. -
భూ బేరం! టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూ బేరానికి సన్నద్ధమవుతోంది. గతంలో వివిధ ప్రాంతాల్లో విక్రయించగా మిగిలిపోయిన స్థలాలను మరోసారి అమ్మకానికి పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాత లే అవుట్లలో ఉన్న స్థలాలను విక్రయించడంతో పాటు కొత్త లే అవుట్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నగరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల కోసం సుమారు రూ.5,000 కోట్లు ఆర్జించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఆన్లైన్ బిడ్డింగ్కు ప్రణాళికలను రూపొందిస్తోంది. గతంలో భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో.. ● సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం వరకు, శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు టెండర్లను సైతం కేటాయించారు.శామీర్పేట్ రూట్లో ఆస్తుల సేకరణ తుది దశకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం రూ.3000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. అలాగే రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సైతం రెండు దశల్లో రూ.2500 కోట్ల వరకు వ్యయం కానుంది. ● హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్ప్లాన్– 2050, సికింద్రాబాద్ స్కైవాక్, హుస్సేన్సాగర్ సుందరీకరణ, పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లను మొదట విక్రయించి ఆ తర్వాత రెండు, మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించనున్నారు. మొదటి దశలో.. కోకాపేట్ నియోపొలిస్, ఇన్ముల్నర్వ, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్లో గతంలో పెద్ద ఎత్తున స్పందన లభించింది. అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్లో రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. కోకాపేట్లో ఎన్నారైలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై వారికి 60 శాతం ప్లాట్లను కేటాయించగా హెచ్ఎండీఏకు 40 శాతం ప్లాట్లు లభించాయి. వాటిలో మరో 385 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడో దశల్లో.. మొదటి దశలో కొనుగోలుదారులు, వివిధ వర్గాల నుంచి లభించే స్పందన మేరకు ఆన్లైన్ బిడ్డింగ్ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో బుద్వేల్, ప్రతాపసింగారం, బహదూర్పల్లి, హకీంపేట్, షేక్పేట్లలోని హుడాహైట్స్, కంది, కుత్బుల్లాపూర్, పెద్దకంజర్ల, ఫసల్వాడి తదితర ప్రాంతాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించనున్నారు. దశలవారీగా విక్రయించేందుకు హెచ్ఎండీఏ లే అవుట్లు.. ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లులేమూరు 83.47 164 - 164 తొర్రూరు 117.375 885 392 493 కుర్మల్గూడ 16.75 145 86 59 బాచుపల్లి 27.36 206 204 2 మేడిపల్లి 53.21 208 91 117 (కొన్ని ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉన్నాయి.) మోకిల 165.37 908 189 719 (కొన్ని స్థలాల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది.) బుద్వేల్ 182.10 17 12 4 ప్రతాప సింగారం 126.12 24 - 24 బహదూర్పల్లి 40.00 221 152 69 హుడా హైట్స్ 12.45 37 - 37 కంది 47.14 341 - 341వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న ప్లాట్లు ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లు కోకాపేట్ 533.01 20 14 5 (ఒకప్లాట్ రంగారెడ్డి కలెక్టరేట్కు తిరిగి ఇచ్చారు) ఇన్ముల్నర్వ 92.69 327 – – ఉప్పల్ భగాయత్ 56.39 64 23 41తుర్కయంజాల్ 9.00 34 22 12 మొత్తం హెచ్ఎండీఏ ప్లాట్లు : 1141, రైతులకు కేటాయించినవి : 696, ఇప్పటి వరకు విక్రయించినవి : 59, అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి : 385 ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ ప్రణాళికలు ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు తదితర ప్రాజెక్టుల కోసం.. మొదటి దశలో కోకాపేట్, ఇన్ముల్నర్వ, ఉప్పల్, తుర్కయంజాల్ ప్లాట్ల బిడ్డింగ్ నాలుగు ప్రాంతాల్లో 385 ప్లాట్లు విక్రయానికి సిద్ధం రెండు, మూడు దశల్లో మరో 10 ప్రాంతాల్లో స్థలాల వేలం -
‘ఔట్ సోర్సింగ్’పై వేటు
9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు సాక్షి, సిటీబ్యూరో: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీలో పాత్ర ఉందని గుర్తించిన జీహెచ్ఎంసీ 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లపై వేటు వేసింది. విధుల నుంచి వారిని తొలగించింది. జీహెచ్ఎంసీలోని 14 సర్కిళ్ల పరిధిలో ఈ అక్రమా లు జరిగినట్లు గుర్తించి వారిని తొలగించారు. బుధవారం జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం జరిగేంత వరకు వారిని తొలగించినట్లు వెల్లడి కాలేదు. నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాధ్యులను గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని, 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు సభకు సమాధానమిచ్చారు. ఔట్సోర్సింగ్వారిపై తప్ప అధికారులపై చర్యలు తీసుకోరా? అనే సభ్యుల ప్రశ్నకు బదులిస్తూ పోలీసు కేసులు నమోదయ్యాయని, విచారణ జరుగుతోందని, దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, గోషామహల్, ఖైరతాబాద్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలోని కంప్యూటర్ ఆపరేటర్లను, మలక్పేట, సంతోష్నగర్, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, గోషామహల్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోని హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. అధికారుల పాత్ర లేకుండా సాధ్యమా ? ఈ నేపథ్యంలో అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ఔట్సోర్సింగ్పై పనిచేసే వారే బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేశారా? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. నకిలీ సర్టిఫికెట్లకు వారిని బాధ్యులుగా పేర్కొంటూ, కేవలం వారిపైనే వేటు వేయడంతో జీహెచ్ఎంసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఈ ‘దందా’ జరుగుతున్నా, దాదాపు రెండున్నరేళ్లక్రితమే అవకతవకలు దృష్టికి రావడంతో అప్పట్లో జారీ అయిన సర్టిఫికెట్లను రద్దు చేశామని చెబుతున్నప్పటికీ, ఇంతవరకు ఇంకా ఎందుకు నకిలీ సర్టిఫికెట్ల జారీని కట్టడి చేయలేకపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో వీరి పాత్ర ఉందని.. -
తెలుగు టీచర్లు కావలెను!
సీబీఎస్ఈ నిబంధనతో వెతుకులాటలో పాఠశాలలుసాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయం పలు పాఠశాలలను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ నిబంధన కూడా 2025–26 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానుంది. ఇందుకోసం పాఠశాలలు పెద్ద ఎత్తున తెలుగు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తోంది. నగరంలోని పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్న ప్రకారం.. 40 శాతానికి పైగా ఉపాధ్యాయులు తెలుగు తెలిసినవారు కాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.కొరతే.. సమస్య..జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం, కొత్త నిబంధనలో భాగంగా విద్యార్థులకు రెండో తరగతి వరకు తమ మాతృభాషలో లేదా రాష్ట్ర భాషలో బోధన అందించాలి. ‘ఇది అమలు చేయడంలో ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరతే. తెలుగు బోధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి వస్తుంది లేదా సబ్జెక్ట్ అనువదించేందుకు కొత్త ఉపాధ్యాయులను నియమించాలి’ అని కొంపల్లిలోని ఓ పాఠశాల డైరెక్టర్ అన్నారు. ‘టాప్ స్కూళ్లలో కనాకష్టంగా 10% ఉపాధ్యాయులే తెలుగులో బోధించగలరు’ అని చెప్పారాయన.గట్టి సవాలే..తెలుగు బోధన మీడియంగా ఉండటం గట్టి సవాలేనని హైదరాబాద్ సాహోదయ స్కూల్స్ కాంప్లెక్స్లో సభ్యులుగా ఉన్న పలు సీబీఎస్ఈ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కూడా అంటున్నారు. రామంతాపూర్లోని ఓ పేరొందిన స్కూల్కి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ‘తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల్లోనూ తరచూ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్పై వస్తూ ఉంటారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ మీడియంలో చదివినవారు కాబట్టి వారికి తెలుగుపై పట్టు ఉండడం లేదు’ అని అన్నారు. అదే పరిస్థితి విద్యార్ధులకు కూడా ఎదురవుతుందని, వారు కూడా రాష్ట్రాలతో పాటు స్కూళ్లు మారుతూ ఉంటారని.. దీంతో ఈ నిబంధన అమలు కష్టసాధ్యమని ఆయన గుర్తు చేశారు.మేలు కూడా..సమస్యలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ నిబంధన మేలు చేస్తుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న పలు పాఠశాలల యాజమాన్యాలకు ఇది మంచి మార్పుగా అనిపిస్తోంది ‘మన దగ్గర చాలా మంది టీచర్లకు తెలుగు తెలుసు తెలుగు మీడియం వల్ల విద్యార్థులకు మెరుగైన పునాది పడుతుంది. తద్వారా ఉన్నత తరగతులలో సులభంగా విషయాలు అర్థం చేసుకుంటారు’ అని రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం కార్యదర్శి శేఖర్ రావు అంటున్నారు.ఈ విధానం మంచిదే.. కానీ..మాతృభాషలో నేర్చుకుంటే కాన్సెప్ట్స్ బాగా అర్థమవడానికి నేర్చుకున్నది ప్రాసెస్ చేసుకోవడానికి మేధాశక్తి పెరిగేందుకు వీలుంటుంది. అది చిన్న వయసులో జరగడం చాలా ఉపయుక్తం. దీనివల్ల మనం సంస్కృతీ సంప్రదాయాలను బాగా ప్రమోట్ చేయగలుగుతాం. మాతృభాషలో నేర్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు ఉపాధ్యాయులతో బాగా ఇంటరాక్ట్ కాగలుగుతారు. ఈ లాభాలున్నప్పటికీ.. ప్రస్తుతం దీనిని అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్లకు శిక్షణ, అలాగే రీసోర్సెస్ సమకూర్చుకోవాలి. మరోవైపు ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ను చూసుకుంటే ఆంగ్ల భాషా నైపుణ్యం చాలా అవసరం. ఈ నిర్ణయం అమలుతో ఆంగ్లభాష నేర్చుకోవడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి కొన్ని కీలక సవాళ్లను మనం సరిగా పరిష్కరించుకోగలిగితే.. ఈ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చు.– తనూజ, ప్రిన్సిపాల్, పల్లవి మోడల్ స్కూల్ -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా కేబినెట్ను నెలకు రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు జరపనున్నారు.మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి. -
ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీశ్రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి డాక్టర్లు బులెటిన్ విడుదల చేస్తారని హరీశ్రావు చెప్పారు. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెల్లడించారు.కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు కుంటుంబ సభ్యులు తెలిపారన్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి కి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, ముఠాగోపాల్, గూడెం మహిపాల్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి తదితరులు వెళ్లారు. -
కాళేశ్వరం కమిషన్: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆర్కే భవన్లో జరిగిన ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటలకు వేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ ఈ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్లపైనే కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటలకేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటలకేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటలమహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటలమూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటలరీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటలహరీష్ రావు చైర్మన్గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటలఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటలరీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటలబ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటలబ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల ఇలా మొత్తం 19 ప్రశ్నలు వేసింది. ‘‘నేనేం చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. వాళ్లకే అన్నీ తెలుసు’’ అని నాటి ఇరిగేషన్ శాఖను ప్రస్తావిస్తూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలను ఈటల కమిషన్కు చూపించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన అధికారులను మాత్రమే ఇప్పటిదాకా విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్(kaleshwaram Commission). ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. ఈ మేరకు.. ఈటలను తొలుత విచారించింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకూ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన జరగాల్సిన కేసీఆర్ విచారణ ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది శామీర్పేట్: తూంకుంట మున్సిపల్ సిబ్బంది లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలివీ... తూంకుంట మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన శామీర్పేట వార్డులో విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శామీర్పేట వార్డు పరిధిలో ఓ వ్యక్తి రెండు ఇళ్లను కొనుగోలు చేసి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదిన్నరగా మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. శామీర్పేట వార్డు ఆఫీసులో పని చేసే బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు లంచం డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక స్థలం.. డబుల్ రిజిస్ట్రేషన్.. ప్లాట్ విక్రయించి వ్యక్తి అరెస్టు దుండిగల్: ఒకే స్థలాన్ని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... మల్లంపేట ప్రాంతానికి చెందిన జె.అశోక్ కుమార్ అలియాస్ సారా అశోక్ స్థానికంగా ఉన్న 195, 196వ సర్వే నెంబర్లలోని 9.39 గుంటల్లో గతంలో వెంచర్ వేశాడు. మౌలాలికి చెందిన అన్వర్ ఖాతూన్ అనే మహిళ బాచుపల్లికి చెందిన మోహన్రెడ్డి సహకారంతో 1986 సంవత్సరంలో సదరు వెంచర్లో ప్లాట్ను కొనుగోలు చేసింది. కొన్నాళ్ల వరకు ఖాతూన్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రాలేదు. ఇది గమనించిన అశోక్ సదరు ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా 2004 సంవత్సరంలో అశోక్ సదరు స్థలాన్ని మోహన్రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. 2023లో ఖాతూన్ ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రావడంతో మోసం వెలుగుచూసింది. మోహన్రెడ్డి పేరుపై ప్లాట్ను మార్చినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన అశోక్కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గురువారం అశోక్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అశోక్కుమార్తో పాటు ఇతరుల పాత్ర ఏమైనా ఉందా.. ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఇంకేమైనా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టికెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్ర సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు. ఇతగాడిని తెలంగాణ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేయగా... చైన్నె అధికారులు పీటీ వారెంట్పై అక్కడకు తరలించారు. ● ఉత్తరాఖండ్కు చెందిన విజయ్కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. బతుకుతెరువు కోసం ఒడిస్సాలో స్థిరపడిన ఇతగాడు కుటుంబాన్ని వదిలేసి హఠాత్తుగా బాబా అవతారం ఎత్తాడు. తన పేరును ఓంగా మార్చుకుని దేశ సంచారం మొదలుపెట్టాడు. భిక్షాటన చేసుకుంటూ జీవించడం, కనిపించిన రైలు ఎక్కడం, నచ్చిన చోట దిగడం, ప్లాట్ఫామ్స్పై దొరికినవి తినడం ఇవే దినచర్యలుగా కొన్నేళ్లు బతికేశాడు. ● రైళ్లు, రైల్వే ప్లాట్ఫామ్స్పై ఇలాంటి బాబాలు, భిక్షాటన చేసే వాళ్లు, హిజ్రాల బెడద పెరిగిపోతున్నాయంటూ ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్లను ఉపేక్షించవద్దని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ● అప్పటి నుంచి టీసీలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు ఇలాంటి వాళ్లు ఎక్కడ కనిపించినా టికెట్ తనిఖీ చేయడం, లేకపోతే దింపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలులో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓం బాబాను టిక్కెట్ లేని కారణంగా టీసీ మార్గమధ్యంలో దింపేశారు. ఈ విషయంలోనే ఓం బాబా హర్ట్ అయ్యాడు. దీంతో ఏకంగా రైల్వేల పైనే కక్ష పెంచుకున్నాడు. ● నగరంలోని కాచిగూడ–బుద్వేల్ మధ్య రైలు పట్టాలపై పెద్ద కర్రలు, రాళ్లు పెట్టాడు. వీటిని గుర్తించిన గ్యాంగ్మెన్లు తొలగించి, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు మఫ్టీలో రంగంలోకి దిగడంతో పాటు గ్యాంగ్మెన్లను అప్రమత్తం చేశారు. ● కాటేదాన్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓంను గుర్తించిన ఆర్పీఎఫ్ అతడిని అదుపులోకి తీసుకుంది. ● విచారణ నేపథ్యంలో ఈ నేరాలు తానే చేసినట్లు అతడు అంగీకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ● నగరంలో ఈ పని చేసి, అరెస్టు కావడానికి మధ్యలో చైన్నె వెళ్లిన ఓం అక్కడా ఇలాంటి పనే చేశాడు. విల్లివాక్కం, అంబత్తూరు, ఆవడి, అరక్కోణంలలో రైలు పట్టాలపై వస్తువులు పెట్టడంతో ఐదు కేసులు నమోదయ్యాయి. ● ఈ ఏడాది ఏప్రిల్ 26 ఉదయం 9.30 గంటలకు అవడి రైల్వే యార్డ్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ విఫలమైంది. రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్ను పరిశీలించగా ఐరన్న్ పెండ్రాల్ క్లిప్లు తొలగించినట్లు గుర్తించారు. క్లిప్లు, రెండు అంగుళాల ఇనుప ముక్కలను ట్రాక్పై ఉంచినట్లు తేల్చారు. ● మరుసటి రోజు రాత్రి 7 గంటలకు అరక్కోణం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆరు పాయింట్ల వద్ద బ్యాలస్ట్, ఇనుప ముక్కలు కనిపించాయి. అదే రోజు రాత్రి 11.47 గంటలకు అంబత్తూరు రైల్వే స్టేషన్లో ఐదు చోట్ల బ్యాలస్ట్లు ఉంచినట్లు ఆర్పీఎఫ్కి సందేశం వచ్చింది. ● రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై బ్యాలస్ట్ను తొలగించి, ట్రాక్పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక్కడి అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో చైన్నె ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ● దీంతో ఓంపై అక్కడి కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకొచ్చిన అధికారులు చైన్నె తరలించారు. ● తమిళనాడులో ఇతడు చేసిన పనితో ఎన్ఐఏ కూడా ఉలిక్కిపడింది. దీని వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానించి రంగంలోకి దిగింది. చివరకు ఇది ఓ దొంగ బాబా పనిగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన ఓ నకిలీ బాబా వ్యవహారం హైదరాబాద్తో పాటు తమిళనాడులోనూ కేసులు అరెస్టు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు వారెంట్పై తీసుకువెళ్లిన చైన్నె ఆర్పీఎఫ్ బృందాలు -
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలన, విజయాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, యోగా దివస్ అజెండాలతో బీజేపీ గోల్కొండ జిల్లా నేతలతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... మోదీ దేశ పౌరుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చితే దేశంలో ఐఐటీలు, ఐఐఎం, ఎయిమ్స్ సంఖ్య రెట్టింపయ్యాయని, మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. 52 కోట్ల మందికి ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. మేకిన్ ఇండియా సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమామహేంద్ర మాట్లాడుతూ... నాయకులు, కార్యర్తలు కేంద్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. 21న యోగా దివస్ నిర్వహించుకుందామని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేఖ, ప్రేమ్ సింగ్ రాథోడ్, అట్లూరి రామకృష్ణ, ఉమా రాణి, కోలా దీపక్, తదితరులు పాల్గొన్నారు. -
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు. గురువారం మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్ను మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రక్తదానం చేసేందుకు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు సన్నీ డేవిస్ తదతరులు పాల్గొన్నారు. పోస్టర్ను ఆవిష్కరిస్తున్న దృశ్యం -
సూట్కేస్లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్కేస్లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్కు చెందిన తార బెహార(33), విజయ్తోఫా(30)లు నేపాల్లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్కు ఇదివరకే వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. ● ఇదిలా ఉండగా తార బెహార, విజయ్తోఫాల మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు ఏప్రిల్ 4న జూబ్లీహిల్స్లోని విజయ్ తోఫా తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అక్కడి నుంచి 45 రోజుల క్రితం బౌరంపేట్లోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. విజయ్ తోఫా స్థానికంగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తార బెహార్ గర్భం దాల్చింది. గర్భం విషయంలో వారి మధ్య గొడవ జరుగుతోంది. గర్భం తీసేసుకుంటానని తార బెహార్... వద్దంటూ విజయ్ తోఫా వాదిస్తుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ మే 22న తీవ్ర స్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయ్ తోఫా... తార బేహార్ను ఇంట్లోనే ఉరి వేసి చంపేశాడు. శవాన్ని ఓ పెద్ద సూట్కేసులో కుక్కి అర్ధరాత్రి ఇందిరమ్మ కాలనీకి అనుకుని ఉన్న నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశాడు. 26వ తేదీన ఇంటిని ఖాళీ చేసి జూబ్లీహిల్స్లోని తన కుటుంబం వద్దకు వెళ్లాడు. ● కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్యాగ్ స్కాడ్ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. డాగ్లు ఇందిరమ్మ కాలనీ వైపు వెళ్లడంతో దర్యాప్తును ఆ దిశగా చేపట్టారు. గండిమైసమ్మ నుంచి బాచుపల్లి, మియాపూర్ నుంచి బాచుపల్లి వైపు ప్రధాన రోడ్డుపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ● శవం పూర్తిగా కుళ్లిపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం గాజులు, కలర్ఫుల్ డ్రెస్ల ఆధారంగా పోలీసులు మృతురాలు ఇతర రాష్ట్రానికి చెందినదిగా భావించారు. ఈ క్రమంలో ఆమె నేపాల్వాసిగా నిర్ధారణ అయ్యింది. గోల్డెన్ కలర్ హ్యాండిలే ఆధారంగా... మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకురావడంతో పోలీసులు సూట్కేస్ దిశగా సైతం విచారణ చేపట్టారు. అక్కడ లభించిన సూట్కేసు ఖరీదైనది.. అందులో కొత్తగా ఉంది. హ్యాండిల్ కొత్తగా ఉండటంతో పోలీసులు ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట్ కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని లెదర్ బ్యాగ్లు, సూట్కేసుల షాపుల్లో విచారణ ప్రారంభించాడు. పదిహేను రోజుల క్రితం పెద్ద సూట్ కేసులు ఎవరెవరు కొన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరకు బాచపల్లి చౌరస్తాలోని ఓ లెదర్ షాపులో ఈ నెల 23న విజయ్ తోఫా పెద్ద సూట్ కేసు కొన్నట్లు సీసీ ఫుటేజీ లభించింది. ర్యాపిడోతో ‘బుక్’అయ్యాడు... సూట్కేస్ను కొన్న విజయ్ తోఫా ర్యాపిడో బైక్ బుక్ చేశాడు. ఆ ర్యాపిడో బైక్ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతడు ఇందిరమ్మ కాలనీకి చేరుకున్నట్లు తెలిసింది. ర్యాపిడో నుంచి సమాచారం తీసుకుని నేరస్తుడి నెంబర్ను ట్రేస్ చేశారు. అప్పటికే అతని సెల్ ఫోన్ స్విచ్ఛాప్లో ఉంది. ఈ క్రమంలో సాంకేతిక అంశాలతో గంటల వ్యవ్యధిలో కనుకుని జూబ్లీహిల్స్లో విజయ్ తోఫా కుటుంబం ఉందని నిర్ధారించుకున్నారు. నిఘా పెట్టి విజయ్ తోఫాను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గర్భం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చివరకు హత్య అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకుని 2 కిలో మీటర్లు నడిచి పొదల్లో పడేసిన వైనం పోలీసుల అదుపులో నిందితుడు -
సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. -
ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా?
సాక్షి, హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. లక్షలాది మంది తమ ప్లాట్లు అనధికార లేఅవుట్లలో ఉన్నాయని తెలిసినా, క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కింద గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది. దాదాపు మూడు నెలలుగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. క్రమబద్ధీకరణకు యోగ్యమైనవిగా అధికారులు నిర్ణయించిన వాటిలో ఇప్పటివరకు కనీసం 25 శాతం ప్లాట్ల దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. 2020లో మొత్తం 25,67 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 20,11 లక్షల దరఖాస్తులు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నవిగా తేల్చిన అధికారులు.. ఆ మేరకు సంబంధిత ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చారు. మీరు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లిస్తే.. ఈ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. తద్వారా కనీసం రూ.పదివేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావించింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఫీజు చెల్లింపు గడువును మూడుసార్లు పొడిగించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2020 కటాఫ్ ఏడాది తర్వాత ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో 46,255 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమబద్ధీకరణకు యోగ్యమైన 20.11 లక్షల దరఖాస్తుల్లో ఫీజులు చెల్లించిన వారు కేవలం 5,77 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నవారు ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. డబ్బు చెల్లించిన తర్వాత.. జరిమానా రూపంలో డబ్బు చెల్లించిన 5.77 లక్షలలో ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ చేసినవి 1,77,435 వరకు ఉన్నాయి. ఫీజుల చెల్లించి, మిగిలిన పత్రాలు సరిగా జతచేయని వారిని నుంచి అవసరమైన పత్రాల కోసం అధికారులు వారికి మళ్లీ సమాచారం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనధికార లేఅవుట్లు, ప్లాట్లు అధికంగా ఉన్న జిల్లాలు, అక్కడ నుంచి వచ్చిన దరఖాస్తులు, చెల్లించిన ఫీజులు చూస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అత్యధికంగా అనధికార లేఅవుట్లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తాల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో, రెండోస్థానం మేడ్చల్, మూడోస్థానంలో హెచ్ఎండీఏ నాలుగో స్థానంలో జీహెచ్ఎంసీ, ఐదోస్థానంలో వరంగల్ అర్బన్, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. పురపాలక శాఖలోని అధికారుల పాత్ర లేకుండా వేల లేఅవుట్లు, ప్లాట్లు రావడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యల్పంగా ఆదాయం సమకూరిన జిల్లా ములుగు అయితే..అత్యధిక ఆదాయం వచ్చిన జిల్లా రంగారెడ్డి. మరోసారి పొడిగింపు.. ప్రజలకు తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫైల్ పంపినట్టు చెబుతున్నారు. గతవారంలో పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎంఓలో పురపాలక వ్యవహారాల చూసే మాణిక్రాజ్లు లేని కారణంగా పొడిగింపు ఉత్తర్వులు రాలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిసింది. -
హైదరాబాద్లో రఫేల్ ఫ్యూజిలేజ్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్కు చెందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్లు హైదరాబాద్లో తయారు కానున్నాయి. ఇందుకోసం రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫ్యూజిలేజ్ను తయారు చేసేందుకు టాటా సంస్థ హైదరాబాద్లో ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఫ్రాన్స్ వెలుపల తొలిసారి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్లు హైదరాబాద్ లోనే తయారు కానుండటం విశేషం. రెక్కలు, తోక మినహా విమానంలోని ఇతర భాగాన్ని ఫ్యూజిలేజ్ అంటారు. ఇందులో ప్రయాణికులు, సరుకులు, ఇతర పరికరాల రవాణా కోసం ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఒప్పందంతో భారత వైమానిక తయారీ రంగం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్ యూనిట్లో ఫ్యూజిలేజ్లోని ముందు, వెనుక, పక్క భాగాలు తయారవుతాయి. 2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్ ఉత్పత్తిఒప్పందం మేరకు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రఫేల్ యుద్ధ విమానం తొలి ఫ్యూజిలేజ్ హైదరాబాద్ యూనిట్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ప్రతి నెలా రెండు ఫ్యూజిలేజ్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘రఫేల్ ఫ్యూజిలేజ్లు తొలిసారి ఫ్రాన్స్ బయట ఉత్పత్తి కానున్నాయి. భారత్లో మా సప్లై చైన్ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందాన్ని కీలకమైనదిగా భావిస్తున్నాం’అని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. ‘డసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ రంగం ప్రయాణంలో ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం ఆధునిక, దృఢమైన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థ స్థాపనలో గొప్ప పురోగతికి ప్రతిబింబంగా నిలుస్తుంది’అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ అన్నారు. -
దొరికిన ఉద్యోగం చేసుకోవడమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతలో విద్యపట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ నాణ్యమైన ఉద్యోగాలు సమస్యగా మారాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోని పేరొందిన కళాశాలల్లో చదివినప్పటికీ కొందరికే నాణ్యమైన, పైస్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్యాంపస్ కొలువుల పేరుతో చిన్న, పెద్ద కంపెనీలు ఇచ్చే అరకొర వేతనాలకే రాష్ట్రంలో యువతరం ఉద్యోగాలు చేస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. యువత జీవితాలు, ఉపాధి, కుటుంబ జీవనంపై యంగ్ లైవ్స్ సర్వే రౌండ్–7 (2023–24) నివేదిక ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.తెలంగాణలో 2023 ఆగస్టు నుంచి 2024 జనవరి మధ్య 22 ఏళ్ల వయసు్కలు, 29 ఏళ్ల వయస్కుల విద్య, ఉపాధి, కుటుంబ జీవనంలోని మార్పులను నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో బాల్య వివాహాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ ఉపాధి నాణ్యత, లింగ అసమానతలు, చెల్లింపుల్లేని గృహపనుల భారం మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించి సమాన ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, సామాజిక భద్రత కల్పన ద్వారా లింగ సమానత్వం, మంచి ఉద్యోగాల లక్ష్యాలను సాధించడంపై యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది. విద్య నుంచి ఉపాధి వైపు.. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల వయసు్కల్లో విద్య నుంచి ఉపాధి వైపు పరివర్తన ఆలస్యంగా జరుగుతున్నట్లు తేలింది. 2023లో 53% మంది 22 ఏళ్ల వారు పూర్తి సమయం పనిచేస్తుండగా 2016లో అదే వయసు వారు 62% మంది పనిచేశారు. అదేవిధంగా 20% మంది 22 ఏళ్ల వారు విద్య, ఉపాధి కలిపి చేస్తుండగా 29 ఏళ్ల వారిలో ఇది 12% మాత్రమే. ఈ ఆలస్యం విద్యపై పెరిగిన శ్రద్ధను సూచిస్తోంది. అయితే ఉపాధి అవకాశాల్లో సవాళ్లు పెరిగినట్లు సర్వేలో తేలింది. నాణ్యత లేని ఉద్యోగాలు, లింగ వివక్ష 29 ఏళ్ల వయసు వారిలో 78% మంది నాణ్యతలేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అంటే రాతపూర్వక ఒప్పందం లేని, ఎక్కువ గంటలు పని చేయాల్సిన ఉద్యోగాలు అన్నమాట. అలాగే ఉద్యోగాల్లో పురుషులు (96%) మహిళలు (60%) మధ్య లింగ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 22 ఏళ్ల వయసు వారిలో 10% మంది మాత్రమే రాతపూర్వక ఒప్పందాలు ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ 40% మంది 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు తేలింది. 22 ఏళ్ల పురుషులు సగటున 2.7 గంటలు ఎక్కువ పనిచేస్తుండగా మహిళలు 4.3 గంటలు ఎక్కువగా చెల్లింపులేని గృహ పనులకు సమయం కేటాయిస్తున్నారు.అలాగే 22 ఏళ్ల వయసు్కలకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి ఎక్కువగా లభిస్తున్నట్లు తేలింది. 2016 నాటికి 22 ఏళ్ల వయసులో ఉన్న వారు గ్రామీణ ప్రాంతాల్లోని 98 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఉపాధి రంగాలవైపే దృష్టిసారించినట్లు సర్వే పేర్కొంది. అదే 2023లో 22 ఏళ్ల వయసువారు వ్యవసాయం, అనుబంధ రంగాలలో 64 శాతం మందే ఉన్నట్లు తేలింది. బాల్య వివాహాలు తగ్గుదల: 2023లో 22 ఏళ్ల మహిళల్లో 16% మంది 18 ఏళ్ల లోపు వివాహం చేసుకోగా 2016లో ఇది 32 శాతంగా ఉండేది. 19 ఏళ్లలోపు తల్లులైన వారు 2023లో 22 ఉండగా 2016లో అది 29 శాతంఉంది. అయితే తల్లి విద్యాస్థాయి తక్కువగా ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారిలో బాల్య వివాహాలు, మాతృత్వం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
లక్ష్యానికి మించి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. పంట దిగుబడి పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్యానికి మించి పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొన్నది. పెరిగిన వరి పంట విస్తీర్ణం నేపథ్యంలో యాసంగిలో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా గురువారం నాటికి ఏకంగా 71.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.మరో 3–4 కొనుగోలు కేంద్రాల్లో లక్షకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా కావడానికి సిద్ధంగా ఉంది. ఈ లెక్కన కొనుగోళ్ల ప్రక్రియ ముగిసేలోగా మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ తెలిపింది. గతేడాది యాసంగి సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని అధికంగా సేకరించే అవకాశం ఉంది. సన్నధాన్యం 22.20 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన 71.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో సన్నరకం ధాన్యం 22.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 చొప్పున ప్రోత్సాహక బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గత వానాకాలం సీజన్ నుంచే సన్నాల సాగు పెరిగింది. ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో భారీ ఎత్తున సన్నాల సాగు జరిగింది.అయితే నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి, సూర్యాపేట, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో పండించిన సన్నాలను ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చే బోనస్ ధరను కూడా ఇచ్చి పెద్ద ఎత్తున కొనడంతో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు రాలేదు. కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం సేకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఈ సీజన్ పూర్తయ్యేలోగా 23 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. 12.08 లక్షల రైతుల నుంచి.. రాష్ట్రంలో కొనుగోలు చేసిన 71.39 లక్షల ధాన్యాన్ని 12.09 రైతుల నుంచి సేకరించారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 49.20 మెట్రిక్ టన్నులను 8.42 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. 22.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని 3.66 లక్షల మంది రైతుల నుంచి కొన్నారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 16,547 కోట్లుకాగా, ఇప్పటివరకు రూ. 14,740 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 1,807 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. నిజామాబాద్ ఫస్ట్.. ఆదిలాబాద్ లాస్ట్ యాసంగి ధాన్యం సేకరణలో ఎప్పటిలాగే నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి రూ. 1,870 కోట్ల విలువైన 8.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. 5.96 లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలవగా 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో జగిత్యాల మూడో స్థానంలో ఉంది. అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 144 మంది రైతుల నుంచి 645 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. సాగునీరు లేకపోవడంతోపాటు కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటల సాగు ఆదిలాబాద్లో ఎక్కువ వల్ల వరి పండించే రైతులు తక్కువ. -
నేడు హైదరాబాద్కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత నెల 27న విదేశీ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు. ‘ఫార్ములా–ఈ’రేస్కు సంబంధించి మే 28న విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా, తాను విదేశీ పర్యటన అనంతరం హాజరవుతానంటూ ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ నెల మూడో వారంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో కేటీఆర్ తన అమెరికా పర్యటనను కుదించుకున్నారు. ఆయన భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం బయల్దేరతారు. గోపీనాథ్ కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. -
డిపోర్టేషన్కు ‘నై’జీరియన్లు!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాలైన వీసాలపై వచ్చి ..సైబర్ నేరాలు, డ్రగ్స్ దందాతో దడ పుట్టిస్తున్న నల్లజాతీయులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో వీరిని జైలుకు పంపడం కంటే..డిపోర్టేషన్ ద్వారా తిప్పిపంపడమే ఉత్తమని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిని కూడా తప్పించుకోవడానికి ఆ కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారిలో నైజీరియన్లే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వివిధ రకాలైన వీసాలపై వచ్చి తిష్ట నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు, మొరాకో వంటి దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో కొందరు వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. అనేక మంది డ్రగ్స్ దందాలు, సైబర్ నేరాలు చేస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ తదితరాల కింద కేసు నమోదు చేసేవారు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో బెయిల్పై బయటకు వచ్చే ఆ విదేశీయులు జైల్లో ఏర్పడిన పరిచయాలతో మరింత రెచ్చిపోవడం ప్రారంభించారు. పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతూ... ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో నల్లజాతీయులను డిపోర్టేషన్ చేయడం మొదలెట్టారు. అయితే ఈ డిపోర్టేషన్ను తప్పించుకోవడానికి నల్లజాతీయులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ వివరాలు చెప్పకపోతే ఎంబసీ నుంచి క్లియరెన్స్ రాదని తెలుసుకున్నారు. దీంతో అసలు వివరాలు చెప్పకుండా డిటెన్షన్ సెంటర్లోనే ఉండిపోతామంటున్నారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ఈ వివరాలు సేకరిస్తే, స్థానికంగా ఉన్న తమ అనుచరుల ద్వారా మరో కథ నడిపిస్తున్నారు. ఇక్కడే ఉంటున్న ఆ దేశీయురాలితో వివాహమైనట్టు, ఆమెను వేధిస్తున్నట్టు కేసులు పెట్టించుకుంటున్నారు. ఇలా నమోదైన కేసుల విచారణ పూర్తయ్యే వరకు వారిని డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. ఈ వ్యవహారాలన్నింటినీ నైజీరియన్లు వ్యవస్థీకృతంగా నడిపిస్తున్నారు. ఈ వివరాలను గుర్తిస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ కేసుల్ని మూసేయించి డిపోర్ట్ చేస్తున్నారు. ‘అవతారం’మార్చుకొని మళ్లీ అడుగు... డిపోర్టేషన్ ద్వారా తమ దేశానికి వెళ్లిపోతున్న నైజీరియన్లు అక్కడ నుంచి ఘనా, ఐవరీకోస్ట్, సూడాన్లకు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న భారీ నెట్వర్క్ వీరికి ఆ దేశాల పౌరసత్వం, గుర్తింపులు ఇప్పిస్తోంది. వీటి ద్వారా పాస్పోర్ట్ పొందుతున్న నైజీరియన్లు ఆ మూడు దేశాలకు చెందిన వారుగా మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. ఆపై ఈ నల్లజాతీయులు తమ గుర్తింపుల్ని దాచేస్తున్నారు. నకిలీ పేర్లు, వివరాలతో ఫోర్జరీ పాస్పోర్టు, వీసాలు తయారు చేసుకుంటున్నారు. పట్టుబడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది వద్ద ఇవే లభిస్తున్నాయి. ఈ కారణంగానే వీరి వివరాలు కాదు కదా అసలు పేరు తెలుసుకోవడం కూడా కష్టసాధ్యంగా మారుతోంది. వీరిని కట్టడి చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
పేదలను కొట్టి పెద్దలకు భూములు
సాక్షి, హైదరాబాద్: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్కు పంపారని తెలిపారు. రైతులపై దాడి చేయించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం హరితహారంమాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్రావు అన్నారు. -
నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను ప్రశ్నించనుంది. ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట ఓ ముఖ్య నేత హాజరై వాంగ్మూలనం ఇవ్వనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి దఫా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేసినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి.బరాజ్ల నిర్మాణం సైతం అప్పుడే ప్రారంభమై పూర్తయ్యింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో పాటు ప్యాకేజీలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆర్థిక అనుమతులు, ఆ తర్వాత పనుల అంచనాల సవరణకు అనుమతి, రుణ సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) స్థాపనకు అనుమతుల జారీలో నాడు ఆర్థిక శాఖ కీలకంగా వ్యవహరించింది. ఈ నిర్ణయాల్లో ఈటల రాజేందర్ పాత్రపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా, మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించింది. ఈ వ్యవహారాల్లో ఆయ న పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కమిషన్ ఈ నెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ను, 11న మాజీ సీఎం కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని కోరింది. వారికి ఇప్పటికే సమన్లు పంపించింది. వాస్తవానికి ఈ నెల 5నే కేసీఆర్ను ప్రశ్నించేందుకు కమిషన్ సమన్లు పంపగా, ఆయన అనారోగ్య కారణాలు చూపి మరి కొంత సమయం కోరారు. దీంతో 11వ తేదీన రావాలని కోరింది. -
బడిబాట పట్టేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. బడిబాట షెడ్యూల్ ఇదీ..6వ తేదీ: స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వా మ్యం చేస్తూ గ్రామసభలు నిర్వహించాలి. 7వ తేదీ: టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో: అంగన్వాడీ కేంద్రాల సందర్శన. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవస రాలున్న పిల్లలను గుర్తించి, అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీ: అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.12వ తేదీ: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి న పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదే రోజు వి ద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలి. 13వ తేదీ: ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.16వ తేదీ: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) దినోత్సవం నిర్వహించాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టులవారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17వ తేదీ: ఇంటిగ్రేటెడ్ విద్య. బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18వ తేదీ: తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర అధునిక సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.19వ తేదీ: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించాలి. తగ్గుతున్న ప్రవేశాలుప్రభుత్వ స్కూళ్లలో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 31.17 లక్షల నుంచి 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా ప్రవేశాలు తగ్గటానికి కారణంగా భావిస్తున్నారు. కాగా, బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తూతూమంత్రంగానే పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఏం పని?
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్కర్నూలు, మహబూబ్నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.⇒ నాగర్కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ⇒ మహబూబ్గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. -
40 శాతం వైకల్యమున్నామెజారిటీ కేటగిరీల్లో అర్హత
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) ద్వారా పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ పరికరాల పంపిణీలో గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన ప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు అనుగుణంగా టీవీసీసీ పాలకమండలి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీవీసీసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ జీవో 89 జారీ చేశారు. ఈ నేప థ్యంలో గురువారం టీవీసీసీ చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఉత్త ర్వుల కాపీలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మలక్పేటలోని టీవీసీసీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీ డియాతో మాట్లాడారు. వినతు లను పరిగణించి పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు లబ్ధి జరిగే విధంగా మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బెంచ్మా ర్క్ డిజేబిలిటీ ఉన్న ప్రతి దివ్యాంగుడికి తాజా నిబంధనలు వర్తిస్తాయని, గతంలో 80% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత కల్పించగా... ప్రస్తుత ప్రజాప్రభుత్వం కుదించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ఉదార నిర్ణయం తీసుకోలేదని వీరయ్య వ్యాఖ్యానించారు. 40 శాతం వైకల్యం ఉంటే...తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు, విద్యార్థి నేస్తం కార్యక్రమం ద్వారా ట్యాబ్లు, లూయిస్ బ్రెయిలె అండ్ హెలెన్ కిల్లర్ గిఫ్ట్గా 5జీ స్మార్ట్ ఫోన్లు, లెప్రసి బాధిత దివ్యాంగులకు మైక్రో సెల్యూలర్ రబ్బర్ (ఎంసీఆర్), అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్లు, కుర్చీకే పరిమితమైన దివ్యాంగులకు ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్, స్వయం ఉపాధి కింద వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్ అందిస్తున్నారు. వీటిలో మెజార్టీ కేటగిరీల్లో కేవలం 40 శాతం వైకల్యం ఉన్నా అర్హత సాధిస్తారని టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. -
ఉద్యోగులకు 2 డీఏలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు (కరువు భత్యం) చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనుంది. ఇక మరో డీఏను 6 నెలల తర్వాత చెల్లించనుంది. వచ్చే ఏప్రిల్లో దీనిపై ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు 5 పెండింగ్ డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి రెండు డీఏలపైనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలపై విస్తృతంగా చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సచివాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించి మిగిలిన వాటిని పరిశీలనకు స్వీకరించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లించనుంది. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి నుంచి నెలకు రూ. 500 వసూలు చేయడంతోపాటు సమాన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ట్రస్ట్కు చెల్లించనుంది. ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా ఇతర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ట్రస్ట్ ద్వారా వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏటా సెప్టెంబర్లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్ స్టేట్ కౌన్సిల్, అసోసియేషన్లను గుర్తించేందుకు ఒప్పుకుంది. ౖజీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రస్తుతం పూర్తిగా సెక్రటరియేట్ సర్వీసెస్ ఉద్యోగులే పనిచేస్తుండగా ఇకపై 12.5 శాతం నాన్ సెక్రటరియేట్ సరీ్వసెస్ కోటాను అమలు చేయాలనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ కార్యదర్శి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు తిరిగి పంపించేందుకు అంగీకరించింది. జిల్లా పరిషత్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల పూర్తితోపాటు నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు డిమాండ్లకు సైతం సమ్మతి తెలిపింది. అంగన్వాడీల పదవీవిరమణ ప్రయోజనాలను రూ. 2 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల చెల్లింపుతోపాటు వాహనాల అద్దెల పెంపునకు ఆమోదం తెలిపింది. మరికొన్ని నిర్ణయాలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. – స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 385 మంది మరణించగా రూ. 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. – హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హామ్) కింద రాష్ట్రంలోని అన్ని (పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ) రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 7,947 కి.మీ. పంచాయతీరాజ్, 5,190 కి.మీ. ఆర్ అండ్ బీ రోడ్లు కలిపి మొత్తం 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 16,780 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 16,414 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. వచ్చే రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనుండగా 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకే ప్రభుత్వం అప్పగించనుంది. పార్లమెంట్ స్థానాన్ని ఒక యూనిట్గా లేదా ఉమ్మడి జిల్లాలవారీగా ఒక్కో జిల్లాను ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం. – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 19,579 కోట్లతో అంచనాలతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్–1లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ., కారిడార్–2లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ., కారిడార్–3లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీ. కలిపి మొత్తం 86.1 కి.మీ. కారిడార్ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి పొంగులేటి కోరారు. – రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహాన్ని కొనసాగించాలని.. ప్రజలకు మేలు చేసే కార్యాక్రమాలకు గ్రీన్ చానల్లో చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. – ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది. -
రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. -
Malkajgiri: మిగిలేది మూడే!
మేడ్చల్: హైదరాబాద్ మహనగర విస్తరణలో భాగంగా మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దేశంలోనే విభిన్న జిల్లాగా ఉండేది. ప్రస్తుతం మారుతున్న సమీకరణాలతో జిల్లా స్వరూపం మొత్తంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ మహానగర విస్తరణ చేయాలనే ఆలోచనలు చేయడంతో హైదరాబాద్కు శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజ్గిరిజిల్లా రూపురేఖలు మారుతున్నాయి.3 మినహా.. అంతా జీహెచ్ఎంసీనే.. ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మూడు నూతన మున్సిపాలిటీలను నూతనంగా ఏర్పాటు చేసి, 61 గ్రామాల్లో మిగిలిన గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశాయి. తాజాగా ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలలో వార్డుల విభజనపై దృష్టి పెట్టగా.. విలీన గ్రామాలపై ఎలాంటి విభజన చేయడం లేదు. మున్సిపాలిటీలలో గ్రామాలు ఇప్పటికే విలీనంకావడంతో వార్డు సంఖ్య మారాల్సి ఉండగా.. కేవలం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్లలో మత్రమే వార్డుల విభజన చేస్తున్నారు. మిగతా 7 మున్సిపాలిటీలలో ఎలాంటి వార్డుల విభజన చేయడం లేదు. నూతన మున్సిపాలిటీల్లో మాత్రమే వార్డు కుదింపు చేస్తూ.. మిగతా మున్సిపాలిటీలలో చేయకపోవడంతో 3 మున్సిపాలిటీలు మినహా అన్ని జీహెచ్ఎంసీలో విలీనం అవుతున్నట్లు స్పష్టమౌతుంది.గతంలో అన్ని పాలనలు.. మేడ్చల్ జిల్లా పదేళ్ల క్రితం ఏర్పడిన సమయంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, 5 మండల పరిషత్లు, జిల్లా పరిషత్, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, నూతనంగా 3 మున్సిపాటీలను ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు కనుమరుగయ్యాయి. దీంతో మేడ్చల్ అర్బన్ జిల్లాగా మారిపోయింది. 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు.. నియోజకవర్గంలో మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలు జవహర్నగర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, కార్పొరేషన్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 12 మున్సిపాలిటీలు 4 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతానికి ఉన్నాయి.చదవండి: హైదరాబాద్ కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..పట్టణాల స్థాయికి.. మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, మున్సిపాలిటీలు మాత్రమే నగరానికి కొద్ది దూరంగా ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రాజధాని నగరంలో అంతర్భాగంగా ఉన్నాయి. పట్టణ వాతావరణంలోనే ఉన్నాయి. పోచారం, కొంపల్లి, దుండిగల్ గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ పూర్తిగా పట్టణాలుగా ఉన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్నగర్లు నగర స్థాయికి ఎప్పుడో వెళ్లిపోయాయి. భవిష్యత్తులో మేడ్చల్ కేవలం అర్బన్ జిల్లాగానే ఉండిపోనుంది. కేవలం రెవెన్యూ మండలాలకే పరిమితం కానుంది. -
పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారుఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.ఈ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట్జర్ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ఆర్గనైజేషన్తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్ జగన్ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు.. హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం గోపీనాథ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.నిలకడగానే ఆరోగ్యం: దాసోజు శ్రవణ్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై గోపీనాథ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. 48 గంటలు గడిస్తే గానీ గోపీనాథ్ ఆరోగ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శ్రవణ్. -
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థత గురయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటరియేట్లోని కేబినెట్ హాలులో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటరియేట్ సిబ్బంది.. వెంటనే పరిశీలించి వైద్యం అందించారు. అయితే ఆమె లోబీపీ వల్ల పడిపోయినట్లు నిర్దారించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈరోజు(గురువారం) మధ్యాహ్న ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏ నివేదికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులై లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై కేబినెట్ చర్చించింది.ఇప్పటికే ఆలస్యం అయిందని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళా సంఘాల బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
Hyderabad: సూట్కేసులో యువతి మృతదేహం
నిజాంపేట్: ఓ యువతిని హత్య చేసి సూట్కేసులో తీసుకువచ్చి బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పడేసిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం బాచుపల్లిలోని జీతేపీర్ దర్గా ఎదురుగా ఉన్న జీపీఆర్ లే అవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోషియేషన్ కాలనీలో పొదల మధ్యలో ఓ సూట్కేసు నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐదు నుంచి పది రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తే కీలకం.. యువతి హత్య పోలీసులకు సవాల్గా మారింది. ఎక్కడో చంపేసి సూట్కేసులో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేయడం, అందులో మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు దర్యాప్తు కీలకంగా మారింది. రంగంలోకి ఐదు పోలీసు బృందాలను దింపి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా వివిధ పోలీస్స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన వారి వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాజులు, డ్రెస్లే ఆధారాలు.... మృతి చెందిన యువతి ఒంటిపై ఉన్న గాజులు, డ్రెస్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యా భర్తల గొడవల కారణంగా ఏమైనా ఈ హత్య జరిగిందా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒంటిపై మెరున్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తతో విడాకులు.. సింగర్కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు!
హైదరాబాద్: భర్తతో విడాకులు తీసుకున్న ఓ ఫిమేల్ సింగర్ను క్యాబ్ డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే..బేగంపేట ప్రకాష్నగర్కు చెందిన గాయనికి 2012లో వివాహం జరగ్గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంది. అయితే సింగర్ విడాకులు తీసుకున్న విషయం తెలుసుకున్న బల్కంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఉమామహేష్ గతంలో 2006లో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమెకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
RCB: హైదరాబాద్లో తప్పిన ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. చదవండి: ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా -
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారని.. ఇందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ‘కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నీ ఒకేసారి చేయలేకపోయాం. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనేదే ప్రభుత్వ ఆలోచన’అని భట్టి ఉద్యోగ సంఘాలకు వివరించారు. గత ప్రభుత్వ పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని.. అయినా ఉద్యోగులకు సాధ్యమైన మేర మేలు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామని భట్టి చెప్పారు. ఇప్పటికే ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని.. ప్రభుత్వ ఆదాయం.. ఖర్చు, చేయాల్సిన పనులను బేరీజు వేసుకుంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ముందుకు వెళ్తున్నారని భట్టి వివరించారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే కేబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదన్నారు. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో త్రిసభ్య కమిటీ నివేదిక, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి నివేదిక ఇస్తామన్నారు. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. ఇంకా జాప్యమే!
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మే 11వ తేదీనే సెట్ ఫలితాలు విడుదల చేశారు. సాధారణంగా ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సెలింగ్ చేపడతామని, క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఆరునెలల క్రితమే చెప్పింది. కానీ సెట్ ఫలితాలు విడుదలై నెల కావొస్తున్నా ఇంతవరకూ కౌన్సెలింగ్పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాప్యానికి వారు అనేక కారణాలు చెబుతున్నారు. ఈ నెల రెండో వారం వరకూ షెడ్యూల్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రానురాను ప్రక్రియ ఆలస్యమవుతున్న కారణంగా ఇంజనీరింగ్లో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు యాజమాన్య కోటాలో చేరాలనుకునే వారు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఏఐసీటీఈనే కారణమా? కాలేజీల్లో సీట్లు, బ్రాంచ్లకు సంబంధించి ప్రతీ కాలేజీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి అవసరం. ఏటా ఏప్రిల్ నెలాఖరు, లేదా మే మొదటివారంలోనే ఈ గుర్తింపు ఇస్తుంది. తమతో సంప్రదించిన తర్వాతే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలూ ఏఐసీటీఈకి లేఖలు రాశాయి. అనుమతి ఇచ్చినా, రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలు కొత్త సీట్లు, బ్రాంచ్కు అనుబంధ గుర్తింపు నిరాకరిస్తున్నాయి. ఇది న్యాయ వివాదానికీ కారణమవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ఈసారి ఏఐసీటీఈ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ కారణంగానే అనుమతి ఇవ్వడానికి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏఐసీటీఈ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది దాదాపు 12 వేల సీట్ల పెంపునకు కాలేజీలు ముందుకొచ్చాయి. 3 వేల సీట్లు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఖరారు కాని ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారవ్వకపోవడమూ కౌన్సెలింగ్కు అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేట్ కాలేజీలు సమర్పించిన గడిచిన మూడేళ్ల వార్షిక నివేదికలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాలేజీలు కృత్రిమంగా జమా ఖర్చుల నివేదికలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి తెలిపింది. సర్కార్ నుంచి ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కౌన్సెలింగ్ చేపట్టే సమయంలో ఏ కాలేజీలో ఎంత ఫీజు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులపై స్పష్టత లేని కారణంగా కౌన్సెలింగ్ సాఫ్ట్వేర్లో వివరాలు ఫీడ్ చేయలేమని అధికారులు అంటున్నారు. ముందుకు సాగని అనుబంధ గుర్తింపు కౌన్సెలింగ్ నాటికి వర్సిటీలు సీట్లు, బ్రాంచ్లు ఖరారు చేసి, అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ జాబితాను సాంకేతిక విధ్యావిభాగానికి పంపాలి. వీటి ఆధారంగానే సాఫ్ట్వేర్ రూపొందిస్తారు. విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. ఇప్పటికే కాలేజీల తనిఖీలు పూర్తి చేసిన జేఎన్టీయూహెచ్.. కొన్నింటిపై అభ్యంతరాలు లేవనెత్తింది. ల్యాబ్లు, ఫ్యాకల్టీ సరిగా లేదని పేర్కొంది. వీటిని సరిచేసుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. మరోవైపు కొత్త సీట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇవన్నీ అఫ్లియేషన్ల ప్రక్రియను ముందుకు కదలనివ్వడం లేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టింది. అయినా రాష్ట్ర కౌన్సెలింగ్ ముందుకు కదిలేట్టు లేదు. ప్రైవేట్ కాలేజీల హడావిడి రాష్ట్ర కౌన్సెలింగ్ ఆలస్యమవ్వడం, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లపై ఆరా తీయడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుబులు మొదలైంది. దాదాపు 35 వేల సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. కన్వీనర్ సీట్ల భర్తీ తర్వాతే మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేయాలి. దీంతో కాలేజీలు ముందే సీట్ల రిజర్వేషన్పై ఆరాట పడుతున్నాయి. పీఆర్వోలు, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని సీట్లు అనధికారికంగా భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
మొబైల్ మహారాణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం స్మార్ట్గా దూసుకెళుతోంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని కాంప్రహెన్సివ్ మాడ్యులార్ సర్వే– టెలికం 2025లో వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ ఏడాదే ఈ సర్వే నిర్వహించింది. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేలో తేలింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలో పురుషులకంటే మహిళలే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. సొంతంగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నవారిలో కూడా మహిళలే ముందుండటం విశేషం. సర్వేలోని ముఖ్యాంశాలు.. » ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,395 గ్రామీణ, 1,987 పట్టణ ప్రాంతాల్లో 34,950 కుటుంబాల్లోని 1,42,065 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. » 15–29 ఏళ్ల మధ్య వయసు్కల్లో 97.1 శాతం మంది సర్వే జరిపిన రోజు కంటే ముందు మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ వినియోగించారు. ఇందులో 98 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు ఉన్నారు. 2022–23లో 96.4 శాతం మంది పురుషులు, 91.8 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడినట్టు వెల్లడైంది. » తెలంగాణలో 98.3 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడుతున్నారని తేలింది. రాష్ట్ర సగటు 98.4 శాతంగా నమోదైంది. మిజోరం, అండమాన్ నికోబార్, చండీగఢ్, లక్షద్వీప్లో 100 శాతం మంది మొబైళ్లు వాడుతున్నారు. అయితే, వాడుతున్న వారితో పోలిస్తే సొంతంగా మొబైల్ ఫోన్ ఉన్న వారి సంఖ్య తగ్గింది. తెలంగాణలో 87.7 శాతం మంది పురుషులు, 78.3 శాతం మంది మహిళలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. » దేశవ్యాప్తంగా 70 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. తెలంగాణలో 72.2 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇందులో 79.9 శాతం మంది పురుషులు, 64.9 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో దేశంలో చండీగఢ్ (94.6 శాతం), మిజోరం (92.7 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. » తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 51.9%, పట్టణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే సగటున 63.5 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారు. ఇందులో దేశసగటు 48.9 మాత్రమే ఉంది. » తెలంగాణలో 26.4% (18.9 శాతం మంది గ్రామీణ, 32.3 శాతం పట్టణ) మంది యూపీ ఐల ద్వారా నగదు చెల్లింపులుజరుపుతుండగా, దేశవ్యాప్తంగా ఇది18 శాతం ఉంది. -
కొత్త రేషన్ కార్డుల దందా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల దందా బాహాటంగా కొనసాగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుండడంతో పేదలు పెద్ద ఎత్తున మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెల్ల రేషన్కార్డు (ఆహార భద్రత)తో ముడిపడి ఉండడంతో ప్రాధాన్యం పెరిగినట్లయింది. దీంతో పేద కుటుంబాలు మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థా విచారణ మాత్రం ముందు సాగడం లేదు. దరఖాస్తుదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు దళారులుగా అవతారమెత్తి కనీసం కొంత ఖర్చు (రూ.3000 నుంచి 5,000 వరకు) భరించేందుకు సిద్ధమైతే పక్షం రోజుల్లో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయించి కార్డు చేతిలో పెడతామని పేదలను నమ్మిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల సిబ్బంది సైతం మధ్యవర్తుల ద్వారా వ చ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి రేషన్ కార్డుకు అర్హులుగా సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిఫార్సులు లేని దరఖాస్తులు పెండింగ్లో పెట్టడం గమనార్హం. 2.66 లక్షలకుపైగా దరఖాస్తులు గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో రెండు నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 2.66 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లలో పెద్దగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్త కార్డుల కోసం తాకిడి పెరిగినట్లయింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తయి పదిశాతం మించి కార్డులు కూడా మంజూరుకు నోచుకోనట్లు తెలుస్తోంది. మెజార్టీ దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతుండగా, సిఫార్సు దరఖాస్తులు మాత్రం స్పీడ్గా విచారణకు నోచుకొని మంజూరు అవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తుల పరిస్థితి సైతం.. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా సర్వేలో విచారణ పూర్తయిన వాటికి కూడా మధ్యవర్తుల సిఫార్సులు లేకుండా మోక్షం లభించడం లేదు. విచారణ పూర్తయిన దరఖాస్తులకు సిఫార్సు ఉంటే మాత్రం కార్డులు ఠంచన్గా మంజూరవుతున్న సంఘటనలు అనేకం. మిగితావి పెండింగ్లో మగ్గుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. సమగ్ర సర్వే ద్వారా మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించారు. అందులో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలుగా అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబ్దిదారుల జాబితాను ప్రకటించిన తర్వాతే కార్డుల మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ.. తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో లేని శివారు ప్రాంతాల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా ప్రకటించారు. వాటి మంజూరుకు కూడా మధ్యవర్తుల సిఫార్సు తప్పడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. -
రూ. 2.2 కోట్లు కొట్టేసారు!
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబంధిత కేసు పేరుతో నగరానికి చెందిన విశ్రాంత వైద్యురాలిని ఫోన్లో బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.2.2 కోట్లు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన వైద్యురాలికి గత నెల 27న ఫోన్కాల్ వచ్చిoది. లక్నో నుంచి మాట్లాడుతున్న ఐపీఎస్ అధికారి ప్రేమ్ కుమార్గా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ పరిధిలో నమోదైన ఉగ్రవాద సంబంధ మనీలాండరింగ్ కేసులో వైద్యురాలి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో నిందితురాలిగా చేరుస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆమె ఈ షాక్ నుంచి కోలుకోకముందే వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అప్పుడు మాట్లాడిన సైబర్ నేరగాడు తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ సదానంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు. తాము కొందరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి స్వాదీనం చేసుకున్న వాటిలో ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఫొటోలు ఉన్నాయని చెప్పాడు. ఆ ఫొటోల్లో 17 ఆర్మీ అధికారులవి అయితే.. ఒకటి మాత్రం సదరు వైద్యురాలిదని పేర్కొన్నాడు. ఇది ఉగ్రవాద సంబంధిత కేసు కావడంతో విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని స్పష్టం చేశాడు. వెరిఫికేషన్ చేయాలంటూ.. ఏటీఎం కార్డుల్లో కొన్ని మీ పేరుతో తెరిచిన ఖాతాలతో లింకై ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్తో ఉగ్రవాదులకు నిధులు అందాయని భయపెట్టాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఉగ్రవాదులతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు ఎన్ఐఏ డైరెక్టర్గా చెప్పుకున్న వ్యక్తితో వాపోయారు. ఆ విషయం ఖరారు కావాలంటూ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, దీనికోసం తాము చెప్పిన ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయాలని సూచించాడు. ఈ నగదు పూర్తిగా రిఫండబుల్ అని చెప్పిన కేటుగాడు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి బదిలీ చేసేస్తామని చెప్పాడు. ఆమెను పూర్తిగా నమ్మించడానికి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జడ్జ్ పేరుతో నకిలీ లేఖ కూడా సృష్టించి పంపారు. దీంతో నేరగాళ్ల వలలో పడిపోయిన వైద్యురాలు గత నెల 29 నుంచి 31వ తేదీ మధ్య వారు సూచించిన ఖాతాల్లోకి ఏకంగా రూ.2.2 కోట్లు బదిలీ చేశారు. తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తంతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు విత్డ్రా చేసి, తెలిసిన వారి నుంచి కొంత తీసుకుని ఇలా బదిలీ చేశారు. ఆ మొత్తం రిఫండ్ రాకçపోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బా«ధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్కాలనీ: ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందడంతోపాటు 92 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. సంఘటనకు గల కారణాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన రోగులను పరామర్శించిన ఆయన, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆసుపత్రికి కలుషిత ఆహార పదార్థాలను సరఫరా చేసిన డైట్ కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అధికారులు అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందించిన ఒక స్వీట్ వల్లే ఇది జరిగిందని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇతర ఆహార పదార్థాలతోపాటు వాటి శాంపిల్స్ కూడా పరీక్షలకు పంపించామని మంత్రి తెలిపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిజనిర్ధారణకోసం డీఎంఈతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే బోరబండ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన జరగడం, ఓ రోగి చనిపోవడం బాధాకరమని ఎంపీ అనిల్కుమార్యాదవ్ అన్నారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం వల్లే ఘటన.. రోగుల అస్వస్థతకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. డీఎంఈ డాక్టర్ రాజేంద్రకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితలు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజను ఆ విధులనుంచి తప్పించి.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఆమె స్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ బి.శంకర్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. -
యూరియాపై చేతులెత్తేసినట్టేనా..?
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. వానకాలం సీజన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా కేటాయింపులు పెంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం.. గత సీజన్లో మాదిరిగానే 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. ఈ మేరకు నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచే కోటాను పంపించాలి. గత సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే 5 లక్షల టన్నుల యూరియాను పంపింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభానికి ముందే 5 ఎల్ఎంటీ యూరియాను నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జూన్ నాటికి రాష్ట్రానికి 5 ఎల్ఎంటీ యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 2.19 ఎల్ఎంటీ మాత్రమే. మే, జూన్ నెలల్లో 3.70 ఎల్ఎంటీ రావాలి. కానీ, 1.14 ఎల్ఎంటీ కోత పడుతోందని అధికారులు తెలిపారు. మంత్రి లేఖ రాసినా స్పందన కరువు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశంతో రాష్ట్రంలో యూరియా కొరతపై గత నెల 19న వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ ఢిల్లీకి వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. జూన్లో కంపెనీలవారీ కేటాయింపులు జరిగే సమయంలో మే 26న మరోసారి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపారు. గత రెండు నెలల కేటాయింపులలో ఎక్కువభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా ఉండటం, అది సరైన సమయానికి రాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో జూన్ కోటాలో అయినా స్వదేశీ యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల లేఖల ద్వారా కేంద్రాన్ని కోరారు. కేంద్రం జూన్లో కేటాయించిన 1.70 ఎల్ఎంటీలో 67 శాతం ఇంపోర్టెడ్ యూరియానే కేటాయించింది. గత రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా చేసిన 1.14 ఎల్ఎంటీపై కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రెండుమూడు రోజుల్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఢిల్లీకి పంపిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావటంతో జూన్ వరకు కేటాయించిన మొత్తాన్ని నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని కేంద్రానికి తుమ్మల మూడోసారి లేఖ రాశారు. ఆర్ఎఫ్సీఎల్లో నిలిచిన ఉత్పత్తిరామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా మే 6 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. హీట్ ట్రాన్స్ఫర్ రిఫార్మర్, అమ్మోనియా పైప్లైన్లు, ఇతర యంత్రాల నిర్వహణ కోసం ఈ రిపేర్లు చేపట్టారు. జూన్ రెండో వారంలో ఉత్పత్తి పున:ప్రారంభమయ్యే అవకాశం ఉంది.గత ఏడాది ఆర్ఎఫ్సీఎల్లో 11.94 ఎల్ఎంటీ యూరియా ఉత్పత్తి అయితే, రాష్ట్రానికి 4.68 ఎల్ఎంటీ సరఫరా చేసింది. మిగతాది నేషనల్ పూల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. ఈసారి ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను ఎక్కువగా తమకే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇంకా స్పందన రాలేదు. -
ఉత్పత్తికి ముందే మండుతున్న 'ఇథనాల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు స్థానికులు దాడులకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ యూనిట్ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా, నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. నారాయణపేట జిల్లా హిందూపూర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రైవేటు సంస్థలు.. ప్రజల నిరసనల నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ లక్ష్యం 43 కోట్ల లీటర్లు విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ‘నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ’ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’కింద 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ లెక్కన తెలంగాణలో రోజుకు 5,256 కిలో లీటర్ల (కేఎల్పీడీ) ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఇథనాల్ తయారీ యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’కింద కేంద్రం వడ్డీలో రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 31 సంస్థలు ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా, 2018–2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి. అయితే, అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం (ఐడీఆర్ యాక్ట్) ప్రకారం ఇథనాల్ తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీనిని గతంలో 16 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించినా తెలంగాణ, ఆంధప్రదేశ్ దూరంగా ఉన్నాయి. అయితే, ఇథనాల్ తయారీని ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షక బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్స్, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ధాన్యం ఆధారిత ఇథనాల్పైనే వ్యతిరేకత రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలు చెరకును గానుగ అడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తున్నాయి. గాయత్రి (45 కేఎల్పీడీ), గణపతి (30 కేఎల్పీడీ), మధుకాన్ (60 కేఎల్పీడీ), కృష్ణవేణి (120 కేఎల్పీడీ) ఇథనాల్ను తయారు చేస్తున్నాయి. చెరకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా కూడా ఈ ఫ్యాక్టరీల్లో ఇథనాల్ తయారు అవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటయ్యే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి మొలాసిస్ను తయారు చేసే ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రకమైన పరిశ్రమలపైనే స్థానికుల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రజలకు సరైన అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తోందని పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. అనుమతులు రద్దు చేయాలి పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వెనుక అధికార పార్టీ అండదండలున్నాయి. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలి. రైతులపై పోలీసు కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – డాక్టర్ ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ 12 గ్రామాలకు ఇబ్బంది పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చును పెట్లే ఫ్యాక్టరీ వద్దంటున్నా పనులు చేపడుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నోమార్లు వినతులు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన చేస్తున్నాం. 12 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. – విజయ్కుమార్, రాజోళి, గద్వాల జిల్లా -
పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్లో ఆమె ‘జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు. ఫోన్ చేసి మాట్లాడిన మీనాక్షి సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు. మంత్రితో ముఖాముఖి కాగా, బుధవారం గాం«దీభవన్లో ‘మంత్రితో ముఖాముఖి’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. కేసీఆర్కు నోటీసులిస్తారా?
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: తెలంగాణ సస్యశ్యామలం కావాలని 16 టీఎంసీల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును 141 టీఎంసీలకు పెంచినందుకా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచి్చనట్టేనని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్తో నోటీసులు జారీ చేయించిన కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ కాదు..అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్పై మాకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాగృతి కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కేసీఆర్ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని, 90 శాతం పంప్హౌస్ల పనులు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్హౌస్లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జలదోపిడీ చేసినా బీజేపీ ప్రశ్నించడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని, తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. -
నదుల్లో ఇసుక 'తోడే'ళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు. ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఆ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారిక ఇసుక రీచ్లకు ఆన్లైన్ ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చే లారీలో అదనంగా ఇసుక నింపి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఒక రకమైన దోపీడీ అయితే, అసలు ఆర్డర్ కాపీయే లేకుండా ఈ రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అనధికారిక రీచ్ల నుంచి తరలిపోయే ఇసుకకు లెక్కాపత్రమే ఉండక పోవడం గమనార్హం. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా.. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగిపోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల అండదండలు, కనుసన్న ల్లోనే ఈ దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆ నాలుగు నదుల్లో.. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 32 ఇసుక రీచ్లు అధికారికంగా నడుస్తుండగా, అనధికారికంగా 52 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరి, మంజీరా, కృష్ణా, తుంగభద్ర నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 12, ఉమ్మడి వరంగల్లో 9, కరీంనగర్లో 6 ఉండగా, ఖమ్మం, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల్లగొండల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650 చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్ కాపీ (ఓఆర్డీ) ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీ తీసుకుని రీచ్కు వెళితే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీబీల ద్వారా లారీలో ఇసుకను నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్కు రూ.110 చొప్పున చెల్లిస్తోంది. ఒకవేళ గిరిజన సొసైటీల నిర్వహణలో రీచ్లు ఉన్నట్టైతే వాటికి క్యూబిక్ మీటర్కు రూ.250 చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్ (టీజీఎండీసీ), రెవెన్యూ శాఖలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉండాలి. అన్లైన్లో బుకింగ్ చేసిన ప్రకారమే ఇసుక నింపుతున్నారా? అక్రమాలకు పాల్పడుతున్నారా? అనేది చూడాలి. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఓఆర్డీ అసలే లేకుండా, ఒక్కో ఆర్డర్పై నాలుగైదు లారీల్లో.. చాలా క్వారీల్లో సిబ్బంది ఎటువంటి ఓఆర్డీలు లేకుండానే లారీకి రూ.50 వేలు తీసుకుని ఇసుక నింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కరి పేరు మీద పర్మిట్ తీసుకుని, దానిపైనే నాలుగు, ఐదు లారీలల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా అలా నింపిన లారీలను ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరేలా స్థానిక నేతల అండదండలతో మైనింగ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఇలాకాలో ఇసుకాసురులు! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. వెంకటాపూర్, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం తదితర మండలాల్లోని గోదావరి రీచ్ల నుంచి సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరులు కొందరి అండదండలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇసుక దందాను నిలువరించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రయత్నించక పోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రచారం నిజమేననే వాదన విన్పిస్తోంది. పై స్థాయి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండబట్టే.. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా గోదావరిలోకి రోడ్లు వేసి మరీ ఇసుక తోడుతున్నారని, మామూళ్లు తీసుకుంటూ అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారని స్థానికులు భయపడుతుండటం గమనార్హం. అనధికారిక రీచ్లలో ఏం జరుగుతోంది? అనధికారిక రీచ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. చాలావరకు గతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి విరమించుకున్న ప్రాంతాల్లోనే ఈ దందా సాగుతోంది. దీనిని నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ములుగు టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి విష్ణువర్ధన్, భూపాలపల్లి పీవో శ్రీకాంత్ నుంచి ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. ఉచితం పేరిట యధేచ్చగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక సరఫరాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాల (ఇందిరమ్మ) కింద ఇళ్లు నిర్మించునే వారు కేవలం రూ.1400 చెల్లిస్తే అతడికి రిజిస్టర్డ్ ట్రాక్టర్ యజమాని ఇంటికి వచ్చి ట్రాక్టర్ ఇసుక పోసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేదలైన లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక లభిస్తుండగా, మరోవైపు స్థానిక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి దొరుకుతోంది. అయితే ఈ విధానాన్ని అనుకూలంగా మలచుకుని ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామాల్లో ఉన్న చోటా మోటా నేతలు స్థానిక వాగులను తోడేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ ఇసుకను లారీల్లో ఇతర జిల్లాలకు, హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాలో ట్రాక్టర్ల ద్వారా 500 నుంచి 800 ట్రిప్పుల ఇసుకను ‘ఉచితం’ పేరిట తోడుతూ ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నారే ఆరోపణలున్నాయి. ఇలా రోజుకు రూ.50 కోట్లకు పైగా విలువైన ఇసుక పక్కదారి పడుతున్నట్టు అంచనా. కాగా కొన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందాను గ్రామ కమిటీలు వేలం ద్వారా కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. హైదరాబాద్కు ఇలా.. అక్రమంగా తోడేస్తున్న ఇసుక చాలావరకు హైదరాబాద్కు, ఇతర ముఖ్య నగరాలకు వస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడానికి ‘తెలంగాణ ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ ప్రకటించింది. బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు విపరీతంగా పెరిగి.. ప్రైవేట్ వ్యాపారులు టన్ను ఇసుకను రూ.2,000 నుండి రూ.3,000 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో.. ఈ దందాను అరికట్టడానికి ఈ బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బజార్ల ద్వారా అందుబాటులో ఉండేది. వాస్తవ అవసరాలతో పోల్చుకుంటే నామమాత్రమేనని బహిరంగ రహస్యం.ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏలికేశ్వరం ఇసుక రీచ్. బుధవారం ఇక్కడి నుంచి 7,356 టన్నుల ఇసుక తరలించేందుకు 228 ఆన్లైన్ ఆర్డర్లు బుక్ అయ్యాయి. అంటే 228 లారీల ద్వారా ఈ ఇసుకను తీసుకెళ్తారన్న మాట. లారీ సైజును బట్టి ఒక్కో దానిలో 16 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రీచ్ వద్ద సీసీ కెమెరాలు లేవు. మైనింగ్ విభాగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో లారీలో నాలుగు నుంచి ఆరు బకెట్ల (జేసీబీ ఒక్కసారి తోడే ఇసుక) ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం. ఇందుకోసం బకెట్కు రూ.1,500 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీలో సగటున మూడు బకెట్లు వేశారనుకుంటే మూడు బకెట్లకు రూ.4,500 చొప్పున 228 లారీలకు గాను రూ.10.26 లక్షలు దోచుకుంటున్నారన్న మాట. టన్నుల కొద్దీ అక్రమాలు... రాష్ట్రంలోని 32 అధికారిక రీచ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం..ఆర్డర్ కాపీ మేరకు.. ఆరు టైర్ల లారీలో 7–8 క్యూబిక్ మీటర్లు (11.5– 12.5 టన్నులు), 10 టైర్ల వాహనంలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ. (26 టన్నులు), 14 టైర్ల వాహనంలో 20 క్యూ.మీ. (32 టన్నులు) మాత్రమే నింపాలి. కానీ సామర్థ్యానికి మించి, అలాగే బుక్ చేసుకున్న దాని కంటే అధికంగా సగటున 3 బకెట్ల వరకు ఇసుక అదనంగా నింపుతున్నారు. బకెట్కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని రీచ్ల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది.. లారీల్లో అదనంగా ఇసుకను నింపుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక లోడింగ్ సమయంలో ఒక్కో లారీకి (బకెట్ డబ్బులు కాకుండా) రూ.1,000–1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫీడ్రిన్ డ్రగ్ను కానిస్టేబుల్ గుణశేఖర్కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఎఫీడ్రిన్లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయాలపై కూకట్పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
స్నాతకోత్సాహం
జేఎన్టీయూలో అలరించిన వేడుకలుకేపీహెచ్బీకాలనీ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) 13వ స్నాతకోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ విజయ్కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. గతానికి భిన్నంగా స్నాతకోత్సవ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల కేరింతలు, అభినందనలు తెలిపేందుకు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ స్నాతకోత్సవం పండగ వాతావరణాన్ని తలపించింది. విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడమే నిజమైన విద్య అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విద్యార్థులు సృజనాత్మకత, నైతిక విలువలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రదానం చేశారు ఎంతో ఆనందంగా ఉంది.. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. 5 గోల్డ్ మెడల్స్ రావటంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. –నవ్యశ్రీ, ఈసీఈ విభాగం నా కల సాకారమైంది సివిల్ ఇంజినీరింగ్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మా నాన్న ఉపాధ్యాయుడు. ఎంతోమంది విద్యార్థులకు చదువు గొప్పతనం గురించి చెబుతుంటారు. నా తల్లిదండ్రుల కృషి చాలా ఉంది. – పి.సుప్రియ, సివిల్ ఇంజినీరింగ్ -
ఔటర్.. ఔరా!
ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధికి సర్కారు అడుగులు సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలతో అనుసంధానంగా ఉంటూ ఇతర నగరాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఔటర్ చుట్టూ ఐటీ, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి ప్రాంతాలలో సెజ్ తరహాలో కంపెనీలకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సంస్థలకు చేరువలో నివాసాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నగరాభివృద్ధి విస్తరించడంతో పాటు వాక్ టు వర్క్ విధానంలో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. కనిష్టంగా వెయ్యి ఎకరాలు.. ఔటర్ చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఔటర్కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఒక్కోచోట వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూములను సేకరించాలన్న అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మరోవైపు గతంలో ఏవైనా సంస్థలకు స్థలాలు ఇచ్చి అవి ఇంకా కార్యకలాపాలు ప్రారంభించకపోతే వాటిని వెనక్కి తీసుకునే మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వాక్ టు వర్క్ తరహాలో.. ఔటర్ చుట్టూ రానున్న పరిశ్రమలు వాక్ టు వర్క్ విధానంలో ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. కంపెనీలకు చేరువలోనే నివాసాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) తరహాలో ఒకేచోట 300 ఎకరాల భూములు సేకరించాలని, పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే అక్కడ నివాసం ఉండేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారుల భావిస్తున్నారు. ఇందుకోసం 300 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించాలని నిర్ణయించారు. రోడ్లు, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలను అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. అభివృద్ధి విస్తరణ.. ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో యాపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎలక్ట్రానిక్ సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు పరిశ్రమలతో పాటు షాబాద్ మండలంలో విద్యుత్ బస్సుల తయారీ, టెక్స్టైల్స్ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ, పరిశ్రమల హబ్లలో పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు వాటికి సమీపంలో విద్యా సంస్థలు, వినోద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రెస్టారెంట్లను ప్రారంభిస్తే అభివృద్ధి మరింత విస్తరించే అవకాశముంది. ఐటీ, పరిశ్రమలకు స్థలాల కేటాయింపునకు కసరత్తు òÜgŒæ ™èlÆý‡àÌZ HÆ>µr$ ^ólĶæ*ÌS° °Æý‡~Ķæ$… కంపెనీలు, నివాసాలు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు -
మహా దారిలో..
ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లు ● జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ● మొదటి దశలో 10 రహదారులకు హెచ్ఎండీఏ ప్రణాళికలుసాక్షి, సిటీబ్యూరో: ఔటర్రింగ్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగ్రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. రావిర్యాల నుంచి ఆమన్గల్ మార్గంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ తరహాలోనే మరో 10 ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఔటర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డుకు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ వీటిని నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా విశాలమైన రహదారులు అందుబాటులో ఉంటాయని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా రెండు దశల్లో నిర్మించనున్న సుమారు 350 కిలోమీటర్ల మేర అనుసంధానం చేసే విధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్లను దశలవారీగా నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరువైపులా టౌన్షిప్లు ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఆధునిక సదుపాయాలతో టౌన్షిప్లు నిర్మించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు సేకరించి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్కు అనుగుణంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. వీటిని గ్రీన్ఫీల్డ్ రోడ్లకు ఇరువైపులా నిర్మించనున్నారు. ప్రజలు నివాస సముదాయాల నుంచి తేలిగ్గా గ్రీన్ఫీల్డ్కు చేరుకొనే సదుపాయం ఉంటుంది. ప్రతి లే అవుట్ను అన్నిమౌలిక సదుపాయాలతో డిజైన్ చేసేందుకు ప్రతిపాదించారు. రైతుల నుంచి భూములు సేకరించి ఏర్పాటు చేసే లేఅవుట్లలో 60 శాతం భూమిని తిరిగి వారికే అందజేయనున్నారు. మిగతా 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకోనుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన రావిర్యాల– ఆమన్గల్ మార్గంలో మొదటి దశలో రేడియల్ రోడ్డుకు ఇరువైపులా కి.మీ పరిధిలో 21 లక్షల చదరపు మీటర్ల (518.92 ఎకరాలు) విస్తీర్ణంలో టౌన్షిప్ను, రెండో దశలో 500 మీటర్ల పరిధిలో మరొకదానిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలో రతన్టాటా గ్రీర్ఫీల్డ్ రోడ్డు పనులు.. ఫ్యూచర్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ రావిర్యాల ఇంటర్చేంజ్ నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న 41.50 కి.మీ. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులను హైకోర్టు స్టే ఎత్తివేసిన వెంటనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అనుబంధ హెచ్జీసీఎల్ సంస్థ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.రెండోదశలో మీర్ఖాన్పేట్ నుంచి ట్రిపుల్ ఆర్ వద్ద అమన్గల్ వరకు రూ.2,365 కోట్ల వ్యయంతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ● గ్రీన్ఫీల్డ్ రోడ్లు 100 మీటర్ల వెడల్పుతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేలు. ఆరు లైన్ల ప్రధాన రహదారి (3+3 లేన్) ● భవిష్యత్తులో 8 లైన్లకు (4+4) విస్తరించే అవకాశం ఉంటుంది. ● రావిర్యాల–ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మధ్యలోనే మెట్రో కారిడార్ కోసం 20 మీటర్ల భూమిని కేటాయిస్తారు.ఈ మార్గంలో ఎట్గ్రేడ్ (భూమార్గంలో)గా మెట్రో కారిడార్ రానుంది. ● గ్రీన్ఫీల్డ్ రోడ్లకు రెండు వైపులా 3–లైన్ల సర్వీస్ రోడ్లు ఉంటాయి. 2 మీటర్ల చొప్పున గ్రీన్బెల్ట్ను (పచ్చదనం) ఏర్పాటు చేస్తారు. ● రెండు వైపులా 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్, మరో 2 మీటర్ల యూటిలిటీ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. -
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్-2025 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు రెండు సెక్షన్స్లో పరీక్షలు జరగనున్నాయి.ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.పరీక్షల నిర్వహణ తేదీలు, సెషన్లు, సబ్జెక్టులు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈసారి టెట్కు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
వాక్వే పనులను వేగవంతం చేయాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్లో వాక్వే పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కేబీఆర్ పార్క్ వాక్వే పనులను పరిశీలించారు. లైసెన్స్ తీసుకున్న పెట్ డాగ్స్ను మాత్రమే పార్క్లోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లైవర్లు, అండర్పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా? అంటూ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను వివరణ అడిగారు. సెన్సిటివ్ జోన్ పరిధిలోనే పనులు చేపట్టినట్లు ప్రాజె క్టు ఇంజినీర్లు కమిషనర్కు వివరించారు. ఆయన వెంట అడిషనల్ కమిషనర్ సుభద్రా దేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీలక్ష్మి, ఈఈ నాయక్, డిప్యూటీ ఈఈ హరీష్, సర్కిల్ ఈఈ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యశాఖకు ‘గోషామహల్ స్టేడియం’
ఉస్మా‘నయా’ ఆస్పత్రి కోసం 31 ఎకరాల 39 గుంటలు సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్గంజ్లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్లో శివకుమార్ లాల్ పోలీ సు స్టేడియం ప్రాంతానికి తరలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు సైతం ప్రారంభమైంది. మొత్తం 43 ఎకరాల 37 గంటల ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆస్పత్రికి, 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించారు. కొత్త ఉస్మా నియా ఆస్పత్రికి కేటాయించిన స్థలాన్ని నగర పోలీ సు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వైద్యశాఖకు అప్పగించారు. మిలిగిన స్థలంలో పోలీసు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నారు. అదనంగా మరో రెండు ఎకరాలు.. ప్రస్తుతం గోషామహల్లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో ఓ పక్క స్టేడియం, సిటీ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం, డాగ్ స్క్వాడ్, అశ్విక దళంతో పాటు శిథిలమైన కొన్ని పోలీసు క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వీటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అమరుల స్తూపం ఉండగా దాన్నే పోలీసు అధికారులు గ్రౌండ్గా వినియోగిస్తున్నారు. ఈ స్తూపానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా, సముచిత ప్రాధాన్యం ఇస్తూ స్డేడియంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికోసం సర్కారు రూ.55 కోట్లు మంజూరు చేసింది. అశ్వికదళం కోసం తాత్కాలికంగా నిర్మించిన 24 షెడ్లను ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. తాత్కాలిక ప్రాతిపదికన డాగ్ స్క్వాడ్ను బేగంపేటలోని పోలీసు క్వార్టర్స్లోకి పంపారు. ఈ స్థలానికి అదనంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) వద్ద మరో రెండు ఎకరాలు నగర పోలీసు విభాగానికి కేటాయించింది. ఇక్కడ కెన్నెల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వాహనాలు శిథిలం కాకుండా.. నగరంలోని ఏడు జోన్లకు సంబంధించిన పోలీసులు వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ప్రస్తుతం ఈ స్టేడియంలోనే ఉంచుతున్నారు. వీటికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త నిర్మాణాల్లో భాగంగా ఈ వాహనాల కోసం ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. పక్కనే మరో నాలుగు అంతస్తుల్లో సీఎస్డబ్ల్యూ, సీటీసీలతో పాటు ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తారు. మిగిలిన ప్రాంతంలో స్టేడియం, గ్రౌండ్స్ ఉండనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రి కోసం ప్రభుత్వం గోషామహల్ స్టేడియం ప్రాంగణం నుంచి 25 ఎకరాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. దీనికి ప్రతిగా ఆరాంఘర్ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది. ఈ స్థలంలో రాష్ట్ర స్థాయి బ్యారెక్స్, ప్లేగ్రౌండ్, డ్రిల్ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. రహదారులు సైతం విస్తరణకు ప్రతిపాదనలు.. ఎన్నికలతో పాటు బోనాలు, గణేష్ ఉత్సవాలతో పాటు ఇతర కీలక బందోబస్తుల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే బలగాల కోసం ఈ బ్యారెక్స్ వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న వీటిలో ఉన్నతాధికారుల కోసమూ కొన్నింటిని కేటాయించనున్నారు. గోషామహల్ స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ఉన్న రహదారులపైనా ప్రభుత్వ విభాగాలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అది వాణిజ్య ప్రాంతం కావడంతో పాటు రోడ్లన్నీ ఇరుకుగా ఉంటాయి. ఆస్పత్రి నిర్మాణం ప్రారంభంతోనే ఈ రోడ్ల విస్తరణకూ చర్యలు చేపట్టనున్నారు. ఆస్పత్రి చుట్టూ 30, 60, 100 అడుగుల వెడల్పుతో రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికోసం ఇప్పటికే అధికారులు సర్వే సైతం ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రోడ్ల స్థితిగతులు, కొత్త వాటి కోసం సేకరించాల్సిన ఆస్తులు, కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. అప్పగించిన పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మిగతా 11 ఎకరాల 38 గుంటల్లో పోలీసు నిర్మాణాలు స్వాధీనం చేసుకున్న వాహనాలకు ప్రత్యేక భవనం వివరాలు వెల్లడించిన సిటీ కొత్వాల్ -
మళ్లీ పోలీస్ చేతికి జేమ్స్ స్ట్రీట్ భవనం
బన్సీలాల్పేట్: హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టిన జేమ్స్ స్ట్రీట్ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారని, త్వరలోనే రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని రాంగోపాల్పేట్ పురాతన పోలీసు స్టేషన్ను మంగళవారం ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాల్, నగర ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెడ్గే తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడారు. రాంగోపాల్పేట్ పాత పోలీసు స్టేషన్కు హెచ్ఎండీఏ మరమ్మతులు నిర్వహించి బ్రహ్మాండంగా తయారు చేశారన్నారు. సదరు స్టేషన్ను తిరిగి తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు. త్వరలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. జేమ్స్ స్ట్రీట్ భవనం 1870 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి 2016 వరకు సుదీర్ఘకాలం రామ్గోపాల్పేట్ పోలీసు స్టేషన్ ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత మరమ్మతుల కోసం తొమ్మిదేళ్ల క్రితం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుని..ఇప్పుడు అప్పగిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు సంబంధించిన వస్తువులను తిరిగి ఇక్కడి తీసుకవచ్చి పోలీసు కార్యకలాపాలు సాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పురాణి హవేలిలోని సిటీ పొలీసు కమిషనర్ కార్యాలయం మరమ్మతులు పూర్తి కావచ్చాయని, త్వరలో ఈ భవనాన్ని ప్రారంభించి అక్కడి నుంచీ నగర పోలీసు కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. బీజేపీ కార్పొరేటర్లతో కిషన్రెడ్డి సమావేశంసాక్షి, సిటీబ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన వారితో చర్చించారు. బస్తీ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయన ప్రస్తావించారు. వర్షాకాల సన్నద్ధతపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు సూచించారు. అలాగే గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైన కూడా ప్రశ్నించాలని సూచించారు. గ్రేటర్ సమస్యలపై బల్దియా మీటింగ్లో అంశాల వారీగా ఏయే కార్పొరేటర్లు ఏం మాట్లాడాలనే దానిపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.● రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ త్వరలో అక్కడికి తరలింపు ● సందర్శించిన సీపీ సీవీ ఆనంద్ -
సమన్వయంతో సమస్యలు నివారించండి
సాక్షి, సిటీబ్యూరో: వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సీజన్ను దృష్టిలో ఉంచుకొని వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై ఆయా విభాగాల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలో అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనుల్ని వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్వద్ద రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతి గురించి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్(సీఆర్యూ)లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో.. -
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విదేశాలకు..
శంషాబాద్: అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థి సర్టిఫికెట్ నకిలీదిగా తేలడంతో హైదరాబాద్లోని ఓ నకిలీ సర్టిఫికెట్ విక్రయిస్తున్న కన్సెల్టెన్సీ గుట్టు రట్టైంది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన పకీరు గోపాల్రెడ్డి 2018లో మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించి ఏడాదిన్నర కిందట అమెరికాలోని వెబ్స్టర్ వర్సిటీలో 28 వేల డాలర్ల ఫీజు చెల్లించి ఉన్నత చదువులో ప్రవేశం పొందాడు. 15 నెలలు చదివిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఐదు నెలలు ఇక్కడే ఉన్నాడు. నాలుగురోజుల కిందట అమెరికా వెళ్లిన అతడిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు యునివర్సిటీలో ఇన్యాక్టివ్ విద్యార్థిగా గుర్తించి స్వదేశానికి తిప్పిపంపారు. దీంతో తిరిగి వచ్చే క్రమంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడి వీసాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు పరిశీలించగా నకిలీ సర్టిఫికెట్ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు. పదిహేను మందికి పైగా.. నకిలీ సర్టిఫికెట్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్రెడ్డిని విచారించగా బీఎన్రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో ఉన్న ధనలక్ష్మీ ఒవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో రూ.80 వేలకు డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సిద్దేశ్వర్ పోలీసుల బృందం ధనలక్ష్మీ ఒవర్సీస్ సంస్థపై దాడులు చేశారు. సంస్థ నిర్వాహకుడు కాతోజు అశోక్ను అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న మధురై కామరాజ్, ఉస్మానియా వర్సిటీలకు చెందిన 17 నకిలీ డిగ్రీ, ప్రొవిజినల్ మార్కుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన విద్యార్హత లేకుండా విదేశీ విద్యనభ్యసించాలనుకునే వారు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు గుర్తించారు. పదిహేనుమందికిపైగా నకిలీ సర్టిఫికెట్లతో విదేశీ విద్యకు వెళ్లినట్లు విచారణలో అశోక్ వెల్లడించాడు. కేరళకు చెందిన వ్యక్తికి ఒక్కో సర్టిఫికెట్కు రూ.30 వేలు ఇస్తే..అతడే సర్టిఫికెట్లు తయారుచేసి పంపిస్తున్నట్లు తెలిపాడు. అశోక్ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన నకిలీ స్టాంపులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్రెడ్డి, అశోక్లను రిమాండ్కు తరలించగా కేరళకు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.ఓ కన్సల్టెన్సీ నిర్వాకం అమెరికా నుంచి తిరిగొచ్చిన విద్యార్థి సర్టిఫికెట్ పరిశీలనలో బయటపడ్డ వైనం కేరళలో తయారీ..హైదరాబాద్లో విక్రయం ఇద్దరి అరెస్ట్..ఒకరి పరారీ -
వేర్వురుగా రెయిన్ వాటర్, సీవరేజ్ లైన్లు
జలమండలి ఎండీ సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం పాయింట్లను గుర్తించి రెండు లైన్లను వేర్వేరుగా నిర్మించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సోమవారం మలక్పేట్లోని నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మతు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు దశాబ్దాల క్రితం నాటి సీవరేజ్ లైను శిథిలమైపోవడంతో అవుట్లెట్ లేక వర్షం కురిసిన సమయాల్లో సీవరేజ్ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. మలక్పేట్ ఆర్యూబీ వరకు సీవరేజ్ లైన్ల నిర్మాణం చేపట్టడానికి అధికారులతో చర్చించారు. కొత్త సీవరేజ్ లైన్ల వల్ల తాత్కాలికంగా మురుగు సమస్య తలెత్తకుండా ఉంటుందని అన్నారు. అలాగే సమీపంలోని భవనాలనుంచి ఉత్పన్నమయ్యే సీవరేజ్ను ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సమీపంలోని అన్ని సీవరేజ్ లైన్లను, మ్యాన్ హోళ్లను డీసిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు, హైడ్రా అధికారులు పాల్గొన్నారు. -
‘నేతన్నకు భరోసా’కు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఈ నెల 2న మార్గదర్శకాలను జారీ చేసినట్లు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం రూ.48 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా.. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహకం కింద.. గరిష్టంగా ఏటా నేత కార్మికులకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు తెలిపారు. ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని వివరించారు.చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, వార్షికాదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50 శాతం ఆర్జిస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు.ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50 శాతం కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహకం కింద.. ఏటా రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ నుండి మార్చి) బ్యాంకు ఖాతాలోకి నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేయనున్నట్లు వివరించారు. కాగా, మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని.. సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. -
‘పుర’ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మునిసిపల్ వార్డుల విభజనకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో 18 కొత్త మునిసిపాలిటీలు కాగా, మిగతావి పాత కార్పొ రేషన్లు, మునిసిపాలిటీలు. మునిసిపల్ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో వార్డుల విభజన ప్రక్రియ మంగళవారం నుంచి జూన్ 21 వరకు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది.ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఉన్న మునిసిపాలిటీల్లో కొత్త ప్రాంతాల కలయికతోపాటు, కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. కాగా ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న 13 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పునర్విభజన జోలికి వెళ్లలేదు. ఓఆర్ఆర్ లోపలి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను కలిపి కొత్తగా మూడు కార్పొరేషన్లుగా మార్చాలని యోచిస్తున్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్లలేదు. 21లోపు వార్డుల విభజన: 18 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లోనే చ ట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా ముని సిపాలిటీలకు వార్డుల సంఖ్యను పురపాలక శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉన్న ఐదు కార్పొరేషన్లు, ఏడు మునిసిపాలిటీల్లోనూ వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలి. -
ప్రపంచ సుందరి పోటీల ఖర్చు రూ.30 కోట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చిస్తే..స్పాన్సర్షిప్ రూపంలో రూ.21 కోట్ల ఆదాయం సమకూరిందని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరో రూ.10 కోట్లకు సంబంధించి స్పాన్సర్షిప్ ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ మొత్తం కూడా సమకూరితే ప్రభుత్వానికి నయాపైసా కూడా ఖర్చు లేకుండా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించినట్టవుతుందని చెప్పారు. మిస్ వరల్డ్ సంస్థ అవసరాలకు రూ.3 కోట్లు ఇచ్చామని, అవి కూడా ఖర్చులో భాగంగానే చూపామని వెల్లడించారు. మంగళవా రం ఆయన సచివాలయంలో మరో మంత్రి పొన్నం ప్రభాక ర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఈ పోటీల రూపంలో ప్రపంచ మీడియాను తెలంగాణకు రప్పించటం ద్వారా ఇక్కడి పర్యాటక ప్రాంతాలపై ప్రపంచస్థాయిలో విస్తృత చర్చకు వీలు కల్పించామని, ఫలితంగా తెలంగాణ పర్యాట కానికి రూ.10 వేల కోట్ల విలువైన ప్రచారం లభించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో దీని ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. పర్యాటకం, హస్తకళ లు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామని, ఆ వేడుకల నిర్వహణ, ఆతి థ్యం పట్ల పోటీదారులు, మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.పరిస్థితి ఇలా ఉంటే, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు అయ్యాయంటూ కేటీఆర్, హరీశ్రావు తదితరులు ఆరోపిస్తున్నారని, అంత ఖర్చు ఎలా అయ్యిందో ఆధారాలు చూపాలని, తనను తెలంగాణభవ న్కు రమ్మన్నా, అబిడ్స్ చౌరస్తాకు రమ్మన్నా చర్చకు వస్తాన ని, నిరూపించలేకపోతే అంత ఖర్చు కాలేదని ఒప్పుకొని ముక్కు నేలకురాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలకు రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలపాలని, ఇప్పుడు తాము ఇంత పెద్ద ఈవెంట్ను దాదాపు ఖర్చు లేకుండా నిర్వహించగలిగామని వెల్లడించారు.చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్లో ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు రూ.లక్ష అని, సుందరీమణులకు 30 తులాలు చొప్పున బంగారం ఇచ్చారని తప్పుడు వార్తలు రాయించారన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్కు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించామని, ఒక్కో ప్లేట్ ఖర్చు రూ.8,200 మాత్రమే అయ్యిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్ దేనని అన్నారు. పోటీదారులకు పిసరు కూడా బంగారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లామ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె ఆరోపణలే నిజమైతే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు సంతృప్తిగా, సంతోషంగా ఎలా ఉండగలిగారని ప్రశ్నించారు.తాము మళ్లీ హైదరాబాద్కు వస్తామని, తమ జీవితంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంటుందని వారు చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం కావటంతో ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వారి పార్టీల్లోని సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పర్యాటకశాఖ డైరెక్టర్ హన్మంతు జండగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి పాల్గొన్నారు. -
మహిళా నిరసనకారుల కోసం మహిళా పోలీసులతో స్వాట్
సాక్షి, హైదరాబాద్: నిరసనలు..ధర్నాలు..ఆందోళనల్లో పాల్గొనే మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో వారి ఆత్మగౌర వానికి భంగం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీ సులు స్వాట్ (స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకొని, పోలీస్స్టేషన్లకు తరలించే సందర్భాల్లో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రారంభించారు.ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన...హైదరాబాద్లోని సుల్తాన్బజార్లో ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు గత ఏడాది డిసెంబర్లో నిరసన తెలిపారు. వీరిని ముందస్తు అరెస్టు చేయడానికి అవసరమైన స్థాయిలో మహిళాపోలీసులు లేకపోవడం, ఉన్న వారికీ నైపుణ్యం లేకపోవడంతో ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పోలీసులు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం మహిళా నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులతో కూడిన వింగ్ ఉండాలని నిర్ణయించింది. దీంతో నగర సాయుధ విభాగం (సీఏఆర్) హెడ్క్వార్టర్స్కు చెందిన 2024 బ్యాచ్ కానిస్టేబుళ్లతో స్వాట్ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఒక్కో ప్లటూన్లో 21 మంది చొప్పున రెండింటికి రూపం ఇవ్వడానికి సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.బైక్ స్టంట్తో అబ్బురపరిచిన పూజ...ప్రదర్శన సందర్భంగా స్వాట్ సభ్యురాలు పి.పూజ బైక్ స్టంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమె కడుపుపై ఓ చెక్క పెట్టిన శిక్షకులు దాని మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. దీనికోసం తాను ఎలాంటి ప్రాక్టీసు చేయలేదని, కేవలం డెమో నిర్వహించి నేరుగా వచ్చానని వివరించారు. జాతీయస్థాయిలో వాలీబాల్ ప్లేయర్ అయిన పూజ.. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లోనూ పాల్గొన్నారు. వాలీబాల్లో గోల్డ్, ఆర్మ్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్స్ గెల్చుకున్నారు.ఎలాంటి దుస్తులు ధరించినా నేర్పుగా నిరసన తెలుపుతున్న మహిళలందరూ ఒకే విధమైన దుస్తులు ధరించరు. చీర, చుడీదార్, జీన్స్ ఇలా ఏ రకమైన వస్త్రాలు ధరించిన వారిని ఎలా అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. ఒకే చోట గుంపుగా ఉన్న ఆందోళనకారుల్నీ సోలార్ లాక్, ప్రామిస్ లాక్ అనే టెక్నిక్స్ వాడుతూ ఎలా లిఫ్ట్ చేయాలన్నది నేర్చుకున్నాం. – జె.ఉమరెండు రకాల మార్షల్ ఆర్ట్స్ శిక్షణస్వాట్ ట్రైనింగ్లో భాగంగా జిమ్ వ్యాయామంతోపాటు రెండు రకాలైన మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. కరాటేలో కట్టాస్, పంచెస్, సెల్ఫ్ డిఫెన్స్, కిక్స్... క్రావ్మగాలో రియల్ ఫైట్, ఏడు మూవ్మెంట్స్లో ఎదుటి వ్యక్తిని నేలకూల్చడం తదితర అంశాల్లో అవగాహన కల్పించారు. – టి.శిల్పవర్ధన్గోషామహల్ పోలీస్ స్టేడియంలో స్వాట్ బృందాల ప్రదర్శన తొలి దశలో 35 మందిని స్వాట్ కోసం ఎంపిక చేశారు. వీరికి పోలీసులతోపాటు మార్షల్ ఆర్ట్స్, మాబ్ కంట్రోల్ ఎక్స్పర్ట్స్తో 45 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. మహిళలతోపాటు పురుష నిరసనకారుల్ని అదుపు చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, ఎలాంటి ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో స్వాట్ బృందాలు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించాయి. సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో పని చేయనున్న ఈ బృందాలకు ఆర్ఎస్సై మౌనిక పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. త్వరలోనే మరో ఏడుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మేన్గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
రేపు కేబినెట్.. పలు కీలక అంశాల చర్చ
సాక్షి, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యామ్ల భద్రతా ప్రాధికార సంస్థ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారీస్థాయిలో ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలతోపాటు రికవరీ చేయాలని కమిషన్ సూచించిన విషయం విదితమే. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్చార్జ్లుగా నియమించి, భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి అ«దీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతోపాటు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ గతవారంలోనే తన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే ఐదు కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. వానాకాలం పంటల అంశం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న తీరుపై కూడా చర్చించే అవకాశముంది. వాస్తవంగా జూన్ 2వ తేదీన కనీసం వంద ఇళ్లను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేసినా, అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చోటుచేసుకోని విషయం విదితమే. -
పోషకలోపం.. ఊబకాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్ లైవ్స్’రౌండ్–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్ రిస్్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.మానసిక ఒత్తిడిలోయువత తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది. అక్కడలా.. ఇక్కడిలా..సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. విద్యా స్థాయిల తేడాల వల్ల కూడా.. తల్లుల విద్యాస్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, వారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయని సర్వే స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు తల్లికి పదేళ్లకుపైగా చదువు ఉంటే వారి పిల్లల్లో తక్కువ బరువు కలిగి ఉన్న వారు 24.1% ఉండగా స్థూలకాయం 27.6% వరకు ఉంది. విద్య, ఆర్థిక స్థితి, మహిళా సంక్షేమం ఇవన్నీ పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పోషకాహారం, ఆరోగ్య విద్య, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే పేద కుటుంబాలకు ప్రత్యేక ఆహార భద్రత కార్యక్రమాలు మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. -
పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: పత్రికల గొంతు నొక్కేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం చెల్లదని హైకోర్టు అభిప్రాయపడింది. జాతీయ భద్రతతోపాటు ఇతర కొన్ని ప్రమాదకర సందర్భాల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. 2022లో ఓ వెబ్సైట్, యూట్యూబ్ చానల్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వును కొట్టేసింది. తమకు వ్యతిరేకంగా అవమానకరమైన, అపవాదు తీసుకొచ్చేలా ఓ వెబ్సైట్లో వీడియోలు, చిత్రాలు, నివేదికలు, ప్రచురణలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కూకట్పల్లి కోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు మేఘాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022 డిసెంబర్ 2న కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్ అర్డర్ను సవాల్ చేస్తూ వెబ్సైట్, యూట్యూబ్ నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకొనేలా ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ), 19 (1) (జీ)లను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ పి. శ్రీసుధ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన అభ్యంతరకరమైన ఉత్తర్వును కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. -
తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలుస్తామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన విద్యార్థులు స్థానిక చట్టాలపై అవగాహన లేకుండా ఏవైనా తప్పులు చేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం చేస్తామని చెప్పారు. అమెరికాకు వర్థిన విద్యార్థులు ఏదైనా కారణంతో స్వదేశానికి తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో ఆవేదనకు గురవుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులు కూడా స్థానిక చట్టాలతో పాటు అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్– డాలస్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గతంలో భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు, చదువు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారని కేటీఆర్ గుర్తు చేశారు. వేగంగా మారిన ప్రపంచ పరిణామాలతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో అమెరికాలో అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఐటీ మరింత అభివృద్ధి మంగళవారం డాలస్లో అక్కడి ఐటీ కంపెనీల యాజ మాన్య ప్రతినిధులతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగంలో తెచ్చిన విప్లవాత్మక విధానాల వల్లే హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఏఐ రంగంలో దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు భారత్లో ఖండాంతర సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముందని చెప్పారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ రంగంవిస్తరించి ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల్లోనూ ఐటీ హబ్లు నిర్మించామని తెలిపారు. అమెరికాలోని యువత భారత్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. కేసీఆర్ జీవితం స్ఫూర్తిగా... సాహసోపేత నిర్ణయాల ద్వారానే కలలు సాకారం అవుతాయనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే సాక్ష్యమని కేటీఆర్ అన్నారు. నలభై ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అవహేళనలు ఎదురైనా 14 ఏళ్లు నిరంతర పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి భారత్కు వచ్చి కంపెనీలు ప్రారంభించాలని, ఆవిష్కరణల యుగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. భారత్లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. మేధో వలస భారత్కు పెను సవాలుగా మారిందంటూ, ప్రవాస భారతీయ విద్యార్థులు దేశ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. 70 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి ఆసుపత్రిని సందర్శించారు.ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం 68 మంది రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. -
కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హైదరాబాద్ సిటీలో ఉన్న కీలక వాటర్ లాగింగ్ ఏరియాలపై దృష్టి పెట్టారు. ఏఏ ప్రాంతాల్లో, ఏ స్థాయిలో వర్షానికి, ఎన్ని నీళ్లు నిలుస్తున్నాయి? అనే అంశాన్ని గడిచిన కొన్నాళ్లుగా అధ్యయనం చేశారు. దీని ఆధారంగా జాబితాను రూపొందించారు. ఈ నివేదికను జీహెచ్ఎంసీకి పంపిన ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేయిస్తున్నారు. తొలి దశలో బేగంపేట, సైఫాబాద్ల్లో ఉన్న మూడు వాటర్ లాగింగ్ ఏరియాల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రాంతంలో పని పూర్తయిందని, మిగిలిన రెండు చోట్లా ఉన్న సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ‘సాక్షి’కి తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోఆ ప్రాంతాలు అత్యంత ఇబ్బందికరం... జీహెచ్ఎంసీ (GHMC) గణాంకాల ప్రకారం ‘గ్రేటర్’లో దాదాపు 150 వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారుల పైనే ఉండటంతో ఓ మాదిరి వర్షానికీ రోడ్లు మునిగిపోయి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ, వరద కాల్వలు అన్నిచోట్లా లేకపోవడం, ఉన్నవీ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్స్ సైతం నగర వ్యాప్తంగా ఒకేలా ఉండట్లేదు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఆ ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల చుట్టుపక్కల ఏరియాల పైనా ప్రభావం చూపుతున్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో ఇలాంటి సమస్యాత్మకమైనవి గుర్తించిన ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రాధాన్యత క్రమంలో జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నారు. కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం...నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు వాటర్ లాగింగ్ ఏరియాలు అత్యంత ఇబ్బందికరంగా మారాయి. వీటివల్ల ఆ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నారు. అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన బేగంపేట పరిధిలోని అమీర్పేట–సికింద్రాబాద్ మధ్య ఉన్న చీకోటి గార్డెన్స్తో పాటు సైఫాబాద్ పరిధిలోని ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, లక్డీకాపూల్ బస్టాండ్ వద్ద ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాయి. చీకోటీ గార్డెన్స్ వద్ద ప్రభావంతో పంజాగుట్ట, సోమాజీగూడ వరకు, మిగిలిన రెండు చోట్ల వాటర్ లాగింగ్ ప్రభావంతో ఖైరతాబాద్, నిరంకారి, అయోధ్య జంక్షన్, మాసబ్ట్యాంక్, రవీంధ్రభారతి తదితర ప్రాంతాల వరకు ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఇవి క్లియర్ కావడానికి ఒక్కోసారి గంటలు పడుతుండటంతో సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యారో సహకారంతో చీకోటి గార్డెన్స్ వద్ద... ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు జీహెచ్ఎంసీ సహకారంతో ఆయా సమస్యలకు కారణాలు అధ్యయనం చేశారు. మురుగు, వరదనీటిని కూకట్పల్లి నాలాలోకి తీసుకువెళ్లే డ్రైనేజీ చీకోటి గార్డెన్స్ వద్ద అంతకు ముందు ప్రాంతాల కంటే చిన్నగా ఉండటంతో పాటు వర్షం కురిసినప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్), బేగంపేటలోని ఓల్డ్ ఎయిర్పోర్టు నుంచి భారీగా వరదనీరు రావడం కారణంగా గుర్తించారు. దీనికి పరిష్కారం కోసం అన్వేషించిన అధికారులు అక్కడ ఉన్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (క్యారో) సహకారం తీసుకున్నారు. వారి అనుమతితో అందులో ఉన్న ఓ చెరువును అభివృద్ధి చేసి హెచ్పీఎస్, ఓల్డ్ ఎయిర్పోర్టు నుంచి వచ్చే నీటిని డైవర్షన్ కెనాల్స్ ద్వారా అందులోకి మళ్లిస్తున్నారు. ఓ గేటు ఏర్పాటు చేయడం ద్వారా చెరువు నిండిపోతే... వంతుల వారీగా నీటిని బయటకు వదులి చీకోటీ గార్డెన్స్ డ్రైనేజీపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. దీంతో అది పొంగిక వాటర్ లాగింగ్ తగ్గింది.జీహెచ్ఎంసీ సహకారంతో ముందుకు వాటర్ లాగింగ్ ఏరియాల వద్ద సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తొలి దశలో కోర్ సిటీలోని మూడు ప్రాంతాలను ఎంచుకున్నాం. జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. చీకోటి గార్డెన్స్ వద్ద సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండు చోట్లా పైప్ లైన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ప్రారంభమయ్యే లోపు ఈ రెండు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాం. – డి.జోయల్ డెవిస్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
యాక్సిడెంట్తో బయటపడ్డ అక్రమ నీటి దందా!
సాక్షి, సిటీబ్యూరో: నాగోలు ఠాణా పరిధిలోని జైపురికాలనీ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం గ్రేటర్ హైదరాబాద్లో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని బయటపెట్టింది. బోర్ల ద్వారా జరుగుతున్న నీటి దందాను వెలుగులోకి తెచ్చింది. నగరంతో పాటు మూసీ తీరం వెంట అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా భారీగా బోర్లు వేస్తున్న కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. వాటర్–ల్యాండ్–ట్రీ యాక్ట్ను (వాల్టా చట్టం) అడ్డంగా ఉల్లంఘిస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ప్రతి రోజూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా సంబంధిత విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ అక్రమ నీటి వ్యాపారం ఫలితంగా అనేక కాలనీల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. పట్టుమని పది సంస్థలూ లేవు... గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని కేవలం గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కనీసం ఒక్క ట్యాంకర్ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. ప్లాంట్ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచ్చితంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇలా అనుమతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు కనీసం పది కూడా లేకపోవడం గమనార్హం. భూగర్భ జలాలు పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందల అడుగుల బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా... సాధారణ రోజుల్లో ఈ అక్రమ నీటి దందా పగటి వేళలో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటున్నారు. భారీ పరిణామంలో బోర్లు వేసిన ఈ అక్రమార్కులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనరేటర్లు వినియోగించి మరీ నీటిని తోడేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేసేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ను దాని పరిమాణాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు కొన్ని వందల ట్యాంకర్ల నీరు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటికి ప్రముఖ హోటళ్లు, లాడ్జిలు, అపార్ట్మెంట్స్, హాస్టళ్లకు అమ్మేస్తున్నారు. వినియోగం ఎంత శ్రేయస్కరం...? ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉందని తెలుస్తోంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా వీటి నుంచి వచ్చే నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాలకు సంబంధించిన ఆనవాళ్లూ ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ నీటిని ఖరీదు చేస్తున్న హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు, అపార్ట్మెంట్స్ వాసుల్లో కొందరికి ఈ విషయం తెలిసినా తప్పక ఖరీదు చేస్తున్నారు. ఈ నీటిని తాగడానికి వాడకపోయినా ఇతర అవసరాలకు, హోటల్, లాడ్జిల్లో సరఫరాకి వాడేస్తున్నారు. మరికొందరికి ఈ ట్యాంకర్ డ్రైవర్లు విషయం చెప్పకుండా విక్రయించేస్తున్నారని సమాచారం. వేసవి కాలంలో ఉండే నీటి డిమాండ్ను ఈ బోర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమ దందాలకు మచ్చుతునకలు: ఉప్పల్ మండలంలో మూసీ తీరం వెంట అనేక చోట్ల ఈ అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. అంబర్పేట శ్మశాన వాటికను కూతవేటు దూ రంలోనూ బోర్ల ద్వారా నీటిని తోడేసి ట్యాంకర్ల ద్వారా విక్రయించే దందా నడుస్తోంది. న్యూ మార్కెట్ మెట్రోస్టేషన్ సమీపంలో, ఛే నంబర్ ఫ్లైఓవర్ మార్గంలో, శ్రీనగర్ కాలనీలో జోరుగా సాగుతోంది.చదవండి: ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు పట్టించుకోని సంబంధిత విభాగాలు...అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఈ బోర్ల ద్వారా జరుగుతున్న దందా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా కారణంగా రాజధానిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్ డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఇవి తిరిగే మార్గాల్లో రహదారులు సైతం ఛిద్రం అవుతున్నాయి. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ‘అనుమతులు లేకుండా బోర్లు వేయడం నేరం. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి. అలాంటి బోర్లు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. -
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. సర్కార్ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. సాక్షి మీడియాతో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందని కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండ్మిక్ స్టేజ్కి వచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రకటించింది. ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిందే. వృద్ధులు, కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయి’’ అని రవీందర్ నాయక్ వివరించారు.ప్రజలు పానిక్ కావొద్దు. అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలకు మార్గదర్శకాలు, సూచనలు పంపిస్తున్నాం, కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. మన దగ్గర పరిస్థితి కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రవీందర్ నాయక్ తెలిపారు. -
గాంధీ భవన్కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
పట్టాలపై మృత్యుఘంటికలు
సాక్షి, హైదరాబాద్: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ మరికొందరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్లకు రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు యథేచ్చగా పట్టాలు దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్ తమను చేరే లోపు ట్రాక్ దాటేయొచ్చనే అతివిశ్వాసం కూడా నిండు ప్రాణాలను హరిస్తోంది. నగరంలోని ఎంఎంటీఎస్, సబర్బన్ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఈ ట్రాక్లను దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు దాటాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్పురా, ఉప్పుగూడ, మలక్పేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్, బీహెచ్ఈఎల్, సికింద్రాబాద్ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మలుపులు...మృత్యు పిలుపులు ‘‘లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే క్రమంలో నేచర్క్యూర్ హాస్పిటల్, భరత్నగర్, హఫీజ్పేట్, తదితర చోట్ల ట్రాక్ మలుపులు ఉన్నాయి. ఈ రూట్లో ట్రైన్ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్ వచ్చేలోపు దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్ శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే అది వందల మీటర్ల దూరం పరుగులు తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ మలుపుల వద్దనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ట్రాక్లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి బ్రేక్ అప్లయ్ చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్ దూరంలో ఆగుతుంది. అప్పటికే ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్ లొకోపైలెట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా మేనియా.... సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్లపైన నించొని రకరకాల రీల్స్ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత ఇలాంటి సోషల్ మీడియా మేనియాలో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు సనత్నగర్ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్ పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయతి్నంచి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆరీ్పఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు.రైలు ఢీకొని అన్నదమ్ముల దుర్మరణంకాచిగూడ: రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ కమల్ కుటుంబంతో కలిసి సమీపంలోని రైలు పట్టాల వద్ద నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన మహ్మద్ షాబుద్దీన్ (26) ఎలక్ట్రికల్ షాపులో వర్కర్గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు మహ్మద్ ఫైజల్ (21) వెల్డింగ్ వర్కర్గా పని చేస్తున్నాడు. సోమవారం అన్నదమ్ములిద్దరూ గడ్డికోసం పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచి్చన రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
కాళేశ్వరంపై విష ప్రచారం ఆపాలి
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసీతెలియక మాట్లాడుతు న్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యామ్ను నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్ది. 371 పిల్లర్లు కలిగిన మూడు బరాజ్లలో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి.. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ పనులు చేపట్టడం లేదన్నారు. డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023 నాటికి రెండు పంటలకు కలిపి 2.29 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్, హరియాణాలను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని, మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చేయకూడని అప్పు, చేయకూడని తప్పులేవీ చేయలేదని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...అవకాశాల అక్షయపాత్ర తెలంగాణ‘తెలంగాణను పదేళ్ల పాలనలో అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తి డాలస్లో నూ కనిపిస్తోంది. ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్వి స్తుంది. అమెరికన్ డ్రీమ్ తరహాలో కేసీఆర్ తెలంగాణ స్వ ప్నాన్ని మహాత్ముడు, అంబేడ్కర్, మార్టిన్ లూథర్కింగ్ స్ఫూ ర్తితో ముందుకు సాగి సాకారం చేశారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం. కేసీఆర్ సీఎం అవుతారు. తెలంగాణను ప్రేమించడంలో వెనుకబడంఅధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ఉద్యమ స్ఫూర్తితో ప్రభు త్వాన్ని నడిపి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశాం. గేలి చేసిన నోళ్లతో నే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుంద నిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్వన్గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదు. ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వి తీయం. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనా డూ బతుకమ్మ, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని మర్చిపోలే దు. అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేసి అండగా నిలబడతామని కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నా.ఘనంగా రజతోత్సవ సభడాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు వేలాదిమంది హాజరయ్యారు. విదేశాల్లో బహిరంగ సభ నిర్వహణ ద్వారా బీఆర్ఎస్ కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. సభాప్రాంగణ సామర్థ్యం 7 వేల కెపాసిటీకాగా, ఫైర్కోడ్ యాక్టివేట్ కావడంతో సుమారు ఐదు వేల మంది సభా ప్రాంగణం బయటే ఉండిపోయారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో సభలు నిర్వహించే ప్రాంగణాల్లోకి నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్కోడ్ యాక్టివేట్ అవుతుంది. కాగా అమెరికా నలుమూలల నుంచి ఈ సభకు ప్రవాస తెలంగాణవాసులు, ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఈ సభా వేదికగా, బీఆర్ఎస్, తెలంగాణ విజయగాథను కేటీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శన, ధూంధాంకు నేతృత్వం వహించారు. -
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. ‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతన్న సంక్షేమానికి పెద్దపీట రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. యువతే మన భవిష్యత్తు.. యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. కులగణనతో దేశానికి ఆదర్శంగా.. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్లో ఇదొక తొలి మెట్టు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు. పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారంతెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ జరిపిన కవాతు ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు. అవార్డు అందుకున్న గద్దర్ సతీమణి.. దివంగత ప్రజాకవి గద్దర్ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. -
నోటీస్ కాదు.. నన్ను సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాపుకు రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి’ అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. రాజాసింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్తో రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’