breaking news
Hyderabad
-
యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ను కలిశానని సీఎం రేవంత్ తెలిపారు. యూరియా పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ను పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 23 వ తేదీ) గాంధీ భవన్లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్కాన్ సదస్సులో సీఎం రేవంత్రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది. -
కూకట్పల్లిలో దారుణం.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల చదువు కూడా ఇంకా పూర్తి కాని ఓ బాలుడు.. పక్కింట్లో ఉన్న ఓ అమాయక బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తనకు కావాల్సిన ఓ చిన్న క్రికెట్ బ్యాట్ (Cricket Bat) దొంగతనం చేయాలనుకునే క్రమంలో అభమూ శుభమూ తెలియని చిన్నారిని బలిగొన్నాడు. హైదరాబాద్ రాజధాని నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ అమానుష ఘటనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పదో తరగతి చదువుతున్న బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడమేంటి? అదీ నడిబొడ్డున జరగడం ఏమిటి? రేపటి పౌరులను రేపటి నేరగాళ్లుగా మారుస్తున్న ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ తలెత్తుతున్నాయి.దొంగతనానికి వెళ్లే ముందు తాను పక్కాగా ప్లాన్ చేసుకున్నానని.. అవసరమైతే హత్య ఎలా చేయాలి? అనేది కూడా ముందే ఆలోచించానని కూకట్పల్లిలో (Kukatpally) బాలిక హత్య కేసు నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. ఆ బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు కూడా ఉందనీ వెల్లడైంది. దీంతో ఈ తరహా క్రైమ్ నేపథ్య సినిమా/సిరీస్ల ప్రభావంపై చర్చ మొదలైంది. మోగుతున్నాయ్.. డేంజర్ బెల్స్ కోవిడ్ 19, లాక్ డౌన్ ప్రభావంతో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు.. ఇలా ఇంటర్నెట్కు అనుసంధానిత పరికరాల వాడకం పెరిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా సులభంగా యాక్సెస్ చేయడం వల్ల వెబ్ సిరీస్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి చాలా మందికి ఒక రకమైన వ్యసనంలా మారిపోయాయి. వెబ్సిరీస్తో సమస్య ఏమిటంటే.. సిరీస్ నచ్చితే వీక్షకులు ఒక ఎపిసోడ్ చూసి ఆపడం సాధ్యం కాక మొత్తం సిరీస్ను చూస్తున్నారు. పరిశోధనలు చెబుతోందదే.. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్కు చెందిన క్రిమినాలజీ రిసెర్చర్స్ చేసిన పరిశోధనలో కేవలం వెబ్ సిరీస్ చూడడం వల్ల 34 శాతం మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, భయాందోళనలకు రాత్రివేళ పీడ కలలకు గురవుతున్నారని తేల్చారు. క్రైమ్ కంటెంట్ చూసిన ప్రతీ నలుగురు టీనేజర్లలో ఒకరు అభద్రతకు లోనవుతున్నారని, క్రిమినల్స్ను హీరోలుగా అపోహపడే ప్రమాదం పెరుగుతోందని స్పష్టం చేసింది. ఈ తరహా క్రైమ్ కంటెంట్ పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికలతో వస్తున్నప్పటికీ చిన్నారులు (Kids) మాత్రం సులభంగానే చూడగలుగుతున్నారని వెల్లడించింది. చదవండి: కూకట్పల్లి కేసు.. పోలీసులు ఏం చెప్పారంటే..? పర్యవేక్షణే శరణ్యం.. ఈ నేపథ్యంలో కొందరు పిల్లల్లో అభద్రతా భావం పెరుగుతుంటే.. మరికొందరిలో నేర పూరిత మనస్తత్వం విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. వారిని స్క్రీన్ వీక్షణ నుంచి మళ్లించి ఆరోగ్యకరమైన ఆటలు, హాబీల వైపు దృష్టి నిలిపేలా చేయడం, అలాగే క్రైమ్ కంటెంట్ను చిన్నారులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అదీ ఒక కారణమే.. కాని అదే కారణం కాదు... హింసాత్మక ప్రవృత్తికి కేవలం సోషల్ మీడియా (Social Media) మాత్రమే కారణం అని చెప్పలేం. అయితే.. అదీ ఒక కారణమే. సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలకు ఇవి ప్రేరకంగా పనిచేస్తాయని అనొచ్చు. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు కూడా అగ్రెసివ్ నెస్ను పెంచుతాయి. ఏదేమైనా ఈ స్వభావాన్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. – డా.చరణ్ తేజ్, న్యూరో సైక్రియాట్రిస్ట్ -
సహస్ర తల్లి సంచలన ఆరోపణలు.. వాళ్ల పాత్ర కూడా ఉంది!
సాక్షి, హైదరాబాద్: తమకు న్యాయం చేయాలంటూ సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పారు. ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూకట్పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.తమకు న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుంటామంటూ సహస్ర తల్లి హెచ్చరించారు. న్యాయం చేసేవరుకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని.. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? తమ కుమార్తె హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర తల్లి ఆరోపిస్తోంది.బాలిక సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదని.. అతడికి ఉరిశిక్ష వేస్తేనే తన కూతురికి ఆత్మ శాంతి కలుగుతుందన్నారు. తన కూతురిని హత్య చేసి పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. ‘‘నా కూతురిని చంపేసి.. నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. కఠిన శిక్ష విధించాలి’’ అని సహస్ర తండ్రి డిమాండ్ చేశారు. సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు.కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది.వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. -
క్లబ్హౌస్లోనే.. సేఫ్టీ లాకర్!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయులకు సంపద అనేది కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాదు.. అదో భావోద్వేగాలతో ముడిపడిన అంశం కూడా.. అందుకే సంపాదించడమే కాదు సంపదను భద్రపరుచుకునేందుకూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. బ్యాంక్లు, ప్రైవేట్ సంస్థలు సేఫ్టీ లాకర్ల సేవలు అందిస్తున్నా.. వాటి పనిదినాల్లో తప్ప 24/7 వాటిని వినియోగించుకోలేం. అలా కాకుండా క్లబ్హౌస్లో, నివాస సముదాయంలోనే సాయుధ దళాల వంటి భద్రత ఉంటే ఎంత బాగుంటుందో కదూ. ఈమేరకు దేశంలోనే తొలి సేఫ్టీ డిపాజిట్ లాకర్ సేవల సంస్థ ఆరంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సత్త్వా గ్రూప్ చేతులు కలిపింది.ఎంత విలాసవంతమైన నివాస సముదాయంలో ఉన్నా సరే బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలకు భద్రత విషయంలో కాస్త భయాందోళనలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా నివాస సముదాయాలలో జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా వంటివి ఉంటాయి. కానీ, నివాసితుల సంపదకు భద్రత, సౌకర్యవంతం కలిగించడం వసతుల్లో భాగమే. కస్టమర్ల సంపదకు గోప్యత, సౌలభ్యం, ఆనందం, భద్రత అందించడమే వీటి ప్రత్యేకతలు.భద్రత, బీమా.. బీఐఎస్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మిలిటరీ గ్రేడ్ వాల్ట్తో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ప్రతీ లాకర్కు బయోమెట్రిక్ ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా చొరబడితే గుర్తించే నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రతి లాకర్కు రూ.కోటి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే లాకర్ లోపల ఏముందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. దీంతో మీ సంపద ఎల్లవేళలా మీ నియంత్రణలోనే ఉంటుంది.కస్టమర్ల బంగారం, వజ్రాలు వంటి ఆభరణాలను సేఫ్టీ లాకర్లో భద్రపరిచే ముందు, తర్వాత వినియోగించిన ప్రతీసారి మీ కళ్లముందే తూకం వేస్తారు. ఏళ్ల పాటు బ్యాంక్ లాకర్ల వెయిటింగ్ జాబితాలు ఉండటం, అధిక విలువ డిపాజిట్లు, యాక్సెస్ పరిమితంగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి.అయితే వీటిల్లో మాత్రం కమ్యూనిటీలోని క్లబ్హౌస్లోనే ఈ సేఫ్టీ లాకర్ ఉంటుంది. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నివాసితులకు 24/7 అందుబాటులో ఉంటుంది. అందులోనే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది. దీంతో ఆభరణాల వంటివి అలంకరించుకొని బయటకు రావొచ్చు. -
నెల క్రితమే ప్లాన్.. హత్య అలా జరిగింది: సీపీ మహంతి
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్లో రాసుకున్నాడు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడు. బ్యాట్ కోసం సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడ్డాడు. నిందితుడికి క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. క్రైం సినిమాల ద్వారా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, సీన్స్ చూసి ప్రభావితం అయ్యాడు. ఈ ఘటనలో తల్లికి అనుమానం వస్తే ఆమెపై ప్రామిస్ చేసి బాలుడు నమ్మించాడు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు దొరికాయి. కత్తిని బాలిక ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకులు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్లో వేశాడు. చాలా సంక్లిష్టమైన కేసు ఇది. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నిందితుడిని జువైనల్ హోంకు తరలించాం. నిందితుడి కోసం ఐదు బృందాలు గాలించాయి’ అని చెప్పుకొచ్చారు. బాలిక తండ్రి ఆవేదన.. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. అతను మేజర్. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. నా కూతురిని చంపేసి నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. ప్రభుత్వం అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కూకట్పల్లి కేసు.. ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.ఇది కూడా చదవండి: సహస్ర హత్యపై సీపీ మహంతి.. సంచలన విషయాలు వెల్లడి.. ఇక, కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్పల్లి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మెషిన్లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం. -
ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం
తమకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేరైతే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ప్రాంతం, ప్రాజెక్ట్, బడ్జెట్తో పాటు ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా, వారి వారి వెసులుబాటు బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. – సాక్షి, సిటీబ్యూరోసొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే.. మరికొందరు ఉద్యోగ విరమణ వయసు నాటికి గానీ కొనుక్కోలేరు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. కనీసం ఐదారేళ్ల ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక చేస్తేనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను పలువురు డెవలపర్లు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ముందు నుంచే పక్కా ఆర్థిక ప్రణాళికంగా వ్యహరించాలి.పొదుపు చేస్తేనే.. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతినెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. కనీసం నెలకు రూ.10 వేల నుంచి, ఆ తర్వాత ఎవరి ఆదాయాన్ని బట్టి ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్పేమెంట్కు అవసరమయ్యే 15–20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణాన్ని తీసుకోవచ్చు.బడ్జెట్ను బట్టే నిర్ణయం.. ప్రతినెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగస్తులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టీలు వేయడం, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేయడం వంటి మార్గాలను అన్వేషించాలి. అంతేకాకుండా బ్యాంక్లు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇంటి బడ్జెట్ ఎంతో ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. -
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చొరవకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా కేతిరెడ్డి ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. తన చొరవతో సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలలో ముగింపు పలకలని అధికారులను ఆదేశించి, తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవ్వరు చెడగొట్టాలని ప్రయత్నించినా సహించేది లేదన్న సంకేతం ఇచ్చారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్ చేయాలన్న తన కోరికకు ఈ సమ్మె ఒక అడ్డంకిగా ఉందని ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తదితరులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు.అదేవిధంగా ఎన్నో రోజులుగా సతమతమవుతున్న సినీ కార్మికుల సమస్యలు, చిత్రపురి కాలనీ వ్యవహారంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమాలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్టర్ వద్ద లెక్కలు సమర్పించకుండా ఉన్న వారిపై, దొంగ సభ్యులను చేర్చుకొని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాటిని సొసైటీస్ రిజిస్టర్ వద్ద సమర్పించని ట్రేడ్ యూనియన్ సంఘాలపై విచారణ చేపట్టాలన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని మాజీ వింగ్ కమాండర్ సందీప్ సింగ్ జగ్గి అన్నారు. శుక్రవారం మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ చర్చించేందుకు ఇలాంటి వేదిక ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ సెషన్స్లో నగరంలోని 40 పాఠశాలల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. వీరు వివిధ దేశాల రాయబారులుగా, ప్రతినిధులు ఆయా దేశాల్లోని నిధులు, నియామకాలు, సమస్యలు, పర్యావరణ సమస్యలు, సహజ వనరులపై చర్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తొలి రోజు తమ దేశాల ఎజెండాలను ప్రవేశ పెట్టి ఒక్కో అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్
వనస్థలిపురం: వనస్థలిపురం కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ ఎస్.రాజేష్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్టేషన్కు సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
Hyderabad: ప్రభుత్వ స్తంభాలపై ప్రైవేటు ఆధిపత్యం
సాక్షి, హైదరాబాద్ : సరఫరా చేసే ప్రతి యూనిట్ను పక్కాగా లెక్కించే సామర్థ్యం కలిగి ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. తన అ«దీనంలో ఉన్న విద్యుత్ స్తంభాలపై ఇప్పటికీ ఓ స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఏ సర్కిల్ పరిధిలో ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి? ఎన్ని మీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి? ఏ స్తంభంపై ఏయే కంపెనీలకు చెందిన ఎన్ని కేబుళ్లు వేలాడుతున్నాయి? వంటి కనీస వివరాలను సేకరించకపోవ డాన్ని పరిశీలిస్తే.. ఆడిట్ విషయంలో డిస్కం ఇంజినీర్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుంగిపోతున్న స్తంభాలు గ్రేటర్లో 33/11కేవీ సబ్స్టేషన్లు 498 ఉండగా, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 ఉన్నాయి. 33కేవీ యూజీ కేబుల్ లైన్లు 1,280 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, 33 కేవీ ఓవర్హెడ్లైన్లు 3,725 కిలోమీటర్లు, 11 కేవీ ఓవర్హైడల్ లైన్లు 21,643 కిలోమీటర్లు, 11కేవీ యూజీ కేబుల్ లైన్లు 957 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 1,50,992 ఉండగా, వీటి పరిధిలో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఫీడర్ నుంచి డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు వచ్చే 11 కేవీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి గృహానికి విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఎల్టీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో కూడా సరైన లెక్కలేదు. High Court Orders Removalనిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు 12 మీటర్లకుపైగా ఉండేవి. సిమెంట్ పోల్స్ వచి్చన తర్వాత ఎత్తు తగ్గించారు. వాటికి సపోరి్టంగ్ వైర్లను కూడా తొలగించారు. సాధారణంగా 11 కేవీ విద్యుత్ స్తంభం ఎత్తు తొమ్మిది మీటర్లపైగా ఉండగా అదే 33 కేవీ స్తంభం పది మీటర్లకుపైగా ఎత్తు ఉంటుంది. మెజార్టీ సరీ్వసు ప్రొవైడర్లు ఐదారు మీటర్ల ఎత్తు నుంచే వైర్లను రోడ్డుకు అటు ఇటుగా ఉన్న గృహాలకు లాగుతున్నారు. లైన్ వేయగా మిగిలిన వైర్లను ఉండలుగా చుట్టూ స్తంభాలకు వేలాడదీస్తున్నారు. ఇలా ఒక్కో స్తంభానికి 500 కేజీల బరువు ఉన్న తీగలు వేలాడుతున్నాయి. సామర్థ్యానికి మించిన బరువును తట్టుకోలేక ఆయా స్తంభాలు ఏదో ఒక వైపు వంగి కన్పిస్తున్నాయి. పర్యవేక్షణ లేదు.. ప్రమాణాలు పాటించరుకరెంట్ సరఫరా, లైన్లు పర్యవేక్షణ, రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక ఆడిట్ ఉంది. గ్రేటర్లో స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ సరీ్వసు ఆపరేటర్లు 30 మందికిపైగా ఉన్నట్లు అంచనా. నిజానికి విద్యుత్ సంస్థ కంటే ఇంటర్నెట్, స్టార్ కేబుళ్ల ఆదాయం ఎక్కువ. లైన్లు, కేబుళ్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ సంస్థకు కొన్ని కచి్చతమైన ప్రమాణాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ కేబుల్ ఆపరేటర్లకు, సరీ్వసు ప్రొవైడర్లకు కనీస భద్రత ప్రమాణాలు, నియమ నిబంధనలు లేవు. వీరి పని తీరుపై పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం కూడా లేదు. మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కేబుళ్లు కొనుగోలు చేసి విద్యుత్ స్తంభాలపై వేలాడదీస్తున్నారు. ఈదురు గాలితో కూడిన వర్షాలకు తరచూ తెగిపడుతుండటంతో వాటికి సపోరి్టంగ్ కోసం జే వైర్లతో అనుసంధానిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్తంభాలకు జంక్షన్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అక్రమంగా కరెంట్ వాడుతున్నారు. ఈ విషయం ఇటు క్షేత్రస్థాయి ఇంజినీర్లు మొదలు..సీఎండీ వరకు తెలుసు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఆపరేటర్పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా రామంతాపూర్, అంబర్పేట్, బండ్లగూడ ఘటనలతో అప్రమత్తమైన డిస్కం.. స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించే పని మొదలు పెట్టింది. అయితే.. ఇప్పటికే డిస్కం నిర్ణయించిన చార్జీలు చెల్లించి, స్తంభాల ద్వారా కేబుళ్లను ఏర్పాటు చేసుకున్న సరీ్వసు ప్రొవైడర్లు డిస్కం ఇంజినీర్ల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అన్ని అనుమతులు తీసుకున్న తమ కేబుళ్లను కూడా తొలగించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 1.73 లక్షల స్తంభాలకే అనుమతులు.. నగరంలో ఎల్టీ 11కేవీ, 33 కేవీ సహా అన్ని రకాల విద్యుత్ స్తంభాలు 20 లక్షలకుపైగా ఉన్నట్లు డిస్కం ప్రకటించింది. వీటిలో 1.73 స్తంభాల వినియోగానికి మాత్రమే ఆయా సరీ్వసు ప్రొవైడర్లకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కో–యాక్సిల్ (లోపల మెటల్ కండక్టర్తో ఇన్సులేషన్ ఉన్న కేబుల్ టీవీ వైర్) కేబుల్స్ వాడుతున్నట్లు తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను విద్యుత్ స్తంభాలపై వేయడం సహా భద్రతా చర్యలను అమలు చేయడం ఆయా ఏజెన్సీదే పూర్తి బాధ్యత. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసిన విద్యుత్ స్తంభాలను సులభంగా గుర్తించేందుకు వాటిపై పెయింటింగ్ తప్పనిసరిగా చేయాలి. విద్యుత్ స్తంభాలపై బ్యాక్హాల్ ఎక్విప్మెంట్ వంటి అదనపు పరికరాలను ఇన్స్టాల్ చేయరాదు. అనుమతించిన సంఖ్యకు మించి స్తంభాలను ఉపయోగించకూడదు. సమీపంలోని లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను డైరెక్ట్ ట్యాపింగ్ చేయరాదు. కానీ.. అనేక ప్రదేశాలలో కేబుల్స్ కిందికి 5 అడుగుల ఎత్తులో వదిలేస్తున్నారు. కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, బోర్ డ్రిల్లింగ్ వంటి భారీ వాహనాలు రోడ్డును దాటేటప్పుడు తక్కువ ఎత్తులో వేయబడిన ఈ కేబుల్స్ వల్ల విద్యుత్ నెట్వర్క్కు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐఎస్పీలు, కేబుల్ ఆపరేటర్లు కొత్త కనెక్షన్ కోసం కేబుల్ వేస్తున్నారే కానీ ఇప్పటికే పాడైన, వినియోగంలో లేని కేబుల్స్ను తొలగించట్లేదు. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతి తీసుకున్న కేబుళ్లను కూడా గుర్తించే పరిస్థితి లేకపోవడంతోనే అన్ని తీగలను తొలగించాల్సి వస్తోందని డిస్కం స్పష్టం చేస్తోంది. -
ఇచ్చంపల్లికి షరతులతో తెలంగాణ సమ్మతి
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీళ్లను తరలించాలనే ప్రతిపాదనలకు తెలంగాణ షరతులతో సమ్మతి తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్ వల్ల దిగువన ఉన్న సమ్మక్క సాగర్పై ఏ ప్రభావం పడదని అధ్యయనాల్లో తేలిన తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. దేవాదుల కింద 38 టీఎంసీలు, సీతారామ కింద 67 టీఎంసీలు, సమ్మక్క సాగర్ కింద 47 టీఎంసీల నీళ్లను తాము వినియోగించుకున్న తర్వాత మిగిలే నీళ్లను గోదావరి – కావేరి అనుసంధానంలో భాగంగా తరలించేందుకు ఉన్న అవకాశాలపై సిమ్యులేషన్ స్టడీస్ జరిపి.. సానుకూల ఫలితాలు వస్తేనే ముందుకు వెళ్ళాలని సూచించింది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్్కఫోర్స్ శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్కుమార్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అధికారులు ప్రత్యక్షంగా హాజరుకాగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు వర్చువల్గా హాజరయ్యారు. తెలంగాణ తరఫున హాజరైన వారిలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుబ్రమణ్యం ప్రసాద్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్ ఉన్నారు. ఏపీ జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ హాజరయ్యారు. కేంద్రం నిధులతో 2 జలాశయాలు కట్టించాలి జాతీయ ప్రయోజనాలు ఇమిడిలేని ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వరాదని, గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తరలించే నీటిలో 50 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని రాహుల్ బొజ్జా కోరారు. ఇచ్చంపల్లి బరాజ్ కడితే అక్కడి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అనుసంధానం ద్వారా లభించే రాష్ట్ర వాటా జలాలను ఎక్కడైనా వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నీళ్లను నిల్వ చేసేందుకు రెండు జలాశయాలను కేంద్ర నిధులతో కట్టించి ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత మేర ముంపును తగ్గించాలని సూచించారు. ఇచ్చంపల్లి నుంచి తరలించే జలాలను నాగార్జునసాగర్లో కాకుండా దిగువన 7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న సాగర్ టెయిల్ పాండ్లో వేయాలన్నారు. ఏపీ ఇంట్రా లింక్ ప్రాజెక్టులపై అభ్యంతరం ఇదే ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఎన్డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్లను సమరి్పంచాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని కోరడంపై రాహుల్ బొజ్జా తీవ్ర అభ్యంతరం తెలిపారు. కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా గోదావరి–బనకచర్ల ఆనుసంధానం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాకే.. ఈ నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఏపీ ప్రతిపాదించిందని సమావేశం దృష్టికి తెచ్చారు. అనుసంధానం ప్రాజెక్టుపై సమ్మతి తెలుపుతూ అవగాహన ఒప్పందంపై.. అందరి సమ్మతి, అధ్యయనాల తర్వాతే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పరీవాహకంలో రాష్ట్రంలో 968 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు సత్వరంగా క్లియరెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం నుంచే చేపట్టాలి: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ కోరింది. గోదావరిలో నీటి లభ్యతపై 2023 జూన్లో సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగానే గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించారంటూ అభ్యంతరం తెలిపింది. ‘అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కృష్ణాబేసిన్లో గోదావరి నీళ్లు వేస్తే.. బేసిన్పై ఆధారపడిన ఇతర రాష్ట్రాలూ వాటాలు కోరే అవకాశం ఉంది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ అధ్యయనాల్లో తేడా ఉంది. అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఏపీ కోరింది. కనీసం 40 టీఎంసీలైనా ఇవ్వండి: కర్ణాటక ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తమకు కనీసం 40 టీఎంసీలను కేటాయించాలని కర్ణాటక కోరింది. ‘పూడికతో తుంగభద్ర జలాశయం 30 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. బెడ్తి – వర్ధా అనుసంధానంతో ఏ మా త్రం ప్రయోజనం లేదు. తుంగభద్ర ఎగువన మరో లింకు ప్రతిపాదిస్తాం..’ అని తెలిపింది. 48% పరీవాహకం ఉన్నా నీళ్లు ఇవ్వరా?: మహారాష్ట్ర ‘గోదావరిలో 48 శాతం పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలోనే ఉన్నా మా రాష్ట్రానికి ప్రాజెక్టు కింద నీళ్లు కేటాయించలేదు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కు నీళ్లను తరలిస్తే ఆ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలకు ఆ నీటిపై హక్కు ఉంటుంది. దాని ప్రకారం నీటి కేటాయింపులు చేయాలి..’ అని మహారాష్ట్ర కోరింది. మా వాటా నీళ్లన్నీ వాడుకుంటాం: ఛత్తీస్గఢ్ ’గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన మా వాటా నీళ్లను పూర్తిగా వాడుకుంటాం. మాకు గోదావరిలో 301 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 163 టీఎంసీల వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలు ఉన్నాయి. 100 టీఎంసీలతో బోధఘాట్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం..’ అని ఛత్తీస్గఢ్ పేర్కొనగా, సీడబ్ల్యూసీ జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు కదా? వేరే నీటి అవసరాలు లేవుగా? అని ప్రశ్నించింది. దీంతో ఛత్తీస్గఢ్ స్పందిస్తూ.. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్తో నాలుగు గ్రామాలు, 170 హెక్టార్ల భూమి ముంపునకు గురి అవుతాయని పేర్కొంది. వెంటనే పనులు చేపట్టాలి: తమిళనాడు అనునంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతూ ఇప్పటికే సంతకాలు చేశామని, కావేరీ తీవ్ర లోటు బేసిన్ అని, తక్షణమే ప్రాజెక్టు పనులు చేపట్టాలని తమిళనాడు కోరింది. తమకు 24 టీఎంసీలు కాదని, 74 టీఎంసీలు కేటాయించాలని పుదుచ్చేరి విజ్ఞప్తి చేసింది.గోదావరి నీటిని వాడుకోం: సీడబ్ల్యూసీ చైర్మన్ ‘గోదావరి–కావేరీ అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలు చుక్క కూడా వాడుకోము. హిమాలయన్ కాంపోనెంట్ నుంచి నీటిని తీసుకొచ్చి గోదావరిలో వేసి ఆ నీళ్లను తరలిస్తాం. రాష్ట్రాలన్నీ పెద్ద మనసుతో, ఉదార స్వభావంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించాలి. ప్రస్తుతం గోదావరిలో ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం. ఛత్తీస్గఢ్ గనుక తమ పూర్తి వాటా నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రాజెక్టులను నిర్మించుకుంటే తరలింపును నిలిపివేస్తాం. అయితే మరో 15 ఏళ్లయినా ఛత్తీస్గఢ్ తన వాటాను వాడుకునే అవకాశాల్లేవు..’ అని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్కుమార్ జైన్ అన్నారు. -
జడ్జీలపై వ్యక్తిగత ఆరోపణలు ప్రమాదకరం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులపై విమ ర్శలు చేయడం, దూషించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిందని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిన్ మౌషుమీ భట్టాచార్య ఆవేదన వ్యక్తంచేశారు. అసంతృప్తికి గురైన న్యాయ వాదులు, క్లయింట్లు జడ్జీలపై ఆరోపణలు చేయడమే కాకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలని బెదిరించే స్థాయికి దిగజారుతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, అనిశ్చితికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కేసులో ముగ్గురి క్షమాపణలను అనుమతిస్తూ న్యాయ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిపై గతంలో నమోదైన అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మౌషుమి భట్టాచార్య వివక్షతో వ్యవహరించారని పిటిషనర్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. దానిని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 11న కొట్టివేసింది. పిటిషనర్తోపాటు ఆయన తరఫు న్యాయవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. జస్టిస్ మౌషుమి భట్టాచార్యకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ మౌషుమి భటాచార్య ధర్మాసనం ముందు శుక్రవారం పెద్దిరాజు, రితీశ్పాటిల్, నితిన్ మేష్రమ్ భేషరతుగా క్షమాపణ చెప్పారు. అప్పీల్లో వాడిన భాషకు చింతిస్తున్నామని తెలిపారు. ఆ అఫిడవిట్ను న్యాయమూర్తి అనుమతించారు.న్యాయమూర్తులకు వేదిక లేదుతనపట్ల సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరుకు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య కృతజ్ఞత తెలిపారు. జడ్జీలపై దాడులు చేసేవారు ఇష్టారాజ్యంగా మీడియాలో ఒక క్లిక్తో ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తన వాదన వినిపించేందుకు సంబంధిత న్యాయమూర్తికి వేదికే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాన్ని కాపాడటంలో జడ్జీలది కీలక పాత్ర అని, వారిపై దాడులు కోర్టుల గౌరవానికి భంగం కలిగిస్తాయని అన్నారు. న్యాయమూర్తి పదవి అంటే చైర్మన్ అధికారం కాదని.. మనస్సాక్షి, నిబద్ధత, కరుణతో న్యాయం అందించే బాధ్యత అని స్పష్టంచేశారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కోర్టులు న్యాయం అందించడంలో పతాకధారులుగా నిలుస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. -
టెన్త్ క్లాస్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆ బాలుడికి క్రికెట్ బ్యాట్పై మక్కువ... ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు కొనివ్వలేదు... పక్క భవనంలోని స్నేహితుడి ఇంటి నుంచి ఆ బ్యాట్ చోరీకి స్కెచ్ వేశాడు. ఒకవేళ బ్యాట్ కనిపించకపోతే అందినకాడికి డబ్బు దోచుకొని ఆ సొమ్ముతో బ్యాట్ కొనుక్కుందామనుకున్నాడు. చోరీ అనంతరం ఇంటిని గ్యాస్ లీక్తో తగలబెట్టాలని వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని మరీ కుట్రపన్నాడు.అయితే చోరీ చేస్తుండగా ఆ ఇంటి యజమాని కుమార్తె చూడటంతో తప్పించుకోవడం కోసం ఆమెను దారుణంగా హతమార్చాడు. కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను చంపిన పదో తరగతి బాలుడి వ్యవహారమిది. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్ప లు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు.పుట్టిన రోజున వచ్చి కేక్ తినిపించి...పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చి కూకట్పల్లి దయార్గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. భర్త గతంలో చిరుద్యోగం చేసి మానేయగా భార్య కొన్నాళ్ల క్రితం వరకు కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివే వారి కుమారుడు (15) సక్రమంగా బడికి వెళ్లకుండా టీవీ, ఓటీటీల్లో వచ్చే క్రైమ్, హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు.కొన్నాళ్లుగా ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్కు చెందిన చానల్ వీక్షిస్తున్నాడు. తమ ఇంటికి ఆనుకొని ఉన్న మూడంతస్తుల భవనంపై ఉన్న పెంట్ హౌస్లో సహస్ర అనే బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి సింగిల్ బెడ్రూం ఇంట్లో నివసిస్తోంది. పక్కపక్క భవనాల్లో ఉండటంతోపాటు ఆమె సోదరుడు కూడా బాలుడు చదివే పాఠశాలలోనే చదువుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టిన రోజు వేడుకకు సైతం హాజరైన బాలుడు.. ఆమెకు కేక్ కూడా తినిపించాడు.క్రికెట్ కిట్ కొనివ్వని కారణంగా...సహస్ర సోదరుడితోపాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి బాలుడు తరచూ క్రికెట్ ఆడేవాడు. కొన్నాళ్ల క్రితమే సహస్ర సోదరుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ఓ క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడంతో తనకు కూడా క్రికెట్ బ్యాట్ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని పలుమార్లు అడిగాడు. వారు కొనకపోవడంతో సహస్ర ఇంట్లో చోరీకి స్కెచ్చేశాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటం వల్ల ఆ ఇంట్లో ఏవి ఎక్కడు న్నాయో తెలిసిన బాలుడు.. ఆ ఇంట్లో ఎవ్వరూ లేనివేళ బ్యాట్ కాజేసి.. ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు గ్యాస్ లీక్ ద్వారా ఇంటికి నిప్పంటించాలని కుట్ర పన్నా డు. ఇందుకోసం వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని చివర్లో ‘మిషన్ డన్’ అని రాశాడు. పాఠశాలకు సెలవులు కావడంతో...చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18న సహస్ర, ఆమె సోదరుడు స్కూళ్లకు వెళ్లిపోతారని.. తండ్రి మెకానిక్ షాపుకి, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే సహస్ర చదువుతున్న బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయాలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో నాలుగు రోజులు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు.. తమ భవనం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వచ్చి సైడ్ వాల్ మీదుగా సహస్ర కుటుంబం ఉంటున్న భవనం మూడో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి పెంట్హౌస్కు చేరుకున్నాడు.తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలకు వెళ్లి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన సహస్ర బాలుడిని చూసింది. ఆమె అరిస్తే పట్టుపడతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన వద్ద ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్ప టికీ చావలేదని భావించిన నిందితుడు.. ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి వచ్చిన మార్గంలోనే తన ఇంటికి పారిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకొని రక్తం మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్లాడు.కత్తి, లేఖను దాచి... రక్తం మరకలు దుస్తుల్ని వాషింగ్ మెషీన్లో పడేసి ఆన్ చేశాడు. ఆపై ఏమీ ఎరగ నట్లు తండ్రితో కలిసి పెంపుడు కుందేలును పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో లంచ్ బాక్స్ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి.. కుమార్తె రక్తపుమడుగులో మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులనూ తప్పుదోవ పట్టించి..ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితోపాటు ఈ బాలుడినీ విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలా అతను.. సహస్ర ఇంటి నుంచి డాడీ, డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పి బాలిక తండ్రినే అనుమానితుడిగా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు.. క్షుద్రపూజల అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేశారు.ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచి్చన సమాచారంతో... స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఈ బాలుడి వ్యవహార శైలిపై అనుమానం వచి్చంది. దీంతో ఆయన ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం ఆ బాలుడు చదివే పాఠశాలకు వెళ్లిన పోలీసులు సహస్ర హత్య విషయమై ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు.దీంతో కత్తి, రక్తం మరకలతో ఉన్న దుస్తులు, లేఖ లభించాయి. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆంగ్లంలో 11 లైన్లలో రాసి ఉన్న ఆ లేఖలో ‘ఫస్ట్ గో హోం... అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్ అండ్ నెక్ట్స్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్’అంటూ లేఖలో రాసి ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు చోరీ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చాలని కుట్రపన్నినట్లు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై శనివారం అధికార ప్రకటన చేయనున్నారు. -
25న రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 25వ తేదీ మధ్యా హ్నం 2 గంటల కు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్ని కలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కాళేశ్వరం కమిషన్ నివే దిక తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించి, పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించే విషయంపై నిర్ణ యం తీసుకోనున్నట్లు తెలిసింది. యూరియా కొరతపై కూడా చర్చించనున్నట్లు సమా చారం.ముఖ్యంగా హైకోర్టు తీర్పు మేరకు వచ్చే నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహించాల్సి ఉన్నందున.. ఈ ఎన్నికల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవ కాశం ఉంది. శనివారం జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వెల్లడయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్లో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు కూడా ఈ సమావే శంలోనే ఖరారు కానున్నాయి. ఈ నెల 29 నుంచి లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సమావేశాలు వారం పాటు నిర్వహిస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశాలే ఎజెండాగా సమావేశా లు ఉంటాయని తెలిసింది. ఘోష్ కమిషన్ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలు, హైకోర్టు లో కౌంటర్ దాఖలుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. -
యూరియా పక్కదారిపై బదులివ్వాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణకు పంపుతున్న యూరియా పక్కదారి ఎలా పడుతోందో, ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తోందో సమాధానం చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క బస్తా కూడా అధిక ధరలకు అమ్మకుండా చూడాలని.. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసే దురుద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.రైతులకు సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో 2.04 లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్గా ఉందని కిషన్రెడ్డి చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు విత్తనాలు వేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదని ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ కేంద్రం 11 ఏళ్లుగా రైతులపై భారం వేయకుండా రాష్ట్రానికి సుమారు రూ. 80 వేల కోట్ల ఎరువుల సబ్సిడీని భరించిందన్నారు.రూ. 2,650 విలువైన ఒక్కో యూరియా బస్తాను రూ. 265 సబ్సిడీ ధరకే రైతులకు అందిస్తుంటే దాన్ని రూ. 400కి వారు కొనాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందని కిషన్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అసలు కుట్ర ఎవరిదో బదులివ్వాలని నిలదీశారు. పెద్ద రైతులు వారి దగ్గర ఎక్కువ యూరియా ఉంచుకోవద్దని.. అవసరమైన యూరియాను అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయం వద్ద నిరసనలకు భయమెందుకు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా సెపె్టంబర్ 17న ‘తెలంగాణ లిబరేషన్ డే’ను హైదరాబాద్లో నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విముక్తి దినాన్ని కేంద్రం తరఫున ఘనంగా నిర్వహిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజాసమస్యలు, నగరాభివృద్ధి అంశాలపై బీజేపీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు, భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.హైదరాబాద్లో మౌలిక సమస్యల పరిష్కారానికి జైలుకెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సెపె్టంబర్ 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే పోరాటానికి బీజేపీ రాష్ట్రశాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల లోపు సిపార్సులను అన్నీ అమలు చేస్తామని ఇచి్చన హామీ అటకెక్కిందని విమర్శించారు.ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ప్రస్తుతం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ మొత్తాల విత్డ్రాపైనా మారిటోరియం విధించడం దారుణమన్నారు. -
సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజునే తండ్రికి కొడుకు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి చోటుచేసుకున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులతో కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు కన్నీటిపర్యంతం కావడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి హృదయం పగిలిపోయిందని.. దీనికి బాధ్యులెవరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడింది. వైర్లతో విద్యుత్ స్తంభాలు, మామూళ్లతో కొందరి జేబులు బరువెక్కి కిందకు వంగుతున్నాయని చురకలంటించింది. అనుమతి లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.అనుమతి ఉన్నా ప్రమాదకరంగా ఉంటే వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని రామంతాపూర్లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర సందర్భంగా భక్తులు లాగుతున్న రథానికి విద్యుదాఘాతం జరిగి ఐదుగురు మృతి చెందడం, పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. దీన్ని సవాల్చేస్తూ భారతీ ఎయిర్టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కరెన్సీ నోట్లు మాత్రం కనిపిస్తాయ్.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామని.. ప్రభుత్వం నోటీసు జారీ చేయకుండా నగరమంతా కేబుళ్లను కట్ చేయడం సరికాదన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫున శ్రీధర్రెడ్డి వాదిస్తూ నగరంలో దాదాపు 20 లక్షలకుపైగా స్తంభాలుంటే 1.70 లక్షల స్తంభాలపైనే కేబుళ్ల ఏర్పాటుకు అనుమతులున్నాయన్నారు.పరిమితికి మించి కేబుళ్ల వల్ల స్తంభాలు వంగిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మామూళ్లతో కొందరి జేబులు కూడా బరువెక్కి వంగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అనుమతులున్న కేబుల్ ఏజన్సీలు అనధికారిక కేబుళ్ల తొలగింపు విషయంలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు.స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున ఏవి అనుమతులున్నవో ఏవి లేనివో గుర్తుపట్టడం కష్టంగా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. అనుమతులు తీసుకోని సంస్థలు ఇచ్చిన కరెన్సీ నోట్లు మాత్రం అక్రమార్కులకు బాగా కనిపిస్తాయని చురకంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆరు కుటుంబాలు అనుభవిస్తున్న వేదనకు సమష్టి బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
చర్చించాకే చర్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కమిషన్ నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రిమండలి నిర్ణయించినప్పుడు.. అంతకుముందే మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది.పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు ఒకవేళ నివేదికను అధికారిక వెబ్సైట్ లో పెడితే వెంటనే తీసివేయాలని ఆదేశించింది. కమిషన్ 8బీ, 8సీ కింద నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్లను నిందితులుగా చూపడం సరికాదని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తదుపరి వారంలోగా సమాధాన కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా భేటీ వెనుక దురుద్దేశం ఉందన్న పిటిషనర్లు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై 2024, మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6 జారీ చేసింది. పిటిషనర్లు సహా పలువుర్ని కమిషన్ విచారించింది. ఈ ఏడాది జూలై 31న సర్కార్కు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం తమ నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. నివేదికలోని అంశాలు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఈ నెల 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం మీడియాకు వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఈ మేరకు సెక్షన్ 8బీ, 8సీకి సంబంధించి కిరణ్ బేడీ వరెŠస్స్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ, స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ ఎల్కె అద్వానీ తీర్పు కాపీలను కూడా అందజేశారు. నివేదిక కాపీని తమకు అందించకుండా పదే పదే వివరాలు వెల్లడించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. దీని వెనుక దురుద్దేశం ఉందని.. సహజ న్యాయ సూత్రాలను సర్కార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. జీవో 6ను రద్దు చేయాలని, కమిషన్ నివేదిక పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేదిగా ఉందని ప్రకటించాలని కోరారు..’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అసెంబ్లీలో చర్చకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఏజీ ‘కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేయడానికి, పరిశీలనాంశాలను మంత్రిమండలికి సమర్పించడానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని ఏజీ తెలిపారు. తమ నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు మంత్రిమండలి పరిశీలనకు సమర్పించిందని చెప్పారు.కాగా కమిషన్ నివేదికను ఆమోదించాలని, చర్చ కోసం అసెంబ్లీ ముందుంచాలని ఈ నెల 4న కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. అయితే అసెంబ్లీలో చర్చకు ముందే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని గురువారం ఏజీని అడిగాం. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచి్చన లిఖిత పూర్వక వివరణను ఏజీ శుక్రవారం కోర్టుకు సమర్పించారు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని తెలిపారు’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో వివరించింది. స్టే, రద్దు ఉత్తర్వులివ్వని ధర్మాసనం ‘నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అధికారిక వెబ్సైట్లో కూడా నివేదిక ఉంచినట్లు పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ముందు, నివేదికను మంత్రిమండలి ఆమోదించి, చర్చ కోసం అసెంబ్లీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే, దానిని తొలగించాలి. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పిటిషనర్ల ప్రతిష్టను కించపరిచేలా కమిషన్ నివేదికలోని ఆంశాలు ఉంటే అంటే అది సరికాదు. లాగే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సర్కార్ చెబుతున్నందున పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ అనే భావన అవసరం లేదు. నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అక్కడ దానిని చర్చించాలి. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. మూడు వారాలు సమయం ఇస్తున్నాం..’ అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. -
సనత్నగర్: వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: వ్యభిచారం గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని సనత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో యువతిని రిహబిలిటేషన్ సెంటర్కు పంపించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కడప జిల్లా అరవీడు కూర్మయ్యగారిపల్లికి చెందిన పల్లపు నరేష్ (34) నగరానికి వలస వచ్చి మూసాపేట భవానీనగర్లో ఉంటున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన కొండా నాగరాజు (51)తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి రెండు నెలలుగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా నరేష్ నాగరాజులతో పాటు మూసాపేట రాఘవేంద్రకాలనీకి చెందిన గుణశేఖర్ (26) అనే విటుడిని అరెస్టు చేశారు. అలాగే మరో యువతిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
కొత్త కార్డులకు రేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో కొత్త ఆహార భద్రత (రేషన్)కార్డుదారులకు శుభవార్త. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు అందనున్నాయి. పాత కార్డుదారులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు కూడా నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. పౌరసరఫరాల గోదాంల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఇండెంట్ ప్రకారం బియ్యం స్టాక్ సరఫరా ప్రారంభమైంది. సెపె్టంబర్ నుంచి సుమారు లక్షకు పైగా కొత్త కార్డుదారులకు బియ్యం అందనున్నాయి. పౌరసరఫరాల శాఖ గత ఐదు నెలల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ వస్తోంది. ఈ నెల 20 వరకు మంజూరైన కార్డుదారులకు సెపె్టంబర్ కోటా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత కార్డుదారులకు జూన్ నెలలోనే ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. అయితే.. మే 20 వరకు మంజూరైన కొత్త కార్డుదారులకు కూడా మూడు నెలల కోటా ఒకేసారి అందజేశారు. అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నా... రేషన్ కోటా మాత్రం కేటాయించలేదు. మూడు నెలల కోటా గడువు ముగియడంతో తాజాగా పాత కార్డుదారులతో పాటు కొత్తవారికి కూడా సెపె్టంబర్ కోటా కేటాయించారు. గ్రేటర్లో 13.76 లక్షలకుపైగా కార్డులు గ్రేటర్ పరిధిలో సుమారు 13.76 లక్షల కార్డులు ఉండగా, అందులో దాదాపు 60.01 లక్షల యూనిట్లు (లబి్ధదారులు) ఉన్నారు. ప్రతి కార్డులోని యూనిట్కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం కోటా కేటాయించారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా వచ్చే నెల 1 నుంచి 15 వరకు నెలవారీ కోటా పంపిణీ చేస్తారు. లబ్ధి కుటుంబాలు సెలవులు మినహా మిగతా రోజుల్లో నెలవారీ కోటాను డ్రా చేసుకోవచ్చు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని సభ్యులు(కార్డులో పేరు ఉన్న సభ్యులు) ఒకరు ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చి కుటుంబానికి కేటాయించిన సరుకుల కోటాను డ్రా చేయవచ్చు సన్న బియ్యం మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగతా సరుకులు సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంది. -
ఏడు బ్లేడ్లు మింగిన ఆటోడ్రైవర్
హైదరాబాద్: సికింద్రాబాద్ గాందీఆస్పత్రి వైద్యులు అరుదైన వైద్యసేవలను అందించి ఏడుబ్లేడ్లు మింగిన వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు. డిప్యూటీ సూపరింటెండెంట్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ సునీల్కుమార్ తెలిపిన మేరకు.. మౌలాలికి చెందిన రియాజుదీ్థన్ పాషా (36) ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 16న ఏడు బ్లేడ్లను మింగాడు. తీవ్రమైన కడుపునొప్పితో అదే రోజు గాంధీ అత్యవసర విభాగంలో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఎక్స్రే తీయగా కడుపులో ఏడు బ్లేడ్లు కనిపించాయి. సర్జరీ చేసి బ్లేడ్లు బయటకు తీయడం ప్రాణాపాయమని భావించిన వైద్యులు గ్య్రాస్టోఎంట్రాలజీ ఎండోస్కోపీ ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించారు. బ్లేడ్లు జీర్ణాశయంలో ఉండడంతో బయటకు తీసే క్రమంలో అన్నవాహిక ఇతర సున్నితమైన భాగాలకు గాయాలు అయ్యే అవకాశం ఉండడంతో ఎండోస్కోపీ పద్ధతిని విరమించుకున్నారు. లిక్విడ్ డైట్, ఐవీప్లూయిడ్స్, కడుపులోని ఆమ్లాలను తగ్గించే మందులు ఇచ్చి నిరంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఈరకమైన వైద్యవిధానం సత్ఫలితాలు ఇచ్చింది. జీర్ణాశయంలో ఉన్న ఏడు బ్లేడ్లు మెల్లగా చిన్న ప్రేగుకు, అక్కడి నుంచి పెద్దపేగుకు చేరుకుని రెండు రోజుల తర్వాత మలద్వారం నుంచి వచ్చేలా చేశారు. పదునైన వస్తువులు మింగిన క్రమంలో జీర్ణాశయంతోపాటు ఇతర అవయవాలకు తగిలి అంతర్గతగాయాలు, రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు ఉంటుందని, ఈ కేసులో ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రొఫెసర్ సునీల్కుమార్ వివరించారు. అరుదైన కేసులో అత్యంత ప్రతిభావంతమైన వైద్యసేవలు అందించి బాధితునికి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులను సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి అభినందించారు. -
కష్టాలు వరుస కట్టాయి..
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు. ⇒ మహబూబాబాద్లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.టోకెన్ ఇచ్చి ఐదురోజులు..నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్అదును దాటితే ఇబ్బందే.. వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్ -
జనవరి 15కల్లా ‘యాదాద్రి’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వచ్చే ఏడాది జనవరి 15 నాటికి జాతికి అంకితం చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే రెండు యూనిట్లను అందుబాటులోకి తెచ్చామని.. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పరిధిలో భూములు కోల్పోయిన 500 మందికి ప్రజాభవన్లో భట్టి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టామన్నారు.‘కాంగ్రెస్ అంటేనే కరెంట్... కరెంట్ అంటేనే కాంగ్రెస్’అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్కు 2022 అక్టోబర్లోనే పర్యావరణ అనుమతులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచి్చందని.. అయినా గత ప్రభుత్వ పాలకులు ప్లాంట్ నిర్మాణ పనుల్లో చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి నిర్మాణ పనుల్లో వేగం పెంచామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1978లోనే జపాన్ సంస్థ మిత్సుబిషి సాంకేతికతను ఉపయోగించి పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామని భట్టి అన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షల మంది పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు అయ్యే రూ. 17 వేల కోట్ల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు.ఆలస్యం వల్ల ఆర్థిక భారం.. ప్రతి మండలానికీ అంబులెన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల్లోని వారికి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని భట్టి తెలిపారు. ప్రతి మండలానికీ ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని, భూసేకరణకు అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనే లక్షలాది మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందాయని భట్టి గుర్తుచేశారు. వారిలో చాలా మంది భూ నిర్వాసితులు ఇప్పుడు ఉద్యోగాలు పొందారన్నారు. జెన్కో విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన 159 మంది కుటుంబ సభ్యులకు రెండోసారి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ఉన్నతా ధికారులు నవీన్ మిత్తల్, హరీశ్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు ఎలా వెళ్లాలి?
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు సలహాకమిటీ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకొని తమ వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లతోపాటు రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఎజెండా ఇదే....!గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఐదారు కీలకాంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముడిపడి ఉన్న బీసీల రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై కూడా నేతలు చర్చించనున్నారు. అయితే, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా కల్పించలేని పక్షంలో పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు ప్ర«తిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు అనుసరిస్తున ద్వంద్వ, అస్పష్ట వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరోమారు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే, ఈ విషయంలో పీఏసీలోని అందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకొని, మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, పెండింగ్లో ఉన్న గ్రామ, మండల, జిల్లా పార్టీ కమిటీల నియామకం, రాష్ట్రంలో యూరియా కొరత, ప్రతిపక్ష పార్టీల వైఖరి తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం. -
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/మహబూబ్నగర్/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతోసుధాకర్రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా సుధాకర్రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.అయితే 1998 (12వ లోక్సభ), 2004 (14 లోక్సభ)లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కారి్మక) చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న. మహబూబ్నగర్లో జననం..నల్లగొండతో అనుబంధం సురవరం సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు. చిరస్మరణీయుడు సురవరం సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్ సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు. కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ నేతల సంతాపం సుధాకర్రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
కేకు కోయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలిచి వేసింది: హైకోర్టు
హైదరాబాద్: నగరంలో విద్యుత్ స్తంబాలకు వేలాడదీసి కేబుల్ వైర్లు తొలగింపు అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ పిటిషన్పై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) విచారణ జరిగింది. దీనిలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప మిగతా ఏవీ ఉండకూడదని ఆదేశించారు. దీనిలో భాగంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాంతాపూర్లో విద్యుత్ షాక్ కారణంగా పలువురు మరణించిన ఘటనను జడ్జి నగేష్ ప్రస్తావించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు.. తలకొరివి పెట్టడం కలిచి వేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని, ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ‘ఆ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయింది.. దీనికి అందరం బాధ్యులేమేనా?, ఈ ఘటనతో సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’ అని జస్టిస్నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోభాగంగా ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తొలుత ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.రామంతాపూర్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేసే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారానికి వాయిదా పడింది. -
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి విషెస్ చెప్పాడు. అయితే, టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు కూడా షాక్కు గురవుతున్నారు.బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్యకు పాల్పడ్డాడు. పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్గా బాలుడు వ్యవహరించాడు.బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాలుడు రాసుకున్నాడు.హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
మానసిక ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం
హైదరాబాద్: మధుమేహం ప్రభావం శారీరకమైందే కాకుండా మానసికంగానూ ఉంటుందని హైదరాబాద్లోని ఆలివ్ సర్వోదయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మధుమేహం - మానసిక ఆరోగ్యాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన ఒక సదస్సులో వైద్యులు ఈ అంశంపై చర్చించారు. కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ వికాసుద్దీన్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు వైద్యులు తమ క్లినికల్ అనుభవాలను పంచుకున్నారు. మధుమేహ రోగుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ వికాసుద్దీన్ మాట్లాడుతూ.. కేవలం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిచండం, మందులను సక్రమంగా వేసుకోవడంతోనే మధుమేహ నియంత్రణ ఆగిపోదని, మధుమేహ రోగులో ఓ అదృశ్య భారానికి లోనవుతూంటారని అన్నారు. డాక్టర్ల వద్దకు వచ్చే ముందు వారు చెప్పుకోలేని ఆందోళనకు గురవుతూంటారని, మధుమేహాన్ని నిత్యం పర్యవేక్షిస్తూండాల్సిన అవసరంతో ఒత్తిడికి గురై ఉంటారని, ఫలితంగా చాలామంది రోగులు డిప్రెషన్కు లోనై ఉంటారని, సామాజిక ఒత్తిళ్ల పుణ్యమా వీరి జీవితం తాలూకూ నాణ్యతపై ప్రభావం పడి ఉంటుందని వివరించారు. శారీరక లక్షణాలకు చికిత్స తీసుకున్న విధంగానే మధుమేహ రోగులు మానసిక సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అప్పుడే వారి దైనందిన జీవితం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని అనానరు.100 మిలియన్లకు పైబడి... ఇరవై ఏళ్ల క్రితం దేశంలో మధుమేహం జీవనశలి సంబంధిత జీవక్రియల వ్యాధి అనుకునేవారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనాల ప్రకారం, 1995లో భారతదేశంలో మధుమేహుల సంఖ్య 2.6 కోట్ల మంది మధుమేహులు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లకు మించిపోయింది. ICMR–INDIAB, 2023 అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు డయాబెటిస్ రోగులలో ఒకరు ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మధుమేహం, మానసిక ఆరోగ్యాల మధ్య ఉన్న సంబంధాని విస్మరించలేమని, పట్టణీకరణ, అధిక పని సమయం, శారీరక శ్రమ తగ్గిపోతూండటం, ఒంటరితనం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు. ఆధునిక వైద్యంలో డయాబెటిస్ సంరక్షణ, మానసిక ఆరోగ్య నిపుణులు, కుటుంబం పాత్ర, ఆరోగ్య సంరక్షకుల సమన్వయం కూడా అవసరమని డాక్టర్ వికాసుదీన్ స్పష్టం చేశారు. -
తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖలో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్లో 1616, ఆర్టీసీ హాస్పిటల్లో 7 పోస్టులు భర్తీర చేయనున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రభుత్వం గడువు నిర్ణయించింది. పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది.జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. స్పెషాలిటీ వైద్య సేవలు.. పల్లెలకు చేరువ అవనున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. -
Hyderabad: చివరి దశకు ఖైరతాబాద్ గణపతి పనులు
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మరో అయిదు రోజులే ఉండటంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈ నెల 25న మహాగణపతికి నేత్రోనిలన కార్యక్రమం ఉంటుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
‘ఓసీ’తో మాయ చేసి..
సాక్షి, సిటీబ్యూరో: అదో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ నగర శివార్లలోని ఆ గేటెడ్ కమ్యూనిటీలో సుమారు వందల సంఖ్యలో విల్లాల నిర్మాణం చేపట్టారు. వాటిలో చాలావరకు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని తుది దశ నిర్మాణంలో ఉన్నాయి.హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను (ఓసీ) కూడా అందజేశారు. దీంతో అక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారు. నిబంధనల మేరకు ఒకసారి ఓసీ తీసుకున్న తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు కట్టడాలు చేపట్టడానికి అవకాశం లేదు. కానీ కొన్ని విల్లాలకు చెందిన యజమానులు ఇష్టారాజ్యంగా నిబంధనలను బేఖా తరు చేస్తూ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కొందరు స్థానికులు హెచ్ఎండీఏకు సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవడం గమ నార్హం. ఒక్క గేటెడ్ కమ్యూనిటీల్లో కాదు. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు తదితర అ న్ని నిర్మాణాల్లోనూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత ఉల్లంఘనలకు పాల్పడటం గమనార్హం. వెల్ఫేర్ సంఘాల పేరిట ఉల్లంఘన.. శ్రీశైలం రహదారికి సమీపంలోని మరో భారీ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని విలాసవంతమైన విల్లాలు (Luxury villas) ఉన్నాయి. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ తారలు, డైరెక్టర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, ఎన్నారైలు తదితర వర్గాలకు చెందిన వారు విల్లాలను నిర్మించుకున్నారు.కొంతమంది సామాన్యులు కూడా ఊళ్లల్లోని ఆస్తులను అమ్ముకుని పిల్లల చదువు కోసం ఇందులో ప్లాటు కొనుక్కొని నివసిస్తున్నారు. కమ్యూనిటీ అంతటికీ ప్రాతినిధ్యం వహించేందుకు ఏర్పడిన వెల్ఫేర్ అసోసియేషన్లు సొంత నియమ నిబంధనలను రూపొందించుకొని హెచ్ఎండీఏ నిబంధనలను నీరుగారుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మించుకునే వాళ్లు హెచ్ఎండీఎ నిబంధనల ప్రకారం నిర్మాణాలను కొనసాగిస్తుండగా, ఇప్పటికే భవనాలు పూర్తి చేసుకున్న వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి అదనపు భవనాలను నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహించేవారే హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మాణాలు కొనసాగిస్తున్నారు’ అని హెచ్ఎండీఏ కమిషనర్కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేషన్ నిబంధనల పేరిట 2 శాతం అక్రమ నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం గమనార్హం.కొరవడిన నిఘా.. సాధారణంగా ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (occupancy certificate) అందజేసిన తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలు తదితర స్థానిక సంస్థల పరిధిలో ఉంటుంది.ఇలాంటి ఫిర్యాదులపై హెచ్ఎండీఏ అధికారులు సైతం స్థానిక సంస్థలను అప్రమత్తం చేసి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్ఎండీఏకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు, స్థానిక మున్సిపాలిటీలు, రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టవచ్చు.మియాపూర్, శంషాబాద్ తదితర భూముల పరిరక్షణలో హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్థానిక సంస్థలతో కలిసి చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పని చేశాయి. 500 గజాల నుంచి 1000 గజాల లోపు బహుళ అంతస్తుల భవనాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.కొంతకాలంగా హెచ్ఎండీఏ (HMDA) విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. హెచ్ఎండీఏకు చెందిన ప్లానింగ్, ఎస్టేట్ తదితర విభాగాలకు సహకరించేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో అన్ని చోట్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత యథావిధిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రణాళికా విభాగానికి చెందిన కొందరు అధికారులే ఈ మేరకు భవన యజమానులకు ఉచిత సలహాలు ఇస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏకు, స్థానిక సంస్థలకు మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొనే వ్యవస్థలు పని చేయడం లేదు. -
‘నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని’
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను తాను కలవడంపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి స్పందించారు. తాను మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, మర్యాద పూర్వకంగా మాత్రమే ఆయన్ను కలిశానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) ‘సాక్షి’తో మాట్లాడిన ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి.. ‘ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు. కర్ణాటక హోం మంత్రిగా ఖర్గే పనిచేసిన దగ్గర్నుంచీ ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సన్నిహితుడు కాబట్టే మర్యాదపూర్వకంగా మాత్రమే ఖర్గేను కలిశాను. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్తోనే నడుచుకుంటాను. నేను వందకు వంద శాతం వైఎస్ జగన్ మనిషిని. ఎల్లో మీడియా కావాలని నాపై ఉద్దేశపూర్వక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
వెయిట్ లాస్ సర్జరీ కోసం యూకే నుంచి భారత్కు వచ్చిన మహిళ
హైదరాబాద్: ఎక్కడో లండన్లో ఉంటూ బ్లాక్ టాక్సీ డ్రైవర్గా పనిచేసుకుంటున్న ఓ బ్రిటిష్ మహిళ.. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారతీయ డాక్టర్ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. 102 కిలోల నుంచి శస్త్రచికిత్స అనంతరం 70 కిలోలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ తెలిపారు.“అలెగ్జాండ్రియా ఫాక్స్ అనే 59 ఏళ్ల మహిళ భర్త జేన్ ఫాక్స్కు 2023లో లండన్లో ఉండగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశాను. ఆయన 64 కిలోల బరువు తగ్గారు. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి, మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి. ఆ ఫలితంతో ఆయన చాలా సంతోషించారు. దాంతో 102 కిలోల బరువు ఉన్న అలెగ్జాండ్రియా తాను కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అందుకు భారతీయ వైద్యుడైన డాక్టర్ కేశవరెడ్డి దగ్గరకే వెళ్లాలని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ లాంటి సమస్యలున్నాయి. దాంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.ఆమెకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందుకు సంబంధించిన పరీక్షలు చేశాం. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీనివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. దాంతోపాటు కిడ్నీ వైఫల్యం కూడా తగ్గింది. ఆమెకు చాలా సానుకూల దృక్పథం ఉండడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. దాంతో శస్త్రచికిత్స అయిన మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గదిలో ఆమె అటూ ఇటూ హాయిగా తిరిగేస్తున్నారు. త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకుంటున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. మూడు రోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అలెగ్జాండ్రియా ఇంగ్లండ్లో బ్లాక్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంటారు. అది అక్కడ చాలా గౌరవప్రదమైన, కష్టమైన వృత్తి. దానికి ముందుగా మూడేళ్ల శిక్షణ తీసుకోవాలి. లండన్ నగరంలోని ప్రతి వీధి బాగా తెలిసి ఉండాలి. ఈ టాక్సీలను అక్కడ చాలా గౌరవనీయంగా చూస్తారు. ఇంత గౌరవప్రదమైన పని చేసేటప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని భావించడం వల్లే అలెగ్జాండ్రియా ఇక్కడివరకు వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు.స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలా సులభమైన శస్త్రచికిత్స. ఇందులో సరికొత్త పరిశోధనలు కూడా చేసి ఉదరభాగం మళ్లీ వ్యాకోచించకుండా ఉండేలా చేస్తున్నాం. దీనివల్ల దీర్ఘకాలం పాటు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి లాంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కూడా మరో పదేళ్లు పెరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స. బరువు తగ్గడానికి మందులు వాడడం కంటే ఇది చేయించుకోవడం చాలా మంచిది” అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు. -
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్లింది. దీంతో, పలు జిల్లాలో బంద్ కొనసాగుతోంది.👉నల్లగొండ జిల్లాలో మార్వాడీ వ్యాపారస్తులకు నిరసనగా మిర్యాలగూడలో వ్యాపారస్తుల బంద్. దుకాణ సముదాయాలు బంద్ చేసి నిరసన తెలిపిన స్థానిక వ్యాపారులు.👉యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్, ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రాల్లో స్వచ్ఛంద బంద్లో పాల్గొంటున్న వర్తక వ్యాపారులు. బంద్కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్న వ్యాపారస్తులు. మార్వాడీ గోబ్యాక్ అంటూ చౌటుప్పల్లో వాణిజ్య సముదాయాలు బంద్ చేసి మద్దతు తెలుపుతున్న వ్యాపారస్తులు.👉మార్వాడీ గో బ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ ఆగస్టు 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పిలుపు మేరకు పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో భారీగా మోహరించాయి పోలీసు బలగాలు.👉జమ్మికుంట పట్టణంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. బంద్ సందర్భంగా పలువురు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 👉సిద్దిపేట జిల్లాలో మార్వాడీ గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జేఏసీ నాయకుల పిలుపు మేరకు విద్యా సంస్థలు, దుబ్బాక బంద్ కొనసాగుతోంది.👉రంగారెడ్డి జిల్లా అమనగల్లో మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపునకు మద్దతుగా కిరాణా, వర్తక, వస్త్ర, స్వర్ణకార్ల షాప్లు బందు పాటిస్తున్నారు.👉ఇక, తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని.. ఎదగనీయటం లేదని.. మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. పట్టణాల్లో షాపులను బంద్ చేస్తున్నారు. బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. 👉ఓయూ జేఏసీ పిలుపుతో షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్వాడీ గో బ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మార్వాడీలకు బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు. -
సచివాలయం వద్ద ఉద్రికత్త.. బీజేపీ నేతలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.ఇక, హైదరాబాద్లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. -
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్సైట్లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. గురువారం జరిగింది ఇదే.. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. -
హైదరాబాద్ ‘ట్రాఫిక్’ బండి..అదిరెనండి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు చొప్పున ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు. వీళ్లు ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. ఇలాంటి రెండు జంక్షన్ల మధ్య ఉన్న మార్గంలో ఇబ్బంది ఏర్పడితే! అప్పుడు స్పందించాల్సింది ఎవరు? ఆ మార్గాన్ని పర్యవేక్షించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సిటీ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సౌజన్యంతో తొలి దశలో 50 అవెంజర్ వాహనాలను ఖరీదు చేసి, వీటికి అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేశారు. వీటిని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఆవిష్కరించారు. వాహనాల హంగులిలా.. ఎనిమిది గంటల పాటు నిర్వరామంగా సంచరించినా చోదకుడు అలసిపోకుండా ఉండేందుకు బజాజ్ కంపెనీకి చెందిన తెలుపు రంగు అవెంజర్ 220 క్రూయిజ్ వాహనాన్ని ఎంపిక చేశారు. వీటిపై హెచ్సీఎస్సీ, సిటీ, ట్రాఫిక్ పోలీసు లోగోలు ముద్రించారు. ఈ వాహనం నిర్వహణ టాస్్కఫోర్స్ సిబ్బంది బాధ్యత. దశలవారీగా మరో 100 వాహనాలు కొనుగోలు చేయనున్నారు. జంక్షన్ల మధ్య జామ్స్ లేకుండా చూడటం, అక్రమ పార్కింగ్, క్యారేజ్ వే ఆక్రమణలు తొలగించడం, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం, బ్రేక్ డౌన్ అయిన వాహనాల గుర్తింపు ఈ టాస్్కఫోర్స్ విధులు. బ్రేక్ డౌన్ అయిన భారీ వాహనాలు తొలగింపునకు మూడు అత్యాధునిక క్రేన్లు సమీకరించుకున్నారు. నంబర్ల వారీగా ఇలా..1పబ్లిక్ అడ్రస్ సిస్టం: ఈ వాహనానికి ముందు భాగంలో రెండు మైకులు ఉంటాయి. వీటిలో ఒకటి సైరన్ కాగా.. మరొకటి పబ్లిక్ అడ్రస్ సిస్టం. 2 కాలర్ మైక్రోఫోన్: దీనిపై సంచరించే సిబ్బంది ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రకటన చేయడానికి ఆగాల్సిన అవసరం లేదు. దీనికి అనుసంధానించి ఉండే కాలర్ మైక్రోఫోన్ను చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాడవచ్చు. 3 వాకీటాకీకి మైక్రోఫోన్: క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు సమాచార మారి్పడికి వాకీటాకీ అనివార్యం. వాహచోదకుడు తన వాకీటాకీనీ చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మైక్రోఫోన్ సౌకర్యం ఉంది. 4 డ్యాష్బోర్డ్ కెమెరా: ఈ వాహనాన్ని నడిపే ట్రాఫిక్ టాస్్కఫోర్స్ సిబ్బంది దారిలో కనిపించిన ఉల్లంఘనల్ని ఫొటో తీయడానికి చేతిలో ఉండే కెమెరాలు అవసరం లేదు. వాహనం హ్యాండిల్ పైన ప్రత్యేకంగా డ్యాష్బోర్డ్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇది తీసిన ఫొటోలు నేరుగా కంట్రోల్ రూమ్కు చేరతాయి. అక్కడ నుంచి ఈ–చలాన్ జారీ అవుతుంది. 5 జీపీఎస్ ట్రాకింగ్: ట్రాఫిక్ టాస్్కఫోర్స్ వాహనాలను అవసరాన్ని బట్టి ఏ ప్రాంతానికైనా మోహరిస్తారు. దీనికోసం అవి ఎక్కడ ఉన్నాయో కంట్రోల్ రూమ్ సిబ్బంది తెలుసుకోవడానికి జీపీఎస్ పరిజ్ఞానంతో పని చేసే ట్రాకింగ్ డివైజ్ ఉంది. 6 ఫస్ట్ ఎయిడ్ కిట్: అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్, అందులోనే కమ్యూనికేషన్ కోసం ట్యాబ్ ఉంటుంది. 7 ట్రాఫిక్ ఎక్యూప్మెంట్ బాక్స్: వర్షం కురిసినప్పుడు అసరమైన చోట విధులు నిర్వర్తించడానికి రెయిన్ కోట్, షూస్తో పాటు రిఫ్లెక్టివ్ జాకెట్ ఉండే పెట్టె ఉంది. 8 బాడీ వార్న్ కెమెరా: టాస్క్ఫోర్స్ సిబ్బంది సంచరించే మార్గాలు, అక్కడి పరిస్థితులతో పాటు ప్రజలతో నడుచుకునే తీరు పరిశీలించడానికి బాడీ వార్న్ కెమెరా ఉంది. ఇది నేరుగా కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ దీని ఫీడ్ మొత్తం రికార్డు అవుతుంది. 9యుటిలిటీ బాక్స్: రెస్క్యూ సమయంలో వాహన చోదకుడు తన హెల్మెట్, సెల్ఫోన్తో పాటు ఇతర పరికరాలు భద్రపరుచుకోవడానికి ఈ బాక్స్ ఉపకరిస్తుంది. -
రైల్వే కీమెన్కు జీపీఎస్
గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ.. భారీ వర్షం కురిసింది. కేసముద్రం–ఇంటెకన్నె సెక్షన్ల మధ్య అర్ధరాత్రి వేళ రైల్వే కీమెన్ ట్రాక్ పెట్రోలింగ్లో ఉన్నాడు. ఎడతెగని వర్షం వల్ల అయోధ్యపురం చెరువులోకి వరద పోటెత్తి కట్ట తెగింది. దీంతో రైల్వే ట్రాక్ వద్ద మట్టి కొట్టుకుపోతున్న విషయాన్ని కీమెన్ గుర్తించి వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు. సరిగ్గా అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైళ్లు (అప్ అండ్ డౌన్ ట్రాక్ మీద వెళ్లే రెండు రైళ్లు) కేసముద్రం స్టేషన్కు చేరుకున్నాయి. వెంటనే అధికారులు వాటిని నిలిపేశారు. కాసేపటికే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఆరోజు కీమెన్ అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది.. అదే కీమెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే... ?సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై రైళ్లు సురక్షితంగా పరుగుపెట్టడం వెనుక దేశవ్యాప్తంగా వేలమంది కీమెన్ (గ్యాంగ్మెన్) నిర్విరామ పహారానే ప్రధాన కారణం. అత్యంత కిందిస్థాయి ఉద్యోగులే అయినా.. రైల్వే భద్రతలో వీరిదే కీలక భూమిక. ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల వల్ల రైళ్లకు పొంచి ఉండే ప్రమాదాన్ని తప్పించేది వీరే కావటంతో ఇప్పుడు వీరి విధులపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కీమెన్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు వారిని నిరంతరం ట్రాక్ చేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందుకోసం పేజర్ తరహాలో ఉండే జీపీఎస్ ఉపకరణాన్ని వారికి ఏర్పాటు చేశారు. వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ ఉపకరణాన్ని వెంటపెట్టుకొని వెళ్లాలి. వారు ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో విధుల్లో ఉన్నారో ఆ ఉపకరణం ద్వారా డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉండే కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాక్ చేస్తారు. ఇందుకోసం కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ట్రాకింగ్ కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫలితంగా కీ మెన్ ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా విధుల్లో ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో...దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుతం 2,800 మంది ట్రాక్ పర్యవేక్షణ విధుల్లో ఉన్నారు. వీరిలో 1,800 మంది కీమెన్ కాగా, ప్రత్యేక పెట్రోలింగ్ విధుల్లో మిగతా వారుంటారు. ఇప్పుడు వీరిలో 1,600 మందిని తాజాగా జీపీఎస్తో అనుసంధానం చేశారు. మిగతా వారిని మరో నెల రోజుల్లో దాని పరిధిలోకి తేనున్నారు. వాస్తవానికి ట్రాక్ కీమెన్లో అప్రమత్తత పెంచేందుకు వారిని జీపీఎస్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలన్నది 2018లో తీసుకున్న నిర్ణయం. కానీ, దాన్ని అమలులోకి తేవటంలో తీవ్ర జాప్యం జరిగింది. కొన్ని రైల్వే జోన్లలో పాక్షికంగా అమలులోకి తె చ్చినా, పూర్తిస్థాయిలో జీపీఎస్ ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయలేకపోయారు. భారీ వర్షాలప్పుడు మరింత అవసరం భారీ వర్షాలప్పుడు ఏర్పడే మెరుపు వరదలు రైల్వేను అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, వాగులు, గుట్ట దిగువన ఉండే ట్రాక్కు ఈ వరదలు ప్రమాదకరంగా మారుతాయి. దీంతో 24 గంటలు ట్రాక్పై నిఘా అవసరం. గత సంవత్సరం కేసముద్రం సమీపంలో ట్రాక్ దిగువన మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, వీలైనంత తొందరలో కీమెన్, పెట్రోలింగ్ మెన్కు జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి వేగంగా కసరత్తు పూర్తి చేసింది. ఈ వర్షాకాలం నాటికి మూడొంతుల మందిని ట్రాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. -
31 అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) తెలిపింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్కు గురువారం నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు. రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 471 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ 8వ తేదీ వరకు రూ.723.97 కోట్ల మేర బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల సగటున రూ.100 కోట్లకు తగ్గకుండా చెల్లింపులు చేస్తూ వస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెపుతోంది. ఈ నేపథ్యంలో గత జూన్ 9 నాటికి బకాయిలు రూ.981 కోట్లకు చేరాయి. తాజాగా ఈ బకాయిలు రూ.1,000 కోట్లకు పైగానే పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేష్ వివరించారు. గత జనవరిలో సేవలు నిలిపివేత ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో గత జనవరిలో వైద్య సేవలను నిలిపివేస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.117 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపిస్తూ తాజాగా మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. -
అప్పటి హైజాక్కు ఇప్పుడు కంగారు!
శంషాబాద్: అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట పాకిస్తాన్లో ఓ విమాన హైజాక్ ఘటన జరిగితే శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు మాత్రం తెగ కంగారు పడిపోయి ఇప్పుడు కేసు పెట్టారు!! పోలీసులు కూడా పూర్వాపరాలు తెలుసుకోకుండానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేశారు!! ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. 1998 మే 28న జరిగిన పాక్ విమాన హైజాక్ ఉదంతం, హైజాకర్ల అరెస్టును ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ఈ నెల 14న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు అనే పేరు పలుమార్లు రావడంతోపాటు హైజాకర్లు, ఢిల్లీ తదితర పదాలు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీఓసీ) ఉపయోగిస్తున్న ఓ ఏఐ ఆధారిత టూల్ పొరబడింది. ‘ఎక్స్’ వేదికగా ‘బెదిరింపు సందేశం’ వచ్చిదంటూ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఏసీఓసీకి చెందిన రాకేశ్ కుమార్ శర్మ అనే సెక్యూరిటీ, విజిలెన్స్ అధికారి.. పూర్వాపరాలు చూసుకోకుండానే అదే రోజు ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ‘ఎక్స్’లో ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని ఆర్జీఐఏ పోలీసులు పేర్కొనడం గమనార్హం. నిజాంల కాలంలో మన భాగ్యనగరం పేరును అన్ని రకాల సమాచార సందేశాల్లో హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ (డెక్కన్) అని సంబోధించేవారు. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మరో హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ (సింధ్)గా పిలుస్తున్నారు.నాడు జరిగింది ఇదీ..బలోచ్ హైజాకర్లు పాక్ విమానాన్ని ఢిల్లీ మళ్లించాలని డిమాండ్ చేయగా అంతదూరం వెళ్లేందుకు ఇంధనం సరిపోదంటూ హైజాకర్లను విమాన కెప్టెన్ ఉజెయిర్ ఖాన్ బురిడీ కొట్టించాడు. కావాలంటే తొలుత గుజరాత్లోని భుజ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయి ఇంధనం నింపుకున్నాక ఢిల్లీ తీసుకెళ్తానంటూ వారిని నమ్మించాడు. హైజాక్ ఉదంతాన్ని సింధ్ ప్రావిన్స్లో ఉన్న హైదరాబాద్ ఎయిర్పోర్టుకు కోడ్ భాషలో పంపాడు. వారు సైతం భారత అధికారులుగా హైజాకర్లను భ్రమింపజేస్తూ భుజ్లో విమాన ల్యాండింగ్కు అనుమతిస్తున్నట్లు రిప్లై ఇచ్చారు. చివరకు విమానం అక్కడి హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవగా తాము భారత భూభాగంలోకి ప్రవేశించామని హైజాకర్లు నమ్మారు. ఆ వెంటనే పాక్ కమాండోలు విమానంలోకి చొరబడి హైజాకర్లను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. ఆ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఆ ఉదంతం జరిగిన 17 ఏళ్లకు.. అంటే 2015 మే 28న హైజాకర్లను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. -
వర్షాలతో రోడ్లకు రూ.1,000 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆర్ అండ్ బీ శాఖ రోడ్లకు సుమారు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు నివేదించారు. రోడ్లతోపాటు పలుచోట్ల కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్లు, హైవే స్ట్రెచ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. రోడ్లకు జరిగిన నష్టంపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రస్తుత పరిస్థితిపై ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్ల స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. త్వరలోనే హ్యామ్ విధానం ద్వారా నాణ్యమైన రోడ్లు వేయబోతున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన జాతీయ ప్రాజెక్టులపై మంత్రి ఆరా తీశారు. ఖానాపూర్ నుంచి బెల్లంపల్లి, ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్ రోడ్డు మార్గంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, ఈఎన్సీ జయ భారతి, సి.ఈ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ను డర్టీ పార్టీ అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని దూషించటం బీఆర్ఎస్ నేత కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తోందని తెలిపారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. -
సెలవొస్తే.. సిటీబస్సు ట్రిప్పులకూ బ్రేక్!
రామంతాపూర్కు చెందిన ఆంజనేయులు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం రాత్రి 8.30 గంటలకు బంజారాహిల్స్ నుంచి బయలుదేరి 9 గంటలకు లక్డీకాపూల్ చేరుకున్నారు. రాత్రి 10.30 వరకు ఎదురుచూసినా రామంతాపూర్ బస్సు రాలేదు. అప్పటికే అక్కడ 30 మంది వరకు ప్రయాణికులు జమయ్యారు. ఓవైపు బోరున వర్షం కురుస్తుండటం, ఇటు బస్సు రాకపోవటంతో వారి అవస్థలు వర్ణనాతీతం. రెండుగంటలపాటు ఎదురుచూస్తే గానీ బస్సు రాలేదు. ఇది ఒక్క ఆంజనేయులుకు ఎదురైన పరిస్థితే కాదు.. ఆదివారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఎదుర్కొన్న దుస్థితి. వర్షం కురిసే సమయం...సెలవు రోజుల్లో ఇదే పరిస్థితి ఎదురుకానుంది. సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంపుపై దృష్టి సారిస్తున్న ఆర్టీసీ.. మరోవైపు ఖర్చులను కూడా నియంత్రించుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఈ ఆలోచన నగరవాసులపై పెద్ద ప్రభావమే చూపబోతోంది. వానలు కురిసిన సమయంలో, పండుగల వేళ రద్దీ అంతంత మాత్రమే ఉంటోందని భావిస్తున్న ఆర్టీసీ, ఆయా సమయాల్లో బస్సులను పరిమితంగానే నడపాలని యోచిస్తోంది. ఇటీవల వర్షం కురిసిన ఓ రోజు కొన్ని ప్రాంతాల్లో తక్కువ రద్దీతో బస్సులు తిరగటాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని, అలాంటి సమయాల్లో బస్సుల సంఖ్య తగ్గించి తిప్పాలని డిపో మేనేజర్లను మౌఖికంగా ఆదేశించారు. శనివారం మరోసారి పరిశీలించిన అధికారులు, రద్దీ తక్కువగా ఉన్నా.. ఎక్కువ బస్సులు ఎందుకు తిప్పుతున్నారంటూ సిటీ అధికారులను ప్రశ్నించారు. దీంతో సంబంధిత అధికారులు అందరు డిపో మేనేజర్లకు మరోసారి సీరియస్గా మౌఖికంగానే ఆదేశాలిచ్చారు. ఆదివారం నుంచి బస్సుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. దీంతో డిపో మేనేజర్లు ఆదివారం దాదాపు 20 శాతం బస్సు ట్రిప్పులను తగ్గించేశారు. రాత్రి పూట ఎక్కువ బస్సులను రద్దు చేశారు. రాత్రి 9 తర్వాత సింహభాగం బస్సులను డిపోలకే పరిమితం చేసి అతి పరిమితంగా నడిపారు. దీంతో ఆ సమయంలో రోడ్లపై మిగిలిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచి్చంది. 2019లోనూ ఇదే తరహాలో... 2019లో దీర్ఘకాల సమ్మె తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ తీరుపై సమీక్షించిన సమయంలోనూ ఇదే తరహా నిర్ణయం జరిగింది. నగరంలో రద్దీ లేని సమయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు తిప్పుతున్నారని, ఇది డీజిల్ దుబారాకు కారణమవుతోందని పేర్కొన్న ప్రభుత్వం, నగరంలో 2 వేల బస్సులు తగ్గించాలని ఆదేశాలిచ్చింది. అప్పుడు అంతమేర బస్సులను రద్దు చేసిన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. నగరంలో కేవలం 3 వేల బస్సులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ నగర జనాభాతో సమంగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8,900 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. అసలే తక్కువ బస్సులున్న తరుణంలో ఒకేసారి 2 వేల బస్సులు తగ్గించటంతో ఏర్పడిన కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ తరుణంలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఆ సంఖ్యను మరింత తగ్గించి నడిపితే, రోడ్లపై ఉన్న ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వస్తుంది. కానీ, ప్రయాణికుల అవస్థల కంటే ఆదాయమే ముఖ్యమన్న తరహాలో ఆర్టీసీ వ్యవహరిస్తుండటం ఇప్పుడు నగర ప్రయాణికులకు శాపంగా మారబోతోంది. గత్యంతరం లేని స్థితిలో, జేబులో బస్పాస్ ఉండి కూడా ఆటోలు, క్యాబ్లపై ఆధారపడాల్సి వస్తోంది. మహాలక్ష్మి పథకం ఉండి కూడా మహిళలు భారీ మొత్తం చెల్లించి ఆటోలు, క్యాబ్లలో వెళ్లాల్సి వస్తోంది. రద్దీ లేకుంటే రద్దు చేయమన్నారు రోడ్లపై ప్రయాణికుల సంఖ్యను గమనిస్తూ తక్కువగా ఉన్న రోజుల్లో 10 నుంచి 15 శాతం సర్వీసులు నడపొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఆదివారం మా డిపో పరిధిలో సాయంత్రం తర్వాత కొన్ని సర్వీసులను రద్దు చేశారు. సెలవు రోజుల్లో ఇలాగే కొనసాగించాలని సూచించారు. – ఓ కండక్టర్ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు రాత్రి 9:30 గంటల సమయంలో బస్సుల కోసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఎదురుచూసే పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ సమయంలో 113 నంబరు బస్సు కోసం గమ్యం యాప్ చూస్తే వాటి జాడే లేదు. రాత్రి పదిన్నర సమయంలో ఒక బస్స్టాప్లో 30 మంది ప్రయాణికులు జమయ్యారంటే సర్వీసుకు సర్వీసుకు మధ్య విరామం ఎంత ఎక్కువగా ఉందో అవగతమవుతుంది. –ఆంజనేయులు, రామంతాపూర్ -
సినీ కార్మికుల సమ్మెకు తెర
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కార్మికులు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కార్మికశాఖ కార్యాలయంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఫిల్మ్ చాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించాయి. కార్మికులు 30 శాతం వేతనాల పెంపు కోసం డిమాండ్ చేయగా 22.5 శాతం వేతనం పెంపునకు నిర్మాతలు ఓకే అన్నారు. దీంతో 18 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ఫుల్స్టాప్ పడింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా చిత్రీకరణలు జరగనున్నాయి. సీఎం సూచనతో పరిష్కారం చూపాం: ‘దిల్’రాజు చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతోపాటు పలువురు సినీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో గురువారం ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, ఎఫ్డీసీ ద్వారా పరిష్కారం చూపాం. ఇందుకుగాను చిత్ర పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్కు సినీ పరిశ్రమ, ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. భారతీయ చిత్రాలన్నీ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్. తెలుగు సినిమాలతోపాటు అన్ని భాషల సినిమాలూ హైదరాబాద్లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దాం’ అని ‘దిల్’రాజు పేర్కొన్నారు. రోజుకు రూ. 2 వేలలోపు ఉంటే తొలి ఏడాది 15 శాతం పెంపు సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకురాగా ఫెడరేషన్ ప్రతినిధులు అందుకు ఒప్పుకున్నారని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తెలిపారు. రోజుకు రూ. 2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారని చెప్పారు. అలాగే రూ. 2 వేల నుంచి రూ. 5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచుతారని వివరించారు. ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆదివారాలు షూటింగ్ చేస్తే డబుల్ కాల్షీట్ లెక్కన వేతనాలు చెల్లిస్తుండగా ఇకపై పెద్ద సినిమాలకు ఒకటిన్నర కాల్షీట్, చిన్న సినిమాలకు మాత్రం రెండు, నాలుగో ఆదివారాలకే ఒకటిన్నర కాల్షీట్ ఉంటుందని గంగాధర్ తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలు సమస్యలపైనా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం: వల్లభనేని అనిల్కుమార్ ‘వేతనాల పెంపుపై లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం కుదిరింది. 30 శాతం వేతనాల పెంపు కోసం మేం అడగ్గా నిర్మాతలు 22.5 శాతానికి ఒప్పుకున్నారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్, మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, లైట్మెన్ యూనియన్ల కార్మికులకు ఎక్కువ వేతనం కావాలని అడిగాం. దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. అంతిమంగా ఫైటర్లకు 7.5 శాతం, డ్యాన్సర్లకు 5.5 శాతం పెంచేందుకు ఒప్పుకున్నారు’ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ తెలిపారు. కలిసిమెలిసి ముందుకు సాగాలి‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సామరస్యంగా, సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ – చిరంజీవి -
ఇంజనీరింగ్ ఫీజులు..మళ్లీ మొదటికి
ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఫీజులపై మరోసారి కసరత్తు చేయాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీజీఎఫ్ఆర్సీ)కి ప్రభుత్వం సూచించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సిఫార్సులను ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 160 కాలేజీలతో ఎఫ్ఆర్సీ తిరిగి సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం సూచించింది. కాలేజీలు గతంలో సమర్పించిన పత్రాలు, ఖాతా పుస్తకాలను మళ్లీ పరిశీలించాలని పేర్కొంది. ఎఫ్ఆర్సీకి సమర్పించే వివరాలన్నీ నిజమైనవేనని కాలేజీల నుంచి నోటరీ అఫిడవిట్ తీసుకోవాలని.. ఒకవేళ ఏ విషయమైనా నిజం కాదని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జీవోలో ఆదేశించింది. ఫీజుల నిర్ధారణలో ఎఫ్ఆర్సీకి పూర్తి స్వేచ్ఛ ఉందని.. కాలేజీ నాణ్యతను నిర్ణయించి ఫీజులు ఖరారు చేసే అధికారం ఇస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే టీజీఎఫ్ఆర్సీ సమావేశమై 2025–2028 బ్లాక్ పీరియడ్కు ఫీజుల ఖరారు మార్గదర్శకాలపై చర్చించింది. అనంతరం కాలేజీలతో సంప్రదింపులు, పత్రాల పరిశీలనకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ ఈ నెల 25 నుంచి మొదలై సెప్టెంబర్ 3తో ముగియనుంది. -సాక్షి, హైదరాబాద్ఫీజుల పెంపునకు ఇవే ప్రామాణికం» ఫీజుల నిర్ధారణకు ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని కమిటీ కొన్ని సూచనలు చేసింది. వాటిని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం ప్రధానంగా ఆరు మార్గదర్శకాలను సూచించింది.»కాలేజీలో నాణ్యతాపరమైన విద్యను ఫీజు పెంపునకు కొలమానంగా తీసుకోవాలి. నాణ్యత కల్పించే భరోసా కాలేజీలో ఏ మేరకు ఉందో గుర్తించాలి. ఫ్యాకల్టీ, సరికొత్త మార్పులు, విద్యార్థి విజ్ఞానాన్ని పెంచేందుకు తీసుకొనే చర్యలను ప్రామాణికంగా తీసుకోవాలి.» కాలేజీలో చదివే విద్యార్థుల పురోగతి ఎలా ఉంది? విద్యార్థులకు ఏ స్థాయిలో ప్రేరణ కల్పిస్తున్నారు? వారి హాజరు శాతం ఏ విధంగా ఉంది? ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థుల పురోగతిలో మార్పు, ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఏ స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.» ముఖ ఆధారిత గుర్తింపు హాజరు విధానం, ఆధార్ అనుసంధాన చెల్లింపు పద్దతుల్లాంటి ఆధునిక విధానాలను ఫీజుల పెంపునకు ప్రామాణికంగా తీసుకోవాలి. జమా ఖర్చులు సహా అన్ని విషయాల్లో పారదర్శకత, జవాబుదారీతనంలో కాలేజీ తీరును ఫీజు పెంపునకు ఒక అర్హతగా నిర్ణయించారు.» నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) వంటి జాతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ర్యాంకులు పొందిన సంస్థలను ఫీజుల పెంపునకు కొలమానంగా తీసుకోవాలి. » ప్రభుత్వం అందించే సాంకేతిక విద్యను ఏ మేరకు అనుసరిస్తున్నారు? దీన్ని ఆధారంగా చేసుకొని ఉన్నత ప్రమాణాలతో బోధన అందించే విధానాలను పరిశీలించాలి.ఈ ఏడాది పెంపు లేనట్టే!ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఇప్పటికే పూర్తవగా అంతర్గత స్లైడింగ్, అన్ని కాలేజీల్లో ఓరియంటేషన్ సైతం ముగిసింది. క్లాసులు కూడా పూర్తిస్థాయిలో మొదలవనున్నాయి. 2025–26 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులు పాత బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజులే చెల్లించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎఫ్ఆర్సీ 160 కాలేజీల డాక్యుమెంట్లు, ఆడిట్ నివేదికలను పునఃపరిశీలించాలి. ఆ తర్వాత ఫీజులపై ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. అయితే ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఫీజులు పెంచినా ఈ ఏడాదికి మాత్రం అవి అమలయ్యే అవకాశం కనిపించడంలేదు. ఫీజులపై ఆరు వారాల్లో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఫీజులపై పునఃపరిశీలన చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడి యాకు అందజేశారా?, మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు కేసీఆర్, హరీశ్రావు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మేడిగడ్డ బరాజ్కు సంబందించిన ప్రతిదీ కేబినెట్, ఇంజనీర్ల సూచనలు, ఆమోదంతోనే జరిగింది. దురదృష్టవశాత్తు అసాధారణ వర్షాలతో ఓ పిల్లర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రభుత్వం రాజకీయ కక్షతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చట్ట నిబంధనలు పాటించలేదు. చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధతను, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, నివేదిక కాపీ ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానించారు. అసెంబ్లీలో చర్చించకుండానే ప్రభుత్వం పవర్పాయింట్ ప్రజెంటేషన్తో నివేదికలోని వివరాలు మీడియాకు తెలియజేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో నివేదికను బహిర్గతం చేశారు. నివేదికపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సారాంశాన్ని వందలాది అధికారిక, అనధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు సీఎం, మంత్రులు పదే పదే ప్రెస్మీట్లలో బీఆర్ఎస్ పార్టీ, పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిటిషనర్లకు నోటీసులు సైతం సరైన విధానంలో ఇవ్వలేదు. చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ కింద సమన్లు జారీ చేయలేదు. కేవలం సాక్షిగానే నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షులు ఇచ్చిన వివరాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలి. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం మా ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా సమర్పించిన నివేదికను రద్దు చేయాలి..’ అని కోరారు. ఈ సందర్భంగా కిరణ్బేడీ, ఎల్కే అద్వానీపై కమిషన్లను కొట్టివేసిన కేసులకు సంబంధించిన వివరాలు ధర్మాసనానికి అందజేశారు. ఇద్దరూ శాసనసభ్యులే.. అందుకే అసెంబ్లీలో చర్చ ప్రభుత్వం, కమిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నివేదిక నేరుగా అసెంబ్లీలో బహిర్గతం చేస్తాం. పిటిషనర్లు ఇద్దరూ శాసనసభ సభ్యులు. ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మించారు..’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీజే జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీలో చర్చించాలని భావించినప్పుడు నివేదికను మీడియాకు ఎందుకు విడుదల చేశారని ఏజీని ప్రశ్నించారు. ‘నివేదిక ప్రతిని పబ్లిక్ డొమైన్లో పెట్టారా?, పిటిషనర్లకు 8బీ కింద నోటీసులిచ్చారా? నివేదిక ప్రస్తుత స్థితి ఏంటీ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారా?’ అని అడిగారు. మీడియాకు ఇవ్వలేదు..పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మీడియాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్ డొమైన్లోనూ పెట్టలేదని ఏజీ బదులిచ్చారు. నివేదికకు కేబినెట్ ఆమోదం తర్వాత రూపొందించిన 60 పేజీల త్రిసభ్య కమిటీ నివేదికలోని వివరాలను మీడియాకు ఇచ్చామని చెప్పారు. 8బీ కిందే పిటిషనర్లకు నోటీసులిచ్చామని తెలిపారు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కిరణ్బేడీ, ఎల్కే అద్వానీ కేసులు ఇక్కడ వర్తించవని వాదించారు. కాగా, తనకు సమర్పించిన నివేదిక ప్రతి సరిగా కనిపించడం లేదంటూ కొన్ని పాయింట్లు హైలైట్ చేసి ఉండటంపై సీజే అభ్యంతరం తెలిపారు. విచారణను నిలిపివేద్దాం అని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణ కొనసాగించారు. వివరాలు స్పష్టంగా ఉన్న కాపీ ఇవ్వాలని వారికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని చెప్పాలని ఏజీకి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
జూబ్లీహిల్స్ ఓటర్లు ఎంత మందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేశాయి. కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ దీమాగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. -
‘తెలంగాణ ఇచ్చిన పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీనా?’
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ గ్రేడ్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసేనని, మీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎటువంటి పార్టీనో మీ తండ్రి కేసీఆర్ను అడిగితే చెబుతారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూఫ్ పోటో దిగింది మర్చిపోయారా? అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. ‘మా పార్టీ పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు..మీ తెలంగాణ వాదం పై సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావ్. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై చులకనగా మాట్లాడడం..అమెరికాలో చదివిన మీ విజ్ఞతకు వదిలేస్తున్న. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పిఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ. రాజకీయంతో సంబంధం లేకుండా దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. యూరియా ఎందుకు రావట్లేదో అంత మాత్రం తెలియదా?, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్’ అని ప్రశ్నించారు. -
ఆ 3 రోజులే ట్రాఫిక్ ఎక్కువ.. ఎందుకంటే!
ఊరికి పశ్చిమాన ఉన్నవి ఆ ప్రాంతాలు.. ఐటీ కారిడార్లు.. హైదరాబాద్కు తలమానికం.. నగరానికి మణిహారం.. ఐటీకి ఆలవాలం.. లక్షలాది ఉద్యోగులు.. దాదాపు అంతకు రెట్టింపు వాహనాలు.. వీఐపీల రాకపోకలతో బీజీ బీజీ.. ఇంతేనా! ఆ ప్రాంతాలు ఐటీ కారి‘డర్’కు.. ట్రా‘ఫికర్’కు కేరాఫ్ కూడా. వానొచ్చినప్పుడు చూడాలి వాటి సొగసు.. చినుకు పడితే వణుకే.. ప్రయాణమంటే ప్రయాసే.. అడుగుడుగునా అవస్థలే.. రహదారులన్నీ వాహనాల బారులే.. ఫ్లై ఓవర్లు ఉన్నా.. అండర్ పాస్లున్నా.. చాలా వెడల్పాటి రోడ్లున్నా.. తప్పని ట్రా‘ఫికర్’. నగరవాసికి నరకం చూపుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిదీ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఉండే పశ్చిమ హైదరాబాద్లో అయితే వాహన విస్ఫోటంతో నగరవాసికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లలోని రహదారులపై రోజుకు 10 లక్షల వాహనాలు చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి బిజీ రోడ్లపై తేలికపాటి వర్షాలకే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.హైదరాబాద్లో ఉన్న సుమారు 15 వేల ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9,05,715 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా ఐటీ సంస్థలు ఉద్యోగుల కోసం హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారంలో 2–3 రోజులు ఆఫీసు నుంచి, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్స్కు ముందు, తర్వాత రోజులైన శుక్ర, సోమవారాల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. దీంతో సోమ, శుక్రవారాలతో పోలిస్తే మిగిలిన రోజుల్లో ఐటీ కారిడార్లలోని రహదారులపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది.ఏ ఏ రోజుల్లో ట్రాఫిక్ జాం ఎక్కువంటేసోమ, శుక్ర వారాలతో పోలిస్తే మంగళ, బుధ, గురువారాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ మంగళ, బుధవారాల్లో 20–25 శాతం, గురువారాల్లో 10–15 శాతం రోడ్లు వాహనాలతో బిజీగా ఉంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నాలుగు గంటలు నరకమే.. ఐటీ కారిడార్లలో రోజుకు 10 లక్షల ఆటోలు, బస్సులు, కార్లు, బైక్లు తిరుగుతుంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ ప్రయాణించాలంటే వణుకే. ఈ నాలుగు గంటల్లో సుమారు లక్ష వాహనాల్లో ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. వారం మధ్య దినాల్లో ట్రాఫి క్ రద్దీ విపరీతంగా ఉంటుంది. సోమ, శుక్ర వారాల్లో ఐటీ ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తుండగా.. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వెళుతున్నారు. దీంతో నివాస ప్రాంతాలతో అనుసంధానమై ఉండే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీ 25 శాతం అధికం.ప్రధానంగా ఈ రోడ్లు జాంజాం.. ⇒ గచ్చిబౌలి–మియాపూర్ రోడ్ ⇒ లింగంపల్లి వయా గచ్చిబౌలి రోడ్ ⇒ హైటెక్ సిటీ–జేఎన్టీయూ వయా హఫీజ్పేట, కేపీహెచ్బీ ⇒ బొటానికల్ గార్డెన్ అండ్ కొత్తగూడ ⇒ టోలిచౌకి–రాయదుర్గం రోడ్ (షేక్పేట ఫ్లై ఓవర్)కొత్తగా మరో 25 లక్షల గృహాలు.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఏటా ఇచ్చే అనుమతుల్లో 60 శాతానికి పైగా భవన నిర్మాణ అనుమతులు ఐటీ కారిడార్లలోనే ఉంటాయి. అయితే ఆ మేరకు ఆయా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం లేదు. భవిష్యత్తు అవసరాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్లో 30 అంతస్తులకుపైగా హైరైజ్ భవనాలు వందల సంఖ్యలో నిర్మాణమవుతున్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో ఐటీ కారిడార్లలో కొత్తగా 25 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ కారిడార్లలో నివాసముండే కుటుంబాల్లో ఇంటికి 2–3 కార్లు ఉంటున్నాయి. ఈ లెక్కన లక్షల వాహనాలు కొత్తగా రోడ్ల మీదికి వస్తాయి. ఇప్పుడున్న రద్దీనే తట్టుకోలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వ విభాగాలు భవిష్యత్తు పరిణామాల గురించి కూడా ముందస్తుగా ఆలోచిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఏం చేయాలంటే.. ⇒ ఎడతెరిపిగా వర్షాలు కురిసే రోజుల్లో ఐటీ సంస్థలు వేర్వేరు లాగిన్, లాగ్ అవుట్ వేళలను అవలంబించాలి. ⇒ సాధ్యమైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు వంటి ప్రజా రవాణాను ఉద్యోగులు వినియోగించేలా సంస్థలు ఆదేశించాలి. ⇒ ఒకే ప్రాంతం, ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరికివారు సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్లే బదులుగా ముగ్గురు, నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ⇒ కార్ పూలింగ్, బైక్ ట్యాక్సీ వంటి ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం ⇒ యాజమాన్యాలు ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీసులో విధిగా నిర్వహించే మీటింగ్స్ను ఆన్లైన్ లేదా వర్చువల్ విధానంలో చేయడం ఉత్తమం. ⇒ ఐటీ కారిడార్లలో రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం, సిమెంట్ కాంక్రీట్ వంటి వాటితో నిండిపోయి వర్షపు నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోకుండా మున్సిపల్, హైడ్రా, పోలీసులు సమన్వయంగా పనిచేయాలి. ⇒ హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసుకు రావాలనేది యాజమాన్యాల నిబంధన. వానాకాలం, ఇతరత్రా అత్యవసర రోజుల్లో ఈ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేలా సంస్థలను అధికారులు ఆదేశించాలి. ⇒ ఆఫీసు నుంచైనా, ఇంటి నుంచైనా ఉద్యోగుల పని వేళలు, ఉత్పాదకతలో ఎలాంటి మార్పులు లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమే మేలు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమేకాకుండా యాజమాన్యాలకూ ఉద్యోగుల రవాణా ఖర్చులు తగ్గుతాయి.‘వీఐపీ’ల రాకపోకలు కూడా కారణమే..గతంలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలుగా మారడంతో వారంతా కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ (Madapur) వంటి పశ్చిమ హైదరాబాద్కు వలస వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరంతరం వీఐపీల కదలికల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లు ఎల్బీ స్టేడియంలో జరిగేవి. కానీ, ఇప్పుడు హైటెక్స్, హెచ్ఐసీసీ (HICC) వంటి ఐటీ కారిడార్లలోని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా అభిమానుల తాకిడితో రోడ్లన్నీ స్తంభించిపోతున్నాయి. హెచ్ఐసీసీ, హైటెక్స్, నోవాటెల్, జేఆర్సీ, సంధ్య వంటి కన్వెన్షన్లలో నిత్యం ఏదో ఒక భారీ కార్యక్రమంఉంటుండటంతో ఐటీ కారిడార్లు బిజీ బిజీగా మారుతున్నాయి. కుండపోతగా కురిసినప్పుడే సమస్య వాన నీరు వెళ్లే మార్గాల పరిమాణం కంటే అధికంగా కుండపోత వర్షపునీరు వచ్చినప్పుడు రోడ్లన్నీ వరదతో నిండి ట్రాఫిక్ జాం అవుతున్నాయి. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా (Hydraa), పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ మోటార్లతో వరద నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో కనీసం రెండు లైన్లు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. – చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ, మాదాపూర్మల్టీమోడల్ ట్రాన్స్పోర్టే పరిష్కారం బహుళ అంతస్తుల్లో నివాసం ఉండేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నందున డెవలపర్లు కూడా హైరైజ్ ప్రాజెక్ట్లు ఎక్కువగా చేపడుతున్నారు. అయితే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీకి సరైన పరిష్కారం మెట్రో, ఎంఎంటీఎస్ల విస్తరణ, మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ వినియోగమే. ఆఫీసులు, విద్యాసంస్థలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలి. – జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ హైదరాబాద్ -
నాపై కక్ష గట్టారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఆఫీస్లో టీబీజీకేఎస్ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధం. రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్ ఎన్నిక. కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు.‘‘గతంలో కేసీఆర్కు రాసిన లేఖలు లీక్ చేసి కుట్రలు చేశారు. పార్టీ వ్యవహారాలను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. ‘‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను...ఈ పదేళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా, ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది’’ అంటూ లేఖలో కవిత పేర్కొన్నారు.కాగా, కవితకు బీఆర్ఎస్ హైకమాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. గురువారం ఉదయం సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. -
అరిస్తే.. కరుస్తా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. గల్లీల్లో ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, దారిన పోయే పెద్దల వరకూ దాడి చేసి ప్రాణాలు తోడేస్తున్నాయి. మోటారు సైకిల్పై వెళ్లే వారిని సైతం వెంబడిస్తున్నా యి. దొరికితే పిక్కలు పీకేస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజు కు సరాసరిన 100 కేసులు వస్తున్నాయి. నెలలో కనీసం ఒకటి నుంచి రెండు రేబిస్ కేసులు నమోదవుతున్నాయంటే కుక్కకాట్ల తీవ్రను అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ‘ఏబీసీ’ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.‘భౌ’గోళిక సమస్యలతో..కుక్కలు నిత్యం తిరిగే వారిని గుర్తిస్తాయి. కొత్త వ్యక్తులు వచ్చినా, కొత్త జీవాలు వచ్చినా వాటిలో తమ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని భావిస్తుంటాయి. జీహెచ్ఎంసీ జంతు జనన నియంత్రణ ఆపరేషన్లు చేపట్టిన తర్వాత ఒక ప్రాంతంలో పట్టిన కుక్కలను వేరే ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కొంత మంది కుక్కను కొన్నాళ్లకు విసుగొచ్చి మధ్యలో దూరం తీసుకెళ్లి విడిచిపెట్టేస్తున్నారు. దీంతో అవి ఒంటరిగా మారిపోతున్నాయి. వాటికి భౌగోళిక సమస్యలు (టెరిటోరియల్ బిహేవియర్) వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్కడుండే కుక్కలు కొత్తగా వచ్చినవాటిపై దాడి చేస్తున్నాయి. దీంతో వాటిల్లో అభద్రతా భావం నెలకొంటోంది. ఒకరకమైన ఉద్రేకమైన భావనలోకి వెళిపోతుంది. మనుషులను, జంతువులను శత్రువులుగా చూస్తుంది. సరైన ఆహారం, ఆవాసం లేకపోవడం సమస్యలతో దాడులకు తెగబడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్మానుష్య ప్రాంతాలు దాటాలంటే భయపడాల్సివస్తోంది.రూ.30 కోట్లు ఖర్చు చేసినా..ఒక్కో కుక్క ఒక దఫా 7 నుంచి 8 పిల్లలకి జన్మనిస్తుంది. జీహెచ్ఎంసీ, జంతు సంక్షేమ సంఘాలు జంతు జనన నియంత్రణ (ఏబీసీ), యాంటీ రేబిస్ కార్యక్రమాలను చేపడుతున్నాయి. సిటీ పరిధిలో 20 లక్షలకుపైగా కుక్కలు ఉండగా ఏటా సుమారుగా 50 వేల నుంచి 60 వేల వీధి కుక్కలను పట్టుకుని, జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నారు. ఏబీసీ కోసం గత రెండేళ్లలో రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోతున్నారు.రేబిస్ ప్రాణాంతకమే..చల్లని వాతావరణంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. వీధి కుక్కల్లో ఒక కుక్కకు రేబిస్ సోకినా, అది గుంపులో కలవడం అన్నింటికి వైరస్ సోకుతోంది. మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. రేబిస్ వ్యాధి ప్రాణాంతకంగానే పరిణమిస్తుంది. రేబిస్ సోకిన కుక్కకు గొంతులో కండరాలు బిగుసుకుపోతాయి. నీరు, ఆహారం, చివరికి లాలాజలం కూడా మింగడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. ఆ కుక్క కరిసి నా, దాని లాలాజలం మనుషుల శరీరంపై ఉన్న గా యాలపై పడినా రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది.నియంత్రణ ఒక్కటే మార్గంగ్రేటర్లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వాటిని నియంత్రణ ఒక్కటే మార్గం. జంతు కుటుంబ నియంత్రణ (ఏబీసీ)ఆపరేషన్ల సంఖ్యను, సంరక్షణ కేంద్రాలను పెంచాలి. కుక్క కరిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. వెంటనే డైద్యుడిని సంప్రదించి, (ఏఆర్బీ)యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కరిచిన కుక్కను గుర్తించి మున్సిపల్ వారికి అప్పగించాలి.– డా. డి.అశోక్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ -
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: నగర శివారులోని జంట జలాశయాలు నిండుకుండున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువన నీరు విడుదల చేస్తుండగా.. బుధవారం సాయంత్రం ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. పరీవాహక ప్రాంతాల్లోని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది.హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం : 1,763.50 అడుగులుప్రస్తుత నీటిమట్టం : 1,763.00 అడుగులుఇన్ఫ్లో : 1600 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 1,017మొత్తం గేట్లు : 17ఎత్తిన గేట్లు : 1 గేటు మూడు అడుగుల మేరఉస్మాన్సాగర్పూర్తి స్థాయి నీటి మట్టం : 1,790 అడుగులుప్రస్తుత నీటిమట్టం : 1,788.60 అడుగులుఇన్ఫ్లో : 1200 క్యూసెక్కులుఅవుట్ఫ్లో : 220మొత్తం గేట్లు : 15ఎత్తిన గేట్లు : 2 గేట్లు.. అడుగు మేర -
సినీ కార్మికులు రోడ్డున పడ్డారు
బంజారాహిల్స్: వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. షూటింగ్లు జరగకపోవడంతో పూట గడవడంలేదు. ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.30 శాతం వేతనాలు పెంచాలంటూ..నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాల్సి ఉంటుంది. గత జూన్ 30న ఈ గడువు ముగిసింది. జూలై 1 నుంచి పెంచిన 30 శాతం వేతనాలతో సినీ కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వేతనాల పెంపునకు ఫిలిం ఛాంబర్ వెనుకడుగు వేసింది. తమకు మూడు నెలల గడువు కావాలంటూ కోరింది. నెల గడవకముందే తాము 15 శాతం వేతనాలు పెంచుతామని అది కూడా మూడు విడతలుగా పెంచుతామని ఫైటర్లు, డ్యాన్సర్లు, టెక్నీషియన్లకు మాత్రం పెంచేది లేదంటూ మెలిక పెట్టింది. దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సాధ్యం కాని షరతులకు ఒప్పుకోలేదు. ఫలితంగా రెండు వారాల నుంచి సినీ పెద్దలకు కార్మిక యూనియన్ నాయకులకు చర్చలు జరుగుతున్నా అవి ఫలప్రదం కావడం లేదు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇంటి అద్దెలు కట్టాలంటూ కొందరు, పిల్లల ఫీజులు చెల్లించలేక ఇంకొందరు.. ఇలా సినీ కార్మిక లోకం కన్నీరు పెడుతోంది. గత మూడు రోజుల నుంచి కొందరు సినీ పెద్దలు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఫిలిం ఫెడరేషన్ అనుబంధంగా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్లు, లైట్మెన్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్ ఆర్టిస్ట్లు, డ్రైవర్లు.. తదితర కార్మికులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటున్నారుషూటింగ్లు ఉంటేనే ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు చెల్లించగలుగుతాం. ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేక చాలా మంది కార్మికులు చేతులెత్తేశారు. ఇప్పటికై నా సినీ పెద్దలు మా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి మా డిమాండ్లు నెరవేర్చాలి. – లలిత, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్అన్నీ కొర్రీలేమా డిమాండ్లు నెరవేర్చడంలో కొర్రీలు పెడుతున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవుల్లో ఫుల్ కాల్షీట్లు ఇస్తారు. ఇవి ఇచ్చేది లేదంటూ పెద్దలు చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. మా కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎందుకింత పట్టుదలగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. - చంద్రకళ, జనరల్ సెక్రటరీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ -
విన్నావా.. వినాయకా!
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) బదులు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని పంపిణీ చేయాలన్న జీహెచ్ఎంసీ ఆలోచన మంచిదే. ప్రతిమలను ఉచితంగానే పంపిణీ చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. ఆ సంస్థలను సంప్రదించకుండా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే అందుకు నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమవడం ఆరోపణలకు తావిస్తోంది.ఇప్పటికే జీహెచ్ఎంసీ చెరువుల ప్రక్షాళన, తదితర కార్యక్రమాల కోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్ నిధులతో పనులు చేస్తోంది. కోట్లాది రూపాయలతో ఆ పనులు చేస్తున్న జీహెచ్ఎంసీకి.. మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సీఎస్సార్ నిధులు వినియోగించుకోవాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలోనే పనులు చేస్తూ ఏటా కోట్ల రూపాయల పనులు పొందుతున్న సంస్థలు సైతం స్వచ్ఛందంగా వాటంతట అవే ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. కనీ సం ఆ సంస్థలను సంప్రదించినా జీహెచ్ఎంసీకి రూ పాయి ఖర్చు లేకుండా, ఖజానాపై ఎలాంటి భారం పడకుండా ప్రజలకు ఉచితంగానే మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం సాధ్యమయ్యేది.టెండర్లకు వెళ్లేందుకే..ఎల్–1 ధరలకు మట్టి వినాయక విగ్రహాలను సరఫరా చేసే సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా బల్దియా తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. అది ఏమైనా ఆ రంగంలో పని చేస్తున్నవారందరూ వినియోగించుకునేలా ఉందా? అంటే అదీలేదు. కేవలం రెండు రోజుల గడువులో కేవలం వ్యక్తిగతంగానే టెండర్లు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైన వారిని ఎంప్యానెల్కు ఎంపిక చేశాక మూడు రోజుల్లో విగ్రహాలను నిర్ణీత ప్రాంతాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టెండరులో పాల్గొనేందుకు ఆన్లైన్ అవకాశమూ ఇవ్వలేదు. ఏవైనా సందేహాలుంటే సంప్రదించాలంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవారే లేరు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ‘ఆస్థాన కళాకారుల’ కోసమే ఈ టెండర్లు పిలిచినట్లుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తూతూమంత్రంగా..గతంలోనూ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలని ప్రకటనలు గుప్పించినప్పటికీ.. ఒప్పందం మేరకు తయారు చేయాల్సినన్ని చేయలేదనే ఆరోపణలున్నాయి. తయారైన వాటిని ఎన్ని చోట్ల ఎవరికి పంపిణీ చేశారో తెలియదు. కొన్ని చెత్త కుప్పల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఆ మాత్రం దానికి జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయడం ఎందుకనే విమర్శలు వెల్లువెత్తినా.. జీహెచ్ఎంసీ ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు.ఇలా చేయాల్సింది..ఒకవేళ నిజంగానే చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటే ఇందిరా మహిళాశక్తి పేరిట క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయిస్తున్న జీహెచ్ఎంసీ.. సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళా సంఘాల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయించి పంపిణీ చేస్తే.. అటు వారికి ఉపాధి, ఇటు పర్యావరణహితమూ సాధ్యమయ్యేవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.ఏవి ఎన్నో వివరాలేవి?గతంలో మాదిరిగానే 8 అంగుళాలవి, 1 అడుగు, 1.5 అడుగుల మట్టి విగ్రహాలు నిర్ణీత వ్యవధిలోగా అందించాలని పేర్కొన్నప్పటికీ, ఏ సైజువి ఎన్నో వివరాల్లేవు. అంటే అవసరాన్ని బట్టి విగ్రహాల సంఖ్యను పెంచుతారో, తగ్గిస్తారో చెప్పలేని పరిస్థితి. దీంతో.. విగ్రహాల పేరిట ఈసారి ఎన్ని నిధులు ఖర్చు చేయనున్నారో తెలియదు. గతంలో రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు.ఇవీ ధరలు..గరిష్టంగా ఏ సైజు విగ్రహాలకు ఎంత చెల్లిస్తారో వివరాలిలా ఉన్నాయి.● 8 అంగుళాల విగ్రహం: రూ. 33.39● 1 అడుగు విగ్రహం: రూ.136.50● 1.5 అడుగు విగ్రహం: రూ.339.15 -
శాంతిని నెలకొల్పడంలో పీస్ కమిటీలు కీలకం
నగర కొత్వాల్ సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల పాత్ర కీలకమని సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన అన్ని జోన్లకు సంబంధించిన పీస్ కమిటీల సభ్యులతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఉన్న ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ‘నగరంలో మొత్తం 1500 మంది పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉన్నారు. వివిధ వర్గాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించడంలో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో దోహదపడుతోంది. నగరానికే ప్రత్యేకమైన ‘గంగా–జమునా తెహజీబ్’ను (వివిధ మతాల మధ్య సామరస్యం) నిలబెట్టడానికి ఈ కమిటీలు ఎంతో కృషి చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ తమ ఏరియాలో శాంతిని నెలకొల్పడానికి కమిటీ సభ్యుల సేవలు అవసరం. శాంతి భద్రతలను పరిరక్షించడానికి స్థానిక పోలీసులకు సహకరించాలి. ఈ కమిటీల సభ్యుల కృషి వల్లే నగరానికి మంచి పేరు వచ్చింది. పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల్లో యువకులను కూడా చేర్చుకోవాలి. పోలీసు అధికారులు సమాజంలోని సభ్యులతో కలిసి, వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తేనే సరైన పోలీసింగ్ సాకారం అవుతుంది’ అని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సిటీ పోలీసులకు మద్దతుగా ఉంటూ, రాబోయే పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావం, ఐక్యత నెలకొల్పడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఎస్పీ డీసీపీ కె.అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎస్ఎస్ఆర్ షెడ్యూల్
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) షెడ్యూల్ విడుదల చేసిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎస్ఎస్ఆర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లకు అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 25 వరకు వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు తుది జాబితా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వివిధ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సూచనలు స్వీకరించి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధులు మర్రి శశిధర్ రెడ్డి, కొల్లూరి ప్రవీణ్ కుమార్, పి.వెంకటరమణ, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి కె.సందేశ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మల్లంగి విజయ్, సీపీఎం ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజేష్ కుమార్, మహ్మమద్ వాజిద్ హుస్సేన్, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి ప్రశాంత్ రాజు యాదవ్, ఎంఐఎం నుండి సయ్యద్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం: కమిషనర్
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్నగర్, ఎస్సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
కొత్వాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కోర్టు
సాక్షి, సిటీబ్యూరో: అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలు కలిగిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్ల సమస్యను పరిష్కరించారు. పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కొత్వాల్ ఆయా గ్యాంగ్లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం పది పోలీసుస్టేషన్లకు సంబంధించిన 11 గ్యాంగ్లకు చెందిన 101 మందిని విడిగా విచారించారు. అందులో ఆరు గ్యాంగ్లు తమ పెద్దలు, కుటుంబీకుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నామని కొత్వాల్కు తెలిపాయి. మిగిలిన గ్యాంగ్లు భవిష్యత్తులో కూడా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లయితే వారితో బాండ్ రాయించుకుంటామని తెలిపారు. ఆపై ఈ కోర్టు విచారణను తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ కోర్టుకు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వరావుతో పాటు పది ఠాణాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. -
ఫెయిలయ్యాననే దిగులుతో బాలుడి ఆత్మహత్య
హస్తినాపురం: ఇంటర్లో ఫెయిలవడంతో కొద్ది నెలలుగా మనస్తాపం చెందిన ఓ బాలుడు ఫ్యాన్కి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శారదనగర్కాలనీలో నివాసం ఉంటున్న పావని, అనిల్కుమార్ దంపతుల పెద్ద కుమారుడు ఉమామహేశ్వర్ (17) గత మార్చిలో రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల డిప్రెషన్కు లోనయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లి రాత్రి 11 గంటలకు వచ్చి ఒంటరిగా తన బెడ్రూంలో పడుకున్నాడు. మధ్య రాత్రి అనిల్కుమార్ చిన్న కుమారుడికి వాంతులు కావడంతో వాష్రూంకు తీసుకెళ్లేందుకు ఉమా మహేశ్వర్ పడుకున్న బెడ్రూం డోర్ను కొట్టగా డోర్ లాక్చేసుకుని ఉన్నాడు. అతని సెల్ఫోన్కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో బెడ్రూం తలుపులు పగలగొట్టి చూడగా ఉమామహేశ్వర్ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కిందకి దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుని తల్లి పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఎలక్షన్ కమిషన్ ‘మోదీ కమిషన్’గా మారింది
పంజగుట్ట: దేశంలో హిందుత్వ, ఫాసిస్టు విధానాల అమలులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ను మోదీ కమిషన్గా మార్చిందని పలువురు వక్తలు విమర్శించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, జాగో నవ భారత్, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘వుయ్ డిమాండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్–ఫెయిర్ ఎలక్షన్స్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ చంద్రకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలంలో ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగ యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నారని, బిహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఎన్నికల కమిషన్ కొత్త నాటకం ఆడుతుందని, అందులో భాగమే ఓటర్ల సవరణ అని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీగా ఉండాలని, అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించారు. ఒకప్పుడు ఎన్నికల్లో ఫిజికల్ రిగ్గింగ్ జరిగేదని, ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జానకి రాములు, పోటు రంగారావు, వి.శ్రీనివాస్, సోహ్రాబేగం, పాశం యాదగిరి, బండి దుర్గా ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల విమర్శ -
పుస్తకాలు, పత్రికలు చదవండి
● విద్యార్థులకు హైడ్రా కమిషనర్ సూచన ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాలు, దిన పత్రికలను చదడం అలవాటుగా చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సానుకూల థృక్పథంతో భవిష్యత్కు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమం తప్పకుండ తరగతులకు హాజరుకావాలన్నారు. విద్యార్థుల జీవితంలో 90 శాతం విజయం కష్టపడి పని చేయడం వల్ల, 5 శాతం స్మార్ట్ వర్క్, 5 శాతం నెట్ వర్కింగ్ వల్ల లభిస్తుందన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండ పుస్తకాలను చదవడం అలవాటుగా పెట్టుకోవాలని విద్యార్థులకు చూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.చంద్రశేఖర్, ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ సుమన్ సిన్హా, ఇంజినీరింగ్ డీన్ ప్రొ.ఎ.కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.మంగు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
సచివాలయంలో అరుదైన పక్షి
ఆఫ్రికన్ గ్రే ప్యారెట్గా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయానికి బుధవారం అరుదైన అతిథి వచ్చింది. సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయం పేషీ సిబ్బంది వద్దకు ఓ అరుదైన పక్షి వచ్చి వాలింది. వాతావరణం చల్లగా ఉండటం, వర్ష ప్రభావం వల్ల..ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి సచివాలయానికి చేరింది. దీనిపై కార్యాలయంలోని సిబ్బంది అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ పక్షిని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శ కాచిగూడ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. బుధవారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ‘ఛలో సెక్రటేరియట్ – సేవ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లు విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎన్.గౌతంరావు, ఆనంద్గౌడ్, శ్రీనివాస్,శ్యామ్ సుందర్, రాజశేఖర్, మేకల సారంగపాణి, సందీప్, కొంతందీపిక, కేశబోయిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ఖైరతాబాద్: పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్ను నిర్ణయించే అవకాశం కల్పించారని, కంప్యూటర్ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్గాంధీ స్పూర్తితోనే ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. తాము కూడా రాజీవ్ బాటలో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో పేదల కలలు సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమన్నారు. జయంతి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని రాజీవ్కు నివాళులర్పించారు. రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ను ప్రధానిని చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి..
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్లోని మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి మొత్తం 16వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. దీని విలువు దాదాపు 400 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కబ్జాదారులపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. మాదాపూర్లోని జూబ్లీ ఎన్క్లేవ్లోని ఆక్రమణలకు హైడ్రా తొలగించింది. మాదాపూర్లో జైహింద్ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని అక్కడి ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన లే అవుట్లో ఉన్న నాలుగు పార్కుల్లో రెండు పార్కులతో పాటు, ఐదువేల గంజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని దాదాపు 16వేల గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది.హైడ్రా గుర్తించిన భూమి విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. 1995లో అనుమతి పొందిన లే అవుట్ను 2006లో అప్పటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీంతో, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్, హోర్డింగ్లను హైడ్రా తొలగించింది. హోటల్ అద్దె, ప్రకటనల ద్వారా జైహింద్ రెడ్డి నెలకు 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం.. పార్కులు, ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు పెట్టింది. ఇక, కబ్జాదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిసింది. -
హైకోర్టు కీలక ప్రశ్న.. రేపు చెబుతామన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు?. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు.. రేపు సమాధానం చెబుతామంటూ ఏజీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం తెలుసుకున్న విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. రేపే సమాధానం చెబుతామంటూ ఏజీ తెలపడంతో తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. -
మియాపూర్లో మిస్టరీ డెత్స్.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త,మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రూ.50 వేలు ఇవ్వకుంటే వీడియో వైరల్ చేస్తా..
బంజారాహిల్స్ : ‘వెనుక కూర్చొని మీరు చేసిన పనులన్నీ గమనించా..వీడియో తీశా..వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలి’ అంటూ బెదిరింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కవాడిగూడకు చెందిన అహ్మద్ అనే యువకుడితో పాటు మరో యువతి హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఈ నెల 17వ తేదీన వీరిద్దరూ విధులు ముగిసిన తర్వాత సాయంత్రం 5.30 గంటలకు కవాడిగూడ వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుకున్నారు.జహీరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్ వీరిద్దరినీ ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో బంజారాహిల్స్ రోడునెంబర్–2లోని టీవీ–9 సమీపంలో ఓ స్నేహితుడిని కలిసేందుకు 20 నిమిషాలు ఆగి..తిరిగి బయలుదేరారు. వీరిద్దరినీ కవాడిగూడలో దింపిన తర్వాత అహ్మద్ జీపే ద్వారా బిల్లు చెల్లించాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి అహ్మద్కు ఓ మేసేజ్ వచి్చంది. నువ్వు వెనుక కూర్చొని ఆ అమ్మాయితో ఏమేమీ చేశావో అన్నీ తాను రికార్డ్ చేశానని, వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.గంటసేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తాను చిన్న ఉద్యోగినని అహ్మద్ చెప్పగా, ఒక రోజు గడువు ఇస్తున్నానని, తెల్లారిలోగా రూ.50 వేలు తెచి్చవ్వాలని హెచ్చరించాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఊబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్పై బీఎన్ఎస్ సెక్షన్ 77, 308 (3), 351 (2), ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండ్రోజుల్లో ‘దగ్గుపాటి’ క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ‘జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను టీడీపీ నుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలని.. రెండ్రోజుల్లో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే అనంతపురం ముట్టడిస్తామని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరించారు. ‘నందమూరి’ కోడలిని తిడితే ఎలా ఒప్పుకుంటామని వారు బుధవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రెస్మీట్ పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరికైతే ఫోన్చేసి బూతులు మాట్లాడాడో అతన్ని పక్కన కూర్చోపెట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు నరేంద్ర చౌదరి, సుధీర్ రాజు, కావూరి కృష్ణ, బాబ్జి, ఆదోని ముజీబ్లు ఏమన్నారంటే..ఎమ్మెల్యేను టీడీపీ నేతలు నిలదీయాలి..ప్రజాప్రతినిధి అయి ఉండి ఎమ్మెల్యే దగ్గుపాటి ఒక మాతృమూర్తిని నోటికి ఎంతవస్తే అంత సోయిలేకుండా మాట్లాడడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ అంటే మహిళలను ఎంతో గౌరవించే పార్టీ అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఇలా ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడాడో ఆయన్ని నిలదీయాలి. ప్రసాద్ అనే ఎమ్మెల్యే వెనక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లేకపోతే తమ సత్తా ఏమిటో చూపించే వాళ్లం. తప్పుచేసి ఇప్పుడు నా వాయిస్ కాదు అని అంటున్నాడు. కానీ, ఫోన్లో మాట్లాడిన అభిమానం మాత్రం ఎమ్మెల్యేనే మాట్లాడాడని స్పష్టంగా చెబుతున్నాడు. దీంతో.. ఎమ్మెల్యే ప్రసాద్ అతనిని, అతని కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. దగ్గుపాటి అహంకారానికి నిదర్శనం..ప్రభుత్వం సినిమాకు అనుమతిచ్చిన తరువాత ‘ఎలా రిలీజ్ చేస్తారు’ అని అనడానికి ఎమ్మెల్యే ఎవరు? 25 ఏళ్లుగా తలాతోక లేనివారు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ ఏనాడూ ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనలేదు. వార్–2 సినిమా ప్రమోషన్లో కూడా పాతికేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఎన్టీఆర్ చెప్పారు కానీ, ఎవ్వరినీ విమర్శించలేదు.. ఎవరికీ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. అయినా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం. రెండ్రోజుల్లో ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే చలో అనంతపూర్ నిర్వహించి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. అక్కడి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన, రాస్తారోకో చేస్తాం. ఎన్టీఆర్ యువసైన్యం తన సత్తా చూపిస్తుంది.ఏపీలో ప్రెస్మీట్ పెట్టే పరిస్థితి లేదు..ఇక ఈ ప్రెస్మీట్ అనంతపురంలో పెట్టాల్సింది. కానీ, అక్కడ పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెట్టి మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఆఖరుకు విజయవాడలో పెడదామనుకున్నా అక్కడ కూడా పెట్టకూడదంటున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో చివరికి హైదరాబాద్కు వచ్చి సమావేశం పెట్టాల్సి వచ్చింది. -
మూసీలో గోదావరిని పారిస్తాం
గచ్చిబౌలి: గోదావరి నదీ జలాలతో మూసీ నది ఏడాదంతా పారేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. గోదావరి నుంచి 35 టీఎంసీల నీటిని గండిపేట, హిమాయత్సాగర్కు తరలించి 365 రోజులూ మూసీ నది స్వచ్ఛమైన నీటితో ప్రవహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. మూసీ సుందరీకరణ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీలను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెట్రో రైల్ విస్తరణతో హైదరాబాద్లో రాత్రి సమయంలో కూడా మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తా మని చెప్పారు. బుధవారం గచ్చిబౌలిలోని తాలింలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. 1994 నుంచి 2014 వరకు పనిచేసిన ముఖ్యమంత్రులు హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు.. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్సిటీకి పునాది వేసినప్పుడు కొందరు దానిని హేళన చేశారు.నేడు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ కూడా కొందరికి ఇష్టం లేక విమర్శలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చూన్ –500 జాబితాలోని కంపెనీల్లో హైదరాబాద్లోనే 85 ఉన్నాయి. ఐటీ కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు. అదే ఒరిజినల్ సిటీ’అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో..ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే సబ్రిజి్రస్టార్ కార్యాలయాల్లో ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో సకల సౌకర్యాలతో అత్యాధునిక సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ ప్రాంతంలో 39 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, 11 ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఎనిమిది నెలల్లో రూ.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అపర్ణ ఇన్ఫ్రా సంస్థ గచి్చబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి మిగిలిన 10 భవనాల నిర్మాణం పూర్తిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆదేశించారు. రోల్ మోడల్గా భూభారతి ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేసి రెవెన్యూ సంస్కరణల్లో రోల్ మోడల్గా భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండా సీఎస్ఆర్ నిధులతో ఆయా కంపెనీల సహకారంతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలి తాలింలో రూ.30 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తామని తెలిపారు. భవనంలో డీఆర్ఓ, ఆరుగురు ఎస్ఆర్ఓల ఆఫీసులు, వెయిటింగ్ హాల్, టోకెన్ సిస్టమ్, వివాహ రిసెప్షన్ కోసం ప్రత్యేక హాల్, ఫీడింగ్ రూమ్, చిన్నారుల కోసం క్రష్ సెంటర్, వృద్ధుల కోసం ర్యాంప్, వీల్చైర్ సదుపాయం, 300 కార్లకు పార్కింగ్, గ్రీన్ బిల్డింగ్, సెల్లార్ సిస్టమ్, కేఫ్ ఉంటాయని చెప్పారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
ఆ మరణాలకు బాధ్యులెవరు...?
సాక్షి, హైదరాబాద్: ‘కేబుల్ వైర్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యులెవరో చెప్పండి? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు అన్యాయంగా దుర్మరణం చెందారు. అందుకు బాధ్యులు కేంద్రమా? రాష్ట్రమా? జీహెచ్ఎంసీనా? కేబుల్ ఆపరేటర్లా? ఎవరికి వారు మాకు సంబంధం లేదని చెప్పడం దుర్మార్గం. కేబుళ్ల పునరుద్ధరణ సమస్యే కాదు’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్లోని రామంతాపూర్లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్ టెల్ బుధవారం లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. మధ్యంతర ఉత్తర్వులివ్వలేం పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ.. కేబుల్ వైర్ల ఏర్పాటు కోసం ముందుగా అన్ని అనుమ తులు తీసుకుని.. రూ.21 కోట్లు చెల్లించా మని తెలిపారు. ప్రభుత్వం తొలగించాలని నిర్ణయం తీసుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ నోటీసులివ్వకుండా కేబుళ్లను కట్ చేయడం సరికాదని వాదించారు. గృహాలకు కేబుల్ తీసుకున్న వారు కూడా విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్నారని, అందుకు తమను బాధ్యులను చేయడం తగదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్నెట్ సేవలు అందక డాక్టర్లు, న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సమస్య వచ్చినప్పుడల్లా ఇలా పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. గతంలో ఇలాగే పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. విద్యుత్ స్తంభాలపై పరిమితికి మించి కేబుళ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ దశలో తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వైర్ల తొలగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. అప్పటివరకు వైర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్కు సూచించారు. వివరాలను మా ముందు ఉంచండి: లోకాయుక్త సాక్షిలో వచ్చిన ‘కృష్ణుడి శోభాయాత్ర విషాదాంతం’వార్తకు లోకాయుక్త స్పందించింది. ఐదుగురు మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణకు స్వీకరిస్తూ.. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ (ఆపరేషన్స్), ఉప్పల్ సీఐని ఆదేశించింది. వచ్చే నెల 11లోగా వివరాలను సమర్పించాలని ఆదేశించింది. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’కు కోత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు సగం మందిపై ప్రభావం చూపించేలా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు సూచించింది. మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇంజనీరింగ్ ఫీజులతో పాటు, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపైనా చర్చించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.8 కోట్ల మేర పేరుకుపోవడంతో.. పరీక్షల సమయంలో యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ అంశాలను విద్యా, సంక్షేమ శాఖల అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు తీరును మార్చాలని, అర్హతల్లో మార్పులు చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. దీనివల్ల అర్హులైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం దీన్ని కొనసాగించాయి. లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేస్తూ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఈ కారణంగానే ఏ ప్రభుత్వమూ ఇందులో ఏ చిన్న మార్పూ చేయడానికీ సాహసించలేదు. తాజాగా ఈ పథకం నిబంధనలు సవరిస్తే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. మార్పుల ప్రభావంపై నివేదిక కోరిన ప్రభుత్వం!ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ అర్హతల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలనే కొత్త నిబంధన తీసుకురావాలని సీఎం సూచించినట్టు తెలిసింది. దీంతో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో నిర్దిష్ట మార్కులను ప్రామాణికంగా తీసుకునే అంశంపైనా ఆయన అధికారులతో చర్చించినట్టు తెలిసింది. డిగ్రీ కోర్సుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లోపిస్తున్నాయని, ఇలాంటి వారిని రీయింబర్స్మెంట్ నుంచి తప్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదే సమయంలో సాంకేతిక విద్యకు సంబంధించి కొన్ని మార్పులపై ఈ సందర్భంగా చర్చించారు. కోర్సుకు సంబంధించిన ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకోవాలని, వారికే రీయింబర్స్మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి తెచ్చినట్టు సమాచారం. ఉదాహరణకు సీఎస్ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. ఆ విధంగా ఆయా కోర్సులకు సంబంధించిన ప్రధాన సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు తీసుకొస్తే ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఎంతవరకూ ఉంటుందో నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు తెలిసింది.కొత్త నిబంధనలతో కష్టమే..!రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. ఈ కారణంగానే తొలి ఏడాది పలు సబ్జెక్టులు మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 75 శాతం హాజరు విషయంలోనూ భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. యూనివర్సిటీలు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా పాఠాలు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు రీయింబర్స్మెంట్ విషయంలో ఇబ్బంది తప్పదని అధికారులే చెబుతున్నారు. -
నాణ్యతే కొలమానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై త్వరలో స్పష్టత రానుంది. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పలు అంశాలతో నివేదిక రూపొందించింది. కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో బుధవారం సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ నివేదికను ఒకటిరెండు రోజుల్లో సీఎంకు పంపే అవకాశం ఉంది. 2025–26 నుంచి 2028–29 బ్లాక్ పీరియడ్కు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. పెద్ద కాలేజీలకే పండగ రాష్ట్రంలోని 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. అత్యున్నత, మధ్యస్థ, అతి తక్కువ ప్రమాణాలుగా కేటగిరీలు చేస్తున్నారు. మొత్తం కాలేజీల్లో 115 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాల్లో ఉన్న 41, హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో 50 కలిపి మొత్తం 91 కాలేజీలు సాధారణ ప్రమాణాలతో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిల్లో 45 కాలే జీల్లో కనీస స్థాయి ప్రమాణాలు ఉన్నాయని భావిస్తున్నారు. జాతీయ ర్యాంకుల్లో ఇవి వెనుకబడి ఉన్నాయి. కాలేజీల ఆడిట్ నివేదికల ఆధారంగా వీటికి కూడా ఏటా ఫీజులు పెంచుతున్నారు. మొత్తంగా 5 నుంచి 7 శాతం మేర ప్రతి మూడేళ్లకు ఫీజులు పెరుగుతున్నాయి. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్తో పాటు ఇతర జాతీయ ర్యాంకులున్న కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచాలని, ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న కాలేజీలను ఫీజుల పెంపునకు అనుమతించాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది. టాప్ కాలేజీలు మాత్రమే ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి. కమిటీ నివేదిక ప్రకారం టాప్ కాలేజీలకు మాత్రమే ఫీజులు పెరిగే వీలుంది. చిన్న కాలేజీలకు ఫీజుల కోత, లేదా సాదాసీదా పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాగా, రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. వీటిని కట్టడి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఏఐసీటీఈ వీటికి అనుమతి ఇస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం డీమ్డ్ వర్సిటీలకు నిరభ్యంతర పత్రాలు ఇస్తుంది. ఇలా ఎన్ఓసీ పొందిన వర్సిటీల పత్రాలను పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లకు సంబంధించిన మద్యం పాలసీని ప్రకటించింది. గత పాలసీతో పోలిస్తే దుకాణాల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడం మినహా పెద్దగా మార్పులేమీ లేవు. అయితే దరఖాస్తు ఫీజు పెంపు ద్వారానే కనీసం రూ. 3,500 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్ కాలపరిమితిని మూడేళ్లకు పెంచాలని భావించినా, పలు సమీకరణాల దృష్ట్యా లైసెన్స్ కాల పరిమితిలో మార్పులు చేయలేదు. ఈ మేరకు బుధవారం వచ్చే రెండేళ్ల కోసం నూతన మద్యం విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం.రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. లాటరీ పద్ధతిలోనే మద్యం దుకాణాలు » 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు అమలయ్యే ఈ విధానం ప్రకారం.. గతంలో ఉన్నట్టుగానే లాటరీ పద్ధతి (డ్రా) ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అయితే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన వార్షిక ఫీజు (రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్–ఆర్సెట్) లో ఎలాంటి మార్పు చేయలేదు. » 5 వేల జనాభాలోపు ఉన్న మద్యం దుకాణానికి రూ.50 లక్షలుగా ఉన్న ‘ఆర్సెట్’ను 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఆరు స్లాబులు కేటాయించారు. » 5 వేల నుంచి 50 వేల జనాభా గల దుకాణాలకు రూ. 55 లక్షలు, రూ. 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ. 85 లక్షలు రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్గా నిర్ణయించారు. » 20 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలకు ఎక్సైజ్ ట్యాక్స్ను రూ.1.10కోట్లుగా వసూలు చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దుకాణాలతోపాటు జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్ల పరిధివరకు కూడా ఇదే స్లాబ్ వర్తిస్తుంది. » మునిసిపాలిటీలకు 2 కిలోమీటర్ల వరకు ఆయా మునిసి పాలిటీల్లో అమలయ్యే ‘ఆర్సెట్’స్లాబ్ వర్తిస్తుందని ప్రభు త్వం తెలిపింది. వార్షిక ఎక్సైజ్ ట్యాక్స్ను లైసెన్స్దారులు ఆరు విడతలుగా చెల్లించాలి. మొత్తం ఫీజులో 25 శాతాన్ని బ్యాంకు గ్యారంటీ కింద 25 నెలలకు ఇవ్వాలి. వార్షిక పన్ను కన్నా పది రెట్లు ఎక్కువగా మద్యం విక్రయాలు జరిపితే 10 శాతం టర్నోవర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అవే రిజర్వేషన్లు గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను దుకాణాల కేటాయింపులో గతంలోనే మాదిరిగానే అమలు చేస్తారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా వాకిన్ స్టోర్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఫీజు ను రూ. 5లక్షలుగా నిర్ణయించారు. ఈ స్టోర్స్లో గ్లాసులు, వాటర్ బాటిళ్లు, ఐస్, తినుబండారాలను విక్రయిస్తారు. ఇవి కాకుండా వైన్షాపునకు అదనంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఒక్కో షాపుపై సంవత్సరానికి రూ.5 లక్షల ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్ఆర్ఈటీ) చెల్లించాల్సి ఉంటుంది. -
ఆగిన ఇంటర్నెట్ సేవలు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు వేసిన కేబుల్ వైర్ల వల్ల హైదరాబాద్లో విద్యుత్ షాక్ తగిలి పలువురు ప్రాణాలు పో గొట్టుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కరెంట్ పోల్స్కు ఉన్న తీగలన్నీ తీసివేయాలని ఆదేశించింది. కొన్ని నెలలుగా నోటీసులిస్తున్నా పట్టించుకోని ఆపరేటర్లపై చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.కేబుల్ వైర్లను తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. దీంతో చాలాచోట్ల ఇంటర్నెట్ ఆగిపోయింది. ఆన్లైన్ ఆధారిత కార్యక్రమాలు నిలిచిపోయాయి. మీ–సేవ, ఈ–సేవ, రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్కు తిప్పలు పడ్డారు. అటు వర్క్ఫ్రంహోం చేస్తున్న ఉద్యోగులు ,సర్విస్ అందించే టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారుల దృష్టికి సమస్య..కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ ఉన్నతాధికారులను బుధవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఒక్కసారిగా నెట్ బంద్ కావడంతో తలెత్తిన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చారు. కొంతసమయం ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు పరిస్థితిని గుర్తించారు. విద్యుత్ స్తంభం 30 అడుగుల వరకూ ఉంటుంది. 15 అడుగుల వరకూ కేబుల్కు అనుమతిస్తూ, అంతకుపైన ఉన్న కేబుల్స్ను తొలగిస్తామని చెప్పారు. 15 అడుగులకిందకు ఉన్నా తొలగిస్తున్నారని, సిబ్బందికి చెప్పినా వినిపించుకోవడం లేదని ఆపరేటర్లు చెప్పారు. దీంతో అన్ని స్థాయిల అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్టు డిస్కమ్ సీఎండీలు తెలిపారు. -
యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టే రాష్ట్రంలో కొరత నెలకొందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధమని తాను గతంలోనే సవాల్ విసిరితే, దానిపై స్పందించడానికి ఆ పార్టీ నాయకులు ధైర్యం చేయలేదన్నారు. కేంద్రం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని చెప్పారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని, మిగిలిన 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్గా ఉందని చెప్పారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేసింది. కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు’అని తెలిపారు. తాను తెలిపిన ఈ వివరాలు తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాంచందర్రావు సవాల్ విసిరారు.అలా నిరూపించలేకపోతే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాకు సిద్ధం కావాలన్నారు. మంత్రి తుమ్మల ముందుగానే ‘స్టాక్ లేదు’అని అబద్ధాలు చెప్పడం.. ‘మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’లో భాగమని అన్నారు. ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు.‘పంట విస్తీర్ణంలో గతేడాదితో పోల్చితే ఏ మార్పూ లేకపోయినా అదనపు యూరియా ఎక్కడికి వెళ్లింది? నిజంగా రైతుల వద్దకు చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్వహణా లోపంతో కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ఇఫ్కో, క్రిభ్కో, ఆర్సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతుల నుంచి పదివేల మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చాయన్నారు.‘మార్వాడీ గోబ్యాక్’ వెనుక అర్బన్ నక్సల్స్..తెలంగాణలో శాంతి–భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రాంచందర్రావు ధ్వజమెత్తారు. ‘మార్వాడీ గోబ్యాక్’నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని రాంచందర్రావు ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఆత్మప్ర బోధం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి.హన్మంతరావు పేరును ప్రకటించాల్సింది కదా? అది ఎందుకు జరగలేదు’అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. కాంగ్రెస్కు కేవలం బీసీల ఓట్లు మాత్రమే అవసరం తప్ప, వారి అభ్యున్నతి అవసరం లేదన్నారు. దీనితో బీసీవర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్తో పాటు ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్ప టికైనా ఆత్మప్రబోధం మేరకు ఎన్డీఏ ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కి ఓటేయాలని కోరుతున్నామన్నారు. -
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఎరువుల పరిమాణం, ఎంత పంపిణీ అయ్యిందీ, పక్కదారి పట్టిన ఎరువులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును వివరించాలని ఆదేశించారు. తాము వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, పార్టీ తరఫున పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నందినగర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.రైతులు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు‘కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ్ధ విధానాలతో రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేయడం ద్వారా రైతులకు సకాలంలో అందేలా చూశాం. కానీ ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతోనే ఎరువుల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత, సోషల్ మీడియా దుష్ప్రచారం అంటూ సీఎం కాలయాపన చేస్తున్నాడు. కానీ కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులే ఎరువులను బ్లాక్లో అమ్ముతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. దమ్ముంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎరువుల కొరతపై గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి..’ అని కేటీఆర్ సవాల్ చేశారు.కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా‘బీసీ సామాజికవర్గం మీద ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన వారిని ఎందుకు పోటీ చేయించడం లేదు?. కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా. ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తే అయితే కచ్చితంగా వ్యతిరేకించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అని కేటీఆర్ చెప్పారు.‘మార్వాడీ గో బ్యాక్’పై ప్రభుత్వం స్పందించాలి‘‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం స్పందించాలి. విశ్వనగరం హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వారు ఉన్నారు. పొట్ట కూటి కోసం వచ్చే వారితో తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. పొట్ట కొట్టే వారిపైనే పోరాటం. ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు ఇక్కడి వారి సంస్కృతి, మనోభావాలను గౌరవించాలి..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మేము ఏ కూటమిలోనూ భాగస్వాములం కాదు‘బీఆర్ఎస్ సర్వ స్వతంత్ర పార్టీ. మాకు ఢిల్లీలో బాస్ ఎవరూ లేరు. ఢిల్లీ పార్టీలేవి మాకు బాసులు కాదు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మేము ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ భాగస్వాములం కాదు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇప్పటివరకు మమ్మల్ని ఏ కూటమీ సంప్రదించలేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తాం. సెప్టెంబర్ 9లోపు రాష్ట్ర రైతులకు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతాం..’ అని కేటీఆర్ తెలిపారు. -
‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. -
అప్పుడు లేని యూరియా కొరత.. ఇప్పుడే ఎందుకొచ్చింది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. -
సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే హైవే పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్నందుకు యజమాని నుంచి దుర్గాప్రసాద్ రూ.లక్ష వరకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా గొల్ల దుర్గాప్రసాద్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం,హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. -
ఉడత ఊపులకు భయపడేది లేదు.. పోరాటం ఆగదు: సాక్షి మీడియా
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను సంపులో పడేసిన ఓ తల్లి బలవన్మరణానికి ప్రయత్నించింది. పిల్లలు మరణించగా.. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు. -
అందుకే అడగ్గానే ఒప్పుకున్నా: జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ: స్వయంగా దేశ ప్రధానినే తమ అభ్యర్థికి ఓటేయాలని అడుగుతున్నారని.. అలాంటిది తాను ఎంపీలను అడగడంలో తప్పేమీ లేదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి(79) అంటున్నారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. ఓ తెలుగు ఛానెల్తో ఆయన మాట్లాడారు. ‘‘ఉత్తర, దక్షిణ భారత దేశం అనే తేడా లేదు. నేను తెలంగాణలో పుట్టా.. కానీ భారతదేశ పౌరుడినే. ఉపరాష్ట్రపతి పదవిని- దేశాన్ని దయచేసి వేరుగా చేసి చూడొద్దు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. ఇందులో దాపరికం ఏం లేదు. పార్లమెంట్ సభ్యులందరూ విజ్ఞులు. స్వయంగా ప్రధాని తమ అభ్యర్థికి ఓటేయాలని ఎంపీలను అడుగుతున్నారు. అందుకే నేను కూడా నాకు ఓటు వేయాలని ఎంపీలను బహిరంగా కోరుతున్నా.... ఉపరాష్ట్రపతి పీఠం.. రాజకీయ వ్యవస్థేం కాదు. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ వ్యవస్థ కాదనే ఉద్దేశంతోనే అడగ్గానే ఒప్పుకున్నా. రాజకీయ ప్రేరేపిత పరిస్థితుపై మాట్లాడను. ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. నేను పోటీ పడుతోంది ఉప రాష్ట్రపతి పదవి కోసమే. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు. ఆ పదవికి ఉన్న గౌరవం కాపాడాల్సి ఉంది.పార్లమెంట్ సభ్యుల్లో విభజన జరిగిందని నేను అనుకోవడం లేదు. నేను గెలవాలని ఎంపీలు కోరుకుంటున్నారు. నాకు మద్దతు ఇస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడిని అనుకుంటే నాకు ఓటేయండి. భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలి. రాజ్యాంగ పరిరక్షకు కృషి చేస్తా. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నా’’ అని ఎంపీలకు విజ్ఞప్తి చేశారాయన. ఇదిలా ఉంటే.. ఉపరాష్ట్రపతి పదవికి నామినేన్ల దాఖలుకు రేపు ఆఖరి తేదీ. ఇవాళ ఇండియా ఎంపీల కూటమి సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొంటారని.. రేపు(గురువారం) తన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి..
కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్): ఓ యువతి విషయంలో జరిగిన వివాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్పై కొందరు యువకులు దాడి చేసి గాయపర్చారు. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన మేరకు..హిమాయత్నగర్కు చెందిన మధుగౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ నెల 15న కేపీహెచ్బీకాలనీ రోడ్డునెంబర్–1 వద్ద ఓ యువతితో సన్నిహితంగా ఉండేందుకు సంప్రదించాడు. ఈ క్రమంలో యువతితో వివాదం ఏర్పడడంతో ఆమె తన బంధువైన సోహెల్కు ఫోన్ చేసి తెల్పింది . దీంతో సోహెల్ తన అనుచరులైన సాయికుమార్, బారెడ్డి సిసింధర్ రెడ్డి, బారెడ్డి ప్రతాప్రెడ్డి అలియాస్ పాండు, అశ్వనీ కుమార్సింగ్తో పాటు ఓ మైనర్ బాలుడు, మరికొంతమందితో కలిసి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగౌడ్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేరి్పంచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. -
నువ్వు నాతో ఉండకపోతే.. నీ జీవితాన్ని నాశనం చేస్తా..
సనత్నగర్: ‘నువ్వు నాతో ఉండకపోతే, నీ ఫొటోలను ప్రతిచోటా వైరల్ చేస్తా..నీ జీవితాన్ని నాశనం చేస్తా.. నువ్వు ఎవరికీ నీ ముఖాన్ని చూపించలేవు..’ అంటూ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలతో ఓ యువతిని బెదిరించిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీకి చెందిన యువతి (18) కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి ప్రేపర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ హార్దోల్కు చెందిన అర్షద్ఖాన్ ఏఐ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసిన ఆమె అశ్లీల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ గత కొంతకాలంగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పాటు ఆమె సోదరుడికి కూడా ఆ ఫొటోలు పంపించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఆమెకు ఫోన్ చేసి నాతో రావాలని, నేను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. దీంతో అర్షద్ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిగరెట్లు లేవన్నందుకు బాలికపై దాడి
హైదరాబాద్: సిగరెట్లు అడిగితే లేవని చెప్పినందుకు ఓ యువతిపై సమీప బంధువు దాడి చేసిన సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రసూల్పురా కృష్ణానగర్ నాల్గవ బ్లాక్లో నివాసం ఉండే బాలిక (17) కుటుంబం స్థానికంగా దుకాణం నిర్వహిస్తుంటుంది. ఈ నెల 17న రాత్రి 8.30 గంటల సమయంలో సదరు బాలిక షాపులో ఉండగా ఆమె సమీప బంధువు అహ్మద్ సిగరెట్స్ అడిగాడు. సిగరెట్లు లేవని చెప్పడంతో అహ్మద్ కోపంగా బాలికను బయటకు లాక్కెళ్లి కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరికొంతమంది అతని స్నేహితులు గుల్లు, ఫౌజియా, గౌసియా, నౌషీన్లు కూడా ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో బాలిక కంటికి గాయమైంది. తన కుమార్తెపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
మూసాపేట: కూకట్పల్లి దయార్గూడలో సోమవారం సహస్రిని (11) అనే బాలికను హత్య చేసిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్ఓటీ, సీసీఎస్, పోలీస్ బృందాలు సుమారు 6 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సీసీ పుటేజ్, క్లూస్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. కాలనీలో, భవనంలోని పలువుర్ని ప్రశ్నించారు. బాలిక ఒంటిపై సుమారు 20కి పైగా చిన్న చిన్న గాట్లు ఉన్నాయని, పదునైన చిన్నపాటి ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మెడపై 14 గాట్లు, కడుపులో 6 గాట్లు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగానే మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లాలోని వారి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు బాలిక హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా అదే భవనంలో ఉన్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుటుంబంపై చేతబడి చేశారన్న అనుమానంతో అతడు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
కేబుళ్లు వైర్లు కట్
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ నగరవాసుల మృత్యువాతకు కారణమవుతున్న స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను రెండో రోజైన మంగళవారం కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, విద్యుత్ స్తంభాలకు ప్రమాదకరంగా మారిన కేబుళ్లను తొలగించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా టీవీ కేబుళ్లతో పాటు ఇంటర్నేట్ కేబుళ్లను కూడా తొలగించడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు. ఇంట్లో టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచి్చంది. ఇళ్ల నుంచి పని చేసే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. వరుస ఘటనలతో సర్కారు సీరియస్.. ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు చెల్లించాలి. కేబుళ్లు 15 ఫీట్ల ఎత్తులో అమర్చుకోవాలి. కానీ.. మెజార్టీ కేబుళ్లు పది అడుగుల ఎత్తులోనే కని్పస్తున్నాయి. సపోరి్టంగ్ వైరు, కేబుల్ గరిష్ట బరువు మీటర్కు 200 గ్రాములకు మించరాదు. స్తంభానికి స్తంభానికి మధ్య తీగల పొడవు 50 మీటర్లు మించరాదు. కానీ.. చాలా చోట్ల కేజీల కొద్దీ బరువున్న తీగలను చుట్టారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారు. కనీసం నెలవారీ బిల్లు చెల్లించడం లేదు. ఏ ఒక్క చోట కూడా మీటర్ ఉండదు. కానీ యథేచ్ఛగా విద్యుత్ను వాడుతుంటారు. నగరంలో ఈ తరహా కంపెనీలు 28కి పైగా ఉన్నట్లు అంచనా. ఆయా కేబుల్ ఆపరేటర్లతో ఇప్పటికే డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సమావేశమై..స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక నేతలు, ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలతో ఒత్తిడి తీసుకొచి్చ, తొలగింపు ప్రక్రియను విస్మరించారు. తాజాగా రామంతాపూర్, అంబర్పేట్, బండ్లగూడ వరుస ఘటనలతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కేబుళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించినప్పటికీ.. రెండో రోజైనా మంగళవారం మరింత వేగవంతం చేసింది. విగ్రహాల తరలింపు పట్ల అప్రమత్తంగా ఉండాలి గణేష్ విగ్రహాల తరలింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ నిర్వాహకులకు సూచించారు. రామంతాపూర్, బండ్లగూడ, అంబర్పేట ఘటనల్లో విద్యుత్ అధికారుల తప్పిదం లేదని స్పష్టం చేశారు. ఇతర కారణాలే ఇందుకు కారణమని తెలిపారు. ఇప్పటికే ప్రమాదకరంగా మారిన ఎల్టీ, హెచ్టీ కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో ఏబీ కేబుల్ ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేసినట్లు తెలిపారు.విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి.. విగ్రహాల ఎత్తును బట్టి రూట్ను ఎంచుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. విద్యుత్ లైన్ల నుంచి కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. లైన్లో ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం/ఇండక్షన్ ఉంటుంది. క్రేన్లు, ట్రక్కులు, ఎత్తైన మెటల్ విగ్రహాల తరలింపులో అప్రమత్తంగా ఉండాలి. మెటల్ ఫ్రేమ్లతో కూడిన డెకరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలి. మండపాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కకూడదు. సంస్థ సిబ్బంది ద్వారానే కనెక్షన్ తీసుకోవాలి. మండపాల్లో విద్యుత్ పనులు చేసేప్పుడు పరిసరాలను పూర్తిగా పరిశీలించాలి. విద్యుత్ తీగలు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. వైరింగ్లో లీకేజీలు లేకుండా చూసుకోవాలి. వర్షానికి తేమతో షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్కు ఫోన్ చేయాలి. -
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, బలవంతంగా తొలగించే కార్యక్రమం చేపట్టాలని స్పష్టంచేశారు. అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు.దీనిపై కన్సల్టెంట్ సంస్థ ఇచి్చన నివేదికపై ఆయన చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాఖల సమన్వయ లోపంతోనే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని.. వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోని ఒక్కో శాఖ ఒక్కోలా వ్యవహరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టీఎల్, బఫర్జోన్, నాలాకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ అనుమతించి.. అవసరమైతే భూ సేకరణ చేసుకోమని సర్కార్కు ఆదేశాలు జారీ చేస్తేనే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ‘రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలిస్తూ ఉంటారు.. ము న్సిపల్ అధికారులు నిర్మాణాలకు అనుమతిస్తారు.. నీటిపారుదల అధికారులేమో నీటి ప్రవాహ మార్గమని, ఎఫ్టీఎల్ అని, బఫర్జోన్ అని చెబుతుంటారు. దశాబ్దాలు గడుస్తున్నా వివాదాలు మాత్రం పరిష్కా రం కావడం లేదు’అని వ్యా ఖ్యానించింది.చెరువు నీరు ప్రవహించే మార్గమైతే పాస్ పుస్తకాలు ఎలా జారీ చేశారని అడిగింది. జవహర్నగర్ కాంపౌండ్ వాల్ తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. జవహర్నగర్ కాంపౌండ్ వాల్ను కూల్చివేసి డ్రైనేజీ, మురుగునీటిని తన భూమిలోకి అనుమతిస్తూ నీరుపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్ణ యం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కాచిగూడకు చెందిన పల్లె నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. మునక నుంచి బయటపడేందుకు ప్రహరీ కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. సమస్యను తెలియజేస్తూ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్కు సూచించారు. కౌంటర్ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పార్కింగ్ వసతి ఉంటేనే ఫ్లాట్ కొనండిబిల్డర్లు 10 ఫ్లాట్లకు అనుమతి తీసుకుంటారు.. వీరికి పార్కింగ్ స్థలం ఉంటుంది.. అనధికారికంగా మరో 4 ప్లాట్లు నిర్మిస్తారు.. మరి వారికి పార్కింగ్ ఎలా ఇస్తారు? ప్రజలు ముందుగా పార్కింగ్ సదుపాయం చూసుకున్న తర్వాతే ఫ్లాట్లు కొనుగోలు చేయాలని జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సూచించారు. హైదరాబాద్లో చాలా భవనాలకు పార్కింగ్ వసతి లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు.హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ సమస్యపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ సెపె్టంబర్ 2కు వాయిదా వేశారు. -
సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. టీఎన్జీవో భవన్లో మంగళవారం జేఏసీ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మిక, పెన్షనర్లకు చెందిన 206 సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ సమావేశం తీర్మానించింది.సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మొదలయ్యే ఆందోళన, జిల్లాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని, అంతిమంగా జంగ్ సైరన్తో చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని నిర్ణయించింది. 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను జేఏసీ ఖరారు చేసింది. సమావేశ వివరాలను జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయింది ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలిచి్చన ప్రభుత్వం రెండేళ్లవుతున్నా ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని మారం జగదీశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ సబ్ కమిటీల చుట్టూ తిరిగినా ప్రయోజనం కన్పింంచలేదన్నారు. రెండేళ్లయినా పీఆర్సీ కమిటీ నివేదిక ఏమైందో తెలియదన్నారు. జేఏసీ నేతలు వెళ్లినా గుర్తుపట్టలేని స్థితిలో మంత్రులు ఉండటం దారుణమన్నారు. ప్రతి నెలా 1న వేతనం ఇవ్వడమే గొప్పగా చెబుతున్న ప్రభుత్వం, తాము కష్టపడి పనిచేస్తేనే జీతం ఇస్తున్నారనే వాస్తవాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి వచి్చందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లనివ్వడానికి వెనుకాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి, ఓపిక నశించి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని జగదీశ్వర్ తెలిపారు. లక్ష్యం నెరవేరే వరకూ ఎవరికీ భయపడేది లేదన్నారు. ఉద్యోగుల వాణి విన్పింస్తాం రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ ఏకం చేస్తామని, తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని, తాము కూడా వారి ఆగ్రహాన్ని కట్టడి చేయలేమన్నారు. సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును హైదరాబాద్లో చేపడతామని తెలిపారు. వచ్చేనెల 8 నుంచి జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారుల సంఘాలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ..పెండింగ్లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం నిబంధనలు రూపొందించాలి. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు ఆదేశాలివ్వాలి. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి. గచి్చ»ౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి. శాఖల్లో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. -
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరు తూ కేసీఆర్తో పాటు మాజీమంత్రి హరీశ్రావు మంగళ వారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం–1952 ప్రకారం ప్రభుత్వం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమిషన్కు విచారణార్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఘోష్ను ప్రతివాదులుగా చేర్చారు. కాపీ ఇవ్వకుండా పదేపదే ఆరోపణలు ‘నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నివేదిక మా పరువుకు నష్టం కలిగించేలా ఉందని ఈ నెల 4న మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, కాపీని ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఎటువంటి సమర్థనీయమైన ఆధారం లేకుండా అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రతివాదులు జీవో 6ను జారీ చేశారు. నిబంధనల మేరకే బరాజ్లు.. అన్నీ పరిశీలించాకే కేంద్రం అనుమతులు ఏడు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి 160 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి కాళేశ్వరం ఎత్తిపో తలు పథకానికి నిబంధనల మేరకు రూపకల్పన చేసి నిర్మించాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో బరాజ్ నిర్మాణాన్ని మరో చోటికి మార్చాలనే నిర్ణయం సహా ప్రతి అంశంపై కేబినెట్ ఆమోదం తర్వాతే చర్యలు చేపట్టాం. 13 జిల్లాలకు నీరందించేలా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్లకు ప్రతిపాదనల నుంచి నిర్మాణం వరకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం అనుమతి మంజూరు చేసింది’ అని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగానే కమిషన్ ‘ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వస్తోంది. అధిక వర్షపాతంతో మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగడం దురదృష్టకరం. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్తో సంబంధం లేదు. అయినా బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం ప్రారంభించింది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా న్యాయవిచారణ కమిషన్ నియమించింది. అయినా ప్రజాజీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యాం. నివేదిక పూర్తయిన తర్వాత మాకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియాకు విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే.. నివేదిక ఏకపక్షమని వెల్లడవుతోంది. విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది. ఎన్నికల్లో లబ్ధి కోసం..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మంత్రులు మా ప్రతిష్టను కించపరిచేలా మీడియా ద్వారా దాడి ప్రారంభించారు. ‘పరిపాలనా అనుమతుల నుంచి నిర్మా ణం వరకు అక్రమాలు జరిగాయి.. అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారే బాధ్యులు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తుల నిర్ణయం.. నాటి సీఎం సూచన మేరకే బరాజ్ స్థలాలు ఎంపిక చేశారు.. నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు.. రూ.259 కోట్ల పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ ముందుంచలేదు.. సీఎం, హరీశ్ ఆదేశాల మేరకే జారీ చేశారు.. ఖజానాపై అదనపు భారం పడింది..’ లాంటి వాక్యాలను నివేదికలో పేర్కొనడం పరిశీలిస్తే.. కమిషన్ కావాలనే మాకు వ్యతిరేకంగా విచారణ సాగించినట్లు తేటతెల్లం అవుతోంది.మాతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదం. నివేదికను పరిశీలిస్తే.. పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలి..’అని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్ కోరారు. ఇదీ నేపథ్యం.. ప్రస్తుతం స్రూ్కటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశముంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు.. కేసీఆర్, హరీశ్, ఈటల కారణమని నివేదిక తేలి్చనట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
40 అంతస్తులంత జంబో రాకెట్
ఉస్మానియా యూనివర్సిటీ/షాద్నగర్ రూరల్/ఖైరతాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 40 అంతస్తుల భవనమంత పొడవైన రాకెట్ను నిర్మిస్తోందని, అది 75 టన్నుల పేలోడ్ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి మోసుకెళ్లగలదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది ఇస్రో నావిక్ ఉపగ్రహం, ఎన్ 1 రాకెట్ వంటి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతీయ రాకెట్ ద్వారా 6,500 కిలోల బరువైన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తయారు చేసిన మొదటి లాంచర్ 17 టన్నుల బరువు ఉండేది. దాని ద్వారా 35 కిలోల పేలోడ్ను భూమి దిగువ కక్ష్యలోకి పంపారు. ఈ రోజు మనం 75 వేల కిలోల పేలోడ్ను పంపగల రాకెట్ను తయారు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీఎస్ఏటీ –7ఆర్ను ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రస్తుత జీఎస్ఏటీ –7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానంలో సేవలందిస్తుంది. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్కు 55 ఉపగ్రహాలున్నాయి. రాబోయే మూడునాలుగు సంవత్సరాలలో ఆ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది’అని వెల్లడించారు. ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్ ఉపగ్రహాల తయారీలో ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఇతర దేశాల కోసం క్షిపణులు తయారు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని నారాయణన్ తెలిపారు. అబ్దుల్ కలామ్ కృషి, పట్టుదల వల్ల ఉపగ్రహాల తయారీలో ఎంతో పురోగతి సాధించామని అన్నారు. తొలిసారి 1980లో ఎస్ఎల్వీ–3 క్షిపణిని విజయవంతగా ప్రయోగించినట్లు వివరించారు. నాటి నుంచి చంద్రయాన్ –3 వరకు ఇస్రో ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో చంద్రయాన్ –4 చేపట్టనున్నట్లు ప్రకటించారు. తన 41 సంవత్సరాల సర్వీసులో ఎన్నో ప్రయోగాలు చేసి టీం వర్క్తో అనేక విజయాలు సాధించిన్నట్లు తెలిపారు. పరిశ్రమల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్రో శాటిలైట్ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. అక్షరాస్యత, వైద్యం, విద్యుత్తు, ఆహార ఉత్పత్తులు, రైల్వేలు, విమానయాన సర్వీసులు, టెలిఫోన్, ఆర్థిక రంగంతోపాటు మౌలిక వసతులు, రవాణా తదితర రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2035 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నైపుణ్యాలకు నెలవుగా ఓయూ: గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రపంచవ్యాప్తంగా ఓయూ పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండటం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర గవర్నర్ జిషు్టదేవ్ వర్మ అన్నారు. విజ్ఞానం, పరిశోధనలతోపాటు విభిన్న రంగాల్లో నైపుణ్యాలకు ఓయూ నెలవుగా ఉందని ప్రశంసించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి నారాయణన్ చేసిన కృషిని గవర్నర్ కొనియాడారు. స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ నారాయణ్కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం 121 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 1,261 మందికి పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను అందచేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నవారిలో ఉన్నారు. ఎన్ఆర్ఎస్సీని సందర్శించిన ఇస్రో చైర్మన్ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని అన్నారం శివారులో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను (ఎన్ఆర్ఎస్సీ) మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ సందర్శించారు. సుమారు రెండు గంటలపాటు అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. హైదరాబాద్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. -
దక్షిణ ‘మహిళా’ రైల్వే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఓ అరుదైన ఘనతను సాధించింది. జోన్ పరిధిలో 11 ప్రధాన విభాగాలుండగా, వాటిల్లో ఐదు విభాగాలకు మహిళలే అధిపతులయ్యారు. ఇటీవలి వరకు మూడు విభాగాలకు వారు నేతృత్వం వహిస్తూ రాగా, తాజాగా జరిగిన బదిలీల్లో మరో రెండు విభాగాలను కూడా వారికే అప్పగించారు. కీలక ఐదు విభాగాలను మహిళలే పర్యవేక్షిస్తుండటం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి కీలక లక్ష్యాలనైనా సాధించే సత్తా మహిళలకుందని, జోన్ పరిధిలో కీలక విభాగాలను సమర్థంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆపరేషన్స్: కె. పద్మజ రైళ్ల రాకపోకలు, వాటి సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర విభాగాలతో సమన్వయం, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాలు రైల్వేలో ఆపరేషన్స్ విభాగ పరి«ధిలోకే వస్తాయి. ఈ విభాగ నిర్వహణ కత్తిమీద సామే. ఈ సంవత్సరం జూలై వరకు సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రూ.4,601 కోట్ల ఆదాయం సాధించింది. 49 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి కొత్త రికార్డు సృష్టించింది. పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో 1,117 ప్రత్యేక రైళ్లు నడిపింది. దీనికి ప్రస్తుతం 1991 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి కే.పద్మజ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 2025 జనవరిలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య విభాగం: ఇటీ పాండే ఆపరేషన్స్ తర్వాతఅంత ప్రాధాన్యం ఉన్న విభాగమిది.టికెట్ అమ్మకాలు, రిజర్వేషన్,స్టేషన్ నిర్వహణ, సరుకు రవాణా,మార్కెటింగ్, ఆదాయ వనరుల పెంపువంటివి దీని పరిధిలో ఉంటాయి. ఈ విభాగానికి ఈ నెల రెండో తేదీన 1998 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి ఇటీ పాండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ‘రైల్ మంత్రి రాజభాష రజత్ పథక్ (2025), మంత్రిత్వ శాఖ పురస్కారం (2007), జీఎం అవార్డులు (రెండుసార్లు), విమెన్ ఎచీవర్స్ (2016) లాంటి అనేక పురస్కారాలు పొందారు. ‘రైడింగ్ ది ఫ్రైట్ ట్రైన్’అనే పుస్తకం రాశారు. అంతర్జాతీయస్థాయిలో కామ్ రోడ్స్ మారథాన్ (88 కి.మీ.)ను పూర్తి చేసిన ఏకైక మహిళా సివిల్ సర్వెంట్గానూ గుర్తింపు పొందారు. భద్రతా విభాగం: అరోమా సింగ్ ఠాకూర్ రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత చాలా కీలకం. అసాంఘిక శక్తులు, ఆకతాయిలు మొదలు ఉగ్రవాదుల వరకు రైల్వేపై దాడులు చేయటం సహజం. ట్రాక్పై అడ్డుగా ఇనుప చువ్వలను ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా చేసే కుట్రలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి వాటినినిర్వీర్యం చేయటం సహా స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు క్షేమంగా ఉండేలా, భద్రంగా గమ్యంచేరేలా ఆర్పీఎఫ్ సిబ్బంది పహారాలో ఉంటారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతనుప్రస్తుతం 1993 బ్యాచ్ ఐఆర్పీఎఫ్ఎస్ అధికారి అరోమాసింగ్ ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు. 2023 జూలైలో ఆమె ఐజీ కమ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నేతృత్వంలో ‘ఆపరేషన్ యాత్రి సురక్ష‘, ‘ఆపరేషన్ అమానత్‘, ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే్త‘, ‘ఆపరేషన్ సతర్క్‘వంటి ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. మహిళల భద్రతకు ‘ఉమన్ శక్తి టీమ్లు‘, ‘మెరి సాహిలీ‘, ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు‘ప్రారంభించారు. వైద్య విభాగం: డా. నిర్మలానరసింహన్రైల్వేలో ప్రత్యేక ఆస్పత్రులు ఉంటాయి. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఇవి వైద్య సేవలందిస్తాయి. ఇవి కాకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రత్యేక మొబైల్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకుని వైద్యం అందిస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 8 ప్రధాన ఆస్పత్రులు, 40 హెల్త్ యూనిట్లు ఉన్నాయి. లాలాగూడలోని 380 పడకల కేంద్ర రైల్వే ఆస్పత్రి ఉంది. ఈ విభాగానికి 1989 బ్యాచ్ ఐఆర్హెచ్ఎస్ అధికారి డా.నిర్మలానరసింహన్ డిసెంబర్లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక విభాగం: హేమ సునీత అతి పెద్ద నెట్వర్క్ అయిన రైల్వేలో ఆర్థిక అంశాల పర్యవేక్షణ కూడా చాలా కీలకం. ఆర్థికపరమైన పొరపాట్లు, అక్రమాలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ విభాగానికి 1993 ఐఆర్ఏఎస్ అధికారి హేమసునీత గత ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు. లండన్, పారిస్, మలేíÙయా, సింగపూర్లలో ఆర్థిక అంశాలçపై అంతర్జాతీయ స్థాయిలో కోర్సులు చేసి, శిక్షణ పొందారు. ఆమె పీపీపీ, ఇంటర్నేషనల్ టాక్స్, అక్రూవల్ అకౌంటింగ్లలో ప్రావీణ్యం పొందారు. -
గోదావరి ఉగ్రరూపం !
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని సింగూరు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకి భద్రాచలం వద్ద 6.87 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ప్రవాహం 9.32 లక్షల క్యూసెక్కులు, నీటి మట్టం 43 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పెన్గంగా, ఎగువ గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో ఉధృతి పెరుగుతుండటంతో మరో 24 గంటల్లో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకి 37,499 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19.39 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,1501 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 80వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 17.8 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 88వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీరామ్సాగర్ నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 2.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 72.99 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లను పైకెత్తి 3.75 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 3.74లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 16.06 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 3.74 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్కి 2.63 లక్షలు, అన్నారం బరాజ్కి 1.21 లక్షలు, మేడిగడ్డ బరాజ్కి 6.65 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్కబరాజ్కి 7.65 లక్షలు, సీతమ్మసాగర్ బరాజ్కి 6.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చి న వరదను వచ్చి నట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం లింక్–1, 2 ద్వారా పంపింగ్ షురూ మిడ్మానేరు జలాశయం నుంచి అన్నపూర్ణ పంప్హౌజ్ ద్వారా గోదావరి జలాల తరలింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2లో భాగమైన నంది పంప్హౌజ్లోని ఒక పంప్ ద్వారా 3150 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్లోకి వేసి అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా రామడుగు రిజర్వాయర్కు తరలిస్తున్నారు. రామడుగు నుంచి 3150 క్యూసెక్కులను గాయత్రి పంప్హౌజ్లోని ఒక పంప్ ద్వారా మిడ్మానేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. శ్రీరామ్సాగర్ నుంచి ఫ్లడ్ఫ్లో కెనాల్ ద్వారా గ్రావిటీతో మరో 12,600 క్యూసెక్కులు మిడ్మానేరులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయంలో నిల్వలు 13.78 టీఎంసీలకు చేరాయి. దీంతో మిడ్మానేరు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగమైన అన్నపూర్ణ పంప్హౌజ్లోని ఒక పంపు ద్వారా 3200 క్యూసెక్కులను అనంతగిరి రిజర్వాయర్లోకి వేస్తుండటంతో రిజర్వాయర్లో నిల్వలు 3.5 టీఎంసీలకు గాను 1.06 టీఎంసీలకు చేరాయి. మిడ్మానేరు నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా నిల్వలు 25.77 టీఎంసీలకు చేరితే 4 పంపులను ఆన్చేసి రోజుకు కనీసం ఒక టీఎంసీ జలాలను తరలించుకునే అవకాశం కలగనుంది. రంగనాయకసాగర్ నుంచి రెండు పంపుల ద్వారా 2534 క్యూసెక్కుల నీళ్లను మల్లన్నసాగర్లోకి ఎత్తిపోస్తుండటంతో రిజర్వాయర్లో నిల్వలు 50 టీఎంసీలకు గాను 10.38 టీఎంసీలకు చేరాయి. శ్రీశైలం, సాగర్లో ఇలా.. దోమలపెంట/నాగార్జునసాగర్: కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్కు వరద పోటెత్తుతోంది. ఎగువన గల శ్రీశైలం జలాశయానికి 3,61,654 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. దిగువకు స్పిల్వే మీదుగా 3,44,750 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్కులు మొత్తం సాగర్ జలాశయంలోకి 4,10,186 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్నుంచి 3,94,573 క్యూసెక్కులు వదులుతున్నారు. -
విద్యుదాఘాతంతో నలుగురి మృతి
చాంద్రాయణగుట్ట/అంబర్పేట/మాచారెడ్డి: వినాయక చవితి ఏర్పాట్లలో ఉండగా...వేర్వేరు చోట్ల జరిగిన విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, ఒకరు త్రీవంగా గాయపడ్డారు. రామాంతపూర్లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురి మృతి చెందిన ఘటన మరవకముందే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. పాతబస్తీలోని పురానాపూల్ చంద్రికాపురం బైరూపియా గల్లీకి చెందిన అఖిల్ గణనాథుడిని ప్రతిష్టించడానికి 15 మంది స్నేహితులతో కలిసి విగ్రహాన్ని తెచ్చేందుకు సోమవారం రాత్రి జల్పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వెళ్లారు. 22 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేసి..తక్కువ ఎత్తులో ఉండే ట్రాలీలో పెట్టి ట్రాక్టర్పై తీసుకొస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బండ్లగూడలోని రాయల్ సీ హోటల్ ఎదురుగా వచి్చన సమయంలో రోడ్డుకు అడ్డంగా వెళుతున్న 33 కేవీ హై ఓల్టేజీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహ కిరీటానికి తాకాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ రత్లావత్ ధోని(19), వికాస్ ఠాకూర్(21), అఖిల్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంతోశ్నగర్లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధోని, వికాస్ మృతి చెందారు. అఖిల్ పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన డ్రైవర్ ధోనికి మూడు నెలల క్రితమే దగ్గరి బంధువుల అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నవంబర్లో వివాహం జరగాల్సి ఉండగానే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఏర్పాట్లలో ఉండగా... హనుమకొండకు చెందిన నందబోయిన రాజు తన కుటుంబంతో కలిసి బాగ్అంబర్పేట రెడ్బిల్డింగ్ సమీపంలో నివసిస్తున్నాడు. ఇతని కుమారుడు రామ్చరణ్ తేజ(18) కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. సోమవారం కామాక్షి అపార్ట్మెంట్ ఎదుట గణేశ్ మండపానికి స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్చరణ్ మండపంపైకి ఎక్కి పెద్ద కర్రలు సర్దుతుండగా ఒక కర్ర.. పైనుంచి వెళుతున్న హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో అప్పటికే పచ్చిగా ఉన్న కర్రకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి రామ్చరణ్ తేజ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. పుట్టిన రోజే...: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్నగర్కు చెందిన 15 మంది యువకులు గణేశ్ విగ్రహం కోసం నిజామాబాద్ జిల్లా పెర్కిట్కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్లో విగ్రహాన్ని తరలిస్తుండగా పాల్వంచ మండలం ఆరెపల్లి స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై 11 కేవీ విద్యుత్ తీగలకు విగ్రహానికి సపోర్టుగా కట్టిన ఇనుపరాడ్లు తగిలాయి. దీంతో అక్కడే ఉన్న కొమ్ము లక్ష్మీనారాయణ(19) కరెంట్షాక్తో మృతి చెందాడు. మరో యువకుడు సాయి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతుడు లక్ష్మినారాయణది మంగళవారమే పుట్టిన రోజు. విగ్రహంతో ఇంటికి చేరిన తర్వాత కేక్ కట్ చేసి ఆనందంగా గడపాలని స్నేహితులు అనుకున్నారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ వైర్లు తగలలేదు: సీఎండీ సంఘటన స్థలాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. 33కేవీ విద్యుత్ లైన్లు తెగడం గానీ, వేలాడటం గానీ జరగలేదని, ఇందులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదన్నారు. హైఓల్టేజీ లైన్కు రెండు అడుగుల దూరం ఉన్నా, ఇండక్షన్ స్పార్క్ (ప్రేరణ జ్వాల) వస్తుందని, ఆ స్పార్క్ కారణంగానే యువకులు భయపడి కిందకు దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. డ్రైవర్ కిందకు దూకే క్రమంలో టైర్ కింద పడ్డాడని, మరో యువకుడు డివైడర్ వైపు దూకి చనిపోయాడని చెప్పారు. వర్షాకాలంలో విద్యుత్ లైన్లకు ఐదు అడుగుల దూరంగా ఉండాలని సీఎండీ సూచించారు. -
ప్రజల నడ్డి విరిచే పన్నులు ఎత్తివేయాలి
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబ్లో రద్దు లేదా మార్పు ద్వారా ప్రజలకు నిజమైన దీపావళి అందిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో «ఉత్పత్తుల ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగే జీఎస్టీ జాతీయ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి ‘తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై పన్నులు ఉండకూడదని భావించాం. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై తొలుత 5శాతం విధించి ఆ తర్వాత 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్త వ్యతిరేకత వెల్లువెత్తడంతో 12శాతం పన్ను విధింపు నిర్ణయాన్ని వాయి దా వేశారు. చేనేతపై పన్ను విధింపును విరమించుకోవాలి. జీఎస్టీలోనీ 12శాతం స్లాబ్ ను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజ లకు మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం జీఎస్టీ ద్వారా సమకూరే రూ.22 లక్షల కోట్లలో 12% స్లాబ్ వాటా కేవలం 5శాతం మాత్రమే. దశాబ్ద కాలంగా నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటోంది. పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గించాలి పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ ధరలను తగ్గిస్తే పరోక్షంగా ఇతర నిత్యావసరాల ధరల భారం కూడా తగ్గుతుంది. సెస్సుల రూపంలో రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బకొట్టే కుట్రకు పాల్పడిన కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ రేట్లను వెంటనే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, విద్యకు సంబంధించిన ఫీజులు, కేన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి’అని ప్రధానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాయాలి: కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సంగతిని పక్కన పెడితే ఒక్క ఇటుక ముక్క కూడా సరిగా పేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.హైదరాబాద్లో శాంతిభద్రతలు క్షీణించాయ ని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్ నగల దుకాణంలో దోపిడీ, కూకట్పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. -
రాజ్యాంగ పరిరక్షకులు, వ్యతిరేకుల మధ్య ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికను రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న వారికి, ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన తెలంగాణ రైతు బిడ్డ, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచిందన్నారు. ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగం చేసి, బతికున్న ఓటర్లను చనిపోయినట్లు, లేని ఓటర్లను ఉన్నవారిగా చూపిస్తూ.. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీయే ఒక పక్కన, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే, రాజ్యాంగబద్ధ్ద సంస్థలను పరిరక్షించే ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయని అన్నారు, ఇండియా కూటమి ఉపరాష్టపతి అభ్యర్థిని ప్రకటించిన తరువాత రేవంత్రెడ్డి తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. మనమంతా ఏకం కావాలి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్రెడ్డిని అభ్యర్థిగా ఎంపికచేసిందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన పీవీ నరసింహారావు తరువాత తెలంగాణకు చెందిన వ్యక్తి రెండో అత్యున్నత పదవికి పోటీకి ప్రకటించడం మనందరికీ గర్వకారణం. తెలుగు ప్రజలుగా రాజకీయాలకు అతీతంగా ఆత్మప్రబోధనానుసారం ఓటు వేయాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిది. మొత్తం 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులం ఒకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నా. టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, జనసేన పార్టీల నాయకులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, పవన్ కళ్యాణ్ను తెలంగాణ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ పార్లమెంట్ సభ్యులను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కోరుతున్నా. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది’అని రేవంత్ చెప్పారు. తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీకాదు ‘1991లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. కాంగ్రెస్, టీడీపీ సిద్ధాంతపరంగా పూర్తి వైరుధ్యం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆరోజు పీవీపై పోటీ పెట్టకుండా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం, ఆ తరువాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలి’అని రేవంత్రెడ్డి చెప్పారు. జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతుగా మీరు ఉభయ రాష్ట్రాల్లోని పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతునివ్వా లని బహిరంగంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని బదులిచ్చారు. బీఆర్ఎస్ను ఎలా మద్దతు అడుగుతారని ప్రశ్నించగా.. ‘జస్టిస్ సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాదు. పార్టీ సభ్య త్వం లేదు. కాంగ్రెస్ ఎంపిక చేయలేదు. ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి‘అని అన్నారు. ఇది తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కాదని వ్యాఖ్యానించారు. ఓబీసీ బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరు.. ఇప్పుడు ఓబీసీ వ్యక్తిని ఎన్డీయే నిలబెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ‘జస్టిస్ సుదర్శన్రెడ్డి బలహీన వర్గాలకు బలమైన గొంతుక. రాష్ట్రపతి వద్దనున్న బీసీల రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటున్న ఎన్డీయే అభ్యర్థి, బలహీనవర్గాల వ్యక్తా.? బలహీనవర్గాలకు అండగా నిలబడాల్సిన వ్యక్తా’అని సీఎం ఎదురు ప్రశ్నించారు. -
అదిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలవడానికి సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి పూర్తి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలవడానికి సిద్ధమన్నారు. మంగళవారం(ఆగస్టు 19వ తేదీ) మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అదిష్టానం ఆదేశిస్తే కేసిఆర్ను కలవడానికి సిద్దం. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తడో లేదో.. ఆయనకు నా మొఖం చూడటం ఇష్టం ఉందో లేదో. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో నా నిర్ణయం ఏం లేదు ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్ ఆయన్ను కలుస్తాను.. మన ఊరాయనా. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్కు వెళతాను’ అని పేర్కొన్నారు. -
తెలంగాణ రైతాంగానికి ఊరట
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రైతాంగానికి ఊరట లభించింది. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. మంగళవారం కలిశారు.కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్రెడ్డి వెల్లడించారు. 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి 14 వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది...వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామన్నారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నాం. పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించాం. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఎంపీలం కూడా పలుమార్లు నడ్డాను కలిశాం. మేము పలుమార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది’’ అని చామల కిరణ్రెడ్డి తెలిపారు. -
సర్వ హంగులు.. సకల సదుపాయాలు...
సాక్షి, సిటీబ్యూరో : స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల ఏర్పాటుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గ్రేటర్ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి సమీకృత భవన సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. 11 సమీకృత భవన సముదాయాలు.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు చేట్టింది. తొలివిడతలో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ భవన సముదాయాన్ని నిర్మించనుంది. అందులో రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కార్యాలయాల కార్యాకలాపాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తోంది. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల భవన సముదాయానికి ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాపన జరిగే విధంగా రంగం సిద్దం చేసింది.ఇంకా ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే.. నగర శివారులోని కోహెడలో అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్ పేట్, హయత్నగర్, వనస్ధలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. మంకాల్లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కోసం.. బోడుప్పల్ లో ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్పేట్ కార్యాలయాల కోసం కండ్లకోయలో ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్కేసర్, మల్కాజ్గిరికి.. బంజారాహిల్స్లో బంజారాహిల్స్, ఎస్.ఆర్. నగర్, గొల్కోండ సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల కోసం.. మలక్పేటలో ఆజంపూరా, చార్మినార్, దూద్బౌలి సబ్ రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. చదవండి: రైలు ప్రయాణికులకు కీలక అప్డేట్.. గమనించారా?మరో పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధలాలను గుర్తింపు కోసం రిజి్రస్టేషన్శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు బీఐఎస్ శిక్షణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శ్రామిక విభాగం ఉన్నతాధికారులకు భారతీయ ప్రమాణాల బ్యూరో, హైదరాబాద్ శాఖ శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మౌలాలీలోని బీఐఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పని ప్రదేశాల్లో అనుసరించాల్సిన నియమాలు, పాటించాల్సిన భారతీయ ప్రమాణాలు, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై బీఐఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. భారతీయ ప్రమాణాల్లో పొందుపరిచిన వ్యక్తిగత భద్రతా పరికరాలు (PPE), సరైన ఎంపిక, వినియోగం మరియు నిర్వహణ, రంగాల వారీ భద్రతా చర్యలు – పనిస్థలాల్లో స్పష్టత కల్పించడం, ఉద్యోగ సంబంధిత ఆరోగ్యం, భద్రతా నిర్వహణ వ్యవస్థ (IS/ISO 45001:2018), నిర్మాణ భద్రత కోడ్స్, తవ్వకం, కూల్చివేత, నిర్మాణ కార్యకలాపాల భద్రత, భద్రతా రంగులు, ప్రమాద నివారణ, దృశ్యరూపక హెచ్చరికలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు శిక్షణనందించారు.ఈ సందర్భంగా బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో భద్రత చట్టపరమైన అవసరం మాత్రమే కాదని.. ప్రతీ కార్మికుడు, పారిశ్రామికవేత్తల బాధ్యత అన్నారు. పని చేసేటప్పుడు ధరించే వస్త్రాలు, రక్షణ పరికరాలు, ఆరోగ్య సంబంధిత భద్రతా పరికరాలతో పాటు పాటించాల్సిన నియమాలనూ భారతీయ ప్రమాణాలు చెబుతాయన్నారు. ఈ ప్రమాణాలు ప్రమాదాలను నివారించడంతో పాటు కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పని సామర్థ్యం పెంపునకు తోడ్పడతాయని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్, జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్లు జి సునీత, శ్యామ్ సుందర్ రెడ్డి, ఎం రాజేంద్ర ప్రసాద్తో పాటు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్రావు విజ్ఞప్తి చేశారు.కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. -
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి డీఎస్ఆర్ గ్రూప్ లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆ సంస్థలో భాగస్వామిగా ఉన్న రంజిత్ రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ ఉదయం నుంచి డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ట్యాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాల నేపథ్యంలో.. గడిచిన ఐదేళ్లలో పన్నుల చెల్లింపుల ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ ఎండీ సుధాకర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరెడ్డి ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ,ఎస్సార్ నగర్, సూరారంలో.. అదీ సీఆర్పీఎఫ్ బలగాల నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
కూకట్పల్లి బాలిక కేసు.. పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. అదె బిల్డింగ్లోనే అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కూకట్పల్లిలోని దయార్గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని హత్యోదంతం.. రాష్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. చివరకు.. ఇది బయటివారి పని కాదని ఓ నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో.. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బడికిపోయి ఉన్నా బతికేదేమో! ‘‘బడికి పోయి ఉన్నా బతికేదేమో.. ఏం చేసిందని నా బిడ్డను ఇలా చంపారు. అందుకేనేమో ఆడపిల్లను కనాలంటే భయపడుతున్నారు’’ అంటూ తల్లి రేణుక గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్నగర్లోని బైక్ మెకానిక్గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు సాద్విన్ (9) ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు స్కూళ్లలో చదువుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్బాక్స్ రెడీ చేసి స్కూల్కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. -
భూగర్భ విద్యుత్ లైన్లు ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రధాన రహదారులు, వీధుల్లో వేలాడుతున్న ఓవర్హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు సెక్షన్ల వారీగా ఫీడర్ల వివరాలను సేకరించింది. ఒక్కో సెక్షన్కు రూ.వంద కోట్ల చొప్పున గ్రేటర్ వ్యాప్తంగా ఇందుకు రూ.15 వేల కోట్లకుపైగా అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మెట్రోజోన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో డిస్ట్రిబ్యూషన్ లైన్లు మినహా 33/11 కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇక మేడ్చల్ (హబ్సిగూడ, మేడ్చల్ సర్కిల్), రంగారెడ్డి (సైబర్సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్) జోన్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓహెచ్ (ఓవర్ హెడ్ లైన్లే) కన్పిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తరచూ తెగిపడుతూ..అటుగా వచ్చి వెళ్లేవారిపై పడి అమాయక ప్రజల మృత్యువాతకు కారణమవుతున్నాయి. ప్రమాదాలను నియంత్రించడంతో పాటు వేలాడే కరెంట్ తీగలు కని్పంచని నగరంగా తీర్చిదిద్దాలని భావించి..ఆ మేరకు నగరమంతా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఉపముఖ్య మంత్రి భట్టి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం బెంగళూరులో పర్యటించి, ఆ మేరకు భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించింది. సెక్షన్ల వారీగా ప్రతి పాదనలు సిద్ధం చేయాల్పిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రాజెక్ట్ విభాగం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ప్రతిపాదన దశలోనే ఆ పనులు.. గ్రేటర్లో ప్రస్తుతం 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజు గరిష్ట విద్యుత్ డిమాండ్ 65 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలకే కాకుండా అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగులను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్ హెడ్ లైన్కు ఆనుకుని విద్యుత్ షాక్తో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఓవర్హెడ్లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చొచ్చని డిస్కం భావించినప్పటికీ..ఇందుకు సంస్థ వద్ద సరిపడు నిధులు లేకపోవడం పనులకు విఘాతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీం ప్రకటించి నిధులు కేటాయిస్తే మినహా..ఇప్పట్లో ఈ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు. -
హైదరాబాద్ బండ్లగూడలో విషాదం
హైదరాబాద్: రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అఖిల్ అనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేసింది
హైదరాబాద్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటనలో భార్యా, ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట రెడ్డి, ఎస్ఐ మహ్మద్ మజీద్ ఆలీలు తెలిపిన మేరకు.. రాజీవ్గాంధీ నగర్లో మహమ్మద్ షాదుల్, భార్య తబ్సుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు. నాలుగు సంవత్సరాల క్రితం తబ్సుమ్కు మొహమ్మద్ తాఫిక్ అనే వ్యక్తితో అయిన పరిచయం వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. దీంతో భర్త షాదుల్ అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడు మొహమ్మద్ తాఫిక్తో కలిసి షాదుల్ను చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం తబ్సుమ్ ప్రియుడితో కలిసి ఆగస్టు 15న ఉదయం షాదుల్ పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. ఈ సంఘటపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులైన తబ్సుం, ప్రియుడు మొహమ్మద్ తాఫిక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
గొంతు కోసి.. కడుపులో పొడిచి..
హైదరాబాద్: కూకట్పల్లిలోని దయార్గూడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతుకోసి..కడుపులో కత్తితో పొడిచి చంపేశారు. ఇలా ఎందుకు..ఎవరు ఇంత కసిగా హత్య చేశారో తెలియరాలేదు. కూకట్పల్లి పోలీసులు తెల్పిన మేరకు..సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్నగర్లోని బైక్ మెకానిక్గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు (9) ఉన్నారు. సహస్రిని బోయిన్పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సాది్వన్ పాఠశాలకు వెళ్లాడు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. కాగా మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్బాక్స్ రెడీ చేసి స్కూల్కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎవరికి ఏ అపకారం, అన్యాయం చేయని మాకు ఈ కడుపుకోత ఎందుకు అంటూ కన్నీటి పర్యంతమైంది. పాప స్కూల్కు వెళ్లినా బతికుండేది కదా అంటూ విలపించింది. సహస్రిని కడుపులో మూడు కత్తి గాట్లు, గొంతు కోసినట్లు గాయాలు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. దొంగతనం కోసం కానీ, మరే కారణంతో కానీ బాలికను చంపి ఉండవచ్చనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకోసం, ఎవరు పాపను చంపారన్న వివరాలు దొరకలేదని, సీసీ కెమెరాలు కూడ సరిగ్గా లేవని, దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తెలిసిన వారి పనే? కాగా కృష్ణ దంపతులు నివసిస్తున్న భవనంలో రెండు అంతస్తులు, ఓ పెంట్ హౌస్ ఉంది. పెంట్హౌస్లో వీరు నివసిస్తున్నారు. శని, ఆదివారాల్లో సెలవులు కావటంతో సోమవారం పాప ఒక్కతే ఉందన్న విషయం ఎవరికి తెలిసి ఉంటుందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక ఒంటరిగా ఉందనే విషయం తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి తల్లిని పరామర్శించి, ఓదార్చారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, పాప తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. -
హైదరాబాద్లో రాత్రంతా జోరు వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. అల్పపీడన ప్రభావంతో నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు మంగళవారం ఉదయం కూడా వాన జోరు కొనసాగుతోంది. దీంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. మరో రెండ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కుండపోత వాన..
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. జిల్లాల్లో అనేకచోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో 23.6 సెం.మీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లోకి సైతం వరద నీరు చేరింది. కొన్నిచోట్ల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్ రహదారిపై వరద కుంభవృష్టితో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఒకింత అంతరాయం ఏర్పడింది. పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్పేట–శాకారం మార్గంలో రవాణా స్తంభించి పోయింది. గుండాల మండలంలో 16 సెం.మీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వేల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలోనే అతి పెద్దదైన తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు అలుగుపోస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ మళ్లీ జలమయమయ్యాయి. కేజీబీవీకి సోమవారం కూడా సెలవు ఇచ్చారు. చెరువుల్లా పంట పొలాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలోని దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 1000 చెరువులు అలుగు పారుతున్నాయి. కొట్టుకుపోయిన కోళ్లు..కారు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 16.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులోని కాలువ కట్ట కొట్టుకుపోయి సమీపంలో ఉన్న ఫౌల్ట్రీఫాంను వరద ముంచెత్తడంతో కొన్ని కోళ్లు కొట్టుకుపోయాయి. 3 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో పొంగి ప్రవహిస్తున్న వాగులో పవన్ అనే వ్యక్తికి చెందిన కారు కొట్టుకు పోయింది. పవన్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. వరద తగ్గిన తర్వాత పోలీసులు కారును బయటకు తీశారు. మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. కల్యాణి , పోచారం ప్రాజెక్టులు ఉధృతంగా అలుగు పోస్తున్నాయి. వందలాది చెరువులు నిండాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వచ్చే రహదారిపై సర్వాపూర్ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సెం.మీ వర్షం కురిసింది. మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ప్రాణహిత, పెన్గంగ, వార్దా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగులో పోటెత్తుతున్న వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద జాతీయ రహదారిపై ఉన్న 163 హైలెవల్ వంతెన వద్ద రెండు కిలోమీటర్ల పొడువునా గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. కొండాయి వద్ద జంపన్నవాగు, ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు, గోగుపల్లివాగు, ఏటూరునాగారం–భద్రాచలం రహదారి మధ్యలోని జీడివాగు, మంగపేట మండలంలోని కమలాపురం వద్ద ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని హనుమంతుల వాగు, ముళ్లకట్ట వద్ద మేడివాగు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి రెండు మీటర్ల ఎత్తులో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వరద పరిస్థితిని సమీక్షించారు. గొర్రెల కాపరులు, రైతును రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో అత్యధికంగా పిట్లంలో 17.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్, మహహ్మద్నగర్, నస్రుల్లాబాద్, మండలాల్లో 12 సెం.మీ నుంచి 16 సె.మీ. వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరలో ప్రవాహం పెరిగి బిచ్కుంద మండలం శెట్లూర్ వద్ద ప్రవాహంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు చిక్కుకున్నారు. 656 గొర్రెలు కూడా నీటి మధ్యలో ఉండిపోయాయి. అధికారులు సోమవారం తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ బృ«ందాల సాయంతో గొర్రెల కాపరులు, రైతును రక్షించారు. అలాగే గొర్రెలను బయటకు తీసుకువచ్చారు. మహారాష్ట్ర వరదల్లో ముగ్గురు మహిళల గల్లంతు – జగిత్యాలలోని టీఆర్నగర్లో విషాదం జగిత్యాల క్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమైన ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్నగర్కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తో పాటు వారి బంధువు, ఆర్మూర్కు చెందిన సోహెబ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్కు వెళ్లారు. ఆదివారం రాత్రి జగిత్యాల వైపు ఖాళీగా వస్తున్న ఓ కారు డ్రైవర్ వీరిని ఎక్కించుకుని టీఆర్నగర్కు బయల్దేరాడు. 30 కిలోమీటర్ల దూరం రాగానే ఓ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కారు అందులో చిక్కుకుంది. సోహెబ్, డ్రైవర్ ఎలాగో బయటపడి ఒడ్డుకు చేరారు. ముగ్గురు మహిళలు మాత్రం గల్లంతయ్యారు. అంతకుముందు సమీన తన కోడలుకు ఫోన్ చేసి ‘పిల్లలు జాగ్రత్త.. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం..’ అని సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయతి్నంచినా సమీన ఫోన్ పనిచేయలేదు. సోమవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి, మరొకరి గల్లంతు కామారెడ్డి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఒకరు నీట మునిగి చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామ శివారులో చెరువు అలుగు వరదలో సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
సరిహద్దులో పేలనున్నమరో సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో పహారా కాసే జవాన్ల చేతికి మరో ‘సిటీ తుపాకీ’అందనుంది. బాలానగర్ కేంద్రంగా పని చేసే లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే ‘అస్మి’పేరుతో ఓ సబ్ మెషీన్ గన్ (ఎస్ఎంజీ) రూపొందించి ఆర్మికి అందించింది. తాజాగా మీడియం మెషీన్ గన్ (ఎంఎంజీ)ను తయారు చేస్తోంది. పుణెలోని రక్షణ అభివృద్ధి, పరిశోధక సంస్థ (డీఆర్డీఓ)లో అంతర్భాగమైన అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిషిమెంట్ ఈ గన్ను డిజైన్ చేయగా... తయారీకి సంబంధించి ఆర్మీ నుంచి రూ.17.7 కోట్ల ఆర్డర్ లోకేశ్ మెషీన్స్కు దక్కింది.ఈ సంస్థ ఇజ్రాయెల్, జర్మనీ ఆయుధ కర్మాగారాలకు దీటుగా ‘అస్మి’ని ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. ఈ తుపాకీని భద్రతా బలగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగిస్తున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ అస్మి అనువుగా ఉంది. తాజాగా 7.62 = 51 మి.మీ. క్యాలిబర్తో ఉండే ఈ ఎంఎంజీ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారవుతోంది. ఈ ఎంఎంజీలో క్విక్ ఛేంజ్ బ్యారల్ సిస్టం, త్రీ–పొజిషన్ గ్యాస్ రెగ్యులేటర్ వంటి ఆధునిక హంగులున్నాయి.తుపాకీ సమర్థమంతంగా పని చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఎంఎంజీల కంటే ఈ తుపాకీ 25 శాతం తక్కువ బరువు ఉంటుంది. 1800 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదించగలదు. 250 తూటాల బెల్ట్ కెపాసిటీతో పని చేస్తుంది. రెండు బెల్ట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలోనూ నిరాఘంటంగా సేవలు అందిస్తుంది. -
అడ్డుకుంటున్నది వారే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రతిపాదనలకు మతం రంగు పులిమి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ట్యాంక్బండ్కు సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రవీంద్రభారతిలో సభికులనుద్దేశించి మాట్లాడారు. పర్యాటక ప్రాంతంగా ఖిలా షాపూర్ అభివృద్ధి ‘బహుజనుల సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి నిర్మించిన ఖిలా షాపూర్ కోటను బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. మేం ఆనాడు కోటపైకి వెళ్లి చూసి.. దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాం..’అని సీఎం తెలిపారు. బీజేపీకి ఆ ధైర్యం ఉందా? ‘రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా కుల సర్వే చేపట్టి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాల గణాంకాలను తేల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించాం. ఐదు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశాం. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు బీజేపీ మతం రంగు పులిమింది. మోదీ, కిషన్రెడ్డి వీటిని అడ్డుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్లో ముస్లింలు బీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే ధైర్యం బీజేపీకి ఉందా? రాహుల్గాం«దీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు..’అని రేవంత్ అన్నారు. తెలంగాణలోనూ ఓట్లు చోరీ చేసే కుట్ర.. ‘దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ ఓట్ల కుట్రను రాహుల్గాంధీ బట్టబయలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో డిప్యూటీ సీఎంతో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేస్తా. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర జరుగుతోంది. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బహుజనుల పిల్లలు రాజ్యాధికారం సాధించాలి ‘బహుజనుల పిల్లలంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు.. వర్థంతులు, జయంతుల కోసం కాదు. ప్రతి ఒక్కరిలో వారి స్ఫూర్తిని రగిలించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. తెలంగాణ నిర్ణయాలు దేశానికే ఆదర్శం: భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక విప్లవానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కుల సర్వేను కేంద్రం నమూనాగా తీసుకుని కులగణనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వాయిపేట కోటను రూ.4.5 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరితో కలిసి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గలగలా గోదావరి ఉరుకులు పరుగులు పెడుతోంది. కృష్ణా పరీవాహకంలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు.. గోదావరి పరీవాహకంలో సింగూరు నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఉభయ నదులు స్వేచ్ఛగా పరుగెడుతూ కడలిలో కలిసిపోతున్నాయి. కృష్ణా పరీవాహకంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.79 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు.జూరాల, తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలంకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలం జలాశయానికి 3.29 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లను 12 అడుగుల మేర పైకెత్తి 4.03 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విద్యుదుత్పత్తి ద్వారా మరో 66,099 క్యూసెక్కులను విడుదల చేస్తుండడంతో సాగర్లోకి 3.05 లక్షల క్యూసెక్కులకు వరద చేరుతోంది.సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 299.74 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 26 గేట్లను పైకెత్తి 2.25లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 28,826 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం 2.47 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 10 గేట్లను పైకెత్తి 2.93 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 16 వేల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ఉగ్ర గోదావరి... గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, నిల్వలు 97.86 టీఎంసీలకు చేరాయి. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకి 36,309 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19.6 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 40,821 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 95,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 14.98 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 1.25లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకి 1.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 72.99 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లను పైకెత్తి 2 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 34,493 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.61 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 34,194 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 15.78 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 1.69 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సుందిళ్ల బరాజ్కి 1.59 లక్షలు, అన్నారం బరాజ్కి 6905 క్యూసెక్కులు, మేడిగడ్డ బరాజ్కి 4.29 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కబరాజ్కి 4.98 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ బరాజ్కి 5.87 లక్షల క్యూసెక్కల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. -
రేవంత్ చేతకానితనం వల్లే పరిశ్రమలు పారిపోతున్నాయి: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధత, సీఎం రేవంత్ రెడ్డి చేతకాని పాలనతో పరిశ్రమలు తెలంగాణ నుంచి పారిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ చేతకాని పాలనతో రూ. 2,800 కోట్ల కేన్స్ పెట్టుబడి గుజరాత్కు తరలిపోయిందని విమర్శించారు. ప్రత్యక్షంగా 2 వేలమంది తెలంగాణ యువత ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గండికొట్టిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ శ్రమ.. రేవంత్ చేతకానితనం వల్ల బూడిదలో పోసిన పన్నీరుగా మారిందన్నారు. ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అని కేటీఆర్ మండిపడ్డారు. ఇదొక "చెత్త" సర్కారు! రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు కేటీఆర్ ‘‘ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారు! ’ అని విమర్శించారు.ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025 -
‘తెలంగాణాలోనూ ‘ఓట్ చోరీ’.. వారి భరతం పడతాం‘
సాక్షి,హైదరాబాద్: ‘బీహార్లోనే కాదు.. తెలంగాణలో ఓటు చోరీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర చేసేవారి భరతం పడదాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఓట్ చోరీ అంశంలో తప్పు చేసినవారిని వదిలేసి..తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రవీంద్ర భారతి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీ ఆరోపణలకు ఏడురోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలన్న ఈసీ ఆదేశాలపైవిధంగా స్పందించారు. ‘ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనంరాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం.గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది.అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు.ఐదు నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు.ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు?.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించగలరా?. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు.రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు.రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి.విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది.విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే.అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది. దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది.అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది.ఇది ఎంతవరకు న్యాయం. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం’ అని వ్యాఖ్యానించారు. -
కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో మైనర్ బాలిక (12)హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుణ్ని సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు.బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాల్ని గమనించారు. అయితే, బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోమవారం కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్నగర్లో ఓ మైనర్ బాలిక(12) దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న బాలికపై నిందితులు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
Ramanthapur: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్: రామంతాపూర్లోని గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
రామంతాపూర్లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. దీంతో, బాధిత కుటుంబ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మరోవైపు.. రామంతాపూర్లో పోలీసులు, అధికారులను మృతుల బంధువులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ సీఎండీని బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.ప్రమాదంలో చనిపోయిన ఆరు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసలు.. అక్కడున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుక విషాదకర ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, మృతుల కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
Hyderabad: చిక్కడపల్లిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: వివేక్నగర్లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల ఇంట్లో చోరీ జరిగిన 48 గంటల్లోనే చిక్కడపల్లి పోలీసులు కేసును చేధించారు. ఆదివారం సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పావల్లి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకు చెందిన బ్రూస్లీపై ఈనెల 13న చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఇతడిపై 64 కేసులు ఉన్నాయని తెలిపారు. చిక్కడపల్లిలోని వివేక్నగర్లోని దిట్టకవి ఎన్క్లేవ్లో నివసించే రిటైర్డ్ ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, రాజేశ్వరిల ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాయుడు చైతన్యసాయికుమార్తో కలిసి ఆభరణాలను విక్రయించాలని పథకం పన్నారు. ఇతడిపై సైతం దాదాపు 67 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో సెంట్రల్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు సుందరయ్య పార్క్ వద్ద వారిని పట్టుకున్నారు. పోలీసులు తమ తీరులో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 25.8తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ప్రతి కాలనీలీ, అపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ కోరారు. పోలీసులు కేసును చేధించడంతో పీపుల్స్పార్క్ రెసిడెన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఎసీపీ రమేష్ కుమార్, సీఐ రాజునాయక్, డీఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పోస్టల్ సేవలపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ– సేవల విస్తరణ కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్ శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలుసేవలు రద్దు కాగా.. సెపె్టంబర్ ఒకటి నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు లెటర్ రెడ్ (పోస్టట్) బాక్స్లను కూడా ఎత్తి వేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ– సేవల విసర్తణపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకైక దిక్కు తపాలానే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతిక టెక్నాలజీకితో పోస్టల్ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ అవుతూ వస్తోంది. రిజిస్టర్డ్ పోస్టులకు మంగళం.. పోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టు సేవలకు మంగళం పాడనుంది. తాజాగా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పోస్ట్మాస్టర్లకు శాఖాపరమైన నోటీస్లు జారీ చేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా.. ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్ట్కార్డు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే అందుబాటులో ఉండేది.సుమారు 171 ఏళ్లుగా.. పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో ముందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిషర్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో æసేవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ‘కంపెనీ మెయిల్’ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటివాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్) పొందడం ఒక ప్రత్యేకత, చట్టపరంగానూ ఎంతో విలువైనది. ఇది కాస్త మరో రెండు వారాల్లో కనుమరుగు కానుంది! స్పీడ్ పోస్ట్లో విలీనం.. రిజిస్టర్డ్ పోస్ట్ సేవను పూర్తిగా ‘స్పీడ్ పోస్ట్’ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. తపాలా శాఖ తమ సేవలను ఆధునికీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవల క్రమబదీ్ధకరణ, పనితీరును మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్ పోస్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ను విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్ పోస్ట్ అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు స్పీడ్ పోస్ట్లో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతం కానుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది రిజిస్టర్డ్ పోస్ట్లో లేదు. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. రెడ్ పోస్ట్ బాక్స్పై ఊహాగానమే.. రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్ పోస్ట్ బాక్స్ల ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పోస్టల్ అభిమానాలు కలత చెందుతున్నారు.దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదన్న బాధ్యత వ్యక్తమవుతోంది. అయితే.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని. అది ఒక ఊహాగానం మాత్రమేనని పోస్టల్వర్గాలు పేర్కొంటున్నాయి. పోస్టల్ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్ బాక్సులను ఎత్తేస్తున్నట్లు అధికా>రిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం రిజిస్టర్డ్ పోస్టల్ సరీ్వస్ను స్పీడ్ పోస్టులో విలీనం తప్ప ఇది ఎరుపు పోస్ట్ బాక్సులతో సంబంధం లేదని పేర్కొంటున్నారు.తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత.. వాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీమెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మారి్పడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. ఐదేళ్లలో జరిగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ పరిశీలిస్తే.. 25 శాతానికి పడిపోయింది. స్పీడ్ పోస్ట్, ఇతర కొరియర్ సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్ట్కు డిమాండ్ తగ్గింది. అయితే.. తాజాగా స్పీడ్ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్ పోస్ట్ కనీసæ చార్జీ రూ. 26 నుంచి రూ. 30 వరకు ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కనీస చార్జీ రూ.41. ఇది రిజిస్టర్డ్ పోస్ట్తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీలు భరించక తప్పదు. -
HYD: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని రామంతాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులు కన్నీటపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాన్ని పక్కన నిలిపివేసిన స్థానిక యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంట్ షాక్ ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది.ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు.. గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్రెడ్డి(35), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
గ్రామీణ రోడ్ల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న 86.55 కి.మీ. మేర గ్రామీణ రహదారులను శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించేందుకు రూ.143 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టు మంత్రి సీతక్కకు నివేదిక సమరి్పంచింది. వాటికి మరమ్మతు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు రూ.6.5 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించింది. ఆదివారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్సుద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్లకు జరిగిన నష్టంపై వివరాలను మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాలతో కొన్ని గ్రామాలకు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోతే, తిరిగి పునరుద్ధరించామని ఈఎన్సీ అశోక్ పేర్కొన్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని, వరద తగ్గుముఖం పట్టగానే ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను అంచనా వేసి వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు. -
కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే అధికార కాంగ్రెస్ కూడా 3 ఆప్షన్లను పరిశీలించనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గుచూపాలనే అంశాన్ని తేల్చేందుకు ఈనెల 23న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో 3 అంశాలపై చర్చించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. ఎలా ముందుకెళ్దాం? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. పీసీసీ చీఫ్తో పాటు పార్టీలోని బీసీ ముఖ్య నేతలు ఓ వాదన వినిపిస్తుండగా, కొందరు మంత్రులు, మరికొందరు నేతలు మరో వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే బీసీలకు 42 %రిజర్వేషన్ల కల్పనే పార్టీకి ప్రధానమని, అవసరమనుకుంటే ఈ విషయంలో మరికొంత సమయం తీసుకుందామని ఆయన అంటున్నారు. ఆదివారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు, నాయకులు మాత్రం ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మరింత జాప్యం చేయడం మంచిది కాదని, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పీఏసీని సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ మూడు ఆప్షన్లు పీఏసీ ముందుకు.. పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరగనుండగా.. రిజర్వేషన్ల విషయం ఎటూ తేలనందున కోర్టును మరింత సమయం కోరుదామని, వీలుకాదంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోమారు ఢిల్లీకి వెళదామనే ప్రతిపాదన ఇందులో మొదటిది. మరోమారు అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండూ కాదంటే నేరుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం మూడోది. వీటిపై అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీఎంతో ముఖ్యుల భేటీ ఆదివారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్తో మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియన్ నేత వి.హనుమంతరావులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు గాం«దీభవన్లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా 22న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగే అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరు కావాలని రేవంత్ను వీహెచ్ కోరారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా పీసీసీ చీఫ్కు సూచించిన ముఖ్యమంత్రి.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వీహెచ్కు చెప్పినట్టు సమాచారం. -
ఇక కొత్త సర్వే మాన్యువల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల హద్దును నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్ను రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, ప్రజాపాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జరిగే సర్వేలు పారదర్శకంగా ఉండేందుకు గాను తాజా నిబంధనలు తయారు చేయాలని, సర్వే మాన్యువల్ తయారీకి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. ఆదివారం సర్వే విభాగంపై సమీక్ష సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. అక్టోబర్ 2 నుంచి లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థ అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. లైసెన్సుడు సర్వేయర్ల నియామకంలో భాగంగా ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో 7 వేల మందికి తొలి విడత శిక్షణ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. గత నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటిస్ శిక్షణ కూడా పూర్తి చేశామని చెప్పారు. రెండోదశ శిక్షణ ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నామని, ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్లకు రిపోర్టు చేయాలని సూచించారు. భూ భారతి చట్టంలో భాగంగా రిజి్రస్టేషన్ల సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, సర్వే విభాగాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా లైసెన్సుడు సర్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని పొంగులేటి వివరించారు. -
‘అమృత్భారత్’ ఈసారైనా పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: తక్కువ చార్జీ..ఎక్కువ వేగంతో ప్రయాణ సదుపాయం అందించే సామాన్యుడి రైలే అమృత్భారత్ ట్రైన్. ఇప్పటివరకు రెండు దశల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే దక్షిణమధ్య రైల్వేలో మాత్రం ఒక్క అమృత్భారత్ కూడా పట్టాలెక్కలేదు. ‘అమృత్ భారత్ 1.0’, ‘అమృత్భారత్ 2.0’శ్రేణుల తర్వాత ఇప్పుడు తాజాగా ‘అమృత్ భారత్ 3.0’వెర్షన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా కూడా అమృత్ భారత్ 3.0 ప్రస్తావనకు వచ్చింది. ఈ కొత్త వెర్షన్లో ఏసీ, నాన్ ఏసీ సదుపాయం ఉన్న రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్ కేంద్రంగా ఈ సామాన్య ప్రయాణికుల రైలును పట్టాలెక్కిస్తారా..లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. » హైదరాబాద్ నుంచి పటా్న, వారణాసి, షిరిడీ తదితర ప్రాంతాలకు భారీ డిమాండ్ ఉంది. » సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్టణం, కాకినాడ మార్గాల్లో అన్ని రెగ్యులర్ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగలు, వరుస సెలవులతో నిమిత్తం లేకుండా వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. కొత్తగా రానున్న మూడో వెర్షన్ అమృత్భారత్ రైళ్లను హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి తేవాలని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రైలు కూడా రాలేదు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023లో అమృత్భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి, పేద ప్రజలు, వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్ల చార్జీలను రూపొందించారు. » ఏసీ సదుపాయం లేని అమృత్భారత్ రైళ్లలో 11 జనరల్ క్లాస్ కోచ్లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, మరో రెండు సెకండ్ క్లాస్–కమ్–లగేజ్–కమ్–గార్డ్ వ్యాన్లు, దివ్యాంగులకు ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. » తాజాగా చెన్నై ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న అమృత్భారత్ 3.0 వెర్షన్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. » ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అమృత్భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అందులో 6 అమృత్ భారత్ రైళ్లు బిహార్కే కేటాయించారు. ఆ రాష్ట్రంలోని మోతీహరి, పటా్న, దర్భంగా, సీతామర్హి తదితర నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. » మరో రెండు అమృత్ భారత్ రైళ్లు పశ్చిమబెంగాల్లోని మాల్డా టౌన్ నుంచి, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (గోమతినగర్) నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. » ముంబయి, బెంగళూరుకు కూడా ఒక్కొక్క అమృత్భారత్ రైళ్లను కేటాయించారు. » తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక అమృత్భారత్ రైలు కూడా అందుబాటులో లేదు. హైదరాబాద్ నుంచి బిహార్కు ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. » సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల రూట్లో ప్రయాగ్రాజ్, వారణాసి మీదుగా పట్నా వరకు అమృత్భారత్ సూపర్ఫాస్ట్ డైలీ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తెస్తే వలస కార్మికులతోపాటు వారణాసి, ప్రయాగకు వెళ్లే భక్తులకు సైతం ఎంతో ప్రయోజనం కలుగుతుంది. » ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ పట్నా ఎక్స్ప్రెస్ ఒక్కటే ఈ రూట్లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రతి రోజు వందలాది మంది వెయిటింగ్ లిస్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు.తెలంగాణ సంపర్క్ క్రాంతి ఏదీ? ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి న్యూఢిల్లీకి సంపర్క్క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపర్క్క్రాంతి రైళ్లను ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ సంపర్క్క్రాంతిని నడపాలని ప్రయాణికులు, ప్రయాణికుల సంఘాలు రైల్వే వినియోగదారుల సమావేశాల్లో ప్రతిపాదించారు. విజ్ఞప్తులు చేశారు. ఎంపీల సమావేశంలోనూ ప్రతిపాదనలొచ్చాయి. కానీ రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. -
‘సృష్టి’ ఉచ్చులో చిక్కుకున్నారిలా..!
సాక్షి, హైదరాబాద్: సంతాన సాఫల్య కేంద్రం ముసుగు వేసుకుని, సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, క్రయవిక్రయాలు చేపట్టిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న డాక్టర్ నమ్రత ఉచ్చులో మిగిలిన నిందితులు ఎలా చిక్కుకున్నారనేది దర్యాప్తు అధికారులు గుర్తిస్తున్నారు. ఈ నేరాలకు సంబంధించి ఇప్పటివర కు 9 కేసులు నమోదు కాగా... 25 మంది నిందితులను అరెస్టు చేశారు. ‘సృష్టి’కేంద్రంగా సాగించిన వ్యవహారాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్న నగర పోలీసు విభాగం, ఈ కేసులో అత్యంత కఠినమైన బీఎన్ఎస్లోని సెక్షన్ 111ను జోడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఎం.నందిని ఘట్కేసర్ సమీపంలోని రాంపల్లిలో నివాసం ఉండేది. ఈమె 2010లో కొన్నాళ్లపాటు జీడిమెట్లకు చెందిన తన స్నేహితురాలి తల్లి వద్ద నివసించింది. ఆమె తరచూ క్లినికల్ ట్రయల్స్ కోసం ల్యాబ్లకు వెళుతుండేది. అప్పుడప్పుడు నందినిని తనతో తీసుకువెళ్లేది. ఇలా డబ్బు సంపాదించడం కోసం నందిని కూడా క్లినికల్ ట్రయల్స్కు క్లయింట్గా మారింది. 2017లో బెంగళూరులో క్లినికల్ ట్రయల్కు హాజరవుతున్న సమయంలో సంజయ్ అనే వ్యక్తిని కలిశారు. 2018లో వీళ్లు వివాహం చేసుకుని మౌలాలీలో కాపు రం పెట్టారు. 2025 జనవరిలో నందిని తన అండాన్ని దానం చేయడానికి బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఈమెకు మరో నిందితురాలు హర్ష రాయ్తో పరిచయమైంది. అప్పటినుంచి స్నేహితులుగా మారిన వీళ్లు అండాలను దానం చేసే వారి వివరాలు మారి్పడి చేసుకునే వాళ్లు. ఈ నేపథ్యంలోనే వీరికి మరో నిందితురాలు ధనశ్రీ సంతోషితో పరిచయం ఏర్పడింది. సంతోషి ద్వారా నందిని, హర్షరాయ్ నమ్రత ఉచ్చులో చిక్కారు. ఈ నేపథ్యంలో అసోంకు చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన చిన్నారిని డాక్టర్ నమ్రతకు విక్రయించారు. ఆమె ఈ చిన్నారిని రాజస్తాన్కు చెందిన దంపతులకు అమ్మింది. ఈ దంపతుల ఫిర్యాదుతోనే సృష్టి విష యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సంతో షి, హర్ష రాయ్లపై మహారాష్ట్రలోని విఖ్రోలి పోలీసుస్టేషన్లోనూ చిన్నారుల అక్రమ రవాణా కేసు ఉంది. డ్రైవర్గా వచ్చి.. కీలకంగా మారి.. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ఎం.పవన్ మోహన్ కృష్ణ నగరానికి వలసవచ్చి పద్మారావు నగర్లోని ఓ బాలుర హాస్టల్లో ఉండేవాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇచ్చిన యాడ్ అతడిని ఆకర్షించింది. డ్రైవర్ పోస్టుకు సంబంధించిన ఆ ప్రకటన చూసిన పవన్ మోహన్ ఆ సెంటర్లో సంప్రదించాడు. అయితే డ్రైవర్ పోస్టు కోసం వెళ్లిన మోహన్ని ఆస్పత్రి నిర్వాహకులు సూపర్వైజర్గా చేర్చుకున్నారు. ఆ ఉద్యోగంలో చేరడంతోనే డా.నమ్రతతో పరిచయం ఏర్పడి, ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసికి ఒప్పించడం విధిగా మార్చుకున్న ఇతడికి, నమ్రత ఒక్కో క్లైంట్కు రూ.10 వేల నుంచి రూ.15 వేల కమీషన్ ఇచ్చేది. అలా కొన్నాళ్లకు సికింద్రాబాద్లోని సృష్టి సెంటర్ నిర్వహణలో ఇతడు కీలకంగా మారాడు. -
గజ్వేల్ రేక్ పాయింట్ ఖాళీ!
గజ్వేల్: తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు యూరియా సరఫరా కేంద్రంగా ఉన్న గజ్వేల్ రేక్ పాయింట్ ప్రస్తుతం అత్తెసరు నిల్వలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉంచడానికి గజ్వేల్లో 2022 జూన్ 27న రేక్ పాయింట్ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రేక్ పాయింట్లకు ఇది అదనం. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, ఈ లైన్పై గజ్వేల్ రైల్వేస్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్ ఏర్పాటు చేశారు. పలు పోర్టుల నుంచి ఇక్కడి రైలు మార్గంలో.... గజ్వేల్ రేక్ పాయింట్కు తమిళనాడు రాష్ట్రంలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలుమార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. గతంలో ఇక్కడకు ఎన్ఎఫ్సీఎల్ (నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్ (కోరమాండల్ ఇంటర్నేషనల్ కెమికల్), ఇఫ్కో తదితర కంపెనీలకు చెందిన యూరియా వచ్చేది. కానీ ప్రస్తుతం ఎన్ఎఫ్సీఎల్ నుంచి యూరియా బంద్ కాగా, మిగిలిన కంపెనీల ఉత్పత్తులు వస్తున్నాయి. గతంలో భారీగా నిల్వలు. రేక్ పాయింట్ను ప్రారంభించిన 2022–23 సంవత్సరంలో 15 నుంచి 20 వరకు రేక్ల నిల్వలు వచ్చాయి. ఒక్కో రేక్ సామర్థ్యం 1,400 మెట్రిక్ టన్నులు. ఇలా ఆ ఏడాది సుమారుగా 21 వేల మెట్రిక్ టన్నుల నుంచి 28 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు వచ్చి...ఆయా జిల్లాలకు సరఫరా అయ్యాయి. 2024–25లో 10 రేక్లకు పైగా వచ్చాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం మూడు రేక్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సీజన్లో కేవలం ఇక్కడకు 4,200 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీనివల్ల ఆయా జిల్లాలకు సరఫరా అయ్యే యూరియాలో తీవ్రమైన కోత పడింది. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా యూరియా దిగుమతులు నిలిచిపోవడం వల్ల ఇక్కడకు రావాల్సిన నిల్వల్లో కోత పడింది. యూరియా టోకెన్ల కోసం రైతుల ఆందోళనకేసముద్రం: యూరియా బస్తాల టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి బారులుదీరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఆదివారం జరిగింది. కేసముద్రం, ధన్నసరి సొసైటీలకు 20 టన్నుల యూరియా వస్తుందనే సమాచారంతో.. ఉదయం 7 గంటలకు రైతులు పీఏసీఎస్ల వద్దకు చేరుకున్నారు. కేసముద్రం రైతు వేదిక భవనంలో యూరియా టోకెన్లు ఇస్తున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారంతో అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకొని క్యూలో నిల్చున్నారు. 444 బస్తాలకు గాను ఏవో వెంకన్న, పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. వెయ్యి మందికి పైగా రైతులు మధ్యాహ్నం వరకు క్యూలైన్లో నిల్చొని పడిగాపులు పడినా, 444 బస్తాలకు మాత్రమే టోకెన్ ఇవ్వడంతో మిగిలిన రైతులంతా నిరాశతో వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాల పంపిణీకి అధికారులు టోకెన్లు ఇచ్చేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పెద్దసంఖ్యలో చేరుకున్న రైతులు బారులు దీరారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో టోకెన్ల పంపిణీ నిలిపివేశారు. అనంతరం రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.అవసరానికి మించి యూరియా కొనొద్దుముందస్తు సాగుతో పెరిగిన యూరియా వాడకం రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయని కేంద్రం చాలా రాష్ట్రాల్లో యూరియా కొరత ఉందని బీజేపీ అధ్యక్షుడికి తెలియదు వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు ఆందోళనకు గురై అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన యూరియాను పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం సచివాలయంలో మంత్రి తుమ్మల వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా లభ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా చైతన్యపరచాలని చెప్పారు. వానాకాలం సీజన్కు కేంద్రం కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఈనెల వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటంతో ఏర్పడిన యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆదేశించారు. సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా అమ్మకాలు కూడా అధికంగా జరిగాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నల్లగొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో గత సంవత్సరంతో పోలిస్తే యూరియా అమ్మకాలు అధికంగా జరిగినట్టు తెలిపారు. యూరియాను వ్యవసాయానికి కాకుండా, ఇతర అవసరాల కోసం మళ్లించకుండా టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని, ఇక్కడే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు అవగాహనరాహిత్య మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవానికి మన రాష్ట్రంలోనే కాకుండా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్తాన్తోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు బి.గోపి మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సీజన్కు ముందే కేంద్రం ఎరువులను కేటాయిస్తుందని, అందులో భాగంగానే తెలంగాణకు కూడా యూరియాతో కలిపి 5 రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని అన్నారు. ఇందులో యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ కలిపి 13.95 మెట్రిక్ టన్నులుగా ఉన్నట్టు తెలిపారు. అయితే కేటాయించిన యూరియాను నెలవారీగా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం వల్ల సమస్య ఎదురైందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హాకా ఎండీ చంద్రశేఖర్, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీ టు అమరావతి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాలుగో నగరి.. ఫ్యూచర్ సిటీతో రాష్ట్రాభివృద్ధి మరో దశకు చేరనుందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తు నగరాన్ని వచ్చే వెయ్యేళ్ల అవసరాలను తీర్చేలా, ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న సర్కారు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మధ్య ఎనిమిది లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణం తర్వాత హైదరాబాద్–విజయవాడ మధ్య దూరం 70 కిలో మీటర్ల మేర తగ్గుతుందని చెపుతున్నారు. మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రీజనల్ రింగ్ రైల్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టులను ఓడరేవుతో అనుసంధానిస్తే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య రవాణాతో పాటు బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులను ఆకర్షించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నంలో బందరు పోర్టుకు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. దీనికి త్వరలోనే అనుమతి మంజూరు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్లు.. ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులకు కూడా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. రీజనల్ రింగ్ రైల్ను బందరు పోర్టు లేదా ఇతర ఓడరేవుతో అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ట్రిపుల్ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్, చౌటుప్పల్ లేదా ఖమ్మం వద్ద వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్.. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (ఓఆర్ఆర్ లోపల), సెమీ ఆర్బన్ (ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య), గ్రామీణ (ఆర్ఆర్ఆర్, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల మధ్య) ప్రాంతం.. అని మూడు భాగాలుగా విభజించిన సర్కారు.. వీటిని సేవా, పారిశ్రామిక, వ్యవసాయ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తెలంగాణ రైజింగ్–2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ను రూపొందించనుంది. దీనిని వచ్చే డిసెంబర్ 9న విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం గమనార్హం. -
వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటిదశ సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్.విద్యాసాగర్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీఎస్సీ(అగ్రికల్చర్)లో 15 శాతం సీట్లు, బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో 15 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు కేటాయించినట్టు చెప్పారు.విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో చదివినవారు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు. విద్యార్థి లేదా, వారి తల్లిదండ్రుల పేరుపై ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధిహమీ పథకం కార్డు కలిగి ఉన్నవారే ఈ కోటకు అర్హులన్నారు. పై అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్సైట్ www.pjtau.edu.in లో చూడొచ్చని రిజి్రస్టార్ పేర్కొన్నారు. -
సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్/గంభీరావుపేట/సిరిసిల్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు తెలిపారు. తాను హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, దానిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘మీ ఆశీర్వాదంతోనే రాజకీయంగా ఎదిగాను. మీరు వద్దనుకునే వరకు ఇక్కడే పోటీ చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్లలో పోటీ చేయనని, హైదరాబాద్ శివారుల్లో పోటీ చేస్తానని కొన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు’అని కోరారు. మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకుంటా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను దగ్గరుండి గెలిపించుకుంటానని కేటీఆర్ తెలిపారు. ‘నా గెలుపు కోసం మీరంతా కష్టపడ్డారు. మీ గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో నేను కష్టపడుతాను. ఇంటింటికీ వెళ్తాను. అభ్యర్థులకు బీఆర్ఎస్ టిక్కెట్ల నేనే ఇస్తాను. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారు వ్యాపారం చేసుకోవాలే తప్ప, వాళ్లకు రాజకీయాలు ఎందుకు?’అని ప్రశ్నించారు. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్)తో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన ‘ఎక్స్’ లో స్పందించారు. ‘ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో, సమస్యల పరిష్కారాల కన్నా సాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన ఎన్నికల సంఘం, ఎన్డీయే ప్రభుత్వానికి అనుబంధ విభాగంలా పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు సీఎం రేవంత్రెడ్డి పదేపదే ప్రచారం చేస్తున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం ఆకాంక్ష నెరవేరదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి విజన్ లేని నాయకుడు. ఆయన నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందనే దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ’అని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.కుంటయ్య కూతురు పెళ్లి చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరికవేణి కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన కూతురు లక్షిత (భార్గవి) పెళ్లి బాధ్యతలను కేటీఆర్ నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పెళ్లి వేడుకలకు ఆదివారం హాజరయ్యారు. పెళ్లి ఖర్చులను పార్టీ పరంగా కేటీఆర్ భరించారు. కుంటయ్య చిన్న కూతురుకు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్గా అందించారు.ఆ ఆహ్వానం నాకెంతో ప్రత్యేకం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నవిత వివాహానికి కూడా కేటీఆర్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘అన్నా.. నాకు నాన్న, అన్న లేరు. మీరు అన్నయ్యగా పెళ్లికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి’ నవిత వాట్సాప్లో పంపిన ఆహ్వానం తన మనస్సును కదిలించిందని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చాలని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు.. అది నా మీద ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను’అని పేర్కొన్నారు. -
21న ఓయూకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలసి 21వ తేదీన ప్రారంబోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహా్వనించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ప్రారంభించడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు కొత్త హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను సైతం సీఎం ప్రారంభించనున్నారు.అనంతరం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’అనే అంశంపై ముఖ్యమంత్రి.. ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, గత ఇరవై ఏళ్ల కాలంలో ఓయూకు ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం ఇదే ప్రథమమని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘సీఎం రీసెర్చ్ ఫెలో షిప్’తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు. -
లీజుకు ఆర్టీసీ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ జిల్లాల్లో ఉన్న భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి విలువైన ప్రాంతాల్లో భూములున్నాయి. వాటిల్లోంచి ప్రస్తుతం 22 ప్రాంతాల్లో ఉన్న 65 ఎకరాల భూములను తాజాగా లీజు కోసం టెండర్ నోటిఫికేషన్లో పేర్కొంది. నగర శివారులోని తుర్కయాంజాల్, శంషాబాద్ సమీపంలోని రషీద్పురా, శామీర్పేట, హకీంపేట, కరీంనగర్, ఖమ్మం, వనపర్తి, గద్వాల సహా మొత్తం 22 ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. నెలకు రూ.85 లక్షల ఆదాయం వస్తుందని అంచనా.. ముఖ్య ప్రాంతాల్లోని చిన్నచిన్న బిట్లను గతంలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు కేటాయించింది. కొన్ని పెద్ద భూములను షాపింగ్మాల్లాంటి వాటికి ఇచ్చింది. అయితే, అవి పరిమితంగానే ఉన్నాయి. మిగతా భూములను భవిష్యత్ అవసరాల దృష్ట్యా తన వద్దే ఉంచుకుంది. గతంలో ఓ పర్యాయం ప్రభుత్వం ఈ భూములను అమ్మి నిధులు సమీకరించబోతోందన్న వార్తలు వెలువడ్డాయి. భూములను అమ్మడమంటే, త్వరలో సంస్థను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నట్టేనని ఆరోపిస్తూ కారి్మక సంఘాలు ఆందోళనకు దిగాయి. భూములను అమ్మే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆర్టీసీ స్థలాలను అమ్మే ఆలోచన తనకు లేదని ఆ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆ భూముల్లో కొన్నింటిని లీజుకు ఇవ్వాలని టెండర్లు పిలిచింది.ఈ లీజు ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.65 లక్షల నుంచి రూ.85 లక్షలు సమకూరుతాయని అంచనా వేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం రోజువారీ ఆదాయం బాగా పెరిగింది. మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం ఠంచన్గా సంస్థకు చెల్లిస్తే, సంస్థ కొంతమేర లాభాల్లోకి చేరుకుంటుంది. గతంలో ఉన్న నష్టాలను దాదాపు అధిగమించినట్టయ్యింది. అయితే, పెద్దమొత్తంలో పేరుకుపోయిన బకాయిలు, అప్పులు, వాటిపై వడ్డీలు చెల్లించేందుకు మాత్రం ఈ ఆదాయం సరిపోదు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో కూడా ఎలాంటి కేటాయింపులు లేనందున కచ్చితంగా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందఇటీవల రూ.400 కోట్ల అప్పు తీసుకుంది. ఈ తరుణంలో అదనపు ఆదాయం సమకూరితే కొన్ని బకాయిలు తీర్చేందుకు కొంతమేర ఉపయోగంగా ఉంటుందని సంస్థ భావి స్తోంది. ఈ భూములకు ఎంత ధర నిర్ణయించవచ్చో తేల్చేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చిన ధరలనే ఖరారు చేస్తూ టెండర్లు పిలిచింది. దానికంటే ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలు, వ్యక్తులకు ఆ భూములను కేటాయించనున్నారు. రాజకీయ నేతల చేతుల్లోకి చేరితే.. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత కీలక ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకొని బడా షాపింగ్ మాల్ నిర్మించి ఆదాయాన్ని పొందుతూ సంస్థకు మాత్రం లీజు మొత్తాన్ని చెల్లించకుండా బకాయిపెట్టారు. ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా లీజు చెల్లించకుండా మొండికేశారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ ప్రయతి్నంచగా రాజకీయంగా ఉ న్న పలుకుబడితో అది కుదరకుండా చేశారు.చివరకు ఇటీవల సంస్థ దూకుడుగా వ్యవహరించటంతో దిగివచ్చాడు. ఇప్పుడు లీజుకు ఇచ్చే భూములను అలాంటి నేతల చేతుల్లోకి చేరకుండా సంస్థ జాగ్ర త్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాటి వల్ల ఆదాయం రాకపోగా, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవటం కూడా ఆ ర్టీసీకి కష్టంగా మారుతుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. -
పొంగుతున్న కృష్ణా, గోదావరి
సాక్షి నెట్వర్క్: ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తోపాటు తెలంగాణ, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి ఆదివారం మరింత పెరిగింది. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ 9.980 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అన్నారం (సరస్వతి) బరాజ్ వద్ద ఇన్ఫ్లో 80 వేల క్యూసెక్కులకు చేరింది. బరాజ్లోని మొత్తం 66 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కి 5.66 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బరాజ్కి 1,84,330 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అదేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 12.98 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పడవల ద్వారా మల్యాల, కొండాయి, ఐలాపురం, గోవిందరాజు కాలనీ ప్రజలను తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, తహసీల్దార్ జగదీశ్, ఎంపీడీఓ శ్రీనివాస్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. సాగర్కు నిలకడగా వరదకృష్ణానదిలో కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆదివారం మూడు గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో క్రస్ట్ గేట్ల ద్వారా 77,946, విద్యుదుత్పత్తి చేస్తూ 38,818, సుంకేసుల నుంచి 49,632 మొత్తం 1,66,396 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. దీంతో మూడు గేట్ల ద్వారా 79,269 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ మరో 65,807 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదిలారు.ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.4 అడుగుల వద్ద 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి మొత్తం 1,99,781 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఉదయానికల్లా ఇది వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. అల్పపీడనం, వాయగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సోమవారం ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతోపాటు రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమవ్వడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 30.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది.15 శాతం అధిక వర్షపాతంనైరుతి సీజన్ వర్షాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.81 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15 శాతం అధికంగా వర్షాలు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 5 జిల్లాల్లో అత్యధికంగా, 9 జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో సగటున 1.51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆందోళనకరంగా ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో 2018 నుంచి 2022 వరకు నమోదైన ఆత్మహత్యల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 2018లో 7,845 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2019లో 7,675, 2020లో 8,058, 2021లో ఏకంగా 10,171 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2022లో ఆ సంఖ్య 9,980గా నమోదైంది. ఐదేళ్లలో 43,729 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఏటా సగటున 8,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. వీరిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు కూడా ఉండడం గమనార్హం. కాగా 2023 నుంచి 2025 వరకు జరిగిన ఆత్మహత్యల వివరాలను ఎన్సీఆర్బీ వెల్లడించలేదు. దేశంలో ఐదేళ్లలో 7.62 లక్షల ఆత్మహత్యలు ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 1,34,516 ఆత్మహత్యలు (రేటు 10.2) నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 1,70,924 (రేటు 12.4)గా నమోదైంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఐదేళ్లలో మొత్తం 7,61,648 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో లక్ష జనాభాకు సగటున 11.26 రేటుతో ఆత్మహత్యలు నమోదయ్యాయన్న మాట. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకొని లెక్కలేస్తే సిక్కిం రాష్ట్రంలో అత్యధికంగా ఐదేళ్లలో సగటున 37.5 రేటు నమోదైంది. 26.42 రేటుతో ఛత్తీస్గఢ్ తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో కేరళ (25.44)ఉండగా, నాలుగో స్థానంలో (23.3) తెలంగాణ, ఐదో స్థానంలో తమిళనాడు (21.8) ఉన్నాయి. నిరుద్యోగం, కుటుంబ సమస్యలూ కారణం.. నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా గుర్తించగా.. పంటలు సరిగా పండక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో ఏయేటికాయేడు పెరుగుతోంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 2018లో 10,134 మంది ఉంటే 2022లో ఆ సంఖ్య 14,600గా నమోదైంది. తెలంగాణలో ఐదేళ్లలో 2,590 మంది మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. కాగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్లలో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండగా, లక్షద్వీప్లో అతి తక్కువగా నమోదైంది. ఆత్మహత్య ఆలోచనల నుంచి మళ్లిస్తున్న టెలి మానస్ చిన్న సమస్యను సైతం పెద్దగా ఆలోచించి ఆత్మహత్య వైపు అడుగువేసే ధోరణి పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను నివారించేందుకు వీలుగా 2022 అక్టోబర్లో ‘నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (టెలి–మానస్)’ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలి మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మొబైల్ యాప్, వీడియో కన్సల్టేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రిలో మానస్ కేంద్రం ఏర్పాటు చేయగా, ఈ కేంద్రానికి ఇప్పటివరకు 1,61,477 ఫోన్కాల్స్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫోన్ రాగానే మానసిక నిపుణులు బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా 53 టెలీ మానస్ కేంద్రాలకు ఇప్పటి వరకు 24.52 లక్షల కాల్స్ను వచ్చాయి. -
ఎత్తిపోతలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్మానేరు జలాశయానికి పంపింగ్ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. మిడ్ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం మిడ్మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్సాగర్కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఎఫ్ఎఫ్సీ) ద్వారా గ్రావిటీతో మిడ్మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్ఎఫ్సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్మానేరుకు చేరుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ల ద్వారా అంతే నీళ్లను మిడ్మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్హౌస్లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్ చేస్తున్నారు. దీంతో మిడ్మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు నుంచి ఎప్పుడు? మిడ్మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్తో పాటు మరో లింక్ ద్వారా మలకపేట, అప్పర్ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్లైన్ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రాజెక్టులకు వరద ఇలా.. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి.. కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మిడ్మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు అందే అవకాశం ఉంది. కృష్ణా జలాశయాలు కళ కళ కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఓ కార్పొరేటర్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఉన్నారు. ఆదివారం (ఆగస్ట్17) బాలానగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్పల్లిలోని ఓ గెస్ట్ హౌస్లో పేకాట శిబిరంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొండలరావుతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. వీరివద్ద నుంచి మూడు లక్షల నగదుతో పాటు, మొబైల్ ఫోన్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు. క్రీడల్లో గానీ, రోజువారీ జీవితంలోగానీ అవి అత్యంత అవసరమైనవని ఆమె చెప్పారు. జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అనే స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో తన జీవనయానంలో క్రమశిక్షణ, ఇబ్బందులను అధిగమించేందుకు త్వరగా స్పందించాల్సిన అవసరం లాంటి విషయాలు పంచుకున్నారు.జీవీకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి, వీణారెడ్డిలతో జరిగిన ఒక చర్చ.. సాధారణ విషయాల నుంచి సీరియస్ అంశాలవైపు మళ్లింది. ఒలింపిక్ పతకం సాధించడం కంటే ఐస్ క్రీం తినకుండా ఉండడం కష్టమా అన్నప్పుడు.. సింధు నవ్వేసింది. తర్వాత మాట్లాడుతూ, “పతకాలు సాధించడం కష్టమే. కానీ, ఐస్ క్రీం వద్దనడం ఇంకా కష్టం. కానీ క్రమశిక్షణ, కోలుకోవడం, ముందస్తు సంరక్షణల వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నాను. నిలకడ అనేది చాలా ముఖ్యం. గాయాలు కాకుండా చూసుకోవడండ, అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడడంతోనే మనం ఎక్కువకాలం ఆటలో ఉండగలం” అని చెప్పారు.తన సొంత అనుభవాల గురించి సింధు వివరిస్తూ శిక్షణలాగే త్వరగా కోలుకోవడం, వెంటనే స్పందించడం ఎందుకు ముఖ్యమో ఇలా చెప్పారు. “మనమంతా క్రీడల్లో ఫిట్నెస్ పరీక్షలను గౌరవిస్తాం. మరి జీవితంలో వైద్యపరీక్షలంటే ఎందుకు భయపడతాం? మనం ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటామన్నది కాదు, ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది. కానీ మహిళలకు వ్యాధుల నివారణ చాలా కీలకం. మీరు పెద్దస్థాయిలో పోటీ పడుతున్నా, లేదా చురుగ్గా ఉన్నా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. దానివల్ల ఏమైనా సమస్యలున్నా త్వరగా తెలుస్తాయి, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండగలరు” అని వివరించారు.హైదరాబాద్లోని వేగవంతమైన జీవితంలో సింధు చెప్పే విషయాలు చాలా ముఖ్యం. “ఏదో సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కాకుండా ఏటా వైద్యపరీక్షలు చేయించుకోవడం అవసరం. అనారోగ్యం వచ్చినప్పుడు పరుగెత్తడం కంటే ముందస్తు వైద్య పరీక్షలకు తప్పకుండా వెళ్లాలి. మీరు పతకాల కోసం ప్రయత్నిస్తున్నా, డెడ్లైన్లు వెంటాడుతున్నా, లేదా ఫిట్గా ఉన్నా కూడా ఎర్రజెండా వచ్చేవరకు ఆగద్దు. వైద్యపరీక్షలను ఒక అలవాటుగా చేసుకోండి” అని కోరారు.మహిళలు తమ ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారని సింధు అన్నారు. “ఆరోగ్యం విషయంలో అలసత్వాన్నుంచి మనం స్వాతంత్య్రం పొందాలి. డాక్టర్ గూగుల్ను నమ్మకండి.. వైద్య పరీక్షలు చేయించుకోండి. ఏదైనా జరిగేవరకు వేచి చూడడం మంచిది కాదు. ఈ లోపే స్పందించాలి. జీవితంలో వెనకబడిపోవడం కాకుండా ఏది అవసరమో దానిపై దృష్టిపెట్టే స్వేచ్ఛ మీకు ముందస్తు వైద్యపరీక్షలతో వస్తుంది” అని సింధు తెలిపారు.ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ, “ఇళ్లలోనైనా, ఆఫీసుల్లోనైనా మహిళలు తమ గురించి తక్కువ ఆలోచిస్తారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అంటే మీ సొంత అవసరాలు, విశ్రాంతి, సంపూర్ణ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడమే. ఇవన్నీ లగ్జరీలు కావు.. అత్యవసరమైనవే. చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని కాపాడతాయి. చిట్టచివరి నిమిషంలో పరుగెత్తాల్సిన పని ఉండదు” అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఎన్జీకే శాస్త్రి కూడా సమస్యలను ముందుగా గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా కలుగుతాయో సవివరంగా చెప్పారు.జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి సంవత్సరంలోనే రోగుల అవసరాలకు సమగ్ర పరిష్కారాలు అందిస్తూ, 17 విభాగాలకు సంబంధించిన ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర వైద్యపరీక్షలు, డేకేర్ శస్త్రచికిత్సలు, నివారణ చికిత్సలు చేస్తూ సమగ్ర ఆస్పత్రిగా ఎదిగింది.ముందస్తు వైద్య పరీక్షలు కేవలం అథ్లెట్లకు మాత్రమే కాదని ఈ చర్చలో చివరగా తేల్చారు. సింధు అయితే ఒకే సూత్రం చెబుతారు.. మీ శరీరం మరమ్మతులు కోరుకోకముందే దానిని చూడండి. అది మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటుంది. -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు. -
1 నుంచి నెలవారీ రేషన్ కోటా
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్–1) నుంచి మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని (బ్యాగ్) అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. -
ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళల దాడి
మాదాపూర్ : మాదాపూర్లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు. మాదాపూర్ ఇమేజ్గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లగ్జరీదే మూడో వంతు వాటా.. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది. అందుబాటు ఇళ్ల కొరత.. నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్పూర్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది. -
పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు ఎన్డీయే ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను.. ‘కూలవరం’అనే ధైర్యం ఉందా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బీజేపీ నేతలు బురదజల్లారు. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయినా పోలవరం కాఫర్ డ్యామ్పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అని నిలదీశారు. ‘ఏపీలో ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్కు గుట్టుచప్పుడు కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్ వద్ద మరమ్మతులు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదు. పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్ర రైతును తీర్చిదిద్దిన కేసీఆర్పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుమీద కాంగ్రెస్, బీజేపీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హృద్యంగా.. సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: వారంతా సరికొత్త హృదయాలతో కొంగొత్త జీవనం గడుపుతున్నారు.. కానీ ఆ పునర్జన్మ పొందేందుకు పడిన కష్టనష్టాలు, వ్యయప్రయాసలు తమ లాంటి వైద్య పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం నిరీక్షిస్తున్న రోగుల కోసం నిరంతరం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ల సంబంధ సమాచారం అందించేందుకు వీలుగా హారి్టయెస్ట్ పీపుల్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న 240 మంది వ్యక్తులు, వారి కుటుంబీకులు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. గుండె మార్పిడికి ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను ఎప్పటికప్పుడు గ్రూప్లో షేర్ చేస్తూ రోగులు, వారి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. కీలక సమయంలో సహాయం.. గ్రూప్ వ్యవస్థాపక సభ్యురాలు, గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన ముంబైకి చెందిన ఆర్మైటీ హోమి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తన కుమార్తెను ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకి తరలించే క్రమంలో ఎదురైన సమస్యలు, సవాళ్లు ఇతర రోగులకు ఎదురవకుండా చూసేందుకే వాట్సాప్ గ్రూప్కు శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ‘చాలా మంది గుండె, ఇతర అవయవాల మార్పిడి కోసం చిన్న పట్టణాల నుంచి ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కీలక సమయంలోనే మా గ్రూప్ సభ్యులు అవసరమైన సహాయం చేస్తారు’అని హోమి వివరించారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఏడేళ్ల క్రితం గుండె మార్పిడి చేయించుకున్న డా. వినీ కిర్పాల్ సైతం ఈ గ్రూప్లో చేరారు.తనకు ఎదురైన అనుభవాల సారంతో ఇప్పటికే ‘న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్’పుస్తకం ద్వారా అవయవ గ్రహీతలు, దాతలు, అవయవ మార్పిడి వైద్యుల విశ్లేషణలు, అభిప్రాయాలను వినీ కిర్పాల్ వెలుగులోకి తీసుకొచ్చారు. మరో గ్రూప్ సభ్యురాలు, కిడ్నీ గ్రహీత జయ జైరామ్.. 28 ఏళ్లకుపైగా అవయవదాన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ ఫౌండేషన్ (మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్) ముంబై విభాగానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. బ్రెయిన్ డెడ్కు గురయ్యే రోగుల కుటుంబాలను అవయవదానానికి ప్రోత్సహించడంపై ఆమె దృష్టిపెట్టారు. -
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంటు భవనం పరిసరాలు ప్రత్యేకంగా ఉన్న తరహాలోనే తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని కూడా రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉభయసభలున్న ప్రాంగణం యావత్తు కొంత గందరగోళంగా ఉంది. వారసత్వ భవనం అయినప్పటికీ, ప్రధాన భవనానికి చేరువలో ఇతర భవనాలుండటంతో ఆ భవన ప్రత్యేకతకు కొంత భంగంవాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది. సభ జరిగే సమయంలో వాహనాలకు సరైన పార్కింగ్ వసతి లేకపోవటంతో ప్రధాన భవనం చుట్టూరా నిలుపుతున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనం అయినప్పటికీ, దాని ప్రత్యేకతను ఇనుమడింపజేసేలా పచ్చిక బయళ్లు లేకపోవటం వెలితిగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాన భవనానికి అతి చేరువలో ఉన్న ఇతర భవనాలను తొలగించి.. కొంచెం దూరంగా, క్రమపద్ధతిలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యులు, మండలి సభ్యులు, వీఐపీలకు ఆ భవనంలో చాలినన్ని వసతులు లేవని, అందుకు ప్రత్యేకంగా మరో భవనం నిర్మించి వసతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఉద్యానవన శాఖ స్థలాన్ని సేకరించి.. శాసన మండలి కూడా శాసనసభ ఉన్న ప్రధాన భవనంలోకే మారనుంది. ఇప్పటికే పాత అసెంబ్లీ హాల్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ప్రస్తుతం జూబ్లీహాలు వెనకవైపు కొనసాగుతున్న మండలి ప్రాంగణాన్ని ఖాళీ చేయనున్నారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఉద్యానవన విభాగం ఆదీనంలోని స్థలాలను సేకరించి దానికి మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించారు. అలా సేకరించిన నర్సరీ, ఉద్యానవన స్థలాలను కొత్త నిర్మాణాలకు వాడబోతున్నారు. జూబ్లీహాలు భవనానికి కూడా వారసత్వ హోదా ఉండటంతో దానిని తొలగించే వీలులేదు. దీంతో ఆ భవనాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ పార్కింగ్ యార్డును రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సాధారణ పార్కింగ్ స్థలం వాహనాలకు సరిపోని పక్షంలో ప్రత్యేకంగా పార్కింగ్ టవర్ను నిర్మించే యోచనలో ఉన్నారు. మొత్తంమీద వాహనాలను ప్రధాన భవనం ఛాయల్లో పార్క్ చేయకుండా చేస్తారు. ఇక పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనాలు తొలగించి ఆ ప్రాంతాన్ని లాన్గా మార్చబోతున్నారు. ముందు వైపు, ఆ చుట్టు పక్కల ఎలాంటి ఇతర నిర్మాణాలు లేకుండా క్రమబద్ధం చేస్తారు. వాటికీ రీమోడలింగ్.. ఇక పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియంలు వినియోగంలో లేవు. వాటిని కూడా రీమోడలింగ్ చేయటం ద్వారా ఎలాంటి అవసరాలకు వినియోగించవచ్చనే విషయంలో ప్లాన్ చేస్తున్నారు. వీఐపీలకు, సందర్శకులకు వేర్వేరు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంట్లో ఉన్న సెంట్రల్ హాల్ మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి హాల్ నిర్మాణం, అక్కడ శాసన సభ్యులు కలసి కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు, సమావేశాల నిర్వహణకు వినియోగించుకునేలా నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఆమోదించే ప్రణాళిక ప్రకారం త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నారు. -
పోటెత్తిన గోదావరి
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/నిర్మల్/రామగుండం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి నది పోటెత్తింది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,738 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 97.29 టీఎంసీలకు చేరింది. రెండు మూడు రోజుల్లో జైక్వాడ్ నిండితే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరగనుంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు వరద రాష్ట్రంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21.34 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,634 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు అయినప్పటికీ డ్యామ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో నిల్వను 21 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 31,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.22 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 54.63 టీఎంసీలకు పెరిగాయి. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 1.33 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ, 2.04 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ (41) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఐదు గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కడెం నుంచి వస్తున్న వరద తోడుకావడంతో దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 18.23 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 20 గేట్లను ఎత్తి 53,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. నంది పంప్హౌస్ ద్వారా మరో 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 11,000 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లోకి నీటి పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దిగువ గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన వరద ఇంకా చేరకపోవడంతో దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్కి 6,142, అన్నారం బరాజ్కి 7,825 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్కు దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది వచ్చి కలవడంతో మేడిగడ్డ బరాజ్కి 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దాన్ని మొత్తం కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్లోకి 4.60 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 3.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండడంతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గుండా ప్రవహించి ధవళేశ్వరం బరాజ్ మీదుగా సముద్రంలోకి వరద చేరుతోంది. వాగులు వంకలు ఏకంరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద పొంగిపొర్లుతోంది. దీంతో ఏటి అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని గుంజేడువాగు, గాదెవాగు, రాళ్లతెట్టెవాగు, ముస్మివాగు, మొండ్రాయిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం మండలం ఇల్లెందు– మహబూబాబాద్ రహదారి పైనుంచి జిన్నెలవర్రె వాగు పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్ గ్రామాల్లోని వరి పొలాలు నీట మునిగాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా, శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం, భీంఘనపురం రిజర్వాయర్లలోకి 18 అడుగుల మేర నీరు చేరింది. మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించింది. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల చలివాగుకు వరద పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, పాలేరు, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వైరా, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల కాలనీలను వరద ముంచెత్తగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేటికి వరద నెమ్మదిగా పెరుగుతుండడంతో నీటిమట్టం శనివారం రాత్రి 15 అడుగులకు చేరింది. దీంతో మున్నేటికి ఇరువైపులా పరిస్థితులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్నగర్ పట్టణాల్లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్ తరుణం వాగులో రెండు లారీలు వరదలో చిక్కుకుపోగా, డ్రైవర్లను పోలీసులు రక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, భాగ్యనగర్, కృష్ణానగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజార్హత్నూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి తదితర మండలాల్లో పత్తి, సోయా, వరి పంటలు దెబ్బ తిన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముట్నూరు వద్ద ఆదిలాబాద్–మంచిర్యాల రహదారి తెగిపోయింది. సిరికొండలోని చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాత్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. బోధన్ డివిజన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జలాల్పూర్–బడాపహాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగులు పోస్తూ మంజీరలోకి ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు, గణపురం ఆనకట్టల ద్వారా కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.