Hyderabad
-
పాతబస్తీలో అంతులేని విషాదం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు..ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక..ఎటు వెళ్లాలో అర్థంకాక..అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు. ఆదివారం తెల్లవారు జామున పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి..‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు. రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది! సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్సుఖ్నగర్లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్బాగ్లోని మొఘల్ కోర్ట్లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది. మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చారి్మనార్తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. నిబంధనలు... వాస్తవాలు... నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగి్నమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు. అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు. ఏదైనా అగి్నప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగి్నమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్లోనే ఉంది. వీటికి తోడు అగి్నమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.పేరులోనే ఫైర్! సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగి్నమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం. పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిòÙ్మంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది. శిక్షలు తక్కువే.. ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.ఏళ్లుగా నిరీక్షణ.. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగి్నమాపక శాఖ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగి్నమాపక శాఖ 2020 జూన్లో అగి్నమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం పురానాపూల్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్హౌస్కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్నగర్లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్ను తీసుకుని రజని గుల్జార్ హౌస్కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్నగర్కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్నగర్లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు. -
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్గంజ్లోని శాంతి ఫైర్ వర్క్స్లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్గంజ్లోని శాంతి ఫైర్ వర్క్స్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్మన్తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్ఘాట్లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. -
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సాక్షి, హైదరాబాద్/చార్మీనార్/దూద్బౌలి: అది హైదరాబాద్ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. అంతా బంధువులే... రాజస్తాన్కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ, దేవనాథ్ మోడీ, సునీల్ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్ హౌస్లోని చార్మీనార్ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్ మోడీ అత్తాపూర్, దేవనాథ్ మోడీ హిమాయత్ నగర్లో ఉంటున్నారు.గుల్జార్ హౌస్లోని దుకాణాల (జీ ప్లస్ వన్) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్లో ఉండే సునీల్ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్ హౌస్లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు. మీటర్ వద్ద మొదలైన మంటలు ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్పుర నుంచి మొదటి ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు. భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్ కేస్) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్ (చెక్క) పార్టీషన్తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. అపస్మారక స్థితిలో..సెల్ఫోన్ లైట్ వెలుగుతూ.. సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ లైట్ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్ పైకి వెళ్లే స్టెయిర్ కేస్కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రహ్లాద్ కుటుంబం అంతా మృత్యువాత ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్ మోడీ మరో సోదరుడైన బంకట్ మోడీ టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్ మోడీతో పాటు రాజేందర్ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. కిషన్రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్ జుల్పికర్ అలీ, అహ్మద్ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖపై కిషన్రెడ్డి ఫైర్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్ వచి్చందని, మొఘల్పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్ కేస్ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మృతులు వీరే: ప్రహ్లాద్ మోడీ (70), మున్ని (70), రాజేందర్ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాంచ్ (4), ఇరాజ్ (2), అరుషి (3), రిషబ్ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఇద్దూ (4). మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్హౌస్ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది. – మీర్ జాహెద్, గుల్జార్ హౌస్ వద్ద గాజుల వ్యాపారి -
గుల్జార్హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు.ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్ గుల్జార్హౌస్లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది. -
తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మందు బాబులకు బిగ్షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్పై రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్బాటిల్పై రూ.40 పెంచింది.కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది. -
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు? -
పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025చార్మినార్ గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.15గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారంమరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు. -
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్ (67)అభిషేక్ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్ (17)శీతల్ జైన్ (37)ఇరాజ్ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్అన్య మోదీపంకజ్ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్ప్రథమ్ అగర్వాల్ప్రాంశు అగర్వాల్. -
తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కారణంగా నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్ భగ్నమైంది. ఈ క్రమంలో ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్(28) ఇద్దరూ కలిసి.. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో పేలుళ్లకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పోలీసులు.. ఒక ఇంటిలో తనిఖీలు నిర్వహించగా పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు. -
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్లో షార్ట్ సర్క్యూట్స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్ఫ్లోర్లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్ఫ్లోర్కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది. -
పాక్, తుర్కియేపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తుర్కియే దేశానికి విజ్ఞప్తి చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాక్ కంటే భారత్లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్లోనూ గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవొద్దని వ్యాఖ్యానించారు.తుర్కియే, భారత్ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తుర్కియే అభివృద్ధికి భారత్ తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు. పాక్ వైపు మొగ్గుచూపుతున్న తుర్కియే తమ విధానాన్ని పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపైనా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ‘నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిని పాకిస్తానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నాలాంటి వారు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే వారికి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది’ అని అన్నారు.మానవాళికి ముప్పు పాక్..పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఒవైసీ కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్తానీ మిలిటరీ భారత్లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్నీ ఆయన విమర్శించారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ, చైర్పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు. -
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. -
కోటి మంది స్త్రీలను కోటీశ్వరుల్ని చేస్తాం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ఆడబిడ్డల సొంతమని, రూపాయి కూడా ఎగవేయకుండా వడ్డీతో సహా అప్పులు చెల్లిస్తున్నారని కితాబునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రాష్ట్రంలో స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల్లో సభ్యుల సంఖ్య కోటికి పెరగాల్సిన అవసరముందని, పట్టణ ప్రాంత మహిళలను వాటిలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘వి హబ్’(విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ హబ్) చేపట్టిన ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’, ‘గ్రాస్రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను శనివారం రేవంత్రెడ్డి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ‘ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానం. ఇప్పటికే వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను మహిళలకు అప్పగించాం. సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వేయి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అప్పగించేందుకు సిద్దంగా ఉన్నాం’అని సీఎం ప్రకటించారు.‘మహిళా శక్తిని కాంగ్రెస్ ఎన్నడూ తక్కువగా అంచనా వేయలేదు. మహిళా శక్తికి చేయూత ఇచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలి్పంచాం, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం, విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టడం, పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ తదితరాల వ్యాపారాలు అప్పగించాం. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సాహిస్తూ, శిల్పారామంలో ఎస్హెచ్జీల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ను కేటాయించాం’అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ ‘వి హబ్ గత ఏడేళ్లుగా మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వి హబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మిషన్ మహిళా శక్తి –2025’విధానానికి అనుగుణంగా ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’ను వి హబ్ తెచి్చంది. దీనిద్వారా మహిళలు ఉద్యోగ కల్పన, సంపద సృష్టి, కొత్త తరం పారిశ్రామికవేత్తలకు ప్రేరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వి హబ్ ద్వారా త్వరలో జిల్లాల్లో ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘స్కిల్ డెవలప్మెంట్, మినీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లు ఏర్పాటవుతాయి.పెద్దపల్లి, పరకాల, నల్లగొండ, వికారాబాద్లో త్వరలో ఈ సెంటర్లు ప్రారంభమవుతాయి. వీటిలో మహిళలకు స్థానికంగా నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి సదుపాయాలు, మార్కెట్తో అనుసంధానం వంటి అనేక వసతులు సమకూరుతాయి’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ శర్మ, వి హబ్ సీఈఓ సీత పల్లచొల్లా, అసోసియేట్ డైరక్టర్ ఊహ సజ్జా తదితరులు పాల్గొన్నారు. 17 అవగాహన ఒప్పందాలు విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం సందర్భంగా వి హబ్ 17 కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (హైదరాబాద్), ట్రిపుల్ ఐటీ బాసర, గీతమ్ యూనివర్సిటీ, గోదావరి, పెద్దపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, తారా డిగ్రీ కాలేజీ (సంగారెడ్డి), మథర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రి హబ్, హెచ్పీ ఇండియా సేల్స్, హైసియా, ఐకోనియా, టీఆర్డీ స్డూడియోస్, 1ఎం1ఎంబీ, నిర్మాణ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల జాబితాలో ఉన్నాయి. ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్’కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, వరల్డ్ బ్యాంక్ సహకారంతో నడుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని 140 మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలు వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ‘గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ద్వారా గ్రామీణ యువతలో సృజనాత్మకత, సార్టప్ దృక్పథాన్ని పెంపొందిస్తారు. 6 వేలమందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
కొలువుదీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే, ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ.. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమై న అంశాలు పెండింగ్లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్–1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైనా నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. తుది తీర్పు తర్వాతే ముందుకు... గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్–1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించటంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపేసింది. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్–2, ఆ తర్వాత గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది.ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్–1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుంది. తుది తీర్పు వచి్చన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికారవర్గాలు అంటున్నాయి. కోర్టు కేసులతో.. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది.అయితే, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కిందిస్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావిస్తోంది. ⇒ గతేడాది డిసెంబర్లో గ్రూప్–4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్లంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువస్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ⇒ ఈ నేపథ్యంలో గ్రూప్–1 తుది జాబితాను వేగంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ⇒ గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి లేదు. -
Hyd: భారత సైన్యానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం(మే 17వతేదీ) సాయంత్రం సమయంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తాయి.దీనిలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘వీరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జై జైలు కొట్టాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు, ఆర్థిక శక్తి భారతదేశం. గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఏ దేశం పై యుద్ధానికి కాలు తీయలేదు. మన దేశాన్ని కాపాడకోవడానికి ఎదురు దాడికి దిగాం. ప్రధాని నరేంద్ర మోదీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఇండియా ఉంది. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రరిజాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ సమస్య కాదు...కశ్మీర్ ఇండియాలో పార్ట్. పీవోకేపై మాత్రమే ఇప్పుడు చర్చ. మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా జోక్యం అవసరం లేదు. మన సమస్యను మనం పరిష్కరించుకోగలం’ అని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రి శ్రీధర్బాబుపై నమోదైన కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భూ సేకరణ అంశంలో మంత్రి శ్రీధర్బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది.శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ వాదించారు. వాదనలకు ఏకీభవించి నాంపల్లి కోర్టు.. కేసు కొట్టివేసింది. -
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 13 మందిని నిందితులుగా తేల్చారు. ఈ ఘటనకు కారణమైన 13 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.క్యూనెట్కు చెందిన ఇద్దరితో పాటు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్కు చెందిన వ్యక్తులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంపు చేసి పెట్టడం వల్లే ఆరుగురు ప్రాణాలు రక్షించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. వేస్ట్ మెటీరియల్ లేకుండా ఉంటే, ఆరుగురు ప్రాణాలు పోకుండా ఉండేవని పోలీసులు అన్నారు. -
వై-యాక్సిస్ యూఎస్ ఎంబసీతో ఎంఓయూ
సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలో చదువుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులకు సహకారం అందించ డానికి వై–యాక్సిస్ ఫౌండేషన్ యూఎస్ రాయబార కార్యాలయంతో అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా విద్యార్థులకు విశ్వసనీయమైన, నిస్పాక్షికమైన మార్గదర్శకత్వాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్ యూఎస్ఏ ప్రోవైడర్గా ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్తో యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబంధించిన ఎంఓయును కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలకు సేవలు అందించే ఏకైక ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రంగా హైదరాబాద్లో వై–యాక్సిస్ ఫౌండేషన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన సమాచారం కోసం ఎడ్యుకేషన్ యూఎస్ఏ వన్–స్టాప్ సెంటర్ వై–యాక్సిస్ ఫౌండేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై–యాక్సిస్ ఫౌండేషన్ డైరెక్టర్ సబీనా జేవియర్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: After Fifty యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు! -
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్లో వైరల్గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్షిప్ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసులు నెంబర్ వన్.. సీఎం ప్రశంస
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సీవీ ఆనంద్కు, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి ట్విట్టర్ వేదికగా.. వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష.మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది.ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్ కు, ఆయన బృందానికినా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం… నేను కంటున్న కలలను సాకారం చేయడానికి…కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు… నేను మద్దతుగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.వివిధ రంగాల్లో… ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో… 138 దేశాలతో పోటీ పడి…ఈ రోజు తెలంగాణ పోలీస్… ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన… హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ… pic.twitter.com/CLKSzX75jc— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025 -
చలించిన కేబీఆర్ పార్కు వాకర్లు... ప్రతి వారం అన్నదానం
హైదరాబాద్ : క్యాన్సర్ ఆస్పత్రికి నిత్యం వచ్చే క్యాన్సర్ బాధితులతో పాటు వారి సహాయకులను చూసి చలించిపోయిన కేబీఆర్ పార్కు వాకర్లు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి వారం అన్నదానం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శుక్రవారం కేబీఆర్ పార్కు వాకర్లు, స్నేహ హస్తం ఫౌండేషన్ ప్రతినిధులు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము నిత్యం కేబీఆర్ పార్కుకు వాకింగ్కు వస్తుంటామని ఫుట్పాత్లపై క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చే పేషంట్లతో పాటు వారి సహాయకులు ఆకలి అలమటిస్తున్న తీరును చూసి చలించిపోయి స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదానం చేస్తున్నట్లు వారు తెలిపారు. 300 మందికి అన్నదానం చేస్తున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహ్మద్ కతల్ హుస్సేన్, భరత్ భూషణ్, రామ్కుమార్, కిషోర్ కుమార్, జబ్బార్, ఫయాజ్, షౌకత్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల ఆగడాలకు చెక్!
3.5 ఎకరాల సర్కారు స్థలంపై కబ్జాదారుల కన్ను బంజారాహిల్స్: మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు చేయని కుయుక్తులు లేవు. పట్టు వదలని విక్రమార్కుల్లా భూమిపై పట్టు నిలుపుకోవాలని అటు పోలీసుల్ని, ఇటు రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎంతో విలువైన మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. కబ్జాదారు పార్థసారథి, ఆయన కొడుకు విజయ భార్గవన్ ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఇక్కడి చెట్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం 12 సీసీ కెమెరాలను రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం–10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఎదురుగా తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ను ఆనుకొని సర్వే నెం. 403/పిలో ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత మంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేసేందుకు ఎనిమిదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పాటు రౌడీలను సైతం దింపి ఈ స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ స్థలాన్ని కబ్జా చేసిన పార్థసారథి, ఆయన కొడుకు విజయ్ భార్గవ్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంలో షేక్పేట రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదయ్యాయి. మూడుసార్లు ఈ స్థలంలోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలు కూల్చివేసి అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. అయినాసరే కబ్జాదారులు ఈ స్థలంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాన్ని తమ అధీనంలోకి తీసుకొని లోపల ఒక గదిని నిర్మించి రౌడీలను పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న షేక్పేట మండల రెవెన్యూ అధికారులు.. కబ్జా జరిగిన స్థలం లోపల ఉన్న అయిదుగురు రౌడీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. చెట్లపై సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వీటిని తొలగించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు: షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డిఅధికారుల కళ్లుగప్పి.. ఠాణాలో క్రిమినల్ కేసులు నమోదైనా.. రౌడీలను తరి మేసినా.. అక్రమ నిర్మాణా లు కూల్చివేసినా.. సదరు కబ్జాదారులు మాత్రం ఈ స్థలంలో తిష్ట వేశారు. ఎలా గైనా భూమిని కబ్జా చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కబ్జాదారుల ఆగడాలకు షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి చెక్ పెట్టినా.. అధికారుల కళ్లు గప్పి సెలవురోజుల్లో కబ్జాదారులు స్థలంలోకి చొచ్చుకొస్తున్నారు. అయిదెకరాల ఈ ప్రభుత్వ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని.. ఇందులో ఎకరన్నర స్థలం తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ కోసం కేటా యించినట్లు.. మిగతా మూడున్నర ఎకరాల భూమి పక్కాగా ప్రభుత్వానిదేనని తహసీల్దార్ అనితారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని.. అందుకోసమే లోపల హెచ్చరిక బోర్డులతో పాటు బ్లూషీట్లపై ఇది ప్రభుత్వ భూమి అని రాసినట్లు ఆమె తెలిపారు. కబ్జాదారులు మరోసారి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
గొంతు.. చెవులు కోసి.. ఒంటికి నిప్పంటించి
మేడ్చల్: మేడ్చల్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి (50) మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లిలో అద్దె గదిలో నివాసం ఉంటూ కిష్టాపూర్లోని ఓ మద్యం దుకాణంలో రోజువారీ కూలీగా పని చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఉంటున్న గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చెవులు, గొంతు కోసి.. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ఒంటిపై దుస్తులు వేసి కాల్చివేసినట్టు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ... మహిళ హత్య కేసు ఛేదించడానికి లోకల్, ఎస్వోటీ పోలీసులతో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళ ఒంటి మీదున్న నగలు, డబ్బుల కోసం నమ్మించి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారా?, గతంలో తనతో సహజీవనం చేసిన వ్యక్తి ఈ పని చేశాడా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నామన్నారు. కాగా.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు మేడ్చల్ పరిధిలో మహిళ దారుణ హత్య సగభాగం వరకు కాలిన మృతదేహం -
సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు టెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద ప్రధాన మార్గాల్లోని రహదారుల నిర్వహణకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఐదేళ్ల క్రితం ఈ పనుల్ని పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చిన గడువు గత డిసెంబర్– జనవరిల్లోనే ముగిసిపోయింది. కానీ.. ఇప్పటివరకు మళ్లీ టెండర్లు పిలవలేదు. గతంలో మాదిరిగానే మళ్లీ పెద్ద ఏజెన్సీలకిచ్చే యోచనలో ఉన్న ఇంజినీరింగ్ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలతో స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయానికి పంపి వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో.. తాత్కాలికంగా కొంత కాలం వరకై నా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఈ పనులు చేసేందుకు తాజాగా టెండర్లు పిలుస్తున్నారు. వాస్తవానికి మే నెల ముగిసేలోగానే రీ కార్పెటింగ్, మరమ్మతులు తదితరమైనవి పూర్తి చేయాల్సి ఉండగా, స్పష్టత లేకపోవడంతో పనులు చేయలేదు. తాజాగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో.. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పెరిగే వర్షాలకు రోడ్లు దెబ్బతింటాయి. ఇప్పటికే వివిధ సంస్థల అవసరాల కోసం తవ్వకాలకు అనుమతులివ్వడంతో, అనుమతులున్న వాటితోపాటు లేని ప్రాంతాల్లోనూ అడ్డదిడ్డంగా రోడ్లను తవ్వి వదిలేశారు. వాటిని తిరిగి పూడ్చాల్సి ఉంది. వర్షాలకు గోతులు పడితే ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని గ్రహించి.. జూన్ వరకు పనుల కోసమంటూ తాజాగా సికింద్రాబాద్ జోన్లో టెండర్లు పిలిచారు. లేన్ మార్కింగ్లు, క్యాచ్పిట్స్ మరమ్మతులు, ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లకు రంగులతో సహా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు రూ.1.03 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. పెద్ద ఏజెన్సీలకిచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు తాత్కాలికంగా ఈ టెండర్లు పిలిచారు. మిగతా జోన్లలోనూ పిలవనున్నట్లు తెలుస్తోంది. లేన్మార్కింగ్లు, క్యాచ్ పిట్స్ పనులు సహా.. తాత్కాలికంగా జూన్ వరకు మాత్రమే.. ప్రభుత్వ నిర్ణయమేంటో? ఒక ప్రతిపాదన మేరకు గతంలో ఉన్న మార్గాల్లోనే అంతే దూరం పనులుండగా, మరో ప్రతిపాదనలో అదనంగా కొన్ని రోడ్లను చేర్చడంతో పాటు ఈసారి అదనంగా పూడికతీత పనులు కూడా చేర్చారు. గతంలో ఎప్పటికప్పుడు రోడ్ల రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత, స్వీపింగ్, గ్రీనరీ, ఫుట్పాత్లు, లేన్మార్కింగ్ల పనులుండేవి. పాత మార్గాల్లోని రోడ్లకే అయితే.. 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2,491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1,142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3,825 కోట్లు. గతం కంటే 398 కి.మీ. మేర పనులు, రూ.1,334 వ్యయం అదనం. వీటిలో ప్రభుత్వం దేనికి అనుమతిస్తుందో, లేక ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. -
మ్యాన్హోళ్లలో బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల తీరు మారడం లేదు. సీవరేజీ పైపులైన్లో వ్యర్థాలే కాదు.. కరగని ఘన పదార్థాలు, మురుగు ప్రవాహానికి అడ్డుపడే బ్లాంకెట్లు, బెడ్షీట్లను సైతం వదిలేస్తున్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో కట్టడికి 180 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మ్యాన్హోల్ టు మ్యాన్హోల్ డీ– సిల్టింగ్ చేసినా.. సీవరేజీ వ్యర్థాలపై అవగాహన కల్పించినా మార్పు రావడంలేదు. ఇటీవల మలక్పేట నల్లగొండ చౌరస్తా వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లో పై ఫిర్యాదుల వస్తుండంతో జలమండలి అధికారులు శుక్రవారం డీ– సిల్టింగ్ పనులు నిర్వహించారు. జెట్టింగ్ యంత్రాలను ఉపయోగించి మ్యాన్హోళ్ల నుంచి సిల్ట్ను బయటికి తీయగా.. అందులోంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలు బయటపడ్డాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలోని మ్యాన్హోళ్లు ఓవర్ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. ఇకనుంచి ఎవరైనా మ్యాన్హోళ్లలో చెత్త, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు. వాణిజ్య భవనాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి వాణిజ్య భవన సముదాయాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి అని జలమండలి సూచించింది. రెస్టారెంట్లు, హాస్టల్స్, హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, ఆఫీసులు తదితర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు.. తమ సీవరేజీ పైపులైన్ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్ వర్క్కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఘన, కరగని వ్యర్థ పదార్థాలు మురుగు ప్రవాహనికి అడ్డుపడుతున్నాయి. ప్రధానంగా సిల్ట్ చాంబర్లు లేకపోవడంతో సీవరేజీ పైపులైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవర్ ఫ్లో అవుతున్నాయి. మరోవైపు నివాస సముదాయాల నుంచి సీవరేజీ పైపులైన్లో బ్లాంకెట్లు, బెడ్షీట్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు, ఘన పదార్థాలు లాంటి వ్యర్థాలు వదలడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. నల్లగొండ చౌరస్తా వద్ద డీ– సిల్టింగ్లో వెలికితీత అవగాహన కల్పించినా.. మారని తీరు బయటపడుతున్న ఘన పదార్థాలు.. వ్యర్థాలు -
బర్షత్ ఖాన్ ‘బకాయి’ రూ.25 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా సాగిన లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసుపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అహ్మదాబాద్ యూనిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్మగ్లింగ్లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్ వ్యాపారి బర్షత్ ఖాన్ ఎగవేసిన కస్టమ్స్ సుంకం రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తక్షణం రూ.7 కోట్లు చెల్లించాలంటూ ఆదేశించగా... రూ.కోటి కట్టిన బర్షత్ మరో రూ.50 లక్షలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్ కోర్టులో గురువారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ను తిరస్కరించాలంటూ డీఆర్ఐ అధికారులు చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోపక్క ఈ లగ్జరీ కార్లను ఖరీదు చేసిన వారిలో ఇద్దరు హైదరాబాదీలను అహ్మదాబాద్ డీఆర్ఐ యూనిట్ గుర్తించింది. వీరి నుంచి వివరాలు సేకరించేందుకు శుక్రవారం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. విజయ్నగర్ కాలనీలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన బర్షత్ అహ్మద్ ఖాన్ గచ్చిబౌలిలోని డైమండ్ హిల్స్లో 2008 నుంచి ఎస్కే కార్ లాంజ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడి సోదరుడికి రెండు వర్క్షాప్స్ ఉండటంతో బర్షత్ సైతం ఈ రంగంలోకి వచ్చాడు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు బడా బిల్డర్లు, కాంట్రాక్టులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న బర్షత్ పదేళ్లలోనే గణనీయమైన స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం క్లైవ్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఏకే కార్ లాంజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఏకే కార్ లాంజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఇతడి కార్ లాంజ్ నుంచి ఖరీదైన లగ్జరీ కార్లను ఖరీదు చేసే వారిలోనూ వీళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బర్షత్ కస్టమర్లలో అత్యధికులు పన్ను ఎగ్గొట్టడానికి చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేసినట్లు డీఆర్ఐ అనుమానిస్తోంది. గడిచిన కొన్నేళ్లల్లో అమెరికా, జపాన్లోని హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నేవిగేటర్ తదితర కంపెనీలకు చెందిన 30 కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఈ వాహనాలను హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లో బడా వ్యాపారులు, రియల్టర్లకు విక్రయించారని అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు పది కార్లు హైదరాబాదీలకే అమ్మినట్లు డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించిన డీఆర్ఐ మిగిలిన వారి కోసం ఆరా తీస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లర్ లెక్కలు తేలుస్తున్న అహ్మదాబాద్ డీఆర్ఐ తక్షణం రూ.ఏడు కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు రూ.కోటి చెల్లించి బెయిల్కు దరఖాస్తు హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నగరానికి చెందిన ఇద్దరు కార్ల కొనుగోలుదారుల గుర్తింపు -
రోడ్డు ఆక్రమించి..షెడ్డు నిర్మించి..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్, షేక్పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.78 నవ నిర్మాణ్నగర్ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సర్వే నెం.403లో ఒక్కొక్కరికి 50 గజాల చొప్పున ఈ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. 1999 ప్రాంతంలో చంద్రబాబు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ స్థలంలోనే ఈ క్వార్టర్లు నిర్మించి ఇందులో ఆరుగురికి పట్టాలు కూడా ఇచ్చారు. మరో ఆరు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంట్లో దోభీ, తోటమాలి తదితరులు ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఉంటున్నారు. ప్లాట్ నెంబర్.1లో ఎలాంటి పట్టా లేకుండా సీహెచ్.మూర్తి అనే దోభీ కొంత కాలంగా అక్రమంగా నివసిస్తుండటమే కాకుండా..క్వార్టర్స్ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మించాడు. దీంతో స్థానికులు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై కొంత కాలంగా పట్టాలు ఉండి అధికారికంగా ఉంటున్న వారికి, పట్టాలు లేకుండా ఖాళీ ప్లాట్లలో ఉంటున్న వారికి మధ్య రోడ్డు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ సీవరేజి పైప్లైన్, మంచినీటి పైప్లైన్ మంజూరు కావడంతో పాటు జీహెచ్ఎంసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే దోభీ మూర్తి ఆక్రమించిన స్థలంలో షెడ్డు నిర్మాణం వీటికి అడ్డుగా ఉంది. సదరు షెడ్డును తొలగిస్తే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు షేక్పేట తహసీల్దార్కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అనితారెడ్డి క్వార్టర్లను పరిశీలించారు. వారి వద్ద ఉన్న పట్టాలు, ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఆరా తీశారు. రోడ్డు ఆక్రమించి షెడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని ఆమె హెచ్చరించారు. మరో వైపు పట్టాలు లేకుండానే కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వం నిర్మించిన ఈ క్వార్టర్లలో తిష్టవేసి వీటిని శాశ్వతంగా కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి అక్రమార్కులను ఖాళీ చేయించి క్వార్టర్స్ అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో సిబ్బందికి క్వార్టర్లు వాటిలో తిష్టవేసిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల పరిశీలన అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశం -
పవర్ఫుల్గా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యుత్కు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని, భవిష్యత్లో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం శుక్రవారం తన నివాసంలో ఇంధన శాఖపై డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ప్రజా రవాణా (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.9.8 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వినియోగం పెరగలేదని, అయినా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అది 18,138 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను⇒ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా అమల్లోకి తెచి్చన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని.. మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్లకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు ఇతర కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.హెచ్ఎండీఏతో సమన్వయం..ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్లకు విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో డిమాండ్కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా వీటిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పొడవునా సోలార్ విద్యుత్ లైటింగ్ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్పాత్లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
సారీ.. నో లారీ!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల కొనుగోలు రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్ఎంటీలధాన్యం వచ్చిందని, 51.39 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకు ఆలస్యం? కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? ⇒ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు ⇒ గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.అయితే మొత్తంగా సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా : 70.13 ఎల్ఎంటీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం : 51.39 ఎల్ఎంటీ ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు) : 34.02 ఎల్ఎంటీ సన్న రకం (2,25,215 రైతులు) : 17.37 ఎల్ఎంటీ కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.11,913.05 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం : రూ.8,511.42 కోట్లు సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ : రూ.868.61 కోట్లు వర్షం వస్తే ఎట్లా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసినా.. లారీలు లేక..మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి. 20 రోజులైనా కాంటా కాలేదు.. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. – కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్పీరియం ఎకో పార్క్తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్పీరియం.. హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్క్ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్పీరియం ఎకో పార్క్లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్పీరియం, సృజనాత్మక డిజైన్తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు. -
28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్(బహిరంగ విచారణ) నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 60.78 శాతం పూర్తయ్యాయి.రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే.. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్కు దిశానిర్దేశం చేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. బ్యాక్ వాటర్ ప్రభావంపై నాలుగు రాష్ట్రాల సీఎస్లతో చర్చించి.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు. -
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించి చూపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంటే, ఆ పనిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు మాత్రం కీచులాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి చివరకు ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా మారింది. ఈ పోటీల నిర్వహణలో ప్రధాన భూమిక పర్యాటక శాఖదే. అందులో అంతర్భాగమైన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ఈడీ స్థాయి అధికారిని పోటీలు కొనసాగుతుండగానే మాతృ సంస్థకు పంపటం వెనుక అధికారుల మధ్య వివాదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. స్పాన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్.. పోటీల నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం–మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా చెరిసగం భరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్వహణ ఖర్చుల అంచనా రూ.57 కోట్లని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.25 కోట్లను మించి స్పాన్సర్షిప్ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయని సమాచారం. పోటీలు ప్రారంభం కాకముందే స్పాన్సర్గా ఉండేందుకు ఓ పెద్ద బ్యాంకు ముందుకొచి్చ, ప్రభుత్వం ఆశించిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఒక్క బ్యాంకుకే మొత్తం స్పాన్సర్షిప్ ఇవ్వలేమని, మరికొన్ని సంస్థలతో కలిపి ఇస్తామని ఓ ఉన్నతాధికారి ఆ బ్యాంకు ప్రతినిధులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత కొన్ని సంస్థలు ముందుకొచి్చనా.. వాటితో ఓ ఉన్నతాధికారి సరిగా వ్యవహరించకపోవటంతో అవి కూడా వెనుదిరిగాయని చెబుతున్నారు. సదరు సంస్థలతో అధికారులు సరిగా డీల్ చేసి ఉంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన మొత్తానికి మించి ఆదాయం సమకూరి ఉండేదని అంటున్నారు. మరోవైపు ఒకరిద్దరు అధికారులు ఈ స్పాన్సర్షిప్ వ్యవహారాన్ని సొంత లబి్ధకి వాడే ప్రయత్నం చేశారని, దానిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వెరసి కీలక స్పాన్సర్షిప్స్ వ్యవహారంలో యంత్రాంగం వైఫల్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల మధ్య కీచులాటలు.. ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లను ప్రారంభంలో అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్కు అప్పగించింది. ఆ సమయంలో సీఎంతో జరిగిన ఓ సమావేశంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైనట్లు తెలిసింది. ఈ పోటీల్లోని కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అనుమతించాలని ఆ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్రెడ్డి ప్రతిపాదించారు. అప్పుడే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయేశ్రంజన్కు దీనిపై సమాచారం లేదు.చివరకు కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇంతటి కీలక నిర్ణయం తనకు తెలియకుండా తీసుకోవటమేంటని ప్రకాశ్రెడ్డిని జయేశ్రంజన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటన ఆ ఇద్దరు అధికారుల మధ్య కొంత అగాధానికి కారణమైందని పర్యాటక శాఖలో ప్రచారం జరుగుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్రెడ్డి, ఈడీ విజయ్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే విజయ్ని ఉన్నఫలంగా మాతృసంస్థకు పంపారని అంటున్నారు. కాళ్లు కడిగించారనే అపవాదు.. ఇటీవల వరంగల్లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆలయాల్లోకి వెళ్లేముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘట్టం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అక్కడ సాధారణ భక్తులు కాళ్లు కడుక్కున్నట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటే సరిపోయేది. కానీ, పోటీదారులను కుర్చిల్లో కూర్చోబెట్టి కాళ్ల కింద కొత్త పళ్లాలు ఉంచి, చెంబులతో నీళ్లు పోసి సిబ్బందితో కాళ్లు కడిగించారు. కొందరు సిబ్బంది టవల్తో కాళ్లను తుడిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసలు ఇలా పళ్లాల్లో కాళ్లుంచి కడిగించే ఆలోచన ఎవరు చేశారంటూ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
తిరంగా ర్యాలీ.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా రేపు హైదరాబాద్లో తిరంగా ర్యాలీని నిర్వహించనున్నారు..రేపు(శనివారం, మే 17వ తేదీ) హైదరాబాద్ లో తిరంగా ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి, శనివారం సాయంత్రం గం. 5.30ని.ల నుంచి రాత్రి గం. 7.30 ని.ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. -
‘హరీష్ పై కేటీఆర్కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్గా హరీష్ రావు పైన కేటీఆర్కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్గంజ్లోని సౌత్వెస్ట్ జోన్ మహిళా పోలీస్స్టేషన్కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్స్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
‘హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అత్యధికంగా 17, 162 మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు.2025- 26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారబోతోంది.హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు..హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
హరీష్రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
కాళేశ్వరం కమిషన్ నిర్ణయం.. వారిని బహిరంగ విచారణకు పిలవొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్రావు, ఈటల రాజేందర్కు ఊరట లభించినట్లైంది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వారిని విచారణకు పిలవకూడదని నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 4వందల పేజీల రిపోర్ట్ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనుంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ గడువును ఈ నెల 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. -
వేదవల్లి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు ఆ తల్లి దండ్రులు చివరి క్షణంవరకు పోరాడారు. ఆస్తు లన్నీ అమ్మి, అప్పులు చేసి కూడా రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా, పాప ప్రాణాలు దక్కలేదు. మరోవైపు స్తోమతకు మించి వైద్యా నికి ఖర్చు చేయటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి గతంలో పాప వైద్యానికి రూ.8 లక్షలు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడు ఆ పాప కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో రూ.7 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన రఘు, మంజుల దంపతుల పెద్ద కుమార్తె వేదవల్లి (5)కి 2022లో బ్లడ్ క్యాన్సర్ సోకింది. పాపను రక్షించుకునేందుకు రెండేళ్లపాటు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. 2024లో సీఎం ఎ.రేవంత్రెడ్డి దృష్టికి ఈ విషయం రావటంతో చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు మంజూరు చేశారు. చికిత్స అందించినప్పటికీ గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఆ మేరకు రూ.7 లక్షల చెక్కు ను సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గురువా రం వేదవల్లి తండ్రి రఘుకు అందజేశారు. -
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్నగర్ అహ్మద్నగర్కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్లోని ఓ కేఫ్కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉస్మాన్సాగర్కు తప్పిన మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాలకు తాగునీరు అందించే ఉస్మాన్సాగర్కు (గండిపేట చెరువు) మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చే మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. వరద సమయంలో ఆ నీరు గండిపేటకు చేరేలా ఉండే రెండు గేట్లు శిథిలం కావడం, దీనిపై మీడియాలో వచ్చిన కథనాలతో హైడ్రా ఈ చర్య తీసుకుంది. శిథిలమైన గేట్లను పరిశీలించడానికి గతంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అక్కడ పరిస్థితులు చూసిన ఆయన తక్షణం మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. దీంతో శిథిలమైన రెండు గేట్ల స్థానంలో కొత్తవి అమర్చారు. బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ నాలా ఒకప్పుడు కేవలం వరద కాలువగా ఉండేది. శంకర్పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్సాగర్ వరకు వర్షపు నీటిని తీసుకెళ్లిన చరిత్ర ఈ నాలాకు ఉంది. ప్రస్తుతం నాలాకు ఎగువన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు, రిసార్టుల నుంచి బయటకు వస్తున్న మురుగు నీరు దీని ద్వారానే ప్రవహిస్తోంది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే ప్రయోజనాలుంటాయని, హుస్సేన్సాగర్కు వర్షపు నీటిని తీసుకువెళ్లే ఏకై క నాలా ఇదేనని స్థానికులు చెబుతున్నారు. దీంతో నాలా పునరుద్ధరణపైనా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. బుల్కాపూర్ నాలాకు ‘హైడ్రా‘ గేట్లు దీని పునరుద్ధరణపై అధికారుల దృష్టి -
అఫ్జల్గంజ్లో అగ్నికీలలు
మూడంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు ● పసిపాప సహా ఏడుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది ● షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు అఫ్జల్గంజ్: అఫ్జల్గంజ్లోని మహారాజ్గంజ్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల నివాస భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని ఏడాది చిన్నారి సహా మరో ఏడుగురిని నిచ్చెన ద్వారా కిటికీల నుంచి బయటికి తీసుకువచ్చి రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన మహారాజ్గంజ్లోని మూడంతస్తుల భవనంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనంలో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో అప్పటికే ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన కిశోర్ లాల్వాని, రాజు లాల్వాని, లక్ష్మీ లాల్వాని, జ్యోతిరామ్, ప్రియ, యాష్, సమర్థ్లతో పాటు ఏడాది వయసున్న చిన్నారిని ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొదటి అంతస్తు నుంచి రెండు మూడు అంతస్తులకు వేగంగా మంటలు వ్యాపించడంతో మొదట నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సాయంత్రం వరకూ శ్రమించారు. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లు వాడినట్లు అంచనా. కాగా.. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాంను నిర్వహిస్తుండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు పలువురు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. ఆస్తినష్టం ఎంత వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ప్రమాద ఘటనపై ఎంపీ అనిల్కుమార్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు పరిశీలించారు. -
హైడ్రా టైం టేబుల్ సిద్ధం!
సోమవారం నుంచి శనివారం వరకు పని ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఓ టైమ్ టేబుల్ సిద్ధమైంది. వారంలో ఏ రోజు ఏ పని చేయాలి? అనేది కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, హైడ్రా సంస్థాగత నిర్మాణం, క్షేత్ర స్థాయి పరిశీలన.. ఇలా ప్రతి అంశానికీ సమప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వారం నుంనే ఈ విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. మరోపక్క హైడ్రా కోసం ఇటీవల కొనుగోలు చేసిన 122 వాహనాలను అధికారులు, సిబ్బందికి అందజేశారు. సోమవారం ప్రజావాణితో మొదలై.. రాణిగంజ్లోని బుద్ధభవన్లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఆరోజు ఔటర్ రింగ్రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు వస్తున్నారు. ప్రతి వారం కనీసం 50 నుంచి 60 మంది వస్తుండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పడుతోంది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ సహా వివిధ అంశాల గుర్తింపునకు హైడ్రా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో పాటు ప్రముఖ సంస్థల సహకారం తీసుకుంటోంది. ఆయా ఏజెన్సీల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ అంశాల పురోగతిని పర్యవేక్షించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్ర తి మంగళవారం రివ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. కీలక ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన.. ప్రజావాణితో పాటు ఇతర విధానాల్లో హైడ్రాకు అందిన ఫిర్యాదులను అధికారులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. దీనికోసం రెవెన్యూ, న్యాయశాఖ సహా వివిధ విభాగాల నుంచి అధికారులు డిప్యుటేషన్పై హైడ్రాలో పని చేస్తున్నారు. సున్నితమైన, కీలకాంశాలను స్వయంగా హైడ్రా కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ప్రతి బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోహెడ నుంచి పర్యటన మొదలు పెట్టిన రంగనాథ్ రాత్రి 7.30 గంటలకు మేడ్చల్ జిల్లా బౌరంపేటతో ముగించారు. గురువారం హైడ్రా పరిపాలన పరమైన అంశాలపై దృష్టి పెడుతున్న కమిషనర్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పురోగతి, తీసుకున్న/తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం హైడ్రా ఆధ్వర్యంలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. వీటిని నిపుణులతో పాటు మాజీ, ప్రస్తుత అధికారులను ఆహ్వానిస్తున్నారు. ఈ శనివారం నగరంలోని నాలాలపై చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో పని చేసేలా కమిషనర్ ఆదేశాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏవీ రంగనాథ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి వాహనాల కేటాయింపు ద్విచక్ర వాహనంతో పాటు హెల్మెట్ సైతం.. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బలగాలతో పాటు హైడ్రాలో పని చేసే అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది కోసం హైడ్రా 122 వాహనాలు ఖరీదు చేసింది. వీటిలో 21 ట్రక్కుల్ని కేవలం ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఉపకరణాలను వాహనంలో అందుబాటులో ఉంచారు. ఉన్నతాధికారులు, అధికారుల కోసం నాలుగు ఇన్నోవా క్రిస్టాలు, 55 స్కార్పియోలు ఖరీదు చేశారు. డీఆర్ఎఫ్తో పాటు అసెట్ ప్రొటెక్షన్ విభాగానికి చెందిన సిబ్బంది తరలింపు కోసం ఐదు మినీ బస్సుల్ని ఖరీదు చేశారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి 37 ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈ వాహనాలను అధికారులు, సిబ్బందికి కేటాయింపు పూర్తి చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనంతో పాటు కచ్చితంగా హెల్మెట్ కూడా పంపిణీ చేశారు. వాహనం నడిపే సమయంలో కచ్చితంగా దాన్ని ధరించాలని స్పష్టం చేస్తున్నారు. -
మరోసారి మహా రియల్!
సాక్షి సిటీబ్యూరో: కొత్త లేఅవుట్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఔటర్రింగ్రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలోనే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సొంత స్థలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతుల నుంచి కూడా భూములను సేకరించి భారీ లే అవుట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనడంతో కొత్త లే అవుట్ల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేశారు. ప్రస్తుతం కొంతవరకు సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అధికారులు కొత్త లేఅవుట్ల అభివృద్ఙిపై దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా భూములను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు ముందుకు రావడంతో లే అవుట్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. గతంలో కోకాపేట్, బుద్వేల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో అనూహ్యమైన స్పందన రావడంతో.. మరోసారి అదే స్థాయిలో స్పందన లభించకపోయినప్పటికీ హెచ్ఎండీఏ స్వయంగా వెంచర్లను అభివృద్ధి చేసి విక్రయిస్తే రియల్ రంగంలో కొంత మార్పు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సుమారు 500 ఎకరాల్లో.. నగర శివార్లలోని కుర్మల్గూడ, ప్రతాపసింగారం, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్నర్వ, కొర్రెముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాల భూములలో రోడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు. మిగతా చోట్ల కుర్మల్గూడలో 92 ఎకరాలు, బోగారంలో 125, ప్రతాపసింగారంలో సుమారు 151, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు గుర్తింంచారు. తిమ్మాపూర్లో 156 ఎకరాలు, కుత్బుల్లాపూర్లో 130, కొర్రెములలో 138 ఎకరాలు చొప్పున సేకరించనున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూములు అందుబాటులో ఉన్నట్లు అంచనా. రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. మొదట కనీసం 500 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. గతంలో హెచ్ఎండీఏ వెంచర్లలో ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోవడంతోనే రైతులు తమ భూములను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు ఆసక్తితో ఉన్నట్లు అధికారులు చెప్పారు. కొనుగోలుదారులు సైతం హెచ్ఎండీఏపై నమ్మకంతో ముందుకు వస్తున్నారు. ప్రతాపసింగారంలో పనులు.. సుమారు 150 మంది రైతుల నుంచి ప్రతాపసింగారంలో ఇప్పటికే 133 ఎకరాల భూమి సేకరించారు. మరిన్ని భూముల సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నవాటితో పాటు కొత్తగా సేకరించనున్న వాటితో కలిపి సుమారు రూ.120 కోట్లతో భారీ వెంచర్ను అభివృద్ధి చేయనున్నారు. రైతులకు ఎకరాకు 1,741 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభించనుంది. మూడేళ్ల క్రితమే ఈ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం, మార్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున, ఔటర్రింగ్రోడ్డుకు చేరువలో ఉండడంతో ప్రతాపసింగారం లే అవుట్కు అనూహ్యమైన స్పందన లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నయా వెంచర్ల ఏర్పాటులో హెచ్ఎండీఏ ఔటర్ సమీప గ్రామాల్లో లే అవుట్లకు సన్నాహాలు కుత్బుల్లాపూర్, కొర్రెముల, కుర్మల్గూడ, ప్రతాపసింగారంలలో.. -
దక్షిణాసియాలోనే తొలి నగరంగా రికార్డు..
మూసీ నది దక్షిణ ఒడ్డున సరికొత్త ఆధునిక ఎస్బీఆర్ సాంకేతికతతో నిర్మించిన నాగోలు ఎస్టీపీ దేశంలోనే అతి పెద్దది. ఇప్పటి వరకు ఎస్టీపీలకు యూఏఎస్బీ, ఎంబీబీఆర్, ఈఏబీఎన్ఆర్ టెక్నాల జీ వినియోగించగా.. సరికొత్త ఎస్బీఆర్ టెక్నాలజీతో సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 320 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఎస్టీపీని 15 ఎకరాల్లో నిర్మించారు. ఇటీవల వాటర్ డైజెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ యునెస్కో భాగస్వామ్యంతో 2024 –2025 సంవత్సరానికి గాను ప్రభుత్వ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీగా నాగోలు ఎంపిక చేసి జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు ప్రదానం చేసింది. పర్యావరణ అనుకూలత, సమర్థ మురుగు నీటి శుద్ధి, నీటి పునర్వినియోగం, ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తున్నందుకు ఉత్తమ ఎస్టీపీగా ఎంపిక చేసింది. మురుగు నీటి పరిస్థితి ఇలా.. ● హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజువారీగా 1,950 మిలియన్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. జలమండలి ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 322 ఎమ్మెల్డీ సామర్థ్యం గ ల ఐదు ఎస్టీపీలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ దశలో ఉండగా.. సుమారు 113.5 ఎమ్మెల్డీ సామర్థ్యంగల మూడు ఎస్టీపీల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే దాదాపు 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయవచ్చు. మిగిలిన 72 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయాల్సి అవసరం ఉంటుంది. ● గత ప్రభుత్వం వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంతో సుమారు రూ.3,866.21 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధం కాగా.. స్థలాల సేకరణ, ఇతరత్రా కారణాలతో వాటి సంఖ్యను ఇరవై ఎస్టీపీలకు కుదించినా సామర్థ్యం తగ్గకుండా పనులు పూర్తి చేసింది. అందులో ఇప్పటికే 12 ఎస్టీపీలు మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, మరో ఎనిమిది ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హ్యామ్ మోడ్లో అమృత్ ఎస్టీపీలు కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్లో నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నాయి. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్లో.. మిగిలిన 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే 972 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలును, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్ధ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్లపాటు నిర్వహణకు చేపట్టనుంది. మూసీపై ఎస్టీపీల ప్రతిపాదన ● హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా మూసీ నదిపై సుమారు 62 ఎస్టీపీల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన సమర్పించింది. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీ నదిలోకి చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కి.మీ మేర ప్రవహిస్తుండటంతో దానికిరువైపులా మురుగు కలుస్తోంది. రాబోయే పదేళ్లలో విస్తరించే హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎమ్మెల్డీల మురుగు నీరు ఉత్పన్నం కావచ్చని జలమండలి అంచనా వేసింది. దీంతో మూసీపై మురుగు నీటి శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించింది. ● ప్రస్తుతం మహానగరంలో 9,769 కిలో మీటర్లు మాత్రమే సీవరేజీ పైపులైన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 2.656 కి.మీ, ఓఆర్ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలన్న ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ఇక మురుగు శుద్ధి.. వంద శాతం ఇప్పటికే 37 ఎస్టీపీలు.. త్వరలో మరో 8 అందుబాటులోకి అమృత్ 2.0 కింద కొత్తగా 39 నిర్మాణాలు.. కేంద్రం వద్ద మరో 62 ఎస్టీపీలకు ప్రతిపాదనలు ముందస్తుగా పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే సీవరేజీపై ప్రణాళిక నాగోల్ ఎస్టీపీ పని తీరుతో జలమండలికి ‘వరల్డ్ వాటర్’ అవార్డు దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. సరికొత్త సాంకేతికతో మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది. తాజాగా అమృత్ 2.0 పథకం కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో ముందస్తు ప్రణాళికతో.. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. రాబోయే పదేళ్లలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని అంచనా వేసి.. శుద్ధి ప్రక్రియ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాం. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసే విధంగా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం అమృత్ ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. మూసీలో కలిసే మురుగు నీటిని సైతం శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించాం. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ అత్యాధునిక సాంకేతికతతో.. సరికొత్త సాంకేతిక ‘సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. తక్కువ విస్తరణ, తక్కువ విద్యుత్తో ఎక్కువ మురుగు నీటిని ఇవి శుద్ధి చేస్తాయి. నిర్మాణ వ్యయం తక్కువే. మ్యాన్పవర్ లేకుండా పూర్తిగా ఆటోమెటిక్గా మురుగు నీటి శుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. – సుదర్శన్, జలమండలి డైరెక్టర్ -
ముఠా ఆటకట్టు
వీసా, పాస్పోర్టుల ట్యాంపరింగ్శంషాబాద్: వీసా, పాస్పోర్టులను ట్యాంపరింగ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా విజిటింగ్ వీసాలపై అమాయకులను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపుతున్న ఓ ముఠాలోని ఇద్దరు సభ్యులను ఆర్జీఐఏ ఔట్పోస్టు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణమ్మ కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చింది. ఆమె పాస్పోర్టు, వీసాలను పరిశీలించిన అధికారులు ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరికొందరికి ఇదే తరహాలో పశ్చిగోదావరి జిల్లాకు చెందిన ఏజెంట్లు కువైట్లో ఉద్యోగానికి పంపేందుకు తప్పుడు వీసాలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన సత్యనారాయణ, చిలుకూరు బాలాజీ, హైదరాబాద్కు చెందిన అంజి, కడప జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, గోపాల్ ముఠాగా ఏర్పడి గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నిరక్షరాస్యులు, అమాయకులను టార్గెట్ చేసుకుని కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వర్కింగ్ వీసా కోసం నిబంధనల ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేంట్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉండగా వీరు దానిని తీసుకోకుండా వర్కిగ్ వీసా రద్దయినట్లు నకిలీ స్టాంపులతో క్యాన్సిల్డ్ ముద్రలు వేస్తున్నారు. అనంతరం బాధితులకు విజిటింగ్ వీసాలు అందజేసి ముందుగా మస్కట్కు పంపి అక్కడి నుంచి వారిని కువైట్కు పంపుతున్నారు. ఈ క్రమంలో పాస్పోర్టు, వీసాలను ట్యాంపరింగ్ చేయడంతో పాటు పీఓఈ సర్టిఫికేట్ లేకుండా విదేశాలకు పంపుతున్నారు. విజిటింగ్ వీసాలపై వెళుతున్న అమాయకులు పలు ప్రాంతాల్లో పట్టుబడుతూ మోసపోతున్నారు. నిందితుల ఆచూకీపై సమాచారం అందడంతో గురువారం నాంపల్లిలోని ఓ హోటల్పై దాడి చేసి చిలుకూరి బాలాజీ, సుంకర శివకుమార్లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.వీరి నుంచి ట్యాంపరింగ్ చేసిన 14 వీసాలు, 14 పాస్పోర్టులు, 16 విమాన టికెట్లు, 2 నకిలీ స్టాంపులు, ఏడు సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాఽధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఆర్జీఐఏ ఔట్ పోస్టు సీఐ బాలరాజు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఎస్ఐ సిద్దేశ్వర్ తదితరులను ఏసీపీ అభినందించడంతో పాటు రివార్డులను అందజేశారు. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి నలుగురి ముఠా సభ్యుల్లో ఇద్దరి అరెస్ట్ ఉద్యోగాల పేరుతో విజిటింగ్ వీసాలపై విదేశాలకు పంపుతున్న వైనం -
పోలీసు విచారణకు బెల్లంకొండ హాజరు
బంజారాహిల్స్: రాంగ్రూట్లో రావడమే కాకుండా ఆపినందు కు ట్రాఫిక్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై జూబ్లీహి ల్స్ పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా గురువారం విచారణకు పిలిపించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఆ రా తీయడమే కాకుండా రాంగ్రూట్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, మధ్యా హ్నం ఎక్కడి నుంచి వస్తున్నారంటూ ప్రశ్నించారు.అతడికి చెందిన బీవైడీ కారును సీజ్ చేశారు. 41ఏ నోటీసు ఇచ్చి తాము పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించారు. శ్రీనివాస్పై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుమారు గంట పాటు ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. -
ముగ్గురు కుమార్తెలతో సహా చెరువులో దూకిన తల్లి
మేడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ముగ్గు కుమార్తెలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన నాగరాజు, సుజాత (32) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు నారపల్లి, మహాలక్ష్మిపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.సుజాత చెరుకు రసం బండి నడుపుతుండగా, నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు అక్షిత(13), ఉదయశ్రీ(11) వర్షిణి(6) ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో బుధవారం పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఇద్దరికి సర్దిచెప్పారు. అయితే అదేరోజు రాత్రి మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన సుజాత గురువారం ముగ్గురు పిల్లలతో సహా నారపల్లి చెరువులోకి దూకి అత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు చెరువులోకి దూకి వారిని బయటికి తీశారు. అయితే అప్పటికే సుజాత, చిన్న కుమార్తె వర్షిణి మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న అక్షిత, ఉదయశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● తల్లి, చిన్న కుమార్తె మృతి ● ఇద్దరు పిల్లలను కాపాడిన స్థానికులు -
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
నాంపల్లి: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు వారి నుంచి 15 నకిలీ సర్టిఫికెట్లు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన షాబాజ్ ఖాన్, ముర్తుజా నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్మాయిల్, శాలివాహన నగర్కు చెందిన కడారి రమేష్ నకిలీ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పసికందును చిదిమేశాడు గోల్కొండ: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 11 రోజుల పసికందును తన మరో నాలుగేళ్ల కుమార్తె ఎదుటే దారుణంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్కు చెందిన జగత్ నగరానికి వలస వచ్చి అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం అతడి మొదటి భార్య చనిపోవడంతో తమ దేశానికే చెందిన గౌరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. షేక్పేట్ గుల్షన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న జగత్ కుటుంబంతో కలిసి అక్కడే వాచ్మెన్ రూంలో నివాసం ఉంటున్నాడు. వారికి ఓ కుమార్తె (4) ఉంది. 11 రోజుల క్రితం అతడి భార్య గౌరీ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన జగత్ తరచూ తాగివచ్చి రాత్రి వేళల్లో భార్యతో గొడవపడేవాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి గదిలోనుంచి పసికందును తీసుకుని అపార్ట్మెంట్ గేటు బయటికి తెచ్చాడు. దీనిని గుర్తించిన అతడి పెద్ద కూతురు (4) తండ్రి వెంటే వచ్చింది. అనంతరం జగత్ పసికందును గేటు పక్కన రోడ్డుపై పడుకోబెట్టి గొంతు కోశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని టవల్లో చుట్టుకుని ఏమీ జరగనట్లు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే భార్య నిద్రలో ఉండడంతో పసికందు మృతదేహాన్ని గదిలోని మూలన దాచాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన అతడి భార్య గౌరి చిన్నారి కనిపించకపోవడంతో అపార్ట్మెంట్వాసులకు చెప్పింది. దీంతో వారు సీసీ కెమెరాలు పరిశీలించగా జగత్ చిన్నారిని హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు నిందితుడు జగత్ కోసం గాలింపు చేపట్టారు. అతను మెహిదీపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని సెవన్ టూమ్స్– టోలిచౌకీ రోడ్డులోని డస్ట్ బిన్లో పడేసినట్లు చెప్పాడు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. టోలిచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● 11 రోజుల కుమార్తెను గొంతు కోసి చంపిన తండ్రి ● మరో కుమార్తె ఎదుటే ఘాతుకం ● పోలీసుల అదుపులో నిందితుడు -
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
నాంపల్లి: పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంబడించి దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం రెడ్హిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ హఫీజ్ బాబానగర్కు చెందిన యాన్ ఖురేషీ (22) తన బావ మరిది హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 17 ఏళ్ల వయస్సులోనే హత్యకు పాల్పడిన అతను జువైనల్ హోమ్కు వెళ్లాడు. కంచన్బాగ్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసుపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఉదయం కేసు విచారణకు హాజరైన యాన్ ఖురేషీ బైక్పై ఇంటికి తిరిగి వెళ్తుండగా రెడ్హిల్స్లోని ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్తో దాడి చేశారు. కిందపడ్డ అతడిపై దాడి చేసి కత్తులతో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా కడుపులో కసితీరా పొడిచారు. దీనిపై సమాచారం అందడంతో నాంపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడ్హిల్స్లో ఘటన -
‘కంచ’ను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు సిద్ధాంత దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు మరో నివేదికను అందజేసింది. ‘400 ఎకరాలపై ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాన్ని పరిశీలించగా.. 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది.ఇందులో కూడా 7.08 శాతం దట్టమైన అడవి (70 లేదా అంతకంటే ఎక్కువ శాతం చెట్లు), 31.89 శాతం మధ్యస్థ అడవి (70శాతం కంటే తక్కువ 40 శాతం కంటే ఎక్కువ చెట్లు), 17.17 శాతం బహిరంగ అడవి (10–40 శాతం చెట్లు) ఉన్నాయి. ఇదంతా చెట్ల నరికివేతకు ముందు. ఈ గణాంకాలు తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. 1.44 శాతం దట్టమైన అడవి, 7.99 శాతం మధ్యస్థ అడవి, 9.5 శాతం బహిరంగ అడవి.. అని సర్కార్ పేర్కొంది. చెట్ల నరికివేత తర్వాత.. ఈ గణాంకాలు 0.002 శాతం దట్టమైన, 0.61శాతం మధ్యస్థ, 7.92 శాతం బహిరంగ అడవిగా ఉన్నాయని పేర్కొంది.ఆకుపచ్చ జీవవైవిధ్యానికి ప్రాముఖ్యత‘2,300 ఎకరాల భూమిలో గొప్ప జీవవైవిధ్యం దాగిఉంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ భూమిని కన్జర్వేషన్ రిజర్వ్గా లేదా డీమ్డ్ ఫారెస్ట్గా ప్రకటించి, అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎలాగూ వర్షాకాలం వస్తోంది కనుక స్థానికంగా ఎదిగే చెట్లు, పొద జాతులను దట్టంగా నాటాలి. నేలతోపాటు తేమ పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్నియమించాలి.అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, భూ యాజమాన్య విభాగాల సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసి ప్రభుత్వ, సంస్థాగత భూములను గుర్తించాలి. తడి భూములు (సంరక్షణ–నిర్వహణ) నియమాలు–2017 ప్రకారం.. ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను తడి భూములుగా రక్షించేందుకు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్ల మూసివేతకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ భూముల సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలి’ అని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది. -
ఏమీ లేకున్నా... ఇచ్చెయ్ గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం (జేఎన్టీయూహెచ్) అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు కాలేజీల తనిఖీ నివేదికలపై వర్సిటీ అధికారులు గురువారం సమీక్షించారు. అనేక కాలేజీల్లో సరిపడా బోధకులు లేరని, మౌలిక వసతులు లేవని తనిఖీ బృందాలు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు వీటిని పెద్దగా పరిగణనలోనికి తీసుకోకుండా, లోపా లను సరిచేసుకునేందుకుమరో అవకాశం ఇవ్వాలని మాత్రమే నిర్ణయించినట్టు సమాచారం.కాలేజీలు ప్రారంభించే నాటికి ఫ్యాకల్టీని నియమించుకోవాలని, లేబోరేటరీలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేటు కాలేజీలకు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తు న్నాయి. ఫ్యాకల్టీ లేకుండా గుర్తింపు ఇవ్వడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు ఇచ్చాక కాలేజీలు స్పందించకపోతే చేసేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఒత్తిడా? డీలానా? ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కాలేజీల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆగ్రహం వ్యక్తంచేసింది. తనిఖీల్లో ఈ అంశాలను ప్రధానంగా చూడాలని సూచించింది. వాస్తవానికి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేనప్పుడు సెక్షన్లు తగ్గించడమో, గుర్తింపు నిలిపివేయడమో చేయాలి. కానీ, వీటి ఏర్పాటుకు కాలేజీలకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించా రు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ డీల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రైవేటు కాలేజీకి చెందిన వ్యక్తితో యూనివర్సిటీ కీలక అధికారి అంటకాగడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం వల్లే అందరికీ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వస్తోందని ఆయన సమర్థిచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోర్సులకు అధ్యాపకులెక్కడ? ఇంజనీరింగ్ కాలేజీలను జేఎన్టీయూహెచ్ బృందాలు కొన్ని నెలల క్రితమే తనిఖీ చేశాయి. 140 కాలేజీల్లో వాస్తవ పరిస్థితితో నివేదిక ఇచ్చాయి. 50 కాలేజీల్లో డేటాసైన్స్ బోధించేందుకు మాస్టర్ డిగ్రీ చేసిన నిపుణులు లేరని తేల్చారు. కొన్ని కాలేజీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారిని బోధకులుగా చూపించే ప్రయత్నం చేశాయి. వారి పాన్కార్డులను పరిశీలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తు న్నట్టు తేలింది. ఆల్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐఎంఎల్ కోర్సుల్లో సీట్లు పొందిన కాలేజీల్లోనూ నిపుణుల కొరత కనిపిస్తోంది.గుర్తింపులేని సంస్థల నుంచి డిప్లొమా కోర్సులు చేసిన వారిని బోధకులుగా చూపించినట్టు తేలింది. రెండుమూడు సెక్షన్లకు ఒకే అధ్యాపకుడు ఉన్న కాలేజీల సంఖ్య 24 ఉందని గుర్తించారు. డిజిటల్ లేబొరేటరీలు పేరుకు మాత్రమే ఉంటున్నాయి. అందులో లాంగ్ లెర్నింగ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామింగ్ ఫైల్స్ కూడా కన్పించడం లేదని తనిఖీ బృందాలు వర్సిటీకి నివేదించినట్టు తెలిసింది. డేటాసైన్స్ను విశ్లేషించేందుకు లేబోరేటరీలో అవసరమైన ప్రోగ్రామింగ్ లేదని గుర్తించారు. -
హైదరాబాద్లో ఇక పక్కాగా 'వరద' నివారణ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో వానొస్తే రోడ్లు, కాలనీలు అని తేడా లేకుండా వరద నీరు ముంచెత్తుతోంది. ప్రతి వానాకాలానికి ముందు వరద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వర్షాకాలంలో ముంపు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. నగరంలో వరదనీటి కాలువల (నాలాల) సమస్య వల్లే ఈ పరిస్థితులని గుర్తించిన యంత్రాంగం వాటి ఆధునికీకరణ పనులు చేపట్టింది. 2000 సంవత్సరంలో ముంపు అనుభవాలతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద మొదటి దశలో రూ.985 కోట్ల పనుల్ని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఆ పనులు 80 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని సమస్యలు, కోర్టు కేసుల వంటి అవాంతరాలతో మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో దశ కింద కూడా కొన్ని పనులు చేపట్టారు. నిధుల కోసం.. ఈ పనులు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ), తదితర పనుల కోసం చేసిన రుణాలకే ఏటా భారీ నిధులు మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీకి వరదనివారణ ప్రాజెక్టులకు రుణాలిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణం పొందాలని భావించింది. వరద నివారణ పనులకు మన కరెన్సీలో రూ.5135.15 కోట్ల మేర రుణం కోసం జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనకు జైకా నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జైకా ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నిధులందనున్నాయి. ఏయే పనుల కోసం.. వరద నివారణ చర్యల్లో భాగంగా వరద కాలువల (నాలాల) ఆధునికీకరణ, కొత్త వరద కాలువల నిర్మాణం, చెరువుల పరిరక్షణ, సుందరీకరణల కోసం ఈ నిధులు తీసుకోనున్నారు. ప్రాజెక్టు కాలపరిమిది దాదాపు ఎనిమిదేళ్లు. ఇందులో జైకా ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకే దాదాపు ఏడాది పట్టనున్నట్లు సమాచారం. అనంతరం లోన్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకం, పనుల డిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టరు ఎంపిక వంటివి పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్ల వరకు పట్టనున్నట్లు తెలుస్తోంది. జైకా నుంచి అందే రుణం (రూ.5135.15 కోట్లు)తో హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్యూఏ) వరకు 450 కి.మీ.ల మేర వరదకాలువల ఆధునీకరణ, కొత్తవాటి నిర్మాణం, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం తదితరమైనవి చేయనున్నారు. ఓఆర్ఆర్ వరకు ప్రాంతాన్ని హెచ్యూఏగా వ్యవహరిస్తున్నారు. 2036 విజన్తో.. హెచ్యూఏ (HUA) పరిధి వరకు ప్రస్తుత జనాభా 1.40 కోట్లు కాగా, 2036 నాటికి ఇది 2 కోట్లకు చేరుకోనుందనే అంచనాతో ఈ ప్రతిపాదన రూపొందించారు. వరద నివారణ చర్యల కోసం ఈ నిధులతో చేపట్టే పనుల వల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, యుటిలిటీస్ వంటివి దెబ్బతినకుండా ఉంటాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ సొరంగాలుగా.. వరద సాఫీగా ప్రవహించేందుకు వరద కాలువల (నాలాలు) నిర్మాణాలకు ఎలాంటి ఆధునిక సాంకేతికత వినియోగించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, జపాన్ తరహాలో భూగర్భ సొరంగాల మాదిరిగా వరద నీరు మళ్లించే నిర్మాణాలు చేయాలనే యోచనలో అధికారులున్నారు. జపాన్ (Japan) రుణం తీసుకోనుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఇటీవల జపాన్లో పర్యటించి రావడం తెలిసిందే. ఎన్ని కాలువలు ఉన్నా.. నగరంలో 13 మేజర్ వరద కాలువలు, 150కి పైగా చిన్న, మధ్య తరహా చెరువులు, మూడు పెద్ద చెరువులు (హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, హుస్సేన్సాగర్) ఉన్నప్పటికీ 2020లో వచ్చిన వరదలో జరిగిన భారీ నష్టంతో, మున్ముందు సదరు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టారు. చదవండి: అనుమతులు లేక స్తంభించిన స్థిరాస్తి లావాదేవీలు..జపాన్లో అలా.. జపాన్లో టోక్యో శివార్లలోని మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ అండర్ గ్రౌండ్ డిశ్చార్జి టన్నెల్ తరహాలో నగరంలో వరద నీటి పరిష్కారానికి అవకాశముంటుందా అనే దిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అందుకు తగిన సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జి–కేన్స్ ప్రాజెక్ట్గా ప్రసిద్ధి చెందిన అది ప్రపంచంలోనే అత్యంత భారీ వరద నీటిని మళ్లించే సొరంగమార్గం ప్రాజెక్ట్. దాని పొడవు 6.3 కిలోమీటర్లు. భూమి కింద 22 మీటర్ల లోతున నిర్మించారు. 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో ఒక్కొక్కటి 500 టన్నుల బరువైన 59 రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్తంభాలతో భారీ నీటి నిల్వ ట్యాంక్ నిర్మించారు. 78 పంపుల ద్వారా సెకనుకు 200 మెట్రిక్ టన్నుల నీటిని నదిలోకి మళ్లించే సామర్ధ్యం ఉంది. ఐదు ప్రాంతాల్లో నీటి నియంత్రణ ఏర్పాట్లున్నాయి. -
సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్కు నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే
సాక్షి, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా: సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేదని వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫొటో పెట్టలేదని అనచరులు ఆవేదన తెలిపారు. కార్యకర్తల ఆందోళనను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.కాగా, సరస్వతి పుష్కరాలు సందర్భంగా గురువారం సీఎం రేవంత్రెడ్డి దంపతులు జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సరస్వతీదేవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొన్నారు. -
గామా నైఫ్.. మెదడు చికిత్సల్లో సరికొత్త విప్లవం
మెదడులో వచ్చే సమస్యలు.. ప్రధానంగా క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందులో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పంపుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతాదులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్యంత కచ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు. చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. మెదడులో వచ్చే కణితులు (క్యాన్సర్, ఇతరాలు), రక్తనాళాలు సరిగా ఏర్పడకపోవడం, పిట్యుటరీ కణితులు, విపరీతమైన నొప్పి తదితరాలకు ఇది బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స. దుష్ప్రభావాలు చాలా తక్కువ, విజయాల రేటు ఎక్కువ.రోగులకు ప్రయోజనాలివీ.. మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. మెదడులో ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలను పాడుచేయకుండా సమస్యను మాత్రమే కచ్చితంగా తొలగిస్తుంది. చాలావరకు ఒకే సెషన్లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్లచ్చు. ఇప్పటివరకు గామా నైఫ్ చికిత్సలు ప్రపంచంలో 10 లక్షల మందికి పైగా రోగులు పొందారు. మన దేశంలో ఇప్పటివరకు 8వేల ప్రొసీజర్లు చేశారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90% విజయాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు. దీనికి సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24-48 గంటల్లోనే 90% రోగులు తమ పనులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ కణితులు, రక్తనాళాల్లో సమస్యలు.. లాంటి 20 రకాల సమస్యలకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. కిమ్స్ ఆస్పత్రిలో పెట్టినది ఒకే సెషన్లో పలు కణితులను కూడా నయం చేస్తుంది. దాంతో చికిత్స సమయం తగ్గుతుంది. న్యూరాల్జియా సమస్యకు దీంతో చికిత్స చేస్తే 48 గంటల్లోనే నొప్పి బాగా తగ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్రమే కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి. సంప్రదాయ మెదడు శస్త్రచికిత్సల కంటే ఇందులో దుష్ప్రభావాలు దాదాపు లేనట్లే. -
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం -
యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు.. తగిన సౌకర్యాలు లేక తిప్పలు
యాదాద్రి భువనగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండకు వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు కొరవడిన రవాణా సౌకర్యంతో పాటు, భద్రతా సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో దైవ దర్శనం కోసం భక్తులు యాదాద్రికి పోటెత్తుతున్నారు. దర్శన సమయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో భక్తుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి తోడు భక్తుల రద్దీకి తగ్గట్లు రవాణ సౌకర్యం లేదని, దైవదర్శనంలో భక్తులు వాగ్వాదినికి దిగుతున్నా పోలీసు సిబ్బంది పట్టించుకోవడం లేదు.దీనికి తోడు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడంలో అధికారుల విఫలమవుతున్నట్లు సమాచారం.బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోవాలా దోపిడీ ఎక్కువైందని, తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!
సాక్షి, బంజారాహిల్స్: రాంగ్రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ జర్నలిస్ట్కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్రూట్లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు. (చదవండి: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో)దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్ను స్టేషన్కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కామెడీ పేరుతో వేషాలా.. చట్టప్రకారం శిక్ష తప్పదు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కామెడీ పేరుతో తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగాట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇదేం వెర్రి కామెడీ!?. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? . కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదేం వెర్రి కామెడీ!?సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025 -
తెలంగాణ సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ..
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. -
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
Ration Card: రేషన్ కార్డులు ఎక్కడ .. జారీ ఎప్పుడు..!
వరంగల్కు చెందిన ఆంజనేయులు ఉపాధి కోసం రెండు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి బోడుప్పల్లో స్థిర పడ్డారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని ఆధారంగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులేదని అధికారులు గుర్తించి క్షేత్ర స్థాయి విచారణ కూడా పూర్తి చేశారు. రేషన్ కార్డు కోసం ఎంపికై జాబితాలో సైతం పేరు చేర్చారు. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు . ఇలాంటి ఉదంతాలు సిటీలో అనేకం. అయితే ప్రభుత్వం గత రెండు నెలలుగా మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన దరఖాస్తులతో ఎంపికైన కుటుంబాలు కూడా మళ్లీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలా? వద్దా ? అనేది తెలియక వారు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంపికైన కుటుంబాలకు స్పష్టత లేకుండా పోయింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వేతో రేషన్ కార్డుల కోసం ఎంపికైనా ఇప్పటికీ మంజూరు అందని ద్రాక్షగా తయారైంది. మరో వైపు తాజాగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఇప్పటికే ఆఫ్లైన్ దరఖాస్తుల ద్వారా ఎంపికైన కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే డబులింగ్ అయి అసలుకే ఎసరు వస్తుందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. సంబంధిత పౌరసరఫరాల అధికారులు కూడా స్పష్టత ఇవ్వక పోవడంతో పేద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారు.సర్వేలో 83 వేల కుటుంబాలు సరిగ్గా ఐదు నెలల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలు అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబి్ధదారుల జాబితాను ప్రకటించిన తర్వాతనే కార్డులు మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవంగా గతేడాది జరిగిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కేవలం గ్యారంటీ పథకాల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, రేషన్ కార్డు దరఖాస్తులను పక్కకు పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన కుటుంబాలపై విచారణ జరపడంతో మిగతా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో వాటిపై కూడా విచారణ జరిపిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఆన్లైన్ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సర్వే జాబితాపై ఎలాంటి కదలిక లేకుండా పోయింది.ఆన్లైన్ ద్వారా 2.60 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా అన్లైన్లో ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలకు జారీ కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన అర్హత గల కుటుంబాల జాబితా కూడా జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు అందక పోవడం, మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులపై కనీసం విచారణ ప్రారంభం కాకపోవడం వెరసి కొత్త రేషన్కార్డుల జారీపై సందిగ్ధత నెలకొంది. -
HYD: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్గంజ్లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోందివివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్ గోడౌన్కు మంటలు వ్యాపించాయి. అనంతరం, మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ డీఎఫ్ఓ వెంకన్న సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రమాదం జరిగిందని కాల్ వచ్చింది. వెంటనే ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. సెకండ్ ఫ్లోర్ లో ముగ్గురు బిల్డింగ్ పైన ఐదుగురు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చాము. మంటలు అదుపులోకి వచ్చిన ఇంకా స్మోక్ భారీగా వస్తుంది. బేగంబజార్లో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఇంట్లోనే గోదాం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు.బట్టలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో స్మోక్ ఎక్కువగా వస్తుంది. మరో గంటల్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తాం. మనుషులు వెళ్లలేని చోటికి లేటెస్ట్ గా వచ్చిన రోబోను పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని అన్నారు. -
ఏపీలో దంచికొట్టిన వాన.. HYDలో మరో రెండు గంటలు అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించి తెలిసిందే.. తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రోజంతా ఎండ మండిపోతున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచికొడుతోంది.. ఈ క్రమంలో గురువారం ( మే 15 ) కూడా వర్షాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. #HyderabadRains Update : 8:10AMMODERATE-HEAVY Rains Expected In Many Parts Of The Hyderabad City In Next 2-3 Hours Already Rains Happening SouthWest Hyderabad Soon It Will Cover Central And East HyderabadPlan Your Work Accordingly pic.twitter.com/hnKXH19aDo— Hyderabad Weather (@JawadWeatherman) May 15, 2025గురువారం ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.. అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్ నగర్, కోఠి, యూసఫ్ గూడా, కూకట్పల్లి, అల్వాల్, సుచిత్ర, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. ఉదయం 9 గంటల సమయానికి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. #15MAY 8AMScattered -Intense Rains Continues... in South &West #Hyderabad ⛈️Rain to Continue in Various Parts of the City during the Next 1Hr...PLAN ACCORDINGLY!!#Hyderabadrains pic.twitter.com/9fGOmFBtxL— Hyderabad Rains (@Hyderabadrains) May 15, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోను ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.@balaji25_t In Vikarabad District 🌧️🌧️ pic.twitter.com/d0ICc9N8Sb— M Sai Kumar Reddy (@saidarling888) May 15, 2025 HyderabadRains ALERT 3 ⚠️⛈️ The POWERFUL STORMS which formed in North, West HYD is now further spreading into East, Core HYD also now. It's going to be ON AND OFF strong rains, thunderstorms in MOST PARTS OF THE CITY till 9AM. Plan your morning travel accordingly— Telangana Weatherman (@balaji25_t) May 15, 2025 -
సండే ఫండే.. ఇక సందడే..
మెట్రో నగరాల్లో వీకెండ్స్ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్ జోష్తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్ కార్నివాల్ కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్ జోష్కు మిస్ వరల్డ్ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్ మే 18న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.నాటి వీకెండ్.. సూపర్ హిట్.. నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్ బండ్ రోడ్ ఒక ఓపెన్ ఎంటర్టైన్ మెంట్ ప్లేస్గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.ప్రమోషన్ యాక్టివిటీస్.. ఆరీ్మకి చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్ ట్రక్స్ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్ షోలు, ఫైర్ స్పోర్ట్స్ ఉండేవి. పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్ యాక్టివిటీస్కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫౌంటెన్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్ను నిర్వహించారు.రీఛార్జ్.. రీస్టార్ట్.. సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్ వరల్డ్ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్ వరల్డ్ డైలీ షెడ్యూల్లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం. -
సాంస్కృతిక సమ్మేళనం.. అందాల సోయగం..
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్కి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ వ్రస్తాలతో అందాల తారలు హొయలు పోయారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు పోటీదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా తమ తమ దేశాల వస్త్రధారణతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది అధునాత సాంస్కృతిక సమ్మేళనంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి అధునాతన జీవనశైలి, ముఖ్యంగా ఆహారం తమకు ఎంతగానో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల కోసం నిత్యనూతనంగా సన్నద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. -
మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వన్యప్రాణుల రక్షణకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచి్చ»ౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం భూ, అటవీ జంతువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక అందజేసింది. ప్రభుత్వం తరఫున ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు వివరాలు, ఫొటోలతో సహా అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు. ‘100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు, తక్షణం అమలు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని రాష్ట్ర వన్యప్రాణి ఉన్నతాధికారులను ఆదేశించాం. ఏప్రిల్ 17, 21, మే 3, 8న రాష్ట్ర చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్, వన్యప్రాణుల నిర్వహణ నిపుణులతో కంచ గచి్చబౌలి భూములను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ భూములు 2,374 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులో 400 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ రాళ్లు, చెట్లు, గడ్డితో కూడిన భూములు. అధికారుల తనిఖీల సమయంలో కొన్ని పక్షులు, మచ్చల జింకలు కనిపించాయి. ఈ ప్రాంతంలో చాలా వీధి కుక్కలు తిరుగుతున్నాయని, వాటి కారణంగా వన్యప్రాణులకు ముప్పు కలిగే అవకాశం ఉందని గ్రహించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్కు చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ చేసిన అభ్యర్థన మేరకు ఏప్రిల్ 4 నుంచి 30 మధ్య 26 వీధి కుక్కలను పట్టుకోవడానికి బృందాలను నియమించి చర్యలు తీసుకున్నాం’అని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు అమర్చాం ‘భూముల్లో వన్యప్రాణులపై నిఘా, రక్షణ కోసం 24 గంటలూ 3 షిఫ్టుల్లో ఐదుగురితో మూడు బృందాలను నియమించాం. నరికిన, ఎండిన చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉండటం, వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండటంతో నివారణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. వారికి ప్రత్యేక అగి్నమాపక యంత్రాలు అందజేశాం. ఏ ప్రాంతంలోనైనా వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, సంగ్రహణకు 20 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశాం. జింకల నీటి అవసరాలకు 12 కృత్రిమ నీటి వనరులను నెలకొల్పాం. భద్రత పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అమర్చాం. అడవి జంతువుల భద్రత కోసం వర్సిటీ, టీజీఐఐసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. తక్షణ పశువైద్య సంరక్షణ, చికి త్స కోసం తెలంగాణ అటవీ శాఖతో కలిపి యాంటీ పోచింగ్ పేరిట స్క్వాడ్ను ఏర్పాటు చేశాం. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడంతోపాటు ఇకపై చెట్లను ఎవరూ నరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’అని నివేదికలో వివరించారు. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
ఇది తినండి.. ఇలా ఉండండి!
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్ఐదారేళ్ల శ్రమ..ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. టాప్ ఆస్పత్రితో ఒప్పందం..ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్లో వెల్కం డిన్నర్లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.»ప్రస్తుతం హోటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.» మిస్వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు -
గడువులోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి కృష్ణా పరీవాహకంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా నిర్ణీత గడువులతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగిరం చేయాలన్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని భూసేకరణ ప్రత్యేకాధికారిని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎంపికైన 244 మందితోపాటు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైన 199 మందికి బుధవారం సాయంత్రం జలసౌధలో సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలను అందించారు. అనంతరం మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. సీఎస్ కె.రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్సమీక్షలో పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి పనులకు కార్యాచరణ ప్రణాళికసూదిని జైపాల్రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబర్లోపు పూర్తి చేయాలన్నారు. వీటికి సంబంధించి పెండింగ్ పనులు, అవసరమైన నిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.కృష్ణాలో జలాల్లో నీటి వాటాల కోసం..కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలన్నారు. సుమారు 70 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉండగా, ఏపీలో కేవలం 30 శాతమే ఉందని గుర్తు చేశారు. ఈ ప్రాతిపదికన కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలన్నారు. గోదావరి పరీవాహకం నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ 90 టీఎంసీలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల వాటాను పెంచాలని కోరుతూ వాదనలు వినిపించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా పరీ వాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నీటి వాటాల కేటాయింపుల కోసం సమర్థంగా వాద నలు వినిపించాలని ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టే టప్పుడు నీటి కేటాయింపులు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ట్రిబ్యు నల్ నుంచి నీటి కేటాయింపులు పొందాలని సూచించారు. -
నేటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతీ నదికి గురువారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 10.45 గంటలకు బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నట్లు పండితులు పేర్కొన్నారు. అయితే రాత్రి సమయం కావడంతో గురువారం ఉదయం 5.44 గంటలకు అంతర్వాహిని సరస్వతీ నదికి విశేష పూజలతో పండితులు పుష్క రుడికి ఆహ్వానం పలుకుతారని కాళేశ్వరం దేవస్థానం వేదపండితులు వివరించారు. కాళేశ్వరాలయంనుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. మెదక్ జిల్లా రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకు సీఎం రేవంత్రెడ్డి నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరస్వతీ ఘాట్ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కరాల పవిత్రతను కాపాడాలిసరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. -
కట్టిన మూడేళ్లకే కూలింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్తో పాటు జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు. ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది ‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మూడుచోట్లా కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు ‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. హెలీకాప్టర్లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఎవరి పని వారు చేయాలి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంజనీర్ ఇన్ చీఫ్ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్ చెప్పారు. ‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది ‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు. -
జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బల్దియాలోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి వివరాలను అధికారులు తెలిపారు. -
‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’
హైదరాబాద్: నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?, మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశాం. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ. అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారుగతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు.తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
రేపట్నుంచి కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు
హైదరాబాద్: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. రేపు(గురువారం) పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ జరుగనున్నాయి.పుష్కరాల వేళ.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి.పుష్కరాలకు నెల ముందు నుంచి నీటి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు.ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లు ఉండటం విశేషం. -
TSRTC city bus : అత్యంత రద్దీగా బస్సులు...అసలు కారణాలివీ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు! మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు!
మణికొండ: జీవిత చమరాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు..కూతురైన కరుణించకపోతుందా అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది. వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. ఈ ఘటన నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల కొమరయ్య, లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగిలో 150 గజాల్లో ఇంటిని నిర్మించుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు చేశారు. అయితే ఇంటిని కుమారులు, కూతురు కలిసి ఇటీవల రూ.60 లక్షలకు అమ్మేసి ముగ్గురు రూ. 20 లక్షల చొప్పున పంచుకున్నారు. తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు. కుమారులు, కూతురు స్థానికంగానే ఉన్నా వారికి అన్నం పెట్టడం లేదు. దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టు పక్కల వారి ఇళ్లకు వెళ్లి అడుక్కు తింటున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు.. స్థానిక మాజీ కౌన్సిలర్ ఉషారాణి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు వచ్చే రూ. 2వేల పింఛన్ రూ.5 వేలు అవుతుందని, సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్త చెప్పాడు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, తమను ఆదుకోవాలని కోరారు. -
ఏమిరా మాతోనే పెట్టుకుంటావా...
గోల్కొండ(హైదరాబాద్): ఏమిరా మాతోనే పెట్టుకుంటావా... అంటూ ఓ రౌడీషిటర్ సోదరులు హేర్ కట్టింగ్ సెలూన్ యజమానిపై దాడి చేయడమే గాకుండా సెలూన్ను ధ్వంసం చేసిన సంఘటన సోమవారం రాత్రి గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన జాఫర్, సోహెబ్ సోమవారం రాత్రి గోల్కొండ మోతీమహల్ వద్ద గల హెయిర్ కట్టింగ్ వీరు సెలూన్ యజమాని సయ్యద్ నిజాముద్దీన్తో వాగ్వాదానికి దిగారు.ఏమిరా మాతోనే పెట్టుకుంటావా మేము ఎవరో తెలియదా అంటూ నిజాముద్దీన్ను బయటికి లాగి చితకబాదారు. అంతటితో ఆగకుండా సెలూన్ను ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సోదరుడైన రౌడీషిటర్ హంజాను పోలీస్స్టేషన్కు పిలిపించి హెచ్చరించారు. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ప్రయాణికులు 100 శాతం బస్సులు 60 శాతమే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది.కొత్త సర్వీసులేవీ.. నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల విని యోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు, తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్ర యాణ సదుపాయం అందుబాటులోకి వచి్చన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయాణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు.2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు,సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సులవైపు మళ్లారు.మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి.దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి,రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి.దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్సీటర్ ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది.కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలు, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీల కింద నగదును అందిస్తోంది. వసతిగృహ సంక్షేమాధికారికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నిధిని విడుదల చేస్తోంది. ఆ నిధి నుంచి విద్యార్థులకు చెల్లిస్తున్నారు. ఇకపై కాస్మెటిక్ చార్జీలను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరవనుంది. బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.ఈ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు మాధిరి పనిచేస్తుంది. ఈ కార్డుల వినియోగం వల్ల విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పైన చైతన్యం కలిగించినట్లవుతుంది. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.విద్యార్థులకు అవసరమైన సబ్బులు, షాంపూలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ కేంద్రాల ద్వారా కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేసేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, బెడ్షిట్లు, కార్పెట్, బ్యాగులు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
కమిటీలతో కాలయాపన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం, తాజాగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.ఇలా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప.. 16 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. మంగళవారం టీఎన్జీఓ భవన్లో టీజీఈజేఏసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఐదు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులను దోషులుగా చూపుతున్న సర్కారు ప్రకటనలు జేఏసీ అడుగుతున్నవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లేనని, తామెన్నడూ ఏదీ అదనంగా కోరలేదని జగదీశ్వర్ చెప్పారు. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉద్యోగులను దోషులుగా చూపుతున్నట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఇంకో నెలరోజులు గడిస్తే ఆరో డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి వినతులు సమర్పించామని, ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాల వారీగా నిరసనలు చేపట్టాలని టీజీఈజేఏసీ పిలుపు ఇచ్చిందని, ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి పరిస్థితిని వివరించినందున నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ, రాష్ట్ర ప్రభుత్వ స్పందన తర్వాత జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారుల కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆర్థికేతర అంశాలతో కూడిన డిమాండ్లను వేగవంతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు–2025 మే నెలలోనే చేపట్టాలని, గత ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి తిరిగి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. -
కుమ్మక్కు తేలాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రైవేటు కాలేజీలతో ఎఫ్ఆరీసీ ఆడిటర్లు కుమ్మక్కయ్యారా? ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మరోసారి భేటీ అయ్యి ఫీజుల ఖరారు చేయాలని నిర్ణయించారు. 2025–26 నుంచి మూడేళ్ళ కాలానికి గాను, ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీజీఏఎఫ్ఆర్సీ) మంగళవారం భేటీ అయింది. కమిటీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన పలువురు అధికారులు పాల్గొన్నారు.ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం ఆడిట్ రిపోర్టులు సమర్పించాయని మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సమావేశంలో సీరియస్గా చర్చ జరిగింది. ‘సాక్షి’వార్తలో వాస్తవం ఉందనే అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఎఫ్ఆర్సీ నియమించిన ఆడిటర్లు ప్రైవేటు కాలేజీలకు కొమ్ముగాశారనే ఆరోపణల నేపథ్యంలో ఫీజుల పెంపును గుడ్డిగా ఆమోదించలేమని వారు స్పష్టం చేశారు. దీంతో ప్రైవేటు కాలేజీల జమా ఖర్చులపై ఆడిట్ నివేదికలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది.కాలేజీల ఆడిట్ నివేదికలను ఆమోదించిన ఆడిటర్ల నిబద్ధతపై కమిటీలోని పలువురు సభ్యులు సందేహాలు లేవనెత్తినట్టు తెలిసింది. కాలేజీలతో వారికి గల సంబంధాలపై ఆరా తీయాలని విద్యాశాఖకు చెందిన కీలక అధికారి సూచించినట్టు సమాచారం. అడ్డగోలుగా ఫీజులు పెంచేందుకు వీలుగా ఆడిటర్లతో ప్రైవేటు కాలేజీలు కుమ్మక్కవ్వడం ప్రభుత్వాన్ని అప్రదిష్టకు గురి చేస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆడిటర్ల నేపథ్యం తెలుసుకోకుండా ఫీజులు పెంచేందుకు అనుమతించకూడదని ఆమె వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎంవోలోనూ అధికారుల చర్చలు! ఏఎఫ్ఆర్సీ సమావేశం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగింది. ‘సాక్షి’కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరా తీసిందని, దీంతో సమావేశానికి రావాల్సిన అధికారులు సీఎంవోకు వెళ్ళి చర్చించినట్టు సమాచారం. అలాగే ఫీజులను ఇప్పటికిప్పుడు యథాతథంగా ఆమోదించవద్దనే సూచనలు అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం మొదలవ్వగానే విద్యాశాఖ అధికారులు ఫీజుల పెంపుపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ప్రైవేటు కాలేజీలు ఇచ్చిన ఆడిట్ నివేదికలు పరిశీలించి నిర్ధారించుకున్నారా?’అంటూ ఓ ఉన్నతాధికారి ప్రశ్నించినట్టు తెలిసింది.దీంతో ‘ఇది తమ పని కాదని, ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామన్నట్టుగా ఏఎఫ్ఆర్సీ అధికారులు కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ‘అసలు ఆడిటర్లు ఎవరు? వారికి గతంలో ఏయే కాలేజీలతో అనుబంధం ఉంది?’అనే అంశాలపై ఆరా తీయాలని విద్యాశాఖ అధికారులు పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో అధికారుల మధ్య వాడివేడి వాగ్వాదం జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టులను సమావేశానికి తె ప్పించిన విద్యాశాఖ అధికారులు అందులో లోపాలను ఎత్తిచూపినట్టు తెలిసింది.అన్ని కాలేజీల ఆడిట్ రిపోర్టులూ ఇదే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైన నేప థ్యంలో ఆ నివేదికలు మరోసారి పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త కోర్సులు పెట్టామని, మౌలిక వసతుల కో సం భారీగా ఖర్చు పెట్టామంటూ.. నివేదిక లు ఇచ్చిన కాలేజీలకు స్వయంగా వెళ్ళి పరి శీలించాల్సిన అవసమూ ఉందని కొందరు అధికారులు వాదించినట్లు సమాచారం. ఆడిటర్లపై సీఎంవో ఆరా ఏఎఫ్ఆర్సీ నియమించిన ఆడిటర్లు ప్రైవేటు కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎంవో రంగంలోకి దిగింది. ఆడిటర్లకు సంబంధించిన వివరాలపై స్వయంగా వాకబు చేస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఆడిట్ నివేదికల కోసం నియమించుకున్న ఆడిట్ సంస్థలకు, ఏఎఫ్ఆర్సీ నియమించిన ఆడిటర్లకు మధ్య సబంధాలున్నట్టుగా సీఎంవోకు సైతం ఫిర్యాదులు వచి్చనట్టు తెలిసింది. ప్రైవేటు కాలేజీల ఆడిట్ నివేదికలు పరిశీలిస్తున్న క్రమంలో జరిగిన ఫోన్కాల్ సంభాషణలపై వాకబు చేస్తున్నట్టు తెలిసింది. కలకలం రేపిన ‘సాక్షి’ కథనం‘నేడు ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు’పేరుతో ‘సాక్షి’ప్రచురించిన కథనం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యారి్థ, ప్రజా సంఘాలతో పాటు అధికార పార్టీ వర్గాలు సైతం దీనిపై తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటోందంటూ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కొందరు సీఎంవో దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఖరారు కావాల్సిన ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా పడింది. -
మళ్లీ ‘కోర్’కునేలా..?
ఇంజనీరింగ్లో కోర్ గ్రూపులకు రానురాను ఆదరణ తగ్గుతోంది. కంప్యూటర్ సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతి ఏటా కోర్ గ్రూపుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీలు వాటిని తగ్గించుకునేందుకే మొగ్గుచూపుతున్నాయి. గత ఏడాది వందకు పైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గించాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి.ఈ ఏడాది కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దీనిపై ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరారు. ఇంజనీరింగ్ విద్యలో సమతుల్యత అవసరమని భావిస్తున్న అధికారులు.. కోర్ గ్రూపులను కాపాడేందుకు త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నిర్వాహకులు, ఉన్నత విద్యా మండలి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. – సాక్షి, హైదరాబాద్తగ్గుతున్న చేరికలుసివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఈఈఈ కోర్సుల్లో 2019లో 43,532 సీట్లు ఉంటే 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024 సంవత్సరానికి వచ్చేసరికి అంటే ఐదేళ్లలో సీట్లు 25,597కు పడిపోయాయి. 19,739 చేరికలు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో గడచిన ఆరేళ్ళలో 280 శాతం మేర ప్రవేశాలు పెరిగాయి. సీట్లు కూడా భారీగానే పెరిగాయి. 2019లో కనీ్వనర్ కోటా కింద 22,033 సీఎస్ఈ సీట్లు ఉంటే 20,311 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో సీట్లు 61,587కు పెరగగా ఏకంగా 59,485 సీట్లు భర్తీ అయ్యాయి. స్లైడింగ్లో మార్పుతోనూ కోర్కు నష్టం ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కోర్ గ్రూపులను మరింత దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు. కన్వీనర్ కోటా కింద ఏదైనా కాలేజీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆఖరి సమయంలో ఐఐటీ, ఎన్ఐటీల్లోనో, డీమ్డ్, ఇతర రాష్ట్రాల కాలేజీల్లోనో చేరుతుంటారు. దీంతో ఖాళీ అయ్యే సీట్లను కాలేజీలు బయటి విద్యార్థులతో భర్తీ చేసేవి. అయితే గత ఏడాది స్లైడింగ్ విధానాన్ని నిర్వహించిన సాంకేతిక విద్య విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలకు కలిపి స్లైడింగ్ నిర్వహించ లేదు.ఏ కాలేజీకి ఆ కాలేజీలో మాత్రమే స్లైడింగ్కు అవకాశం ఇచ్చింది. ఇది కోర్ గ్రూపులను మరింత దెబ్బతీసింది. 40 వేల ర్యాంకు వచ్చిన వ్యక్తి ఒక కాలేజీలో సివిల్ గ్రూపులో సీటు పొందితే, స్లైడింగ్లో ఆ వ్యక్తి సీఎస్ఈ సీటు తెచ్చుకున్నాడు. కానీ 10 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థి కంప్యూటర్ కోర్సు మాత్రమే కోరుకున్నా, ఆ కాలేజీలో బ్రాంచి లేకపోవడం వల్ల సీటు పొందలేని స్థితి ఏర్పడింది. ఈ విధంగా గత ఏడాది దాదాపు 5,500 మంది విద్యార్థులు నష్టపోయినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో కోర్ బ్రాంచీల్లో చేరిన వారిని అలాగే ఉంచి, కొత్తవారికి అవకాశం ఇచ్చేవారు.దీనివల్ల కోర్ గ్రూపులో చేరినవారు అలాగే ఉండేవారు. దీనిపై పలువురు విద్యావేత్తల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్య అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఇటీవలి కాలంలో కోర్ గ్రూపుల సిలబస్లో మార్పులు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్లను కూడా చేరుస్తున్నారు. దీనివల్ల కోర్కు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
దడ పుట్టించే ‘డ్రోణా’స్త్రం
సాక్షి స్పెషల్ డెస్క్,సాక్షి, హైదరాబాద్:రాజుల కాలంలో కత్తులు, బల్లేలతో సైనికులు రణక్షేత్రంలో పోరాడారు. తరవాత.. యుద్ధ భూమిలో తుపాకులు, బాంబుల మోత మోగింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మానవ రహిత విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా వేల మైళ్ల దూరం నుంచే శత్రుదేశంపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్.. తాజాగా భారత్–పాక్... యుద్ధం ఏదైనా.. డ్రోన్స్ (మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)) ఇప్పుడు సైనిక సంపదలో అత్యంత కీలకంగా మారాయి. పెళ్లిళ్ల వంటి వేడుకల్లో ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్స్ మాత్రమే చాలా మందికి సుపరిచితం. కానీ, డ్రోన్స్ అంటే అంతకుమించి. డ్రోన్లు అధునాతన ఆయుధాలు. ఎవ్వరూ ప్రాణాలను పణంగా పెట్టకుండానే కచి్చతమైన దాడులు చేయడం, వేగంగా మోహరించే సామర్థ్యం వీటి సొంతం. క్షిపణులతో పోలిస్తే వీటి అభివృద్ధికి అయ్యే వ్యయమూ తక్కువే. మన దేశంలో డ్రోన్ల వాడకం.. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం తొలిసారి యూఏవీలను వినియోగించింది. ఆ తర్వాత ఇండియా అధికారికంగా వీటి కొనుగోలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మన సైన్యం వద్ద ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న సెర్చర్ ఎంకే–2 టాక్టికల్ డ్రోన్స్, హెరాన్మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్ఈ), హార్పీ యాంటీ రాడార్ డ్రోన్లు ఉన్నాయి. హార్పీ అనేది ఆత్మాహుతి డ్రోన్(లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసే క్రమంలో దీన్ని వినియోగించారు). వీటితో పాటు హరోప్ లాయిటరింగ్ అటాక్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రాడార్ సైట్లు, వాహనాలే లక్ష్యంగా మందుగుండుతో ఢీకొట్టి సర్వనాశనం చేయడం దీని స్పెషాలిటీ. దీంతో పాటు అధిక మన్నిక, పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇజ్రాయిల్ ఎంఏఎల్ఈ డ్రోన్’హెరాన్టీపీ/మార్క్ 2’కూడా మన దగ్గర ఉంది.మొదటి ప్రపంచ యుద్ధంలో..మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా రెండూ తొలిసారిగా యూఏవీతో ప్రయోగాలు చేశాయి. 1950–60లలో శత్రు భూభాగంపై గూఢచర్యం చేయడానికి యూఎస్ చిన్న రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నిఘా యూఏవీలు తొలిసారిగా మోహరించారు. 2000వ సంవత్సరంలో అమెరికా హెల్ఫైర్ క్షిపణులతో కూడిన ప్రిడేటర్ డ్రోన్ను రూపొందించింది. ఇక్కడి నుంచే సైనిక ఆయుధ భాండాగారంలోపెనుమార్పులు వచ్చాయి. మగ తేనెటీగను ఇంగ్లీషులో డ్రోన్ అంటారు. శ్రామిక తేనెటీగలకన్నాఇవి పెద్దగానే ఉంటాయి. కానీ తేనెనూ సంపాదించలేవు. తమను తామూపోషించుకోలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇవి చేసే పని ఏమీ ఉండదు. కానీ, ఆడ తేనెటీగ కోసం వెతుకుతూ ఎగిరి, దాన్ని కలిశాక పడిపోతుంది. డ్రోన్ మాత్రం అలాకాదు.. చూసి రమ్మంటే కాల్చి వస్తుంది.హైదరాబాద్ నుంచి..రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇప్పటికే నిలిచింది. డిఫెన్స్ డ్రోన్విభాగంలోనూ ఇదే బాటలో పయనిస్తోంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. భారత రక్షణ శాఖ కోసం ఏఎల్ఎస్–250 యూఏవీలను ఉత్పత్తి చేస్తోంది. అదానీ–ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియా.. హెర్మీస్ 900 యూఏవీలను తయారు చేస్తోంది. రక్షణ రంగానికి కావాల్సిన కీలక యంత్ర, పరికరాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్థ ఎస్ఈసీ ఇండస్ట్రీస్కు చెందిన ట్రిన్నోవేట్ సినర్జీ టెక్నాలజీస్ చిన్న యూఏవీలు, హైబ్రిడ్ డ్రోన్స్ సరఫరా చేస్తోంది.ఆయుధాలను మోసే యూఏవీలను ఇండియన్ ఆర్మీకి అందిస్తోంది. జెన్ టెక్నాలజీస్ చిన్న యూఏవీలను భారత రక్షణ విభాగాలకు సరఫరా చేస్తోంది. ఎస్ఈసీ డీఆర్వీఏఎన్ఇన్నోవెన్షన్స్.. మిలిటరీ టెస్టింగ్ కోసం టార్గెట్ డ్రోన్లను; శిక్షణ, మదింపు కోసం శత్రు డ్రోన్లను అనుకరించే యూఏవీలను ఆఫర్ చేస్తోంది. మారుత్ డ్రోన్స్ రక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. టీ–హబ్, టీ–వర్క్స్ కేంద్రంగా కొన్ని స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి రానున్నాయి. భారత్ ఎలక్ట్రికల్స్ – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తయారీ భాగస్వాములుగా డీఆర్డీఓ రుస్తోమ్ – 2 డ్రోన్స్ అభివృద్ధి చేసింది. దక్ష యూఏవీ, ఐడియా ఫోర్జ్ వంటివి కూడా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2030 నాటికి రూ.34,860 కోట్లకు..డ్రోన్స్, యూఏవీల తయారీలో 75% వరకు విడి భాగాలు దేశీయంగా ఉత్పత్తి అయినవే. కొన్ని నెలల్లో ఇది 100 శాతానికి చేరడం ఖాయమని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిఫెన్స్ డ్రోన్కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీకి ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టాయి. పరిశ్రమకు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారత సైనిక డ్రోన్ మార్కెట్ 2024లో రూ.13,040 కోట్లు. 2030 నాటికి ఇది రూ.34,860 కోట్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రిసర్చ్ అంచనా. -
కాంగ్రెస్ సర్కార్పై వరుస పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. -
కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతున్నా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికుల తరహాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీలపై సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు తీర్చేందుకు సమయం దొరకడం లేదని విమర్శించారు. ధాన్యపు రాశులను గాలికి వదిలి.. సీఎం రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నా.. సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పరిమితమవుతూ సచివాలయం ముఖం కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మరణాలకు సీఎందే బాధ్యత కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడటంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యపు రాశుల సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్న ఈ మరణాలకు సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ‘వానకాలంలో రైతుబంధు సాయం ఎగవేసిన ప్రభుత్వం.. యాసంగిలో మూడు ఎకరాలకు మించిన రైతులకు ఇవ్వనే లేదు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు. పాకిస్తాన్ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ అప్పు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద బురద చల్లే తొందరలో సీఎం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు’అని ఎద్దేవా చేశారు. తాము రైతుల సమస్యల గురించి మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం అందజేసిన వివరాల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.4 వేల కోట్లు చెల్లించాలని, సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.4 వేల కోట్ల బకాయి ప్రస్తుత యాసంగి సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని హరీశ్రావు విమర్శించారు. రైతులకు 48 గంటల్లో వడ్ల కొనుగోలు డబ్బులు ఇస్తామని చెప్పినా.. నేటికీ రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సన్న ధాన్యానికి రూ.512 కోట్ల బోనస్ కూడా విడుదల చేయలేదని చెప్పారు. రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్రావు, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్కు నాయకత్వం ఇచ్చినా ఓకేబీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదని హరీశ్రావు తెలిపారు. ‘నేను పార్టీ పెడుతున్నట్లు, మరో పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వచి్చన తప్పుడు ప్రచారాన్ని గతంలోనే ఖండించా. మా పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ అంశంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా పార్టీలో నాయకత్వ పంచాయితీ లేదు. కేసీఆర్ మా పార్టీ అ«ధ్యక్షుడు. ఆయన ఆదేశాలను పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా. కేసీఆర్ నిర్ణయాన్ని నేను జవదాటను’అని హరీశ్రావు స్పష్టంచేశారు. -
పుష్కరాలకు నీళ్లొచ్చాయి
సాక్షి, హైదరాబాద్: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు పెద్ద టెన్షన్ దూరమైంది.. సరిగ్గా పుష్కరాల వేళ, అడుగంటిన నది.. మళ్లీ ప్రవాహ స్థాయికి చేరుకుంది. దీంతో పుష్కరాల్లో భక్తుల స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పదన్న భయాందోళనలు దూరమయ్యాయి. గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతి నదికి ఈనెల 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు నిర్వహించే కాళేశ్వరం దేవస్థానం చెంత గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో గత నెలలోనే నీళ్లు పూర్తిగా అడుగంటాయి. పుష్కరాలకు నెల ముందు నుంచి సమస్య బాగా పెరుగుతూ వచ్చింది. దీంతో పుష్కరాల నాటికి నీళ్లు మరీ తగ్గి భక్తులు పుణ్య స్నానాలు చేయలేని దుస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో, ఆమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను అప్పట్లో ఆదేశించారు. కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉంది. ఇసుక తేలిన నదిలో చాలా నీళ్లు ప్రవాహంలోనే ఇంకుతాయి. పుష్కరాల నాటికి ప్రచండ ఎండలుండనున్నందున ప్రవాహంలో నీళ్లు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని తట్టుకొని నీళ్లు దేవాలయం వరకు చేరాలంటే నిత్యం 5 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఎల్లంపల్లిలో కూడా కనిష్ట స్థాయిలోనే నీటి నిల్వ ఉన్నందున, ఉన్న నీటిలో రోజుకు 5 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటికి కటకట ఎదురవుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం తల పట్టుకున్న తరుణంలో అకాల వానలు ఆదుకున్నాయి. ప్రాణహిత బేసిన్ అయిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇటీవల అకాల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కాళేశ్వరం దేవాలయం వద్ద నదిలో నీటి మట్టం ఏకంగా 30 సెం.మీ. మేర పెరిగింది. ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నదీ గర్భంలో గరిష్టంగా 30 అడుగుల మేర నీళ్లున్నాయి.దీంతో ముందు జాగ్రత్త చర్యగా 5 అడుగుల ఎత్తు వరకు నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడి వరకు భక్తులను స్నానాలకు అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలు కొనసాగే ఈనెల 26 వరకు స్నానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.రేపటి నుంచి 26 వరకు పుష్కర సంబురంహాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం వద్ద పుష్కర సంబురం గురువారం ప్రారంభం కానుంది. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15న సీఎం రేవంత్రెడ్డి రానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్ను సరస్వతి ఘాట్ సమీపంలో నిర్మించారు. రూ.కోటితో తయారు చేసిన రాతి సరస్వతీమాత విగ్రహం, రూ.55 లక్షలతో టెంట్సిటీ, హారతి గద్దెలు నిర్మించారు. వీటిని సీఎం ప్రారంభిస్తారు. పుష్కరాలకు 12 రోజుల పాటు పీఠాధిపతులు రానున్నారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానందసరస్వతి పుష్కర ప్రారంభ పూజలో పాల్గొంటారు. కాశీపండితులచే 12 రోజులు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. 330 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజూ ఉంటాయి. 12 రోజులపాటు దేవాలయంలోని యాగశాలలో యాగాలు నిర్వహిస్తారు. -
ఫేక్.. జర దేఖ్!
ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. దేశంలో 77.4 శాతం ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. డీప్ ఫేక్ల కారణంగా 55 శాతం మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్పై నమ్మకం కోల్పోతున్నారని 2024లో ఒక సర్వే తెలిపింది. - సాక్షి, హైదరాబాద్ఫేక్ న్యూస్ వ్యాప్తి ఇలా.. » దేశంలో సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే ఫేక్ న్యూస్లలో రాజకీయ సంబంధమైనవి 46 శాతం, సాధారణ అంశాలపై 33.6 శాతం, మతపరమైనవి 16.8 శాతం ఉంటున్నాయి. » 2022–2024 మధ్య నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫేక్ న్యూస్పై 12 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. » పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా దేశవ్యాప్తంగా 2019 నుంచి 2025 వరకు సుమారు 50 వేల నకిలీ వార్తలను ధ్రువీకరించింది. » తెలంగాణ ప్రభుత్వం 2020లో స్థాపించిన ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ 2020–2025 మధ్య రాష్ట్రంలో సుమారు 8,000 నకిలీ వార్తలను ధ్రువీకరించింది. వీటిలో 50% రాజకీయ అంశాలు, 30% సా మాజిక సమస్యలు, 15% ఆరోగ్య సంబంధిత వార్తలున్నాయి. » తెలంగాణలో 2022–2024 మధ్య ఫేక్ న్యూస్పై 1,200 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో 70% సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందినవి. » రాష్ట్రంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి 65% వాట్సాప్ ద్వారా జరుగుతోంది. డీప్ఫేక్ వీడియోల వ్యాప్తి ఇలా..» 2023లో దేశవ్యాప్తంగా సుమారు 50,000 డీప్ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టించబడినట్లు అంచనా. ఈ సంఖ్య 2024లో 20% పెరిగింది. » 2023–2025 మధ్య డీప్ఫేక్ వీడియోసంబంధిత ఫిర్యాదులు సుమారు 3,500 ఎన్సీఆర్పీలో నమోదయ్యాయి. » దేశంలో డీప్ఫేక్ కంటెంట్లో 60% వాట్సాప్ ద్వారా, 25% ట్విట్టర్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. » రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగంలో 2023–25 మధ్య డీప్ఫేక్ సంబంధిత ఫిర్యాదులు 300 నమోదయ్యాయి. రాష్ట్రంలో డీప్ఫేక్ కంటెంట్లో 50% వాట్సాప్, 30% ట్విట్టర్, 15% టెలిగ్రామ్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. చెక్ పెట్టండిలా.. ఎస్సీఆర్పీ పోర్టల్: డీప్ ఫేక్ వీడియోలపై ఫిర్యాదు చేయ డానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cyb ercrime.gov.in) (www. cybercrime.gov. in)ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నకిలీదా, నిజమైనదా? అని నిర్ధారించుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్, తెలంగాణ ఫ్యా�క్ట్ చెక్ పోర్టల్ (factcheck.telangana.gov.in) అందుబాటులో ఉన్నాయి. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఏ విషయంలోనైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు. అన్ని అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గమనిస్తున్నారు. తప్పుడు వార్తలపై 87126 72222 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదులు పంపండి. – ఎక్స్లో టీజీసీఎస్బీ కేస్ 01విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చేసినప్రసంగంలో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పినట్టుఒక వీడియో ఈ నెల 10న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడిరూపొందించిన ఫేక్ వీడియోగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.కేస్ 02శంషాబాద్ విమానాశ్రయంలో ఒక కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇటీవల జరిగిన మాక్ డ్రిల్లోదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా బయటపెట్టింది.కేస్ 03 భారతసైన్యానికి విరాళాలుసేకరించేందుకు కేంద్రం బ్యాంకు ఖాతా తెరిచిందని, ప్రజలు విరాళాలు ఇవ్వాలని వాట్సాప్లో ఒక మెసేజ్ వైరల్అవుతోంది. ఇది నకిలీ సందేశమని,అప్రమత్తంగా ఉండాలని టీజీ సీఎస్బీ ప్రకటించింది. -
వయ్యారి భామ.. నీ హంస నడక!
సాక్షి, హైదరాబాద్: నిజాం వారసత్వ వైభవానికి, ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్ను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలకు పోజులిచ్చారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్ వాక్ ఉత్సాహంగా సాగింది. చార్మినార్ వద్ద, లాడ్బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాతబస్తీలో పాపులర్ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా..కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. అనంతరం లాడ్ బజార్కు వెళ్లారు. చుడీ బజార్ (గాజుల మార్కెట్)లో షాపింగ్ చేశారు.సెల్ ఫోన్లలో చార్మినార్..గ్రూప్ ఫొటోప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ప్రభుత్వం హెరిటేజ్ వాక్లో భాగంగా వారు చార్మినార్ను సందర్శించారు. విశిష్టమైన నగర వారసత్వ వైభవానికి ఈ అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చార్మినార్ను తిలకించడమే కాకుండా దాని ముందు ఏర్పాటు చేసిన వేదికపై గ్రూప్ ఫోటో దిగారు. చార్మినార్ చరిత్ర, గొప్పదనం గురించి టూరిజం శాఖ గైడ్లను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ ఫోన్లలో చార్మినార్ అందాలను బంధించారు. గాజులు, ముత్యాల హారాల షాపింగ్నగర జీవనశైలి, ఇక్కడి విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చార్మినార్ సమీపంలోని లాడ్ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో హెరిటేజ్ వాక్ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కేఆర్ కాసత్, జాజు పెరల్స్, ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో ఈ మిస్ వరల్డ్ తారలు అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు. నగర విశిష్టతను చాటాలన్న వ్యాపారులులాడ్ బజార్ వ్యాపారులు కొందరు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మీమీ దేశాల్లో హైదరాబాద్ విశిష్టతను, చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లాడ్ బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలు, రంగురంగుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సుందరీమణుల హెరిటేజ్ వాక్ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. -
చౌమహల్లా ప్యాలెస్లో సుందరీమణులు
'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 120 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్కు చేరుకున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా చౌమహల్లా ప్యాలెస్కు చేరుకున్నారు. ఇక్కడే మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటక ప్రాంతం గురించి తెలిపే ఫోటో గ్యాలరీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.చౌముల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని వారు అన్నారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
డీఎస్పీ ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తింపు
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. -
HMDA: ‘అనుమతులు’ ఎప్పుడిస్తరు?
సాక్షి, సిటీబ్యూరో: ట్రిపుల్ఆర్ వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరించినప్పటికీ ఇంకా లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం ప్రారంభం కాలేదు. దీంతో నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. హెచ్ఎండీఏ విస్తరణకు ముందు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ప్లానింగ్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) నుంచి అనుమతులు లభించేవి. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలోని ప్రాంతాలన్నీ హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. రెండు నెలల క్రితమే ఈ బదిలీ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవలసి ఉంది. కానీ రెండు నెలలుగా దీనిపైన ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిర్మాణ సంస్థల్లో గందరగోళం నెలకొంది. రూ.కోట్లల్లో అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ఇటు డీటీసీపీ నుంచి అటు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించకపోవడంతో సందిగ్ధంలో పడ్డాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సైతం ఇది ఆటంకంగా మారినట్లు నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రీజనల్ రింగురోడ్డు వరకు మారిన సీన్... హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అన్ని రకాల అనుమతులు, ప్రొసీడింగ్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర నిర్మాణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు కొత్త ప్రాంతాలను హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని 6 జోన్లలో చేర్చారు. హెచ్ఎండీఏ పరిధిని విస్తరించినప్పటి నుంచి ఆ పరిధిలో డీటీసీపీ అనుమతులను నిలిపివేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హెచ్ఎండీఏ నుంచి కొత్తగా ఎలాంటి అనుమతులు లభించలేదు. హెచ్ఎండీఏ వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం డీటీసీపీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్డ్నౌ పోర్టల్ సేవలను డీటీసీపీ ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ గతంలో ఉన్న 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు లభిస్తుండగా, కొత్తగా చేరిన 3,215 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్న గ్రామాలు, మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతులు మొదలు కాకపోవడం గమనార్హం.మ్యాపింగ్లో జాప్యమేల... హెచ్ఎండీఏ కొత్తగా విస్తరించిన ప్రాంతాల మ్యాపింగ్లో జాప్యం వల్లనే అనుమతుల ప్రక్రియను ఇంకా ఆరంభించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మ్యాపింగ్ తుదిదశకు చేరిందని, త్వరలోనే పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రిపుల్ఆర్ వరకు రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు సైతం హెచ్ఎండీఏ కసరత్తును చేపట్టింది. దీంతో నిర్మాణరంగంపైన స్పష్టత కొరవడినట్లు రియల్వర్గాలు పేర్కొంటున్నాయి. ‘షాద్నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు నెలల నెంచి ఎదురుచూస్తున్నాం. కానీ ఈ మ్యాపింగ్ పూర్తయిన తరువాత అనుమతినిస్తారా లేక, కొత్త మాస్టర్ప్లాన్ వచ్చేవరకు నిలిపివేస్తారా తెలియడం లేదు.’ అని ఒక రియల్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ మెగామాస్టర్ప్లాన్ అమల్లోకి వచ్చే వరకు అనుమతులు లభించకపోతే తాము తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని పేర్కొన్నారు. భారీ లే అవుట్లే కాకుండా అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలకు సైతం ఇబ్బందులు తలెత్తనున్నాయి.హెచ్ఎంఏ డెవలప్మెంట్ ప్లాన్..హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్ధిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ఈ హెచ్ఎంఏ (HMDA) పరిధిలో ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలతో మాస్టర్ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు చేపట్టారు. ఈ ప్రణాళికలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముసాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి సరికొత్త మాస్టర్ప్లాన్ రానుంది. చదవండి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!ఈ క్రమంలో నిర్మాణరంగానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతులను ఎప్పటి నుంచి ఇస్తారనేది సందిగ్ధంగా మారింది. బ్లూన్గ్రీన్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) వరకు చెరువులు, కుంటలు, తదితర నీటివనరులను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలను చేపట్టవలసి ఉంది.దీంతో అప్పటి వరకు వేచి ఉండవలసిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. -
చార్మినార్ దగ్గర సందడి చేసిన అందాల భామలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి (చార్మినార్) నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.రాత్రికి చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు. అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఏమిటీ హెరిటేజ్ వాక్? హైదరాబాద్ నగరం, చారిత్రక నేపధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ‘ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్‘ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించి, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్ వాక్లో భాగంగా, పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రక కట్టడాలలో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, బద్షాహీ అషూర్ఖానా, ఖిల్వత్ ముబారక్, లాడ్ బజార్ వంటివి ఉన్నాయి. ఇవి హైదరాబాద్ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.సందర్శకులకు స్థానిక గైడ్ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు. -
కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్ రావు ఏమన్నారంటే
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. -
మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్ఫ్రెండ్ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేసన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అసలే ఎండలు.. ఆపై వేసవి తాపం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న మద్యంప్రియులు బీర్లతో చిల్ అవుతున్నారు. పెద్దఎత్తున బీర్లు సేవిస్తున్నారు. దీంతో రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాలు రెట్టింపైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి లిక్కర్ను సేవించే వాళ్లు సైతం ‘చిల్’అయ్యేందుకు చల్లటి బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వైన్షాపులు సహా మార్టుల్లో చల్లని బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చల్లటి బీర్ల కొరత ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు పది నుంచి పదిహేను కాటన్ల బీర్లను మాత్రమే రిఫ్రిజిరేటర్లలో బీర్లను పెట్టేవారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో రోజుకు 30 నుంచి 40 కేసుల బీర్లను రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయాల్సి వస్తోంది. అయినా చిల్డ్ బీరు దొరకడం కష్టమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్లో లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.3,272.32 కోట్ల ఆదాయం సమకూరగా, కేవలం గ్రేటర్ జిల్లాల నుంచే రూ.1160 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం గమనార్హం. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్కు రాగా కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్ సెంటర్ను భవిష్యత్లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కమలాకర్రెడ్డి, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు కాల్ చేయాలని డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపారు. -
నువ్వు ముదిరాజ్వా.. రెడ్డివా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను బీసీ బిడ్డగా ఎవరూ ఆమోదించడం లేదని, ఆయన అసలు ము దిరాజ్ కులానికి చెందిన వారో, లేక రెడ్డి కులానికి చెందిన వారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అనుభవమున్న నాయకుడు రాజేందర్కు ఇంత దిగజారుడు తనం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదని, ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరించారు. సోమవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, పీసీసీ నేతలు ఈర్ల కొమురయ్య, సలీం, గజ్జి భాస్కర్, ఇందిరా శోభన్లతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని, అందుకే కిషన్రెడ్డిపై ఉన్న ఆక్రోశాన్ని రేవంత్పై వెళ్లగక్కుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన లోని అలీబాబా 40 దొంగల్లో ఈటల కూడా ఒక సభ్యుడని, రాష్ట్రం అప్పుల పా లు కావడానికి కేసీఆర్తో పాటు ఈటల నిర్వాకం కూడా కారణమని పేర్కొన్నా రు. దద్దమ్మగా ఉన్న ఈటలను అప్పుడు బీఆర్ఎస్ నుంచి తంతే వెళ్లి బీజేపీలో ప డ్డారని, మళ్లీ ఇప్పుడు అక్కడ ఇమడలేక కేసీఆర్వైపు చూస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము ఒక్క విజిలేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో తెలియదని అ న్నారు. కేటీఆర్ బాణిలోనే రాజేందర్ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోంది కిషన్రెడ్డి, రాజేందర్ గ్యాంగేనని మండిపడ్డారు. -
స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమలుతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ చకచకా కొనసాగుతోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం క్రయ, విక్రయదారులు గంటల తరబడి వేచి చూడకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి, మరో 15 నుంచి 20 నిమిషాల్లో చేతికి దస్తావేజులు అందుతున్నాయి. రిజి్రస్టేషన్ శాఖ సంస్కరణల్లో భాగంగా ప్రయోగాత్మకంగా మరో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ ఆఫీస్లతోపాటు ఫరూక్ నగర్, షాద్నగర్, మహేశ్వరం, వనస్ధలిపురం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, నారపల్లి, మల్కాజ్గిరి సబ్ రిజి్రస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సత్వరమే స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు వెసులు బాటు కలిగినట్లయిది. ఇప్పటికే గత నెల రోజులుగా ఆజంపురా, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ తదితర సబ్రిజి్రస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలవుతోంది. రోజువారీగా 48 నుంచి 144 స్లాట్లు.. గ్రేటర్ పరిధిలో ఎంపిక చేసిన సబ్రిజి్రస్టార్ కార్యాలయాల్లో రోజువారీగా 48 చొప్పున స్లాట్లను అమలు చేస్తున్నారు. దస్తావేజుల తాకిడి అధికంగా ఉండే ఆఫీసుల్లో మాత్రం 144 స్లాట్స్ వరకు అవకాశం కల్పిస్తున్నారు. దస్తావేజుదారులకు కేటాయించి స్లాట్ల సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రయత్నంస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకోని అత్యవసర దస్తావేజుదారుల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కేవలం ఐదు ‘వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను’ అనుమతిస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. సబ్ రిజి్రస్టేషన్ ఆఫీసుల్లో స్థిరాస్తి రిజి్రస్టేషన్ల కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం అర్ధగంటలోపు దస్తావేజుల ప్రక్రియ పూర్తి కావడం పట్ల స్థిరాస్తి క్రయవిక్రయదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తికొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రెండురోజుల ముందు ఉప్పల్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ చేసుకున్నా. కేవలం పది నిమిషాల్లోనే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయింది. అరగంట వ్యవధిలోనే డాక్యుమెంటు తీసుకుని ఇంటికి వచ్చేశాం. నిజంగా ఈ విధానం చాలా బాగుంది. దీని వల్ల ఎక్కడా ఇబ్బంది పడలేదు సరికదా సమయం చాలా ఆదా అయింది. సో హ్యాపీ. – సంతోష్ కుమార్ రెడ్డి, ఉప్పల్చాలా ఈజీ అయిందికాప్రా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నాం. గతంలో రిజి్రస్టేషన్కు ఒక రోజంతా పట్టేది. తరువాత 2,3 రోజుల తర్వాత రిజి్రస్టేష¯న్ డాక్యుమెంట్లు చేతికి అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రిజి్రస్టేష¯Œన్ 15 నిముషాల్లో పూర్తయింది. మరో 15 నిమిషాల్లో డాక్యుమెంట్లు సిద్ధం చేసి చేతికి అందించారు. రద్దీ లేకుండా ప్రశాంత వాతావరణంలో పని చాలా ఈజీగా పూర్తయింది. – ఎ.శ్రీలత, కాప్రా -
Ameerpet: స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నం
అమీర్పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్ వాలా డాట్ కామ్లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపేవాడు. బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ
హైదరాబాద్: మిస్ వరల్డ్–2025 పోటీదారులతో చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు మంగళవారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే చిరు వ్యాపారులను కట్టడి చేసే దిశగా అందరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు తమ వ్యాపారాలకు సెలవు ఇవ్వాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చార్మినార్కు నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అణువణువూ తనిఖీ చేసిన అనంతరమే చార్మినార్ (Charminar) వరకు అనుమతించనున్నారు. ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్లతో చార్మినార్, లాడ్ బజార్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్ది..ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్లో పాల్గొననున్నారు. చార్మినా ర్నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే వాక్లో ప్రపంచ సుందరాంగులు పాల్గొని ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అనంతరం షాపింగ్ చేయనున్నారు. తెలంగాణ జరూర్ ఆనా.. అనే టైటిల్తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సులో మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తారు. శివారు ప్రాంతమైన ఆరాంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ ద్వారా పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. అనంతరం బహదూర్పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్గట్టి, గుల్జార్హౌజ్, చార్కమాన్ మీదుగా చారి్మనార్కు చేరుకుంటారు. డిన్నర్ (Dinner) అనంతరం తిరిగివచ్చిన రూట్లోనే వెళ్లనున్నారు. హెరిటేజ్ వాక్ (Heritage Walk) కోసం పాతబస్తీలో దాదాపు 10 కిలో మీటర్ల రేడియస్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ (GHMC) చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల మరమ్మతులు చేయించామన్నారు. దాదాపు 250 మంది కారి్మకులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ, శాలిబండ (రాజేష్ మెడికల్ హాల్) నుండి వోల్గా జంక్షన్, వోల్గా జంక్షన్ నుండి మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్డుకు వెళ్లే రోడ్లలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల్ని నియంత్రించనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు నగర పోలీస్ (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మదీనా జంక్షన్: నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. హిమ్మత్పుర: నాగల్చింత/శాలిబండ ప్రాంతాల నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను హిమ్మత్పురా జంక్షన్, హరి బౌలి మరియు వోల్గా జంక్షన్ వైపు ఫతే దర్వాజా రోడ్డు వరకు తరలిస్తారు.వోల్గా జంక్షన్: హిమ్మత్పురా నుండి వచ్చే ట్రాఫిక్ను చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. వీటిని వోల్గా జంక్షన్ ఫతే దర్వాజా వైపు మళ్లిస్తారు. ఫతే దర్వాజా నుండి వచ్చే ట్రాఫిక్ను హిమ్మిత్పురా వైపు మళ్లిస్తారు. మూసబౌలి: పురానాపూల్ (గుడ్ విల్ కేఫ్) నుండి వచ్చే ట్రాఫిక్ను చారి్మనార్/చౌమహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు మరియు మూసబౌలి వద్ద సిటీ కాలేజ్ మరియు ఫతే దర్వాజా వైపు దూద్బౌలి ద్వారా మళ్లిస్తారు. చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్ను చౌక్ మైదాన్ వద్ద కోట్ల అలిజా లేదా మొఘల్పురా వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్: ఎతేబార్ చౌక్ ప్రాంతం నుండి గుల్జార్హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఎతేబార్ చౌక్ వద్ద మండి మిరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. షేర్ ఎ బైతుల్ కమాన్: మిట్టి కా షేర్ నుండి వచ్చే ట్రాఫిక్ను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు మరియు మిట్టి–కే–షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ వైపు మళ్లించి హైకోర్టు రోడ్డుకు చేరుకుంటారు. లక్కడ్ కోట్ (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అపాట్ వైపు నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్ను లక్కడ్ కోట్ వద్ద (ఓల్డ్ సీపీ ఆఫీస్ లేన్) మరియు మిరాలం మండి మార్కెట్ వైపు మళ్లిస్తారు (అవసరమైతే) ఈ పరిమితులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. -
తెలంగాణకు అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి చూపడంతోపాటు హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతులు, సంక్షేమంతో కూడిన సమతుల పాలన రాష్ట్రంలో సాగుతోందని తెలిపారు. హైదరాబాద్ను అద్భుత నగరంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్లో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ప్రాంగణాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పేరొందిన ‘మిస్ వరల్డ్’పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయని, ఈ తరహా ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఓడరేవులతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని సీఎం వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనేం.. పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉంది. డిసెంబర్, 2023లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకుని ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం. 2025లో దావోస్లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ కట్టడి, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలోనూ మొదటి స్థానంలో ఉంది. 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్వేర్, లైఫ్సైన్సెస్, పారిశ్రామిక రంగాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా మారింది. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా తయారైంది. మైక్రోసాఫ్ట్, కాగి్నజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో క్యాంపస్లను విస్తరిస్తున్నాయి’అని సీఎం రేవంత్రెడ్డి వివరించారు. ఏఐ లీడర్గా తీర్చిదిద్దుతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్గా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘తెలంగాణను ఏఐ లీడర్గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. ఏఐ సిటీలో భాగస్వామి అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయా రు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకు హైదరా బాద్ హబ్గా మారింది. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సొనాటా ప్రతినిధులు సమీర్ ధీర్, సుజిత్ మొహంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీఎందేశ క్రికెట్ చరిత్రలో విరాట్కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్లాఘించారు. క్రికెట్లో ఆయన సాధించిన విజయాలను పొగిడారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ఉన్నత క్రమశిక్షణ కలిగిన, కమిట్మెంట్ ఉన్న ఆటగాడిగా ఆయన సాధించిన పలు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. యువ క్రికెటర్లకు ఆయన ఒక మార్గదర్శి అని తెలిపారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తన తదుపరి దశ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. -
నేడు అండమాన్లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మంగళవారం (13వ తేదీ) సాయంత్రానికి అండమాన్–నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అండమాన్–నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.3 డిగ్రీల సెల్సియస్గా రికార్డయ్యింది. రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. -
విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు యూనిఫాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలోని సిబ్బందికి యూనిఫాం (ఒకే రూపం దుస్తులు) అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డిస్కంలో పనిచేస్తున్న అటెండర్ మొదలు సీఎండీ వరకు అందరూ ఒకటే అన్న భావన తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూనిఫాం డిజైన్ చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారం తీసుకుంటామని చెప్పారు. సోమవారం ప్రజాభవన్లో ఎస్పీడీసీఎల్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు.రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ క్షణం కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించామన్నారు. ఈ ఏడాది మార్చిలో 17,162 మెగావాట్లకు పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు సిబ్బందిని భట్టి అభినందించారు.రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ విస్తరణతో పాటు డేటా సెంటర్స్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు కావాల్సిన విద్యుత్ గురించి ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
టీజీసీఎస్బీ అంతర్రాష్ట్ర ఆపరేషన్.. 20 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గుజరాత్లో నిర్వహించిన అంతర్రాష్ట్ర ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది. సైబర్ నేరాలకు పాల్పడే వారికి మ్యూల్ బ్యాంకు ఖాతాలు (ఒకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను ఇతరులకు వినియోగించుకునేందుకు ఇవ్వడం) సరఫరా చేస్తున్న ఏజెంట్లు, మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు లావాదేవీల్లో సహకరిస్తున్న ముఠా గుట్టురట్టు చేసింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుజరాత్లోని సూరత్లో మే 1 నుంచి మే 10 వరకు ప్రత్యేక ఆపరేషన్లో 20 మందిని అరెస్టు చేసింది. వీరిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు, ఆరుగురు ఏజెంట్లు ఉన్నారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణలో 60కి పైగా, దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో పేర్కొన్న ప్రకారం..తెలంగాణలోని ఏడు సైబర్ క్రైం పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా పలు అనుమానాస్పద నగదు ఉపసంహరణలు, చెక్కుల ద్వారా జరిగిన లావాదేవీలపై టీజీసీఎస్బీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు తేలింది. తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ. 22,64,500 విత్డ్రా చేసుకున్నట్టు గుర్తించారు.అరెస్టయిన నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఒక బ్యాంకు ఉద్యోగి (వాపీ శాఖకు చెందిన డీసీబీ బ్యాంకు రిలేషన్íÙప్ మేనేజర్) ఉన్నారు. వీరు వ్యాపార, పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్, పార్ట్–టైమ్ ఉద్యోగ సహా వివిధ సైబర్ మోసాల్లో పాల్గొన్నట్టు శిఖాగోయల్ తెలిపారు. అరెస్టు అయిన నిందితుల నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, నాలుగు ఏటీఎం కార్డులు, ఐదు చెక్ బుక్లు, రెండు పాన్కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులు, ఇతర నేర సంబంధిత డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.సూరత్ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీలు ఫణీందర్, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు మహేందర్, రవికుమార్తోపాటు ఆపరేషన్కు సహకరించిన ఎస్పీ దేవేందర్సింగ్, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, హరికిషన్లను శిఖాగోయల్ అభినందించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే 1930 లేదా ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
మల్కన్గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్గిరి కేంద్రంగా కొన్ని ముఠాలు గంజాయి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ కీలక ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి అంతా మల్కన్గిరి అటవీ ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలు.. అక్కడే ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. మల్కనగిరి నుంచి గంజాయిని హైదరాబాద్కు రవాణా చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ⇒ ఉప్పల్ హెచ్సీఎల్ మల్లాపూర్లో జరిపిన సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందికి చిక్కిన నిందితులు వివేక్రెడ్డి, మధుకిరణ్ల ఫోన్లలో ఈ మేరకు కీలక వీడియోలు లభించాయి. వీటిల్లో టన్నుల కొద్ది గంజాయిని కుప్పగా పోసి కొందరు వాటిని ప్యాకింగ్ చేస్తూ..గంజాయి రవాణా గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గంజాయి ముఠా కార్యకలాపాలను క్షణ్ణంగా వివరించే ఇలాంటి వీడియోలు దర్యాప్తు బృందాలకు చిక్కడం ఇదే తొలిసారి అని మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ దాకాఅటవీ ప్రాంతంలో సేకరించిన గంజాయిని ఎండబెట్టిన తర్వాత అంతా ఒక్కచోటకు తెస్తారు. కుప్పలుగా పోసి..దానిని కిలోల చొప్పున అవసరం మేరకు ఎన్ని కిలోల ప్యాకెట్లు కావాలంటే అంత బరువు తూచి ఒక కవర్లో పెడతారు. ఈ కవర్లను చతురస్రాకార డబ్బాల్లో కూర్చి వీలైనంత వరకు ముద్దగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఆ చతురస్రాకార బాక్స్ల్లోని గంజాయిని ప్రెసింగ్ రాడ్ కింద పెట్టి పదిమంది తిప్పుతూ వీలైనంత మేరకు తక్కువ పరిమాణంలో కనిపించేలా ముద్దలా అయ్యేలా చేస్తున్నారు. దీనిపై ప్లాస్టర్తో సీల్ చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల బరువు ఎక్కువగా ఉన్నా..ప్యాకెట్ సైజు కుదించబడడంతోపాటు, గంజాయి రవాణా సమయంలో వాసన రాకుండా చేస్తున్నారు. దీన్ని దళారులు, గంజాయి ముఠాలతో డీల్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం, రాజమండ్రి మార్గాల్లో రోడ్డు మార్గంలో, లేదంటే ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రైలు మార్గంలో దేశంలోని పలు పట్టణాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి. రూ.53 లక్షల విలువైన గంజాయి సీజ్ మల్లాపూర్లోని హెచ్సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని ఎక్సైజ్శాఖ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.53 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్కుమార్లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా ముఠాకు చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ , కట్ల వివేక్రెడ్డిలను అరెస్టు చేయగా, ఏ–1 మల్కన్గిరి జిల్లాకు చెందిన రాంబాబు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లలో ఇష్టారాజ్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పారదర్శకంగా జరగాల్సిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్లు.. సిఫార్సులకే పెద్దపీట వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. అధికారుల క్షేత్రస్థాయి సర్వేకు భిన్నంగా అర్హుల జాబితా రూపొందినట్లు ఆరోపణలు లేకపోలేదు. మొదటి విడత పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కొంత వరకు అర్హులకే ఇళ్లు దక్కినప్పటికీ.. రెండో విడత జాబితా తయారీ పూర్తిగా ఎమ్మెల్యే, వారి అనుచరుల కనుసన్నల్లో పూర్తయింది. ఇందిరమ్మ కమిటీలు సిఫార్సు చేసిన కార్యకర్తలు/ఓటర్లకే ఇళ్లను కట్టబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులకు బదులు అనర్హులు వచ్చి చేరినట్లు సమాచారం. విషయం అధికారులకు తెలిసీ ఏమీ చేయలేక.. వారు సూచించిన పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేరకుండా పోతోంది. రాజకీయ జోక్యంతో.. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 80.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కులగణన/ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, జియో ట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఎంపిక చేసిన బృందాలు దరఖాస్తు దారుని ఇంటికి చేరుకుని వివరాలు సేకరించాయి. ఒక కుటుంబానికి ఒకే ఇల్లు కేటాయించేలా జాబితా రూపొందించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను తొలుత ఎంపీడీఓలు/ మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో ఉంచారు. గ్రామ సభలు/వార్డు సభల్లో ఆయా లబ్ధిదారుల జాబితాను చదివి విన్పించారు. తీరా తుదిజాబితా (Final List) రూపకల్పనలో రాజకీయ పైరవీకారులకే పెద్దపీట వేసినట్లు తెలిసింది.తొలి విడతలో 15 వేల ఇళ్లు మంజూరు కాగా, వీరిలో ఇప్పటికే ఏడు వేల మందిని ఎంపిక చేసి, వారికి ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేశారు. మిగిలిన వారికి మరో రెండు మూడు రోజుల్లో అందజేయాల్సి ఉంది. పారదర్శకంగా, నిజాయితీగా పేదలకు దక్కాల్సిన ఇళ్లు రాజకీయ జోక్యంతో పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పిన వారి పేర్లను మాత్రమే జాబితాలో చేర్చుతుండటం.. ఎండీఓ, మున్సిపల్ కమిషనర్లు వాటినే ధ్రువీకరిస్తుండటం.. కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి వాటికి ఆమోదముద్ర వేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. అందని ఆర్థిక సాయం.. పెరిగిన సిమెంట్ ధర మరోవైపు ఇందిరమ్మ ఇల్లు మంజూరై, సొంత ఖర్చులతో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆర్థిక సహకారం అందకపోవడంతో వారు అయోమయంలో పడి పోయారు. ఇప్పటికే చేతిలో ఉన్న సొమ్ము పూర్తిగా ఖర్చు కాగా, కొత్తగా మార్కెట్లో అప్పు పుట్టని పరిస్థితి. అంతేకాదు ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించకూడదనే నిబంధనకు తోడు ఇటీవల పెరిగిన సిమెంట్, కూలీ ధరలు కూడా లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు సిమెంట్ బస్తా రూ.290 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం ఒక్కో బస్తా ధర (కంపెనీని బట్టి) రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగింది. పెరిగిన ధరలు భారంగా మారనుండటంతో మెజార్టీ లబ్ధిదారులు పిల్లరు గుంతలు, బేస్మెంట్ దశలోనే నిర్మాణాలను నిలిపివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే కొంత మంది మధ్యవర్తులు కొత్తగా ఇళ్లు కట్టుకోవాలని భావించే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు మంజూరు చేయిస్తామని ఆశ చూపించి, వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చదవండి: హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం -
వెంటాడుతున్న తీవ్ర అనారోగ్యం..మారని జీవితం !
జవహర్నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులు, దుర్బర జీవితాలను గడుపుతున్నారు. పిన్న వయస్సులోనే పారిశుద్ధ్య కార్మికులు జబ్బు బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కష్టపడుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 212 ప్రకారం సౌకర్యాలు.. జవహర్నగర్ కార్పొరేషన్లో 130 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. కాగా గ్రామపంచాయితీ ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తున్న సిబ్బందికి మారుతున్న కాలాన్ని బట్టి రోజూవారి వేతనం పెరగడానికి చాలా ఏళ్లు పట్టింది. పారిశుద్ధ్య సిబ్బందికి కనీసవేతనాలు చెల్లించాలని జీవో నెం.212 ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని అనేక ఏళ్లుగా కార్మిక నాయకులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008 డిసెంబర్ నెలలో కాంట్రాక్ట్ కార్మికులకు పాత జీవోను చట్టం చేస్తూ.. కొత్త జీవో ప్రకారం నెలవారీ జీతంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించారు. బ్యాంకుల ద్వారా జీతాలు ఇవ్వాలని, అది నేటికి అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జీవో 65 అమలు.. గత ప్రభుత్వం జీవో 14 ప్రకారం అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం జీవో 65ను అమలు చేస్తోంది. జీవోనెం 60 ప్రకారం వేతనాలు పెంచి, గతంలో కార్మికులకు పెంచిన జీతాలను తగ్గించకుండా వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు.. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారి కుటుంబాల్లో రోజూ ఎవరో ఒకరూ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్యాసకోస వ్యాధులు, ఇన్ఫెక్షన్కు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కార్మికుల జీవితాలకు సరైన భద్రత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు.. జవహర్నగర్ పట్టణంలో పనిచేస్తున్న 130 మంది కారి్మకుల్లో సగానికి పైగా 25 ఏళ్ల సర్వీసు ఉన్నవారే. అందరికీ నిర్దిష్ట పని గంటలు ఉన్నా.. వీరికి వర్తించవు. ఇంతచేసినా.. వీరికి ఇచ్చే వేతనం నామమాత్రమే. కాలానికి అనుగుణంగా కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పట్టణ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ భద్రత కరువు .. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఐదేళ్లపాటు పనిచేసిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే నిబంధన ఉంది. అయితే స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వకపోవడం వల్ల ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రోజూ అడుగుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారు లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలికారి్మకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవిత బీమాను వెంటనే అమలు చేయాలి. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని అనుకున్నాం. కానీ నేటికి ప్రభుత్వం అమలు చేయడంలేదు. ప్రతీ కారి్మకుడికి రూ.26 వేల కనీసం వేతనం చెల్లించాలి. – రాములు, ఎలక్ట్రిషన్, జవహర్నగర్ హెల్త్కార్డులు ఇవ్వాలి.. నిత్యం పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ రోగాలబారిన పడుతున్నాం. కనీస వేతనం లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకులకు హెల్త్కార్డులు ఇచ్చి, ఉచిత వైద్యం అందించాలి.- వెంకటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటమే.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెలబెట్టుకుని కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. కార్పొరేషన్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి పర్మనెంట్ చేయాలి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలను ఆపేదిలేదు. – శివబాబు, రాష్ట్ర మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
అమ్మో.. అపార్ట్మెంట్!!
పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్మెంట్ కొన్న.. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయ్యింది. ఆ సమయంలో కార్పస్ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. అయితే ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్మెంట్ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్ ఫండ్ పరిగణలోకి తీసుకోవటం లేదు. – ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇదీ..నగరంలోని ఓ ఐటీ కంపెనీలో హెడ్గా పనిచేశాను. స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లలకు ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్పల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్ కొన్నా. వీటి కోసం డెవలపర్కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. అందులో ఉన్నంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగళూరుకు బదిలీ అయ్యింది. ఎప్పుడైతే సొసైటీకి అపార్ట్మెంట్ అప్పగించారో రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. జిమ్లోని వస్తువులు మూలనపడ్డాయి. – ఓ ఐటీ ఉద్యోగి వ్యథ ఇదీ.....వీళ్లిద్దరే కాదు గృహ కొనుగోలుదారుల అందరిపైనా వసతుల భారం పడుతుంది. సామాన్యుడి సొంతింటి కలకు నిర్మాణ వ్యయం, స్థలాల ధరలు ఎంత భారం అవుతున్నాయో.. అదే స్థాయిలో వసతుల చార్జీలు భారంగా మారిపోయాయి. క్లబ్హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ పిచ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ పార్క్, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ హాల్, గెస్ట్ రూమ్స్, 7 స్టార్ రెస్టారెంట్.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ ధరలోనే వసతుల చార్జీలు కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్, గ్రీనరీ, పైప్డ్ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు రూ.లక్షలలో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్హౌస్ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము రూ.2–3 లక్షల వరకూ బాదుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఓసీ రాకముందే వసూళ్లు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. కానీ, నిర్మాణ సంస్థలు పట్టించుకోవటం లేదు. పోనీ, ఆయా ప్రభుత్వ విభాగాలైనే నియంత్రిస్తున్నాయా అంటే పట్టించుకునే నాథుడే లేడు. మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్.. అంటూ కొనుగోలుదారుడికి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను కల్పించాడా లేదా అని పర్యవేక్షించే వారే కరువయ్యారు. కానీ, భౌతికంగా ఆయా వసతులను డెవలపర్ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్ అయ్యాక ఇక ఆ అపార్ట్మెంట్కు డెవలపర్కు సంబంధం ఉండదు.👉ఇది చదివారా? వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!వెంచర్లలో రిసార్ట్ అని వసూళ్లు.. ఓపెన్ ప్లాట్లు చేసే బిల్డర్లు కూడా మీము ఏం తక్కువ తిన్నామా అన్నట్లు అపార్ట్మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలో కూడా కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే.. కానీ, బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. వీకెండ్ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్ కోర్స్, క్లబ్హౌస్ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్పేట, షాద్నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెగ ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.🔶ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. ఇందులో ధర చదరపు అడుగు(చ.అ.) రూ.9 వేలకు విక్రయిస్తుంది. 2,050 చ.అ.అపార్ట్మెంట్కు రూ.1,84,50,000 అవుతుంది. ఇక, ఈ అపార్ట్మెంట్లో వసతుల చార్జీలు కింది పట్టికలో చూద్దాం!అపార్ట్మెంట్కు రూ.1,84,50,000 అయితే, వసతులకు చెల్లించాల్సింది రూ.2,92,22,468. వసతులు, అపార్ట్మెంట్ ధర రెండూ కలిపితే రూ.2,13,72,468 అయ్యిందన్నమాట.ఇలా చేస్తే బెటర్.. 🔹 వసతుల కల్పనకు అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయడం సరైంది కాదు. నిర్మాణ సంస్థలు కల్పించే వసతులతో సగానికి పైగా అమినిటీస్ నివాసితులు వినియోగించరు. పైగా ప్రతినెలా నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీల్లోని నివాసితులకు అపార్ట్మెంట్ కొనుగోలు భారంగా మారుతుంది. నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే చేయాలి. 🔹 ప్రాజెక్ట్లో విక్రయాలు పూర్తయ్యాక డెవలపర్ కమ్యూనిటీని హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. అక్కడి నుంచి అందులోని వసతులను నివాసితులే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో బాగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయా వసతుల నిర్వహణ పట్టించుకునే వారే ఉండరు. స్విమ్మింగ్ పూల్ ఎండిపోతుంది. నిర్వహణ లేక జిమ్, ఇతర వసతులు మూలనపడిపోతాయి. 🔹 అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకటే విధంగా ఉండాలి. పెద్ద సైజు గృహాలకు ఎక్కువ రహదారి, డ్రైనేజీ ఎక్కువ నీళ్లు, ఎక్కువ కాంతి వాడుకోలేరు కదా. అందుకే ఎన్ని ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. 🔹 హౌసింగ్ సొసైటీల్లోని క్లబ్హౌస్లను థర్డ్ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్మార్కెట్, మెడికల్ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. 🔹 ఒకటే ఏరియాలో ఉండే 3–4 ప్రాజెక్ట్లకు ఒకటే క్లబ్హౌస్ కట్టుకోవటం ఉత్తమం. దీంతో నిర్మాణ సంస్థకు ఖర్చు ఆదా అవటంతో పాటు నివాసితులకు నిర్వహణ భారం కాదు. -
హైదరాబాద్లో భారీగా రద్దయిన పాత నోట్ల స్వాదీనం
సనత్నగర్(హైదరాబాద్): రద్దయిన కరెన్సీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.99 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.టీవోలీ ఎక్స్ట్రీమ్ థియేటర్ వద్ద రద్దయిన పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్రెడ్డి, గొల్లమందల రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన వీరు మరికొందరితో కలిసి పాత నోట్ల మారి్పడికి యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
summer camps ఆటపాటలతో సమ్మర్ సందడి
వెంకటేశ్వరకాలనీ వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలియని విషయాలను తెలిసేలా... ఆహ్లాదంగా గడిపి వేసవి సెలవులను మరింత ఆనంద జ్ఞాపకాలుగా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం బడుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 80 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్లో అటు కంప్యూటర్ నేర్చుకోవడంతో పాటు ఇటు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. లిటిల్స్టార్ హైస్కూల్, గతి హైసూ్కల్, సెయింట్ ఆల్ఫాన్సెస్ హైసూ్కల్, ప్రాక్టీసింగ్ హైసూ్కల్, పంజగుట్ట పడవ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఈనెల 15వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు.. ఈ సమ్మర్ క్యాంప్ ఉదయం 8నుంచి 11గంటల వరకు ఉంటుందన్నారు. ఈ క్యాంపు ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కంప్యూటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, మెడిటేషన్, ఇంగ్లిష్, సైన్స్లో శిక్షణ ఇస్తున్నారు. గణితం ట్రిక్స్ ఇందులో నేర్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్బాబు ఈ సమ్మర్ క్యాంప్ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనేలా చేసి విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలు స్తున్నారు. సమ్మర్ క్యాంప్ తమకెంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వచ్చే నెలా 10వ తేదీ వరకు పొడిగిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. -
ఉచ్చులోకి దించి.. మాట మార్చి!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, గూఢచర్యం, వీరికి సహాయ సహకారాలు అందించడం కోసం పాకిస్థాన్ తన దేశీయుల్ని భారత్లోకి పంపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ పట్టుబడితే వారిని తమ దేశీయుడని అంగీకరించడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. కొందరిని మాత్రమే తమ జాతీయులని అంగీకరిస్తూ.. మిగిలిన వారితో తమకు సంబంధం లేనట్లు చేతులు దులుపుకొంటోంది. ఈ కారణంగానే 2004లో నమోదైన కేసులో 2013లో అరెస్టు అయి, 2015లో ఆ కేసు వీగిపోయినా 76 ఏళ్ల వయసున్న పాకిస్థానీ షేర్ అలీ కేశ్వానీ ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలో మగ్గుతున్నాడు. ఐఎస్ఐ ఆదేశాలతో వచ్చిన అర్షద్... పాకిస్థాన్లోని రహీమైఖర్ఖాన్ జిల్లా ఖాన్పూర్కు చెందిన అర్షద్ మహమూద్ అలియాస్ అర్షద్ మాలిక్ను 2002 నవంబరులో పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అధికారులు ఫీర్జీ, లియాఖత్ సంప్రదించారు. మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, భారత ఆర్మీ యూనిట్ల సమాచారం అందించడానికి సిద్ధం చేశారు. అర్షద్కు పాకిస్థాన్ పాస్పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ పంపారు. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు అర్షద్ పేరుతో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్రామ్పూర్ మీదుగా కోల్కతా పంపారు. హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని 2003 జూలైలో పాస్పోర్ట్ అందుకున్నాడు. దీంతో సిటీకి వచ్చిన అర్షద్ ముత్యాల్బాగ్లో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారితో తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినంటూ, కోల్కతా నుంచి వచ్చినట్లు చెప్పుకొన్నాడు. 2004లో పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. నగరంలోని భద్రతా బలగాలకు చెందిన సున్నిత ప్రాంతాల్లో తిరిగి, వివరాలు సేకరించే అర్షద్ మాలిక్ రాత్రి వేళల్లో వాటిని ఐఎస్ఐకి పంపేవాడు. కింగ్కోఠి అగర్వాల్ చాంబర్స్లో ఉండే హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా షేర్ చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. 2004 మార్చి 9న హైదరాబాద్ టాస్్కఫోర్స్ పోలీసులు సైబర్ కేఫ్లో ఉన్న అర్షద్ను పట్టుకున్నారు. ఇతడి నుంచి ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు స్వా«దీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసుల ఆ తర్వాత సిట్కు బదిలీ అయింది. ఇతడి విచారణలో వెలుగులోకి .. అర్షద్ విచారణ నేపథ్యంలోనే ఇతడికి షేర్ అలీ కేశ్వానీ అనే పాకిస్థానీ సహకరించినట్లు వెలుగులోకి వచి్చంది. ఇతడిని ఉగ్ర ఫైనాన్షియర్గా మార్చిన పాకిస్థాన్.. భారత్కు పంపింది. ఇక్కడ ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ఆర్థిక సాయం చేస్తున్న కేశ్వానీని ఆగ్రా పోలీసులు 2004 జనవరిలోనే అరెస్టు చేశారు. అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేకపోయారు. అర్షద్కు నాంపల్లి కోర్టు 2009లో జీవితఖైదు విధించింది. కేశ్వానీని నగర పోలీసులు 2013లో ఇక్కడికి తీసుకువచ్చారు. 2015 మార్చి 9న ఇతడిపై ఉన్న కేసు వీగిపోయింది. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే పాకిస్థాన్ సదరు వ్యక్తి తమ పౌరుడే అని అంగీకరించాలి. అర్షద్ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్కు పంపేశారు. కేశ్వానీ విషయంలో ఇలా జరగకపోవడంతో ఇప్పటికీ చర్లపల్లి జైలులోనే ఉన్నాడు. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. సిద్దిక్తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్వర్ధన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
సాక్షి, హైదరాబాద్:: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచి్చన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రోపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచింది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టు అంటూ అందులో ప్రముఖంగా ప్రస్తావించింది. హైదరాబాద్ మెట్రో రైల్కు ఐఎస్బీ, స్టాన్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి ఇప్పటికే సముచితమైన గుర్తింపు లభించింది. మన మెట్రో విజయగాథను పరిశోధనా పత్రాలుగా ప్రచురించాయి.తాజాగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి సారథ్యంలో మెట్రో రైల్ వ్యవస్థ ఒక ప్రముఖ రవాణా వ్యవస్థగానే కాకుండా మౌలిక వసతుల కల్పనలో నూతన ఒరవడిని ప్రదర్శించిందని, పీపీపీ విధానంలో ప్రపంచంలోనే విశేషమైన ప్రాజెక్టుగా అవతరించిందని హార్వర్డ్ వర్సిటీ తన పరిశోధనా పత్రంలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన అనేక సవాళ్లను వ్యూహాత్మకంగా అధిగమిస్తూ, నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పరుగులు తీస్తోందని పేర్కొంది. మెట్రో మ్యాన్గా పేరొందిన ఎన్విఎస్ నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాలను ప్రధానంగా ప్రస్తావించింది.హైదరాబాద్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రొఫెసర్లు, పరిశోధకులు.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్థాపనకు బీజం పడినప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వ ప్రతిపాదనలను, ఆలోచనలను నిర్మాణాత్మకంగా అమలు చేసిన తీరుపై ‘హైదరాబాద్ మెట్రో – ఆలోచన నుంచి అమలు వరకు’అనే ప్రధాన శీర్షికన తమ ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ జర్నల్లో ప్రచురించింది ‘పీపీపీ పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్’అనే ఇతివృత్తంతో చేసిన పరిశోధనను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా తీసుకుంది. ఎన్వీఎస్ కృషి అపూర్వం నగర రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 2006లో ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ప్రాజెక్టుకు ఆలోచన చేశారని పరిశోధన పత్రం తెలిపింది. మేటాస్ పతనం, భూసేకరణ సమస్యలు, అనేక రకాల ఆందోళనలు, రాజకీయ ఒడిదుడుకులు వంటి అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన మెగా ప్రాజెక్టుగా అవతరించిందని పేర్కొంది. హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ ఆవశ్యకతను, ఆ ఆవశ్యకతకు కార్యరూపం ఇచ్చి ఏ విధంగా అమలు చేశారో వివరించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు వచి్చనట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి ఎన్విఎస్ రెడ్డి అనుసరించిన విధానం, చేసిన కృషి అపూర్వమైనదని అభివరి్ణంచింది. విలక్షణమైన ప్రణాళికా తీరు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక విషయాలపై లోతైన అవగాహన, సమస్యలను అధిగమించే నాయకత్వ సామర్థ్యం ఈ ప్రాజెక్టును చరిత్రలో నిలిచిపోయేలా చేశాయని స్పష్టం చేసింది. -
పెరగనున్న ఎండల తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..ఖమ్మంలో అత్యధికంగా 41.4 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.4 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్నగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. శనివారం నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మాత్రం దాదాపు అంతటా గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. -
జుగల్బందీ సూపర్ హిట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవంలో ఈసారి మిస్ వరల్డ్ లిమిటెడ్ చేసిన కొత్త ప్రయోగం బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై తొలుత కాస్త విముఖత ప్రదర్శించిన మిస్ వరల్డ్ సంస్థ తర్వాత ఆమోదించింది. చివరకది మిస్ వరల్డ్ బృందాన్నే బాగా ఆకట్టుకోవడంతో పాటు అనూహ్య స్పందన లభించింది. ఏ నగరంలో జరిగినా.. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో స్థానిక సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటం సహజం.ఇదే తరహాలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో 250 మంది కళాకారులతో తెలంగాణ సంప్రదాయ పేరిణి నృత్య విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇంతవరకు ఎప్పుడూ జరిగే తంతే. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత, మిస్ వరల్డ్ పోటీదారులను వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేస్తారు. కానీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ పరిచయ భాగాన్ని ఒకింత కొత్తగా డిజైన్ చేశారు. పోటీదారులను ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కో బృందం పరిచయానికి పైలట్ తరహాలో ఒక్కో సంప్రదాయ నృత్యరీతిని ప్రదర్శించేలా రూపకల్పన చేశారు. గుస్సాడీ, ఒగ్గు డోలు, లంబాడీ, కొమ్ము కోయ నృత్య కళాకారులను నాలుగు బృందాలుగా చేసి, ఒక్కో ఖండం పోటీదారులను కళాకారులు తమ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించే తరహాలో రూపొందించారు. దీనికి పాశ్చాత్య సంగీతాన్ని కూడా జోడించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వీక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందాల పోటీకి తగ్గట్టుగా ప్రత్యేకంగా పేరిణి గీతం 250 మంది కళాకారులతో సంప్రదాయ పేరిణి నృత్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వినియోగించిన గీతాన్ని అందాల పోటీలను దృష్టిలో ఉంచుకుని రాయించటం విశేషం. ‘అతివల హంస నడకలతో అందమే సాగెనే..లలిత శృతుల గతుల లయల హొయల..అరవిరిసిన కన్నులకు అభినయాల వందనం.. అతి కోమల అధరాలకు అతి సుందర వందనం.. మనసెరిగిన మగువలకు మయూరాల వందనం..’అంటూ సాగిన గీతానికి తగ్గట్టుగా కళాకారులు నర్తించి ఆకట్టుకున్నారు. ఈ విధంగా సంప్రదాయ నృత్యాలతో పోటీదారులను స్వాగతించి పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, పేరిణి సందీప్, ఫణి నారాయణ, శ్రీరాంభట్ల ఆదిత్య శర్మలు శ్లోకంతో కూడిన గీతాలను రచించారని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. -
యువతకు మెంటల్ హెల్తే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ తరం యువతపైన అత్యంత సున్నితమైన సామాజిక బాధ్యతలున్నాయి. వీటిని నెరవేర్చడానికి వారిలో మానసిక పరిపక్వత కీలక అంశం’అని మిస్ బంగ్లాదేశ్ అక్లిమా అతికాకొనికా(Aklima Atika Konika) అన్నారు. ప్రస్తుతమున్న పలు సామాజిక సమస్యలకు పరిష్కారాలన్నీ యూత్ మెంటల్హెల్త్ పైనే ఆధారపడి ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మిస్వర్డల్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన అతికా ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..ఏ సహజత్వమే సౌందర్యం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నాకు ఫ్యాషన్ అంటేనే సరిగ్గా తెలియదు. కంఫర్ట్గా అనిపించే దుస్తులు వేసుకోవడం, ఎవరైనా పలకరించినా స్పందించలేని మొహమాటం ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సెన్స్ లేదు. అలాంటిది అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా దృష్టిలో బ్యూటీ అంటే సహజత్వం. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే వారి సౌందర్యానికి మెరుగులద్దుతుంది. అత్యంత సహజత్వమే సౌందర్యంగా కనిపిస్తుందని నేను నమ్ముతా.ఏ భారత్లో సాంస్కృతిక వైవిధ్యం భారత్ ఒక అద్భుత సాంస్కృతిక సమ్మేళనం. ఢిల్లీ వెళితే ఒకలా, చెన్నై, లడక్ వెళితే మరోలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతిక వైవిధ్యం. భారత్ మొత్తం తిరిగితే చాలు ప్రపంచం తిరిగినట్టే. కోల్కతా (బెంగాల్) వెళితే మా దేశ మూలాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. హైదరాబాద్ (Hyderabad) అయితే మినీ ఇండియా. దేశంలోని ప్రత్యేకతలన్నీ ఇక్కడే ఆతిథ్యమిస్తాయి. నాకు మరో ఇల్లులా అనిపిస్తుంది హైదరాబాద్. తెలంగాణ ప్రజల ఆతీ్మయత నా మనసు దోచుకుంది. నేను మంచి భోజన ప్రియురాలిని. నాకు నచి్చనట్టు ఇక్కడ స్పైసీ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడి వారసత్వ వంటకాలు చాలా బాగున్నాయి. ఏ యంగ్ మైండ్ మ్యాటర్స్ మానసిక ఆరోగ్యం.. మానసిక పరిపక్వత ఈ తరం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఇందులో భాగంగానే యువత మెంటల్ హెల్త్పై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ‘యంగ్ మైండ్ మ్యాటర్స్’ అనే ప్రాజెక్ట్ చేపట్టా. భారత్లో పరిస్థితులు చెప్పలేను కానీ.. ఆసియా దేశాల్లో యువత మానసిక అస్థిరత, మెంటల్ హెల్త్ గురించి ఎవరూ అంతగా ప్రస్తావించట్లేదు. దీనితో ముడిపడి ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. తమపైన తమకు విశ్వాసం ఉన్నప్పుడే మిగతా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నేను ప్రపంచ సుందరి విజేతగా నిలిస్తే.. నా గుర్తింపు, ప్రశస్తిని అంతర్జాతీయంగా యూత్ మెంటల్ హెల్త్పై అవగాహన కల్పించడానికి, దానితో ముడిపడి ఉన్న అంశాల కార్యాచరణకు వినియోగిస్తాను. ఏ అపురూప స్నేహం భారత్–బంగ్లా మా దేశ యువతలో నైపుణ్యాలకు కొదువ లేదు. ఎన్నో విషయాలను బయటికొచ్చి నేర్చుకుంటున్నాం. గతేడాది మా దేశ యువత చేపట్టిన స్టూడెంట్ రెవల్యూషన్ నాకు స్ఫూర్తి. ఒక బంగ్లా అమ్మాయిగా మా యువత తరఫున ప్రపంచానికి మా ప్రశస్తిని చూపించే బాధ్యత నాపై ఉంది. ఆ ఆశయంతోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నాను. వినయం లేకుండా విజయం ఉండదని గట్టిగా నమ్ముతాను. భారత్–బంగ్లాదేశ్లది స్నేహపూర్వక సంబంధం. రాజకీయంగా, ఆర్థిక పరమైన అంశాల్లో అనుబంధంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడి ప్రజల ప్రేమ నాకెప్పుడూ గుర్తుండిపోతుంది. ఏ ఎన్నో దాటుకొని వచ్చాను నేనూ ఒక మనిషినే. అందరిలానే విభిన్న అనుభవాలు, బాధాకరమైన సందర్భాలను దాటుకొని వచ్చాను. నన్ను నేను సముదాయించుకోవడానికి, ఒత్తిడి పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తాను. ప్రకృతి ప్రేమికురాలిని. ప్రకృతికి మన మానసిక అనిశి్చతి, అస్థిరత్వాన్ని తొలగించే శక్తి ఉంది. నాకు ఏ మాత్రం బాగాలేకున్నా ప్రకృతిలోకి వెళతాను. నాకు నేను సమయం ఇచ్చుకుంటా. సాధారణంగా మాట్లాడటమే నాకున్న పెద్ద చాలెంజ్. అలాంటిది ఇప్పుడు మిస్వరల్డ్ వేదికపైన మాట్లాడగలుగుతున్నానంటే అది నా పరిణామ క్రమమే. మహిళలు బయటికెళ్లి ఉద్యోగం, వ్యాపారం ఇంకేదైనా చేయడమే సాధికారత అని అనుకోను. ఒక మహిళ తనకు నచి్చన రంగంలో తన అభిరుచులకు అనుగుణంగా రాణించడమే సాధికారత అని నమ్ముతాను. -
అర్హతలో బాలికలు.. ర్యాంకుల్లో బాలురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)లో బాలికలే పైచేయి సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో మాత్రం బాలురే ముందు వరుసలో ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో టాప్ ర్యాంకులు అత్యధికంగా బాలురకే దక్కాయి. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 73.26 శాతం అర్హత సాధిస్తే, అగ్రి, ఫార్మసీ సెట్లో 87.82 శాతం మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్రెడ్డి, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్కుమార్ తదితరులు హాజరయ్యారు. టాపర్లంతా బాలురే ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సెట్కు 2,20,326 మంది దరఖాస్తు చేసుకుంటే, 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,51,779 మంది (73.26 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 86,762 మంది దరఖాస్తు చేసుకుంటే, 81,198 మంది పరీక్ష రాశారు. వీరిలో 71,309 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ సెట్లో బాలికలు 73.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 72.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అగ్రి, ఫార్మసీ సెట్లో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం అర్హత సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో ఎక్కువగా బాలురే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్లో మొదటి పది ర్యాంకులు బాలురకే దక్కాయి. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురంకు చెందిన పల్లా భరత్చంద్ర మొదటి ర్యాంకు దక్కించుకుంటే, హైదరాబాద్కు చెందిన ఉడగండ్ల రమాచరణ్రెడ్డి రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడో ర్యాంకు కూడా ఏపీకి చెందిన పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్కు వచ్చింది. నాన్–లోకల్ కోటాను ఈ ఏడాది నుంచి ఎత్తివేయటంతో ఏపీకి చెందిన విద్యార్థులు సెట్ రాయడం వరకే అర్హులు. వారికి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించరు. అగ్రి, ఫార్మసీ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో 9 ర్యాంకులు బాలురకే దక్కాయి. హైదరాబాద్కు చెందిన సాకేత్రెడ్డి మొదటి స్థానం పొందారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బ్రాహ్మిణి రెండ్ల ఐదవ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకర్లు....డాక్టర్గా పేద ప్రజలకు సేవ చేయాలని ఉంది డాక్టర్గా పేద ప్రజలు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా మంచి ర్యాంక్ ఆశిస్తున్నా. తల్లిదండ్రుల, అధ్యాపకులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించగలిగా. – సాకేత్రెడ్డి, 1వ ర్యాంకర్డాక్టర్ కావాలన్నదే లక్ష్యం కష్టపడి చదవటం వల్లే మూడో ర్యాంక్ సాధించగలిగాను. సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్ బైపీసీలో 992 మార్కులు వచ్చాయి. ఇటీవల ‘నీట్’పరీక్ష రాశాను. మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ ఫలితాలు విడుదలయ్యాక ఎంబీబీఎస్లో చేరతాను. – చాడా అక్షిత్, 3వ ర్యాంకర్గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుంటా ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. నేను ప్రతి రోజూ 16 గంటలు చదివాను. ఇందులో మంచి ర్యాంక్ వచి్చనప్పటికీ నా దృష్టి మొత్తం నీట్పైనే ఉంది. గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. – సాయినంద్, 4వ ర్యాంకర్మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేస్తా మెడిసిన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించాను. అధ్యాపకులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. –బ్రాహ్మిణి రెండ్ల, 5వ ర్యాంకర్,వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో ర్యాంకు సాధించగలిగా. నీట్లో కూడా మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. – గుమ్మడిదల తేజస్, 6వ ర్యాంకర్డాక్టర్ కావడం నా కల డాక్టర్ కావడం నా కల. వైద్య వృత్తిలో చేరి పేద ప్రజలకు సేవ చేస్తా. నీట్లో సైతం మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికాబద్ధంగా చదవడంవల్లే మంచి ర్యాంక్ సాధించగలిగాను. – కొలను అఖీరానంద్రెడ్డి, 7వ ర్యాంకర్పేదలకు వైద్య సేవలు అందిస్తా డాక్టర్గా మారి పేదలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా టాప్ టెన్్త ర్యాంక్ ఆశిస్తున్నా. మెదటి నుంచి డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. ఆ దిశలోనే పట్టుదలతో చదివా. ఆసక్తి లేకపోయినా కళాశాల అధ్యాపకుల సలహాతోనే టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాశాను. నీట్ పరీక్ష అంతకంటే బాగా రాశాను. అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించగలిగాను. – భానుప్రకాష్రెడ్డి, 8వ ర్యాంకర్ ఇంజనీరింగ్ ర్యాంకర్లు...ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. ఎంసెట్లో 2వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల గైడెన్స్తో ర్యాంకు సాధించగలిగా. – ఉడగండ్ల రామచరణ్రెడ్డి, 2వ ర్యాంకర్ సివిల్ సర్వీసెస్ టార్గెట్ సివిల్ సర్వీసెస్ సాధించటం నా లక్ష్యం. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలని ఉంది. ఇటీవల జేఈఈ మెయిన్లో జనరల్ కేటగిరీ 75వ ర్యాంక్, ఓబీసీలో 10వ ర్యాంక్ సాధించా. ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్కు సిద్ధమవుతా. – సూర్యకార్తీక్, 3వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా ఐఐటీ బాంబేలో సీటు సాధించడం లక్ష్యం. జేఈఈ మెయిన్లో 70వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంక్ సాధించగలిగా. ఐఐటీ తర్వాత సివిల్ సర్వీసెస్కు సిద్ధం కావాలని ఉంది. – లక్ష్మీ భార్గవ్, 4వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో చేరటమే లక్ష్యం ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదవటమే నా లక్ష్యం. ప్రస్తుతం ఈఏపీ సెట్లో 5వ ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. ఈ పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా చదివాను. – వెంకటగణేష్ రాయల్, 5వ ర్యాంకర్భవిష్యత్లో సివిల్స్కు ప్రిపేరవుతా ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. నా అసలు లక్ష్యం సివిల్స్ సాధించటం. భవిష్యత్లో సివిల్స్కు ప్రిపేరవుతా. నా సోదరి కూడా సివిల్స్ సాధించింది. ఇటీవల జేఈఈ మెయిన్లో ఆలిండియా 31వ ర్యాంక్ సాధించా. ఓబీసీ కేటగిరీలో మూడో ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్కు సీరియస్గా చదువుతున్నాను. –రుస్మిత్ బండారి, 7వ ర్యాంకర్తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది ఈఏపీ సెట్లో ర్యాంక్ సాధించడానికి దేవుడి దయ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మంచి ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. కళాశాల ప్రిన్సిపాల్, డీన్ పూర్తి సహకారం అందించారు. – అర్జా శామ్యూల్ సాత్విక్, 9 ర్యాంకర్డాక్టర్ కావటమే లక్ష్యం డాక్టర్ కావటమే నా లక్ష్యం. అందుకోసం కష్టపడి చదివాను. దిల్సుఖ్నగర్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాను. నీట్ కోసం శిక్షణ తీసుకుంటూనే ఈఏపీ సెట్ రాశాను. – శశికిరణ్, 10వ ర్యాంకర్ -
మహాద్భుతం.. బుద్ధవనం
రెండు వేల సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, ఇక్కడ విలసిల్లిన బౌద్ధమత ప్రాచుర్యం ఆధారంగా కృష్ణా తీరంలో (నాగార్జునసాగర్ తీరంలో) బుద్ధిస్టు హెరిటేజ్ థీం పార్కును బుద్ధవనం (Buddhavanam) ప్రాజెక్టుగా మహాద్భుతంగా తీర్చిదిద్దారు. అభినవ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఆ చరిత్ర ఆధారంగానే సాగర్ తీరంలో 274 ఎకరాల్లో బుద్ధవనం (శ్రీపర్వతారామం), 30 ఎకరాల్లో విపశ్యన కేంద్రం నిర్మించారు. అష్టాంగ విభాగాలుగా దీని నిర్మాణం చేశారు. ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన అతిపెద్ద మహాసూ్థపం బుద్ధవనం.ఈ నెల 12వ తేదీన బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి వెల్లంకిలో కొంతసేపు సేద దీరి, నాగార్జునసాగర్కు చేరుకుంటారు. విజయవిహార్ అతిథిగృహంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. విజయవిహార్ ముందు ఏర్పాటు చేసిన ఫొటో సెషన్లో పాల్గొంటారు. అనంతరం విజయవిహార్ వెనుకభాగంలో, సాగర్ తీరాన పచ్చిక బయళ్లలో వారు ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. ఆ తరువాత బుద్ధవనం చేరుకుంటారు. బుద్ధుని పాదుకల వద్ద 25 మంది బౌద్ధ సన్యాసులు నిర్వహించే బౌలికుప్ప మహాబోధి పూజల్లో పాల్గొంటారు. అక్కడినుంచి మహాసూ్థపం వద్దకు చేరుకొని, వెనుక భాగాన ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కుతారు. దానికి వంద అడుగుల దూరంలో ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాన్ని తిలకిస్తారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలో అష్టబుద్ధుల వద్దకు చేరుకొని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా బౌద్ధమత గురువు నిర్వహించే 5 నిమిషాల ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం రెండు నిమిషాల పాటు «ధ్యానం చేస్తారు. అక్కడి నుంచి మహాస్థూపం చూట్టూ ఉన్న 2,500 విగ్రహాల గురించి పర్యాటక శాఖ ప్రతినిధి శివనాగిరెడ్డి వివరిస్తారు. అనంతరం జాతకవనంలోకి వెళతారు. అక్కడ వారికి బుద్ధవనం, తెలంగాణలో బౌద్ధ చరిత్ర ప్రాధాన్యత గురించి పర్యాటక శాఖ ప్రతినిధి వివరిస్తారు. బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ప్రత్యేక డ్రామాను ప్రదర్శిస్తారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండబుద్ధుని జీవిత విశేషాలు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2003లో దీనిని ప్రారంభించింది. సిద్ధార్థ గౌతముని జీవితంలోని ప్రధాన ఘట్టాలను వర్ణించే అనేక నేపథ్య విభాగాలతో కూడినదే బుద్ధవనం. ఆయన పూర్వ జన్మ కథలను చిత్రీకరించిన జాతక పార్క్, సూక్ష్మ స్థూపాలతో కూడిన స్థూపపార్క్, మహాసూ్థపం, బౌద్ధ హెరిటేజ్ మ్యూజియం, మహాసూ్థపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం, 27 అడుగుల బుద్ధ విగ్రహం ఇందులో ఏర్పాటు చేశారు. ధమ్మ గంటను శ్రీలంక ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిది.ప్రవేశ వేదిక ప్రవేశ వేదిక అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నలు, ఐకానిక్ రూపంలో బుద్ధుడు, జంతువులు, పక్షులు, బోధి వృక్షం, మిథునాలు (రసిక జంటలు), బుద్ధపాదాలు వంటివి ఇక్కడ ఉంటాయి. ప్రధాన ఇతివత్తాలు, సిద్ధార్థుని కిరీటం (జుట్టు) మోస్తున్న అగ్ని స్తంభం, నాగముచిలింద, పవిత్ర అవశేషాల ఆరాధన, మధ్యలో అశోక ధర్మ చక్రం స్తంభంతో శక్తివంతమైన విల్లును మోస్తున్న సిద్ధార్థుడు వంటి శిల్పాలు ఉంటాయి. బుద్ధ చరిత్రవనం సిద్ధార్థ గౌతమ జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలు ఉన్నాయి. అవి జననం, నాలుగు సమావేశాలు, మహా నిష్క్రమణ, జ్ఞానోదయం. బుద్ధుని మొదటి ఉపన్యాసం, మహాపరినిర్వాణం వంటి అంశాలపై చిత్రాలను కాంస్యంతో చేశారు. పల్నాడు సున్నపు రాయిలో చెక్కబడిన బుద్ధపాద స్లాబ్ అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నాలు ఉద్యానవన ప్రవేశ ద్వారం వద్ద ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. జాతక వనం (బోధిసత్వ పార్క్) బోధిసత్వుడు బుద్ధుడిగా మారటానికి ముందు పది పరిపూర్ణతలను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతాడు. వాటినే దశపారమిత అంటారు. అవి దాన (ఉదారత), శీల (ధర్మం), శాంతి (సహనం), వీర్య (ధైర్యం), ధ్యాన (ఏకాగ్రత), ప్రజ్ఞ (జ్ఞానం), త్యాగ (త్యజించడం), సత్య (సత్యం), కరుణ (ప్రేమపూర్వక దయ), సమత (సమానత్వం). 547 జాతక కథలలో 40 జాతక కథలు అమరావతి, ఫణిగిరి, నాగర్జునకొండ, గోలి, జగ్గయ్యపేట, చందవరం బౌద్ధ క్షేత్రాలలోని అసలు శిల్పకళా ఫలకాల ఆధారంగా పల్నాడు లైమ్ స్టోన్లో చిత్రీకరించారు. ధ్యానవనం (మెడిటేషన్ పార్క్) 27 అడుగుల అవుకాన బుద్ధను ధ్యానవనంలో ఏర్పా టు చేశారు. దీనిని శ్రీలంక ప్రభుత్వం అందజేసింది. స్తూపవనం (మినియేచర్ స్తూప పార్క్) కర్లా, అజంతా (మహారాష్ట్ర), సాంచి (మధ్యప్రదేశ్), సారనాథ్ (ఉత్తరప్రదేశ్), మంకియాలా, (పంజాబ్– పాకిస్తాన్), అనురాధపుర, శ్రీలంక, కహు–జో–దారో, మిర్పూర్ ఖాస్, పాకిస్తాన్, బౌధానాత్, మహాత్రాస్తాన్, నేపాల్లోని స్థూపాల ప్రతిరూపాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. థాయ్లాండ్, పార్డో కాలింగ్ చోర్టెన్ టిబెట్, శ్వేసాండావ్– మయన్మార్, గ్యాంగ్జు, దక్షిణ కొరియా, భారతదేశం, ఆగ్నేయాసియాలోని బౌద్ధ స్థూప నిర్మాణాల రూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మహాస్తూపం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. అమరావతిలోని అసలు స్థూపం కొలతలు, వాస్తుశిల్పం ప్రకారం దీనిని నిర్మించారు. దాని పైభాగంలో వేదిక (డ్రమ్), గోపురం (అండ), హారి్మక ఉన్నాయి. 42 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో దాని డ్రమ్, గోపురం భాగాలపై బౌద్ధ ఇతివృత్తాల శిల్ప ఫలకాలతో ఏర్పాటు చేశారు. మహాస్తూపం చుట్టూ గోడపై బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన రాజులు, ధర్మ పోషకుల దశ్యాలు ఉంటాయి. గోపుర భాగంపై వజ్రాసన, బోధి వక్షం, అగ్ని స్తంభం, జాతక కథలు, బుద్ధుని జీవితంలోని సంఘటనలు వంటి బౌద్ధ చిహ్నలను వర్ణించే శిల్పాలు చెక్కారు. స్థూపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం ఉంటుంది. మహాస్థూపం లోపల వర్చువల్ ఆకాశ దృశ్యం మహాసూ్థపం లోపల 25 అడుగుల ఎత్తులో పంచధ్యాన బుద్ధులను ఏర్పాటు చేశారు. మహాస్తూపం పైకప్పు ఆకాశాన్ని తలిపిస్తూ తామరపువ్వు రేకుల ఆకారంలో ఉంటుంది. పైకప్పు లోపలి భాగం చిల్లులు గల ట్రాపెజోయిడల్ ప్యానెల్లతో ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కటి మరొకదానికి భిన్నంగా 2.5 మీటర్ల పరిమాణంలో, కాంతి థర్మోడైనమిక్స్, ప్రత్యేక ప్రకాశాన్ని జోడించేలా ఉంటాయి. ఇందులో లోటస్ రేకులు (960), స్కై ప్యానెల్లు (528) ఉంటాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఉపయోగించిన జర్మన్ టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేశారు. బుద్ధవనానికి అవార్డులు విశిష్ట ఆకర్షణలతో కూడిన ఈ ప్రాజెక్టుకు అనేక అవార్డులు లభించాయి. పర్యాటకులకు ఉత్తమ పౌర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించినందుకు తెలంగాణ పర్యాటక శాఖ 2022లో అవార్డును అందజేసింది. దీనిపై నిర్మించిన డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డును అందుకుంది. 2022లో కోల్కతాలో బౌద్ధ టూర్ ఆపరేటర్ల సంఘం ‘భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ నేపాల్ టూరిజం మిత్ర అవార్డు’ను కూడా అందుకుంది. బౌద్ధ వారసత్వ ప్రాంగణం బుద్ధవనం తెలంగాణలో బౌద్ధమతం ఆగమనం బుద్ధుని జీవితకాలం నాటిది. సుత్తనిపాత పారాయణవగ్గ ప్రకారం ‘కవిట్టవనమిష్టి గోదావరి రివేరిన్’అనే బ్రాహ్మణ ఋషి బుద్ధుని బోధనలను వినడానికి తన 16 మంది శిష్యులను మగధకు పంపాడు. బుద్ధుని అనుచరులుగా మారిన పింగియా.. బుద్ధుని బోధనలను తీసుకువచ్చారు. అప్పటినుంచి నుంచి తెలంగాణలో థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు విస్తరించాయి. అస్సీఘాట్, కోటిలింగాల, కంబాలపల్లి, పాశిగావ్, ధూళికట్ట, ఫణిగిరి, తిరుమలగిరి, వర్ధమానుకోట, గాజులబండ, నేలకొండపల్లి, శ్రీపర్వతం ప్రాంతాల్లో (నాగార్జునసాగర్ ప్రాంతం) బౌద్ధమతం మూడు దశల్లో పరిఢవిల్లింది. -
నేడు సాగర్.. రేపు చార్మినార్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్ (Nagarjunasagar) సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్కు బయలుదేరతారు. చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ (Hyderabad) ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్కు ఆర్డర్ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. -
మన భాషలోనే.. ఆటాడుకుందాం
వీడియో గేమ్స్... పిల్లల దగ్గరి నుంచీ యువత వరకూ వీటి క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆట మొదలుపెట్టారంటే సమయమే తెలీదు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది గేమర్స్ ఏకంగా 39,000 కోట్ల గంటలు మొబైల్లో గడిపారంటే అతిశయోక్తి కాదు. మొబైల్ గేమ్స్ క్రేజ్ అంతలా విస్తరించింది. 2024లో ప్రపంచ వ్యాప్తంగా సగటున నిమిషానికి 94,000 డౌన్ లోడ్స్ జరిగాయి. మనదేశం కూడా ఇందుకు ఏమీ తీసిపోలేదు. గత ఏడాది కొత్తగా 821 కోట్ల డౌన్ లోడ్స్ అయ్యాయి. 5,729 కోట్ల గంటలపాటు మొబైల్ గేమ్స్ ఆడారు. యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి డెవలపర్లు హిందీ సహా తెలుగు, తమిళం వంటి స్థానిక భాషల్లో గేమ్స్ను పరిచయం చేస్తుండడం జోష్ను పెంచుతోంది.భారీగా యాడ్స్ మొబైల్ గేమ్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2024లో 5,04,576 కోట్ల యాడ్స్ యూజర్ల స్క్రీన్ పై దర్శనమిచ్చాయి. దీనిని బట్టి.. ఈ గేమ్స్కి ఎంత ఆదరణ ఉందో, వివిధ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే 2024లో గేమర్స్ 12% అధికంగా 3.5 లక్షల కోట్ల సెషన్స్ పూర్తి చేశారు. గేమ్స్లో మరిన్ని ఫీచర్లు, దశలు, ప్రీమియం కంటెంట్ కోసం యూజర్లు వెచ్చించిన (ఇన్ యాప్ పర్చేజ్) మొత్తం రూ.6,95,360 కోట్లు. ఇలా డెవలపర్లు అందుకున్న ఆదాయం 2024లో 3.8% పెరిగింది.స్థానిక భాషల్లో 70% భారత్లో సుమారు 55 కోట్ల మంది గేమింగ్ యూజర్లు ఉన్నారు. వీరిలో 70% మంది స్థానిక భాషల్లో గేమ్స్ను ఇష్టపడుతున్నారు. కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా ప్రాంతీయ భాషల్లో గేమ్స్ను అందుబాటులోకి తెచ్చాయి. 2024లో భారత్లో టాప్–10లో స్థానం సంపాదించిన మొబైల్ గేమ్స్లో చాలావరకు హిందీ సహా దేశీయ భాషల్లో ఆడుకునే సౌలభ్యం ఉంది.⇒ ‘లుడో కింగ్’ గేమ్ని ప్రస్తుతం తెలుగు, హిందీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళంలో ఆడుకునే అవకాశం ఉంది. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ బెంగాలీ, హిందీ, ఉర్దూలో ఆడేయొచ్చు. క్యాండీ క్రష్ సాగా బెంగాలీ, హిందీ, ఉర్దూలోనూ అందుబాటులో ఉంది.⇒ తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, ఒడియా, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో గేమ్స్ను తేవడం వల్ల యూజర్లు కొనసాగడంతోపాటు, సంతృప్తి చెందుతారన్నది కంపెనీల మాట. దేశీయంగా విజయవంతం కావాలంటే ఈ విధానం తప్పదని చెబుతున్నాయి.సింహభాగం యాపిల్ యూజర్స్మొత్తం డౌన్ లోడ్స్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా 4,120 కోట్లు, మిగిలినవి యాపిల్ ఫోన్స్ ద్వారా జరిగాయి. అయితే ఇన్ యాప్ పర్చేజ్ ద్వారా యాపిల్ యూజర్లు అత్యధికంగా రూ.4,51,136 కోట్లు ఖర్చు చేయడం విశేషం. డౌన్ లోడ్స్, డెవలపర్లకు ఆదాయం పరంగా యూఎస్ఏ టాప్లో ఉంది. రూ.8,480 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించిన యాప్స్ పదేళ్ల క్రితం 2 ఉంటే.. గత ఏడాది వీటి సంఖ్య 11కు దూసుకెళ్లింది. ఇక భారత్లో డౌన్ లోడ్స్లో సిమ్యులేషన్ , ఆర్కేడ్, పజిల్, టేబుల్ టాప్, యాక్షన్ విభాగాలు టాప్–5లో నిలిచాయి. డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికల్స్ సిమ్యులేటర్ 3డీ, ఇన్ యాప్ పర్చేజ్లో ఫ్రీ ఫైర్ గేమ్ తొలి స్థానంలో ఉన్నాయి.గేమింగ్ హైలైట్స్⇒ భారత్లో సులభంగా ఆడగలిగే వీడియో గేమ్స్ (హైపర్ క్యాజువల్) 2,000 కోట్ల డౌన్ లోడ్స్ నమోదయ్యాయి.⇒ ప్రతి సెకనుకు 1,60,000 యాడ్స్ ప్రత్యక్షమయ్యాయి. గేమ్స్కు వెచ్చించిన సమయం గత ఏడాది 7.9% పెరిగింది. ⇒ 2020లో కరోనా మహమ్మారి కాలంలో ఏకంగా 5,760 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి.⇒ డెవలపర్లు అత్యధికంగా 2021లో రూ.7,41,152 కోట్లు ఆర్జించారు. -
‘మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలాన్ని వాడటం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎంతవరకూ కరెక్ట్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈటెల మాట్లాడిన మాటలు ఎంపీ స్థాయి మాటల్లా లేవని, గంజాయి తాగిన వ్యక్తి మాటల్లా ఉన్నాయంటూ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి.. ‘ నేను తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టా. మీకేనా తిట్టడం వచ్చింది.. మాకు రాదా?, మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఈటెల ఏరోజైనా సీఎంను కలిసి తన పార్లమెంట్ సమస్యల గురించి అడిగారా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ఏదో ఫ్రస్టేషన్ లో ఈటెల మాట్లాడుతున్నట్లు ఉందని, సీఎంను తనకు పోస్ట్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఉందన్నారు.ఈటెల పరిధి దాటి మాట్లాడాడు కాబట్టే తాను కూడా మాట్లాడుతున్నానన్నారు జగ్గారెడ్డి. ఆయన పెద్ద తోపేంద కాదని, పెద్ద పర్సనాలిటీ అని ఈటెల తనకు తానే ఊహించుకుంటున్నారని విమర్శించారు. గౌరవ ప్రదమైన విమర్శలు చేస్తే తప్పులేదు కానీ, ఈ తరహా వ్యాఖ్యలు సీఎంపై చేస్తారా అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెచ్చే తెలివి లేదు కానీ ఉద్దెర విమర్శలు ఎందుకన్నారు జగ్గారెడ్డి.సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్కాంగ్రెస్ ప్రభుత్వం తలాతోకా లేకుండా వ్యవహరిస్తోందని, ఇదిలాగే ఉంటే ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ హెచ్చరించారు. 'ఇది తుగ్లక్ ప్రభుత్వం, సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్, సైకోవి కాబట్టి ప్రజలను ఏడిపి స్తున్నావు. మిస్టర్ ముఖ్యమంత్రి నీ కింద ఏం జరుగుతుందో సోయిపెట్టు. నీ కింది అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టు. ప్రజల జోలికి వస్తే ఖబడ్డార్' అని హెచ్చరించారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అపార్ట్మెంట్లు కూలగొడతామంటూ హైడ్రా నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'సీఎంకు, ఎమ్మెల్యేకు, మంత్రికి ఇక్కడికి వచ్చే ముఖం లేదు. దమ్ముంటే రమ్మని చెప్పండి. మేము హైడ్రాకు, చెరువుల పునరు ద్ధరణకు, మూసీలో కొబ్బరినీళ్ల వంటి నీళ్లను పారించడానికి వ్యతిరేకం కాదు. అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకం'అని స్పష్టంచేశారు. -
TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్తో చెక్ చేస్కోండిలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్కే వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.ఇంజనీరింగ్లో ఏపీకి చెందిన భరత్చంద్ర ఫస్ట్ ర్యాంక్, రామ్చరణ్రెడ్డి(రంగారెడ్డికి) సెకండ్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్కు చెందిన సాకేత్ ఫస్ట్ ర్యాంక్, లలిత్ వరేణ్య(కరీంనగర్) రెండో ర్యాంక్ సాధించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది.. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది హాజరయ్యారు.విద్యార్థులు తమ ఎప్సెట్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇👉TG EAPCET 2025 Results Direct Links👉TG EAPCET Engineering Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Engineering-Results-2025.html👉TG EAPCET Agriculture and Pharmacy Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Agriculture-pharmacy-Results-2025.html -
‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Outer Ring Road: కారు దగ్ధం.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులూ మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్బండ్ బహదూర్పురా ప్రాంతం హెచ్బీ కాలనీలో నివాసం ఉండే రితేష్ కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో తన స్నేహితులైన నగరంలోని వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్కు చెందిన ప్రియాష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులు తేరుకునేలోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనమయ్యారు. కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్ మిఠల్ను అతికష్టమ్మీద బయటికి తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెల్లికి చెందిన ఆలూరి భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యారి్థనులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన మాత్రమే ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ.. శనివారం తన గదిలోని ఫ్యాన్కు ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి విద్యార్థినులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని భావన ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఏసీపీ రాజు, సీఐ జగదీశ్లు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా మారింది గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రూ.70 లక్షల లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్లోని ఇన్కమ్ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. -
దేశం యూనిట్గా నేరస్తుల చిట్టా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం.. హద్దుమీరుతున్న ఉగ్రవాదం.. పెట్రేగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలు.. దోపిడీలు, దొమ్మీలు.. వీటన్నింటినీ అరికట్టేందుకు హోంశాఖ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నూటికి నూరు శాతం వినియోగంలోకి తెస్తోంది. గతంలో ఇంట్రానెట్, ఈ–కాప్స్ల ద్వారా పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, నేరపరిశోధనలను సరళీకృతం చేసిన హోంశాఖ.. దేశం యూనిట్గా నేరస్తుల చిట్టాను రూపొందించడంపై దృష్టి సారించింది. ఇప్పటికే క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ద్వారా నేరాల వారీగా నిందితుల జాబితాను సిద్ధం చేసి ఏ మూలన నేరం జరిగినా వివరాలు కనుక్కునే విధంగా నెట్వర్క్ రూపొందించింది. రాష్ట్రాల వారీగా ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, సీసీఎస్, టాస్్కఫోర్స్ తదితర నిఘా విభాగాలు సంయుక్తంగా కార్యాచరణను అమలు చేస్తున్నాయి.కాగా ఇటీవలి సంఘటనల నేపథ్యంలో కరడుగట్టిన నేరస్తుల జాబితా దేశం యూనిట్గా రూపొందించడంపైనా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. అయితే సీసీటీఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తేనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు. సీసీటీఎన్ఎస్ ఎప్పటి నుంచి..?క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అమలుపై మొదటి సమావేశం 2009 జూన్ 19న అప్పటి నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) జాయింట్ డైరెక్టర్ పి.ఆర్.కె.నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. సీసీటీఎన్ఎస్ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) స్పందించి ఆమోదించగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది. వెంటనే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్ట్ అన్ని స్థాయిల్లో .. ముఖ్యంగా పోలీస్స్టేషన్ స్థాయిలో ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించి పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పని చేస్తోంది. దశల వారీగా 2021 జూలై 1 నాటికి, దేశవ్యాప్తంగా 16,276 పోలీస్స్టేషన్లలో (పీఎస్లలో)15,735 (97 శాతం) పోలీస్స్టేషన్లలో కనెక్టివిటీ అందించారు. 2019 జూన్ 30 నుంచి 2021 జూన్ 30 వరకు నేషనల్ డేటాబేస్ దాదాపు 28 కోట్ల రికార్డులకు పెరగ్గా, డిజిటల్ పోలీస్ పోర్టల్ను మాస్టర్ పోలీస్ పోర్టల్గా మార్చారు. వేలిముద్రల నిల్వ, సామర్థ్యాన్ని మెరుగుపరచి పోలీసు దర్యాప్తుల్లో సీసీటీఎన్ఎస్ సిస్టమ్ గేమ్ ఛేంజర్గా మారింది. సీసీటీఎన్ఎస్లో తెలంగాణ భేష్నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్(ఎన్సీఆర్బీ)–2022 ప్రకారం దేశంలోని 17,535 పోలీస్స్టేషన్లకు 17,082 (97.41 శాతం) పీఎస్లలో క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అమలవుతోంది. దేశంలోని 36 రాష్ట్రాలు/యూటీలలో 14 రాష్ట్రాలలో 90 శాతానికి పైగా విజయవంతంగా సీసీటీఎన్ఎస్ అమలవుతున్న 16 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. సీసీటీఎన్ఎస్ విధానం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రతి మూడునెలలకోసారి సమీక్ష జరిపి నివేదిక రూపొందిస్తోంది. నేరం ఎక్కడ జరిగినా, ఎంతపెద్ద నేరమైనా, ఆ నేరస్తుడు పాతవాడే అయినా ఆ విషయాన్ని తెలుసుకోవడం గతంలో కష్టంగా ఉండేది. ఇప్పుడలా కాకుండా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా నేరస్తులను పోల్చుకునే విధంగా వివిధ రకాల నేరస్తుల వివరాలు, ఫొటోలతో సహా డేటాబేస్ సిస్టంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇలాచేస్తే సీసీటీఎన్ఎస్ సిస్టం, ఊహాచిత్రాల ద్వారా నేరస్తుల కోసం వెతకకుండా నేరుగా డేటాబేస్లో పొందుపరచిన ఫొటోలలోనే గుర్తించి దేశంలో ఎక్కడున్నా పట్టుకునే అవకాశం ఏర్పడిందని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కొత్త నేరస్తుల వివరాలు కూడా వెంటవెంటనే పొందుపరిచే అవకాశం ఉందని, తొలిసారిగా నేరస్తుల వివరాలు వేలి ముద్రలతో పాటు ఫొటో కూడా ఉండే సమాచార నిధిని (డేటాబేస్) పొందుపరుస్తున్నామన్నారు. సీసీటీఎన్ఎస్ సిస్టం వినియోగం ఇంకా పూర్తి స్థాయిలో ఉంటే నేర పరిశోధన తీరుతెన్నులు మరింత మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ)– 2022 డేటా ప్రకారం» దేశంలో మొత్తం కేసుల సంఖ్య : 58,24,946 » ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కేసులు: 35,61,379 » స్పెషల్, లోకల్ లాస్ (ఎస్ఎల్ఎల్) కేసులు: 22,63,567 » క్రైం రేటు (ప్రతి లక్ష మంది జనాభాకు..): 422.2 » దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసులు : 1,07,588 » కిడ్నాపైన వారిలో మహిళలు : 88,861 » మహిళలపై జరిగిన అకృత్యాలపై నమోదైన కేసులు: 4,45,256 » చిన్నారులపై దౌర్జన్యం కేసులు : 1,62,449 » ఆర్థిక నేరాల కేసులు : 1,93,385 » నమోదైన సైబర్ నేరాలు : 65,893బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్మెంట్ – 2022 డేటా ప్రకారం» దేశంలో పోలీసుస్టేషన్ల సంఖ్య: 17,535 » గ్రామీణ ప్రాంతాల్లో పీఎస్లు: 9,192 » పట్టణ ప్రాంతాల్లో పీఎస్లు: 5,057 » స్పెషల్ పర్పస్ పోలీసుస్టేషన్లు (అదనంగా) : 3,286 -
బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యతలేంటి?: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో అనుసరిస్తున్న ప్రాధాన్యతలు ఏమిటి? వాటిని సమర్థిస్తూ నోట్ సమర్పించండి. సరైన మాధ్యమం ద్వారా ఆర్థిక శాఖ ముందు ఈ విషయాన్ని ఉంచుదాం..’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో సీతారామా ఎత్తిపోతలు–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దక్షిణ తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన ఈ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్ విధానంలో పూర్తి చేస్తామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండిపోయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నీటి కేటాయింపులు పొందడంలో గత సర్కారు ఫెయిల్.. సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పొందడంలో గత ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 16 నెలల్లోనే కేంద్రాన్ని, కేంద్ర జలసంఘాన్ని ఒప్పించి 67 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపులను సాధించామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పనులు 97 శాతం పూర్తయ్యాయని, మూడు ప్రధాన పంప్హౌస్లలో ఇప్పటికే వెట్రన్ను విజయవంతంగా నిర్వహించామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. త్వరలో నాలుగో పంప్హౌస్ పనులూ పూర్తి చేస్తామన్నారు. పాలేరు లింక్ కాల్వ, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎంకూరు లింక్ కాల్వ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, సొరంగాల వద్ద కట్టడాల నిర్మాణంలో సమస్యలతో పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ‘పనులు చేసేందుకు వేసవి అనువైన సమయం. అడ్డంకులున్నా వేగంగా పనులు కొనసాగించండి. ఇక ఏమాత్రం జాప్యాన్ని భరించలేం. ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో ఉంటూ భూసేకరణ, అటవీ అనుమతులను వేగవంతం చేయాలి.’అని అధికారులను మంత్రి ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన మొత్తం నిధులు ఎంత? ఎంత పురోగతి సాధించారు? అడ్డంకులు ఏం ఉన్నాయి? తెలపాలని కోరారు. భూసేకరణపై సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించి పురోగతిని పరిశీలిస్తామన్నారు. పర్యావరణ, అటవీ అనుమతుల్లేకుండానే గత ప్రభుత్వం సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు చేయడంతో ఎన్జీటీ విధించిన రూ.53.41 కోట్ల జరిమానాను రద్దు చేయించడానికి కృషి చేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులూ త్వరలో తీసుకొస్తామన్నారు. ఇల్లెందుకు సీతారామ జలాలు ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరై తన నియోజకవర్గానికి సైతం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్కు ఎలాంటి మార్పులు చేయకుండానే ఇల్లెందుకు సాగునీటి సరఫరాకు ఉన్న సాంకేతిక సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు శాసిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ సరదాగా వ్యాఖ్యానించారు. -
కులగణనతో బీసీల దశ తిరుగుతుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీల్లో చైతన్యం లేకపోవడం వల్లే కులగణన ఇంతకాలం జరగలేదని ఉత్తరప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్ అన్నారు. విద్య, రాజకీ య రంగాల్లో బీసీలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం జనగణనలో భాగంగా కులగణన కచ్చితంగా చేసి తీరుతుందని స్పష్టంచేశారు. ఈ ప్ర క్రియ పూర్తయితే బీసీలకు అన్ని రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ (బీసీసీఈ) ఆధ్వర్యంలో శనివారం సో మాజిగూడలోని ఓ హోటల్లో కులగణన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కశ్యప్ మాట్లాడుతూ.. ఓబీసీల్లో నకిలీ ఠాకూర్, నకిలీ బ్రాహ్మణులు ఉన్నారని సైమన్ కమిషన్ చెప్పిందని, ఆర్టికల్ 340 లేకుంటే ఇప్పటి వరకు ఓబీసీ కేటగిరీ ఉండేదే కాదని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ను చేర్చడం వల్లే బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు దక్కాయని తెలిపారు. కాంగ్రెస్ వల్లే కులగణన ఆగింది దేశంలో జనగణనలో భాగంగా చేపట్టాల్సిన కులగణన కాంగ్రెస్ వల్లే ఆగిపోయిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనగణనలో కులగణన అవసరం లేదని ఆ కాలమ్ను తొలగించారని, అప్పటి నుంచి కులగణన ఆగిపోయిందని తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానమంత్రులుగా పనిచేసినా కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు రాహుల్గాంధీ కులగణన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి మతప్రాతిపదికన లెక్కలు చెప్పిందని ఆరోపించారు.ఎవరివాటా ఎంతో తేలుతుంది జనగణనతో పాటే కులగణన చేపడితే దేశ జనాభాలో ఎవరి వాటా ఎంతనేది స్పష్టత వస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయని, అత్యంత అల్పసంఖ్యాక కులం నుంచి కూడా ఐఏఎస్ అధికారి అయ్యే వీలుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీల బతుకులు కచ్చితంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వ్యూహాత్మకమా.. వెనకడుగా!
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కీలక స్థావరాల్లోకి దూసుకెళ్లి, గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఇప్పటివరకు పదుల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ప్రస్తుతం వెనక్కి తగ్గాయి. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో వేలాది మంది సాయుధ పోలీస్ బలగాలతో భారీ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్కు బ్రేక్ వేసింది. సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం (మే 11న)లోపు సరిహద్దు హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేంద్ర బలగాల వ్యూహాత్మక ఎత్తుగడా? లేక మావోయిస్టులు ఇప్పటికే చర్చలకు సిద్ధమని ప్రకటించడం, శాంతి చర్చల కోసం పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడం, ఇందుకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ‘కగార్’పై పునరాలోచనలో పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో అణువణువూ గాలిస్తూ.. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ, స్థానిక పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు, ఛత్తీస్గఢ్ వైపు సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని కర్రిగుట్ట అడవులు మావోయిస్టులకు కీలక స్థావరంగా ఉన్నాయని గుర్తించాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ కలిపి సుమారు 24 వేలమంది భద్రతా బలగాలు ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో వారంలో ఆ ప్రాంతంలో ఆపరేషన్ మొదలుపెట్టాయి. డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లు, స్మోక్ బాంబులు, ఫ్లాష్ బాంబులను వినియోగిస్తూ లోనికి దూసుకెళ్లాయి. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్లు, బీర్ బాటిల్ బాంబులు వంటి పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్లు నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్ఓబీ) ఏర్పాటుతో పాటు ఐదు బేస్ క్యాంపులను స్థాపించారు. మావోయిస్టుల సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా గుర్తించాయి. ఏప్రిల్ 24 నుంచి మే 7 మధ్య సుమారు 30 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. కీలక నేతలు లక్ష్యంగా.. కర్రిగుట్టలు మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆ«దీనంలోని మావోయిస్టు స్థావరాలకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి. హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టు నాయకులైన గణపతి, బసవరాజు, ఆనంద్ వంటి వారిని కూడా ఈ ఆపరేషన్లో భాగంగా టార్గెట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. భద్రతాబలగాలు అధికారికంగా ఈ విషయాలు చెప్పనప్పటికీ ఆదే దిశగా ముమ్మరంగా ఆపరేషన్ చేపట్టాయి. కానీ కర్రిగుట్టలపై మావోయిస్టులకు పూర్తి పట్టుండడంతో వారు కొన్ని సమయంల్లో బలగాల కంటే వేగంగా కదలగలిగారు. ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యంతో ముమ్మర ఆపరేషన్లు చేపట్టినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం బలగాలను వెనక్కి రప్పించడానికి మరో కారణంగా చెబుతున్నారు. మావోయిస్టుల వ్యూహం ఫలించిందా? కేంద్ర సాయుధ బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనాయత్వం తప్పించుకుంటూ సేఫ్ షెల్టర్ జోన్లకు వెళ్లడంతో పాటు శాంతి చర్చల పేరిట మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కర్రిగుట్టల చుట్టూ ఐఈడీ బాంబులు అమర్చినట్టు ముందుగానే పెద్దయెత్తున ప్రకటనలు జారీ చేసిన మావోయిస్టు పార్టీ.. సాయుధ బలగాల ఆపరేషన్ మొదలైన కొద్ది రోజుల్లోనే శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖ విడుదల చేసింది. ఇది రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు, మావోయిస్టు అగ్ర నాయత్వం తప్పించుకునిషెల్టర్ జోన్లకు వెళ్లేందుకు, ప్రజల మద్దతు పొందేందుకు ఎంచుకున్న ఒక వ్యూహంగా చెబుతున్నారు. శాంతిచర్చలకు వీలుగా తాము ఆరు నెలలపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో విడుదల అయ్యింది. మరోవైపు సీపీఎం, బీఆర్ఎస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలు, పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మావోయిస్టులతో చర్చలే ఉత్తమమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనితో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఒత్తిడి సైతం కేంద్రం సాయుధ బలగాలను వెనక్కి రప్పించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. -
27న కేరళకు నైరుతి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం. -
అన్నీ ఒకేసారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి స్థానంలో బి.మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు. ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు. కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం. గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. విష్ణునాథ్ స్థానంలో మరొకరు! మరో పక్క ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది. -
అందం.. ఆత్మవిశ్వాసం
సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది. జయ జయహే తెలంగాణ ఆలాపనతో.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు. ‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్ వరల్డ్ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. ఖండాల వారీగా నాలుగు బృందాలుగా.. ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది. అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్ పిరమిడ్ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం.. చివరి బృందంలో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్ గెటప్లో వచ్చింది. పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్ వరల్డ్ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు. – భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా ‘నమస్తే హైదరాబాద్.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్ వరల్డ్ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా అన్నారు. -
హైదరాబాద్లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ పోటీలు ఆరంభమయ్యాయి. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమమమయ్యాయి. మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
నకిలీ చిరునామాలతో రవాణా శాఖ పౌర సేవలు
సాక్షి, హైదరాబాద్: వాహన పర్మిట్ బదిలీ కోసం దాని యజమాని నుంచి రూ.40 వేలు వసూలు చేసినట్లు నగరంలోని బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదులు రావడంతో.. అతడిని అక్కడి నుంచి రవాణా కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇలా పర్మిట్ బదిలీయే కాదు.. అడిగినంత సమర్పించుకుంటే ఎలాంటి సర్వీసులైనా ఇక్కడ తేలిగ్గా లభిస్తాయనే ఆరోపణలున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల బదిలీలు, కొత్త బండ్ల నమోదు సహా వివిధ రకాల పౌరసేవలు ఇక్కడ అంగడి సరుకుల్లా అమ్ముడవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండ్లగూడ కార్యాలయంలో తప్పుడు చిరునామాలతో వాహన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో ఇదే వ్యవహారంలో ఇక్కడి ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. కాగా.. ఈ అక్రమాల తంతు ఒక్క బండ్లగూడ (Bandlaguda) కార్యాలయంలోనే కాదు.. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో యథేచ్ఛ గా కొనసాగుతున్నట్లు.. ‘ఫేక్ అడ్రస్’లకు చిరునామాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామా ఎంతో కీలకం.. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, చిరునామా బదిలీలు, పర్మిట్ బదిలీలు వంటి వివిధ రకాల సేవల్లో వాహనదారుడి అడ్రస్ను ఎంతో కీలకంగా పరిగణిస్తారు. తప్పుడు వ్యక్తులు, అసాంఘిక శక్తుల చేతుల్లోకి వాహనాలు వెళ్లకుండా, అలాంటి వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సులను పొందకుండా నియంత్రించేందుకు కచ్చితమైన అడ్రస్ను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ గుర్తింపు, బ్యాంకు ఖాతా పుస్తకం, వంటగ్యాస్ డాక్యుమెంట్లు, కరెంట్ బిల్లు చెల్లింపు రసీదు తదితర 13 రకాల పత్రాలను చిరునామా ధ్రువీకరణకు ప్రామాణికంగా భావిస్తారు.కాగా.. సదరు వాహనదారు సమర్పించింది నిజమైనవో కాదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే పౌర సేవలను అందజేయాలి. కానీ కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి నిర్ధారణ లేకుండానే పౌరసేవలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు 120 లెర్నింగ్ లైసెన్సులను అందజేస్తే వాటిలో కనీసం 40 వరకు తప్పుడు అడ్రస్లపై జారీ చేసినవే ఉంటాయని ఆర్టీఏ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారివే ఎక్కువగా ఉంటాయన్నారు.అడ్డుకుంటున్నా ఆగడంలేదు.. ‘వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వారి అడ్రస్లను పరిశీలించినప్పుడు మా కార్యాలయం పరిధిలోకి రానివి, తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించినవి గుర్తించి అడ్డుకుంటున్నాం. కానీ అలాంటి వ్యక్తులు నగరంలో ఇతర ఆర్టీఏ కార్యాలయాల నుంచి యథేచ్ఛగా తమకు కావాల్సిన సర్వీసులను పొందుతున్నారు’’ అని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో (Khairtabad RTO Office) పని చేసే ఒక అధికారి తెలిపారు. ‘ప్రతిరోజూ 100 నుంచి 120 లెర్నింగ్లు ఇస్తేనే గిట్టుబాటవుతుందని భావించే సిబ్బంది ఉన్నచోట స్క్రూట్నీ చేస్తే కనీసం 30 శాతం తప్పుడు అడ్రస్లే నమోదైనట్లు తేలుతుంది’ అని మరో అధికారి చెప్పడం గమనార్హం. వాహనదారులు సమర్పించే అడ్రస్ పత్రాలు అసలివో, నకిలీవో నిర్ధారించే వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని జూబ్లీహిల్స్కు చెందిన డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఒకరు అభిప్రాయపడ్డారు. చదవండి: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురుద్దేశాలతో కూడిన, తప్పుడు ఫిర్యాదులకు చెక్ చెప్పడానికి ప్రాథమిక విచారణ (పీఈ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఈ విచారణ పూర్తి చేసి, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాతే హైడ్రా ఠాణాలో కేసు నమోదవుతుంది. ప్రతి ఫిర్యాదును కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి, సిఫార్సు చేసిన తర్వాతే పోలీసుస్టేషన్కు చేరుతుంది. హైడ్రా పోలీసుస్టేషన్ డిజిగ్నేటెడ్ కోర్టుకు సంబంధించి న్యాయశాఖ ఉత్తర్వులు జారీ తర్వాత అధికారికంగా పని చేయడం ప్రారంభించనుంది. కొన్ని ఫిర్యాదుల వెనుక అనేక ఉద్దేశాలు..ప్రభుత్వ భూములు, లే అవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలకు సంబంధించిన కేసుల్ని హైడ్రా ఠాణా నమోదు చేయనుంది. వీటితో పాటు నిర్మాణాల కోసం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటి వాటిని ధ్వంసం చేసినా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముందుకు వెళ్తున్న హైడ్రా (Hydraa) అధికారులు తీవ్రమైన అంశాలు, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వంటివి గుర్తిస్తున్నారు. ఆయా ఆక్రమణల్ని తొలగించడంతో పాటు బాధ్యులపై స్థానిక ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా.. హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని వ్యక్తిగత విభేదాలు, కక్షసాధింపు చర్యలు, బెదిరింపుల దందాలతో ముడిపడి ఉంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ రంగనాథ్ హైడ్రా ఠాణాలో కేసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ఫిర్యాదు చేయాలని భావించిన వారు నేరుగా హైడ్రా ఠాణాకు వెళ్లినా వెంటనే కేసు నమోదు కాదు. ఆ ఫిర్యాదును జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ చేసే సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కమిషనర్ సిఫార్సు మేరకు సిబ్బంది విచారణ చేపడతారు. ఫిర్యాదుతో జత చేసిన పత్రాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో పాటు ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తారు. ఈ వివరాలతో పీఈ పూర్తి చేసి.. నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు జోడించి కమిషనర్కు నివేదిక ఇస్తారు. ఆపై ఆయన ఆమోదంతో కేసు నమోదవుతుంది. నేరం ఏ సంవత్సరంలో జరిగిందో పరిగణనలోకి తీసుకునే ఎస్హెచ్ఓ ఆరోపణలు జోడిస్తారు. ఇప్పటికే వేర్వేరు ఠాణాల్లో నమోదైన కేసుల్ని విడతల వారీగా హైడ్రా స్టేషన్కు బదిలీ చేయనున్నారు.చదవండి: పాకిస్థాన్పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు