breaking news
Hyderabad
-
ఉపాధి కల్పనలో ‘కోదాడ మెగా జాబ్ మేళా’ మైలురాయి
సాక్షి, హైదరాబాద్: విద్యావంతులైన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో నిర్వహించిన కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి చొరవతో సుమారు 350 కంపెనీలు ఒకే వేదికపైకి రాగా, 30 వేల మందికిపైగా ఉద్యోగార్థులు నమోదు చేసుకున్నారు. వివిధ దశల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 5,725 మంది అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియకు షార్ట్లిస్ట్ అయ్యారు.మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి నేతృత్వంలో సెప్టెంబర్ 19న నిర్వహించిన ఈ భారీ నియామక కార్యక్రమం గ్రామీణ నిరుద్యోగ సమస్యను ప్రధానాంశంగా తీసుకుంది. భౌగోళిక దూరం, ఉద్యోగ సమాచార లోపం, ఆర్థిక పరిమితుల కారణంగా ప్రముఖ సంస్థలను చేరుకోలేకపోతున్న గ్రామీణ యువతకు స్థానికంగానే అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన యువత ఈ మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సమాచార సాంకేతికత, ఫార్మా, తయారీ, వైద్య ఆరోగ్య రంగం, బ్యాంకింగ్, రిటైల్తోపాటు వివిధ రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలను పరిశీలించి ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించాయి. గ్రామీణ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నప్పటికీ, వారికి సరైన సమయంలో ఉద్యోగ సమాచారం అందడం లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సులు పూర్తి చేసిన యువత ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, సంస్థలను సంప్రదించడం, ఇంటర్వ్యూల కోసం పదేపదే నగరాలకు వెళ్లడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఒక యువకుడి గ్రామ చిరునామా లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి అతని ఉద్యోగ అవకాశాలకు అడ్డంకిగా మారకూడదన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.అర్హులైన ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలు, తొలి అవకాశం కోసం నిరీక్షిస్తున్న గ్రామీణ యువతను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వారి మధ్య ఉన్న అంతరాన్ని ఈ మేళా తగ్గించిందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను నేరుగా సంస్థల ప్రతినిధుల ముందు ప్రదర్శించడంతోపాటు సంఘటిత రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై అవగాహన పొందారని తెలిపారు.గత ఏడాది హుజూర్నగర్లో నిర్వహించిన జాబ్ మేళా అనుభవానికి కొనసాగింపుగా కోదాడలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో చేపట్టారు. పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలు, ఐదు జిల్లాల అధికార యంత్రాంగంతో ముందస్తుగా సమన్వయం చేసుకుని యువతను పెద్ద ఎత్తున సమీకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ కార్యక్రమానికి సహకారం అందించాయి.జాబ్ మేళాలో పాల్గొన్న యువతను ఉద్దేశించి శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయడంలో కోదాడ మెగా జాబ్ మేళా రాష్ట్రంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఒకే వేదికపైకి సుమారు 350 కంపెనీలను తీసుకురావడం అసాధారణమైన ప్రయత్నమన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి భారీ ఉద్యోగ మేళాలను నిర్వహించి యువత నివసిస్తున్న ప్రాంతాలకు చేరువలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులతో వారు మాట్లాడి, ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. -
హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నెట్వర్క్పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తూ.. వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. 36 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టిన ఈగల్ ఫోర్స్.. 31 మంది క్యారియర్లు, 230 మంది వినియోగదారులను గుర్తించింది. ఒడిశాకు చెందిన పలువురు కీలక ముఠా సభ్యులను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. 23 మంది బాధితులకు డి-అడిక్షన్ పూర్తి కాగా.. వారిని కోర్టు ముందు హాజరుపర్చగా.. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 64-A కింద పునరావాసం పొందిన వారికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. పాన్ షాపుల యాజమాన్యాలకు ఈగల్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే.. -
పెళ్లి పేరుతో మోసం.. నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్పై కేసు
హైదరాబాద్: అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్ (42) చేతిలో మోసపోయిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (37) సంవత్సర కాలంగా నగరంలోని గచ్చిబౌలిలో నివసిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఈమెకు 2016లో వివాహం కాగా, అనంతరం భర్తకు విడాకులిచ్చింది. 2021లో అమెరికాలో చదువుకుంటుండగా సౌరవ్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. సౌరవ్ది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ మహవీర్పుర. మహాభారత్ సీరియల్లో భీముడి పాత్రతో అభిమానులను సంపాదించుకున్నాడు. పలు సినిమాల్లో నటించాడు. కాగా, తనతో పాటు కొద్ది నెలలు ఉన్న సౌరవ్ పెళ్లి పేరిట నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆగస్టు 18న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో లుక్ఔట్ నోటీసు జారీ చేశారు. శుక్రవారం ముంబై విమానాశ్రయం ఎగ్జిట్లో సౌరవ్ను అరెస్ట్ చేశారు. అక్కడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.ఇదీ చదవండి: ఖైరతాబాద్కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం -
బంజారాహిల్స్ టు షేక్పేట్.. మరో భారీ ఫ్లైఓవర్
సాక్షి,హైదరాబాద్: కేబీఆర్ పార్కు వద్ద వన్వే శాశ్వత అమలుతో నగరం నుంచి మాదాపూర్ వైపు రాకపోకలు సాగించే వారికి ఊరట లభిస్తోంది. దీంతో ప్రస్తుతం నగరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు రాకపోకలు సాగించే వాహన చోదకుల కష్టాలపై యంత్రాంగం దృష్టి సారించింది. ట్రాఫిక్ చిక్కుల్ని తప్పించడానికి బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి షేక్పేట్ ఫ్లైఓవర్ వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించడానికి హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడు చొప్పున ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించాలని భావించింది. ఈ పనులకు రూ.1,250 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనుల కోసం అమలు చేసిన వన్ వే ఫలితాలు ఇవ్వడంతో దీన్ని శాశ్వతం చేయాలని నిర్ణయించారు. ఆరు లేన్లతో.. తీవ్రమైన ఇబ్బందులు ఉన్న పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఓ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు రాకపోకలు సాగించే వారి కోసం దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఆరులేన్లతో మరో కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఎమ్మెల్యేస్ కాలనీ మీదుగా షేక్పేట్ వరకు ఇది ఉండనుంది. ఈ మార్గంలో ఇప్పటికే సర్వే సైతం పూర్తి చేసిన అధికారులు కొన్నిచోట్ల మాత్రమే భూమి సేకరించాల్సిన అవసరం ఉందని తేల్చారు. ఈ మార్గంలో రక్షణ శాఖకు చెందిన స్థలాల్లో పిల్లర్లు నిర్మించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు లేఖ రాసిన అధికారులు నిరభ్యంతర పత్రాలు కూడా పొందారు. పంజాగుట్ట–జూబ్లీహిల్స్ కారిడార్తో పాటే బంజారాహిల్స్–õÙక్పేట్ కారిడార్ పనుల్ని చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. -
ఖైరతాబాద్కు ఉపఎన్నిక అనివార్యమైతే ఆసక్తికరం
సాక్షి,హైదరాబాద్: దానం నాగేందర్పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత నిర్వహించనున్న తొలి ఉప ఎన్నిక అవుతుంది. ఈ నేపథ్యంలో ‘సర్’ ద్వారా వెలువడిన నూతన ఓటర్ల గణాంకాలు నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉప ఎన్నికపై ప్రభావం.. ఈ ఉప ఎన్నిక మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్ ప్రక్రియ ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసింది. అర్బన్ నియోజకవర్గాల్లో నమోదయ్యే డబుల్ ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లతో గతంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు సాధారణమే. కాగా.. సర్ ముసాయిదా జాబితా ప్రక్షాళన కావడంతో బోగస్ ఓటింగ్ ఆధారపడే వ్యూహాలకు గండిపడింది. సర్కు ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,96,036 ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత మిగిలిన ఓటర్లు 1,72,564 మంది. మరణించిన, నివాసం మారిన, ఆచూకీ లేని, డూప్లికేట్ (ఏస్డీడీ) తొలగించిన ఓటర్లు 1,23,472. నగర పరిధిలో ఏకంగా 1.23 లక్షలకుపైగా నకిలీ/అసలు లేని ఓట్లు తొలగించడం ఒక రికార్డు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గ ఓటింగ్ సరళి, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది.సీరియస్ ఓటర్ల భాగస్వామ్యం.. కాగితాలపై ఉండే ఓటర్ల సంఖ్య తగ్గడంతో, ఉప ఎన్నికల్లో నమోదయ్యే ఓట్ల ఆధారంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ తగ్గుతుందనే అంచనా ఉన్నప్పటికీ, సవరించిన జాబితా వల్ల శాతంలో మెరుగుదల కనిపిస్తుంది. సర్ అనంతరం జరగనున్న పోలింగ్ కావడంతో సీరియస్ ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో సర్ వల్ల పోయిన బోగస్ ఓట్లు ఏ పార్టీ ఆధారిత ఓటు బ్యాంకుని దెబ్బతీస్తాయనేది అభ్యర్థుల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. సర్ తెచ్చిన ఈ మార్పు ఏ పార్టీకి కలిసి వస్తుందో మరి! కార్యకర్తలూ.. నిరుత్సాహ పడొద్దు: దానం బంజారాహిల్స్: తన వెన్నంటి వుండే కార్యకర్తలెవరూ నిరుత్సాహ పడవద్దని, ఎప్పట్లాగే ఉత్సాహంగా తమ కార్యక్రమాలు చేసుకోవాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా రు. ఆయన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసిన తరువాత శనివారం ఉదయం పలువురు నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబందించి ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందరాదని కోరారు. ఇది ఒక విధంగా మన మంచికే అని, రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని వెల్లడించారు. ఇలాంటివి తాను ఎన్నో చూశానని, మళ్లీ గెలిచి తీరుతామని, ఎప్పట్లాగే అందరూ కలిసికట్టుగా ఉండి తనకు అండగా నిలబడాలని కోరారు. -
హైదరాబాద్లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడు దుర్మరణం
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఓ మూడేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారవడంతో ఇది 'హిట్ అండ్ రన్' కేసుగా నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ ప్రాంతంలో మూడేళ్ల బాలుడు ఇజాన్, తన తండ్రితో కలిసి రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక కారు అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి బాలుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఇజాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సంతోష్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న కారును, దాని డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న చిన్నారి ప్రాణం గాలిలో కలవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇక అప్పులపైనే ఆధారపడం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇకపై కేవలం ప్రభుత్వ రుణాలపైనే ఆధారపడే పాత విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చుకొనే విధానంలో కచ్చితమైన మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’సదస్సులో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, ఇతర కీలక ప్రాజెక్టుల కోసం ఇకపై ప్రైవేటు పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్ ఫండ్స్ను భారీగా సమీకరించే నమూనా వైపు రాష్ట్రం దృష్టి సారిస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారుల రిస్్కను తగ్గించడానికి, వయబిలిటీ గ్యాప్ పూడ్చడానికి ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగిస్తామన్నారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని భట్టి వివరించారు. వికసిత్ భారత్లో తెలంగాణ కీలకం.. దేశాన్ని 2047 నాటికి అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న వికసిత్ భారత్ ప్రయాణంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2025–26 నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 17.82 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఇది 10.7 శాతం వృద్ధి అని.. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు రూ. 2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండి రూ. 4,18,931కి చేరిందని భట్టి గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వివరించారు. రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసమే క్యూర్, ప్యూర్, రేర్ అనే ప్రత్యేక నమూనాను అమలు చేస్తున్నట్లు భట్టి వివరించారు. అలాగే దేశంలోనే తొలి నెట్–జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా 30 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి వెల్లడించారు. యువతే తెలంగాణ అసలైన బలం... రాష్ట్ర యువతే తెలంగాణ అసలైన బలమని భట్టి పేర్కొన్నారు. ఉన్నత విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక భద్రత, మెరుగైన వైద్యం, మహిళా సాధికారతతో కూడిన సమ్మిళిత అభివృద్ధే రాష్ట్ర విధానమని భట్టి వివరించారు. -
టార్గెట్ టాప్–100
కల్వల మల్లికార్జున్రెడ్డి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని టాప్–100 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ను కేవలం ఇంజనీరింగ్ విద్యను అందించే సంస్థగా కాకుండా ప్రపంచస్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పరిశోధనలు, సాంకేతికత, విద్యార్థులు, విద్యాసంస్థలకు చోదక శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్యాంపస్ కొలువుల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉత్పత్తులు, స్టార్టప్ల సృష్టికర్తలుగా ఎదిగేలా కోర్సుల ఎంపికలో స్వేచ్ఛ, ప్రాజెక్టు ఆధారిత విద్య, వారి ఆలోచనలకు ఆర్థిక సహాయం, స్టార్టప్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కృత్రిమ మేధను ప్రతి ఇంజనీరింగ్ విభాగంలోకి తీసుకెళ్లడంతోపాటు సెమీ కండక్టర్లు, 6జీ, ఫొటానిక్స్, కీలక ఖనిజాలు, వైద్య సాంకేతికత, అధునాతన తయారీ వంటి రంగాల్లో పరిశోధనలను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్గా వరుసగా రెండోసారి కూడా కొనసాగుతున్న ప్రొఫెసర్ బీఎస్ మూర్తి.. సాక్షి దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంస్థ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతోపాటు విద్యార్థుల భవితకు సంబంధించి మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రశ్న: వచ్చే ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్ను ఎలా చూడాలనుకుంటున్నారు? బీఎస్ మూర్తి: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని తొలి అగ్రశ్రేణి వంద విద్యాసంస్థల జాబితాలోకి ఐఐటీ హైదరాబాద్ను తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. అయితే ర్యాంకు ఒక్కటే ముఖ్యం కాదు. నాణ్యమైన పరిశోధన, మంచి అధ్యాపకులు, ప్రతిభావంతులైన పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, అంతర్జాతీయస్థాయి మౌలికవసతులు, పరిశ్రమలతో అనుసంధానం.. ఇవన్నీ కలిసే ప్రపంచస్థాయి సంస్థను నిర్మిస్తాయి. విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా సృష్టికర్తలుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? ప్రతి సెమిస్టర్లో విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. మంచి ఆలోచనలకు రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రెండో సంవత్సరం తర్వాత అంకుర సంస్థ ప్రారంభించాలనుకునే విద్యార్థికి ప్రత్యేక ధ్రువపత్రంతో క్యాంపస్లోనే సాంకేతిక వసతులు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. గతేడాది మా స్టార్టప్లు రూ. 1,500 కోట్ల ఆదాయ స్థాయికి చేరాయి. ప్రస్తుతం 810 పేటెంట్లు ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే సుమారు 250 పేటెంట్లు వచ్చాయి. అయితే పేటెంట్ తీసుకోవడం దగ్గరే ఆగిపోవద్దు. అది పరిశ్రమకు చేరి ఉత్పత్తిగా మారాలి. అందుకే ఆవిష్కరణ విభాగం, సాంకేతిక బదలాయింపు విభాగం, స్టార్టప్ల కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేశాం. పరిశ్రమలతో భాగస్వామ్యాలను ఎలా విస్తరిస్తున్నారు? గ్రీన్కో, కోల్ ఇండియా, యశోద ఆసుపత్రి వంటి సంస్థలతో కలిసి ప్రత్యేక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కీలక ఖనిజాల ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ వంటి రంగాల్లో ప్రత్యేక ఎంటెక్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఈ రంగంలో పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేయడం లక్ష్యం. ఇది ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి కోర్సు అని మేము భావిస్తున్నాం. కోర్సుల రూపకల్పనలో పరిశ్రమను భాగస్వామిగా చేస్తున్నాం. అంతర్జాతీయ భాగస్వామ్యాలను కూడా పెంచుతున్నాం. జర్మనీ, జపాన్ తదితర దేశాల విశ్వవిద్యాలయాలతో విద్యార్థుల పరస్పర మారి్పడి కార్యక్రమాలు, పరిశోధన సహకారాలను కూడా పెంచుతున్నాం. ఏఐను ప్రతి ఇంజనీరింగ్ విభాగంలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏఐను ప్రత్యేక పాఠ్యాంశంగా మాత్రమే బోధించడం సరిపోదు. అందుకే ఈ ఏడాది నుంచి ప్రతి బీటెక్ విద్యార్థి మొత్తం పాఠ్యాంశాల్లో సుమారు 10 శాతం వరకు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను చదివేలా చేస్తున్నాం. మా వద్ద ఏఐలో 35 మంది అధ్యాపకులు ఉన్నారు. సివిల్, మెకానికల్, రసాయన, జీవవైద్య రంగాల ప్రొఫెసర్లు కూడా పరిశోధనల్లో ఏఐను ఉపయోగిస్తున్నారు. సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, అణు సాంకేతికతపై పరిశోధనల సంగతేంటి? సెమీ కండక్లర్లు భవిష్యత్ సాంకేతికతకు పునాది. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక సెమీ కండక్టర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఏటా సుమారు 100 మంది ఇంజనీర్లు, మరో 100 మంది ఆపరేటర్లకు ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. ఇక కీలక ఖనిజాల ప్రాసెసింగ్పై ప్రత్యేక ఎంటెక్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ తరహాలో ప్రపంచంలోని తొలి కార్యక్రమాల్లో ఇదొకటి. విద్యా పరిశోధన కోసం సూక్ష్మ అణు రియాక్టర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారా? ఉద్యోగం కోసమే చదువు అన్నట్లుగా కాలేజీ వాతావరణం ఉండకూడదు. అందుకే ప్రత్యేక మానసిక ఆరోగ్య సలహా వ్యవస్థను ఏర్పాటు చేశాం. విద్యార్థులు కుటుంబంలో ఉన్నట్టుగా భావించే సహాయక వాతావరణం కల్పిస్తున్నాం. వారి సమస్యలను తొలిదశలోనే గుర్తించి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రామీణాభివృద్ధికి సంస్థ ఏ మేరకు తోడ్పడుతోంది? మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగితేనే మీ ఎదుగుదల పూర్తవుతుందనేది మా ఆలోచన. ప్రస్తుతం సుమారు ఏడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది వాటిని 15 గ్రామాలకు విస్తరించాలనుకుంటున్నాం. విద్యార్థులు గ్రామాలకు వెళ్లి పిల్లలకు బోధించడం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు. వికసిత భారత్పై మీ అభిప్రాయం? దేశంలో తయారైన ఒక ఉత్పత్తి ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉపయోగపడాలి. మన సాంకేతికత ప్రపంచానికి అవసరమైనదిగా మారాలి. స్వయం సమృద్ధి అంటే మన అవసరాలు మనమే తీర్చుకోవడం మాత్రమే కాదు.. మన ఉత్పత్తులు, సాంకేతికత ప్రపంచానికి ఉపయోగపడే స్థాయికి చేరడం. విద్యార్థులు కేవలం ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఏదైనా స్వయంగా నిర్మించే వారిగా మారాలి. అందుకే ‘భారతి’పేరుతో విద్యార్థులు చిన్న బృందాలుగా ఏర్పడి వారి ఆలోచనలపై పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. హాస్టళ్లు వర్క్షాపులుగా మారాలి. విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకు రావాలి. అప్పుడే నిజమైన ఇంజనీర్లు తయారవుతారు. -
మత్తు వదిలింది.. ఊరు మారింది!
మేకల కళ్యాణ్ చక్రవర్తి గోదావరి తలాపున ఉన్న ఓ గిరిజన గ్రామం గోపన్నగూడెం. ఇక్కడ 108 కుటుంబాలు నివసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడ నివసించేది మొత్తం కోయ తెగలే. రెండు కాపు కుటుంబాలు, ఒక వైశ్య కుటుంబం మినహా అంతా వారే ఉంటారు. అయితే ఈ గిరిజన గ్రామంలో చైతన్యం వెల్లివిరిసింది. అక్కడి మహిళల ధీరత్వం ఓ సామాజిక విపత్తును అవలీలగా అధిగమించేలా చేసింది. మద్య నిషేధం సాధ్యమయ్యింది. గత ఆరేళ్లుగా ఈ ఊళ్లో బెల్ట్షాపు లేదు. ఊళ్లో మద్యం అమ్మడానికి కానీ, తాగడానికి కానీ వీల్లేదు. గ్రామ మహిళా సమాఖ్య పుస్తకంలో ఈ మేరకు లిఖితపూర్వకంగా తీర్మానం చేశారు. గూడెం ప్రజలంతా కలిసికట్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. తద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పును ఆస్వాదిస్తున్నారు. ఆరేళ్లకు ముందు.. సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ (ఇప్పుడు మాస్లైన్)కి చెందిన గొంది లక్ష్మణరావు 2019లో ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పట్లో గ్రామంలో బెల్ట్షాపులు బీభత్సంగా నడిచేవి. చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్షాపులు లేకపోవడంతో నాలుగైదు గ్రామాల ప్రజలు ఇక్కడికే వచ్చి తాగి.. ఊగేవారు. గ్రామంలోని 300 ఏళ్ల చింతచెట్టు కూడలి వివాదాలకు కేంద్రమయ్యేది. భార్యాభర్తల పంచాయితీలు జరిగేవి. మద్యానికి బానిసలైన భర్తలను భరించలేక ఊరి కోడళ్లు పుట్టింటి బాట పట్టేవారు. మద్యానికి అలవాటు పడ్డవారు పొలం కూడా వెళ్లేవారు కాదు. కోళ్లు, ఇతర జంతువుల దొంగతనాలు సర్వసాధారణం. పిల్లలకు ఉన్నత చదువులు దూరం. ఫీజులు కట్టకపోవడంతో 10 వరకు చదివి మానేసేవారు. గ్రామంలో 70–80% గుడిసెలే ఉండేవి. గ్రామస్తులతో మాట్లాడి.. కొందరు గ్రామ మహిళల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ పరిస్థితులపై లక్ష్మణరావు దృష్టి పెట్టారు. గ్రామస్తులతో మాట్లాడారు. మహిళలందరినీ చైతన్యపరిచారు. మద్య నిషేధంపై తీర్మానం చేయించారు. గ్రామ సమాఖ్య పుస్తకంలోనూ రాశారు. ఈ తీర్మానం ప్రకారం గోపన్నగూడెంలో మద్యం అమ్మితే సీసాలు నిర్దాక్షిణ్యంగా పగులగొడతారు. ఒకవేళ గ్రామస్తులపై కేసులు పెడితే సర్పంచ్ ఆ ఖర్చులను భరిస్తాడు. గ్రామంలో మందు అమ్మితే కేసు తీవ్రతను బట్టి రూ.20 వేల వరకు జరిమానా వేస్తారు. ఇక్కడ సారా అమ్మడంతో పాటు తయారీ నిషేధమే. ఏదైనా తేడా వస్తే 100 గుంజీలు కూడా తీయాల్సి ఉంటుంది. ఆరేళ్లలో అదిరిపోయే మార్పు ఆ తీర్మానమే ఆ ఊరి తలరాతను మార్చేసింది. గుడిసెలు దాబాలయ్యాయి. అందరూ పొలం పనులకు వెళుతున్నారు. పిల్లలు నిరాటంకంగా చదువుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం సత్తుపల్లి, ఖమ్మం, దమ్మపేటలకు వెళుతున్నారు. ఒక అబ్బాయి అయితే హైదరాబాద్కు వచ్చాడు. కేవలం ఒక్క మద్యం ఛాయలు ఆ ఊళ్లో లేకపోవడం..ఊహకు అందని మార్పును తీసుకువచ్చిందని అంటున్నారు. మహిళల సహకారంతోనే సాధ్యం నేను సర్పంచ్ అయ్యాక గ్రామ మహిళలు కొందరు వచ్చి ఊళ్లో మద్యం అమ్మకుండా చూడాలని కోరారు. అయితే వారి సహకారంతోనే మద్యం అమ్మకాలపై నిషేధం విధించాం. ప్రస్తుతం మా ఊళ్లో ఒక్క బెల్ట్ షాపు కూడా లేదు. – గొంది లక్ష్మణరావు, మాజీ సర్పంచ్మహిళలతో కలిసి నిలబడ్డాం.. మా గ్రామంలో మద్యం అమ్మకాలు ఆపడం అంత సులభం కాదనుకున్నాం. కానీ మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆడవాళ్లు చెప్పింది నిజమే అనిపించింది. అందుకే మేము కూడా వాళ్లతో కలిసి నిలబడ్డాం. ఎవ్వరూ ఊళ్లో మద్యం అమ్మకూడదని అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి మా ఊళ్లో మద్యం అమ్మకాలు జరగడం లేదు. – పూసం మంగరాజు ఆదాయం సద్వినియోగం మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. సంపాదించిన డబ్బును ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు వినియోగమవుతోంది. ఇది ఒకరి నిర్ణయం కాదు.. ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం. అందుకే ఎన్నేళ్లయినా నిరాటంకంగా అమలవుతోంది. – కలం మంగమ్మ నోరూరే.. కుశిరి ఈ గూడెం ప్రజలు తినే కూరలు వెరైటీగా ఉంటాయి. ఇక్కడి భాషలో కుశిరి అంటే కూర అని అర్థం. వెదురు కొమ్ములతో చేసే కర్కుక్ కుశిరి, గురుగు ఆకుతో చేసే కిక్కల్ కుశిరి, కొడ్డీలు చెట్టు చిగురుతో చేసే కొడ్డెల్ కుశిరి, బొద్దె తీగతో చేసే బొద్దుం కుశిరి ఇక్కడి ప్రత్యేకతలు. అయితే బొద్దుం కుశిరి అంటే పప్పులో బొద్దె తీగను పెడతారు. ఈ కూర తింటే ఆహా ఏమి రుచి అనక మానరని గ్రామస్తులు చెప్పడం విశేషం. చేతిపంపు నీళ్లే ఈ గూడెంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. ప్రతి ఇంటికీ నల్లా ఉంది. కానీ గ్రామస్తులు ఈ నల్లా నీళ్లు తాగరు. ఊళ్లో ఉన్న చేతిపంపు నీటిని మాత్రమే తాగుతారు. ఎందుకని అడిగితే.. ‘గోదావరి నుంచి పైపులతో నీళ్లు తెస్తున్నారు. గోదావరి ఎగువన ఎవరో చనిపోయి ఉంటారు. వ్యర్థాలు వస్తాయి.. మలమూత్రాదులూ కలుస్తాయి. అందుకే ఆ నీళ్లు తాగం. బట్టలు ఉతుక్కుంటాం. అంట్లు తోముకుంటాం. స్నానాలు చేస్తాం కానీ తాగాలంటే మాత్రం భూమి నుంచి వచ్చే నీళ్లే తాగుతాం.’అని చెప్పారు. ప్రాణాపాయం అనుకుంటేనే ఆసుపత్రికి.. ఈ గూడెంలో ఇప్పటికీ నాటు వైద్యం అందుబాటులో ఉంది. అశ్వారావుపేట నుంచి ఆర్ఎంపీ డాక్టర్లు గూడెంలోకి వచ్చి వెళ్తారు. కానీ విరివిగా ఉపయోగించేది మాత్రం వేర్లు, నాటు మందులే. చిన్న చిన్న ఇబ్బందులకు మందులు వాడరు. ప్రాణపాయం అనుకుంటేనే ఆసుపత్రికి వెళ్తారు. పండుగలు ప్రత్యేకం తొలకరి వర్షాలు పడినప్పుడు జూన్లో భూదేవి పండుగ, జొన్నలు, రాగులు చేతికొచ్చినప్పుడు సెపె్టంబర్లో కొత్తల పండుగ, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడి కాయ పండుగ జరుపుకుంటారు. పండుగ జరిగాకే మామిడి కాయలు ముట్టుకుంటారు. ముత్యాలమ్మ పండుగ కూడా చేస్తారు. పెండ్లి పిరం ఇక్కడి గిరిజనుల్లో వరకట్న సంప్రదాయం లేదు. ఇంటికి వచ్చే కోడలు కుటుంబాన్ని నడపగలుగుతుందా.. వ్యవసాయంలో భర్తకు సాయంగా ఉండగలుగుతుందా అన్నది మాత్రమే చూస్తారు. గతంలో ఐదు రోజులు జరిగే పెళ్లి తంతు ఇప్పుడు ఒక్కరోజులో ముగిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. అయితే పెండ్లి మాత్రం చాలా ఖరీదయిపోయింది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలోని అందరికీ భోజనాలు పెడుతూనే ఉండాలి. ఏ సమయంలో వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా కాదనకూడదు. ఆవు మాంసం, చికెన్, మటన్ తప్పనిసరి. చేపను కూడా బాణంతో ఛేదించి ఈ గూడెంలో ప్రతిభకు కొదవలేదు. అంతర్జాతీయ విలుకారుడు గొంది మారెప్పది ఈ గూడెమే. రష్యా, ఇటలీ, ఏథెన్స్, మాల్టా దీవుల్లో పర్యటించి దేశానికి అనేక పతకాలు అందించిన 80వ దశం నాటి విలుకారుడీయన. ఇక్కడి వారి గురి ఎలా ఉంటుందంటే.. బాణంతో నీటిలో ఈదుతున్న చేపను కూడా చటుక్కున పట్టుకుంటారు. -
వరంగల్ ఎయిర్పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు
సాక్షి,వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ఎయిర్పోర్టుకు పేరు సూచించాలంటూ సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా కోరగా.. దానికి టాలీవుడ్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా స్పందించారు.సందీప్రెడ్డి తన సొంత ప్రాంతమైన వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు కానుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్ ఎయిర్పోర్టుకు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)’ అంటూ పేర్లను సూచించారు. వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ పేరు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్టు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️ My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA). It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥 Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏 @revanth_anumula— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 19, 2026దాంతో సందీప్రెడ్డి వంగా ట్వీట్కు సీఎం రేవంత్రెడ్డి “That’s the spirit” అంటూ స్పందించారు. ప్రస్తుతం రెబల్స్టార్ ప్రభాస్తో సందీప్రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సీఎం రిప్లైలో 'స్పిరిట్' అనే పదం ఉండటం సినీ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. That’s the SPIRIT..!!— Revanth Reddy (@revanth_anumula) September 19, 2026మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ నెల 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి భూసేకరణ పూర్తయి, భూమిని ఏఏఐకి అప్పగించినట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి డిసెంబరులో ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. -
జూబ్లీహిల్స్లో డ్రింకింగ్ వాటర్తో ఫ్లోర్ క్లీనింగ్
తాగే నీటిని దుర్వినియోగం చేయొద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొంత మంది మారడం లేదు. ఒకపక్క జనం తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే, మరోపక్క కొంతమంది బాధ్యతారహితంగా మంచినీటిని వేస్ట్ చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం వినియోగించాల్సిన స్వచ్ఛమైన నీరుని దుర్వినియోగం చేస్తున్నారు. ఇళ్లు, వాహనాలు, బట్టలు శుభ్రం చేయడానికి మంచినీటిని వాడుతున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా తాగునీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడం లేదు.తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జలమండలి అధికారులు కొరడా ఝళిపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లో తాగునీటి దుర్వినియోగానికి పాల్పడుతున్న ఓ మహిళకు రూ.20 వేల జరిమానా విధించారు. తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్కు వినియోగిస్తూ దుర్వినియోగం చేసినట్లు గుర్తించడంతో ఈ మేరకు చర్య తీసుకున్నారు. శనివారం ఇంటి యజమాని నుంచి జలమండలి అధికారులు జరిమానా వసూలు చేశారు.తాగునీరు అత్యంత విలువైన వనరని, ప్రజలు దానిని బాధ్యతాయుతంగా వినియోగించాలని నగర ప్రజలకు జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. తాగునీటిని ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తిస్తే, సంబంధిత వివరాలను వాట్సాప్ నంబర్: +91 99499 30003కు పంపించాలని ప్రజలకు సూచించింది. ఇదీ చదవండి: వినాయక భక్తులకు ఫ్రీ పార్కింగ్ -
హైదరాబాద్లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గోపన్పల్లిలో ఒక పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. భారీ యంత్రంలో భవనాన్ని హైడ్రా, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పురాతన భవనం కూల్చివేత ప్రభావంతో ఆ భవనం కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిన్న(శుక్రవారం) ఒక్కసారిగా బిల్డింగ్ పక్కకు ఒరిగిపోయింది. ఇవాళ(శనివారం) భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు.గోపన్పల్లిలోని తాజ్నగర్లో 50 గజాల్లో నిర్మించిన ఓ నాలుగంతస్తుల భవనం అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగింది. దీంతో భవనంలో నివసిస్తున్నవారితో పాటు పక్కనున్న భవనంలోని వారు, బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎంసీ, సర్కిల్, హైడ్రా అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్నే కాకుండా, పక్కనే ఉండే మరో రెండు ఇళ్లవారిని కూడా ఖాళీ చేయించారు. తాజ్నగర్లో లక్ష్మి (దుబాయ్లో నివాసం) అనే మహిళ ఇక్కడ 50 గజాల్లో ఐదంతస్తుల భవనం నిర్మించారు.ఒక్కో అంతస్తుకు రెండు గదుల చొప్పున మొత్తం పది గదులు భవనంలో ఉన్నాయి. దీన్ని బోరబండకు చెందిన మహ్మద్ అజహర్కు నెలకు రూ.75 వేలకు అద్దెకివ్వగా ఆయన హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఒక్కో రూములో ఇద్దరు నుంచి ఐదుగురు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భవనం ఓ పక్కకు ఒరుగుతున్నట్లుగా గమనించి స్థానికులు, హాస్టల్లో ఉంటున్నవారు అజహర్కు సమాచారం అందించారు.అతను భవనాన్ని పరిశీలించి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయమే ఆ భవనంలో అద్దెకు ఉండే వారందరినీ ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉండే మరో రెండు ఇళ్లలో నివాసం ఉండే వారిని కూడా ఖాళీ చేయించిన అధికారులు.. ఇవాళ కూల్చివేశారు. ఇదీ చదవండి: దానం నాగేందర్ దారెటో? -
రాజీనామా నుంచి అనర్హత దాకా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేసిన దానం నాగేందర్ 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి ఆసిఫ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్లో ఓడిపోయారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీ మారిన దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటం నేపథ్యంలో తాజాగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం22 జూన్ 2018: కాంగ్రెస్కు దానం నాగేందర్ రాజీనామా 24 జూన్ 2018: కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిక. 30 నవంబర్ 2018: బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నిక. 3 డిసెంబర్ 2023: ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ రెండోసారి విజయం. 15 మార్చి 2024: సీఎం రేవంత్ సమక్షంలో దానం కాంగ్రెస్ పార్టీలో చేరిక. 18 మార్చి 2024: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తదితరులు దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్. 10 ఏప్రిల్ 2024: తామిచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూహైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్. 15 ఏప్రిల్ 2024: దానం నాగేందర్, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ. 23 ఏప్రిల్ 2024: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ దాఖలు 1 జూలై 2024: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి కూడా దానం నాగేందర్పై స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు 9 సెప్టెంబర్ 2024: అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో స్పీకర్ విచారణ షెడ్యూలు ఖరారు చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశం 22 నవంబర్ 2024: హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టిన డివిజన్ బెంచ్. అనర్హత పిటిషన్లను సహేతుకమైన సమయంలో స్పీకర్ నిర్ణయిస్తారని ప్రకటన. 31 జూలై 2025 : 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం. డిసెంబర్ 2025– ఫిబ్రవరి 2026: దశలవారీగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాలు. దానం, కడియం అంశం చివరిదాకా పెండింగ్. 6 ఫిబ్రవరి 2026: మూడు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవన్న సుప్రీంకోర్టు. 11 మార్చి 2026: దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్. 23 మార్చి 2026: స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ ఏప్రిల్ 2026: దానం అనర్హత వ్యవహారంపై హైకోర్టులో కొనసాగిన విచారణ 26 జూన్ 2026: దానం నాగేందర్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకు కౌంటర్ల దాఖలుకు హైకోర్టు తుది అవకాశం 21/22 ఆగస్టు 2026: దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై తీర్పు రిజర్వు. 18 సెపె్టంబర్ 2026: దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు ధర్మాసనం. -
Hyd: కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది పాలమాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, అతడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట మండలం, చౌడుర్ గ్రామానికి చెందిన వారి పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హఫీజ్పేట్ హోంగార్డ్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్ ఆనంద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వీడియోను రిలీజ్ చేశారు.వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో డిప్యూటేషన్పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.https://t.co/NEZsAOdnPg pic.twitter.com/iIuyboVgfB— CV Anand IPS (@CVAnandIPS) September 19, 2026డీజీపీ సీరియస్..మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. This is atrocious behaviour by Telangana police Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026 -
పెళ్ళైన 18 రోజులకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాలు... యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం తాటపల్లి గ్రామానికి చెందిన పల్లవి (20) ఎదులాబాద్ డివిజన్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 30న చైతన్యపురి పీఎస్కు చెందిన కానిస్టేబుల్తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం నుంచి కళాశాలకు హాజరవుతోంది. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ఆమె విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత మూడో అంతస్తుకు వెళ్లి దూకింది. కళాశాల సిబ్బంది మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్మకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: నర్సు కేసులో కీలక ఆధారం.. నిందితుడి డీఎన్ఏ మ్యాచ్! -
ప్రజా తీర్పునకు విలువ లేదా?.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్రెడ్డి స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును పక్కనపెట్టి రాజకీయ అవసరాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేశారు.దానం నాగేందర్ ఎపిసోడ్పై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పెద్దగా తేడా లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్కు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చిందని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పార్టీ మారే సంస్కృతిని ఇకనైనా నిలిపివేయాలని హితవు పలికారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించిన పార్టీలేనని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున లోక్సభ టికెట్ ఎలా ఇచ్చారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత రాహుల్ గాంధీకి ఉందా? అని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యవహారశైలి ‘నువ్వు పీనుగలు తింటే.. నేను ఏనుగులను తింటా’ అన్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుకు విలువ ఇవ్వకుండా రెండు పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు.భూముల ధరలపైనా విమర్శలు..తెలంగాణలో భూముల ధరలను కృత్రిమంగా పెంచి హైప్ చేస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్రెడ్డి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిందని, ఓపెన్ ప్లాట్ను ఎలా విక్రయించాలనే దానిపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని అన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతుల కోసం చదరపు అడుగుకు వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. “ఈ రకమైన అక్రమాల కోసమేనా 1,200 మంది బలిదానాలు చేసుకున్నది?” అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా రేవంత్రెడ్డి ఏం చేశారని నిలదీశారు.ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్టులపై కీలక వ్యాఖ్యలుఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు నోడల్ ఆఫీసర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కిషన్రెడ్డి తెలిపారు. సుమారు 1,500 ఎకరాల్లో ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రం, బేస్తో పాటు సివిల్ ఎయిర్పోర్టు ఏర్పాటు కానుందని చెప్పారు. రక్షణ శాఖ నుంచి మెజారిటీ నిధులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్ ఎయిర్పోర్టుకు డీపీఆర్ సిద్ధమవుతోందని, ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని కిషన్రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లను.. ఎన్నికలొస్తే కొట్లాడుతా: దానం -
వేగంగా భూముల సర్వే
గజ్వేల్/మర్కూక్: మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాల్లో భూముల సర్వే వేగంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో గజ్వేల్, హుస్నాబాద్, కలెక్టరేట్ డివిజనల్ ఇన్స్పెక్టర్లు (సర్వే విభాగం) సేవ్యానాయక్, బాలయ్య, వంశీ, మర్కూక్ ఆర్ఐ బాలయ్య, మండల సర్వేయర్ హరీశ్కుమార్లతోపాటు మరో ఏడుగురు సర్వేయర్లు, నలుగురు జీపీఓలు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. వీరంతా బృందాలుగా విడిపోయి.. ప్రధానంగా ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లోని 325 సర్వేనెంబర్లోగల 388ఎకరాల ప్రభుత్వ భూమిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.ఈ భూములకు ముందుగా హద్దులు నిర్ణయించే పనిలో ఉన్నారు. రాత్రి వరకు హద్దులు దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. హద్దులు తేలుతుండటంతో సర్వే నెంబర్లో సాగులో ఉన్న రైతులవారీగా నోటీసులు ఇచ్చి ఎవరి భూమి ఎంత?, వారికి గతంలో ఇచ్చిన పట్టా ఎంత?, కబ్జాలో ఉన్న భూమి ఎంత? అనే అంశాలను క్షణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రైతువారీగా భూముల వివరాలు తేలగానే, మొత్తం భూమిలో సాగులో ఉన్నది ఎంత?, మిగిలింది ఎంత? అనే విషయాలను తేల్చనున్నారు. దీని తర్వాత 388ఎకరాల్లో ఇంకా ఏమైనా భూమి ఆక్రమణకు గురైందా? అనే అంశాలను కూడా వెలికి తీయనున్నారు.ఇదే విషయాన్ని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిసింది. ఈ విషయాలను మర్కూక్ తహాశీల్దార్ సరిత, ఏడీ(సర్వే విభాగం) సుదర్శన్లు ధ్రువీకరించారు. రెండో రోజు సర్వే నేపథ్యంలో అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సర్వే జరుగుతున్న భూముల వద్ద, మర్కూక్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సర్వే నేపథ్యంలో ఏం జరుగుతుందోననే భయంతో దళిత రైతులు భూముల వద్దకు చేరుకున్నారు. మా భూములను ఇతరులకు కట్టబెట్టే కుట్రలు చేయొద్దని అధికారులను వేడుకున్నారు. దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న పట్టాల పంపిణీని కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జన్వాడలో హైటెన్షన్.. కేటీఆర్ ఫామ్హౌస్ పరిశీలనకు కాంగ్రెస్ బృందం! -
కోర్టుకు వెళ్లను.. ఎన్నికలొస్తే కొట్లాడుతా: దానం ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా అంచనా వేస్తున్నానని తెలిపారు. ఇదే సమయంలో తాను కోర్టుకు వెళ్లబోనని దానం కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా చిట్చాట్లో భాగంగా దానం నాగేందర్ మాట్లాడుతూ..‘ఉప ఎన్నిక వస్తే నేను కొట్లాడుతాను. నేను కోర్టుకు వెళ్ళను. కోర్టు ఆర్డర్ కాపీని చదువుతున్నాను. నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వస్తాను. ప్రస్తుతం అన్ని రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నానని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని’ అన్నారు.ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయనతో పాటు అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. తీర్పు వచ్చేటప్పటికే అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనను కలిశారు. మరోవైపు దానం నివాసానికి నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక దానం అనర్హతపై బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.కాంగ్రెస్లోని కొందరు సైతం ఆనందంగా కనిపించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న దానం.. అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించడం లేదని, తన నియోజకవర్గంలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దానం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేదాకా ఆ విషయం చాలామంది కార్యకర్తలకు తెలియదు. అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే ఎందరు అండగా నిలుస్తారనేది చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: జన్వాడలో హైటెన్షన్.. కేటీఆర్ ఫామ్హౌస్ పరిశీలనకు కాంగ్రెస్ బృందం! -
అప్పుల బాధతో స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్: అప్పులు, ఆర్థికసమస్యల కారణంగా ఓ యువకుడు స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపిన మేరకు.. పార్శిగుట్టకు చెందిన సోమరపు మనోజ్కుమార్ (29) ఇంటింటికీ తిరిగి రక్తపరీక్ష నమూనాలు సేకరిస్తూంటాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి పైకి చేరుకుని తన ద్విచక్ర వాహనంపై మొబైల్ ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి దూకాడు. తల, కాళ్లు చేతులకు తీవ్రగాయాలు కావడంతో తీవ్రరక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మొబైల్లో మరణానికి గల కారణాలను టైప్ చేసి పెట్టాడు. తన కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలుపుతూ తన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈ సంఘటనతో స్టీల్ బ్రిడ్జిపై కాసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా మృతదేహాన్ని అక్కకు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
వచ్చే నెల 9న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 9న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రిటరి్నంగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్న ఈ ఎన్నికలు సంస్థలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.సెప్టెంబర్ 21న ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. పోటీ చేసే యూనియన్లు తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది.సెప్టెంబర్ 22న ప్రాథమిక ఓటర్ల జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.సెప్టెంబర్ 25న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.సెప్టెంబర్ 26న పోటీలో నిలిచే కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.అక్టోబర్ 9న ఉదయం నుంచి సాయంత్రం వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది.అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు... ఆర్టీసీ నిబంధనల ప్రకారం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. కానీ, సంస్థలో చివరిసారిగా 2016 జూలై 19న ఎన్నికలు జరగ్గా, అందులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత 2020లో జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించలేదు.2019లో 53 రోజుల రికార్డు సమ్మె జరిగినప్పుడు నాటి ప్రభుత్వం సంస్థలో యూనియన్లను అనధికారికంగా నిషేధించింది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు నిలిచిపోయాయి. అసలు యూనియన్ల మనుగడే లేని తరుణంలో, ఇటీవల మరోసారి సమ్మె చేసిన సంఘాలు పట్టుపట్టి యూనియన్లకు తిరిగి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రధాన డిమాండ్గా మంత్రులతో చర్చలు జరిగినప్పుడు విలీనానికి మంత్రులు అంగీకరించారు.తమకు ప్రభుత్వంలో విలీనమే కావాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు అవసరం లేదన్న కార్మికుల వాదనను వినిపిస్తూ యూనియన్ల నేతలు చర్చలు జరిపారు. కానీ, తర్వాత ప్రభుత్వం ఉన్నట్టుండి గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో విజయం సాధించిన యూనియన్ ప్రాతినిధ్యంతో ఉండే అధికారుల కమిటీ విలీనం అంశంపై అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. చివరకు విలీనం అంశానికంటే ముందే ఎన్నికల ప్రక్రియ మొదలైంది.ఇదీ చదవండి: రోజుకో నాయకుడి అక్రమాలు బయటపెడతాం! -
జన్వాడలో హైటెన్షన్.. కేటీఆర్ ఫామ్హౌస్ పరిశీలనకు కాంగ్రెస్ బృందం!
జన్వాడ ఫామ్ హౌస్కు కాంగ్రెస్ నేతలు అప్డేట్స్..జన్వాడ ఫామ్హౌస్ దగ్గర పోలీసుల మోహరింపు..ఫామ్హౌస్ వద్దకు చేరుకున్న చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్👉తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య భూ వివాదం మరింత ముదురుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం వరుసగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడుతోంది. శుక్రవారం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్రావు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. శనివారం జన్వాడలో కేటీఆర్, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని పరిశీలించనున్నారు.👉కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉదయం 10.30 గంటలకు ప్రజాభవన్ నుంచి బయలుదేరి జన్వాడకు వెళ్లనున్నారు. అక్కడ భూములకు సంబంధించిన రికార్డులు, యాజమాన్య వివరాలు, ప్రభుత్వ భూములతో సంబంధం ఉన్న అంశాలను పరిశీలించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా వెలికట్టలో హరీశ్రావు బంధువు హనుమంతరావుకు సంబంధించిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. భూముల రికార్డులు, పహాణీలు, పట్టాదారు వివరాలతో పాటు బదలాయింపు, రిజిస్ట్రేషన్ నిబంధనలపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించింది.👉జన్వాడ అంశంలో మాత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. జన్వాడ ఫార్మ్హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ.. ఆస్తి తనదేనని, కేటీఆర్కు ఎలాంటి యాజమాన్య హక్కు లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, ఫార్మ్హౌస్ను ఆయనకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయని, అధికారికంగా అడిగితే అందజేస్తానని చెప్పారు. జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే..!కేటీఆర్కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు.- ప్రదీప్ రెడ్డి pic.twitter.com/BOKLm1kNh9— Rebel Freak (@rebelfreak0298) September 18, 2026👉మరోవైపు కేటీఆర్ ఈ ఆరోపణలపై న్యాయ విచారణకు సవాల్ విసిరారు. తన కుటుంబంతో పాటు సీఎం రేవంత్రెడ్డి కుటుంబ ఆస్తులపైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల సవాళ్లు, ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో భూముల అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది. ఇదే క్రమంలో శంషాబాద్లో జగదీశ్రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములనూ కాంగ్రెస్ ప్రతినిధులు పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల భూములపై కాంగ్రెస్ చేపడుతున్న వరుస పర్యటనలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: దానం నాగేందర్ దారెటు? -
Hyderabad: 50 గజాల్లో ఐదంతస్తుల నిర్మాణం
హైదరాబాద్: గోపన్పల్లిలోని తాజ్నగర్లో 50 గజాల్లో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగింది. దీంతో భవనంలో నివసిస్తున్నవారితో పాటు పక్కనున్న భవనంలోని వారు, బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎంసీ, సర్కిల్, హైడ్రా అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్నే కాకుండా, పక్కనే ఉండే మరో రెండు ఇళ్లవారిని కూడా ఖాళీ చేయించారు. తాజ్నగర్లో లక్ష్మి (దుబాయ్లో నివాసం) అనే మహిళ ఇక్కడ 50 గజాల్లో ఐదంతస్తుల భవనం నిరి్మంచారు. ఒక్కో అంతస్తుకు రెండు గదుల చొçప్పున మొత్తం పది గదులు భవనంలో ఉన్నాయి. దీన్ని బోరబండకు చెందిన మహ్మద్ అజహర్కు నెలకు రూ.75 వేలకు అద్దెకివ్వగా ఆయన హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఒక్కో రూములో ఇద్దరు నుంచి ఐదుగురు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భవనం ఓ పక్కకు ఒరుగుతున్నట్లుగా గమనించి స్థానికులు, హాస్టల్లో ఉంటున్నవారు అజహర్కు సమాచారం అందించారు. అతను భవనాన్ని పరిశీలించి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయమే ఆ భవనంలో అద్దెకు ఉండే వారందరినీ ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉండే మరో రెండు ఇళ్లలో నివాసం ఉండే వారిని కూడా ఖాళీ చేయించారు. కూలి్చవేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. భవనానికి ఇరువైపులా గోతులు 50 గజాల స్థలంలోని భవనానికి సమీపంలో దాదాపు వెయ్యి గజాల్లో భారీ భవన నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ భవనానికి ఇరువైపు భారీ గోతులు తీస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో పనులు జరుగుతున్నాయని, ఈ కారణంగానే భవనం ఒరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. మరోవైపు స్థలంలోనూ నిర్మాణానికి రెండు రోజుల క్రితమే బోరు వేశారు. -
ఎల్నినోపై సమగ్ర వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఎల్ నినో వల్ల తలెత్తిన నీటి ఎద్దడిని అధిగమించడానికి తక్కువ నీటి వినియోగంతో పండే పంటల సాగును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణాదిన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఎల్ నినో ప్రభావం ఒకటని అన్నారు. ఈ ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తోందని తెలిపారు. హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో చౌహాన్ మాట్లాడారు.ఎల్ నినో ప్రభావం దక్షిణాదిపైనే అధికం ఎల్ నినో ప్రభావం ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదు. ఒక్కో జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉన్నందున, చాలా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను గుర్తించి, వాటి కోసం ప్రత్యేకంగా జిల్లా ఆధారిత అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశాం. రబీ సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో, ఎల్ నినో వల్ల మారే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సాంకేతిక, ఆర్థిక సహాయసహకారాలు అందిస్తుంది. కేంద్ర–రాష్ట్రాలు కలిసికట్టుగా రైతులకు సానుకూల ఫలితాలు అందించాలి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎల్ నినో వాతావరణ మార్పుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంది. ఇక్కడి జిల్లాల్లో ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో సాగు నీటి కొరత ఏర్పడింది.రైతు అన్నదాతే కాదు.. జీవనదాతసాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, కృత్రిమ మేధస్సు, యంత్ర పరిజ్ఞానం ప్రపంచాన్ని ఎంతగా శాసించినప్పటి కీ వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. యంత్రాలు రొట్టెలను తయారు చే యగలవు కానీ, పొలంలో గోధుమలను పండించలేవు. మానవ మనుగడకు అవసరమైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు కేవ లం పొలాల నుంచే వస్తాయి. వాటిని పండించే రైతు కేవలం ’అన్నదాత’ మాత్రమే కాకుండా ఈ సమాజానికి ’జీవనదాత’.రైతుల జీవితాల్లో మార్పే లక్ష్యం ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా, దేశ మే ప్రథమం అనే నినాదంతో కేంద్ర ప్రభు త్వం పనిచేస్తుంది. రైతుల జీవితాల్లో సాను కూల మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం. దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడం మామొదటి లక్ష్యం. ఆహార అవసరా ల కోసం భారత్ ఏ ఇతర దేశంపై ఆధారపడకూడదు. దేశానికి అన్నం పెట్టే రైతు సురక్షిత, సంపన్న జీవితాన్ని గడపాలి. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ముఖ్య ప్రా ధాన్యత. ప్రజలకు కేవలం ఆహారం అందించడమే కాకుండా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం.పాత కొబ్బరి తోటల స్థానంలో.. సంవత్సర కాలంలో భారతదేశ కొబ్బరి ఎగుమతులు రూ.4,349 కోట్ల నుండి రూ.7,038 కోట్లకు చేరాయి. అంటే ఏకంగా 62 శాతం వృద్ధి నమోదు అయ్యింది. తాజాగా కొబ్బరి సాగును ప్రోత్సహించడానికి బడ్జెట్లో సరికొత్త పథకాన్ని ప్రకటించాం. అది త్వరలోనే అమలులోకి రానుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే అగ్రగామిగా ఉన్నందున, ఈ కొత్త పథకం పూర్తి ప్రయోజనాలను రైతులు పొందేలా రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. 60–70 సంవత్సరాల నాటి పాత కొబ్బరి తోటల స్థానంలో విడతల వారీగా కొత్త మొక్కలను నాటేలా పునరుజ్జీవన వ్యూహాన్ని రూపొందించాలి. చట్టాలు, నిబంధనలు ప్రజల కోసమే ఏర్పడ్డాయి కానీ, చట్టాల కోసం ప్రజలు లేరు. కాలం చెల్లిన పాత చట్టాలను, సంక్లిష్ట విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలి..’అని కేంద్రమంత్రి సూచించారు. సదస్సులో కేంద్ర సహాయ మంత్రులు రామ్నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరి, దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. ఎల్ నినో సహాయ నిధి ఏర్పాటు చేయండి: మంత్రి తుమ్మలఎల్ నినో, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల నేపథ్యంలో ఎల్ నినో సహాయ నిధి ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. సూక్ష్మ సేద్యం, నీటి పొదుపు చర్యలకు మరింత సహాయం అందించాలని విన్నవించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తుచేశారు. ఆయిల్పామ్ రైతులకు ధర భద్రత కల్పించాలని, క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా ఆయిల్పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలకు ఎంఎస్పీ అమలులో కేంద్ర–రాష్ట్రాలు కలిసి బాధ్యత వహించాలని తుమ్మల అన్నారు.ఇదీ చదవండి: ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం.. -
దానం దారెటో?
హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయనతో పాటు అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. తీర్పు వచ్చేటప్పటికే అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనను కలిశారు. మరోవైపు దానం నివాసానికి నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక దానం అనర్హతపై బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. కాంగ్రెస్లోని కొందరు సైతం ఆనందంగా కనిపించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న దానం.. అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించడం లేదని, తన నియోజకవర్గంలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దానం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేదాకా ఆ విషయం చాలామంది కార్యకర్తలకు తెలియదు. అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే ఎందరు అండగా నిలుస్తారనేది చర్చనీయాంశమైంది. మంత్రి పదవి ఆశిస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నాగేందర్ 25 వేల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముందే ఆ పార్టీలో చేరితే మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ, కాంగ్రెస్ నుంచి గెలిచినవారికే చాన్స్ అనడంతో అవకాశం దక్కలేదు. పైగా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. ఇంతదాక వస్తుందని ఊహించని దానం..మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లాలనే సూచనలను పట్టించుకోలేదు.బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు దానంపై అనర్హత వేటు పడడంతో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్రెడ్డి, మహేష్ యాదవ్, మధుకర్యాదవ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
రాత్రి 10 తర్వాతే డిన్నర్
సాక్షి, హైదరాబాద్: మారిన జీవనశైలి, సుదీర్ఘమైన ప్రయాణాలు, ఆలస్యంగా తినే భోజనం నగర వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ ఉద్యోగుల్లో ఏకంగా 64 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాతే భోజనం (డిన్నర్) చేస్తున్నారని ఈవా ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026 నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే మొదటి టచ్ బేస్డ్ మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ రూపొందించిన ఈ నివేదిక దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షలకు పైగా రీడింగ్ల ఆధారంగా రూపొందింది. శరీర విశ్రాంతికి విఘాతం.. రాత్రిపూట ఆలస్యంగా, అతిగా భోజనం చేయడం, ఒత్తిడి, నిద్రకు ముందు కాఫీ తాగడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతోంది. మరుసటి రోజు ఉదయానికి శరీరం అలసటగా ఉండే ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ ఎదురవుతోందని నివేదికలో వెల్లడించింది. ఉదయం పూట మధుమేహం స్థాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు నిద్ర నాణ్యత పడిపోతోందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 40 శాతం మంది నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడంతో గుండె స్పందన రేటు పెరుగుతోందని వెల్లడించింది. ఇతర నగరాల్లోనూ.. ముంబైలో 64 శాతం మంది రాత్రి 9.30 గంటల తర్వాతే తింటున్నారు. లోకల్ రైళ్ల ప్రయాణాలు వారిలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. బెంగళూరులో 44 శాతం మందికి సుదీర్ఘమైన ట్రాఫిక్ ప్రయాణాలతో రోజువారీ శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. ఢిల్లీ– ఎన్సీఆర్లో చలికాలపు పొగమంచుతో 30 శాతం మంది బయటకు రాకపోవడంతో వెల్నెస్ స్కోర్లు తగ్గుముఖం పట్టాయి.ఇలా చేస్తే మేలు.. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్య స్కోర్ను 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుకోవచ్చని ఈ అధ్యయనం సూచించింది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిచే వారిలో షుగర్ లెవల్స్ 12–16 శాతం వరకు నియంత్రణలోకి వస్తున్నాయి. రాత్రి డిన్నర్ను వీలైనంత త్వరగా ముగించడం, కేఫిన్ (కాఫీ) తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు. -
సొంత వనరు వద్దు.. పొరుగు ‘చేపే’ ముద్దు!
(గౌటే దేవేందర్) రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తికి వీలుగా సహజసిద్ధమైన వనరులు ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ అధీనంలో భూములు, ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మత్స్యకారుల సహకార సంఘాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించే సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా అవసరమైన చేప పిల్లల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండటం, ఇందుకోసం టెండర్ల ఖరారులో జాప్యం, అవినీతి ఆరోపణలు, నాణ్యత లేని లేదా కల్తీ చేప పిల్లల పంపిణీ, సరైన సమయంలో చెరువుల్లోకి పిల్లలను వదలకపోవడం వంటి సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి. రాష్ట్రంలోనే వందల ఎకరాల్లో విస్తరించిన ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా పక్క రాష్ట్రాల నుంచి చేప పిల్లలను ఎందుకు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత పదేళ్లలో దాదాపు రూ.900 కోట్ల మేరకు ప్రభుత్వ నిధులు కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లల కొనుగోలుకు వెచి్చంచినట్లు అంచనాలు ఉన్నాయి. అంటే ఏటా సగటున రూ.90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒకవైపు భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తుండగా.. మరోవైపు రాష్ట్రంలోని సొంత ఉత్పత్తి కేంద్రాలు మాత్రం నిరుపయోగంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పునరుద్ధరణలో నిర్లక్ష్యం!: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో మొత్తం 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో 21 కేంద్రాలు చేప పిల్లల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని పరిమిత స్థాయిలో మాత్రమే ఉపయోగంలో ఉండగా, మరికొన్ని కేంద్రాలు సగం వరకు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇంకొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్ని కేంద్రాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ట్యాంకులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పునరుద్ధరించి వినియోగించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ కింద పోచంపాడులో 240కి పైగా ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 80 ట్యాంకుల్లో మాత్రమే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. మిగతా అనీ ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్థానంలో కరీంనగర్, మెదక్ ఉన్నాయి. ఈ కేంద్రాలు కేవలం పేరుకే ఉన్నవి కావు. వీటికి భారీ స్థాయిలో చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొత్తం దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే ప్రతి ఏటా 120 కోట్లకు పైగా చేప పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మెదక్ కేంద్రం.. సగానికి పైగా ఆక్రమణ! రాష్ట్రంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో మెదక్ కేంద్రం పరిస్థితి ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. 15.35 ఎకరాల్లో 116 ట్యాంకులున్నాయి. 4 బ్రూడర్, 4 సెగ్రిగేషన్ ప్యాన్స్ ఉండగా మరమ్మతులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు కేలం 21 ట్యాంకులు, 3 బ్రూడర్లు మాత్రమే పని చేస్తున్నాయి. 1961లో నిర్మించిన వీటికి మరమ్మతులు లేక నిరుపయోగంగా మారడంతో సగానికి పైగా భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రతి కేంద్రానికి 3 అధికారులు.. రాష్ట్రానికి సరిపడా ఉత్పత్తి! ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు సిబ్బంది కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రతి కేంద్రానికి కనీసం ముగ్గురు చొప్పున ప్రత్యేక సిబ్బంది లేదా అధికారులు నియమించి, వారి పర్యవేక్షణలో ఉత్పత్తి కార్యక్రమాలను నిర్వహిస్తే రాష్ట్రానికి అవసరమైన స్థాయిలో చేప పిల్లలను ఉత్పత్తి చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలు, నీటి నాణ్యత, చేప పిల్లల పెంపకం, ఆహారం, వ్యాధుల నియంత్రణ, పంపిణీ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, ప్రభుత్వ కేంద్రాల్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టి పర్యవేక్షిస్తే నాణ్యత పెరుగుతుందని అంటున్నారు. ఒక్కసారి పెట్టుబడి.. ఏటా ప్రయోజనం ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ ఒకేసారి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, అవసరమైన ట్యాంకులకు మరమ్మతులు చేసి, నీటి వసతులు కలి్పస్తే వాటిని ప్రతి ఏడాదీ వినియోగించుకోవచ్చు. తద్వారా ప్రస్తుతం కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లలను కొనుగోలు చేయడానికి వెచి్చస్తున్న భారీ మొత్తంలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది సుమారు రూ.70 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టి కేంద్రాలను పునరుద్ధరిస్తే.. ఆ తర్వాత ప్రతి ఏడాది చేప పిల్లల ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం చేకూరడమే కాకుండా, మత్స్యకారులకు కూడా సమయానికి నాణ్యమైన చేప పిల్లలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. రెండు, మూడురకాల చేపపిల్లలే.. ఏటా చేప పిల్లల కొనుగోలు కోసం వెచి్చస్తున్న మొత్తాన్ని ఉత్పత్తి కేంద్రాల పునరుద్ధరణకు, సిబ్బంది నియామకానికి, ఆధునిక సాంకేతికతకు ఉపయోగించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇన్ని కోట్లు పెట్టినా.. పంపిణీ చేస్తున్న చేప పిల్లలు రెండు, మూడు ప్రధాన రకాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అదే ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే సుమారు 10 రకాల చేపలను పెంచే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నీటి వనరులు, చెరువుల స్వభావం, మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో చెరువుల్లో చేపల వైవిధ్యం పెరగడమే కాకుండా మత్స్యకారులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం తక్షణం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, ఎక్కడెక్కడ భూములు ఆక్రమణకు గురయ్యాయి? ఎన్ని ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి? ఎన్ని పని చేస్తున్నాయి? ఎక్కడ మరమ్మతులు అవసరం? ఎంత ఉత్పత్తి సామర్థ్యం ఉంది? వంటి అంశాలను గుర్తించాలనే డిమాండ్లు విని్పస్తున్నాయి. చేప పిల్లల ఉత్పత్తి విషయంలో ప్రభుత్వం దశలవారీగా బయటి కొనుగోళ్లు, కాంట్రాక్టర్లపై ఆధారపడే విధానాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు గట్టిగా విని్పస్తున్నాయి. ఎస్సారెస్పీ కింద ఉన్న పోచంపాడులో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు. ఒకే దగ్గర 240కి పైగా కేంద్రాలు.. వాటిలో 80 కేంద్రాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. -
22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత కేటగిరీలో ఉన్న భూసమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కార్యాచరణ చేపట్టిందన్నారు. శుక్రవారం శాసనసభలో జీరోఅవర్లో 22ఏపై మంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 22ఏ విషయంలో మొత్తం 12 రకాల అంశాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీటిని గరిష్టంగా నెలరోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జీఓ 118 ద్వారా క్రమబద్ధికరణ చేసేందుకు 9,792 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఈ అంశాన్ని పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ హామీకి అనుగుణంగా బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ 118 సమస్యల పరిష్కారానికిగాను శుక్రవారం మెమో జారీ చేసిందని వివరించారు. దాదాపు 22, 23 కాలనీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, శనివారం మధ్యాహ్నం అర్హతలున్న వారికి క్రమబద్ధికరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తామని, నిషేధిత జాబితా నుంచి ఆయా ప్లాట్లను తొలగిస్తామన్నారు. సింగరేణి పరిధిలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో శనివారం అసెంబ్లీ హాలులో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జారీ చేసిన జీఓ 76పై ఈ సందర్భంగా చర్చిస్తామన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. అధీకృత లేఅవుట్లకు సంబంధించి 22ఏ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సమస్యలను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేశ్కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా న్యాయ, శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి పాపిరెడ్డి సభ్యులుగా మెంబర్ కన్వీనర్గా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్గాంధీ హన్మంతు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్కుమార్ శుక్రవారం జీఓ 564 జారీ చేశారు. నాలుగు రకాల కేసులపై ప్రత్యేక దృష్టి సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పెండింగ్ కేసులను ఈ కమిటీ పరిశీలించి పరిష్కరించనుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అధికారుల అనుమతులతో ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పెండింగ్ వ్యవహారాలను పరిశీలిస్తుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో లీజుహోల్డ్ ఆస్తులను ఫ్రీహోల్డ్గా మార్చే అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ కేసుల పరిశీలనలో భాగంగా అవసరమైన రికార్డులు, సమాచారాన్ని ఏ శాఖ నుంచైనా, శాఖాధిపతులు లేదా జిల్లా కలెక్టర్ల నుంచి కమిటీ కోరవచ్చు. అవసరమైతే ఇతర అధికారులను కూడా కమిటీలో సహ సభ్యులుగా చేర్చుకునే అధికారం ప్రభుత్వం కల్పించింది. దీంతో 22ఏ నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన పలు ఆస్తుల వ్యవహారాలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది. ⇒ జీఓ 118 దరఖాస్తుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్ శుక్రవారం మెమో 46940 జారీ చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నెలరోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. -
రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘తాగు, సాగునీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలి. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం, పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం శాసనసభలో ఎల్నినోపై లఘు చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎనిమిది అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టగా, అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అనంతరం సభ్యులు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని ముఖ్యాంశాలు ⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. తద్వారా ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు అవకాశం కల్పించాలి. ⇒ రాష్ట్రానికి అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలి. విండో– ఐ కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ నిర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేక్ల లభ్యతను పెంచాలి. విద్యుత్ ట్రాన్స్మిషన్ చార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలి. ⇒ ఎల్నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలి. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి తగిన సాయం మంజూరు చేయాలి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలి. ⇒ పంట నష్టం/ఇన్పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశు సంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణతోపాటు ఉపశమన చర్యలకు తగిన సహాయం అందించాలి. ⇒ వీబీజీ–రామ్జీ పథకంలో 125 రోజుల పనిదినాలకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలి. ఈ పథకంపై ఖర్చును మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ కాలాన్ని సడలించాలి. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించేందుకు లేబర్ బడ్జెట్ను తగినంతగా పెంచాలి. ⇒ రాష్ట్రానికి అవసరమైన ఎరువులను సకాలంలో కేటాయించాలి. ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్ల ద్వారా సరఫరా చేయాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) కింద కేటాయింపులు పెంచి డ్రిప్ ఇరిగేషన్ను వేగంగా విస్తరించాలి. ఎంఐడీహెచ్ కింద కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలి. ⇒ రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలి. అందుకు అవసరమైన తీరుగా నిబంధనలను సడలించాలి. -
దానంపై హైకోర్టు వేటు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 191 (2), రెడ్విత్ పదవ షెడ్యూల్లోని పేరా 2 (1)ఏ ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. దానం పార్టీ మారలేదంటూ మార్చిలో స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రిట్ పిటిషన్లను అనుమతించింది. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూ 2024లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారని హైకోర్టు గుర్తుచేసింది. సంబంధిత శాసనసభ నియోజకవర్గ స్థానం ఖాళీగా మారినట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను శాసనసభ స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అప్పీలుకు వీలుగా ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ దానం తరఫు న్యాయవాది అభ్యర్థించినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ప్రత్యేక ధర్మాసనం విచారణ ముగించింది. పార్టీ మారినట్లు ప్రకటిస్తూ ఓ ఎమ్మెల్యేపై ఉన్నత న్యాయస్థానం అనర్హత వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్, బీజేపీ సవాల్ చేయడంతో.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరినందున ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) దానం నాగేందర్ చట్టపరంగా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం గత నెల 21న తీర్పు రిజర్వు చేసింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ స్పెషల్ బెంచ్ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తీర్పు కాపీలో ధర్మాసనం పేర్కొన్న కీలకాంశాలు.. కాంగ్రెస్ నుంచి లోక్సభకు.. 2023లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన అనర్హత వర్తిస్తుంది. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానం ఖాళీ అయినట్లే. స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష.. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరించినప్పుడు ఆయన నిర్ణయాన్ని పూర్తిగా న్యాయ సమీక్ష పరిధికి వెలుపల ఉంచలేం. కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్లు కేసులో సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. స్పీకర్ నిర్ణయంలో రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన, దురుద్దేశం, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన వంటి లోపాలు ఉంటే ఆర్టీకల్ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకోవచ్చు. బయటి చర్యలపైనా అనర్హత.. ఎమ్మెల్యే సభ వెలుపల చేసిన చర్యలను పదవ షెడ్యూల్ కింద పరిశీలించే అధికారం స్పీకర్కు లేదన్న అభిప్రాయం సరికాదు (వేరే రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పరిగణించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది). ముఖ్యంగా డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ సింగ్ కేసులో.. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ మరో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడమేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మరవొద్దు. సభ వెలుపలి అంశాలపైనా.. లోక్సభ ఎన్నికల్లో మరో పార్టీ తరఫున పోటీ చేయడం శాసనసభ కార్యకలాపాలను ప్రభావితం చేయదని, టెన్త్ షెడ్యూల్ వర్తించదని స్పీకర్ పేర్కొనడం సరికాదు. ఇలాంటి చర్యలు కూడా టెన్త్ షెడ్యూల్లోని పేరా 2(1)(ఏ) పరిధిలోకి వస్తాయి. గతంలో కొండా మురళీధర్రావు, ఆర్. భూపతిరెడ్డి, రవి ఎస్.నాయక్, రాజేంద్రసింగ్ రాణా తదితర కేసుల్లోనూ సభ వెలుపల చర్యల ఆధారంగా అనర్హతను పరిశీలించిన విషయం ప్రస్తావనార్హం. నాలుగు పత్రాలే కీలకం.. ఏలేటి మహేశ్వర్రెడ్డి వేసిన పిటిషన్లో కీలకంగా నాలుగు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ దాఖలు చేసిన ఫారమ్–26, బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు వెలువడిన గెజిట్ నోటిఫికేషన్, 2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన దాఖలు చేసిన ఫారమ్–26, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరున్న ఫారమ్–7ఏ. వాటిని దానం నాగేందర్ తన కౌంటర్లో ఖండించలేదు. మళ్లీ ఆధారాల భారం వేయలేరు.. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం, కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం, 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం, బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం వంటి కీలక అంశాలను నాగేందర్ ఖండించలేదు. ఇలాంటి వాస్తవాలు అంగీకరించినప్పుడు మళ్లీ వాటి నిరూపణకు ఆధారాలపై భారం వేయడం సరికాదు. గెజిట్, అధికారిక పత్రాలకు ప్రాధాన్యం పిటిషనర్లు సమర్పించిన పత్రాలు ఒరిజినల్ లేదా సర్టీఫైడ్ కాపీలు కావని, వాటికి ఆధార విలువ లేదన్న స్పీకర్ అభిప్రాయం తిరస్కరణీయం. గెజిట్ వంటి అధికారిక పత్రాల ప్రామాణికతపై భారతీయ సాక్ష్య అధినియం 2023లోని సెక్షన్లు 80, 81ను గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ మౌనం అనర్హతను కాపాడదు.. నాగేందర్పై బీఆర్ఎస్ క్రమశిక్షణ చర్య తీసుకోలేదని, ఆయన్ను పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగించిందని స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశం అనర్హతను నిర్ధారించకుండా ఉండటానికి కారణం కాదు. పదవ షెడ్యూల్లోని పేరా 2 (1) (ఏ) కింద ఒక సభ్యుడు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేశాడా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. పార్టీ చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా అప్పటికే అమలైన అనర్హతను తొలగించలేవు. స్పీకర్ ఆదేశం చెల్లదు.. స్పీకర్ నాలుగు అంశాలపై ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగపరమైన బాధ్యతలకు విరుద్ధం. చట్టపరంగా చెల్లవు. 1986 నిబంధనలను ఆధారంగా చేసుకొని అనర్హత పిటిషన్లను తిరస్కరించడం కూడా సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలకు విరుద్ధం. 2024 ఏప్రిల్ 23 నుంచే.. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 2024 ఏప్రిల్ 23న దానం నామినేషన్ దాఖలు చేసిన తేదీనే ఆయన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలిన తేదీగా పరిగణించాలి. అనంతర పరిణామాలు ఆ అనర్హతను తొలగించలేవు. సుప్రీంకోర్టు ‘సుభాష్ దేశాయ్’తీర్పులో చెప్పినట్లుగా.. అనర్హత పార్టీ మార్పు, ఫిరాయింపునకు కారణమైన చర్య జరిగిన తేదీ నుంచే వర్తిస్తుంది. మా పరిస్థితి ఏమిటో అని కొందరు.. ఏమీ కాదన్న ధీమాలో ఇంకొందరు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్లో చేరారంటూ కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్కుమార్పై దాఖలైన పిటిషన్లలో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న మీమాంస పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొంది. మరికొందరు మాత్రం.. ఎంపీగా పోటీ చేసినందునే ఆయనపై న్యాయస్థానం అనర్హత వేటు వేసిందని, తమపై అలాంటి ఆరోపణ లేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్-హఫీజ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం. అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్ను వేడుకున్నారు. కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘ఇది తెలంగాణ పోలీసుల దారుణ ప్రవర్తన. మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు.This is atrocious behaviour by Telangana police Hope you will act @TelanganaDGP https://t.co/CFA6SWxDUe— KTR (@KTRBRS) September 19, 2026ఇదీ చదవండి: టీ20 క్రికెట్లో షఫాలీ వర్మ అరుదైన ఫీట్ -
రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ మోడల్ : తుమ్మల
సాక్షి,హైదరాబాద్: రైతు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో శుక్రవారం జరిగిన ‘సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్’లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.రైతులకు నిపుణుల సలహాలు అందించే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్ను ఆయన ఆవిష్కరించారు. అలాగే, ఫర్టిలైజర్ సేల్ ఫ్రేమ్వర్క్ (ఎఫ్ఎఫ్ఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి తుమ్మల వెల్లడించారు. యూరియా యాప్తో సాధించిన విజయాన్ని ఈ విధానంలోనూ కొనసాగిస్తామన్నారు.రైతు భరోసా: ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున ఇప్పటివరకు రూ.35,839 కోట్లు జమ. 2026 వానాకాలంలో కేవలం 9 రోజుల్లోనే 70.40 లక్షల మంది పట్టాదారులకు రూ.8,759 కోట్లు నేరుగా జమ.రుణమాఫీ: ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ కింద 25 లక్షల కుటుంబాలకు లబ్ధి (సుమారు రూ.21 వేల కోట్లు ఖర్చు).రైతు బీమా: గత మూడేళ్లలో ప్రీమియంగా రూ.3,531 కోట్లు చెల్లించి, 42 లక్షలకు పైగా రైతులకు బీమా భద్రత.కేంద్రానికి మంత్రి తుమ్మల ప్రధాన విజ్ఞప్తులుఆయిల్పామ్ ధర భరోసా: లక్ష హెక్టార్లలో సాగు విస్తరణ జరుగుతున్నందున, తాజా గెలలకు (ఎఫ్ఎఫ్బీ) టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలి; క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలి.మార్కెట్ ధరల పతనంలో కొనుగోళ్లు: మొక్కజొన్న (రూ.6 వేల కోట్లు), జొన్న (రూ.1,100 కోట్లు) కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసామని, 25 శాతం పీఎస్ఎస్ పరిమితిని సడలించి నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. అదనపు కొనుగోళ్ల ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలి.ఎల్నినో అసిస్టెన్స్ ఫండ్: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘ఎల్నినో అసిస్టెన్స్ ఫండ్’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.వికసిత్ తెలంగాణ 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని తుమ్మల పిలుపునిచ్చారు. మంచి విధానాలను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. -
సీఎం ప్రజావాణిలో దరఖాస్తుదారుల తాకిడి
సాక్షి,హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన 256వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 11 గ్రూపులు, 575 మంది ద్వారా 136 దరఖాస్తులు అందాయి.రెవెన్యూ శాఖకు 33, బీసీ సంక్షేమ శాఖకు 27, హోం శాఖకు 15, ఇతర శాఖలకు 61 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి ఓపికగా దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా మలి దశ ఉద్యమకారులకు తగిన గుర్తింపును ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ పలువురు అర్జీలను అందజేశారు. -
Hyderabad: వినాయక భక్తులకు ఫ్రీ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ పది రోజుల పాటు నెక్లెస్ రోడ్డుతో పాటు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోతాయి. ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహా గణపతికి దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుంటారు. కానీ ఈసారి ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. మహా గణపతి దర్శనంతో పాటు నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు వస్తున్న వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇప్పటికే తగు ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూడళ్లలో పార్కింగ్ స్థలాల ఫ్లెక్సీలు.. ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నగర నలుమూలల నుంచి వస్తున్న భక్తులు, వారి వాహనాల పార్కింగ్కు స్థలాలను గుర్తించిన అధికారులు వాటిని తెలియజేసేందుకు వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడికి దారి తీసే నాలుగు మార్గాల్లో అధికారులు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ స్థలాలకు వెళ్లే మ్యాప్లను క్యూ ఆర్ కోడ్లుగా తయారు చేసి ఫ్లెక్సీలు వేసి అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు నేరుగా తాము వస్తున్న ప్రాంతంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నేరుగా అక్కడికి వెళ్లవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఐ మ్యాక్స్ థియేటర్ వద్దతో పాటు, హెచ్ఎండీఏ ఎదురుగా ఉన్న ఐ మ్యాక్స్ పార్కింగ్స్థలం, ఈ–కార్ రేసింగ్ స్థలం, అమరవీరుల స్మారకం వద్ద పార్కింగ్ స్థలాలను అధికారులు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ట్రాఫిక్ రద్దీపై అప్డేట్.. మరో వైపు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఖైరతాబాద్ చుట్టూ పక్కల ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్తో పాటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లలో ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు గంటగంటకు సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీటిని చూస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు సాగుతున్నారు.సాధారణ రోజుల్లో సాయంత్రం.. సెలవు రోజుల్లో రోజంతా.. ఖైరతాబాద్ మహా గణపతికి వీక్షించే వారి సంఖ్యతో పాటు నిమజ్జన వేడుకల్లో పాల్గొనే వారు సాధారణ రోజుల్లో సాయంత్రం వేళల్లో, శుక్ర, శని, ఆదివారాల్లో అత్యధికంగా వస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్లుగానే వాహనాల దారి మళ్లింపుతో పాటు వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలాలను గుర్తించారు. ఇదీ చదవండి: రైల్వే టికెట్ల బుకింగ్.. కీలక విషయాలుసెలవు రోజుల్లో, వారాంతాల్లో సుమారు 2 లక్షల మందికిపైగా వచ్చే భక్తులకు వారి వాహనాల పార్కింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే స్థలాలు గుర్తించినప్పటికీ అధికారులు మాత్రం ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని పార్కింగ్ స్థలాలు కూడా సరిపోయే అవకాశం ఉండదని అందువల్ల మెట్రోతో పాటు బస్సు, ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. -
రైల్వే టికెట్ల బుకింగ్.. కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: రైల్వే టికెట్ కావాలంటే ఒకప్పుడు స్టేషన్కు పరుగుపెట్టేవారు... అక్కడ రిజర్వేషన్ కౌంటర్.. చాంతాడంత క్యూ.. గంటల తరబడి నిరీక్షణ. ఇప్పుడు పరిస్థితి మారింది. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. కోరుకున్న రైలుకు, కోరుకున్న రోజుకు టికెట్ రిజర్వ్ అవుతుంది. ఇలా ఆన్లైన్ టికెట్ బుకింగ్ కొత్తేమీ కానప్పటికీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా దగ్గరదగ్గరగా 90 (జూన్ వరకు గణాంకాల ప్రకారం 89 శాతంగా ఉంది) శాతం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. అంటే, రైల్వే శాఖ ప్రత్యేకంగా నిర్వహించే కౌంటర్లలో కేవలం 10 శాతం టికెట్లే అమ్ముడవుతున్నాయి.మరో మూడునాలుగేళ్లలో ఇక ప్రత్యేకంగా స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లే అవసరం లేదన్న పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. కరెంట్ బుకింగ్ టికెట్లు తప్ప రిజర్వ్డ్ టికెట్లకు ప్రత్యేకంగా స్టేషన్కు జనం రారని ఐఆర్సీటీసీ అంచనా వేస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగించలేని వారు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ వ్యవస్థ కొనసాగుతుంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 65.08 కోట్ల రిజర్వుడ్ టికెట్లు బుక్ కాగా... ఇందులో 57.90 కోట్లు ఆన్లైన్ ద్వారా, 7.18 కోట్లు కౌంటర్ల ద్వారా బుక్ అయ్యాయని తెలుస్తోంది.కౌంటర్ కంటే క్లిక్ మేలు! రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో డిజిటల్ మార్పు ఒక్కసారిగా వచ్చింది కానప్పటికీ, ఇప్పుడది మరింత వేగాన్ని పట్టుకుంది. 2013–14లో రిజర్వ్డ్ టికెట్లలో ఆన్లైన్ వాటా సుమారు 49 శాతం మాత్రమే. ఇప్పుడు అది 90 శాతానికి చేరువైంది. రైల్వే కూడా ప్రయాణికులను డిజిటల్ వైపు తీసుకెళ్లేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్, కొత్తగా రైల్ వన్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. 2026 మార్చి నాటికే రిజర్వుడ్ టికెట్లలో ఆన్లైన్ వాటా సుమారు 88 శాతానికి చేరినట్లు కేంద్రం వెల్లడించింది. ఎందుకింతగా ఆన్లైన్ వైపు? టికెట్ కోసం రైల్వే స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం ప్రధాన కారణం. ఇంట్లో నుంచే సీట్ల లభ్యత చూడటం, రైలు ఎంపిక చేసుకోవడం, చెల్లింపు చేయడం, టికెట్ను మొబైల్లోనే పొందడం వంటి సదుపాయాలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తున్నాయి.ఇదీ చదవండి: నాజూకు ఫోన్లతో పెరుగుతున్న రోగాలు!మరోవైపు కౌంటర్ల వద్ద క్యూలు, ప్రయాణ సమయం, నగదు చెల్లింపుల అవసరం వంటి అంశాలు డిజిటల్ బుకింగ్తో దాదాపు తప్పిపోయాయి. రద్దీ సమయాల్లో, ముఖ్యంగా పండుగల సమయంలో ఈ సౌకర్యం మరింత కీలకంగా మారింది.డబుల్ సామర్థ్యంతో రైల్వే సర్వర్లు... గతంలో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టికెట్లు బుకింగ్ జరిగితే సర్వర్ క్రాష్ అయ్యేది. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. భారీ ట్రాఫిక్ను తట్టుకునేందుకు ఐఆర్సీటీసీ తన నెక్ట్స్ జనరేషన్ ఈ–టికెటింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేసింది. కొత్త సర్వర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో మార్పులతో వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. 2026 జూలై 15న కొత్త యూజర్ ఇంటర్ఫేస్ బీటా వెర్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒకే స్క్రీన్పై వివిధ తరగతుల సీట్ల లభ్యతను చూసుకునే సదుపాయం కల్పించింది. ఇదీ చదవండి: యాపిల్ మడతపెట్టే ఫోన్పై మీమ్స్!దళారులకు చెక్.. డిజిటల్ బుకింగ్ పెరిగిన కొద్దీ నకిలీ ట్రాఫిక్, బాట్ల సమస్య కూడా పెరిగింది. 2026లోని ఆరు నెలల గణాంకాల ప్రకారం .. ఐఆర్సీటీసీ వ్యవస్థకు వచ్చిన భారీ సంఖ్యలో యాక్సెస్ రిక్వెస్టుల్లో సగానికి పైగా బాట్ల(సాఫ్ట్వేర్ ఆధారిత) నుంచే వచ్చిన సందర్భాలు నమోదయ్యాయి. ఆరు నెలల సగటులో 57.74 శాతం రిక్వెస్టులను బాట్ ట్రాఫిక్గా గుర్తించి నిరోధించినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇక అక్రమ బుకింగ్స్ను అడ్డుకునేందుకు అనుమానాస్పద యూజర్ ఐడీల డీయాక్టివేషన్, నకిలీ వెబ్సైట్లు–యాప్లపై చర్యలు, ఏజెంట్లపై నియంత్రణ వంటి చర్యలు కొనసాగుతున్నాయి. -
ఈ సవాల్కు కాంగ్రెస్ సిద్ధమా..?: హరీష్
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు మరోసారి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేసీఆర్ ఫాంహౌస్లో కబ్జా జరిగిందని నిరూపించాలంటూ చాలెంజ్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామన్నారు. కబ్జా కాదని తేలితే సీఎం సహా మంత్రులంతా రాజీనామాలు చేస్తారా? అని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా కేసీఆర్ ఫాంహౌస్ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దీని కారణం సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్.. కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు ఆదేశించారు. కేసీఆర్ ఫాంహౌస్లో 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, వెంటనే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కల్వకంట్ల కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉందని, ధరణిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ ఆరోపించారు. అదే అంశంపై హరీష్రావు సీరియస్గా స్పందించారు. ఏదైతే 300 ఎకరాలు కబ్జా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారో వాటిని నిరూపించాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. నిరూపిస్తే తమ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని, కాకపోతే మీరంతా రాజీనామా చేస్తారా? అని హరీష్ ప్రశ్నించారు. ఈ సవాల్కు కాంగ్రెస్ సిద్ధమా? అంటూ నిలదీశారు.ఇదీ చదవండి: హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్ యూటర్న్ -
తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్ నిజాలు
హైదరాబాద్ మహా నగరంలో ఒక అదృశ్య హంతకుడు నిశ్శబ్దంగా సంచరిస్తున్నాడు. కంటికి కనిపించడు, వాసన ఉండదు, రంగు మారదు, నాలుకకు చేదు రుచి కూడా తెలియదు. కానీ ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి, మీ వంటిట్లోకి, మీ గొంతులో మీ పిల్లల గొంతులోకి దర్జాగా చొరబడి రక్తంలో కలిసిపోతున్నాడు. చేతిలోని గ్లాసులో తళతళలాడుతూ స్వచ్ఛమైన అమృతంలా కనిపిస్తున్న ఆ తాగు నీరు అమృతం కాదు... క్షణక్షణం ప్రాణాలు హరించే ఒక భయంకరమైన రసాయన బాంబు. నగర భూగర్భంలో ఇప్పుడు ప్రవహిస్తున్నది జలం కాదు, మనుషులను కబళించే అత్యంత ప్రమాదకరమైన సైలెంట్ పాయిజన్. వీడియో లో పూర్తిగా వివరాలు చూడండి. -
దానం సీటు ఖాళీ.. ఉప ఎన్నికలపై కారు-కమలం గురి!
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీజేపీలు అప్పుడే అక్కడ జరగబోయే ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. దానం నాగేందర్ అనర్హత వేటు పడిన తదుపరి నిమిషంలోనే ఇరు పార్టీల నేతలు ఆ నియోజకవర్గం గెలుపు పల్లవి అందుకున్నారు ఈ క్రమంలోనే గెలుపు తమదే అంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.దానం నాగేందర్పై అనర్హత వేటు బీఆర్ఎస్ విజయమని, న్యాయ గెలిచిందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ కౌశిక్రెడ్డి విమర్శించారు. ఒక పార్టీపై గెలిచి వేరే పార్టీ నుంచి పోటీ చేయడం నేరమని, మిగతా 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు కౌశిక్రెడ్డి. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారాయన.ఇక బీజేపీ కూడా హైకోర్టు తీర్పును స్వాగతించింది. దానం నాగేందర్ అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్కు చెంపపెట్టని బీజేపీ శాసనసభా పక్ష (బీజేఎల్పీ) ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఇకనైనా బుద్ధి మార్చుకోవాలన్నారు. పార్టీ మారాలంటే భయపడేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఏలేటి పేర్కొన్నారు. దానం నాగేందర్ అనర్హత అంశానికి సంబంధించి కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం ఉండదన్నారు. ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: దానం నాగేందర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ -
దానం నాగేందర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్లు నిర్ధారించి, శాసనసభ్య సభ్యత్వం కోల్పోతున్నట్లు స్పష్టం చేసింది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడాన్ని హైకోర్టు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మరియు ఉత్తర్వులను కోర్టు పూర్తిగా కొట్టివేసింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 మార్చి 17న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీ-ఫామ్పై సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.దీంతో, బీఆర్ఎస్ టికెట్పై గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన ఆయనపై శాసనసభ్య సభ్యత్వం నుంచి అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు.స్పీకర్ క్లీన్చిట్.. హైకోర్టులో సవాల్ ప్రతిపక్ష నేతల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ ఏడాది మార్చి 11న సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్చిట్ ఇస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పిన న్యాయస్థానం.. దానం నాగేందర్ ఎంపీగా పోటీచేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు దానం నాగేందర్ కొంత సమయం కోరగా, ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.ఇదీ చదవండి : దానం తీర్పు.. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల టెన్షన్! -
స్పీకర్కు హోంమంత్రి పదవి.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి ‘కాబోయే హోంమంత్రి మీరే అవుతారని మాకు సమాచారం ఉంది.. అందుకే శాంతి భద్రతల విషయం మీకు చెబుతున్నాం’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా హైదరాబాద్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తుల్లో పోలీసులంటే భయం లేకుండా పోయిందని, నేరాలను అరికట్టాలంటే కఠినంగా శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని బలాలా పేర్కొన్నారు. నేరస్తులకు చట్టం, శిక్షలంటే భయం లేకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడితేనే వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో స్పీకర్ను ఉద్దేశించి బలాలా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆసక్తికరంగా మారాయి. ‘కాబోయే హోంమంత్రి మీరే అవుతారని మాకు సమాచారం ఉంది.. అందుకే మీకు చెబుతున్నాం స్పీకర్ గారు’ అని అన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. నగరంలో నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు, నేరస్తుల్లో చట్టంపై భయాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బలాలా సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. స్పీకర్కు హోంమంత్రి పదవి ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హోంశాఖ.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందినేరస్తులకు అసలు భయం ఉండడంలేదు, శిక్ష కఠినంగా ఉంటేనే నేరాలు తగ్గుతాయిఇప్పుడు రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నాడు కానీ భవిష్యత్తులో మీరే హోంమంత్రి అవుతారని మాకు సమాచారం ఉంది అందుకే మీకు చెప్తున్నాము స్పీకర్ గారు– ఎంఐఎం… https://t.co/2otHaTA20l pic.twitter.com/a2kWgxMBhs— Telugu Scribe (@TeluguScribe) September 18, 2026Video Credit: Telugu Scribe -
22A వివాదం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
22ఏపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి పొంగులేటిజీవో 564 ద్వారా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్, రాజీవ్ గాంధీతో కమిటీ ఏర్పాటు చేశాంజీవో 118 ద్వారా 22A లో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు రేపు పట్టాలు ఇస్తున్నాం22A నుంచి వాళ్ళను లిఫ్ట్ చేస్తున్నాం.22A సింగరేణి ప్రాంతంలో 76 జీవోపై రేపు అసెంబ్లీలో భేటీ కానున్నాంరేపే జీవో రూపంలో సమస్యను పరిష్కరించబోతున్నాంజీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను త్వరలోనే జీవో రూపంలో పరిష్కరిస్తాం.తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సమస్య ఉంది: కూనంనేని విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఐడల్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలికొత్తగూడెంలో ఐడల్ పవర్ ఉత్పత్తిని పునరుద్ధరించాలిఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి.తమిళనాడు తరహాలో ట్రాఫిక్ పోలీసులు కూర్చునే ఏర్పాటు చేయాలిసింగరేణి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేవ్స్ ఇవ్వాలని కోరుతున్నాంహైకోర్టు తీర్పు వేళ అసెంబ్లీలో దానం ఆసక్తికర వ్యాఖ్యలుహైకోర్టు తీర్పు వేళ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్తన భవిష్యత్తు ఏమవుతుందో తనకే తెలియదంటూ ఆవేదననేను ఫైటర్ను.. ఫైట్ చేస్తానేడు తేలనున్న ఎమ్మెల్యే దానం భవితవ్యంపార్టీ ఫిరాయింపు కేసుపై తీర్పు వెల్లడించనున్న హైకోర్టుదానం పార్టీ మారలేదంటూ ఇప్పటికే స్పీకర్ క్లీన్చిట్తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని హైకోర్టుకు తెలిపిన దానం -
22A పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైలెవల్ కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ముగ్గురు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కమిటీ ఏర్పాటైంది. రెవెన్యూ, న్యాయ, రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలను పరిశీలించి 22ఏ సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరించడమే కమిటీ ప్రధాన ఉద్దేశం.ముగ్గురు అధికారులతో కమిటీ22ఏ భూముల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. లా సెక్రటరీ పాపిరెడ్డి, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై వచ్చిన అభ్యంతరాలు, రికార్డులు, చట్టపరమైన అంశాలను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించనుంది.ఫాస్ట్ట్రాక్లో పరిష్కారం22ఏ జాబితాలో చేరిన ప్రైవేటు భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సందర్భాల్లో అర్హత ఉన్న యజమానులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హత ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేలా కమిటీ పనిచేయనుంది. ఇటీవల అసెంబ్లీలో 22ఏ భూములపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 12 అంశాలతో కూడిన కార్యాచరణను ప్రకటించారు. ఇందులో అసైన్డ్ భూములు, ఆమోదిత లేఅవుట్లలోని భూములు, జీఓ 59, జీఓ 118, నాలా చార్జీలు, అనధికార లేఅవుట్లు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు ప్రకటించారు.పొంగులేటి ఆదేశాలతో..ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రకటన నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశాలతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. 22ఏ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఈ కమిటీ నిర్ణయాలు కీలకం కానున్నాయి.ఇదీ సమాచారం: సిద్దిపేటలో హైటెన్షన్.. ఎర్రవల్లి సర్వేకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు -
సీఎం రేవంత్కు కేటీఆర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు ఇవాళ ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష కోట్లు కొల్లగట్టామని రేవంత్రెడ్డి అంటున్నారు. రేవంత్కు మంచి ఆఫర్ ఇస్తున్నా. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాం. మిగతా రూ. 99 వేల కోట్లు మీరే తీసుకోండి.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఖర్చు చేయండి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘ఆ డబ్బులతో విద్యార్థుల బకాయిలు చెల్లించండి. ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాళేశ్వరంలో లక్షకోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారంచేస్తున్నారు. హామీలను రేవంత్ గాలికొదిలేశారు. గత మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరకు వాళ్ల టార్గెట్ అంతా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడమే.. కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీలోని నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ హరాస్ చేస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారం రేవంత్ సర్కార్ టార్గెట్ కావాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.రైతులకు ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ, 15వేల రైతు భరోసా, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కరెంటు కావాలని రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. లక్ష కోట్లని కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారు. కేసీఆర్పైన ఆయన కుటుంబంపైన రేవంత్ విషం చిమ్ముతున్నారు.ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు మంచి పేరు తెచ్చే విషయం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే ఫార్ములా ఈ-రేస్. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ఏర్పాటు చేస్తే దానిపై విషం చిమ్ముతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రెండుసార్లు కోర్టుకు నేను హాజరయ్యాను. కోర్టుకు నేను సహకరిస్తాను. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి విచారణకు హాజరవుతాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ -
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ కోర్టు విచారణ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసర ప్రాంతాలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు వచ్చారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ.54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్గా ఉన్న అర్వీద్ కుమార్ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది.ఇదీ చదవండి: కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చింది: దానం -
కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చింది: దానం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తమకు ప్రాధాన్యమివ్వడం లేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను మాత్రమే పట్టించుకున్నారు.. ఎంఐఎం ఎమ్మెల్యేలంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? అంటూ ప్రశ్నించారు. మంత్రిని అడిగితే కూల్ అంటున్నారు. కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘ప్రభుత్వ నిబంధనలు అధికారులు ఫాలో కావడం లేదు. నా విషయంలో ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఫైటర్ను.. ఫైట్ చేస్తా. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటాం’’ అని దానం పేర్కొన్నారు. కాగా, తనకు దానం నాగేందర్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ.. తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు. నోటీసులు ఇస్తే ఎమ్మెల్యే ప్రివిలేజ్ కాపాడే చర్యలు తాను తీసుకుంటానన్నారు.దానం నాగేందర్ వ్యాఖ్యలపై మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. నిబంధనల ప్రకారమే ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: సిద్దిపేటలో హైటెన్షన్.. -
వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య!
హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పాల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్స్టాప్ సమీపంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్! -
ఎమ్మెల్యే దానం అనర్హతపై హైకోర్టు తీర్పు నేడే
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ‘అనర్హత’అంశంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లలో హైకోర్టు ఇవాళ(శుక్రవారం) తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 3:45 గంటలకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో).. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ దానం పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు చెప్పనుంది.ఇదీ చదవండి: సెప్టెంబర్లో సెగలు! -
ఈసారైనా ఎస్ఐ అవుతానో.. లేదో !
జనగామ జిల్లా: గతంలో ఎస్ఐ ఉద్యోగ వేట ఫలించలేదు. ఈసారి అయినా వస్తుందో.. రాదోనని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ సిరిపురం నవీన్కుమార్, మృతుడి మేనమామ భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్–స్వరూప దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉంది. తండ్రి ప్రభాకర్ మహారాష్ట్రలో ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటున్నారు. అతని రెండో కుమారుడు పొడిశెట్లి సాయి (26)కి పోలీస్ ఉద్యోగం అంటే మక్కువ. గతంలో పరీక్ష రాయగా కొద్ది మార్కులతో రాలేదు. నోటిఫికేషన్ విడుదల కాగా, మళ్లీ ప్రిపేర్ కావడానికి ఇటీవల స్వగ్రామానికి వచ్చి మేనమామ భరత్ వద్ద ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి స్నేహితుల వద్ద ఈసారైనా తాను పాస్ అయితే ఇంట్లో అమ్మనాన్నల కష్టాలు తీరుతాయని, కానీ, జాబు వచ్చే నమ్మకం లేదంటూ బాధ పడుతుండేవాడు. గురువారం ఉదయం నుంచే స్నేహితులందరినీ కలిసిన సాయి.. ఓ సూసైడ్ నోట్ రాసి అందరికి వాట్సాప్లో పంపాడు. అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్సాప్ చూసిన స్నేహితులు హుటాహుటిన అతని ఇంటికి చేరుకొని చూసేసరికే మృతి చెందాడు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సూసైడ్ నోట్లో ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నేనే బాధ్యుడిని. అమ్మ బాపు నా వల్ల ముందు ముందు మీరు బాధ పడకూడదు. నేను మీకు భారం కావొద్దు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా’అని ఉంది. -
భారీ వర్షాల హెచ్చరిక.. ఉద్యోగులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు, గణేశ్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో ప్రయాణ సంబంధిత ఇబ్బందులు, రహదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 25 వరకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉద్యోగులకు దశలవారీగా ముందుగానే విధులు ముగించే అవకాశం కల్పించాలని కోరారు. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఉల్పించాలని ఐటీ సంస్థలు, ఇతర సంస్థలకు సూచించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు వాతావరణ పరిస్థితులు మారుతాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులతో కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. వర్షాలు, నిమజ్జన ఊరేగింపుల కారణంగా రహదారులపై ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగుల ప్రయాణాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్ అవకాశంకల్పించాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు. సైబరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలు కూడా 18 నుంచి 25 వరకు ఆన్లైన్ లేదా వర్చువల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. -
రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్!
తెలంగాణ: కళాశాలకు వెళ్లమని తండ్రి మందలించడంతో అనంతపూర్ నుంచి సికింద్రాబాద్కు చేరుకున్న ఇంటర్ విద్యార్ధి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పీఎస్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ–సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల అప్లైన్ మధ్యన గురువారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు మృతుడి ప్యాంటు జేబులో జనరల్ రైల్ టికెట్ లభించింది. దానిపై నాన్న అని మొబైల్ నెంబర్ రాసి ఉంది. ఆ నెంబర్కు కాల్ చేసిన పోలీసులు మృతుడు అనంతపూర్కు చెందిన గోసల రమేశ్ కుమారుడు పవన్సాయి (18)గా గుర్తించారు. పవన్సాయి అనంతపూర్లోని నారాయణ రెసిడెన్సియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వినాయక చవితి సెలవులకు పవన్సాయి ఇంటికి వచ్చాడు. సెలవుల తరువాత తిరిగి కళాశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: చెల్లిని కాపాడేందుకు వాగులో దూకిన అన్న.. పరిస్థితి తారుమారు! -
పెళ్లి చేయడం లేదంటూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ...
సాక్షి, హైదరాబాద్: తండ్రి మందలించాడన్న కారణంతో కూతుళ్లు ఇంటిని వదిలి పారిపోయారు. ఈ సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నివాసి సుభాష్ సింగ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఈనెల 14న ఆడపిల్లల పెళ్లి విషయమై ఇంట్లో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సోదరుడు ఓ సోదరిపై చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి పిల్లలను మందలించాడు. తండ్రి కూడా తమ మాట వినడం లేదని కుమార్తెలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇద్దరూ ఈనెల 15న ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో విచారించిన కుటుంబ సభ్యులు చివరకు హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెప్టెంబర్లో సెగలు!
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ సెగలు కక్కుతోంది. సాధారణంగా ఉండాల్సిన చల్లదనం మాయమైంది. వేసవిని తలపించేలా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎల్నినో, ఇతర భౌగోళిక పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపిస్తున్నాయి. అడపాదడపా వర్షం.. ఆ వెంటనే తీవ్రమైన ఉక్కపోత. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలను తాకుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో వాతావరణం అత్యంత విచిత్రంగా మారింది తేమ ఎక్కువ..మేఘాలు నిల్ ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, మేఘాలు లేకపోవడంతో ఆగస్టు, సెప్టెంబర్ తొలిభాగంలో సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడింది. ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల పగటిపూట సౌర వికిరణం (సోలార్ రేడియేషన్) నేరుగా భూమిని తాకుతోంది, తద్వారా పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతూ కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు కూడా చేరువవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత (హై హ్యుమిడిటీ ట్రాప్) కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల్లో తేమ శాతం 70 శాతానికి పైగా ఉంటోంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండి, మేఘాలు లేనప్పుడు భూమి విడుదల చేసే వేడి అంతరిక్షంలోకి వెళ్లకుండా వాతావరణంలోనే బందీ అవుతోంది. దీనివల్ల రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ప్రస్తుతం రాత్రి వేళల్లో 20–22 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన ఉష్ణోగ్రతలు, 24–27 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యమైన కారణాలు... ⇒ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ నుండి తీవ్రమైన ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. ⇒ ఎల్నినో తీవ్రత వల్ల భారత ఉప ఖండంపై రుతుపవన ద్రోణి బలహీనపడింది. ఫలితంగా, బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన అల్పపీడనాల సంఖ్య తగ్గింది. దీనివల్ల తెలంగాణకు అందాల్సిన స్థిరమైన వర్షాలు ఆగిపోయాయి. ⇒ ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఆగస్టు మాసంలో సాధారణం కంటే దాదాపు 38–64% తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 17 నాటికి కూడా రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు తీవ్రంగా కొనసాగుతోంది ⇒ వాతావరణ విచ్చిన్నత (ఫ్రాంగ్మ్యాంటెడ్ మాన్సూన్)..ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవన వాతావరణం దెబ్బతింది. నిరంతరంగా కురిసే ముసురు వానలకు బదులుగా, సుదీర్ఘమైన కరవు పరిస్థితులు (డ్రై స్పెల్), ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విచిత్ర వాతావరణం ఏర్పడింది. ⇒ హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, రోడ్లు పగటి వేడిని పీల్చుకుని రాత్రి వేళల్లో ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేయడం వల్ల రాత్రిపూట కూడా విపరీతమైన ఉక్కపోత ఉంటోంది.4, 5 రోజుల్లో వర్షాలుసెప్టెంబర్ 17 నాటి వాతావరణ అంచనాల ప్రకారం... రానున్న 4–5 రోజులలో స్థానిక ద్రోణుల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు పెరిగిన ఉష్ణోగ్రతల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తున్నప్పటికీ, ఎల్నినో ప్రభావం రాబోయే శీతాకాలంపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు -
మా భూములు గుంజుకుంటారా?
గజ్వేల్: ‘చిన్నప్పటిసంది ఈ భూముల్లోనే తిరిగినం.. పశువులు మేపినం.. రాళ్లు, రప్పలు ఉండె..రెక్కలు ముక్కల్జేసి సాగుజేసినం. మా తాతలకెల్లి ఈ భూములతోనే మా బతుకు ముడిపడి ఉంది. సావనైనా సస్తం గాని...మా భూములను ఇడవం. ఈ సర్వేలెందుకు? మా బతుకులు బుగ్గి చేస్తరా? ఇన్ని ఏండ్లయినా మాకు పాసు పుస్తకాలు రాలే, ముందుగల్ల పట్టాలిచ్చి పాస్ పుస్తకాలివ్వండి. రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తారా?’అంటూ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాల్లో గల 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల్లో గురువారం ప్రారంభమైన రెవెన్యూ సర్వే ప్రక్రియ దళిత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ భూముల వద్దకు చేరుకున్నారు. కొత్తగా ఈ సర్వేలు చేపట్టి ఏం చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ సర్వే నంబరులో ఉన్న 388 ఎకరాల భూములు 200 కుటుంబాలకు జీవనాధారంగా పేర్కొంటూ ప్రాణాలు పోయిన భూములివ్వం అంటూ తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా బతుకులు ఆగం చేస్తారా? ఈ సర్వే నంబరులో నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. గతంలో మక్కజొన్న, పజ్జొన్న లాంటి మెట్ట పంటలు వేసుకొని బతికెటోల్లం. కేసీఆర్ సీఎం అయినంక... ఇక్కడ పాండురంగసాగర్ రిజర్వాయర్ కట్టించిండు. దీని తర్వాత వరి సాగు చేసుకుంటున్నం. ఇప్పుడు మా భూముల్లో ప్రభుత్వం చెప్పిందని అధికారులు సర్వే చేస్తుండ్రు. ఈ సర్వే ఎందుకు? మా భూములు వేరే వారికి ఇస్తారా? అలా చేసి మా బతుకులను ఆగం చేస్తారా ? – ముక్కిడి శ్రీనివాస్ ఈ పొలమే నా జీవనాధారం మా భూములల్ల సర్వే చేసి మమ్మల్ని ఆగం చేయొద్దు. నాకు 325 సర్వే నంబరులో ఎకరంన్నర పొలం ఉన్నది. ఈ పొలమే ఆధారం. సర్వే ద్వారా ఎన్నో ఏండ్ల సంది సాగు చేసుకుంటున్న మమ్మల్ని కాదని, వేరే వాళ్లకు భూములు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అట్ల చేసి మమ్మల్ని ఆగం చేస్తారా ? – బలింపురం యాదగిరి మేం దళితులమే కదా..మా భూములను గుంజుకుంటరా ? మేం కూడా దళితులమే కదా..మా భూములు గుంజుకుంటారా? మా తాతల కాలం నుంచి మేమే సాగుచేసుకుంటున్న భూములు. మాకు పట్టాలు పంచిన తర్వాత, మా గ్రామంలో ఇంక ఎవరైనా రైతులు మిగిలి ఉంటే వారికి భూములు ఇవ్వండి. కానీ మావి గుంజుకోవాలని చూడకండి. కేసీఆర్ వల్ల మాకు ఇక్కడ నీటి సౌకర్యం కలిగింది. వరి పంట వేసుకుంటున్నాం. కేసీఆర్ మా భూముల్లోకి రాలేదు. – ఎడమ కర్ణాకర్ రాళ్లురప్పల భూములను బాగు చేసుకున్నం నాకు తెలిసినకాడికి యాభై, అరవై ఏండ్ల సంది మేం ఈ భూములను సాగుచేసుకుంటున్నం. అప్పట్లో నీళ్లు లేక, బొబ్బర్లు, ఉలువలు సాగుచేసుకునే వారు. గిప్పుడు కాల్వలు, పాండురంగసాగర్ ద్వారా నీళ్లు వచి్చనయ్. వరి పంట చేసుకొని బతుకుతున్నం. గిప్పుడు మా భూములను గుంజుకోవాలని చూడొద్దు. – గీసు మల్లేశం అప్పుడు ఇవి గడ్డి మొలవని భూములు ఒకప్పుడు గడ్డి మొలవని భూములివి. మేం కష్టపడి బాగు చేసుకున్నం. నాకు ఇక్కడ ఎకరం భూమి ఉన్నది. కేసీఆర్ మాకు నీళ్లు అందించిండు. వరి పొలం సాగుచేసుకుంటున్న. మా తాతలు అప్పగించిన భూమి ఇది. ఎంతో ఇçష్టంతో వ్యవసాయం చేసుకుంటున్నం. – ఎడమ మల్లేశం ఈ భూములు మావే నేను చిన్నగున్నప్పటినుంచి నేను భూముల్లో పశువులు మేపుకుంటూ తిరిగిన. ఇవి పాడుపత్తర్ లెక్క ఉండే. మెల్లమెల్లగా మంచిగ చేసుకొని సాగుచేసుకుంటున్నం. కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు. మంచి సౌలత్ చేసిండు. – ఎడమ చంద్రయ్య -
ఘాటెక్కిన ఉల్లి! భగ్గుమంటున్న ధర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా సరఫరా తగ్గుదల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో జూలైలో కిలో రూ. 20 పలికిన ఉల్లి.. ప్రస్తుతం రూ. 60కి చేరింది. ఇక తెల్ల ఉల్లి కిలో రూ. 100 మార్కుకు చేరుకుంది. మంచిర్యాలలో నెల రోజుల వ్యవధిలో రూ. 30 నుంచి రూ. 70కి పెరిగింది. మలక్పేటలోని హోల్సేల్ మార్కెట్ అయిన గంజ్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ. 5,200 నుంచి రూ. 5,500 దాకా పలుకుతోంది. మలక్పేట మార్కెట్కు గతేడాది ఆగస్టులో 2,54,120 క్వింటాళ్ల ఉల్లి వస్తే ఈ ఏడాది 1,99,686 క్వింటాళ్లే వచ్చాయి. రోజూ 25 వేల బస్తాలకు బదులు 15 వేల బస్తాలే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సగటు రిటైల్ ధర సెప్టెంబర్ 16న కిలోకు రూ. 53.84గా నమోదైంది. గతేడాది అదే రోజున కిలో ధర రూ. 27.71గానే ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ఉల్లి సగటు చిల్లర ధర దాదాపు 94 శాతం పెరిగింది. తగిన వర్షాల్లేక.. ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలోని ప్రధాన ఉల్లి సాగు ప్రాంతాలైన మహారాష్ట్రలోని నాసిక్, ఏపీలోని కర్నూలుతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడి తగ్గింది. దీనికితోడు గత రబీ సీజన్లో అధిక తేమ వల్ల నిల్వ ఉంచిన పంట సైతం దెబ్బతిన్నది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ సరఫరాను 19 నగరాలకు విస్తరించింది. ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిని తరలించేందుకు రైల్వే ర్యాక్లు, కాండా ఎక్స్ప్రెస్, 30కిపైగా ట్రక్కులను వినియోగిస్తోంది. నాసిక్ నుంచి పంపిన రైలు ర్యాక్ల ద్వారా ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలకు ఇప్పటికే చేరింది. అలాగే ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ. 35కే విక్రయిస్తోంది. కానీ బఫర్ స్టాక్ నుంచి సరఫరా చేసిన ఉల్లి.. ప్రతి మార్కెట్కు సమానంగా చేరకపోవడం సమస్యగా మారింది. అందుకే సాధారణ వినియోగదారులు బహిరంగ మార్కెట్లలో ఉల్లిని దాదాపు రెండింతల ధరకు కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లోకి పూర్తి స్థాయిలో వచ్చే వరకు (మరో నెల రోజులపాటు) ఉల్లి ధరల మంట తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నాటి అసంఖ్యాక సవాళ్లకు హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబం
సాక్షి, హైదరాబాద్: విభిన్న రాజకీయ పరిస్థితుల నడుమ ఎన్నో సంఘర్షణలకు గురైన ప్రజలను ఏకతాటి పైకి తేవడంలో ఒక నవ స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అసంఖ్యాక సవాళ్లను హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబిస్తుందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ పరిణామాలను రాజనీతిజ్ఞత, ధైర్యం, త్యాగాల గాథగా ఆయన అభివర్ణించారు. ప్రతి పౌరుడికీ సమాన స్థాయినిచ్చే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య సౌధం నిర్మించే దిశగా నిరంతర, బృహత్తర ప్రక్రియ కొనసాగిందని అన్నారు. హైదరాబాద్ విమోచన నేపథ్యంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని ఆయన కొనియాడారు. ఆనాడు విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక, రాజకీయ కార్యకర్తలు, రైతులు సహా సామాన్య పౌరులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేకమంది కఠిన కారాగార వాసం, హింస, అంతులేని వ్యక్తిగత కష్టనష్టాలకు గురయ్యారని తెలిపారు. రామ్జీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి దేశభక్తులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు. గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏకీకృత సమైక్య భారత్కు పటేల్ పునాది ‘స్వతంత్ర భారత చరిత్రలో ఓ కీలక ఘట్టానికి హైదరాబాద్ సంస్థాన విమోచనం ముగింపు పలికింది. జాతీయ సమగ్రత, సార్వజనీనతకు బాటలు వేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘట్టం మనకు గుర్తుచేస్తుంది. ఈ సంస్థాన విమోచనం ద్వారా బలమైన, ఏకీకృత సమైక్య భారత దేశానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢమైన పునాది వేశారు. దేశ ఐక్యత కోసం పౌరులందరూ ఒకే రీతిలో ఉండాల్సిన అవసరం లేదు. భిన్న భాషలు, విభిన్న సంప్రదాయాలు, విశ్వాసాలు గలవారై ఉండవచ్చు. అదేవిధంగా భిన్న రాజకీయ అభిప్రాయాల గలవారూ ఉండొచ్చు. అంతిమంగా రాజ్యాంగం, సార్వ¿ౌమాధికారం ప్రజలకే చెందుతాయన్న వాస్తవమే వారిని ఏకతాటిపై నిలుపుతుంది. నేటి వేడుక ఒక చారిత్రక తేదీ సంస్మరణకు మాత్రమే పరిమితం కాబోదు. ఇది భారత ప్రగతి ప్రస్థానాన్ని, దేశ సమైక్యతను సమున్నతంగా నిలిపే విలువలను గుర్తుచేసే సందర్భం. కేంద్ర బలగాల కీలక పాత్ర 1947–1948 మధ్యకాలంలో దేశ నిర్మాణంలో కేంద్ర బలగాలు ఎంతో కృషి చేశాయి. నక్సల్ రహిత భారత్, ప్రతి రాష్ట్రం ప్రశాంతంగా శాంతి భధ్రతల సమస్యలు లేకుండా ఉండాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం.. విజన్. ఇందులో భాగంగా నక్సలిజం నిర్మూలనలో కూడా ఈ బలగాలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజం దేశంలో అంతమైంది. ఛత్తీస్గఢ్లో నక్సలిజం పూర్తిగా కనుమరుగైన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలోని యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో గాం«దీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. తర్వాత సంస్థానాల ఏకీకరణకు పటేల్ ఎనలేని కృషి చేశారు. తదుపరి తరంలో నేడు ‘వికసిత భారత్–2047’దిశగా ప్రస్థానానికి ప్రధాని మోదీ సమర్థ సారథ్యం వహిస్తున్నారు..’అని ఉప రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్కు, జోద్పూర్కు మధ్య అనుబంధం: షెకావత్ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం స్వాతంత్య్ర దినోత్సవం కాదు..సంకల్ప దినోత్సవం. జాతీయ ఏకతా దినం. హైదరాబాద్ విమోచన దినోత్సవం నుంచి ప్రేరణ పొంది సంకల్పబద్ధంగా ముందుకు సాగి, దేశం వికసిత్ భారత్ వైపు సాగేందుకు సంకల్పం ఉపకరిస్తుంది. దేశంలో అంతే ముఖ్యమైన పరివర్తన ఇప్పుడు మోదీ నేతృత్వంలో సాగుతోంది. సర్దార్ పటేల్ సాహసోపేత ‘ఆపరేషన్ పోలో’అన్యాయంపై న్యాయం సాధించిన విజయం. ఇందులో నా స్వస్థలం జో«ద్పూర్కు చెందిన సైనిక యోధులు, మా పూర్వీకులు, కుటుంబీకులు కూడా పాల్గొనడం నాకెంతో గర్వకారణం. ఆ విధంగా హైదరాబాద్కు జో«ద్పూర్కు మధ్య విడదీయరాని బంధం ఉంది. నేను ఇక్కడికి జోద్పూర్ ప్రతినిధిగా వచ్చా..’అని షెకావత్ అన్నారు. వికసిత్ భారత్ దిశగా పునరంకితం కావాలి: గవర్నర్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ..జాతీయ చరిత్రలో హైదరాబాద్ విమోచన అత్యంత విశిష్టమైన, చారిత్రాత్మక దినమని చెప్పారు. నాటి పోరాటాలు, పూర్వీకులు పడిన కష్టానష్టాలు, బలిదానాలను నేటి యువత అర్థం చేసుకుని.. ఆ అనుభవాలు, వీరసైనికుల పోరాటం, త్యాగాల పునాదిగా వికసిత్ తెలంగాణ తద్వారా వికసిత్ భారత్ సాధన దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వాళ్లెందుకు పోరాడాల్సి వచ్చింది: కిషన్రెడ్డి ‘నిజాం మంచి వాడని పాలకులు అంటున్నారు. అద్భుతమైన పాలన అందించి ఉంటే వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఎంతోమంది మహానుభావులు నిజాం అణచివేతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది?..’అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రజాకార్ల ఆగడాలను కప్పిపుచ్చే ప్రయత్నం: బండి సంజయ్ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు నిజాం గొప్పోడనే పరిస్థితి రావడం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రజాకర్ల అఘాయిత్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి తొలుత పోలీస్ అమరవీరుల స్మృతి స్థూపం వద్ద ఉప రాష్ట్రపతి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాగా కేంద్ర బలగాలకు సంబంధించిన 10 బృందాలు డప్పు, డోలు, కోలాటం, గుస్సాడి, శివసత్తులు, లంబాడీ, బతుకమ ్మ, పేరిణి శివతాండవం కళా, నృత్యరూపాల ప్రదర్శించాయి. ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్టులో పలువురు నేతలు, అధికారులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. -
పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రజా పాలనకు పునాదులని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెప్టెంబర్ 17 మనకు గతాన్ని మాత్రమే గుర్తు చేసే రోజు కాదు. మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక ఘట్టం. సకల జనుల ఉద్యమం, ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఆ చరిత్ర, ఆ ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ చేరాలి. చరిత్రను మరిచిపోం. చరిత్ర దగ్గరే ఆగిపోం. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో... తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో గురువారం జరిగిన ప్రజా పాలన దినోత్సవాల్లో ముఖ్యమంత్రి మువ్వన్నెల జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులందరికీ ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని గుర్తుచేశారు. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం అని కితాబిచ్చారు. ఆ సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాం పాలనలో పురోగతి.. ‘భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలోనే కొనసాగింది. నిజాం పాలనలో హైదరాబాద్ పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించింది. నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచస్థాయి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణిచివేత తీవ్రంగా ఉండేది. చివరి దశలో రజాకార్ల దౌర్జన్యాలు ప్రజలను కల్లోలపరిచాయి. భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడింది. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, అనభేరి ప్రభాకర్రావు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు పోరాటాలకు నాయకత్వం వహించారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టారు. ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైంది. అది నిజాం పాలకుల అధికారం ముగిసిన రోజు మాత్రమే కాదు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం. అందుకే సెప్టెంబర్ 17ను మనం ‘ప్రజా పాలన దినోత్సవం’గా జరుపుకుంటున్నాం’అని రేవంత్ రెడ్డి వివరించారు. వరంగల్లో టిమ్స్ ఆసుప్రతి.. ఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ‘అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. వరంగల్లో 2,000 పడకలతో టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించాం. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించాం. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభించాం. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తాం’అని తెలిపారు. రహదారులు అభివృద్ధికి సూచిక.. డిసెంబర్లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరిస్తామని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. ఆర్అండ్బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నాం’అని సీఎం వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే... ⇒ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి. ంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళా మార్ట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నాం. మహిళను కేవలం లబ్ధిదారుగా కాకుండా.. ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. ⇒ కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ⇒ ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశాం. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ⇒ ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించాం. ⇒ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీఎం తేల్చిచెప్పారు. అందుకే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. -
‘మంత్రి పదవి కంటే పీసీసీ పదవే పెద్దది’
ఢిల్లీ : ఈ నెలాఖరుకు పార్టీ పదవులు, కార్పొరేషన్లు, డైరెక్టర్లు, డిసీసీ బ్యాంక్ చైర్మన్లు, డీసీసీ పదవులు భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో పలు విషయాలను పంచుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలోనే తన మంత్రి పదవి గురించి కూడా కాస్త భిన్నంగా స్పందించారాయన. తనను ఎవరూ మంత్రి పదవి తీసుకోమని ఎవరూ అడగలేదని, అయినా మంత్రి పదవి కంటే పీసీసీ పదవే పెద్దదే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు మహేష్గౌడ్. ‘వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నలుగురిని నియమిస్తాం. ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ, జనరల్ కేటగిరీలకే ప్రాధాన్యత. తెలంగాణ ఇంచార్జ్ ఎవరినేది అధిష్టానం నిర్ణయం. ఇచ్చిన హామీలు అమలు చేస్తాము....8 లక్షల కోట్లకు అప్పు కడుతున్నాం. కేటీఆర్ వాళ్ళ తాతలు ఇచ్చిన భూమి అంటున్నారు చూపెట్టండి. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత లెక్కలు అఫిడవిట్ లో చూపెట్టాలి. రాజకీయాలను వ్యాపారం చేస్తామంటే జనం అన్ని గమనిస్తున్నారు. అందరూ కూడా ప్రజా రాడార్లో ఉన్నారు. కాంగ్రెస్ దళితులను రాష్ట్ర పతులను,కేంద్రమంత్రులు చేసింది. ఇందిరాగాంధీ కోరుకున్నదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దళితులకు భూములు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ నేతల ప్రాపర్టీ ఉంటే బయట పెట్టండి.. చర్యలు ఉంటాయి. 2014 నుంచి 2025 వరకు భూ దోపిడి జరిగింది. 22ఏ కారణంగా ఎవరు ఇబ్బంది పడొద్దు అది పార్టీ పాలసీ’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ -
చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ రూ.2.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా ఇవాళ(గురువారం) చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్ రూ.50 వేలు, అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ రూ.50 వేలు తీసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ తన వ్యక్తిగతంగా నియమించుకున్న జంగయ్య అలియాస్ చిన్న ద్వారా రూ.50 వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.పట్టుబడిన అధికారులను అదుపులోకి తీసుకొని చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టుబడిన అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బాధితుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు.ఇదీ చదవండి: భార్య అరిచిందని.. భర్త షాకింగ్ నిర్ణయం -
SIR: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ‘సర్’ ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి కొత్త వెసులుబాటు కల్పించింది. ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు హాజరైతే చాలు. ఫ్యామిలీ మెంబర్కు వ్యక్తిగత హాజరుకు అవకాశం ఇచ్చింది. ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట హాజరై పత్రాలు, సమాచారం అందించే అవకాశం కల్పించింది. కుటుంబ సభ్యుల తరఫున అవసరమైన పత్రాలు సమర్పించవచ్చని.. నోటీసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.ఓటర్ల పత్రాలు స్వీకరించి నోటీసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా ఎన్నికల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చిన ఈసీ.. ఓటర్ల నోటీసులను పరిశీలించి పరిష్కరించాలని సూచించింది. ఫారం-6 దరఖాస్తులపై సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ ఫారం తప్పనిసరి. భవిష్యత్లో అందే ఫారం-6 దరఖాస్తులకూ డిక్లరేషన్ ఫారం తప్పనిసరి.అర్హత తేదీ 1.10.2026 పరిగణనలోకి తీసుకోవాలి. ఫారం-6 పరిశీలన, డిక్లరేషన్ స్వీకరణ, క్లెయిమ్ల పరిష్కారానికి ఆదేశాలిచ్చింది. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ.. తెలంగాణ సీఈవో సుదర్శన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదీ చదవండి: HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్! -
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
సాక్షి,నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్ ఆర్ సెంటర్లో హరిబాబును గుర్తు తెలియని యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. యూట్యూబర్ వైష్ణవి కేసుకు.. హరిబాబు హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు (తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్) వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయమై మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. హరిబాబు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త -
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ అయ్యింది. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. వచ్చే మార్చి 2027తో ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సరికొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనుంది రాష్ట్ర ఈసీ.దీనిలో భాగంగా నవంబర్ 1 తేదీ నాటికి డిగ్రీ పూర్తి మూడేళ్లు పూర్తయిన వారందరూ అర్హులు, అయితే గతంలో ఓటు నమోదు చేసుకున్న పాత ఓటర్లు సైతం తప్పనిసరిగా కొత్తగా ఫారం-18ని ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంల నుంచి ఆయా సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు.. సెప్టెంబర్ 28న ఓటర్ల నమోదు ప్రక్రియకు నోటిఫికేషన్నవంబర్ 1, 2026 అర్హత తేదీగా ఓటర్ల జాబితా తయారీనవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తుల స్వీకరణనవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలనవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణడిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు తెలంగాణ సీఈఓ కీలక సూచనలుఇప్పటికే ఓటర్ల జాబితాలో పేరున్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి ఫారం-18తో పాటు ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలు సమర్పించాలిఆన్లైన్లో దరఖాస్తులకు సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో అవకాశంఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డిజిగ్నేటెడ్ అధికారుల వద్ద ఆఫ్లైన్లోనూ దరఖాస్తులుపోస్టు ద్వారా ఫారం-18 దరఖాస్తుల సమర్పణకు అవకాశంఇదీ చదవండి: ‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’ -
కేసీఆర్ ఫాం హౌస్కు రెవెన్యూ అధికారులు.. అసలేం జరగనుంది?
సాక్షి,సిద్దిపేట: ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా మరికాసేపట్లో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ను సందర్శించనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు సంబంధిత ఫైళ్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో సమావేశమై ఫాంహౌస్ భూములపై సమీక్ష నిర్వహించారు.మరోవైపు, శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు పర్యటించనున్నారు. కబ్జా ఆరోపణలున్న భూమలను వారు పరిశీలించడంతో పాటు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అఫిడవిట్లలో భూముల వివరాలపై కేటీఆర్ను నిలదీసిన పొంగులేటి.. కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నిస్తే.. కేటీఆర్కు ఎందుకంత ఉలికిపాటు?. 2004 అఫిడవిట్లో భూములు లేవు.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా?. అఫిడవిట్లలో నిజాలు రాశారా? ప్రజలను మోసం చేశారా?. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించిన పొంగులేటి.. అఫిడవిట్లలో ఒకటి.. మాటల్లో మరొకటా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబానిదే. భూముల పెరుగుదలపై లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు? కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని పొంగులేటి డిమాండ్ చేశారు.‘‘అఫిడవిట్లలో పేర్కొన్న భూముల వివరాలను ప్రజల ముందు పెట్టాలి. కేటీఆర్ మాటలకు.. ఎన్నికల అఫిడవిట్లకు పొంతన ఉందా?. భూ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలా?’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు… pic.twitter.com/E9oOjS8UBW— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026ఇదీ చదవండి: పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం -
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్లోని లోవెల్లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్కు ఆగస్టు 28న టెక్సాస్లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్!
సాక్షి హైదరాబాద్: తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 9 సంస్థల్లో ఆహార ఉత్పత్తులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. మరో 5 సంస్థలకు పరిస్థితులను మెరుగుపరచుకోవాలని నోటీసులు అందించారు. మొత్తం 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఉన్న 20 ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కలుషిత మాంసం, పురుగులు పట్టిన ముడి సరుకులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన వంటశాలలు, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ముడి సరుకులు లభించాయి. ఆహార తయారీదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారించారు. హోటల్ సంగీత్ గ్రాండ్, బహార్ బిర్యానీ కేఫ్, బాలాజీ ఫేని, అండ్ నమ్కిన్, భువనేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీ, హోటల్ సింధూర ఈస్ట్ కోర్ట్, కెమెస్ట్రీ బార్ అండ్ కిచెన్ (సురభి గ్రాండ్), న్యూ లిమ్రా హోటల్, ఎన్ విలేజ్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చంపాపేట్, కినరా గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్. వనస్థలిపురం సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వివరించారు. రామకృష్ణ ఆయిల్ మిల్, గ్రీన్ల్యాండ్ దాబా, కెఫీ కేఫ్, వన్ లాంజ్ బార్ అండ్ కిచెన్లకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అన్టెరా–నాగోల్, హోటల్ సారథి గ్రాండ్, లక్కీ రెస్టారెంట్–నాగోల్, విజయ రాఘవేంద్ర హోటల్, భగవతి మిస్తాన్ భండార్, ది జాయింట్ అల్ మండీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదీ చదవండి: KBR Park: ఇక అదే దారి -
నిజాంను పొగిడే నేతల డీఎన్ఏ టెస్ట్ చేయాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందని.. అలాంటిది నిజాంను పొగిడే నాయకులు ఓసారి ఇక్కడి పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కాస్త తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని ఆయన అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకేరోజు రావడం ప్రత్యేకమన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే.. తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు.నిజాం పాలనపై తీవ్ర వ్యాఖ్యలునిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు విమోచనం సాధించుకున్నారని బండి సంజయ్ అన్నారు. వీర బైరాన్పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాంటి చరిత్రను పక్కనపెట్టి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.నిజాంను పొగిడే నాయకులు తెలంగాణ పోరాట చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో నిజాంను ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని రక్తపాతం సృష్టించిన నిజాం పాలనను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిజాంను పొగిడే నేతలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని, అసలు వారు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్ఏ ఉందా? అనేది చూడాలంటూ వ్యాఖ్యానించారు.చరిత్రను భావితరాలకు చెప్పాలితెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ పేర్కొన్నారు.అవినీతిపై విమర్శలుకొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి తావులేకుండా మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు.తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలో ఆలోచించుకోవాలని ఆయన కోరారు. అవినీతిమయమైన పాలన కావాలా? అవినీతి రహిత పాలన కావాలా? తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా? లేక ఆ చరిత్రను భావితరాలకు అందించే పాలన కావాలా? అని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీకి ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను పాట, సంగీతం, దృశ్యరూపంలో ప్రజలకు అందించిన ఆకుల నాగేశ్వర్, వందేమాతరం శ్రీనివాస్, దీపికలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇదీ చదవండి: ‘ఎవరి ఆస్తులు ఎంతో తేలుద్దామా?’.. కేటీఆర్ సవాల్ -
ఆస్తి తీసుకున్నారు.. అమ్మను గెంటేశారు
హైదరాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లికి చివరి దశలో అండగా నిలవాల్సింది పోయి ఆస్తి కోసం ఆమెను వేధించి ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ 68 ఏళ్ల వృద్ధురాలు కన్నీటిపర్యంతమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగార్జున నగర్ కాలనీకి చెందిన కందడి వెంకటమ్మ ఇప్పటికే భర్త, కుమారుడిని కోల్పోయింది. జీవిత చరమాంకంలో తన ఇద్దరు కుమార్తెలు అండగా ఉంటారని భావించినా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. తనకున్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలు తమ పేర్లపై రాయించుకున్న అనంతరం తనపై దాడి చేసి, దుర్భాషలాడి ఇంటి నుంచి బయటకు నెట్టివేశారని వెంకటమ్మ ఆరోపిస్తున్నారు. తనను చూసుకునేవారు కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన వెంకటమ్మ ఆరుబయట కూర్చొని భోరున విలపిస్తోంది. ఆమె పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. ఘటనపై అధికారులు స్పందించి వృద్ధురాలు వెంకటమ్మకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వెంకటమ్మ బుధవారం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని, వృద్ధాప్యంలో భద్రత, అండ కలి్పంచాలని వేడుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో.. అంత అవినీతా..? -
KBR Park: ఇక అదే దారి
హైదరాబాద్: కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కుల తొలగింపునకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడేసి చొప్పున ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మించాలని తలపెట్టింది. ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ వన్వే అమలు చేసింది. దీనికోసం చేసిన మార్పులు చేర్పులతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. దీంతో అధికార యంత్రాంగం రూ.1,250 కోట్లు వెచ్చించి.. ఏళ్లు శ్రమించి ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించడం కంటే శాశ్వత ప్రాతిపదికన వన్వే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డు నెం.36 వరకు లేదా రోడ్డు నెం.45 వరకు ఇది ఉండాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు చేరాయి. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాహన చోదకుల ఫీడ్బ్యాక్.. ‘హెచ్–సిటీ’ పనుల్లో భాగంగా అధికారులు గత నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేశారు. ఇది అమల్లోకి వచి్చన పది రోజుల్లోనే ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గి ఫలితాలు కనిపించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నామంటూ వాహన చోదకుల నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్లు వన్వే అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ విధానం శాశ్వతం చేయాలని నిర్ణయించారు. మరోపక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి యంత్రాగానికి సవాళ్లు ఎదురయ్యాయి. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ కేబీఆర్ పార్కు వాకర్లతో పాటు పర్యావరణవేత్తలు, సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ™ దీంతో పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. పలు పరిణామాలతో.. చెట్లను కొట్టివేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉండటంతో సదరు నిర్మాణ రంగ సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు ఎన్నిచెట్లు మిగిలి ఉన్నాయో వాటి జియో ట్యాగ్ను కూడా పర్యావరణవేత్తలు తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వీల్లేకుండాపోయింది. దీనికి తోడు ఈ నిర్మాణాల కోసం మొత్తం 247 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో పలువురు ప్రము ఖులవీ ఉన్నాయి. ఈ కారణంగా వీటి సేకరణ పెను సవాల్గా మారింది. పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కేబీఆర్ పార్కుకు నిర్ణయించిన ఎకో సెన్సిటివ్ జోన్పై సుప్రీం కోర్టులోనూ కేసు పెండింగ్లో ఉంది. ఈ పరిణామాలకు శాశ్వత వన్ వే ఓ పరిష్కారం చూపింది. సీఎం రేవంత్రెడ్డి కూడా ఈ వన్వేలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హెచ్–సిటీ పనులు ఆగిపోయాయి. ఈ పనులతో పోలిస్తే ఎలివేటెడ్ కారిడార్కు చాలా తక్కువే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం! -
ప్రజలే కేంద్రంగా పాలన.. హైదరాబాద్ కోసమే ఫ్యూచర్ సిటీ: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైన రోజుగా సెప్టెంబర్ 17ను గుర్తిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ప్రజలు పోరాడిన చరిత్ర ఉందని, పాలకులపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని వ్యాఖ్యానించారు.సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన వారికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, ప్రభుత్వ వనరులు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే ప్రజాపాలన అని పేర్కొన్నారు. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతు భరోసా కింద రూ.20,616 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని, ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసాతో పాటు రైతు బీమా, భూభారతి సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లతో ప్రణాళిక రూపొందించామని రేవంత్రెడ్డి తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. దళితులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి రూ.927 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపైనా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్రెడ్డి అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఇటీవల టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. గోషామహల్లో రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తూ ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును 55 కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 ద్వారా భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవమే ప్రజాపాలనలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘స్టార్టప్ స్టేట్గా తెలంగాణ’ -
పురుగులకెరుక.. మనిషి మృత్యురేఖ!
సాక్షి, హైదరాబాద్: పాపాలు చేస్తే పురుగులు పట్టిపోతావు... అనేది ముతక సామెత. ప్రస్తుతం మృతదేహంపై వచ్చే ఈ పురుగులే మరణ సమయాన్ని స్పష్టం చేయనున్నాయి. దీనికి సంబంధించిన సరికొత్త సాఫ్ట్వేర్ను తెలుగు పరిశోధకులు రూపొందించారు. ‘ఆటోమేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎంటమాలజీ’పేరుతో జరిగిన పరిశోధన ద్వారా దీనికి రూపమిచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆరు విద్యా సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ క్లూస్ టీమ్లో పని చేస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వెంకన్న ఈ పరిశోధన ఉపయుక్తమన్నారు. హత్య కేసుల్లో అదే కీలకం మరణం ఎప్పుడు సంభవించిందనేది హత్య కేసుల దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘టైమ్ సిన్స్ డెత్’అని పిలుస్తారు. ఇప్పటి వరకు మృతదేహం లభించిన సమయం, శవపరీక్ష నివేదిక, శరీర ఉష్ణోగ్రత, కండరాలు బిగుసుకుపోవడం తదితర అంశాల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన తర్వాత ఈ అంచనా అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో శవంపై వాలే ఈగలు, వాటి లార్వాలు తదితరాలు కీలక ఆధారాలుగా మారుతున్నాయి. వాటి పెరుగుదల దశ, పరిమాణాన్ని విశ్లేíÙంచి మరణం జరిగి ఎన్ని రోజులైందో అంచనా వేస్తున్నారు. 40 మృతదేహాలపై పరిశోధన ఈ పరిశోధనలో అమృత్సర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శవపరీక్షకు గురైన 40 కుళ్లిన మృతదేహాలను పరిశీలించారు. ఈ విధానంలో కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా వచ్చిన ఫలితాలు సంప్రదాయ పద్ధతిలో వచి్చన ఫలితాలతో 99 శాతానికి పైగా సరిపోలాయి. దీంతో క్లిష్టమైన హత్య కేసుల్లో మరణ సమయాన్ని వేగంగా అంచనా వేసేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మృతదేహం కుళ్లడం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక రకాల ఈగలు దానిపై గుడ్లు పెడతా యి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి పెరుగుదల వేగంలో మార్పులు ఉన్నప్పటికీ.. ఒక నిర్దిష్ట జాతి పురుగు ఏ దశలో ఉందో, దాని పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా మృతదేహంపై పురుగులు చేరిన సమయాన్ని అంచనా వేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎలా పని చేస్తుందంటే... మొదటి దశలో మృతదేహం లేదా దానిపై ఉన్న పురుగులు/కీటకాలు స్పష్టంగా కనిపించేలా ఫొటో తీస్తారు. దీన్ని ఆ సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసినప్పుడు ఒక్కో పురుగును ప్రత్యేకంగా గుర్తించి సంఖ్య కేటాయిస్తుంది. ఆ తర్వాత ప్రతి పురుగు పొడవు, ఆకారం, పరిమాణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం పురుగు ఆక్రమించిన ప్రాంతాన్ని లెక్కించి దాని విస్తీర్ణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు పరిమాణాన్ని దాని ఎదుగుదల దశతో పోలుస్తుంది. గుడ్డు నుంచి ఈగగా మారే క్రమానికి పట్టే సమయాలను పరిశోధకులు ముందుగానే సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. ఇలా ఆ కీటకాలు ఎంతకాలంగా పెరుగుతున్నాయో అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మరణించి ఎన్ని రోజులైందో చూపిస్తుంది. -
వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
సాక్షి, హైదరాబాద్: మరో వారం రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ కుటుంబంలో అంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి పనుల నిమిత్తం బైక్పై వెళ్తున్న తండ్రి, కూతురును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.హయత్నగర్ నుంచి అత్తాపూర్ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కూతురు బురుషాన్ బేగం మృతి చెందారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల కోసం బయలుదేరిన తండ్రీకూతుళ్లు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వినాయక నిమజ్జనం వేళ విషాదం.. -
లంచం ఇవ్వడం నేరం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలు, ఏసీబీ దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే అధికారిక విధి కాదని, పాత చట్టం ప్రకారం ఈ కేసు నిలబడదని చెప్పారు. పాత చట్టం ప్రకారం అది నేరం కాదు.. : ఈ కేసు 2015 నాటిది కాబట్టి అప్పటి అవినీతి నిరోధక చట్టం (పీసీ) ప్రకారమే విచారించాలని లూథ్రా కోరారు. పాత చట్టంలోని సెక్షన్లు 7, 11 కేవలం లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకే వర్తిస్తాయని, సెక్షన్ 12 ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని వాదించారు. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక తీర్మానం మేరకు 2018లో వచ్చిన చట్ట సవరణల తర్వాతే లంచం ఇవ్వడాన్ని (కొత్త సెక్షన్ 8 కింద) ప్రత్యేక నేరంగా చేర్చారన్నారు. ఈ కేసుకు పాత చట్టం నిబంధనలే వర్తిస్తాయని, ఆ ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరం కిందకు రాదన్నారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 171 ప్రకారం ఈ ఎన్నికలు అసెంబ్లీ స్పీకర్ పరిధిలో కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. ఇందులో స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టభద్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం ఓటరు (ఎలక్టోరేట్) పాత్రను మాత్రమే పోషిస్తారని తెలిపారు. దామాషా (సింగిల్ ట్రాన్స్ఫరబుల్) పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే ’ప్రజా విధి’లేదా ’అధికారిక విధి’కిందకు రాదని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ‘సీతా సోరెన్’తీర్పు కేవలం సభా హక్కుల పరిరక్షణకు మాత్రమే పరిమితమని, ఈ కేసుకు ఆ తీర్పు వర్తించదని చెప్పారు. ఎమ్మెల్యే ’పబ్లిక్ సర్వెంట్’కాదా? ధర్మాసనం కలుగజేసుకుని.. ‘ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ (ప్రజా సేవకుడు) కాదా? నామినేటెడ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?‘అని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదులిస్తూ.. పీసీ చట్టం వర్తించాలంటే వారు పబ్లిక్ సర్వెంట్ కావడంతో పాటు, వారు చేసే పని ’అధికారిక విధి’అయి ఉండాలన్నారు. కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్–అఫీషియో హోదాలో ఓటరుగా మాత్రమే వ్యవహరిస్తారని, నామినేటెడ్ ఎమ్మెల్యేల పాత్ర కూడా అదేనని వివరించారు. వాదనల సందర్భంగా ఏసీబీ తీరును లూథ్రా తీవ్రంగా తప్పుబట్టారు. 2015 మే 28న అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్ సన్) నేరుగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా కనీసం జనరల్ డైరీలో ఆ విషయాన్ని నమోదు చేయలేదన్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కనీస ముందస్తు అనుమతులు తీసుకోకుండానే మే 31న వలపన్ని దాడులు చేశారని కోర్టుకు తెలిపారు. దాడులు పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ముడుపులకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. అప్పట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం, కక్షసాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదైందని చెప్పారు. దర్యాప్తు లోపాల కారణంగానే ఈ కేసులో ఏ–4గా ఉన్న నిందితుడి (మత్తయ్య) కేసును గతంలో హైకోర్టు కొట్టివేసిందని, ఆ తీర్పు ఏ–1కు (రేవంత్ రెడ్డి) కూడా వర్తిస్తుందని లూథ్రా వాదించారు. దీంతో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. కాగా, విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాది సుందరం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 30కి వాయిదా వేసింది. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ‘నాతో పాటు మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపించండి. మా ఆస్తులు, మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల ఆస్తులు.. 2020 నుంచి ఇప్పటి వరకు ధరణి, భూభారతిలో జరిగిన వ్యవహారాలపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం. మీరు సిద్ధమా?’ అంటూ సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేకే సీఎం వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ డ్రామాలు చేస్తూ ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్ని స్తున్న తమపై ఎదురుదాడి చేస్తున్నారని, దబాయింపులు, బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేతలపై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ.. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి తదితరులతో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. అధికారులు, మంత్రిపై చర్యలేవీ? ‘నిషేధిత భూముల అంశంలో బీఆర్ఎస్ ఇన్నాళ్లుగా చెబుతోంది సీఎం మాటలే ధ్రువీకరించాయి. 3.71 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టామని, సమస్యను పరిష్కరించే క్రమంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 30 లక్షల కుటుంబాలకు సమస్య ఏర్పడిందని సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనం. మేం ఇదే విషయాన్ని ఇన్నాళ్లూ చెబుతున్నాం. ఇప్పుడు సీఎం స్వయంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఒప్పుకున్నారు. మరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన తప్పిదానికి బాధ్యత ఎవరిది? ఆదేశాలు ఇచ్చిన అధికారులపై, జాబితాను అప్లోడ్ చేసిన కలెక్టర్లపై చర్యలెందుకు లేవు? ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని చెప్పిన రెవెన్యూ మంత్రిపై చర్యలెందుకు తీసుకోలేదు? 22ఏపై తప్పు జరిగిందని ఒప్పుకున్న ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారో కాలపరిమితితో ప్రకటించాలి. కమిటీ వేస్తాం.. పరిశీలిస్తాం.. మార్గదర్శకాలు ఇస్తాం.. ఫీజులు కట్టించుకుంటాం.. అంటూ మాటలు చెబుతున్నారు. ప్రజలకు పరిష్కారం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఎదురుదాడితో ప్రజల బాధ పోతుందా? సీఎంకు ఒక చట్టం.. సామాన్యుడికి మరో చట్టమా? మీ ఇల్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టే రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి భూమికీ ఊరట కల్పించాలి..’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేవంత్ పొంతన లేని లెక్కలు ‘కేసీఆర్ ఎకరం కోసం, గజం కోసం ఆలోచించే వ్యక్తి కాదు. తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు. ఆయనకు వెయ్యి ఎకరాలున్నాయని ఒకసారి.. ఇప్పుడు 60 ఎకరాలు ఉన్నాయని రేవంత్ పొంతన లేని లెక్కలు చెప్తున్నాడు. ఫామ్హౌస్, భూముల విషయంలో చేసిన ఆరోపణలన్నీ ఎన్నికల అఫిడవిట్లు, ఆదాయపు పన్ను రిటర్నుల్లో నేను వెల్లడించివే. నా భూములపై కలెక్టర్లు, సర్వేయర్లు, విజిలెన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలతో విచారణలు జరిపించినా అక్రమాలు నిరూపించలేకపోయారు. నా భూములపై అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు. నీ ఆస్తులు, నీ తమ్ముళ్ల ఆస్తులు, నీ కుటుంబ ఆస్తులపైనా అదే విచారణ జరుపుదాం. ఒక్క కొట్రలోనే మీ కుటుంబ సభ్యుల పేరిట 170 ఎకరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మీ కుటుంబ సభ్యుల పేరిట 308 ఎకరాలకు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు అందాయి. సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీలో అన్నీ మాట్లాడతాం.. ధరణి, భూభారతిలో బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవకతవక పైనా విచారణకు సిద్ధం. మేం చేసిన ఆరోపణలకు ఆధారాలు సభలో పెడతాం. సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో మాట్లాడతాం. భూ భారతి చలాన్ల వ్యవహారం, ప్రజల ఆస్తులు ఇతరుల పేర్లకు మారిన లావాదేవీలు, నాదర్గుల్ భూముల అంశం.. ఇలా మేం లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’ అని హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడి బీఆర్ఎస్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేశారని జగదీశ్రెడ్డి విమర్శించారు. తమ వద్ద ఒక్క ఇంచు భూమి అక్రమంగా ఉన్నా నిరూపించాలని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణలు సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. -
పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. 22ఏ జాబితాలో చేర్చిన వివరాల్లో పొరపాట్లు జరిగాయని చెప్పారు. వాటిని పూర్తిగా సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో 22ఏపై చర్చలో భాగంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అటవీ, అసైన్డ్ భూములు తొలగించలేం.. ‘22ఏ కింద మొత్తం 1.02 కోట్ల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సింహభాగం అటవీ, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములే. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేం. వాటిని తొలగించాలని కేసీఆర్, హరీశ్రావు లేఖ మీద రాసి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆగస్టు 30, 2026 నాటికి 22ఏ జాబితాలో 1,02,05,250 ఎకరాలు ఉండగా, అందులో ప్రైవేట్ భూమి 3,73,980 ఎకరాలే. 22ఏలో ఉన్న మొత్తం విస్తీర్ణాన్ని ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం సరికాదు. టీజీఐఐసీ, ఇతర భూములపై వచ్చేసారి బడ్జెట్ సెషన్లో వివరాలు బయటపెడతా. ఇప్పుడు కేవలం రెవెన్యూలో ధరణిలో పార్ట్–1 వివరాలు మాత్రమే బయటపెట్టా. సభలో వారుండాలి.. వారి ఎదురుగా నేనే మాట్లాడతా.. నా కళ్లలోకి చూడడానికి కూడా ధైర్యం రావొద్దు.. చూడాలంటే కూడా చేసిన దొంగతనాలకు ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ప్రత్యక్షంగా తీసుకువస్తా. నిజాం సర్కార్ ఇచ్చినదాన్ని పూర్తిగా లూటీ చేశారు.. జమీన్దార్, జాగిర్దార్లను లూటీ చేశారు. నిజాం పేదలు, దళితలులు, ఆదివాసులు, మైనారిటీలకు దక్కాల్సిన భూములను ఒకే కుటుంబం దోపిడీ చేసింది. ప్రైవేట్ భూమిపై హైపవర్ కమిటీ ప్రైవేటు భూమి 3.7 లక్షలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు సీసీఎల్ఎ, న్యాయ కార్యదర్శి, ఐజీఆర్ఎస్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. నిషేధిత జాబితాలోని నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 12 అంశాలకు పరిష్కారం.. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. ⇒ అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూములు కేటగిరీలో పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు, యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది. ⇒ ఈ విధానం పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. ⇒ భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడతాం. ⇒ అదీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు, కాంపిటెంట్ అథారిటీలు (హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ) ఆమోదించిన లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాం. ⇒ ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది. ⇒ సింగరేణి బొగ్గు గని ప్రాంతాల (కోల్ బెల్ట్) సమస్య కోసం జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది. అసైన్డ్ భూములపై న్యాయ సమీక్ష ⇒ జీవో నంబర్ 59 సమస్యకు కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. ⇒ మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం. ⇒ జీవో నంబర్ 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) సమస్య కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ నిరీ్ణత గడువులోగా పరిష్కరిస్తాం. ⇒ పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. ⇒ అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం. ⇒ ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లు అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం. ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లను 5 సంవత్సరాల లాక్–ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం. ⇒ ప్రైవేటు పట్టా భూములు – నాలా రుసుము చెల్లించని కేసులకు సంబంధించి నాలా చార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయ విక్రయాలకు అనుమతిస్తాం. ⇒ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలకు సంబంధించి అనధికారిక లేఅవుదట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం. ⇒ సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణ కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ⇒ స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించి సమస్యలో నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను దసమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్ధిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. -
చర్చకు పొంగులేటి వస్తారా?.. లేక సీఎం రేవంత్ వస్తారా?: హరీష్ సవాల్
హైదరాబాద్: తమ హయాంలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు సవాల్ విసిరారు. తనతో చర్చకు మంత్రి పొంగులేటి వస్తారా?, లేక సీఎం రేవంతే వస్తారో? తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు. తాము ప్రభుత్వం అవినీతి మీద ప్రశ్సిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు హరీష్రావు. ఈరోజు(బుదవారం, సెప్టెంబర్ 16వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్రావు.. ఎన్నికల అఫడవిట్లో చూపించనవే సభలో రేవంత్రెడ్డి చెప్పారని హరీష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్లు ఆగాయంటే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. భూభారతిలో 9, 200 మంది భూములు మరొకరికి మారాయని ఆరోపించారు హరీష్, భూభారతి స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించరు? అని ప్రశ్నించిన హరీష్,, భూభారతి కాదు.. భూహారితి అంటూ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం -
కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కేసీఆర్కు వెంటనే నోటీసులు ఇవ్వాలన్న సీఎం రేవంత్.. విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే దళితులకు పంచుతామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్లో 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రేవంత్ పేర్కొన్నారు.‘‘కల్వకుంట్ల కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉంది. ఉద్యమాన్ని, ధరణిని అడ్డుపెట్టుకుని భూ దోపిడీ చేశారు. పాంహౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతా. 27 ఎకరాల ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉంది. హిమాన్షు పేరు మీద 44.6 ఎకరాల భూమి ఉంది...రామలింగరాజు కంపెనీల నుంచి కల్వకుంట్ల వారికి భూములు బదిలీ అయ్యాయి. ఫిరంగి కాల్వ భూములు ఎలా పొందారో కూడా చెబుతా. దాదాపు 700 ఎకరాలు ఫాంహౌస్ పరిధిలో ఉంది. 30 రోజుల్లో ఫాంహౌస్ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం’’ అని రేవంత్ తెలిపారు.‘‘కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూ దోపిడీ చేసింది. కేసీఆర్ భూ దోపిడీపై విచారణ జరగాల్సిందే. విచారణకు సిట్కు అప్పగిస్తున్నాం. ఇప్పటివరకు పార్ట్-1 మాత్రమే చెప్పా. బడ్జెట్ సెషన్లో పార్ట్-2 ఉంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్వార్.. రేవంత్కు సంచలన నివేదిక -
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి
హైదరాబాద్: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్ రంగంలో సింగపూర్కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి.. రాష్ట్రంలో ఫ్యాబ్ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్ ట్రేడ్ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు... అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హబ్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్, ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ అండ్ డీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయన్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’లో సింగపూర్ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డా.ఫ్రాన్సిస్ చోంగ్, ఇండియా డైరెక్టరేట్ డైరెక్టర్ జీన్ యీ, సౌత్ ఏషియా ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్ ఆట్రీ టూన్ తదితరులు పాల్గొన్నారు. -
సభ జరగకూడదనే అలా వ్యవహరించారు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: సభ ప్రారంభమైన రోజే బీఆర్ఎస్ వికృత చేష్టలకు పాల్పడిందంటూ సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. 22ఏపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. 22ఏ చర్చించాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుందన్నారు. ఆదర్శంగా ఉండాల్సి కొందరు ప్రజాప్రతినిధులు వికృత చేష్టలకు పాల్పడ్డారంటూ సీఎం మండిపడ్డారు.‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరగకూడదనే ఇలా వ్యవహరించారు. రాష్ట్రంలో సమస్యలు రావాలని పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారు. గత తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ తెలుసు. రైతులకు, పేదలకూ మా ప్రభుత్వం అన్యాయం చేయదు. అసెంబ్లీ నిర్వహణలో గత ప్రభుత్వ రూల్స్నే మేం పాటిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ సభ్యులు సభలో వ్యవహరించారు కాబట్టే సస్పెన్షన్కు గురయ్యారు. 22ఏ వారసత్వంగా వచ్చిన సమస్య. 22ఏ ద్వారా కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు భూ దోపిడీ కి పాల్పడ్డాయి. బహిష్కరణకు సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి. చరిత్రను అవగాహన చేసుకుని అందులో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతంలో జరుగుతున్న తప్పిదాలపై సభలో చర్చ జరగాలి..సభలో జరిగే చర్చలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేసిన అంశంపై సభలో చర్చ జరగాలి. ప్రభుత్వ భూములను పరిరక్షించే అంశాన్ని సభలో ప్రస్తావించకుండా ఉండలేం. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై చర్చ జరగకూడదనుకోవడం సరికాదు. విద్యార్థులకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభలో చర్చ జరగాలి. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చర్చించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కూడా సభలో చర్చ జరగాలి..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ప్రభుత్వానికి వచ్చిన అంశాలను కూడా సభలో చర్చించాలి. ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యలపై కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు రాష్ట్రాలు తిరిగి ఆందోళనలు చేసిన అంశాలు కూడా సభలో చర్చకు వస్తాయి. ప్రజా సమస్యలపై గతంలో ప్రజాప్రతినిధులు చేసిన కార్యక్రమాలను కూడా సభలో ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాంటి అంశాలు సభలో చర్చకు వస్తాయని తెలిసి సభ ప్రారంభం రోజే అనాగరికమైన ఆలోచనతో వ్యవహరించడం సరికాదు..సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. మహిళలను అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరించినా ప్రభుత్వం సహించదు. మహిళలను అవమానించడం అనాగరికమైన చర్య. పోలీస్ శాఖలో కింది స్థాయి సిబ్బంది అయినా, ఉన్నతాధికారి అయినా చట్టం ముందు సమానమే...ప్రజాప్రతినిధి అయినా, సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. మా ప్రభుత్వానికి ప్రతి మహిళ సమానమే. ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలను అవమానించే చర్యలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్వార్.. రేవంత్కు సంచలన నివేదిక -
అసెంబ్లీకి అనూహ్య ఎక్స్టెన్షన్.. మరో రెండు రోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయనుకుంటే.. అనూహ్యంగా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతోనే సమావేశాలు ముగుస్తాయని ఇప్పటివరకు భావించినప్పటికీ.. ఇవాళ కాకుండా మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సభలో వివరించే అవకాశం ఉంది. మరోవైపు వెయ్యి రోజుల పాలనపై ‘మోసం’ పేరిట బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో.. సభా వేదికగా వాటికి సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవాళ్టి సమావేశాల బ్రేకులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. అయితే సాయంత్రంకల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.22ఏపై నేడు చర్చమరోవైపు ఎల్ నినోతో పాటు 22ఏ నిషేధిత భూముల అంశంపై కూడా గురువారం మధ్యాహ్నం తర్వాత సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో ప్రైవేటు భూములు చేరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తన వైఖరిని సభలో స్పష్టం చేయనుంది.రెండు రోజులు ఎందుకు?అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తాయని అంతా భావించిన వేళ.. మరో రెండు రోజులు పొడిగించే ఆలోచన తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వెయ్యి రోజుల పాలనపై చర్చతోపాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమగ్రంగా వివరించే అవకాశం ఉంది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయన్నది స్పష్టత రానుంది. -
ఉచిత సినిమా కోసం క్లిక్..
హైదరాబాద్: ఉచితంగా సినిమాలు చూడాలన్న ఆశ, అతని బ్యాంకులోని నగదును మాయం చేసింది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ ఈ నెల 11న ఇన్స్ట్రాగామ్ స్క్రోల్ చేస్తుండగా ఉచితంగా సినిమాల అందిస్తామన్న ప్రకటన చూశాడు. ‘గూగుల్ పేటీవీ’ అనే ఫైల్ను డౌన్లోడ్ చేశాడు. కొద్ది గంటల్లోనే తన ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు బదిలీ అయ్యాయి. దీంతో బా«ధితుడు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు గణపతి హల్చల్
హైదరాబాద్: బేగంబజార్ ఫీల్ఖానాలో లీచీక రాజ బంగారం వినాయకుడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి బంగారు వినాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం, మంగళవారాల్లో ఫీల్ఖానా గణనాథున్ని చూసేందుకు ప్రజలు తరలి రావడంతో జనసంద్రంగా మండప పరిసరాలు మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో గోషామహల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ దృష్టికి వెళ్లింది. లీచీక రాజ గణేష్డు ఒరిజినల్ బంగారుది కాదని వివరించారు. విగ్రహం బరువు 48 కిలోల గోల్డ్ ఉందని, అమెరికా డైమండ్ అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందని, అదంతా బూటకమేనని వెల్లడించారు. విగ్రహానికి ఆర్టిఫిషియల్ బంగారుపూత తరహాలో ఆర్టిఫిషియల్ బంగారు కలర్ వేశారని తెలిపారు. ఎవరైనా బంగారు విగ్రహం అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదీ చదవండి: తొలిపూజ వివాదం పూజారి ప్రాణం తీసింది -
అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి కాస్మోస్ భవనంలోకి కొందరు చొరబడి గేట్లు ధ్వంసం చేశారు. ఈ నెల 13న మురళీధర్ రెడ్డి, గడ్డం రవి అనుచరులతో వచ్చి గేట్లు పగులగొట్టి భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మేనేజర్ రవి పెద్ది రాజు ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై కేసు నమోదు చేశామని, చంద్రశేఖర్రెడ్డి ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక -
కొద్దిసేపట్లో విమాన ప్రయాణం.. అంతలోనే దుర్మరణం
శంషాబాద్(హైదరాబాద్): కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్ల్లో దూసుకెళ్లడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్లో కిషన్గూడ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30కు వర్షం కురుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళుతున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్లోకి తీసుకెళ్లాడు. చాయ్ కోసం ఆగితే కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఎయిర్పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లెదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది. బీభత్సం బస్సు హోటల్లోకి దూసుకెళ్లడం అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టవ్కు మంటలందుకున్నాయి. పాన్షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి రప్పించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని, తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్ను ఆస్పత్రికి తరలించారు. -
దానం నాగేందర్ భవితవ్యం తేలేది నేడే..!
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ‘అనర్హత’అంశంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లలో హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో గత నెల 21న తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో).. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. దానం పార్టీ ఫిరాయింపుపై మధ్యాహ్నం 3:45కి హైకోర్టు తీర్పు చెప్పనుంది.ఇదీ చదవండి: ఇలాగైతే రాజీనామా చేస్తా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే -
స్టీల్ బ్రిడ్జ్.. బోల్టులు ఊడి!
హైదరాబాద్: పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జ్ బోల్టులు పది రోజుల్లోనే ఊడి పడటం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ భారత్లోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా ఖ్యాతి గాంచిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్బ్రిడ్జ్ను ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించిన విషయం విదితమే. మరుసటి రోజు నుండే ఈ బ్రిడ్జ్ను వినియోగంలోకి తీసుకువచ్చారు. రెండు రోజులుగా బ్రిడ్జ్ పై నుంచి బోల్టులు ఊడిపతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం బ్రిడ్జ్ కింద నుంచి వెళుతున్న వాహనదారుడిపై బోల్టు ఊడిపడింది. దానిని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయ్యింది. దాంతో సైదాబాద్ స్టీల్బ్రిడ్జ్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి పట్టుమని పది పదిహేను రోజులు కూడా కాకముందే స్టీల్బ్రిడ్జ్ పైనుంచి ఇలా బోల్టులు పడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు బ్రిడ్జ్ నిర్మాణం సమగ్రంగా పూర్తయిందా? లేకుంటే సీఎంతో ప్రారంభించాలని అధికారులు తొందరగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోల్టులు కాకుండా ఏమైనా పెద్ద నిర్మాణ సామగ్రి వాహనదారులపై పడితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు -
నా పేరు నమ్రత.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద కలుద్దామా!
హైదరాబాద్: ‘నా పేరు నమ్రత.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద కలుద్దామా!‘ అంటూ టెలిగ్రామ్లో వచ్చిన ఒక మేసేజ్ ఓ యువకుడిని మోసపోయేలా చేసింది. అమ్మాయి పేరిట నకిలీ గుర్తింపుతో వల పన్ని, కలవడానికి పిలిపించి డబ్బు డిమాండ్ చేసిన ఈ ఉదంతం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో నివసించే శనిగరపు అన్వేష్ (24)కు వారం క్రితం ‘సయిద్ రఫత్’ అనే టెలిగ్రామ్ ఐడీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.అన్వేష్ దానికి బదులివ్వడంతో ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి తన అసలు పేరును దాచిపెట్టి, తనను తాను ‘నమ్రత’గా పరిచయం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా నేరుగా కలవాలని అన్వేషిను కోరాడు. దీంతో ఆమె మాటలను నమ్మిన అన్వేషి.. ఈ నెల 13న మధ్యాహ్నం స్నేహితుడు కొండ్ర ధర్మసేనతో కలిసి పరేడ్గ్రౌండ్స్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1230 వద్దకు చేరుకున్నాడు. అక్కడ వారు వేచి చూస్తుండగా.. అన్వేష్ ఎవరు అని కొందరు ప్రశ్నించారు. తానేనని చెప్పగానే టెలిగ్రామ్ చాటింగ్ ప్రస్తావన తెచ్చారు. అయితే అప్పుడు అసలు విషయం బయటపడింది. తనతో చాటింగ్ చేసింది ‘నమ్రత’ కాదని, ఎవరో కేటుగాళ్లు నకిలీ గుర్తింపుతో కావాలనే తనను ఈ వలలోకి లాగినట్లు అన్వేష్ ఆలస్యంగా గ్రహించాడు. అంతలోనే అక్కడకు నలుగురు వ్యక్తులు వచ్చి అన్వేషిను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. షాక్కు గురైన అన్వేష్ భయంతో తప్పించుకున్నాడు. అన్వేష్ స్నేహితుడు ధర్మసేన వారి మోసాన్ని ప్రశ్నించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు ధర్మసేనను గట్టిగా పట్టుకోగా, మరో దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. బేగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్మసేనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ నకిలీ టెలిగ్రామ్ ఐడీ మూలాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
‘ఐపీఎస్’ కోల్డ్వార్.. రేవంత్కు సంచలన నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఓ జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులతో నిరంతరం టచ్లో ఉంటున్నారని ఓ సీనియర్ ఐపీఎస్పై మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆరోపించారు. సదరు ఐపీఎస్ను కీలక బాధ్యతల నుంచి తప్పించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఓ నివేదిక రూపొందించి, ఏకంగా ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్.. ఓ దక్షిణాది రాష్ట్రానికి గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న క్రమంలోనే ఆయన సిఫారసు మేరకే కీలక పోస్టింగ్ దక్కిందనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది.ప్రత్యర్థి పార్టీకి నమ్మకస్తుడిలా.. ఇదిలా ఉండగా మరో సీనియర్ ఐపీఎస్ ప్రత్యర్థి రాజకీయ పార్టీతో నిరంతరం టచ్లో ఉంటున్నారని, ప్రభుత్వ పరిధిలో జరిగే కీలక నిర్ణయాలు, అంతర్గత అంశాలను ఆ పార్టీ నేతలకు చేరవేస్తున్నారని సీనియర్ అధికారి తీవ్రస్థాయిలో ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలపై నిత్యం ధ్వజమెత్తుతున్నారని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ఎదుట వాపోయినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆ కీలక అధికారిని పదవి నుంచి సాగనంపకపోతే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ నివేదికను కూడా స్వయంగా ప్రభుత్వాధినేతకే సమర్పించినట్టు తెలిసింది.అయితే తన ఫిర్యాదులను ఎక్కడ కొట్టిపారేస్తారోనని భావించిన సదరు ఐపీఎస్.. ఓ దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రిని రంగంలోకి దించి, ఆయనతోనే ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సదరు ఐపీఎస్ ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీ అండదండలు బలంగా ఉన్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. పండగ తర్వాత వేటు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ల కుమ్ములాట ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో హాట్ టాపిగ్గా మారింది. శాఖలో క్రమశిక్షణను గాడిలో పెట్టేందుకు, తారస్థాయికి వెళ్లిన ఈ అంతర్యుద్ధానికి చెక్ పెట్టేందుకు గణపతి నిమజ్జనం తర్వాత ఒకరికి స్థానచలనం కల్పించడం ఖాయమని తెలుస్తోంది.ఇదీ చదవండి: కొండా సురేఖ వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కొంతకాలం హడలెత్తించిన ఐబొమ్మ పైరసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి తాజాగా కోర్టును ఆశ్రయించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపుగా రూ.3 కోట్లు అలాగే ఉండిపోయానని తన పిటిషన్లో పేర్కొన్నాడు.తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది. విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చి, ఆపై పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు అప్పారావు. విశాఖపట్నంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన.. రవి అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని తాను సమర్థించబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అప్పారావు అప్పట్లో స్పష్టం చేశారు.ఇక రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే రవి భార్య నుంచి విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్కు వచ్చేవాడని, అదే సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బంధువులు తెలిపారు. రవికి ఓ కుమార్తె ఉంది. అయితే భర్త వ్యవహారంపై స్పందించేందుకు ఆ భార్య అప్పట్లో నిరాకరించింది. అయితే ప్రస్తుతం వాళ్లు కలిసి ఉంటున్నారా? రవి కేవలం తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.పైరసీకి ‘ఐబొమ్మ’ అడ్డాగా..తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య ఈనాటిది కాదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే వాటి పైరసీ ప్రింట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుండటం ఇప్పటికీ తలనొప్పిగానే ఉంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు అక్రమంగా అందుబాటులోకి వచ్చేవి. ఈ వెబ్సైట్ల వెనుక ఇమంది రవి కీలకంగా వ్యవహరించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.అక్కడే మొదలైన అసలు కథపైరసీ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. తన వెబ్సైట్పై చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పలువురి వివరాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు. సుమారు ఆరు నెలలపాటు రవి కదలికలపై నిఘా పెట్టి అతని నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేశారు.పక్కా స్కెచ్తో అరెస్ట్విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 నవంబర్లో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు నవంబర్ 15, 2025న కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రవి అరెస్ట్ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లను మూసివేయించే చర్యలు చేపట్టారు. 65కుపైగా పైరసీ మిర్రర్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా పోలీసుల చర్యలను అభినందించారు. రూ.3 కోట్లు ఫ్రీజ్.. 21 వేల సినిమాలు?దర్యాప్తులో భాగంగా రవి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని నివేదికల్లో ఈ మొత్తం రూ.3.5 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. రవి వద్ద వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, హార్డ్డిస్క్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి పెద్ద నెట్ వర్క్తో ఈ వ్యవహారమంతా నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేయించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ అప్పట్లో మాట్లాడుతూ.. రవి సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని, అతడి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల వ్యవహారంరవి వ్యవహారంలో కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. ఐబొమ్మ వెబ్సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్ను బెట్టింగ్ ప్లాట్ఫామ్ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తర్వాతి నివేదికల్లో వెల్లడైంది. బెయిల్ కోసం వరుస ప్రయత్నాలుఅరెస్ట్ తర్వాత రవి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తొలుత నాంపల్లి కోర్టులో ఉపశమనం లభించలేదు. వివిధ కేసుల్లో దర్యాప్తు కొనసాగడంతో అతడు జైలులోనే ఉన్నాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఐబొమ్మ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ లింకులు ఎలా ఉన్నాయి? పైరసీ కంటెంట్ ఎలా సేకరించేవారు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవి? అనే అంశాలపై ప్రశ్నించించారు. అదేసమయంలో.. అతన్ని హీరోగా అభివర్ణిస్తూ ఇటు సోషల్ మీడియాలో మద్దతు పెద్ద ఎత్తున కనిపించింది.90 రోజుల తర్వాత బయటకు..దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్లో భాగంగా పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించడంతోపాటు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టింది.ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లుఇలా అరెస్ట్, రిమాండ్, కస్టడీ, బెయిల్, విడుదల వంటి దశలు దాటిన తర్వాత తాజాగా రవి మరోసారి కోర్టును ఆశ్రయించడం కేసులో కీలక పరిణామంగా మారింది. తన నుంచి పోలీసులు ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని అంటున్నాడు. ఈ తరుణంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: హైడ్రాకు ఇది ఊహించని షాకే! -
అనుమతులుంటే ఊరట
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల (22ఏ) విషయంలో బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) అనుమతిలిచ్చిన లే ఔట్లలోని భూములు కూడా 22ఏ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో.. వాటిని వెంటనే ఆ జాబితా నుంచి తొలగించేలా సీఎం రేవంత్రెడ్డి బుధవారం శాసనసభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నుంచి అధికారిక అనుతులున్న వాటికి కూడా ఈ వెసులుబాటు లభించనున్నట్లు సమాచారం. 22ఏ అంశంలో 8 అంశాలను గుర్తించామని, వాటిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై శాసనసభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించిన విషయం విదితమే. కాగా 22ఏ జాబితా తమను ఇరకాటంలోకి నెట్టిందన్న భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నా.. మరింత స్పష్టతతో సభా వేదికగా దిద్దుబాటు చర్యలు ప్రకటించనున్నట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివేక్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో 22ఏ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అప్పట్లో యూఎల్సీ నుంచి ఎలా తొలగించారో..? చిన్న ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అవసరార్థం విక్రయించడానికి వెళ్లితే.. అవి కాస్తా 22ఏ ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చెబితేనే కానీ యజమానులకు తెలియని పరిస్థితి నెలకొనడంతో ఈ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా 22ఏకు తుది రూపు ఇవ్వాలన్న ఉద్దేశంతో మంగళవారం సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని చెబుతున్నా.. అధికారికంగా అనుతులున్న లే ఔట్లకు 2007 సంవత్సరం లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని 22ఏ నుంచి తొలగించడం ద్వారా ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దశాబ్దాల కిందట ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న వారి స్థలాలను ఇప్పుడు 22ఏలో పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మునుగోడు ఎన్నిలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ..ఎల్బీ నగర్లోని పలు కాలనీలు అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్సీ) పరిధిలో ఉంటే, వాటిని యూఎల్సీ నుంచి తప్పించి ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి ప్రజల నుంచి డబ్బు కట్టించుకున్న నేపథ్యంలో ఏ విధంగా వాటిని యూఎల్సీ నుంచి తొలగించారు? అన్న దానిపై మంగళవారం నాటి భేటీలో చర్చించినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వం నుంచి పలు అవసరాల కోసం భూములు లీజుకు తీసుకున్న వారు ఆ స్థలాల్లో భవనాలు నిర్మాణాలు చేసుకున్నారని, ఇప్పుడు వారికిచ్చిన లీజు గడువు ముగియడంతో, వాటి లీజును రద్దు చేయడమా? లేక లీజు కొనసాగించడమా.? లేక వారికి విక్రయించడమా అన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. జీవో 59 పై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ! ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ చేయడానికి జారీ చేసిన జీవో 59 కింది స్థలాలను కూడా ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే కొన్నివేల మంది డబ్బు చెల్లించి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవో 59 పరిధిలోకి వచ్చే భూములపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ నియమించి, అన్నీ సవ్యంగా ఉంటే వాటిని క్రయ విక్రయాలకు అనుమతించాలని తాజాగా ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఇలాంటి భూములు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్లో ఉన్నాయి. కేబినెట్ సబ్ కమిటీయా? అధికారుల కమిటీనా? ఇక యూఎల్సీ, అస్సైన్డ్ భూముల్లో ఇళ్లు కట్లుకున్నవారు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఔట్లతో సమస్యలు, జీవో 118 భూములతో పాటు జీవో 59పై మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించాలా? లేక అధికారుల కమిటీ నియమించాలా? అన్న దానిపైనా ఈ భేటీలో చర్చించారు. ఆ కమిటీకి రెండు మూడు నెలలు గడువునిచ్చి, అచ్చే నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించినట్లు తెలిసింది. మొత్తం మీద బుధవారం మరోసారి అధికారులతో సమావేశం తర్వాత, మంత్రులతోనూ చర్చించి బుధవారం శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. -
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యూపీఐ చెల్లింపులపై చార్జీల విధానాన్ని పునఃప్రవేశపెట్టాలంటూ గూగుల్ పే, అమెజాన్ పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు సభ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఒత్తిడితోపాటు ఏటా రూ. 40 లక్షలకుపైగా టర్నోవర్ ఉండే వ్యాపారులపై చార్జీలు విధించాలన్న ఆర్బీఐ, బ్యాంకుల సూచనను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపుల లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అలాగే రూ. 75 వేలకన్నా ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ను గరిష్టంగా రూ. 300గా ఖరారు చేసినట్లు తెలిపింది. అయితే రూ. 2 వేలలోపు వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులతోపాటు వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య జరిగే యూపీఏ లావాదేవీలు, చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ చార్జీ వర్తించదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఎండీఆర్ రుసుము రూపంలో ఏటా పేమెంట్స్ పరిశ్రమకు రూ. 16,000 కోట్లు వస్తాయని అంచనా. వినియోగదారులు చార్జీ చెల్లించక్కర్లేదు.. ‘యూపీఏ ద్వారా చేసే చెల్లింపులపై వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థలో ఎండీఆర్ ఒక రకమైన చార్జీ. ఇది యూపీఐ చెల్లింపులు జరిపే వినియోగదారులపై విధించే చార్జీ కాదు. వ్యక్తులు ఎప్పటిలాగే ఎలాంటి పరిమితులు, కోటాలు లేకుండా పూర్తి ఉచితంగా యూపీఐ లావాదేవీలు కొనసాగించవచ్చు’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎండీఆర్ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఎండీఆర్ చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. అదే సమయంలో యూపీఐ యాప్ల ప్రొవైడర్లు ప్లాట్ఫాం ఫీజులు లేదా హిడెన్ చార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది. కీలక రంగాలకు యూపీఐ చెల్లింపులపై.. అయితే రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం రీచార్జీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవడం వంటి వాటికి వ్యక్తులు రూ. 2 వేలకుపైగా జరిపే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ. 5 చొప్పున ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రూ. 2 వేలకు మించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ బిల్లులపై జరిపే యూపీఏ చెల్లింపులతోపాటు రూ. 2 వేలకు మించిన స్కూలు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు చెల్లింపులపైనా ఒక్కో లావాదేవీపై రూ. 5 చొప్పున ఎండీఆర్ ఉంటుందని పేర్కొంది. అయితే రూ. 2 వేలకన్నా తక్కువగా ఉండే బిల్లులు, ఫీజులపై మాత్రం ఎలాంటి టీడీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల చెల్లింపులు, స్టాక్బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిపే చెల్లింపులపై 0.02 శాతం టీడీఆర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే వ్యక్తుల ఖాతా నుంచి వ్యాపారుల ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ చెల్లింపులకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని.. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, పునరావృత పెట్టుబడులకు సంబంధించి అమలయ్యే యూపీఐ మ్యాండేట్లు లేదా ఆటోపే విధానాలకు ఎండీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎందుకీ చార్జీ? మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలయ్యే మొత్తంలో కొంత యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు, యాప్లకు పంచుతామని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి, నూతన ఆవిష్కరణాలు, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని వివరించింది. అలాగే టైర్–3 పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కాశ్మీర్, లద్దాఖ్లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆర్థిక రాయితీలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కొత్త వ్యాపారులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో 2021లో కోవిడ్ వ్యాప్తి వేళ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ చార్జీని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు అయ్యే వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా భరిస్తూ వచ్చింది. అయితే యూపీఏ సేవల నిర్వహణ, సర్వర్ల బ్యాండ్విడ్త్ వ్యయం, బ్యాంకుల సాంకేతిక సహాయ ఖర్చులు ఏటా సుమారు రూ. 20 వేల కోట్లను చేరడంతో తమ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఆ మొత్తాన్ని భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.29,82,356 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. అలాగే లావాదేవీల సంఖ్య 2,451 కోట్లు దాటింది. లావాదేవీల వాటా ఇలా.. – ఆగస్టులో నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్యలో 63 శాతం వాటా వ్యాపారులకు చేసిన చెల్లింపులదే. – వ్యాపారులకు చేసిన మొత్తం చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా 67 శాతం. అంటే వ్యాపార రంగంలో జరిగే మెజారిటీ నగదు చలామణి పెద్ద మొత్తాల్లోనే సాగుతోంది. – సంఖ్య పరంగా చూస్తే రూ.2,000 పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే. కానీ విలువ పరంగా అవి 67 శాతం ఉండటం వల్ల ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు, బట్టలు, బంగారు ఆభరణాలు, విమాన/రైలు టికెట్లు, హోటల్ బిల్లుల వంటి పెద్ద చెల్లింపులపై ఈ అదనపు భారం పడనుంది. – వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని తాము భరించలేక వినియోగదారులపైకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రజలు యూపీఐని పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. – నెలవారీ వ్యాపార టర్నోవర్ రూ.1 లక్ష లోపు ఉన్న చిన్న చిన్న దుకాణదారులకు ఈ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. – ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తిగత నగదు బదిలీల విషయానికి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దీని వాటా అత్యధికంగా 70 శాతం. – పర్సన్–టు–పర్సన్ విభాగంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బదిలీల వాటా ఏకంగా 85 శాతం నమోదైంది. – సంఖ్య పరంగా ఇవి 18 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువలో 85 శాతం కలిగి ఉండటం గమనార్హం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్): మనం ఏదైనా దుకాణానికి వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించినప్పుడు.. ఆ సేవను అందించినందుకు బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు వ్యాపారి నుండి వసూలు చేసే రుసుము. – డిజిటల్ చెల్లింపు చేసినప్పుడు ఆ డబ్బు వినియోగదారుడి ఖాతా నుండి వ్యాపారి ఖాతాకు సురక్షితంగా చేరాలి. దీనికోసం పని చేసే బ్యాంకులు, కార్డు కంపెనీలు, యాప్లు తమ సాఫ్ట్వేర్, భద్రతను నిర్వహించడానికి ఈ ఛార్జీని తీసుకుంటాయి. – నిబంధనల ప్రకారం ఈ భారాన్ని వ్యాపారస్తులే భరించాలి. వినియోగదారులు కాదు. ఉదాహరణకు ఈ రుసుము 1 శాతం ఉందనుకుందాం. దుకాణంలో మీరు రూ.3,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.2,700 మాత్రమే అందుతాయి. ఛార్జీల కింద రూ.30 కట్ అవుతుంది. – వ్యాపారస్తులు తమ లాభాలు తగ్గిపోకుండా ఉండటానికి ఈ భారాన్ని వస్తువుల ధరలు పెంచి చివరికి వినియోగదారుల పైకే నెట్టేసే ప్రమాదం ఉంది. -
‘తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి’
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో “తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ర్, కోదండరామ్, అంజిరెడ్డి, ప్రేమ్సింగ్ రాథోడ్ , బీఎస్ రాములు, పాశం యాదగిరి, పాదూరి కరుణ గారు తదితర సామాజిక, రాజకీయ, చారిత్రక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో తమ రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల చారిత్రక సందర్భాలను అధికారికంగా నిర్వహిస్తున్న విధంగానే తెలంగాణలో కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా కోరారు.సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు: బండారు దత్తాత్రేయఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు అని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, దోపిడీ, హింసను ఆయన వివరించారు.కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలపై సాగించిన దమనకాండ, హింస, నరమేధాన్ని ఆయన ప్రస్తావించారు. సుమారు 13 నెలల పాటు రజాకార్ల అరాచకంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢమైన నాయకత్వంలో భారత సైనిక బలగాలు చేపట్టిన చర్యలతో నిజాం పాలనకు ముగింపు పలికి, తెలంగాణ ప్రాంతం భారత సమాఖ్యలో విలీనం అయిందని చెప్పారు. ఈ పరిణామంతో తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు.తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆ చారిత్రక ఘట్టాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ గారు అన్నారు.చరిత్రను మరచిపోకూడదు: విద్యాసాగర్ రావుమహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, మాట్లాడుతూ, తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్పల్లి గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రజాకార్ల దమనకాండకు బైరాన్పల్లి ఒక విషాద సాక్ష్యంగా నిలిచిందని, అక్కడ జరిగిన ఘటనలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, త్యాగాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు.తెలంగాణ విమోచన పోరాట చరిత్రను రాజకీయాలకు అతీతంగా చూడాలని, నిజానిజాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్ర, విమోచన పోరాటంలో అమరులైన వారి త్యాగాలకు సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.ఇతర వక్తలు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరింత చేరువ చేయవచ్చన్నారు. తెలంగాణ విమోచనకు సంబంధించిన చారిత్రక ఆధారాలను సేకరించి, పరిశోధనలు ప్రోత్సహించి, పాఠ్యాంశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భావితరాలకు చరిత్రను పరిచయం చేయాలని సూచించారు.తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చరిత్రకారులు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
జనరిక్ మందుల నాణ్యత భేష్!
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మందుల నాణ్యతకు జనరిక్ మందులకు ఎలాంటి తేడా లేదని తేలింది. జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న అనుమానాలకు కేరళలో జరిగిన తాజా అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య ఔషధ నాణ్యతలో ఏమాత్రం తేడా లేదని పరిశోధకులు తేల్చారు. కేరళలోని వివిధ లైసెన్స్డ్ ఔషధ విక్రయ కేంద్రాల నుంచి సేకరించిన 131 మందుల నమూనాల్లో ఒక్కటి కూడా నాణ్యత ప్రమాణాల్లో విఫలం కాలేదు. మరోవైపు జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే సగటున 48.6 శాతం తక్కువ ధరకు లభించినట్టు గుర్తించారు. ఈ అధ్యయనం అంతర్జాతీయ వైద్య పరిశోధన పత్రిక ‘ఫ్రంటియర్స్ ఇన్ ఫార్మకాలజీ’లో ప్రచురితమైంది. గతంలో కూడా జనరిక్ మందులపై అధ్యయనాలు జరిగినా, మన దేశంలో తాజాగా నిర్వహించిన సర్వే ఇదే కావడం గమనార్హం.8 విభాగాలకు చెందిన 22 రకాల మందుల ఎంపికకేరళలో లివర్ డాక్టర్గా ప్రసిద్ధి చెందిన సైరియాక్ అబ్బీ ఫిలిప్స్ నేతృత్వంలోని పరిశోధకులు 8 చికిత్సా విభాగాలకు చెందిన 22 రకాల అత్యవసర మందులను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఔషధ విక్రయ కేంద్రాలు, ప్రైవేటు జనరిక్ దుకాణాలు, బ్రాండెడ్ మందుల దుకాణాలు తదితర 7 రకాల లైసెన్స్డ్ విక్రయ కేంద్రాల నుంచి నమూనాలను సేకరించారు. సేకరించిన మందుల్లో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులు ఉన్నాయి. ప్రతి నమూనాను గుర్తింపు, మోతాదు ఏకరూపత, మందు కరిగే విధానం, మలినాలు, క్రియాశీల ఔషధ పదార్థం పరిమాణం తదితర ప్రమాణాలపై పరీక్షించారు.ఇందుకోసం ‘ఇండియన్ ఫార్మకోపియా–2022’ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అధ్యయనంలో పరీక్షించిన 131 నమూనాల్లో 131 మందులు అన్ని నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. అంటే జనరిక్ అయినా, బ్రాండెడ్ అయినా ఔషధంలోని క్రియాశీల పదార్థం పరిమాణం, మోతాదు ఏకరూపత, కరిగే విధానం, మలినాల స్థాయి తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నట్టు తేలాయి. అందువల్ల ధర ఎక్కువగా ఉండటం వల్ల నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి ఆధారం కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.సగం ధరకే జనరిక్ మందులు నాణ్యతలో తేడా లేకపోయినా జనరిక్కు బ్రాండెడ్ మందులకు ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. అధ్యయనంలో జనరిక్ మందుల సగటు ధర బ్రాండెడ్ మందులతో పోలిస్తే 48.6 శాతం తక్కువగా ఉంది. బ్రాండెడ్ జనరిక్ మందులతో పోల్చినా జనరిక్ మందులు సగటున 37.1 శాతం తక్కువ ధరకు లభించడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ధర వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని, అత్యధిక ధర ఉన్న బ్రాండెడ్ మందు, అత్యల్ప ధర ఉన్న జనరిక్ మందు మధ్య 13.9 రెట్ల వరకు వ్యత్యాసం నమోదైందని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జన్ ఔషధి కేంద్రాలు’’కూడా అధ్యయనంలో కీలకంగా నిలిచాయి.ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు!పరీక్షించిన ఔషధ విభాగాల్లో 81.8 శాతం అత్యల్ప ధరను జన్ ఔషధి కేంద్రాలే అందించినట్టు పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు నిరంతరం మందులు వాడాల్సి ఉండటంతో ధర తగ్గడం వారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లోనే కాకుండా వైద్య వర్గాల్లోనూ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్టు వారు తెలిపారు. -
ఎంఎంసీసీసీలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్(ఎంఎంసీసీసీ)లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. క్లబ్ అధ్యక్షుడు ఎనుగాల పెద్దిరెడ్డి, సెక్రటరీ రాగిడి లక్షా్మరెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్యదర్శి లక్షా్మరెడ్డి తెలిపారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు అలరించారు. -
సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.కంటోన్మెంట్లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్దేనని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.ఇదే భూమికి సంబంధించి హైకోర్టు తీర్పును ఉల్లంఘించి, శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ సంస్థ భూమిలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ద్వారా స్టే పొందడం గమనార్హం. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, న్యాయవాదులు అల్లంకి రమేష్, మహమ్మద్ జీషన్, మమత ఆర్ వాదనలు వినిపించారు. ఇదీ చదవండి : కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు దారులకు అలెర్ట్. కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసుకోవాలనుకునే వారి గడువు నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైన పేదలు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది (సుమారు 4.8 లక్షలకు పైగా) దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. అర్హులైన నిరుపేదలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్లోనే, యూనిఫామ్ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. Lynching doesn’t always start as an act of killingSometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officialsThe way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…— KTR (@KTRBRS) September 14, 2026 -
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ! -
పోలీస్ స్టేషన్లో దాడి యత్నంపై సమగ్ర దర్యాప్తు చేయాలి..
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించినట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.పండగ రోజున సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో దాదాపు 15 మంది ముసుగులు ధరించి ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే, అక్కడున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్స్టేషన్లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్స్టేషన్లోకి ఎలా వచ్చారు? వారెవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.ఘటనకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. అలాగే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో తేల్చాలని అన్నారు.హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి, దాడికి యత్నించిన వ్యక్తులను గుర్తించాలని అన్నారు. ఘటన వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు -
కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు
రాష్ట్రంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇన్ చార్జీలను ప్రకటించారు. మెదక్ లోక్ సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం నూతన నియామకాలు ప్రకటించారు. ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించిన కవిత తాజా నియామకాలతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను నియమించారు. గతంలో మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు పెద్దపీట వేశారు.అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు1) ఆదిలాబాద్ గోపు వేణుగోపాల్ యాదవ్ (బీసీ)2) మహబూబ్ నగర్ దొడ్ల సౌజన్య రెడ్డి (ఓసీ)3) సికింద్రాబాద్ కంటోన్మెంట్ చింతల రాజలింగం (ఎస్సీ)4) కుత్బుల్లాపూర్ ఎత్తరి మారయ్య (బీసీ)5) ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి (ఓసీ)6) నిజామాబాద్ అర్బన్ కందాడి మోహికా రెడ్డి (ఓసీ)7) నిజామాబాద్ రూరల్ బానోత్ నరేశ్ నాయక్ (ఎస్టీ)8) నిర్మల్ డాక్టర్ మాల్వె చంద్ర ప్రకాశ్ (బీసీ)9) ఖానాపూర్ మేస్రం దయాకర్ (ఎస్టీ – గోండు)10) అంబర్ పేట్ కంచగిరి ప్రవీణ్ కుమార్ (బీసీ)11) ఖైరతాబాద్ దేవరి చంద్రశేఖర్ (బీసీ)12) జూబ్లీ హిల్స్ హలీమా బేగమ్ (ముస్లిం)13) హుజూరాబాద్ కోకట్ల సంతోష్ యాదవ్ (బీసీ)14) పటాన్ చెరు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి (ఓసీ)15) దేవరకొండ నేనావత్ శివ నాయక్ (ఎస్టీ)16) నాంపల్లి సయ్యద్ మతీన్ అహ్మద్ (ముస్లిం)17) ఇల్లెందు వాసం రామకృష్ణ దొర (ఎస్టీ – కోయ)18) అశ్వారావుపేట సోడెం వెంకట్ (ఎస్టీ – కోయ)మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జీమద్ది శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు1) రంగారెడ్డి పురం మహేందర్ రెడ్డి (ఓసీ)2) సంగారెడ్డి మాసన్నగారి బాలయ్య (ఎస్సీ)3) ఆదిలాబాద్ బాపురావు రాథోడ్ (ఎస్టీ)4) నిర్మల్ లోకిని రాము (ఎస్టీ)5) కొమ్రం భీం ఆసిఫాబాద్ కిరిమిల వినోద్ చారి (బీసీ)6) మంచిర్యాల ఊదరి చంద్రమోహన్ గౌడ్ (బీసీ)7) మేడ్చల్ – మల్కాజిగిరి నవీన్ గోగికర్ (బీసీ)8) మహబూబ్ నగర్ డాక్టర్ ఎర్రంశెట్టి వెంకట్రామ్ మూర్తి (బీసీ)9) నిజామాబాద్ మంథెన నవీన్ రెడ్డి (ఓసీ)10) కరీంనగర్ గుంజపడుగు హరిప్రసాద్ (బీసీ)11) భద్రాద్రి కొత్తగూడెం సముద్రాల క్రాంతి కుమార్ (బీసీ)12) గ్రేటర్ హైదరాబాద్ (సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ లు సహా), వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ (ఓసీ)జిల్లా ప్రధాన కార్యదర్శులు1) నిజామాబాద్ దొంత ప్రవీణ్ (ఎస్సీ)2) మేడ్చల్ మల్కాజిగిరి శీలం వీరేందర్ (ఎస్సీ)3) మంచిర్యాల తంగళ్లపల్లి అరుణ్ కుమార్ (బీసీ)టీఆర్ఎస్ అనుబంధ విభాగాలుఎంబీసీ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్ప్రధాన కార్యదర్శి హకీంకారి సురేందర్ జీతెలంగాణ న్యాయ రక్షణ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు అప్పాల నరేందర్ యాదవ్టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్గ్లోబల్ ప్రెసిడెంట్ విజయ్ కూరబోయినగ్లోబల్ జనరల్ సెక్రటరీ సుమన్ బల్మూరిట్రేడ్ అండ్ కామర్స్ వింగ్రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గరినెప్రధాన కార్యదర్శి రామ్ ప్రతాప్ శ్రీవాస్తవ్టీఆర్ఎస్ వీస్టేట్ యూనివర్సిటీస్ ఇన్ చార్జి డాక్టర్ సిమ్రాల చిన్నలింగమయ్య (అశోక్ యాదవ్)స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి బండారు శ్రీనివాస్ గౌడ్జూనియర్/పాలిటెక్నిక్/డిగ్రీ/పీజీ ఇన్ చార్జి వల్లకొండ అజయ్ రెడ్డిటీఆర్ఎస్ సోషల్, డిజిటల్ మీడియారాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ కొల్లూరుప్రధాన కార్యదర్శి సందీప్ బెల్లంపల్లిజాయింట్ సెక్రటరీ కొలకాని మనోహర్జాయింట్ సెక్రటరీ తేజా చౌదరిజాయింట్ సెక్రటరీ కవిత మేరుజాయింట్ సెక్రటరీ పాలె నిషాటీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సుహైబ్టీఆర్ఎస్ రైతు విభాగంరాష్ట్ర అధ్యక్షుడు పొన్నమనేని బాలాజీ రావుటీఆర్ఎస్ బంజారా విభాగంరాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్టీఆర్ఎస్ జర్నలిస్ట్ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు వంగ మహేందర్ రెడ్డితెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్ టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు దేవల వీరన్నఇదీ చదవండి: ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా! -
కేటీఆర్ పీఏ,పీఆర్వో విచారణలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును పరిశీలించేందుకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరినీ అసెంబ్లీ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సైఫాబాద్ పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.అసెంబ్లీ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూపీ లాగుతున్న పోలీసులు, సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం కేటీఆర్ పీఏ, పీఆర్వో అక్కడికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దీనిని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ విచారణ కొనసాగుతోందని న్యాయవాదులు ఆరోపించారు.మరోవైపు, ఈ వివాదం మధ్యలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్ఓ మహేష్ స్పందిస్తూ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తామే స్వయంగా అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే స్పీకర్పై వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశాం. గద్దర్, అందెశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నా.. కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.‘‘దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలి. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం. దళిత జాతిని కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదు’’ అని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు.‘‘దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ,దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు మరిచిపోలేదు. దళిత స్పీకర్ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మీనాక్షీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీనాక్షి విషయంలో అధిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆ అంశంపై సమాచారం లేదు..‘‘కొత్త ఇంఛార్జ్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. కొండా సురేఖను అధిష్టానం పిలిచిందన్న అంశంపై నాకు సమాచారం లేదు’’ అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ.. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి -
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లు గవర్నర్కు స్వాగతం పలికారు.ఖైరతాబాద్లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని రూపొందించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని.. తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నగరం పండగ కళను సంతరించుకుంది. గణనాథుడి పూజలతో భక్తులు తరించనున్నారు. కాగా.. పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయి. నగరంలోని బేగంబజార్, సుల్తాన్ బజార్, గోషామహల్, మెహిదీపట్నం తదితర మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే అన్ని పూజా సామగ్రి ధరలు 40 నుంచి 50 శాతం పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.సాధారణంగా రూ.500–600తో చిన్న పూజకయ్యే ఖర్చు ఈ ఏడాది కనీసం రూ.1,200 నుంచి రూ.1,500కు చేరిందని అంటున్నారు. పూలు, పండ్లతో పాటు గరిక, తమలపాకులు, అరటి ఆకులు, జిల్లేడు, మారేడు తదితరాల ధరలు పెరిగాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకాలు, స్వీట్లు, లడ్డూలకు డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనంటాయి.ఇదీ చదవండి: ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో.. -
తెలంగాణలో వాన మోత.. ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.రాత్రి దంచి కొట్టిన వానతెలంగాణ అంతటా గత రాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. హైదరాబాద్ సహా జనగామ, భద్రాద్రి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ముంచెత్తాయి. కొడకంట్లలో 12 సెం.మీ, పాల్వంచలో 11.7 సెం.మీ. రామన్నపేట, దేవురుప్పలలో 10.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లోనూ ఈ వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సేపు గట్టి వాన పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. -
HYD: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గురువారం రాత్రి అదృశ్యం.. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్ సమీప బంధువు అశోక్ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని గోల్డెన్ దాబా సమీపంలో రాజశేఖర్ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు ఠాణాలో కుప్పకూలిన బంధువు.. కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కారు కోసమే ఘాతుకమా? ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్ చేసుకుని, ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం -
అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి
హైదరాబాద్: అమెరికా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న నగరానికి చెందిన యువకుడు గుండెపోటుతో కన్నుమూశారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బేగంపేట్ ప్రకాశ్ నగర్కు చెందిన నగేష్ సాయికుమారి దంపతుల కుమారుడు రావుల పవన్ సాయి వంశీ (36) చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2016లో అమెరికాలో ఎంబీఏ చేశారు. అనంతరం అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడి కొద్ది నెలల క్రితమే ఐబీఎంలో చేరారు. వంశీకి 2018లో వివాహమైంది. మూడున్నర సంవత్సరాల కుమారుడు, మూడు నెలల వయసు కూతురు ఉన్నారు. కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆయన ఈ నెల 9న ఉదయం పిల్లలతో ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందడంతో ప్రకాశ్నగర్లోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: అతనంటే నాకు ఇష్టం.. దేబ్జానీ ప్రపోజల్ హింట్! -
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం -
కొత్త కారును అడ్డగించి రూ.2 లక్షలు డిమాండ్!
బంజారాహిల్స్: కొత్తగా కొన్న కారును అడ్డుకుని రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ట్రాన్స్జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో రెండు వారాల క్రితం నలుగురు ట్రాన్స్జెండర్లు కొత్త కారును అడ్డగించి అందులోని వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ‘ఎక్స్’లో వీడియో పోస్ట్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా విచారణ చేపట్టగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. BMW owner harassed by transgenders in Hyderabad, demanding 2 lakh rupees after new car was delivered pic.twitter.com/zVFXKdbJh8— Mogambo (@Netajinonsense1) September 11, 2026 ఇదీ చదవండి: రెమ్యునరేషన్పై సింగర్ జంగి రెడ్డి స్పష్టత ఇదే.. -
శంషాబాద్లో బస్సు బీభత్సం.. హోటల్లోకి దూసుకెళ్లి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ కిషన్గూడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హోటల్లోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఎదురుగా కంటైనర్ రావడంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ పోల్ను ఢీ కొడుతూ ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసి ఉన్న కార్లను బైక్ను ఢీకొడుతూ దూసుకెళ్లింది.ప్రమాదంలో బస్సు డ్రైవర్తో సహా పలువురు గాయపడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మృతుడిని కరీంనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దుబాయ్కి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తూ మధ్యలో టీ తాగడం కోసం హోటల్ దగ్గర ఆగిన అజ్మల్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అజ్మల్ మృతి చెందారు.ఇదీ చదవండి: వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు -
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
సాక్షి, హైదరాబాద్: మౌలాలి దగ్గర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. భారీ శబ్దాలు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. రైలు దిగి పరుగులు తీశారు. రైలు విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ తీగలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అనంతరం ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్థారించారు. -
వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వేళ వరుణుడు విజృంభించాడు. అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్లు జారీ చేశాయి.తెలంగాణలో అర్ధరాత్రి దాటాక గట్టి వానలు కొడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గల్లీలు, రహదారులు జలమయం అయ్యాయి. ఇవాళ, రేపు పలు జిల్లాలోనూ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.అటు ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎన్టీఆర్, మన్యం, అల్లూరి పోలవరం, కాకినాడ, గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన -
77% నోటీసుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఆదివారం నాటికి 77 శాతం నోటీసుల పంపిణీ పూర్తికాగా, నోటీసులు అందుకున్న/అందుకోనున్న మొత్తం ఓటర్లలో 25శాతం మంది విచారణ ప్రక్రియ సైతం పూర్తయింది. సర్లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వారిలో 92,88,164 మంది అన్మ్యాప్డ్, అనామలీస్ గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. ‘సర్’లో సాధించిన పురోగతిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం రూపొందించిన రోజువారీ నివేదిక ప్రకారం..ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి 100 శాతం నోటీసుల ప్రచురణ పూర్తయింది. ఇందులో 72,01,011 మంది (77.52%) ఓటర్లకు నోటీసుల పంపిణీ పూర్తి కాగా, మరో 20,87,153 మంది ఓటర్లకు నోటీసుల పంపిణీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 23,31,073 (25%) మందివి ఓటర్ల విచారణ పూర్తి చేశారు. నోటీసుల మీద ముద్రించిన తేదీన ఓటర్లు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వివిధ కారణాలతో 47,57,427 మంది విచారణ తేదీల గడువు ముగిసిపోయింది. దీంతో వీరి విచారణ తేదీలను రీషెడ్యూల్ చేసి కొత్త తేదీలను ఇవ్వనున్నారు. ఇప్పటికే 50,526 మంది ఓటర్లకు కొత్త విచారణ తేదీలు ఇచ్చారు. కలెక్టర్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన బాధ్యత ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా? అని నిర్ధారించడానికి వాటిని జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు. సర్ ప్రక్రియ ప్రస్తుత దశలో సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో)దే అంతిమ నిర్ణయం. వారు ఆమోదించిన పేర్లను నవంబర్ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయి. వీరు అనర్హులుగా తేల్చిన ఓటర్ల పేర్లను అందుకు గల కారణాలతో తొలగించిన ఓటర్ల జాబితాలో ముద్రిస్తారు. తొలగించిన ఓటర్లు తదుపరి దశలో జిల్లా కలెక్టర్కు, అక్కడా తిరస్కరిస్తే ఆ తర్వాతి దశలో సీఈఓకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తొలి అప్పీల్ దశకు ముందే ధ్రువీకరణ పత్రాల పరిశీలన అధికారం కలెక్టర్లకు అప్పగించడం గమనార్హం. ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాలను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయగానే వాటిలో నిజమైనవా? కావా? ధ్రువీకరించాల్సిన అవసరం ఉన్న పత్రాలను ఈఆర్వోలు కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు 2,66,718 ఓటర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా, మరో 7,48,487 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది.ఇప్పటి వరకు 1,524 మంది అనర్హులు సర్లో భాగంగా ఇప్పటి వరకు 23,31,073 మంది ఓటర్ల విచారణకు హాజరై తన వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను రుజువులుగా సమర్పించగా, వారిలో 13,69,023 మంది ఓటర్లు అర్హులని తేల్చారు. విచారణ అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,524 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన ఓటర్ల అర్హతలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలనలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఓటర్లను అనర్హులుగా తేల్చుతున్నారు. -
వైశ్యుల శ్రేయోభిలాషిని
ఉప్పల్(హైదరాబాద్): ‘ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారు. చాలామంది పేదలున్నా, ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్ట పడరు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ కష్టాలు, బాధలు ఉన్నా సమాజంలో గౌరవం కోసం జీవించేవారు ఆర్య వైశ్యులని, తానెప్పుడూ వారి శ్రేయోభిలాషినేనని చెప్పారు. ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులని అవి వ్యవసాయం, వ్యాపారాలేనన్నారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి నుంచి మొదలు కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే అప్పగించారని గుర్తు చేశారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు అయ్యేనాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉందంటే ఆనాటి ఆర్థికమంత్రి రోశయ్యే కారణం అన్నారు. శాసనమండలిలో దూకుడుగా తాను మాట్లాడితే రోశయ్య నన్ను పిలిచి ఆవేశం తగ్గించుకొని అనుభవంతో ముందుకు వెళ్తే పైకి వస్తావని ఆశీర్వదించారన్నారు. రోశయ్య విమర్శించే వారు కాదు..తిట్టేవారు కాదు..చురకలు వేసేవారు అని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీప్రపంచస్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీ అని, ఏ దేశం పోయినా ఆయన గొప్పతనం తెలియనివారు ఉండరని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మాగాంధీ అన్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వ కారణమని చెప్పారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలు ఇస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, మాజీమంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీఎంపీ మధు యాష్కీ, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పరమేశ్వర్రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన చోట నెమ్మదిగా ప్రయాణించాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: ఏఐ.. రాక్షసి!! -
ఏఐ.. రాక్షసి!!
న్యూయార్క్/సాక్షి, హైదరాబాద్: అనూహ్య వేగంతో సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్న కృత్రిమ మేథ (ఏఐ)కు కళ్లెం వేయాల్సిన సమయమొచ్చిందని కృత్రిమ మేథ (ఏఐ) దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ వ్యాఖ్యానించారు. ఫార్చూన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో పలు ఆందోళకర అంశాలను పంచుకున్నారు. ‘‘ఏఐ అమితమైన వేగంతో శక్తిసామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలోగా యావత్ మానవాళిని ఇది హరించేస్తుంది. ఇప్పటికైనా ఏఐ నిపుణులు, ప్రభుత్వాలు, పౌరసమాజం మేల్కొని ఏఐకు కళ్లెం వేయాలి. భద్రతా ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలి’’ అని అన్నారు. ఏఐను నియంత్రించపోతే అది మనందర్నీ చంపేస్తుందని ఆంథ్రోపిక్ నుంచి వైదొలగిన ఏఐ శాస్త్రవేత్త జాకబ్ కోక్సన్ ఇటీవల వ్యాఖ్యానించిన వేళ అదే తరహాలో డారియో ఆమోడెయ్ మాట్లాడటం గమనార్హం. ‘‘ఎప్పటికప్పుడు ఏఐ సరైన మార్గంలో వెళ్తుందో లేదో ఓ కంట కనిపెట్టే భద్రతావ్యవస్థను మెరుగుపరచాలి. లేదంటే మానవాళికి ముప్పు తప్పదు. ఏఐలో వస్తున్న పెను మార్పులను అడ్డుకోకపోతే వచ్చే 12 నెలల్లోగా యావత్ ప్రపంచ ఇంటర్నెట్ను అది గుప్పిటపట్టేస్తుంది. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదం’ అని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను అడ్డుకోవడం అంటే దానిని పూర్తిగా నిలిపేయడంకాదు. ఏఐలో సేఫ్టీ రీసెర్చ్, టెస్టింగ్, పర్యవేక్షణ ఖచ్చితంగా మెరుగుపడాలి. శాస్త్రవేత్తలు అర్థంచేసుకోలేనంత స్థాయికి ఏఐ తనకుతానుగా వృద్ధి చెందకుండా అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు.వంతపాడిన మస్క్, ఆల్ట్మన్డారియో అభిప్రాయంతో ఏఐ దిగ్గజ సంస్థల చీఫ్లు సైతం ఏకీభవించారు. సూపర్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్లతో ప్రమాదం పొంచి ఉందని ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘ఏఐ అనేది మన చేతి దాటిపోతే అదుపుచేయడం చాలా కష్టం. అప్పుడు దుర్వినియోగం అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. క్షిపణుల తయారీ, జీవఆయుధాలు, సైబర్ దాడులు వంటి రహస్యాలన్నీ ఉగ్రసంస్థలు, హ్యాకర్ల చేతికొచ్చే ప్రమాదముంది. అప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డెవలప్ తరహాలో ఇతరులకూ ఏఐను అడ్డుకునే అవకాశం ఉండాలి’’ అని ఆల్ట్మన్, మస్క్ వ్యాఖ్యానించారు.ఏఐ భద్రతా పరిశోధకుల మాట ఇదీ..ఏఐ శక్తిసామర్థ్యాలు పెరిగితే అది మానవాళిని నేరుగా నాశనం చేసే అవకాశం ఉండదని ఏఐ భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. అయితే మానవ ప్రయోజనాలకు అనుగుణంగా లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మానవుల కంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏఐ వ్యవస్థలు సిస్టమ్లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బయో వెపన్లు, సైబర్ దాడులతో పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలనుకొనే వారికి ఏఐ వ్యవస్థలు సాంకేతికంగా కొంత మేర దోహదపడే ప్రమాదం ఉందంటున్నారు. -
మ్యాపింగ్ చేయలేదా.. సాఫ్ట్వేర్ లోపమా?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు.. సర్–2002 ఓటర్ల జాబితాలోని తమ/తమ బంధువుల ఓటు వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది..ఆపై వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం పదేపదే పేర్కొంది. ‘సర్’రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సైతం ఇదే హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 జాబితాలోని వివరాలు ఇచ్చినా, పెద్ద సంఖ్యలో ఓటర్లను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ చేసుకునే అవకాశం లేదని బీఎల్ఓలు చెప్పడంతో ఓటర్లు విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్–2026లో భాగంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లు ఉండగా, వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. నిర్లక్ష్యమా...లేకపోతే... చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలు ఇవ్వకపోవడతో వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా, ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. చాలామంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 ఓటు వివరాలను ఇచ్చినా వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటిసులిస్తుండడంతో ‘సర్’ప్రక్రియలో తీవ్ర లోపాలను ఎత్తిచూపుతోంది. ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేరును సర్–2002 ఓటర్ల జాబితాలోని పేరుతో అనుసంధానం (మ్యాపింగ్) చేయాల్సి ఉండగా, పెద్ద సంఖ్యలో ఓటర్లను మ్యాపింగ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో సర్–2026 ప్రక్రియ ప్రారంభానికి కొన్ని నెలల ముందే..ముందస్తు సన్నాహకంగా మ్యాపింగ్ ప్రక్రియను ఈసీ చేపట్టగా, తమ పేర్లను మ్యాపింగ్ చేయాలని అప్పట్లోనే స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో)కు చాలామంది ఓటర్లు అందజేశారు. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారంలో సైతం సర్–2002 జాబితాలోని వివరాలను అందజేశారు. అయినా, తమను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి ఈసీ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారని సామాజిక మాధ్యమాల వేదిక ఓటర్లు ఆరోపిస్తున్నారు. బీఎల్ఓలు/ బీఎల్ఓ సూపర్వైజర్లు/ఈఆర్వోల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందా? లేక సాఫ్ట్వేర్ లోపాలతో జరిగిందా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని చింతల్కుంటలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఓటర్లుండగా, వారిలో చాలామంది ఓటర్లు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. వివరాలిచ్చినా బీఎల్ఓల నిర్లక్ష్యంతో మ్యాపింగ్ జరగని ఓటర్ల మ్యాపింగ్కు మరో అవకాశం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు. -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్చార్జి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్చార్జిని నియమించే దిశగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. దీపా దాస్మున్షీ స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె విదేశాలకు వెళ్లనుండటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా, ఇతర సంస్థాగత అంశాలతో క్షేత్రస్థాయి నివేదికను మీనాక్షి పార్టీ అధిష్టానానికి సమర్పించారని సమాచారం. అయితే ఆమె గైర్హాజరుతో పార్టీ కొత్త ఇన్చార్జి కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. ప్రధానంగా ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లు రేసులో ముందున్నట్లు సమాచారం కాగా, వీరితో పాటు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లను కూడా ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు. సంస్థాగత అనుభవశీలి ముకుల్ వాస్నిక్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ముకుల్ వాస్నిక్ పేరు ఇన్చార్జి రేసులో బలంగా వినిపిస్తోంది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలకు ఇన్చార్జిగా విజయవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న వాస్నిక్, పారీ్టలో వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాది రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటం, నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడంలో నేర్పరి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. వ్యూహాల రూపకల్పనలో శక్తిసిన్హ్ గోహిల్ గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన గోహిల్కు చట్టసభలు, రాజ్యాంగపరమైన అంశాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో గుజరాత్ ప్రభుత్వంలో ఆర్థిక, విద్యా శాఖల మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఢిల్లీ, బిహార్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో, క్షేత్రస్థాయి శ్రేణులను సమన్వయం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర పరిస్థితులపై దిగ్విజయ్కు పట్టు రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లోని మెజారిటీ సీనియర్ నాయకులతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కావడంతో ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆయన 1993 నుంచి 2003 వరకు పదేళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఉన్నారు. సమన్వయకర్తగా అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్.. రాజస్థాన్ రాష్ట్రానికి మూడు సార్లు (1998–2003, 2008–2013, 2018–2023) ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. గతంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత వ్యవహారాలు) పనిచేసిన కాలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో పార్టీని నడిపించగల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం సాధించేందుకు గెహ్లాట్ లాంటి సీనియర్ నేత అవసరం ఉంటుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. కాగా కొత్త ఇన్చార్జి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై త్వరలో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.వారి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి, మహేష్ రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
భారతీయ భాషలు దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు
హైదరాబాద్: భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి భారతీయ భాషలు ప్రతిబింబాలని, అవి దేశ సమున్నత సాంస్కృతిక వారసత్వానికి అమూల్యమైన ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ నెల 14 వ తేదీన జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.హిందీతో పాటు భారతీయ భాషల పరిరక్షణ, ప్రోత్సాహం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భాషలు ప్రజలను అనుసంధానిస్తూ పరస్పర అవగాహన, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలోపేతం అవుతుందని గవర్నర్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు -
‘మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి’
హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల విజయలక్ష్మి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు -
తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ గణేశుడి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిలషించారు. శ్రీ గణేశుడిని విఘ్నవినాశకుడిగా, శుభప్రదుడిగా ఆరాధించడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని గవర్నర్ పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని ప్రార్థించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ ఐక్యత, శాంతి, అభివృద్ధి, సౌభాగ్యానికి అడ్డుగా నిలిచే అన్ని విఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగించి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వినాయక చవితి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, సామరస్యం, సుఖసంతోషాలను నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు లోక్ భవన్ కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. -
కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి
వరంగల్: మాజీమంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం వరంగల్లో కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది.. కానీ, సారీ అని ఏ రోజూ రాతలు రాయలేదని తెలిపారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకుడే లేడని చెప్పారు.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని మురళి తెలిపారు. ‘‘మాటపై నిలుచోవాలి.. పదవులు ఉంటాయి.. పోతాయి. కృతజ్ఞత అనేది కొండా రక్తంలో ఉంది. నా కారు రంగు ఇండియాలో ఎవరికి ఉండదు.. అది ముస్లింలకు చిహ్నం. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు... కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం.నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి.. మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయి. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవకండి. కొండా సురేఖది... నాది ఓకే మాట... నా బిడ్డ సుస్మితది వేరే మాట. వరంగల్ తూర్పులో 24మంది కార్పొరేటర్లను గెలిపిస్తాను. కొండా మురళి కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి బయటకు వస్తా. రేవంత్ అన్నకు అన్నీ తెలుసు. ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది నిజం. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్ కు అప్పగిస్తున్నా. కష్టపడి పని చేసేవారికి.. గెలిచే వ్యక్తి కార్పోరేటర్ టిక్కెట్ దక్కుతుంది. నాకు, నా బిడ్డ సుస్మితకు సంబంధం లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది నాయకులు ఉన్నారు. కొండా మురళీ మాటంటే మాటే. అన్ని వర్గాలను కల్పుకొని ముందు పోతాం. కార్యకర్తల కోసం ఇంకో 10 ఎకరాలు అయినా అమ్ముతా. కార్యకర్తలే నా బలం’’ అని కొండా మురళి అన్నారు. -
రూ.40 లక్షల చికిత్స.. గాందీలో ఉచితం
హైదరాబాద్: రక్తం గడ్డకట్టే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్ గాందీఆస్పత్రి వైద్యులు. గాందీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన యడ్ల లక్ష్మి(21) ప్రసవం కోసం గతనెల 21న గాం«దీఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి కారణంగా రక్తం గడ్డ కట్టే అరుదైన రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. లక్షలాది రూపాయల విలువైన రికాంబినెంట్ ఫ్యాక్టర్–7 ఔషధాన్ని తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రత్యేకంగా అందించింది. పండంటి ఆడబిడ్డకు జన్మఈనెల 11న వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మి ఆడ శిశువుకు జన్మనిచి్చంది. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదైన అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్–7 డెఫిసియాన్సీ వ్యాధి ఉంటుందని, ప్రసవ సమయంలో రక్తం గడ్డకడితే తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రసవానికి సుమారు రూ.40 లక్షలు తీసుకుంటారని, గాం«దీఆస్పత్రిలో పూర్తి ఉచితంగా నిర్వహించామన్నారు. గాంధీ గైనకాలజీ వైద్యులు ప్రొ. జానకీ, ప్రొ.శకుంతల, లేబర్రూమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత తదితరులు వైద్య సేవలందించారు. చదవండి: భర్త కళ్ళముందే ప్రాణం విడిచిన నవ వధువు -
లోన్ యాప్స్ వేధింపులు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోరబండ పోలీసులు తెలిపిన మేరకు.. ఇందిరానగర్లో నివసించే గద్దె పవన్ (30) నగరంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. పవన్ తన అవసరాల కోసం దాదాపు రూ.10లక్షలను యాప్స్లో రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేక మనస్తాపం చెందాడు. శనివారం తెల్లవారుజామున వాష్రూంలో షవర్కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధాల యాప్ల వినియోగంలో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్ డేటింగ్(రహస్య డేటింగ్) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్ తమ యాప్నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్ కొత్త సబ్స్క్రైబర్లలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.యాప్ ఫీచర్లలో గోప్యతఇండియా యూజర్ ట్రెండ్స్ అండ్ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్ అందించే రహస్య ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్ స్టేట్మెంట్లలో యాప్పేరు కనిపించకుండా బిల్లింగ్ చేయడం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.పోలీసులు, సైబర్నిపుణుల హెచ్చరికలుడేటింగ్ యాప్ల కోసం వెంపర్లాడే వారిని సైబర్నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రై మ్ గణాంకాల ప్రకారం డేటింగ్ యాప్లకు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్మెయిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదురయ్యే పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైవాహిక బంధాలు బలహీనపడ్డాయని డేటింగ్యాప్లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు. ఇదీ చదవండి: ముకేశ్ కళ్ల గురించి దేబ్జానీ-నాగ్ డిస్కషన్ -
బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారం ఆర్మీ ఏరియాలో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే మల్లేష్ వెనుక పెద్ద అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే, కేసు తీవ్రతను పోలీసులు మల్లేష్ భార్య, మామకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో భర్తను భార్య గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఆయుధాలు చోరీ చేసి ఉంటే తప్పును ఒప్పుకోవాలని ఆమె హెచ్చరించడంతో.. చివరకు మల్లేష్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు.. మల్లేష్ మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అక్రమ ఆయుధాల సరఫరాదారులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దేశీయ ఆయుధ సరఫరాదారులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులకు ఆధారాలు దొరకకుండా కీలక వాట్సాప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్, ఇతర లాగ్లను డిలీట్ చేసినట్లు వెల్లడైంది.దీంతో సైబర్ క్రైమ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన డేటాను తిరిగి రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాట్స్, మీడియా ఫైల్స్, కాల్ డేటా వంటి కీలక ఆధారాలు బయటకు వస్తే మల్లేష్ ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు? ఆయుధాల కోసం ఎవరితో డీల్ చేశాడు? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణం నుంచి ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడం సాధ్యమేనా? అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీలోని ‘ఇంటి దొంగల’ సహకారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.చోరీ చేసిన ఆయుధాలను మల్లేష్ ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడు? గ్యాంగ్స్టర్లకా.. ఇతర నేరస్తులకా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధాల కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లు, బ్యాంకు ఖాతాలు లేదా హవాలా మార్గాల్లో ఏమైనా డబ్బు చేతులు మారిందా? అన్నదానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో మల్లేష్ అరెస్టుతో ఆగకుండా.. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.ఇదీ చదవండి: సురేఖకు హైకమాండ్ నుంచి పిలుపు.. -
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ గంట మోగించగానే చర్చ మొదలవుతోంది. కానీ ఆ గంట మోగడం వెనుక ప్రతి గంటకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఎన్జీవో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాసనసభ నడవాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది. 250 మంది అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, 300 మంది పోలీసులు, శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అసెంబ్లీకి వస్తారు. వారందరికీ ఓవర్ టైం అలవెన్స్, భోజనం, రవాణా ఖర్చు ప్రభుత్వానిదే. దీనికితోడు అసెంబ్లీ హాల్లో ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్, వాటి నిర్వహణ సిబ్బంది, క్యాంటీన్, కాగితాల ముద్రణ ఖర్చులు అదనం. ఇవి కాకుండా సభ జరిగే రోజున ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రోజువారీ భత్యం రూ. 2,000, ప్రయాణ భత్యం, హైదరాబాద్లో ఉచిత బంగ్లా, కారు, ఇద్దరు పీఏల జీతాలను ప్రభుత్వమే భరిస్తుంది. సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ మాత్రం సభకు వస్తేనే లభిస్తుంది. ఇలా అన్నీ కలిపితే కేవలం ఒక రోజుపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లెక్కన) రాష్ట్ర శాసనసభ నిర్వహణకు దాదాపు రూ. కోటి నుంచి రూ.కోటిన్నర దాకా ఖర్చవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్కే రూ. 13.59 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగిందని పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది. ఇదీ చదవండి :కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆదివారం ఉదయం కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీల్లో ఉదయం నుంచి 9 గంటల మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రంతా భారీ వర్షాలు కురిసిన యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండలోని కట్టంగూర్ ప్రాంతాల్లో మరో రెండు గంటల పాటు మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. WARANGAL - KARIMNAGAR - SIDDIPET - JANGAON RAINS ALERT - 6.20 AM ⚠️🌧️ ONGOING NON STOP MODERATE - HEAVY RAINS across Medak, Siddipet, Yadadri - Bhongir, Medchal - Malkajgiri to further spread across Jangaon, Hanmakonda, Warangal later into Karimnagar, Bhupalapally, Mulugu,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2026మెదక్, సిద్దిపేట, మెద్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లోనూ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉండగా.. దక్షిణ హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక గత 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 120–200 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్మ్యాన్ పేర్కొన్నారు. యాదాద్రి-భువనగిరి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.ఇదీ చదవండి: వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువతి అక్కడికక్కడే మృతి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్íÙప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపైనుండి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది.ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పట్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి... -
అమ్మేందుకే ఆయుధాలు చోరీ!
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఏరియాలో తీవ్ర కలకలం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసును మరింత వేగవంతం చేశారు. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది. కేసులోతుల్లోకి వెళ్లే కొద్దీ మల్లేశ్ వెనక పెద్ద అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులకు సంచలన ఆధారాలు లభించాయి. నిందితుడు ఫోన్ ఆధారంగా జరిపిన ప్రాథమిక దర్యాప్తులో అంతర్జాతీయ, అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల వ్యాపారులతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. మల్లేశ్ తన మొబైల్ ద్వారా సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ వేదికగా దేశీయ ఆయుధ సరఫరాదారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులకు దొరకకుండా నిందితుడు తన ఫోన్లోని కీలక వాట్సాప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్ రికార్డ్లు, లాగ్లను డిలీట్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ నిపుణులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) టీమ్ సహకారంతో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్లు, మీడియా ఫైళ్లు, కాల్ డేటా రికార్డ్లను వెలికితీసే పనిలో పడ్డారు. కాగా, విశాలమైన ప్రాంగణం, కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండే ఆర్మీ ఏరియా నుంచి కేవలం ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలోని ఇంటి దొంగల సహకారం కూడా తప్పకుండా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొట్టేసిన ఆయుధాలను మల్లేశ్ ఎవరికి విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నాడు? గ్యాంగ్స్టర్లకా లేక నేరస్తులకా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలాగే డిజిటల్ పేమెంట్లు, హవాలా లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా ఎంత మొత్తం చేతులు మారిందనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. -
పెసరకు పిసరంతే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకున్నా, అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేసిన పెసర పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు నిర్ణయించిన రూ.8,780 ధర దక్కక, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్కు మార్క్ఫెడ్ లేఖ రాసి చేతులు దులుపుకుంది. గణనీయంగా పెరిగిన సాగు రాష్ట్రంలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 64,610 ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది 61,348 ఎకరాల్లోనే సాగైంది. కానీ ఈసారి అంచనాలకు మించి 1,60,182 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావంతో మెట్టతోపాటు తరి పంటలు లేని చోట రైతులు పెసర సాగు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే 98,834 ఎకరాల్లో అదనంగా పంట సాగవగా.. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పంట చేతికి వచ్చి నూర్పిడి చేస్తున్న రైతులు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. అయితే, ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా రెండు క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు కూడా మద్దతు ధర లేక రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మద్దతు ధర హుష్ కేంద్ర ప్రభుత్వం పెసర క్వింటాకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర మార్కెట్లలో ఎక్కడా దక్కడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పరిశీలిస్తే గత నెల 14న కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాకు గరిష్టంగా రూ.7,600, రూ.3,400 కనిష్ట ధరగా నమోదైంది. అంటే గరిష్ట – కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం క్వింటాకు ఏకంగా రూ.4,200 తేడా ఉంది. ఈనెల 1న గరిష్టంగా రూ.7,600 పలకగా.. కనిష్ట ధర రూ.3,400కే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ఒక్క క్వింటాకూ దక్కలేదు. దిగుబడి లేదు.. ధర లేదు ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పెసర దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు క్వింటాళ్లకు బదులు రెండు క్వింటాళ్లు మించడం లేదు. రెండున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాకు రూ.6,700 మాత్రమే ధర పెట్టడంతో ఇక్కడ కూడా నష్టపోయాం. – తూము వీరస్వామి, చింతకాని, ఖమ్మం జిల్లా ప్రభుత్వ కొనుగోలు లేక.. అంతా దగా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టం నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.3 వేలకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర పలికితే సాగు ఖర్చులైనా మిగిలేవి. – మడిపల్లి రమేశ్, రేపల్లెవాడ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా -
బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డితో సమావేశమై బీసీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు వివరించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని కోరగా ఈ అంశంపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, పలు జిల్లా కేంద్రాల్లో బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో సీట్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 120 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ,హాస్టల్ విద్యార్థుల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేయగా కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆదేశించారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సాధ్యమైనంత త్వరగా దశలవారీగా చెల్లిస్తామని చెప్పారన్నారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.మల్లేష్యాదవ్, నీలా వెంకటేష్, జిల్లపల్లి అంజి, సి.రాజేందర్, పర్లగోర్ల మోడీ రాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.266 కోట్ల పరిహారం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్లో రూ.266 కోట్ల పరిహారం కక్షిదారులకు పంపిణీ చేశారు. అలాగే 4,20,626 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రీలిటిగెంట్ కేసులు 2,78,335 ఉండగా, పెండింగ్ కేసులు 1,40,565 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. లోక్ అదాలత్లో వినియోగదారుల, కార్మిక, మోటారు ప్రమాద పరిహారం, భూసేకరణ, సివిల్, క్రిమినల్ తదితర వివిధ రకాల పెండింగ్, ప్రీ–లిటిగేషన్ కేసులకు రాజీ పరిష్కారాలు కల్పించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, టీఎస్ఎల్ఎస్ఏ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ పి.శామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ కె.లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 342 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేశారు. వీటిలో 340 బెంచీలు జిల్లా కోర్టుల్లో, రెండు బెంచీలు తెలంగాణ హైకోర్టులో పనిచేశాయి. అత్యధికంగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్కు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సమక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.5 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేసింది. హైకోర్టులో 182 కేసుల పరిష్కారం..తెలంగాణ హైకోర్టులో జస్టిస్ కె.సుజన, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు ఆధ్వ ర్యంలో రెండు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలు పనిచేశాయి. వీటి ద్వారా 182 పెండింగ్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. మోటారు ప్రమాద పరిహా రం కేసుల్లో బాధితులకు రూ.14.81 కోట్లకు పైగా పరిహారం మంజూరైంది. -
ఇదేం పరిపాలన అధ్యక్షా
సాక్షి, హైదరాబాద్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్లో ‘మాక్ అసెంబ్లీ’నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను తలపించేలా సభా మందిరాన్ని తీర్చిదిద్ది, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల పాత్రలను పార్టీ నేతలకు కేటాయించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్రావు స్పీకర్గా వ్యవహరించగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సీఎం రేవంత్రెడ్డి పాత్ర పోషించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాత్రలో, మాజీ మంత్రి గంగుల కమలాకర్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాత్రలో కనిపించారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఇరిగేషన్పై చర్చను ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో అధికార పక్షం పాత్రధారులుగా వ్యవహరించిన నేతలు ప్రభుత్వంపై వ్యంగ్యా్రస్తాలు సంధించారు. విద్యుత్ సమస్యపై వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో కరెంటు పోవడం, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగదీశ్రెడ్డి, కౌశిక్రెడ్డి పోడియం వద్దకు వెళ్లి స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. సీఎంను విమర్శిస్తే మైక్ కట్ చేస్తానంటూ హెచ్చరికలు, కిందనుంచి తనకు చీటీ వచ్చినందున మైక్ ఇవ్వనని మాణిక్రావు చెప్పడం సభలో నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా ఎవరేం మాట్లాడారంటే... నీళ్లలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యమే: జగదీశ్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది, తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్దే. మిషన్ కాకతీయతో చెరువులు, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 22ఏతో ప్రజలకు చుక్కలు: మర్రి రాజశేఖర్రెడ్డి 22ఏ నిబంధనల పేరుతో రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. నా నియోజకవర్గంలో సుమారు 30 వేల ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చారు. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. నా ఇల్లు కూడా 22ఏలో ఉంది: కౌశిక్రెడ్డి హరీశ్రావు ప్రజెంటేషన్ తర్వాత పరిశీలిస్తే నా ఇల్లు కూడా 22ఏలో ఉన్నట్లు తేలింది. భూమిని జాబితా నుంచి తొలగించేందుకు ఓ బాధితుడిని 30 శాతం కమిషన్ అడిగారు. భూముల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు లేక పరిశ్రమలకు పవర్ హాలిడే: ప్రశాంత్రెడ్డి రైతులు కరెంటు, యూరియా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాం.కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు వస్తున్నాయి. నిరుద్యోగులకు ఏవీ ఉద్యోగాలు?: కల్వకుంట్ల సంజయ్ సీఎం కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు, కంపెనీలు వస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. తొలిఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటోంది. ఆ హామీలు ఎక్కడ?: సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి యావత్ తెలంగాణకు జరిగిన అవమానకరం.మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు ప్రభుత్వం లక్ష రూపాయలు బాకీ పడింది. శాంతిభద్రతలు కనుమరుగు : సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థులు కోరితే సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం క్షమాపణ చెప్పాలి. పోడు గిరిజనులపై దాడులు: అనిల్ జాదవ్ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు కూడా అందించాం. ప్రస్తుత ప్రభుత్వం పోడు భూముల విషయంలో గిరిజనులపై దాడులకు పాల్పడుతోంది. క్యూసెక్కులు తెలియవు.. చెక్కులు తెలుసు: పల్లా ఇరిగేషన్ సబ్జెక్టుపై నేను ప్రిపేర్ కాలేదు. చంద్రబాబు సూచనల మేరకు పెట్టుకున్న సలహాదారు ఆదిత్యనాథ్దాస్ చెప్పినట్లు నడుచుకుంటా. నాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది. క్యూసెక్కులు అంటే అర్థం కాదు. కేంద్ర జల సంఘం సమావేశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంగా భావించి వెళ్లాను. మేడిగడ్డను బాగు చేసి, కేసీఆర్కు పేరు వచ్చే పనులు చేసేది లేదు. మైనింగ్ అంటే మై ఎర్నింగ్: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేను సొంత డబ్బు ఖర్చు పెట్టా. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవాల్సి ఉంది. నేను ఒక్కడినే కమిషన్లు తీసుకోవడం లేదు. కర్నాటకలో 40శాతం కమిషన్లు అయితే ఇక్కడ మేము 30శాతమే తీసుకుంటున్నాం. భూ భారతి కాదు.. భూ హారతి చేస్తాం. మైనింగ్ అంటే మై ఎరి్నంగ్. ఏ వంద రోజుల్లో చేస్తామో చెప్పామా? ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాం. ఏ వంద రోజుల్లో చేస్తామని ఏమైనా చెప్పామా? ఐదేళ్లు కాదు..25 ఏళ్లు అధికారంలో ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం.నాకు ఢిల్లీతో సమస్యలున్నాయి. పార్టీలోనూ ఉన్నాయి..చివరికి బీఆర్ఎస్తో కూడా ప్రశాంతత లేదు. ప్రాజెక్టులన్నీ ఇందిరాగాంధీ కట్టినవే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కూడా ఆమే నిర్మించారు. నాకు పాలనలో అనుభవం లేదు.. తెలిసిందల్లా అందరినీ తొక్కుకుంటూ పైకిరావడమే. భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి వంటి అనుభవజ్ఞులున్నారు.వాళ్లు లేకపోతే మంత్రి పొంగులేటి ఉన్నాడు. పాత రోజులు తెస్తామన్నాం..తెచ్చాం. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే పాలన తెచ్చాం. ఉద్యోగాల గురించి హామీ ఇచ్చిన రాహుల్గాంధీని అడగాలి. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజులు చదువుకుని అన్నీ తెలుసుకుని వచ్చా. సభలో నన్ను మాట్లాడనివ్వకపోతే పేగులు మెడలో...గుడ్లు పీకి గోటీలాడుతా..ఇలా పాత భాష మాట్లాడాల్సివస్తది. బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చెప్పడం వల్లే తులం బంగారం ఇవ్వడం లేదు. పైగా దొంగలు ఎత్తుకుపోతే నన్ను బద్నాం చేస్తారు. హిట్లర్ నాకు ఆదర్శం..పాలన కూడా అలాగే చేస్తా.. నాకు తిక్కలేస్తే లోపలేయిస్తా’’. – సీఎం పాత్రలో తలసాని -
ముందస్తు బుకింగ్: నిమజ్జనానికి వాహనం కావాలా? ఆర్టీఏ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవానికి కావలసిన వాహనాలను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ఆర్టీఏ సదుపాయం కల్పించింది. మండపాల డిమాండ్ మేరకు వాహనాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి తమకు చేరే కూపన్లకు అనుగుణంగా వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు.క్యూర్ పరిధిలో 14 చోట్ల వాహనాలను సేకరించి మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భారీ ట్రేలర్లు మొదలుకొని టస్కర్లు, లారీలు, డీసీఎంలు, టాటా ఏస్లు వంటి వివిధ రకాల వాహనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఇందుకోసం ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల నుంచి ముందస్తుగా కూపన్లు తీసుకొని తమను సంప్రదించాలని జేటీసీ తెలిపారు.ఖైరతాబాద్, అంబర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం, కాటేదాన్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియం, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్, కర్మన్ఘాట్ మందమల్లమ్మ ఫంక్షన్ హాల్, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం, మేడ్చల్ రవాణా కార్యాలయం, మియాపూర్ క్రాస్రోడ్స్, పటాన్చెరు, తదితర 14 చోట్ల వాహనాలను అందజేయనున్నారు.అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే నిమజ్జన వాహనాలను నడపాలని, రోడ్డుభద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని జేటీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు.నిమజ్జన వాహనాల అద్దెలు..రెండు ఆక్సిల్ కలిగిన భారీ ట్రేలర్లు లేదా టస్కర్ : రూ.33000మూడు ఆక్సిల్ కలిగిన ట్రేలర్లు, టస్కర్లు : రూ.350002 టైర్ల సామర్ధ్యం కలిగిన హెవీగూడ్స్ వాహనాలు: రూ.రూ.4500. (డీజిల్ ఖర్చు, డ్రైవర్కు రూ.500 బత్తా అదనం.)6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు : రూ.3500,మిడిల్ గూడ్స్ వెహికల్స్కు : రూ.2500డీసీఎం వంటి లైట్గూడ్స్ వెహికల్స్కు : రూ.2000,టాటాఏస్లు : రూ.1500ఇదీ చదవండి: ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా? -
12 గంటలు ఉత్త 'కోతలే'
విద్యుత్ కోతలతో నీరందించలేక ఎండిపోతున్న పొలాన్ని చూపిస్తున్న ఈ మహిళా రైతు పేరు ఈదెమ్మ. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెగడబండకు చెందిన ఈమె పది ఎకరాల్లో వరి సాగు చేసింది. రెండు బోర్లలో నీళ్లున్నా.. కరెంట్ కోతలతో పారించలేకపోతోంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. మధ్యమధ్యలో నాలుగైదు పర్యాయాలు కోత పెడుతున్నారని.. మొత్తంగా 8 గంటలు ఇవ్వడం లేదని చెబుతోంది. ఇప్పటివరకు 8 ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 1.80 లక్షల పెట్టుబడి కాగా.. కరెంట్ ట్రిప్, లోఓల్టేజీతో మూడుసార్లు మోటారు కాలిపోయిందని.. దీనికి అదనంగా సుమారు రూ.25 వేలు ఖర్చయిందని వాపోయింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎల్నినో, వర్షాభావంతో రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరుణుడు కరుణించకపోతాడా అనే ఆశతో వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఇప్పటికే చేతికందకుండా పోయాయి. బోర్లు, బావుల కింద వేసినవి సైతం ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరఫరాలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణం. నీళ్లున్నా, విద్యుత్ కోతలతో తడులందించలేని దుస్థితిలో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. దాదాపుగా 5 నుంచి 8 గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో మొత్తంగా 1,19,55,375 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 50,92,817, పత్తి 48,21,503 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం సాగులో వరి, పత్తి పంటల వాటా 82.9 శాతంగా ఉంది. అయితే వ్యవసాయానికి 12 గంటలపాటు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఐదు నుంచి ఎనిమిది గంటలే ఇస్తున్నట్లు ‘సాక్షి’బృందం పరిశీలనలో తేలింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరంతరాయంగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా.. దఫాల వారీగా అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సరఫరా సమయాలతోపాటు కోతల సమయంలోనూ తేడాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోలా.. – జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లాలో వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. అది కూడా లో ఓల్టేజీతో సరఫరా చేస్తుండడంతో మోటార్లు కాలి పోతున్నాయి. – ఖమ్మం జిల్లాలో రోజుకు ఐదు నుంచి ఏడు గంటలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కోత పెడుతుండడంతో చివరి పంటకు నీరందడం లేదు. వేంసూర్ మండలంలో బోరుబావుల్లో నీళ్లున్నా.. తడులందకపోవడంతో పలువురు రైతులు ఎండిన వరిని తొలగించి.. జొన్న సాగు చేపట్టారు. – కామారెడ్డి జిల్లాలో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కరెంట్ ట్రిప్ కావడం, లోఓల్టేజీ సమస్యతో మోటార్లు తరచు కాలిపోతున్నాయని.. ఒకసారి మరమ్మతుకు వస్తే అదనంగా రూ.10 వేల వరకు ఖర్చు వస్తోందన్నారు. – నిజామాబాద్ జిల్లాలో ఉదయం 8, 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారు. మధ్యమధ్యలో రెండు గంటల పాటు కోత పెడుతున్నారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ కరెంట్ ఉదయం 7.30 గంటలకు ఇస్తున్నారు. మధ్యమధ్యలో కోతలతో మొత్తం 8 గంటలపాటే సరఫరా చేస్తున్నట్లు రైతులు తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో.. గత ఏడాది ఇదే నెల తొమ్మిదిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,906 మెగావాట్లు కాగా.. ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఆల్టైం రికార్డుస్థాయిలో 19,543 మెగావాట్లకు చేరింది. ఈ లెక్కన 23 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడాల్సి రావడం, పంప్ సెట్ల నిరంతర వాడకంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అమాంతంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. కనీసం 15 గంటలు ఇవ్వాలి.. నాకు సొంతంగా ఉన్న 3 ఎకరాల్లో మిరప, మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రెండు బోర్లు ఉన్నా, రోజుకు 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. దీంతో పత్తి పంటకు నీరందించలేక పోతున్నా. దీంతో ఎదుగుదల లేకుండా పోగా.. ఎకరాకు కనీసం క్వింటా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మిరపకు మాత్రమే తడులు పెడుతున్నా. వ్యవసాయానికి ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలి – లక్ష్మీనారాయణ, రైతు, అయిజ, జోగుళాంబ గద్వాల కోతలు లేకుండా సరఫరా చేయాలి తొలుత వచ్చిన గోదావరి జలాలు, వ్యవసాయ బోరు నమ్ముకొని ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ఎండలకుతోడు విద్యుత్ శాఖ ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో ఒక మడి తడిసి మరో మడిలోకి నీరు పోవడం లేదు. దీంతో ఏ మడికామడికి పైపులు వేస్తూ పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నా. కోతల్లేని విద్యుత్ అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. – ఎ.సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు, వేంసూరు, ఖమ్మం -
మేం కొత్తగా పెట్టిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత 22ఏ జాబితాలో పెట్టిన భూములేవీ లేవు. మేం అధికారంలోకి వచ్చాక ఈ జాబితాను కొత్తగా తయారు చేయలేదు. 1999లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ జాబితా అవసరం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. 2009లో కోర్టు ఆదేశానుసారం ఈ జాబితా తయారు చేశారు. 2009–15 వరకు ఈ జాబితాపై హైకోర్టులో రెండువేల కేసులు పడ్డాయి. ఆ సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 22ఏ జాబితా భూములను ఐదు కేటగిరీల్లో వర్గీకరించాలని చెప్పింది. కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2017–25 వరకు హైకోర్టులో 28,611 కేసులు పడ్డాయి. దీంతో 45 రోజుల్లో ఈ జాబితా పబ్లిక్డొమైన్లో పెట్టాలని, కోర్టుకు కూడా కాపీ ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో ఇవ్వాలని, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా డిసెంబర్ 3, 2025న ఈ జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాం. అయితే, తక్కువ సమయం ఉన్నందున జీవో 121, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సమయంలో ఏ భూములు ఈ జాబితాలో ఉన్నాయో వాటిని అప్డేట్ చేయకుండా అదే కాపీని అప్లోడ్ చేశాం. స్వార్థం, స్వలాభం కోసం చేసింది కాదు. తప్పు జరిగిన మాట వాస్తవం. దీనిపై నేను విచారం వ్యక్తం చేశాను. అయితే, యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతున్నాం’ అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీలో 22ఏ భూములపై స్వల్పకాలిక చర్చను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు ప్రసంగించారు. చేయాల్సింది చేసి, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టి నంగనాచిల్లా మాట్లాడుతున్నారని, దొంగే పోలీసును దొంగా దొంగా అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. 47,400 ఎకరాలు తగ్గింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 220 జాబితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉంటే, 2026 ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉందని చెప్పారు. అంటే 47,400 ఎకరాలు తగ్గిందని, ఇంకా తాము లక్షల ఎకరాలు కొత్తగా ఈ జాబితాలో చేర్చింది ఎక్కడని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1,95,812 ఎకరాల వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో ఉంటే ఇప్పుడు 1,94,543 ఎకరాలున్నాయని, దాదాపు 800 ఎకరాలు తగ్గితే తాము కొత్తగా ఏం చేరుస్తామని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రతి అంగుళం భూమికి కాగితాలున్నాయని, టీఎం–15 మాడ్యూల్ ద్వారా ప్రజల పట్టా భూములైన 23వేల ఎకరాలను వారికి ఇచ్చేశామని, జీవోలు, మెమోల లద్వారా మరో 20వేల ఎకరాలు ప్రజలకే ఇచ్చామన్నారు. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఈ జాబితా నుంచి తొలగించిన 23వేల ఎకరాల భూమికి కాగితాల్లేవని కమిటీ చెప్పిందన్నారు. 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని అనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఇక్కడ పలికే చిలుకలు మాత్రమే వేరని, కానీ పలుకులు మాత్రం ఒకటేనన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డిలు ఒకే తరహాలో మాట్లాడిన మాటలను స్పీకర్ అనుమతితో సభకు వీడియో ద్వారా వినిపించారు. శకుని మామ చేసి ఉంటే.. ‘అగిపెట్టెల అబద్ధాల రావు, శకుని మామ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు ఈ జాబితాను సరిచేసి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు. వారు తెచ్చిన ధరణి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యల పాలయ్యారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి మళ్లీ మళ్లీ తిరిగినట్టు అధికారం కోసం దోచుకోవడం కోసం నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారు. కానీ ఆ పులికి తెలియదు.. వచ్చి రేవంత్రెడ్డి అనే బోనులో పడతాడని. ముక్కుతాడు వేసి కట్టేస్తాడని తెలియదు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ రోడ్డెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 22ఏ జాబితాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు పిల్లకాకులు అరవడమెందుకు? ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడొచ్చు కదా? సలహాలు ఇవ్వచ్చు కదా? వసతులు, ఏర్పాట్లు కావాలి కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కనుచూపు మేరలో కనిపించవా? నువ్వున్నప్పుడు నేను మాట్లాడాలనే కోరిక అలానే మిగిలిపోయేట్టుంది’ అని పొంగులేటి చెప్పారు. మొహం చాటేయడం అలవాటే.. 22ఏ జాబితాలో ఉన్న భూములను చూపెట్టి పేదల కడుపుకొట్టారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలో గందరగోళం సృష్టించి ప్లాన్ ప్రకారం పారిపోయారని పొంగులేటి అన్నారు. అయితే, చర్చకు మొహం చాటేయడం వారికి అలవాటేనని, సభ నుంచి వారు పారిపోయినా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పుడు 22ఏ జాబితా కారణంగా అక్కడక్కడా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, కానీ ధరణిని అమల్లోకి తెచ్చినప్పుడు మూడు నెలల పాటు అసలు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 387 గ్రామాలకు నక్షాల్లేవని, ఆయా గ్రామాల్లో సర్వే చేసి భూముల సమస్యలు తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా 70 రోవర్లు కొనుగోలు చేశామని, 32 జిల్లాల్లోని 70 చొప్పున గ్రామాల్లో తొలిదశలో పైలట్ సర్వే చేస్తున్నామన్నారు. నవంబర్ చివరికల్లా ఈ సర్వే పూర్తవుతుందని అన్నారు. 23వేల ఎకరాలు అక్రమంగా బదిలీ ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని వారు చేసిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే అనేక భయంకర విషయాలు వెలుగులోనికి వచ్చాయని పొంగులేటి చెప్పారు. పైలట్లో భాగంగా సిద్ధిపేట, సిరిసిల్లలో ఆడిట్ చేస్తే 23వేల ఎకరాల భూమిని 13వేల ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలిందన్నారు. ఏ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లింది.. విదేశాల్లో జరిగిన లావాదేవీలేంటి? అక్కడ కట్టుకున్న హోటళ్ల వివరాలను ప్రత్యేక విచారణ బృందం (సెట్)కు పంపామని తెలిపారు. అధికారం పోయిన తర్వాత కూడా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుతూ, పాత వ్యవస్థలను ఉపయోగించుకుని పేదల భూములను కొల్లగొట్టాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. అసలు 22ఏ భూముల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించామని, వాటిపై సభ సూచన మేరకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. యూఎల్సీ భూములు, జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, డీటీసీపీలు అనుమతిలిచ్చిన లేఅవుట్లు, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి కాని భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఅవుట్ల విషయంలో సమస్యలున్నాయని, వీటిని సభ నిర్ణయం మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి దందాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు... –ఎన్నికల్లో ఖర్చుకు వాడారు –హరీశ్రావు సొంత మామకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టించారు –ఇలా పొందినవారిలో పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు ధరణి పోర్టల్ను అట్టుపెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు కోసం వాడుకున్నారన్నారు. ఎకరాల కొద్దీ భూమిని నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి విక్రయించి భారీగా డబ్బు పోగు చేసుకున్నారన్నారు. అలాంటి లావాదేవీలకు సంబంధించి తమ ప్రభుత్వం గుర్తించిన భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేరుస్తూ, అవి పేదలకు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏకు సంబంధించి శాసనససభలో జరిగిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావులను ప్రధాన పాత్రధారులుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను శకుని మామ అని, హరీశ్రావును అగ్గిపెట్టెల అబద్ధాల రావు, అని కేటీఆర్ను డ్రామాల వ్యక్తి అంటూ పదేపదే సంబోధించారు. ఉదాహరణలతో సభ ముందు... ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అసైన్మెంట్, భూదాన్ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ పరం చేశారంటూ మచ్చుకు కొన్ని ఉదంతాలుగా సభ దృష్టికి తెచ్చారు. పొంగులేటి మాటల్లోనే... ⇒ ‘సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నెం.271లో 327.09 ఎకరాల ప్రభుత్వం భూమిని గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం కేటాయించింది. ఇందులో 6.18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్రావు తన సొంత మామ (భార్య తండ్రి) హన్మంతరావుకు కట్టబెట్టించారు. ఇందులో కొంత భూమికి సంబంధించి మిషన్ భగీరథ పరిహారం కూడా పొందారు. ⇒ మెదక్ జిల్లా శివంపేట మండలం సిక్లిందాపూర్ గ్రామంలో సర్వే నెం.33 నుంచి 87 వరకు ఉన్న 569.05 ప్రభుత్వ భూమిలో 2023 అక్టోబరు 5న 372.32 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీ చేశారు. దాన్ని మొత్తంగా స్వాహా చేశారు. ఆ రూపంలో పోగుచేసుకున్న రూ.కోట్ల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుగా వినియోగించారు. ⇒ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ సర్వే నం.58, 59లో ఉన్న 476.30 ఎకరాలు ప్రభుత్వం భూమిలో.... 112.21 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తప్పించి ఓ కుటుంబంలోని సభ్యుల పేర్లతో ఓఆర్సీ జారీ చేశారు. ఇక్కడే 195.25 ఎకరాలను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేసే సమయంలో కొందరు పసిగట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాగోతం వికటించి తిరిగి ఆ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి. ⇒ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి గ్రామంలో సర్వే నం. 186 నుంచి 189లో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, దాన్ని పట్టా భూమిగా కన్వర్ట్ చేయించారు. ఇందులో 24.27 ఎకరాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమి ప్రస్తుత విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేము తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాం. ⇒ ఇదే గ్రామం శంకర్హిల్స్ ఏరియాలోని సర్వే నం. 111–191 లోని 460 ఎకరాల భూమికి పట్టాదారులు గతంలో ఓ ప్రైవేటు సంస్థకు జీపీఏ ఇచ్చారు. దాన్ని ఆ సంస్థ 3,333 ప్లాట్లుగా విడదీసి విక్రయిస్తోంది. మరోవైపు ఆ భూమిని మరో సంస్థకు మరోసారి జీపీఏ చేశారు. ఆ సంస్థ ఎకరాల రూపంలో విక్రయిస్తోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా స్టేటస్కో జారీ అయింది. 2022లో నాటి ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. తర్వాత 226.06 ఎకరాలను ఆ తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా పొందినవారిలో బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా ఉన్నారు’ -
గ్రీన్ఫీల్డ్ హైవేపై మళ్లీ ప్రమాదాలు!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణిచారు. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో క్లీనర్ మరణించగా.. అతి వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొని కారు బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇటీవల ఈ హైవేపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సత్తుపల్లిటౌన్: ‘అంతా నిద్రలో ఉన్నాం..అంతలోనే పెద్ద శబ్దం వచ్చింది..లేచి చూసేసరికి చాలామంది చిందరవందరగా పడిపోగా.. నొప్పులు భరించలేక మరికొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు’అంటూ ఏపీ–తెలంగాణ సరిహద్దున శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురు వెల్లడించారు. హైదరాబా ద్ నుంచి విశాఖపటా్ననికి 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా ఏపీలోని చింతలపూడి మండలం ఎండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయి క్లీనర్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సమీపాన తెలంగాణ–ఏపీ సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి నేషనల్ హైవే అంబులెన్స్లో తరలించారు. ఇందులో పి.సురేష్, ఆనంద్ పటేల్, కె.సాహితి(విజయనగరం), బస్సు డ్రైవర్ బండి గోపి(పెద్దిపాలెం)తో పాటు చక్రధర సాహో(గోపీనాథ్పూర్), దుర్గేష్ రావత్(ఉత్తరాఖండ్), ట్రావెల్ బస్సు మరో డ్రైవర్ సాయిఉజ్(కేరళ), డేర్లిన్ అబ్రహం(తమిళనాడు) తీవ్రంగా గాయపడి చికి త్స పొందుతున్నారు. కాగా, ఘటనలో క్లీన ర్ మృతి చెందగా మరో ఏడుగురిని చింతల పూడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పెనుబల్లి: బంగారం కొనుగోలు చేసేందుకు బస్సులో వెళ్లారు.. తిరిగి బయలుదేరే సమయానికి చీకటి పడడం, వెంట బంగారం ఉండడంతో జాగ్రత్తగా వెళ్లొచ్చని అద్దెకు కారు మాట్లాడుకున్నారు. కానీ ఆ కారే ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంటుందని ఊహించలేకపోయారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై శనివారం రాత్రి ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన సీతామహాలక్ష్మి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఉషారాణి అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ కిష్టారానికి చెందిన పుచ్చకాయల శేషు, గోలి రాజేశ్వరితో కలిసి బస్సులో శనివారం ఉదయం ఖమ్మం వెళ్లి బంగారం కొనుగోలు చేశారు. షాపింగ్ పూర్తయ్యే సరికి చీకటి పడడం, తమ వద్ద బంగారం ఉండడంతో ఖమ్మం నుంచి నాగారపు నాగేశ్వరరావు(45) కారు అద్దెకు మాట్లాడుకుని సత్తుపల్లి మండలం కిష్టారానికి గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా వెళ్తున్నారు. ఈక్రమాన పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపాన కారు అతివేగంతో వెళ్తూ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ నాగేశ్వరరావుతో పాటు ఎర్రగుంటపల్లికి చెందిన కొల్లి ఉషారాణి(54) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజేశ్వరి, సీతామహాలక్ష్మి, శేషుకు తీవ్రగాయాలు కావడంతో పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలిలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని సీఐ ముత్తులింగయ్య, ఎస్ఐ షాకీర్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబంలోని ఒకరు ఇటీవల మృతి చెందగా ఆమెకు సంబంధించిన పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకునేందుకు వెళ్లివస్తున్నట్లు తెలియగా.. కుటుంబంలో శుభకార్యం నిమిత్తం బంగారం కొనుగోలు వెళ్లి వస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. -
పన్నుపై అపోహలొద్దు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్లో పన్నులపై అపోహలు వద్దని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ప్రతి ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెరుగుతాయనే విషయం వాస్తవం కాదన్నారు. పన్నులు ఎలా అంటే అలా పెంచడానికి వీల్లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటేషన్ పద్ధతి ప్రకారమే పన్నులు పెరుగుతాయని, గరిష్టంగా 10 శాతానికి మించి పెరగవన్నారు. అది కూడా కేవలం 0.15 శాతం నివాస, 0.75 శాతం వాణిజ్య సముదాయాల మీద మాత్రమే పడుతుందని వివరించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరపున కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (క్యూర్)ను ప్రవేశపెట్టిన శ్రీధర్బాబు చట్టం లక్ష్యాలను వివరించారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత శ్రీధర్బాబు బిల్లుపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. బిల్లులో పెట్టిన 20 శాతాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం మేరకు 10 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ నగరాన్ని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్గా ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, వరదల నివారణ, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో వివిధ సంస్థలు, శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. భవిష్యత్లో నగర అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేసేలా క్యూర్ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. అనంతరం బిల్లు ఆమోదానికి ప్రతిపాదించిన సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా ఈ అంశాన్ని వివరించారు. పన్నుల పెరుగుదలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ బిల్లులో సవరణ చేయాలని సీఎం చేసిన ప్రతిపాదనను సభ ముందు ఆమోదానికి పెట్టారు. ఈ సవరణతోపాటు క్యూర్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఎంఐఎం, బీజేపీ ఏకాభిప్రాయం పాల్వాయి హరీశ్బాబు (బీజేపీ) లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్ రీజియన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే అపెక్స్ కౌన్సిల్ కేవలం విధాన నిర్ణయాల కోసమేనని, ఈ సమావేశాలకు అవసరమైతే మేయర్లను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ కౌన్సిల్ ఏర్పాటు ద్వారా మేయర్లు, కార్పొరేటర్ల స్థానిక అధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించారు. ఇందుకు విభేదించిన హరీశ్బాబు అపెక్స్ కౌన్సిల్కు మేయర్లను రమ్మనకపోతే వారికి ఇంకేం అధికారాలుంటాయని ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యుడు జుల్ఫికర్ అలీ జోక్యం చేసుకుంటూ.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు మేయర్లను ఆహ్వానించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో పాల్వాయి హరీశ్బాబు బల్లలు చరిచి మరీ అభినందించారు. ఎంఐఎం సభ్యుడు కూడా అదే చెబుతున్నాడంటూ అధికార పక్షానికి చూపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ... జుల్ఫికర్ అలీని హరీశ్బాబు గైడ్ చేస్తున్నారని, అందుకే ఆయన ఆ కోణంలో మాట్లాడుతున్నారని బదులిచ్చారు. మూడు కార్పొరేషన్లను నియంత్రించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం లేదని, ఈ కౌన్సిల్ విశాల దృక్పథంతో పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. ప్రజలపై తీవ్ర భారం: అక్బరుద్దీన్ క్యూర్ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు న్యాయస్థానాల్లో నిలవదని, సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. క్యూర్ పరిధిలోని కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల అధికారాలకు కత్తెరేసి కీలక అధికారాలను క్యూర్ అపెక్స్ కౌన్సిల్కు, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అప్పజెప్పారని తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అధికారాలు అప్పజెప్పకపోతే ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువకి బదులుగా ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్నులను విధించాలని బిల్లులో పొందుపర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. స్థలం, భవనం మార్కెట్ విలువలను కలిపి ఆస్తి పన్నులు విధిస్తే నగర ప్రజలపై తీవ్ర భారం పడుతుందని తప్పుబట్టారు. ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెంచాలని బిల్లులో ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించారు. ఆస్తుల మ్యుటేషన్ చేసుకున్న మాత్రాన వాటిపై హక్కులు రావని బిల్లులో పెట్టారని తప్పుబట్టారు. మరో ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకి సంబంధించిన రూ.1,400 కోట్లు విలువైన కాంట్రాక్టును ఒకే కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడాన్ని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బిల్లుపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్ సైతం మాట్లాడారు. కోర్టుల్లో నిలబడదు: పాల్వాయి హరీశ్ ‘క్యూర్’చట్టం న్యాయస్థానం ముందు నిలబడదని, దానిని ఉపసంహరించుకోవాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే... మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఎలాంటి అధికారాలు ఉండవని, సీఎంకు అపరిమిత అధికారాలను కట్టబెడ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి 4,100 అభ్యంతరాలు వస్తే.. అందులో 3 వేలకు పైగా ఆస్తిపన్ను పెంపుదలపై ఆందోళన వ్యక్తమైందన్నారు. విశ్వనగరం ట్యాగ్ ఉండాలి: కూనంనేని సాంబశివరావు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు విశ్వనగరం ట్యాగ్ ఉండాలని, అందుకోసం అధికార వికేంద్రీకరణతో మరింత అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు చెప్పారు. విశ్వనగరం ట్యాగ్ వస్తేనే.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. విస్తీర్ణంలో మూడో స్థానంలో.. జనాభాలో ఏడో స్థానంలో మన రాజధాని ఉందన్నారు. సదుపాయలు కల్పించాలి : దానం ‘క్యూర్’పరిధిలో ప్రజల నుంచి ఏటా 20 శాతం వరకు ఆస్తిపన్ను వసూలు చేయాలనే నిర్ణయం సరికాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇప్పటికే కోటీ 30 లక్షల జనాభా నివసిస్తున్న హైదరాబాద్ త్వరలోనే 2 కోట్ల జనాభాకు విస్తరించనుందని, వీరందరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మండలిలో క్యూర్ బిల్లు జిల్లాల విభజన అంతా అశాస్త్రీయమే: శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఎలా విభజించారో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే క్యూర్ బిల్లును రూపొందించినట్లు వివరించారు. శాసనమండలిలో ఆయన క్యూర్ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ్యులకు ముందస్తుగా ఇవ్వాలని, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇస్తే వాటిని చదివేదెప్పుడని ప్రశ్నించారు. అనంతరం సభ్యులు అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, ఏవీఎన్ రెడ్డి, పింగిలి శ్రీపాల్రెడ్డి తదితరులు మాట్లాడుతూ బిల్లుకు సంబంధించి సూచనలు చేశారు. అనంతరం బిల్లును ఆమోదించినట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. అంతకుముందు శ్రీధర్బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. -
జూబ్లీహిల్స్ క్లబ్ ఫైల్ ముట్టుకోవద్దు!
సాక్షి,హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ క్లబ్లో గత పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలొద్దు. అందుకు ఏ స్థాయిలో సిఫారసు చేయించేందుకైనా నేను సిద్ధం. ప్రస్తుత పాలకవర్గాన్ని పనిచేయనీయకుండా అడ్డంకులు సృష్టించే విషయాన్నీ నేనే చూసుకుంటా’అంటూ సీసీఎస్ పోలీసులపై ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి తెస్తున్న అంశం క్లబ్ సభ్యుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రిటైరైన ఆ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక పదవి కూడా అప్పగించడంతో తన పలుకుబడితోపాటు ప్రస్తుత పదవికి ఉన్న అధికారంతో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో అన్నీ తానై వ్యవహరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పాలకవర్గం చేపట్టిన వివిధ పనులపై సభ్యుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత పాలకవర్గం నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పని, చెల్లింపులను పరిశీలించి ఒక నివేదికను రూపొందించింది. అందులో వివిధ రకాల పనులకు మొత్తం రూ. 19 కోట్ల వరకు ఖర్చుపెట్టగా అందులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించింది. వాస్తవ వ్యయం కంటే అధిక అంచనాలతో పనులు చేపట్టడం, క్లబ్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా వచి్చన రాబడి, చేసిన ఖర్చు, సభ్యత్వాల మంజూరు తదితర అంశాల్లో లోపాలను గుర్తించింది. సీసీఎస్లో ఫిర్యాదు చేసినా దర్యాప్తు లేదు.. ఈ ఆర్థిక అవకతవకలపై ప్రస్తుత కార్యదర్శి జగన్నాథరావు జూలై 28న సీసీఎస్కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. చెనోయ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, సిరి కన్సల్టెంట్స్ (టెక్నికల్ ఎవాల్యుయేషన్ టీమ్) ఆడిట్ సంస్థల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరారు. కానీ ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదవలేదు. దీనివెనుక రిటైర్డ్ ఐపీఎస్ చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్పై ఇదే ఐపీఎస్ ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పాలకవర్గం ఎన్నికే చెల్లదన్న ఉత్తర్వులు ఇప్పించారని.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే ఉత్తర్వును కొట్టేసిందని ప్రస్తుత క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో దేశంలోకెల్లా ప్రముఖులైన వివిధ రంగాల వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు సభ్యులుగా ఉన్నారని.. వారందరి అభ్యర్థన మేరకు జరిగిన విచారణ, ఆపై కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభించకపోవడం ఏమిటని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని క్లబ్ పాలకవర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. -
ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన 22ఏ నిషేధిత భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం రాత్రి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా బాధితులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అబద్ధాల ప్రవాహం పారించారని ఆరోపించారు. తాను అడిగిన ఏ ప్రశ్నకూ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు.డిసెంబర్ 3, 2025న తొందరలో లిస్ట్ అప్లోడ్ చేయడం వల్ల తప్పు జరిగిందని పొంగులేటి ఒప్పుకున్నారన్నారు. తప్పు ఒప్పుకున్నప్పుడు బాధితులకు క్షమాపణ చెప్పి, సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22ఏ జాబితాలో ఎన్ని ఎకరాలు చేర్చారు, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు జాబితా నుంచి తొలగించినట్టే ప్రజల భూములను కూడా జాబితా నుంచి తొలగించాలని హరీశ్రావు కోరారు. కాంగ్రెస్ సర్కారే భూమి, ఎన్వోసీ ఇచ్చింది.. తన కుటుంబ సభ్యులపై పొంగులేటి చేసిన ఆరోపణలను హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. తన మామ హన్మంతరావు రిటైర్డ్ బ్యాంకు అధికారి అని, ఆయన కొండపాకలో భూమి కబ్జా చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎక్స్ సర్వీస్మన్ సత్యనారాయణకు 1995లో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, 2010లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చిందని వివరించారు. ఆ ఎన్వోసీ ఆధారంగా తన మామ చెక్ ద్వారా డబ్బు చెల్లించి, అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. భూమి కేటాయించి ఎన్వోసీ ఇచ్చిందీ కాంగ్రెస్... రిజిస్ట్రేషన్ చేసింది కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఎకరం రూ.15 కోట్లు విలువ చేస్తుందని చెబుతూ, రూ.50 లక్షలకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనన్నారు. కొండపాక సిద్దిపేట నియోజకవర్గంలో కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఉందని, ఈ విషయంలోనూ మంత్రి తప్పుగా మాట్లాడారని పేర్కొన్నారు. నాదర్గుల్, ఖాజాగూడ భూములు, ఫీనిక్స్ కంపెనీ ఒప్పందం తదితర అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరూపిస్తే రాజీనామా చేస్తా: పల్లా జనగామ, వట్టినాగులపల్లి భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. వట్టినాగులపల్లిలో రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూదాన్ భూమిని తాను తీసుకున్నానని పొంగులేటి ఆరోపించారని, ఇందులో వాస్తవం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే తనకు ఎకరం పది గుంటల భూమికి అగ్రిమెంట్ జరిగిందని, రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపారు. ఇది భూదాన్ భూమి కాదని 2008లోనే కోర్టు స్పష్టం చేసిందన్నారు. తనకు ఉన్నది ఎకరం పది గుంటలేనని, 33 ఎకరాల్లో మైనంపల్లి సోదరులు ప్లాట్లు కొనుగోలు చేశారని, అందులో 8.10 ఎకరాలు మైనంపల్లి చంద్రశేఖర్ పేరున ఉన్నాయని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్రావుతో కలిసి జనగామకు వెళ్లి ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. తన భూమిని 22ఏ జాబితాలో చేర్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, కోర్టు కూడా తన భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పిందన్నారు. 29 ఎకరాల భూమి తనదని పొంగులేటి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పొంగులేటి రాజీనామా చేస్తారా అని పల్లా సవాల్ విసిరారు. -
56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో ‘56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలిప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.రెండు దశాబ్దాల్లో తగ్గిన ప్రాతినిధ్యంటి.చిరంజీవులు మాట్లాడుతూ.. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, 2014లో నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం ఇద్దరికి తగ్గారని గణాంకాలతో వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని, జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని కోరారు.‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’బీసీలకు కేవలం ఓటు హక్కు కాకుండా జనాభా ప్రాతిపదికన అధికారంలోనూ వాటా కావాలని బాలగోని బాలరాజుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.అలాగే, తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలను విభజించి వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కటకం నరసింహారావు బీసీ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మించాలని కోరారు. గుజ్జ సత్యం రానున్న కాలం బీసీలదేనన్నారు.తదుపరి వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒకటి యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు.బీసీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలిజనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కడం లేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’ అనే పరిస్థితి మారాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది.జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించడం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, బీసీ కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు సాగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.అడ్వొకేట్ రాజు మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీలు సాధించిన విజయం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. పొన్నం దేవరాజు మాట్లాడుతూ బీసీ అడ్వొకేట్లు తమ హక్కులు, రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, రిటైర్డ్ డీఆర్వో ఇలి వెంకన్న, దుర్గయ్యగౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్, కర్ణాటి మనోహర్, చిన్నారాములు, ముదిరాజ్, చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్, చోళ రాజేశ్వర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశం స్పష్టం చేసింది. -
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు. -
‘‘ప్రతి అర కి.మీ.కి వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి’’
హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అర కిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చేయాలని కోరారు.శనివారం రాష్ట్ర శాసనసభలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై కార్యాచరణ, లింగ సమానత్వం, సార్వత్రిక ప్రాప్యత, సమ్మిళిత పట్టణ రూపకల్పన, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలతో సమగ్ర కార్యాచరణ వ్యవస్థను ప్రతిపాదించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఒక నగరంలోకి ప్రవేశించే వారికి మొదట కనిపించే పరిసరాలే ఆ నగరంపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తాయని పద్మావతి రెడ్డి అన్నారు.పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే పౌర సదుపాయాలు నగర అభివృద్ధికి ప్రధాన సూచికలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థాలు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటి స్వభావానికి అనుగుణంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.“మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారుల పక్కన, పాదచారి మార్గాల మూలల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను పారవేస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లోనే అది భారీ చెత్త కుప్పగా మారి దుర్వాసన వెదజల్లడంతోపాటు వీధి కుక్కలు చేరడానికి కారణమవుతోందన్నారు. దీనివల్ల ప్రజారోగ్యంతోపాటు నగర పర్యావరణం, సౌందర్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర రూపకర్తలు, ఆర్కిటెక్టుల సహకారంతో ప్రతి అరకిలోమీటరుకు ఒక వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు సాధారణ చెత్త కుండీల మాదిరిగా కాకుండా నగర సౌందర్యంలో భాగంగా కనిపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయాలన్నారు.ప్రజలు నడిచి వెళ్లగలిగే దూరంలో వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఉంటే ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేసే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు. పురపాలక సంస్థలకు వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ కూడా సులభతరం అవుతుందన్నారు. నగరం నివసించడానికి ఆరోగ్యకరంగా, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
వినాయక చవితి: వాహనాల మళ్లింపులు, ట్రాఫిక్ మార్గదర్శకాలు ఇవే..
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు పోలీసు అధికారులు శనివారం అన్ని ప్రధాన రహదారులను, రూట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి.జోయల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ అవినాశ్ కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీరాములు, ఏసీపీ ట్రాఫిక్ ఎస్.మోహన్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.అనంతరం జోయల్ డెవిస్ మీడియా సమావేశంలో మాట్లాడి.. బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు, వాహనదారులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ట్రాఫిక్ బందోబస్తు, మార్గదర్శకాలను వివరించారు.ముఖ్యమైన అంశాలు ట్రాఫిక్ మార్గదర్శకాలు:దర్శన దారులు (4 ప్రధాన మార్గాలు):1. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వైపు నుంచి.2. ద్వారకా హోటల్ / టెలిఫోన్ భవన్ వైపు నుంచి.3. మింట్ కాంపౌండ్ / ఐమాక్స్ ప్రసాద్ వైపు నుంచి.4. గణేశుడి విగ్రహం వెనుక ఉన్న బస్తీ వైపు నుంచి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: ఉత్సవాలు జరిగే రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని నివారించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి. మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఖైరతాబాద్ మార్గంలో రోజువారీ 2,200 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతోంది. రద్దీ సమయాలు, సూచనలు: మధ్యాహ్నం తర్వాత, వారాంతాల్లో (శని, ఆదివారాలు), సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి, సాయంత్రం రద్దీని నివారించడానికి భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే దర్శనం పూర్తి చేసుకోవాలి. కుదిరితే సోమవారం నుంచి శుక్రవారం మధ్య రోజులలో దర్శనానికి రావడం ఉత్తమం. సొంత వాహనాలు & కార్ పూలింగ్: వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు కార్ పూలింగ్ (ఒకే కారులో కుటుంబ సభ్యులు, మిత్రులు కలసి రావడం) పాటించాలి. కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ మార్గ్ / ఐమాక్స్ వైపు: ఐమాక్స్ గ్రౌండ్, హెచ్ఎమ్డీఏ లేక్ వ్యూ పార్కింగ్, ఎన్టీఆర్ పార్క్ వెనుక భాగంలోని ఈ-రేసింగ్ (E-Racing) గ్రౌండ్. నెక్లెస్ రోడ్ వైపు: పైన పేర్కొన్నవి నిండితే నెక్లెస్ రోడ్డులోని మక్తా పార్కింగ్ స్థలం. మెట్రో / వివి స్టాచ్యూ వైపు: విశ్వేశ్వరయ్య భవన్ (ఇక్కడ దిగిన వారు రోడ్డు దాటాల్సి ఉంటుంది). టెలిఫోన్ భవన్ వైపు: పరిమిత పార్కింగ్ మాత్రమే కలదు. (భక్తులు వీలైనంత వరకు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న పార్కింగ్ స్థలాలనే ఉపయోగించుకోవాలి). ఆటోలు, ఓలా, ఊబర్ (పికప్ / డ్రాపింగ్ పాయింట్స్): వీవీ స్టాచ్యూ నుంచి నిరంకారీ మధ్య ప్రధాన రహదారిపై ఎక్కడం/దిగడం వల్ల ట్రాఫిక్ స్తంభిస్తుంది. అందువల్ల ఆటోలు, క్యాబ్ల డ్రాపింగ్, పికప్లను ఎంఎంటీఎస్ (MMTS) స్టేషన్ పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్లోనే చేసుకోవాలి. మెట్రో ప్రయాణికులకు ప్రత్యేక సూచన మెట్రోలో వచ్చే భక్తులు దిగిన తర్వాత ఖైరతాబాద్ బడా గణేశ్ ఉన్న వైపే (గణేశ్ పండల్ వైపు) నిష్క్రమించాలి. పొరపాటున 'సెవెన్ టెంపుల్స్' వైపు దిగితే రోడ్డు దాటాల్సి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. భక్తుల సౌకర్యార్థం అక్కడ సైనేజ్ బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాహనాల మళ్లింపు (Traffic Diversions): సాధారణ భక్తుల వాహనాలకు రాజ్దూత్ లేన్, ద్వారకా హోటల్ వైపు నుంచి లోపలికి అనుమతి ఉండదు. వాటిని టెలిఫోన్ భవన్ వైపు మళ్లిస్తారు. మింట్ లేన్ లోపలికి వాహనాలను అనుమతించరు. వాటిని సెక్రటరియేట్ వైపు మళ్లిస్తారు. ఐమాక్స్ థియేటర్ దాటి బడా గణేశ్ వైపు అనుమతి లేదు. డైరెక్ట్గా నెక్లెస్ రోడ్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి రైల్వే క్రాసింగ్ దాటి అనుమతి ఉండదు. డైరెక్ట్గా నిరంకారీ వైపు మళ్లిస్తారు. పాదచారుల క్యూ లైన్లు & బారికేడింగ్: కాలినడకన వచ్చే భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాహనాలు వెళ్లే క్యారేజ్వే పైకి పాదచారులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్ అండ్ బీ (R&B) ఆధ్వర్యంలో మెష్ బారికేడింగ్ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ యూటర్న్, నిరంకారీ వద్ద మాత్రమే రోడ్డు దాటేందుకు (Pedestrian Crossing) అనుమతి ఉంటుంది. బందోబస్తు & భద్రత: ఐఆర్ సిబ్బంది, పుషింగ్ టీమ్స్తో పాటు దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందిని ప్రధాన జంక్షన్లు (వీవీ స్టాచ్యూ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, షాదాన్, నిరంకారీ, ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి జంక్షన్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్గ్ మొదలైన చోక్ పాయింట్ల వద్ద) బందోబస్తులో డిప్లాయ్ చేస్తున్నారు. ముఖ్య గమనిక (దర్శనం ముగింపు తేదీ): సెప్టెంబర్ 23వ తేదీతోనే బడా గణేశ్ దర్శనం పూర్తవుతుంది. 24వ తేదీన దర్శనానికి ఎలాంటి అనుమతి ఉండదు. -
దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారా? బండి సంజయ్
హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగానే ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ సర్కార్కు పోయే కాలం దాపురించింది. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్-9ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాలపై అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గం. విద్యార్థులని చూడకుండా ఇష్టరీతిన గొడ్డున బాదినట్లు చావగొడతారా?, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విద్యార్థి నాయకుడు అస్వస్థకు గురికాడారానికి కారణం పోలీసులు కాదా?, ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది పోరాడే విద్యార్థులపై ఏ రకంగా దాడి చేస్తున్నారో అనే విషయం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
‘‘గణేశ వేడుకలకు ఎక్కడాలేని విధంగా ఈ సౌకర్యం అందిస్తున్నాం’’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శనివారం వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని అన్నారు.‘‘మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. -
హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం హైడ్రా అవలంభిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒకవైపు హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంటే.. మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొడుతుందా? అని నిలదీశారు. ‘‘హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంది.. హైడ్రా వచ్చి కూలగొడుతుంది’’ ఇదే ప్రస్తుతం జరుగుతుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నారాయన. హైడ్రా-హెచ్ఎండీఏల మధ్య సమన్వయం లేని కారణంగా పర్మిషన్లు ఇవ్వడం- ఆపై కూలగొట్టడమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘ క్యూర్ ఏరియాలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రతీ నెల సమన్వయ కమిటీ సమావేశం జరగాలి. ప్రభుత్వ శాఖలే పర్మిషన్ ఇచ్చి.. ప్రభుత్వ శాఖలే కూలగొడితే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోతుంది. హైడ్రా, హెచ్ఎండీఏ మధ్య సమన్వయం అవసరం. ఇలా లేకపోతే హెచ్ఎండీఏ పర్మిషన్లు ఇవ్వటం, మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొట్టడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్ -
TG: ‘గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఇబ్బందులు’
హైదరాబాద్ : తాము తెలంగాణ ప్రజల ఆస్తుల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడితే, తాము వాటిని సరి చేసి ప్రజా ఆస్తుల హక్కుల పరిరక్షిస్తున్నామన్నారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 12వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు. ‘గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా గత ప్రభుత్వం చేసింది. ధరణి పేరుతో వారు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి 22-A పేరుతో పేదల కడుపు కొట్టారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ నేతలకే లాభం చేకూరింది. ధరణి వల్ల ప్రతి జిల్లాలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి ధరణిలో 2.4 లక్షల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో ఉన్న సమస్యలను చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి కాంట్రాక్ట్లను వారి తొత్తులకే కట్టబెట్టారు. అనేక మంది రైతులు ధరణి వల్ల నష్టపోయారు’ అని ఆరోపించారు.ఇక తమ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన భూభారతి పోర్టల్ గురించి అనేక మందితో చర్చించిన తర్వాతే ముందుకెళ్లామన్నారు. మూడు నెలల్లోనే భూభారతి చట్టానికి విధివిధినాలను రూపొందించామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతోనే భూభారత చట్టం పనిచేస్తుందన్నారు.ఇదీ చదవండి: సీఎంగా తలసాని.. ఉత్తమ్గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!


