Sri Sathya Sai
-
ప్రతి అర్జీనీ నాణ్యంగా పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించి ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 237 అర్జీలు అందగా, వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇంజినీర్ ఇంట్లో కొండ చిలువ! పెనుకొండ: పట్టణంలోని తోటగేరిలో వ్యవసాయ పొలంలో నివసిస్తున్న ఇంజినీర్ జగదీష్ ఇంటి ఆవరణలోకి ఆదివారం రాత్రి కొండ చిలువ చొరబడింది. ఒక కోడిని మింగేసి ఆవరణలోని ఓ చిన్న షెడ్డులో పడుకుంది. సోమవారం ఉదయం కొండచిలువను గమనించిన జగదీష్... వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా దాన్ని పట్టుకుని సమీప అటవీప్రాంతంలో వదిలేశారు. -
దగా డీఎీీస్సీపై ధర్మాగ్రహం
ప్రశాంతి నిలయం: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ నిర్వహించిన దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులు దాటుకుని కలెక్టరేట్కు చేరుకుని జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై నిరుద్యోగ యువతకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. పారదర్శకత లేక పోవడం, మెరిట్ లిస్ట్ బహిరంగ పరచకపోవడం, కేవలం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృష్టించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక్కో పోస్ట్కు రూ.లక్షల్లో బేర సారాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో పోస్టులు కేటాయించారన్న ఫిర్యాదులు, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చారన్న ఆరోపణలు యువతలో తీవ్ర అసంతృప్తులకు గురి చేస్తున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకపోవడం, కోర్టు తీర్పు తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల తయారీ, అప్లోడ్ నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలన్నారు. మెరిట్ లిస్ట్లు, మార్కులు, ఎంపిక వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్రమంగా ఎంపికైన వారిపై చర్యలు తీసుకొని నిజమైన వారికి న్యాయం చేయాలని కోరారు. ఆమరణ దీక్షలకు సిద్ధం లీకేజీ ప్రభుత్వం డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. – అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీ ప్రభుత్వం. పది, ఇంటర్, ఏపీసెట్...ఇలా అన్ని పరీక్ష పేపర్లను లీకేజీలు చేసి లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికై నా విచారణచేసి పేపర్ లీకులు, డేటా తొలగింపు, మెరిట్ లిస్ట్లో అవక తవకలపై వెంటనే సమాధానం చెప్పాలి. –గంగుల సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ -
ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
పుట్టపర్తి టౌన్: ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఆయన ఎలక్ట్రికల్ బైక్పై ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎనుములపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి సైతం ఈ–బైక్పైనే వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ–బైక్లతో ఇంధన పొదుపుతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. అనంతరం ఆయన ఎనుములపల్లిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
పోస్టింగ్ ఇస్తామన్నా ‘వద్దు సార్’ అంటున్న అధికారులు
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్చార్జ్ ఆర్డీఓ, ఇన్చార్జ్ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్ సబ్ డివిజన్కు 5 నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ఇన్చార్జ్గా నియమించినా, రెండు సబ్ డివిజన్లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అవస్థల పర్వం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంతులేని అవినీతి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్చార్జ్లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూధన్రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. –గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసిప్రజల్లో భయాందోళన ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం -
మధ్యాహ్నం వరకే వైద్య సేవలు
నల్లచెరువు: మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్యసిబ్బంది మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిథ ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే నల్లచెరువు మండలంలోని పాథ్రమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం నిబంధనలు తమకు వర్తించవు అన్నట్లుగా వైద్య అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 , 11 గంటలైనా విధులకు హాజరు కాని వైద్య అధికారులు మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పీహెచ్సీలో సేవలు అందిస్తున్నారు. ఉదయం ఓపీకి వచ్చిన రోగులను మాత్రమే చూసి తర్వాత తమకు సంబంధం లేనట్లు వెళ్లిపోతున్నారని రోగులు వాపోతున్నారు. పర్యవేక్షణ కరువు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా విధులకు వచ్చే సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలు దాటితే పత్తా లేకుండా పోతున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు సిబ్బంది లేకపోవడంతో విధిలేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్ర ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో శనివారం, ఆదివారం సిబ్బంది ఉండటం లేదని తెలిపారు. ఆస్పత్రిలో వైద్య అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యాధికారులు, సిబ్బందిపై డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆగ్రహం -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కనగానపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేసుకొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి బలవన్మరణం పెనుకొండ రూరల్: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గొందిపల్లి గ్రామం కై లాస దేవాలయం సమీపంలో చోటు చేసుకొంది. కియా ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపిన వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని మల్లాతహళ్లికి చెందిన రాజు (57) ఆలయానికి కిలో మీటరు దూరంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం దుద్దేబండ క్రాస్ నుంచి రాజు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీఆర్వో బషీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. బైక్ను ఢీకొన్న కారు.. రైతు మృతి తనకల్లు: మండలానికి చెందిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అన్నమయ్య జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ములకలచెరువు సీఐ ప్రతాప్ తెలిపిన వివరాలమేరకు.. తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి (55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు. ఆలయంలో చోరీ కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
పుట్టపర్తి టౌన్: చెత్త తరలింపు వాహనాలకు మరమ్మతు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అవి ఎండకు ఎండుతూ.. వానకు తుప్పుబడుతున్నాయి. పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డుల్లో చెత్త సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం పుట్టపర్తి మున్సిపాటీకి రెండు వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం రూ.16 లక్షలు. నిర్వహణ లోపం కారణంగా 15 నెలల క్రితం మరమ్మతుకు గురయ్యాయి. ఒక కంఫ్యాక్టర్ను రెడీ చేసి మరోదాని మెకానిక్ షెడ్ వద్ద వదిలేశారు. అలాగే గతంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, దాతల సహాయంతో చెత్త తరలించేందుకు 10 ఆటోలను సేకరించారు. అందులో ఇప్పుడు మూడు మాత్రం పనిచేస్తున్నాయి. ఏడు వాహనాలు పనిచేయడం లేదు. వాటిని కూడా మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి వదిలేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా కౌన్సిల్ సమావేశానికి హాజరై చెత్త సేకరణకు , పాత వాటిని మరమ్మతు చేయించాలని పదే పదే అధికారులను ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతు చేయించలేదు. అవి మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. ఇప్పటికై నా ప్రత్యేక అధికారి, కమిషనర్ చెత్త తరలింపు వాహనాలపై దృష్టి పెట్టి ప్రజలు సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త తరలింపు వాహనాల మరమ్మతును పట్టించుకోని అధికారులు నెలల తరబడి ఎండలోనే మగ్గుతున్న వాహనాలు -
ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
గోరంట్ల: ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్న అంజినప్ప (58) ఆదివారం మృతి చెందాడు. వివరాలు... మండల పరిధిలోని జీనంవాండ్లపల్లిలో భూవివాదంలో భాగంగా ఈనెల 26న అన్నదమ్ములైన బోయ రంగప్ప, అంజినప్ప వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో తమ్ముడు అంజినప్ప తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న అంజినప్ప ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అంజినప్పకు భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. సీఐ బోయ శేఖర్ తన సిబ్బందితో బెంగళూరు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసుల వైఫల్యంతోనే... జీనవాండ్లపల్లికి చెందిన బోయ రంగప్ప, ఆయన తమ్ముడు చిన్న అంజినప్ప మధ్య కొంత కాలంగా భూవివాదం నడుస్తోంది. పోలీసులకు సైతం ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. రెండు వర్గాలకు చెందిన రైతులు అధికార పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఒక వర్గానికి చెందిన రైతు మంత్రి సవితమ్మ ప్రధాన అనుచారుడైన ఓ గ్రామ నాయకుడికి అత్యంత సన్నితుడు కావడంతో పోలీసులు వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు సకాలంలో సమస్యను పరిష్కరించి ఉంటే అసలు ఘర్షణ జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. -
జోరుగా ఇసుక దందా
పరిగి: పెన్నా, జయమంగళీ నదుల్లో ఇసుక ఖాళీ అవుతోంది. ఇష్టారీతిలో తవ్వకాలు చేపట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకులు కూడా చోద్యం చూస్తుండటంతో ఇసుకాసురుల వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగుతోంది. ట్రాక్టర్ రూ.2 వేలు పరిగి మండల పరిధిలో పెన్నా, జయమంగళి నదులు అక్రమార్కులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర స్థానికంగా అయితే రూ.2 వేలు. అదేవిధంగా కర్ణాటకకు రూ.4 వేల వరకూ ధర పలుకుతోంది. ఇదే అదునుగా ఇసుక తరలింపు కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను కొనుగోలు చేసి రంగంలోకి దించుతున్న అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలించేస్తున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను అధికార బలంతో గంటల్లోనే బయటకు తెచ్చుకుంటున్నారు. రెండు నదుల్లోనూ ఇసుకను ఎడాపెడా తోలేస్తుంటుండటంతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ జీఓను అడ్డుపెట్టుకొని... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దందా సాగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు. నిత్యం వందలాదిగా ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా పొరుగు మండలాలకే కాకుండా కర్ణాటకకు భారీగా తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చన్న వెసులుబాటు కల్పించింది. దీన్నే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులకు పైసా పెట్టుబడి లేకుండా అనుమతులు పొంది ఉచితం మాటున ఇష్టానుసారంగా ఇసుక తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాత్రి వేళలో శ్రీరంగరాజుపల్లి, ఊటుకూరు, శాసనకోట, నేతులపల్లి, బాలిరెడ్డిపల్లి, ఎర్రగుంట, పైడేటి, గణపతిపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటూ ప్రకృతి వనరుగా ఉన్న ఇసుక, మట్టి అక్రమ తరలింపును కాపాడాల్సిన పాలకులు, అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ట్రాక్టర్ రూ.2 వేలు, కర్ణాటకకు తరలిస్తే రూ.4 వేలు పెన్నా, జయమంగళి నదులను ఖాళీ చేస్తున్న ఇసుకాసురులు పట్టించుకోని అధికారులు మండలంలోని మోదా వద్ద తాజాగా ఆదివారం జయమంగళి నది నుంచి రెండు ట్రాక్టర్లు, ఊటుకూరు పెన్నా నది వద్ద ఓ ఇసుక ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కేనులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కేఎస్ఆర్టీసీ కండక్టర్పై దాడి
హిందూపురం: పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ మంజునాథ్పై విచ్చన రహితంగా దాడి చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కర్ణాటక ప్రాంతంలోని గౌరీబిదనూరు డిపోకు చెందిన బస్సు (కేఏ401157) బెంగళూరు నుంచి బయలుదేరి హిందూపురం పట్టణానికి వస్తోంది. ఈ సందర్భంగా ఓ మహిళ పెద్ద లాగేజీ బ్యాగులో మాంసం పెట్టుకుని ప్రయాణించింది. వాసన వస్తుండటంతో ప్రయాణికులు చెప్పిన మేరకు కండక్టర్ ఆమెను ప్రశ్నించి ఇలా మాంసంతో ప్రయాణించడానికి వీలులేదని చెప్పాడు. హిందూపురం రాగానే ఆమెను దిగిపోవాలని సూచించాడు. దీంతో ఆమె బ్యాగుతో దిగివెళ్లింది. బస్సునేరుగా పాతబస్టాండ్ వద్ద వచ్చి చేరింది. కొంత సమయానికి ఆ మహిళకు సంబంధించిన బంధువులు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చి బస్సును వాహనాలతో అడ్డగించి కండక్టర్ మంజునాథ్తో వాదిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. బస్సుడ్రైవర్ గంగాధర్ అడ్డుపడటంతో అతన్ని కూడా దుర్భాషలాడి ఎక్కువ మాట్లాడవంటే బస్సు అద్దాలు పగలగొడతామని హెచ్చరించినట్లు బాధితుడు మంజునాథ్ తెలిపారు. ఈ మేరకు బాధితులు, కేఎస్ఆర్టీసీ డిపో అధికారులు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
పుట్టపర్తి టౌన్: కుటుంబ కలహాల కారణంగా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన సోముశేఖర్ ( 25) ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎస్ఐ నారాయణరెడ్డి వివరాల మేరకు... బుక్కపట్నంకు చెందిన సోముశేఖర్ నిర్మాణంలో ఉన్న సత్యసాయి డిగ్రీ కళాశాలలో బీర్ బాటిల్తో గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని తమ వాహనంలో ఎక్కించుకొని స్థానిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైనా వైద్యం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సరైన సమయంలో స్పందించిన పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వైన్ షాపులో చోరీ యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహానాడుకు హాజరుకాని కూలీలకు వేధింపులు కళ్యాణదుర్గం రూరల్: మండల పరిధిలోని గోళ్ల గ్రామంలో ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యాక్రమానికి హాజరు కాలేదన్న కారణంతో టీడీపీ నేతలు ఉపాధి హామీ హామీ కులీలపై వేధింపులకు దిగారు. ఆదివారం ఉపాధి పనులు అధికారంగా నిర్వహించకూడదు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి ఉపాధి హమీ పనులు నిర్వహించారు. అయితే మహానాడుకు హాజరుకాని కూలీలకు చెందిన ఫోటోలను మాత్రం తీయలేదు. ఎందుకు తమ ఫోటోలు తీయలేదని కొందరు కూలీలు నిలదీశారు. టీడీపీ నేతలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో మాట్లాడుతూ ‘మేము చెబితే మీటింగ్లకు తప్పకుండా హాజరుకావాలి.. మరోసారి ఇలా చేస్తే బాగుండదు’ అంటూ హెచ్చరించారు. అనంతరం వారి ఫోటోలను తీశారు. మహానాడుకు వెళ్లడం, వెళ్లకపోవడం అన్నది తమ వ్యక్తిగత విషయమని, వివిధ కారణాలతో వెళ్లడం సాధ్యపడలేదని కూలీలు చెబుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడాన్ని సాకుగా చూపి కూలీలను ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు తెలిపారు. కేవలం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామిపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఏపీఓను ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించలేదు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పరిగి: మండలంలోని సేవామందిరం ఏఎం లింగణ్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అదే స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముప్పై ఏడు ఏళ్ల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరి కష్టసుఖాలు ఒకరు తెలుసుకోవడంతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం గురువులకు శాలువాలతో సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గురువులు సుధాకర్రావు, ప్రభాకర్రావు, పుల్లప్ప, కనకవల్లి, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు లక్ష్మణమూర్తి, మహేష్, మల్లికార్జునస్వామి, అహమ్మద్, లక్ష్మణ్, సుదర్శన్రెడ్డి, శంకరప్ప, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బంగారంపేట పొలాల్లో మృతదేహం లభ్యం
తాడిమర్రి: మండలంలోని బంగారంపేట, చిల్లకొండయ్యపల్లి గ్రామాల మధ్య ఆదివారం రైతులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్తో సేద్యం చేయిస్తుండగా డ్రైవర్ బోరు వద్ద పడి ఉన్న మృతదేహాన్ని చూసి రైతుకు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. దాడితోట సమీపంలోని కొండపైన జరుగుతున్న అదాని గ్రీన్ ఎనర్జీ హైడ్రో ప్రాజెక్టులో పని చేస్తున్న కూలీలు శనివారం ఇచ్చిన వ్యక్తి అదృశ్యం ఫిర్యాదు మేరకు ఆ దిశగా ఎస్ఐ విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మృతదేహాన్ని పరిశీలించగా అదృశ్యమైన వ్యక్తిగా గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం గంగోటియా గ్రామానికి చెందిన ముగ్గురు పని కోసం నాలుగు రోజుల క్రితం ఆదానీ కంపెనీ వద్దకు వచ్చారు. వారిలో మతి స్థిమితం సరిగా లేని ప్రతాప్ ముండా (45) శుక్రవారం తన బావమరిదితో గొడవపడి అక్కడ నుంచి వచ్చాడు. మద్యం మత్తులో దారి తప్పి పొలాల్లోకి వెళ్లి కిందపడటంతో సృహతప్పి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య జాక్గ్రాణి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
వివాహిత బలవన్మరణం
పుట్టపర్తి అర్బన్: అనారోగ్యం తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన ఆవుల వెంకటేష్కు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చిన్నవాడైన భాస్కర్కు రామగిరి మండలం శేషంపల్లికి చెందిన రామాంజనేయులు కోనమ్మ దంపతుల కుమార్తె మౌనిక(23)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఆరు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందు నుంచే కడుపునొప్పితో మౌనిక బాధపడుతుండేది. బిడ్డ పుట్టిన అనంతరం నొప్పి తీవ్రమైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు లోనైన మౌనిక శనివారం తెల్లవారుజామున ఇంట్లోని బెడ్ రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నారాయణరెడ్డి, తహసీల్దార్ కళ్యాణ్చక్రవర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆటోను ఢీకొన్న కారు బత్తలపల్లి: మండలంలోని తంబాపురం క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మలింగ సిద్దలింగ దస్తారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారి దర్శనం ముగించుకున్న అనంతరం శనివారం కారులో తిరుగు ప్రయాణమైన ఆయన.. తంబాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా రామాంపురం నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బండి నారాయణస్వామి, బత్తలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, మాల్యవంతం గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 ద్వారా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ తిట్టాడని మహిళ ఆత్మహత్యాయత్నం తలుపుల: స్థానిక ఎస్ఐ చెన్నయ్య బూతులు తిట్టారంటూ మండలంలోని సోమలవాండ్లపల్లికి చెందిన వై.మమత ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఓ కేసు విషయంగా మమత భర్త గంగిరెడ్డిని పోలీసులు శుక్రవారం స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో భర్తను దూషిస్తుంటే మమత అడ్డుకుంది. ఆ సమయంలో ఎస్ఐ రెచ్చిపోయి రాయలేని పదజాలంతో దుర్భాషలాడారు. న్యాయం చేయాలని కోరితే ఇలా దుర్మార్గంగా మాట్లాడడం సరికాదని అన్నందుకు ఏమైనా తాగి చావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రత్యర్థుల నుంచి డబ్బు తీసుకుని తమను అన్యాయంగా కేసులో ఇరికించి గ్రామంలో పరువు తీసేందుకు సిద్ధమయ్యారంటూ మమత శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనౖపై ఎస్ఐను ఆరా తీయగా... ఓ వివాదం విషయంగా ఇరు పార్టీలను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయించామని పేర్కొన్నారు. తాము ఎలాంటి దూషణలకు పాల్పడలేదని తెలిపారు. -
మలకవేమల పీహెచ్సీ తనిఖీ
ముదిగుబ్బ: మండలంలోని మలకవేమల పీహెచ్సీని శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం తనిఖీ చేశారు. పలు రికార్డులు, పీహెచ్సీ పరిసరాలు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ఎంపీహెచ్ఈఓ వేణుగోపాలరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శేషజీవితం ప్రశాంతంగా గడపాలి : ఎస్పీ పుట్టపర్తి టౌన్: ఉద్యోగ విరమణ సర్వసాధారణమని, ఇంత కాలం తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించిన వారు ఇకపై శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ సతీష్కుమార్ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ రహిమాన్, ఎస్ఐ బ్రహ్మానందరెడ్డి, ఏఎస్ఐ సోమశేఖర్, హెడ్సీ అల్లాబకాష్ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని డీపీఓలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు వారి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ వలి, ఆర్ఎస్ఐలు ప్రదీప్సింగ్, వీరన్న, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే అంతర్రారష్రట దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు మడకశిర యూజీ పీఎస్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను స్థానిక ఎస్ఐ లావణ్యతో కలిసి ఆయన వెల్లడించారు. మడకశిర ప్రాంతంలో ఇటీవల పలువురి ద్విచక్ర వాహనాలను దుండగులు అపహరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు... కల్లుమర్రి క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అగ్రంపల్లి గ్రామానికి చెందిన శివప్ప, సాయి అలియాస్ సాయిప్రభును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో మడకశిరతో పాటు కర్ణాటకలోని పావగడలో ద్విచక్ర వాహనాల అపహరించి అగ్రంపల్లి గ్రామ సమీపంలోని తన పొలానికి ఆనుకుని ఉన్న ముళ్లకంపల పొదల మాటున దాచినట్లు శివప్ప అంగీకరించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రూ.8.50 లక్షల విలువైన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పది ద్విచక్ర వాహనాల స్వాధీనం -
రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు
● రెడ్డి జేఏసీ నేతల ధ్వజం ధర్మవరం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామాటం శేషాద్రిరెడ్డి, జిల్లా కార్యదర్శి చందమూరి శివారెడ్డి ధ్వజమెత్తారు. హైకోర్టు అడ్వకేట్ అంజన్రెడ్డి, చిగిచెర్ల అరవింద్రెడ్డిపై దాడులు, ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న నరేంద్రరెడ్డిని బూతులు తిట్టి ట్రాన్స్ఫర్ చేయడం, అర్హత ఉన్న రెడ్డి ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండా అడ్డుపడటం, అనవసర బదిలీలు తదితరాలే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక రెడ్డి జేఏసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడంలో భాగంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి గన్మెన్లను తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా పేరుతో నమోదైన కేసుల్లో 800 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఈ దాడులను అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న రెడ్డి ప్రజా ప్రతినిధులు, రెడ్డి నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ పట్టణాధ్యక్షుడు కృష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ఆదిశేఖర్రెడ్డి, కార్యదర్శి మంజునాథ్రెడ్డి, రంగారెడ్డి, సనత్కుమార్రెడ్డి, కాటంరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు. -
మామిడి.. మిగలని దమ్మిడి!
పెనుకొండ: ఎన్నో ఆశలతో ఈ ఏడు లాభాలు గడించవచ్చని ఆశించిన మామిడి రైతులు... పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో కుదేలవుతున్నారు. విధి లేని పరిస్థితిల్లో మండీ వ్యాపారులు అడిగిన ధరకే కాయలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా... చివరకు రెక్కల కష్టమే మిగులతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా .. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగులో ఉండగా, నెలరోజుల క్రితం దిగుబడి ప్రారంభంలో మంచి డిమాండ్ ఉండేది. తోతాపురి రకం టన్ను రూ.30 వేలకు పైగా అమ్ముడు పోయింది. చిరు వ్యాపారులు సైతం మార్కెట్లో కిలో రూ.60 చొప్పున విక్రయిస్తూ లాభాలు గడించారు. ఇలాంటి తరుణంలో కాయ పరిమాణం మరికాస్త పెరిగితే ధర కూడా ఆశించిన మేర ఉంటుందని పలువురు రైతులు భావించారు. దీంతో కోతలు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ. 5 వేల నుంచి రూ. 6 వేలలోపే పలుకుతోంది. గతంలో మార్కెట్లో టన్ను రూ. 50 వేలకు పైగా పలికిన బేనీషా, బాదామి, రాజ్బేనీషా, కసి, రస్పూరి వంటి మేలు రకాలను సైతం ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి అడగడం లేదు. హైదరాబాద్, నాగపూర్, బెంగళూరు వంటి దూర ప్రాంత మార్కెట్లకు కాయలను తీసుకెళుతున్నా గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని ప్రభుత్వ సహకారం మార్కెట్లో ధరలు పతనమై నష్టపోకుండా రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కేవరకూ ఉత్పత్తులను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాక ప్రత్యేక రైలు మార్గం ద్వారా పంట ఉత్పత్తులను దేశంలోని మహానగరాలకు రవాణా చేయించి, ఉద్యాన తోటల రైతులకు లాభాలు దక్కేలా చొరవ తీసుకుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఉద్యాన రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పంటకు కనీస మద్ధతు ధర కల్పించకపోవడం, శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించకపోవడం తదితరాలతో ఉద్యాన రైతులు భారీగా నష్టాలను మూట గట్టుకోవాల్సి వస్తోంది. తోతాపురి టన్ను రూ.6 వేలలోపే కిలో రూ.20 దాటని ఇతర రకాలు మామిడి రైతుల బతుకులు వీధిన పడుతున్నాయి. కాయలకు గిట్టుబాటు ధరలు దక్కక, ఆదాయం రాక, అప్పులు తీర్చలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు ధరల్లేవు మామిడి ధర ప్రారంభంలో కాస్త బాగున్నా కాయ పూర్తి సైజు వచ్చే సరికి ఒక్కసారిగా పడిపోయాయి. సగానికి పైగా ధరలు పడిపోవడం ఒక విధంగా రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. తోతాపురి రకం టన్ను 5 వేలు, బేనీషా, బాదామి ఇతర మేలు రకాలు టన్ను రూ. 20 వేలకు మించి పోవడం లేదు. దీంతో రైతుతో పాటు తోటలను కొనుగోలు చేసిన నాలాంటి వ్యాపారులు టన్నుపై రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. – వినోద్, వ్యాపారి, పెనుకొండ -
వెంకటరమణప్పకు కన్నీటి వీడ్కోలు
పావగడ: వ్యవసాయదారుడు, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప పార్థివ దేహానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాళులర్పించారు. వెంకటరమణప్ప కుమారుడు స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. శనివారం పావగడ తాలూకాలోని హనుమంతనహళ్లికి చేరుకున్న సిద్దరామప్ప.. వెంటరమణప్ప భౌతిక కాయాన్ని చూడగానే కంట తడి పెట్టారు. వెంకటరమణప్ప మృతి తనకు వ్యక్తిగతంగా తీరని నష్టమని పేర్కొన్నారు. ఇంత త్వరగా తన మిత్రడు కనుమూస్తాడని అనుకోలేదని, ఇంకా పదేళ్లు బతికే అవకాశముండేదని బాధ పడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాలను గుర్తు చేశారు. మంత్రులు జమీర్ అహమ్మద్, కేజే జార్జ్, మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజణ్ణ, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య, రాజేంద్ర కేఎన్ రాజణ్ణ, ఎంపీ గోవింద కారజోళ, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు శాంతలారాజణ్ణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్సీ నారాయణస్వామి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి, కలెక్టర్ శుభ కళ్యాణ్, సీఈఓ అశ్విజ, తదితర ప్రముఖులు వెంకటరమణప్ప పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.రాజనహళ్లి వాల్మీకి ప్రసానందస్వామితో పాటు 25 మంది సాధువులు వెంకటరమణప్ప పార్థివదేహాన్ని సందర్శించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు తాను ప్రేమతో పెంచుకున్న వ్యవసాయ క్షేత్రంలో అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. -
‘సర్’ సర్వేకు సహకరించండి
● రాజకీయ పార్టీలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్– సర్) సర్వే జిల్లాలో పక్కాగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ పార్టీల నాయకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జూన్ 5 నుంచి 14వ తేదీ వరకూ సన్నాహక కార్యక్రమాలు, సిబ్బందికి శిక్షణ, ఓటరు గణన ఫారాల ముద్రణ ఉంటుందన్నారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేకరిస్తారన్నారు. ఏ ఇంటికై నా తాళం వేసి ఉంటే.. సదరు ఇంటిని కనీసం మూడు సార్లు బీఎల్ఓలు సందర్శిస్తారన్నారు. జూలై 21న ముసాయిదా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేస్తామని, జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అన్నీ పరిష్కరించి సెప్టెంబర్ 22వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా సర్ సర్వే సాగుతుందన్నారు. అలాగే నకిలీ ఓట్లు లేని స్వచ్ఛమైన జాబితా కోసం రాజకీయ పార్టీలు నియమించుకునే బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ కొండయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
పుట్టపర్తి అర్బన్: స్థానిక ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నలుపు షర్టు, మెడలో పచ్చ దారంతో కూడిన తాయత్తు తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం ఉదయం బసవ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఆచూకీ తెలిసిన వారు 91820 19510 కు సమాచారం ఇవ్వాలని కోరారు. తాటిచెట్టుపై పిడుగు బత్తలపల్లి: మండలంలో శనివారం సాయంత్రం కురిసిన మోస్తారు వర్షానికి నల్లబోయనపల్లి గ్రామ శివారున ఉన్న తాటిచెట్టుపై పిడుగు రాలింది. దీంతో తాటిచెట్టుపై మంటలు ఎగిసిపడ్డాయి. సంజీవపురం గంగమ్మ ఆలయం, ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. -
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్ /ధర్మవరం అర్బన్: ఉరుములు... మెరుపులు..భారీగాలులతో కూడిన వాన జిల్లాను ముంచెత్తింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వాన రాత్రి 9 గంటల వరకూ కురిసింది. ప్రధానంగా తాడిమర్రి, ధర్మవరం, చిలమత్తూరు, పుట్టపర్తి, కొత్తచెరువు ,గోరంట్ల హిందూపురం తదితర ప్రాంతాల్లో 2 గంటలకుపైగా దంచేసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిలమత్తూరులోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడి చెట్టు కాలి పోయింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. తాజా వర్షాలతో ఖరీఫ్ సాగుకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ధర్మవరంలో కుండపోత ధర్మవరంలో శనివారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. చేనేతల ఇళ్లల్లోని మగ్గం గుంతల్లో వర్షపునీరు చేరడంతో సామగ్రి తడిసిపోయింది. ఎన్టీఆర్ సర్కిల్లో ప్రధాన రహదారి మొత్తం జలదిగ్భంధమైంది. దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో వర్షపునీరు నిలవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
పెనుకొండ రూరల్: ‘‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే సమయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి. బీఎల్ఓల వెంట ఉంటూ అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలి. అలాగే నూతన ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలి.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పార్టీ బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజక వర్గంలోని బీఎల్ఓలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ‘సర్’ సర్వే సమయంలో బీఎల్ఓఏల వెంట బీఎల్ఏలతో పాటు పార్టీ ముఖ్యనాయకులు ఇంటింటి పరిశీలనకు వెళ్లాలన్నారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, మృతుల ఓటర్లును గుర్తించాలన్నారు. అధికారులు సమక్షంలో అక్కడికక్కడే నిర్ధారించుకోవాలన్నారు. అర్హత కలిగిన ఏ ఓటు తొలగించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి ఓటూ బంగారం కంటే విలువైనదిగా భావించాలన్నారు. బీఎల్ఓలు, నాయకులు సమష్టి కృషితో పనిచేస్తే స్థానిక సంస్థలలో పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. అన్మ్యాప్డ్ ఓటర్ల ఆధారాలు సిద్ధం చేయండి 2002 తర్వాత ఓటు హక్కు పొందిన ఓటర్లను అన్మ్యాప్డ్ ఓటర్లుగా పరిగణిస్తారని, అలాంటి ఓటర్ల ఆధారాలు సిద్ధం చేసుకోవాలని బీఎల్ఏలకు ఉషశ్రీచరణ్ సూచించారు. ఇంటి యజమాని ఓటు కార్డు మ్యాప్ అయి ఉంటే చాలని, కుటుంబ సభ్యులు ఓటరు కార్డు మ్యాప్ కాకపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించిన జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, భూమి పాసు పుస్తకం, ఇంటి పట్టా, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, పాస్ పోర్టు... ఇలా 13 రకాల పత్రాల్లో ఏవైనా రెండు త్రాలు అధికారులకు అందజేస్తే సరిపోతుందన్నారు. ‘సర్’ సర్వేలో కీలకంగా వ్యవహరించాలి అర్హులైన వారి ఓట్లు తొలగకుండా చూసుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఒక్క ఓటూ తొలగిపోకూడదు ‘సర్’ సర్వేలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీను మహేష్, పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో శ్రీసత్యసాయి జిల్లా ఇప్పటికే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ‘సర్’ పరిశీలనలోనూ నిజమైన ఓటర్లు తొలగించకుండా జాగ్రత్త పడుతూ తక్కువ ఓటర్లు తొలగించిన జిల్లాలో మొదటి స్థానంలో నిలువాలన్నారు. గ్రామస్థాయి నాయకులంతా విధిగా సర్వే సమయంలో బీఎల్ఓల వెంట ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే స్పందించాలన్నారు. సమస్య మీ పరిధిలో పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చి ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, పోలింగ్ బూత్ల జోన్–5 ఇన్చార్జ్ సురేష్, బూత్ కమిటీల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమాం వలి, ఐదు మండలాల బూత్ కమిటీల కన్వీనర్లు, బోయ రాము, విజయ్ కుమార్రెడ్డి, చిలకల రవి, గంగాధర్ రెడ్డి, బలిజ సుబ్రహ్మణ్యం, ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, నరసింహ మూర్తి, తిమ్మయ్య, వెంకటేష్, శంకర్, శ్రీనివాస్, గజేంద్ర, పలువురు ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
అయ్యవార్లలో అలజడి
పుట్టపర్తి: ‘టెట్’పై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2010 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన వారంతా తప్పనిసరిగా ‘టెట్’ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) రాయాల్సిందేనని తేల్చేసింది. అంతేకాదు..ఉద్యోగంలో కొనసాగాలంటే 2028 ఆగస్టు 31వ తేదీ లోపు ఉత్తీర్ణులు కావాల్సిందేనని శుక్రవారం తీర్పు చెప్పింది. దీంతో అయ్యవార్లలో అలజడి నెలకొంది. పాఠం చెప్పే తాము ఇప్పుడు మళ్లీ పాఠాలు నేర్చుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8,300పైచిలుకు మంది ఉపాధ్యాయులు ఉండగా కేవలం 2,900 మంది మాత్రమే ‘టెట్’ పాస్ అయ్యారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు 400 మందికి మించి ఉండరు... దీనిప్రకారం 5 వేల మంది ‘టెట్’ తప్పని సరిగా పాస్ కావాల్సి ఉంది. పదోన్నతులపై తీవ్ర ప్రభావం ఏటా వేసవిలోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘టెట్’ పాస్ అయిన వారికే ప్రమోషన్ కల్పించాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వేలాది మంది టీచర్ల ప్రమోషన్ కల ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది సీనియర్లు పదోన్నతులు కోల్పోనున్నారు. ఇన్సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పనిసరి తాజాగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జిల్లాలోని 5,000 మందిపైప్రభావం చంద్రబాబు, లోకేష్ హామీ నిలబెట్టుకోవాలని టీచర్ల డిమాండ్ మినహాయింపు ఇవ్వాలి టెట్ నుంచి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయాలి. 30 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న వారికి పరీక్ష పెట్టడం సరికాదు. పదోన్నతులకూ ‘టెట్’ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం కూడా దుర్మారం. ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘టెట్’ను ప్రామాణికంగా తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం. – కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎస్టీఏ హిందూపురంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవి అనే ఉపాధ్యాయుడు కొన్నేళ్లుగా పిల్లలకు గణితం బోధిస్తున్నాడు. ఆయన సర్వీసు కూడా ఆరేళ్లు మాత్రమే ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంది. 150 మార్కులకు నిర్వహించే ‘టెట్’లో తాను చెప్పే గణితానికి సంబంధించి 30 మార్కులే ఉంటాయని, మిగతా 120 మార్కులకు తాను సోషల్, తెలుగు తదితర సబ్జెక్టులు ఇప్పుడు చదువుకోవాల్సి వస్తోందని రవి ఆవేదన వ్యక్తం చేశాడు. ..ఇలా జిల్లాలోని టీచర్లంతా ‘టెట్’కు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తే తాము బోధించే సబ్జెక్టుపైనే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. -
హామీ నిలబెట్టుకోవాలి
ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్..గతంలోనే ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రంలో లక్షలాది మంది టీచర్లు నష్టపోతారు. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల జిల్లాలో వేలాది మంది టీచర్లు ఆందోళకు గురవతున్నారు. ఇన్సర్వీస్ టీచర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్లో చట్ట సవరణ కోసం బిల్లు ప్రవేశ పెట్టాలి. అప్పుడే టీచర్లకు న్యాయం జరుగుతుంది. ఇది తప్ప వేరే గత్యంతరం లేదు. – శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ -
పోలీస్ క్రికెట్ టోర్నీ విజేత కేజీఎఫ్ జట్టు
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వారం రోజులుగా సాగుతున్న పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 16 జట్లు పాల్గొనగా, శనివారం జరిగిన ఫైనల్స్లో క్యాంప్ జట్టుపై కేజీఎఫ్ జట్టు విజయం సాధించి ంది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు : ఎస్పీ క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెల రోజులుగా సాగుతున్న టేబుల్ టెన్నిస్ వేసవి శిక్షణా శిబిరం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై, శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత, డీఎస్పీ శివనారాయణస్వామి, పీడీ నరసింహాచారి, తదితరులు పాల్గొన్నారు. మహానాడులో హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్ చిలమత్తూరు: మండలంలోని కోడూరులో ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో గోరంట్ల హౌసింగ్ శాఖలో వర్క్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మల్లికార్జున పాల్గొనడం చర్చనీయాంశమైంది. మహానాడులో మల్లికార్జున సందడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రైతు సమస్యలు పట్టవా?
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారుల పని తీరులో చాలా మార్పులు వచ్చాయని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రధానంగా తాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, విద్యుత్, వెల్ఫేర్ వంటి అంశాలపై చర్చ సాగింది. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ సాలురెడ్డి మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంగా ఆలస్యం చోటు చేసుకుందని, రైతులకు జూన్ 4 నుంచి విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తీసుకెళ్లినా నేటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. రైతులకు పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని జెడ్పీటీసీ నాగరాజు గుర్తు చేశారు. సర్వజనాస్పత్రిలో నెలకొన్న సమస్యలను జెడ్పీటీసీ చంద్ర ప్రస్తావిస్తూ... రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అంబులెన్స్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్లు లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజమ్మ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. సమగ్ర విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కాగా, సమావేశానికి విద్యాశాఖాధికారులు గైర్హాజరు కావడంతో చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. ఐసీడీఎస్లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు. స్థాయీ సంఘ సమావేశంలో అధికారులను నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఎప్పుడు చేపడతారని నిలదీత తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం సర్వజనాస్పత్రిలో రోగులకు భోజనం సక్రమంగా అందివ్వాలని డిమాండ్ -
వీఆర్కు పుట్టపర్తి సీఐ తిమ్మారెడ్డి
పుట్టపర్తి టౌన్: అర్బన్ సీఐ తిమ్మారెడ్డిని వీఆర్కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే పుట్టపర్తి అర్బన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న తిమ్మారెడ్డి... అతి తక్కువ కాలంలోనే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అనంతపురం వీఆర్కు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తిమ్మారెడ్డి పనితీరుతో ఇబ్బంది పడిన కూటమి నాయకులు తనదైన శైలిలో స్థానిక ప్రజా ప్రతినిధులు వద్ద పావులు కదపడంతో ఉన్నతాధికారులు ఆయన్ను వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలో శాంతి భద్రతలు, ప్రొటోకాల్ రీత్యా ప్రశాంతి నిలయం సెక్యూరిటీ వింగ్ సీఐగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని అర్బన్ సర్కిల్కు ఇన్చార్జ్గా నియమించారు. ప్రశాంతంగా ‘పది’, ఇంటర్ పరీక్షలుపుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు శనివారం 23 కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,794 మంది హాజరుకావాల్సి ఉండగా 2,233 మంది హాజరు కాగా, 561 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. అలాగే ‘ఓపెన్’ విద్యార్థులు 171 మందికి గాను 130 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్షలకు 171 మంది గైర్హాజరు 32 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 171 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష నిర్వహించగా...1,255 మందికి గాను 1,166 మంది హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 828 మందికి గాను, 746 మంది విద్యార్థులు హాజరు కాగా, 82 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. జూన్ 5 నుంచి కళాశాలలు ప్రారంభం జూనియర్ కళాశాలలో మరో 5 రోజులు వేసవి సెలవులు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వలస కూలీల వాహనం బోల్తా ●బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో మహిపాల్ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
పశుపోషకులను ఆదుకోవాలి
విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, కుక్కల దాడి.. ఇలా ఏదో ఒక కారణంతో తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట జీవాలు, పశువులు చనిపోతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం పశుబీమా సక్రమంగా అమలు చేయకపోవడంతో పశుపోషకులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో రూ.10 కోట్ల దాకా పశుబీమా అందించింది. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ నిధులు విడుదల కావాల్సి ఉంది బీమా ప్రీమియంలో ప్రభుత్వం 85 శాతం రాయితీ ఇస్తూ పశుబీమాను అమల్లోకి తెచ్చింది. రైతు 15 శాతం మొత్తం చెల్లిస్తే చాలు. కాకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అందుకే కొంతకాలంగా బీమా చేయడం లేదు. పిడుగులు పడటం, ఇంకా పలు కారణాలతో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోయిన మాట వాస్తవమే. బీమా వర్తింపజేస్తే వారికి కొంత ఊరట లభిస్తుంది. – పెంచలయ్య, జేడీ, పశుసంవర్ధకశాఖ -
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
హిందూపురం టౌన్: ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హిందూపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను కేవలం ప్రకటనలతో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం దారుణమన్నారు. మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన తరుణంలో వాటిని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలు సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విద్యార్థులను సామాజిక, రాజకీయ చైతన్యంతో కూడిన ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దడానికి జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, మహేంద్ర, నాయకులు చంద్ర, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు -
పార్టీ కార్యక్రమంలో తరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు
ఎన్పీకుంట: స్థానిక శివాలయం వద్ద ఉన్న కమ్యూనిటీ భవనంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం చర్చనీయాంశమయ్యింది. మండల పరిధిలోని వెలిచలమల, పడమరనడిమిపల్లి, ఎదురుదోన పంచాయతీలకు చెందిన నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వేతనం పొందుతున్న వీరు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిబంధన ఉంది. అయినా నిబంధనలు బేఖాతరు చేస్తూ టీడీపీ లోగోలు, ట్యాగులు ధరించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ తనకల్లు: మండలంలోని మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామంలోని దళిత వాడలో 43వ జాతీయ రహదారి పక్కనే నివాసముంటున్న రమణమ్మ శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు రమణమ్మ ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు కలావర్లు, వెండి గొలుసులతో పాటు రూ. 6 వేలు నగదు అపహరించారు. మరో గదిలో ఉన్న ఎనిమిది బస్తాల బియ్యాన్ని ఆటోలో వేసుకుని వెళ్లిపోయారు. కూలి పనుల నుంచి ఇంటికి చేరుకున్న రమణమ్మ తలుపులు తెరచి ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ దిలీప్ కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ట్రావెల్ బస్సు బోల్తా గోపవరం: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పరిధిలోని 67వ జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు బోల్తాపడింది. విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపులకు చెందిన పవన్కుమార్, కదిరికి చెందిన శ్రీనివాసులుతో పాటు కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బద్వేలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై బద్వేలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక మద్యం స్వాధీనం హిందూపురం టౌన్: కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీ, ఫ్లో కేమ్ ఫ్యాక్టరీ, తిరుమల స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే బ్రిడ్జి వద్ద కర్ణాటక మద్యం దందా సాగుతున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో నలుగురు పట్టుబడగా, వారి నుంచి 90 ఎంఎల్ సామర్థ్యం కలిగిన 9 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అలాగే కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తూ నలుగురు పాత నిందితుల్లో ఒక్కొక్కరికి ఏడాది కాలానికి రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం కంబాలపల్లికి చెందిన ఊటుకూరు మానద్న (60) దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా కోగిర సమీపంలో ఎల్జీబీనగర్ వైపు నుంచి కోగిర గ్రామానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తూ ఢీకొన్నారు. ఘటనలో రోడ్డుపై పడిన మాదన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న నరసింహులతో పాటు బాలలు రాహుల్, భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 లో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మడకశిర రూరల్: స్థానిక 544ఈ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడీహళ్లి పంచాయతీలోని చౌలిపల్లికి చెందిన నరసింహయ్య (62), జగన్.. గొర్రెల వ్యాపార నిమిత్తం శుక్రవారం ద్విచక్ర వాహనంపై మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి వచ్చారు. పశువుల వ్యాపారి చెన్నయ్య గురించి ఆరా తీయడంతో ఆయన గ్రామంలో లేడని తెలుసుకుని మడకశిర వైపుగా బయలుదేరారు. అయ్యవారిపల్లి ప్రధాన కూడలికి చేరుకోగానే జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి కిందపడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా మడకశిరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరసింహయ్య (62) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జగన్ను తుమకూరులోని ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ఎస్ఐ లావణ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ జోరు
ఈ మ్యాచ్లో ఫలానా జట్టే గెలుస్తుంది. పందెం రూ.10 వేలు. ఈ ఓవర్లో వికెట్ పడుతుంది. మీది రూ.వెయ్యి మాది రూ.800, ఈ పార్టనర్ షిప్లో హాఫ్ సెంచరీ చేస్తారు. పందెం రూ.20 వేలు... ఇలా హిందూపురం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం నుంచి క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.కోట్లలో చేతులు మారినట్లు సమాచారం. హిందూపురం: ఐపీఎల్ సీజన్ ప్రారంభనుంచి హిందూపురం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈ బాగోతంలో బెంగళూరు ప్రాంతానికి చెందిన బుకీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. క్రీడా పరిజ్ఞానం ఉన్న యువకులతో పాటు ఇతర జూదాలలో రాటుదేలిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లలో బిజీగా ఉంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో సాగుతుండడంతో అడ్డుకట్ట వేయడం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. బెట్టింగ్లో ఇప్పటికే హిందూపురం పట్టణానికి చెందిన ఓ వ్యాపారి తొలుత రూ.2లక్షల వరకు గెలిచినట్లు సమాచారం. తర్వాత రూ.20 లక్షల వరకూ పోగొట్టుకున్నట్లు వదంతులు వినవస్తున్నాయి. దీంతో సదరు వ్యాపారి హిందూపురాన్ని వదిలి మరో ఊరిలో స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అలాగే బోయపేటకు చెందిన ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్లో బంగారు గొలుసు, బైక్, డబ్బు పోగొట్టుకుని బెంగళూరు వెళ్లిపోయాడు. జట్టు బలాల ఆధారంగా ఐపీఎల్లో తలపడుతున్న జట్ల బలాబలాల ఆధారంగా బెట్టింగ్ సాగుతోంది. అందిన సమాచారం మేరకు ఒక ఓవర్లో పరుగులు, వికెట్లు పడే సమయాలు, నో బాల్, వైడ్లు ఎప్పుడు పడతాయి, ఫోర్లు, సిక్సర్లు ఎప్పుడు కొడతారు.. ఇలా ప్రతి నిమిషానికి రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ కడుతున్నారు. చివరకు మ్యాచ్ ఫలితంపై కూడా భారీ బెట్టింగ్ సాగుతోంది. ఒక జట్టు బలహీనంగా ఉంటే దానిపై తక్కువ మొత్తం పందెం కాస్తున్నారు. బలమైన జట్టు వైపు ఉన్నవారు దానికి కాస్త ఎక్కువ మొత్తం బెట్టింగ్ కడుతున్నారు. హిందూపురంలోని బార్లు, టీ కేఫ్లు, ధాబాల్లో బెట్టింగ్ రాయుళ్లు గంటల తరబడి బైఠాయించి మ్యాచ్ ఫలితం తేలేవరకూ వేచి ఉండడం గమనార్హం. బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా హిందూపురంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ బెట్టింగ్ కేంద్రాలుగా బార్లు, టీ కేఫ్లు, ధాబాలు చేతులు మారుతున్న రూ.కోట్లు క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ ఐపీఎల్ సీజన్ సందర్భంగా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఏఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తూమకుంట వద్ద హిందూపురం రూరల్ సీఐలు చంద్ర, ఆంజనేయులు, సిబ్బంది తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తూ సందీప్కుమార్, తిమ్మారెడ్డి, మర్రబల్లి శ్రీనివాసరెడ్డి పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో హిందూపురం సీఐలు ఆంజినేయులు, జనార్థన్, రాజగోపాలనాయుడు, అబ్దుల్కరీం తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ప్రశాంతి నిలయం: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన ఎన్– కార్డ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పాత కేసుల్లోని నిందితులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్ చేయాలన్నారు. బెల్ట్ షాపులను నిర్మూలించాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, డీపీఈఓ గోవింద నాయక్, ఏఈఎస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 2న జిల్లా ఫుట్బాల్ బాలికల జట్ల ఎంపికహిందూపురం టౌన్: స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో జూన్ 2న జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్ శుక్రవారం వెల్లడించారు. సబ్ జూనియర్ విభాగంలో 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్య జన్మించిన వారై ఉండాలి. జూనియర్స్ విభాగంలో 2011 జనవరి నుంచి 2012 డిసెంబర్ మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మూడు ఫొటోలు, తల్లిదండ్రుల సమ్మతి పత్రం తీసుకుని మంగళవారం ఉదయం 10 గంటలకు క్రీడా మైదానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 80995 98958 లో సంప్రదించవచ్చు. మాజీ మంత్రి వెంకటరమణప్ప ఇక లేరుపావగడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప(84) గుండెపోటుతో కన్ను మూశారు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు వెంకటేష్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో భార్య శారదమ్మ మృతి చెందారు. తాలూకాలోని హనుమంతనహళ్లిలోని తన స్వగృహంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను బెంగుళూరులోని ఫోర్టీస్ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పావగడలోని గురుభవన్ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్ని వెంకటరమణప్ప భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. యువతి అదృశ్యం అగళి: మండలంలోని హళ్లికేర గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప నాల్గో కుమార్తె అంజలి కనిపించడం లేదు. పోలీసులు తెలిపిన మేరకు... 19 సంవత్సరాల వయసున్న అంజలి కర్ణాటకలోని దొడ్డేరి హోబళి రంగాపురంలో తన చిన్నాన్న నాగరాజు నూతనం నిర్మిస్తున్న ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం బహిర్భూమికని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని తమ్ముడు నాగరాజు ఫోన్ చేయడంతో హనుమంతరాయప్ప... బంధువుల సాయంతో చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు చేపట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. -
బీమాపై ‘మూగ’నోము
కదిరి: వైఎస్ జగన్ హయాంలో ‘వైఎస్సార్ పశు బీమా’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఏదైనా కారణంతో పాడి పశువులు లేదంటే జీవాలు (గొర్రెలు, మేకలు) మృత్యువాత పడితే వెంటనే సదరు రైతు ఖాతాలో బీమా సొమ్ము జమ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే జిల్లాలో పశువులకు బీమా కట్టించుకున్నారు. కానీ తర్వాత నిధులు లేవంటూ పశుబీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇటీవల గాలివాన, విద్యుదాఘాతం, కుక్కల దాడులు..ఇలా పలు కారణాలతో ఎన్నో జీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుపోషకులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అయినా ఈ ప్రభుత్వం సదరు రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. జగన్ హయాంలో ఒక్కో రైతుకు రూ.3 లక్షలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైనా కారణంతో గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి రూ.6 వేల చొప్పున గరిష్టంగా రూ.3 లక్షలు మంజూరు చేసేవారు. ఆ మొత్తాన్ని కూడా సదరు రైతు ఖాతాలో నేరుగా జమ చేసేవారు. ఆవు లేదా గేదెలు ప్రమాదవశాత్తూ చనిపోతే జగన్ ప్రభుత్వం ఒక్కోదానికి రూ.30 వేల చొప్పున రైతుకు నష్టపరిహారం ఇచ్చింది. రైతుకు భారం లేకుండా ప్రీమియం డబ్బులో కూడా 80 శాతం ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు నిధులు లేవని ఆ పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గడచిన ఐదు నెలల్లో 450 గొర్రెలు మృతి.. 2026 జనవరి నుంచి మే 20వ తేదీ వరకు జిల్లాలో 452 గొర్రెలు, 311 మేకలు, 28 గేదెలు, 36 ఆవులు, 12 ఎద్దులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. వీటికి పశుబీమా లేకపోవడంతో పశుపోషకులు భారీగా నష్టపోయారు. పాడిపశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించింది. గతంలో అమలు చేసిన పశువుల బీమా పథకానికి మంగళం పాడింది. ఫలితంగా ఏదైనా అనుకోని ప్రమాదంలో పశువులు, జీవాలు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పశు బీమాకు చంద్రన్న మంగళం నిధులు లేవంటూ దారుణ మోసం ఇటీవల తరచుగా మృత్యువాత పడుతున్న మూగజీవాలు పెద్ద మొత్తంలో నష్టపోతున్న పశుపోషకులు గత ప్రభుత్వంలో ‘వైఎస్సార్ పశు బీమా’తో ఎంతో లబ్ధి ఈనెల 26వ తేదీన తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఈదురుగాలులు వీచి కుళ్లాయప్పకు చెందిన పశువుల షెడ్డు కూలి ఐదు గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. అలాగే రూ.లక్షకుపైగా విలువ చేసే పాడిగేదె మృతి చెందింది. వారం క్రితం తలుపుల మండలం దేవరపల్లిలో గాలివానకు కరెంటు తీగలు తగిలి మల్లినాయుడుకు చెందిన రూ.లక్ష విలువ చేసే ఎద్దులు మృతి చెందాయి. గత నెలలో కదిరి మండలం మీటేనాయక్ తండాలో పొలం వద్ద యూరియా కలిపిన నీళ్లు తాగి బద్దే నాయక్కు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. ఇటీవల రొద్దం మండలం ఎం.కొత్తపల్లి ఎస్సీ కాలనీలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో నాగన్నకు చెందిన 22 గొర్రెలు మృతి చెందాయి. నెల రోజుల క్రితం ఎన్పీకుంట మండలం భీమబోయినపల్లిలో కుక్కల దాడిలో కొమ్మల సురేష్ అనే రైతుకు చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో ఉప్పర గోపాల్కు చెందిన 20 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ఇటీవల జరిగిన సంఘటనలు కొన్ని... -
పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను గడువులోపు ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్డీపీ పోస్టల్ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలన్నారు. అనంతరం నెడ్క్యాప్ ద్వారా చేపడుతున్న సౌరశక్తి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంపై ఎస్పీడీసీఎల్ అధికారులతో చర్చించారు. పరిశ్రమలకు సబ్సిడీలు, పీఎం విశ్వకర్మ ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, జెడ్ఎం నాగముని, ఏపీఐఐసీ ప్రతినిధి శశికళ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 23 కేంద్రాల్లో మేథమెటిక్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,546 మందికి గాను 2,086 మంది హాజరుకాగా, 460 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ‘ఓపెన్ స్కూల్’ విద్యార్థులు 213 మందికి గాను 171 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వెల్లడించారు. మొత్తంగా 502 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్షకు 300 మంది గైర్హాజరు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జనరల్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ఫిజికల్ సైన్స్ పరీక్ష జరిగింది. జిల్లాలోని 32 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు 3,633 మందికి గాను 3,410 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 776 మందికి గాను 699 మంది విద్యార్థులు హాజరు కాగా, 77 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా శుక్రవారం 300 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ‘కియా’ యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహం ● ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి ప్రశాంతి నిలయం: జిల్లాలోని ఎన్హెచ్–44 పరిధిలో ‘కియా’ ఫ్యాక్టరీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని, అలాగే ఆ ప్రాంతంలోని రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ సతీష్కుమార్, జిల్లా రవాణా అధికారి కరుణసాగర్రెడ్డితో కలిసి రహదారి భద్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలోనే ‘కియా’ వద్ద జరిగిన ప్రమాదాల గురించి అధికారులు వివరించగా...కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కియా యాజమాన్యం వెంటనే రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. హరిపురం, అమ్మవారిపల్లి, పుట్టపర్తి క్రాస్, దుద్దేబండ క్రాస్, గుట్టూరు క్రాస్ వద్ద తక్షణమే రంబుల స్ట్రిప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలన్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం, లింగారెడ్డిపల్లి క్రాస్ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను కట్టడి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
పుట్టపర్తి: ‘‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించి డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు పాతరేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన నిర్వాకానికి అర్హులైన వేలాది మంది విద్యార్థుల కుటుంబాలు బలవుతున్నాయి. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ చేయించాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్, నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలి. మెరిట్ లిస్ట్, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలి’’ అని వైఎస్సార్ విద్యార్థి (వైఎస్సార్ ఎస్యూ) విభాగం నేతలు డిమాండ్ చేశారు. డీఎస్పీలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పుట్టపర్తి గణేష్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే డీఎస్సీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అన్నీ అనుమానాలే.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో మెరిట్ లిస్ట్ను పక్కన పెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైఎస్సార్ ఎస్యూ నేతలు ఆరోపించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా కేవలం ఎంపికై న విద్యార్థులకు మాత్రమే సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృషించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ డీ మెరిట్ విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చారన్నారు. కనీసం అభ్యంతరాలకు గడువు కూడా ఇవ్వలేదన్నారు. భవి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకంలోనే తప్పులు చేసి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నా... మంత్రి లోకేష్ మొద్దు నిద్రలో ఉన్నారన్నారు. ప్రభుత్వ చర్యలతో నష్ట పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి నియోజక వర్గం అధ్యక్షుడు నరేష్రెడ్డి, మహేష్, అమడగూరు అధ్యక్షుడు చరణ్, ధర్మవరం పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ పోస్టులను అమ్ముకోవడం సిగ్గుచేటు మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ నిరసన తెలిపిన వైఎస్సార్ ఎస్యూ నాయకులు సీబీఐతో విచారణ చేయించాలి మెగా డీఎస్సీలో జరిగిన తప్పులను సరిదిద్ది అర్హులకు న్యాయం చేయడానికి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏటా ఉద్యోగాల క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసగిస్తున్నారు. మరో మూడేళ్లలో మీ పాపం పండనుంది. – వేముల అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ విద్యార్థి విభాగం ‘క్రీడల కోటా’ అభ్యర్థులకు న్యాయం జరగాలి మెగా డీఎస్సీలో ‘క్రీడల కోటా’లో దరఖాస్తు చేసిన వారికి న్యాయం చేయాలి. మెరిట్ లిస్ట్ను వెంటనే ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలి. ఎంపిక విషయాన్ని ఎందుకు అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపారో తెలియజేయాలి. కాల్ లెటర్ల విషయంలో ఎందుకు గందరగోళం జరిగింది. స్పోర్ట్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇది దగా డీఎస్సీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ దగా డీఎస్సీగా మారిపోయింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతగానితనంతో వేలాది మంది అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. లోటు పాట్లను సవరించకుండా... అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకుండా వారిపైనే దాడులకు తెగబడడం విడ్డూరంగా ఉంది. అర్హులకు న్యాయం జరగక పోతే పోరాటం ఉధృతం చేస్తాం. – పురుషోత్తం రాయల్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం -
వైభవంగా సప్తమాత్రుక జ్యోతుల ఉత్సవం
పరిగి: మండల కేంద్రంలో వెలసిన పన్నేడమ్మ (సప్తమాత్రుక) అమ్మవారి జాతర శుక్రవారంతో ముగిసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జాతర నిర్వహించడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు రోజుల పాటూ వివిధ ఆధ్యాత్మిక కొనసాగాయి. శుక్రవారం చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గోపుర కలశ ప్రతిష్ఠాపన, చండీ యాగం, మహాబలి సమర్పణ, మహా పూర్ణాహుతి, మహా నీరాజనం అనంతరం 9 గంటల నుంచి దీపోత్సవం ప్రారంభమైంది. మహిళలు జ్యోతులను సమర్పించారు. అమ్మవారి సేవలో ఉష శ్రీచరణ్ శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ పాల్గొన్నారు. తొలుత పన్నేడమ్మ ఆలయ ప్రాంగణం వరకూ జ్యోతులను తలపై పెట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం జ్యోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సప్తమాత్రుక అమ్మవారి కరుణతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాత్రి జరిగిన గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. చివరి రోజు అట్టహాసంగా సాగిన గ్రామోత్సవం తరలివచ్చిన వేలాది మంది భక్తులు -
విలేకరి ముసుగులో వసూళ్లు!
సాక్షి, టాస్క్ఫోర్స్: పరిటాల అనుచరుడినని చెప్పుకొంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ను నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ భార్గవరెడ్డినీ బెదిరింపులకు గురిచేశాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చానల్లో డాక్టర్, ఆస్పత్రి గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్ భార్గవరెడ్డి లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ను రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు డాక్టర్ తిరస్కరించడంతో ఆస్పత్రిలో హంగామా చేశాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నంద్యాల త్రీటౌన్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతనిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. హరిజన రవి చరిత్ర ఆది నుంచీ నేరమయమేనని పీఆర్ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని పరిటాల కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో చాలా చోట్ల బెదిరింపులకు పాల్పడుతూ దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని చెప్పుకుంటూ వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా తరచూ అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని పలు పట్టణాల్లోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు. ‘పరిటాల’ అనుచరుడు రవి దందా డబ్బుల కోసం నంద్యాలలో ఓ వైద్యుడికి బెదిరింపులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన నంద్యాల పోలీసులు రవి చరిత్ర అంతా నేరమయం.. -
దోచుకునేందుకే అమరావతి మంత్రం
పెనుకొండ రూరల్: ‘‘చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదు. అందుకే గతంలో వైఎస్ జగనన్న అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసి పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. పైగా ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్దకు అప్పులకు వెళ్తున్నారు. అమరావతి పేరు చెప్పి రూ.లక్షల కోట్లు దండుకుంటున్నారు. అనుచరులకు, బినామీలకు దోచిపెడుతున్నారు. అమరావతిలో నాలుగు రోడ్లకు చేసే ఖర్చును, మెడికల్ కాలేజీల కోసం వెచ్చించి ఉంటే రాష్ట్రంలోని పేద, మద్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేది. ఇది ప్రజా కంఠక ప్రభుత్వం.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమందేపల్లి మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు మహానాడు అంటూ అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారని, కానీ ఏ మహానాడులోనూ బీసీల సంక్షేమం గురించి ఆయన మాట్లాడలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు పింఛన్, కురుబల్లోని గుడికట్టు పూజార్లకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి...ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. అసలు ఈ ప్రభుత్వం బీసీలకోసం ఏం చేసిందో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సమాధానం చెప్పాలన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా వైఎస్ జగనన్న ప్రభుత్వం ఎందరో నిరుపేద చేనేతలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ హయాంలో చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం నేతన్నలకు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించలేక పోతోందన్నారు. సొంత మగ్గాలున్న యజమానులకు మాత్రమే పథకం వర్తింపజేస్తోందన్నారు. యజమాని దగ్గర మగ్గం నేసే నేతన్నలకు పథకం ఎందుకు వర్తింపజేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. విజయ్తో నీకు పోలికా..? పార్టీ స్థాపించి...ఎవరితోనూ పెత్తుపెట్టుకోకుండా ఎన్నికల్లో నిలిచి...ప్రజాభిమానంతో గెలిచి సీఎం అయిన విజయ్తో పోలిక పెట్టుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ఉషశ్రీచరణ్ హితవు పలికారు. తమిళనాడు సీఎం కమిట్మెంట్ ఉన్న నాయకుడన్నారు. బీజేపీ పొత్తుకు ఆహ్వానించినా..ఆయన ఒప్పుకోలేదన్నారు. ప్రజల కోసమే పార్టీ పెట్టాడనీ, ప్రజలకు కూడా ఆయన్ను నమ్మి ఆ పార్టీని గెలిపించారన్నారు. పొత్తులతో రాజకీయం చేసే పవన్కళ్యాణ్కు విజయ్కి చాలా తేడా ఉందన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వైఎస్సార్ సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి నోరు జారితే సహించబోమని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. మంత్రిగా ఉన్న ఆమె.. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, ఇందుకు సంబంధించిన చర్చకు వైఎస్సార్ సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సవిత...వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చింది మంచి చేయడానికి గానీ, కక్షలు రేపటానికి, తప్పుడు కేసులు పెట్టడానికి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, నాయకులు మంజు, వేణుగోపాల్, హనుమంతు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ -
42 అర్జీలకు పరిష్కారం
పుట్టపర్తి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ‘ఒక నెల–ఒక నియోజక వర్గం– నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో గతవారం అందిన అర్జీల పరిష్కారంపై చర్యలు చేపట్టారు. గత వారం 77 అర్జీలు అందగా... 42 అర్జీలను పరిష్కరించడంతో పాటు పరిష్కార పత్రాలను అర్జీలకు అందజేశారు. ముఖ్యంగా వేళ్లమద్ది పరిధిలోని ఎర్రవంకపల్లి గ్రామంలో సుదీర్ఘకాలంగా ఉన్న రస్తా సమస్యను పరిష్కరించారు. అలాగే బొగ్గలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కోసం అవసరమైన భూమిని కేటాయించారు. ఇక కురుమాల గ్రామ పొతంలో 150 ఎకరాల భూ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుండగా... రైతులకు న్యాయం చేస్తూ సదరు భూమిని రిజిస్టర్ను పూర్తిగా తొలగించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మనోజ్కుమార్రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేబుల్ కత్త్తిరిస్తూ పట్టుబడిన దొంగ
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్ కత్త్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు. ‘దుర్గం’లో పోలీసుల దందా!కళ్యాణదుర్గం రూరల్: స్థానిక అర్బన్ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు. బాలిక ఆత్మహత్య ఎన్పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. నగరంలో ఇద్దరి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చెరువులో వృద్ధురాలి మృతదేహంగార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విణ్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు. -
బడి బస్సు.. భద్రత తుస్సు!
కదిరి: జిల్లా రవాణా శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి బడి బస్సులను కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి బస్సులోనూ ఏదో ఒక లోపం బయటపడుతుండడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న జూన్ 12 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యం, నిబంధనలకు అనుగుణంగా బస్సులు ఉండాలని హెచ్చరిస్తున్నారు. బయటపడిన లోపాలెన్నో.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి మొత్తం 596 బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులు 342 బస్సులను తనిఖీ చేశారు. మరో 254 బస్సులను తనిఖీ చేయాల్సి ఉంది. తనిఖీ చేసిన వాటిలో ఇప్పటి వరకూ 183 బస్సుల్లో వివిధ రకాల లోపాలు బయటపడడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. 56 శాతం బస్సుల్లో ప్రధమ చికిత్స పెట్టెలు లేవని గుర్తించారు. 92 శాతం బస్సుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు, పరికరాలు లేవని తేలింది. 36 శాతం బస్సుల్లో హ్యాండ్ బ్రేక్ లేదని, చాలా బస్సుల్లో అత్యవపర ద్వారం వద్ద కూడా సీట్లు అమర్చినట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. 96 శాతం బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు కానరాలేదు. కేవలం 12 బస్సుల్లో మాత్రమే వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం బస్సుల్లో నాసిరకం వైరింగ్ ఉన్నందున అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకునే ప్రమాదమున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 36 బస్సులకు డ్రైవర్లుగా 60 ఏళ్లు పైబడిన వారిని నియమించుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరి కొన్ని వారాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల భద్రతపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో బడి బస్సుల నిర్వహణలో డొల్లతనం వెలుగు చూస్తుండడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కవుతున్నారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం తనిఖీల్లో వెలుగు చూస్తున్న డొల్లతనం ఖాళీగా ప్రథమ చికిత్స బాక్స్లు చాలా బస్సుల్లో తెరుచుకోని అత్యవసర ద్వారాలు నిశితంగా పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు తనిఖీలకు సహకరిస్తాం మా స్కూల్కు 3 బస్సులు ఉన్నాయి. వేసవి సెలవుల్లో అన్ని బస్సులూ కండీషన్లో ఉండేలా చిన్నపాటి మరమ్మతులు చేయిస్తున్నాం. ఫిట్నెస్ విషయంలో రాజీ పడం. ఎందుకంటే పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చే వరకూ మాదే పూర్తి బాధ్యత. అందుకే బస్సుల తనిఖీ విషయంలో రవాణాశాఖ అధికారులకు సహకరిస్తాం. – పి.సురేష్కుమార్, షిర్డీ సాయి స్కూల్, కదిరి ఫిట్నెస్ లేకుంటే చర్యలు తప్పవు వేసవి సెలవులు కావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను తనిఖీలు చేసి అందులో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం. ఫిట్నెస్ టెస్ట్ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అది బుక్కపట్నం వద్ద ఉంది. ఫిట్నెస్ పత్రాలు లేకుండా బస్సులు రోడ్డెక్కితే చర్యలు తీసుకుంటాం. – కరుణసాగర్ రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి -
దర్గా కట్ట వద్ద యువకుడి మృతి
యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
17 నుంచి కడపలో ఏపీఎల్
కడప వైఎస్పార్ సర్కిల్: ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళగిరిలో ఫైనల్స్ నిర్వహించనున్నారు. కడప వేదికగా తొమ్మిది మ్యాచ్లు... జూన్ 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులపాటు మొత్తం కడపలో 9 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందుకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. మూడేళ్ల క్రితం స్టేడియంలో రూ.8 కోట్ల వ్యయంతో ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డే అండ్ నైట్ మ్యాచ్ ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహించేలా జిల్లా క్రికెట్ సంఘం చేసిన కృషి ఫలించింది. తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తుడటంతో క్రీడాభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తుంది. మూడు వేదికల్లో ఐదో సీజన్ నిర్వహణ మంగళగిరిలో ఫైనల్స్ -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
● రూ.7.20 లక్షల నగదు స్వాధీనం మడకశిర: నియోజకవర్గ కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినటులపెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. గురువారం మడకశిర పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్యతో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ సుధీర్, సతీష్, దేవరాజ్, ఇర్ఫాన్ పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.7.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్ తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నాటుసారా విక్రేత అరెస్ట్ ధర్మవరం: మండలంలోని నేలకోటతండాకు చెందిన వడిత్యా శంకర్నాయక్ నాటు సారా విక్రయిస్తూ పట్టుబడినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐ నాగరాజు తెలిపారు. గురువారం వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు చేపట్టిన సమయంలో శంకర్నాయక్ పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు మడకశిర రూరల్: మండలంలోని జమ్మానపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో నెల్లూరుకు చెందిన వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్త గాయాలతో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జమ్మానపల్లిలో విద్యుత్ స్తంభాలకు తీగలను లాగడానికి కూలి పని కోసం వచ్చినట్లుగా సమాచారం. గురువారం రాత్రి పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై మడకశిరకు వెళుతుండగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. -
తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై ప్రభుత్వ కుట్ర
మడకశిర: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్రెడ్డి, వాగేష్ విమర్శించారు. గురువారం మడకశిరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో రాప్తాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు భద్రతను పెంచారే కానీ తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యేతోపుదుర్తి ప్రకాష్రెడ్డికి గన్మెన్లను తొలగించడాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే పరిగణించాల్సి వస్తోందన్నారు. తోపుదుర్తి రాజశేఖర్రెడ్డిపై హత్య కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడానికే కుట్ర పూరితంగా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కుట్ర పూరిత రాజకీయాలకు స్వస్తి పలకకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కక్ష సాధింపుల భాగంగానే గన్మెన్ల తొలగింపు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్రెడ్డి, వాగేష్ -
‘కూటమి’లో మళ్లీ లుకలుకలు
కదిరి: కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కదిరిలో తరచూ ఏదో ఒక విషయంలో వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తన ఇంటిముందున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ తన వాహనాలను కొన్నేళ్లుగా పార్కింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై కదిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవప్రసాద్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని గురువారం ఆలయ అధికారులను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తక్షణం ఆ స్థలాన్ని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని, లేదంటే ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నేత ఎంఎస్పైనా.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథిని కూడా జనసేన ఇన్చార్జ్ టార్గెట్ చేశారు. ఎంఎస్ పార్థసారథి ఇల్లు తిరువీధుల్లోనే ఉంది. ఆక్రమణలు తొలగిస్తే ఆయన ఇల్లు చాలా వరకూ కొట్టేయాల్సి ఉంటుంది. మురుగు కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడని, ఇలాంటి ఆక్రమణల కారణంగానే మురుగు నీరు తరచుగా ఆలయంలోకి వస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. భైరవకు ఎందుకంత కోసం? జనసేన కదిరి ఇన్చార్జ్ భైరవప్రసాద్కు ఎమ్మెల్యే కందికుంటతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథిలపై ఎందుకంత కోపంగా ఉన్నారనేది ఇప్పుడు కదిరిలో హాట్ టాపిక్గా మారింది. ఖాద్రీశుడి ఆలయ కమిటీ చైర్మన్ పదవి తనకు రాకుండా వారు అడ్డుపడ్డారని, అలాగే ఇటీవల తన భార్యతో గొడవ పడితే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై కేసు నమోదు చేయించారనే బాధ ఆయనలో ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు. మరోవైపు నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్రెడ్డిని తేరుపైకి రాకుండా ఎమ్మెల్యే పోలీసుల ద్వారా హౌస్ అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. కదిరి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన జనసేన ఇన్చార్జ్ భైరవ ఖాద్రీశుడి ఆలయం చుట్టూ ఆక్రమణలపై ఫిర్యాదు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
పుట్టపర్తి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ రాష్ట్ర అనుబంధ సంఘాల కమిటీల్లో చోటు కల్పించారు. బూత్ కమిటీల వింగ్ రాష్ట్ర సెక్రెటరీగా మడకశిరకు చెందిన జీఎస్.రంజిత్కుమార్, పంచాయతీ రాజ్ వింగ్ రాష్ట్ర సెక్రెటరీగా కదిరికి చెందిన దేశాయి భక్తవత్సలరెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కదిరికి చెందిన యనమల ఆనంద్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సెక్రెటరీలుగా పుట్టపర్తికి చెందిన టీడీ కేశవరెడ్డి, మడకశిరకు చెందిన ఎస్.రామిరెడ్డి , రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలుగా కదిరికి చెందిన పోరెడ్డి వెంకటరెడ్డి, పుట్టపర్తికి చెందిన బి.మాధవరెడ్డిలను నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వర ప్రదాయిని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2025 డిసెంబర్ 27న నిలిచిపోయిన ఇన్ఫ్లో డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రారంభమైంది. ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే జూన్ లేదా జూలైలో పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. డ్యాం నీటి మట్టం 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా.. గురువారానికి 1,588.91 అడుగులతో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 623 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 54 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,590.76 అడుగుల వద్ద 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉండి 2,574 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 131 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉండింది. ‘మహానాడు’లో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్ వజ్రకరూరు: స్థానిక మినీ కల్యాణమంటపంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో వజ్రకరూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉస్మాన్బాషా పాల్గొనడం చర్చానీయాంశమైంది. పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొనడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భక్తిశ్రద్ధలతో.. బక్రీద్ పర్వదినం
జిల్లా వ్యాప్తంగా బక్రీద్ ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్టత, మత ప్రాముఖ్యతను వివరించారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం చూపిన అపారమైన దైవభక్తి, త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో శాంతి, కరుణ, సోదరభావం పెంపొందించుకోవాలని, ఉన్నదానిలో పేదలకు సహాయం చేయడమే ఈ పండుగ యొక్క అసలైన అంతరార్థమన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం ఒకరికొకరు ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. – సాక్షిబృందం -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు తరలించారు. -
మహానాడు అట్టర్ ఫ్లాప్
● జిల్లా వ్యాప్తంగా జనాదరణ లేక వెలవెలబోయిన కార్యక్రమం ● కార్మికులను బలవంతగా తరలించిన వైనం పుట్టపర్తి టౌన్: తెలుగుదేశం పార్టీ గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు డిజిటల్ మహానాడు కార్యక్రమం నిర్వహించి పలు తీర్మానాలు చేయాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో రెండు రోజుల పాటు డిజిటల్ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, స్టిక్కర్లు, సౌండ్ సిస్టమ్తో ఏర్పాట్లను గొప్పగా చేసుకున్నారు. మెదటి రోజు అరకొరగా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండోరోజు మాత్రం పూర్తిస్థాయిలో మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. జనాదరణ లేక మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. రెండేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉపాధి హామీ కూలీలను, మధ్యాహ్నం భోజన ఏజెన్సీ పథకం కార్మికులను, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులను బలవంతగా తరలించారు. సమావేశం పూర్తి కాకుండా ఎవరూ బయటకు వెళ్లిపోకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు గేట్లకు తాళాలు వేసుకొనిమరీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు అష్టకష్టాలు పడ్డారు. పుట్టపర్తి పట్టణం సాయి ఆరామంలో పుట్టపర్తి మండలానికి సంబంధించి మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుంగా గేటుకు తాళం వేయకుండా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని జే వెంకటంపల్లిలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి తాగునీటి పైపులు కొట్టుకుపోయాయి. ఫలితంగా గ్రామస్తులు బిందెడు నీటికి బండెడు కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. పనులన్నీ మానుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మల్లికార్డునను వివరణ కోరగా వర్షానికి గ్రామంలో పైప్లైన్ దెబ్బతిందన్నారు. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, ఆ లోపు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారు. -
అధికారులపై తమ్ముళ్ల సవారీ
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలుగు తమ్ముళ్లు’ పెత్తనం చెలాయిస్తున్నారు. తాము చెప్పినట్లు వినాలని అధికారులను బెదిరిస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తే తమ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని అధికారులు ససేమిరా అనడంతో బదిలీ వేటు వేస్తున్నారు. జోరుగా లాబీయింగ్.. జిల్లా కేంద్రమైన పుట్టపర్తి మున్సిపాలిటీలో ‘తెలుగు తమ్ముళ్లు’ చెప్పిందే వేదంగా నడుస్తోంది. మాట వినని అధికారులను బదిలీపై పంపించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికే ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇటీవల కొత్తగా మరో కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. అయితే నిబంధనల ప్రకారమే తాను విధులు నిర్వర్తిస్తానని చెబుతున్నారు. కానీ ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న 25 మంది ఉద్యోగుల అంశం తెరపైకి రావడంతో కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. ఏడాదిన్నర కాలంగా పలుమార్లు విన్నవించినా ఫలితం రాలేదు. అయితే ఉన్నఫలంగా నియామకాలకు ప్రక్రియ షురూ కావడంతో కార్యకర్తలు ఎవరికి వారుగా షాడో ఎమ్మెల్యే వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులను చేర్చుకోవాలంటూ.. మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్ విభాగంలో కాంట్రాక్టు కింద సిబ్బందిని తీసుకుంటారు. అయితే ‘తెలుగు తమ్ముళ్ల’ కుటుంబాలకు చెందిన 25 మందిని చేర్చుకోవాలని నాయకులు పట్టుబట్టారు. పుట్టపర్తి షాడో ఎమ్మెల్యేగా పేరుపొందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పలుమార్లు అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే తాజాగా 25 మంది సిబ్బంది చేర్చుకోవచ్చని ఆదేశాలు జారీ కావడంతో ‘తెలుగు తమ్ముళ్ల’ మధ్య భారీ పోటీ నెలకొంది. ఏడాదిన్నర కాలంగా విఫలమైన పంతం నెగ్గడంతో శానిటేషన్ విభాగంలో చేరేందుకు భారీగా పోటీ పడుతున్నారు. అర్హత లేని వారిని సైతం చేర్చుకోవాలని సిఫారసు చేస్తుండటం గమనార్హం. పనిచేయకుండా వేతనం పొందాలనే.. శానిటేషన్ విభాగంలో ప్రస్తుతం ఉన్న వారు కూడా అంతంత మాత్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఒకసారి ఉద్యోగంలో చేరి.. అధికార పార్టీ నాయకుల సిఫారసులతో కొనసాగాలని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.18 వేల వరకు వేతనం తీసుకుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. విధులకు డుమ్మా కొట్టి వేతనాలు తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. అర్హులను తీసుకుంటారా? లేక టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పట్టం కడతారా అన్నది చూడాలి. పుట్టపర్తి మున్సిపాల్టీలో 25 మంది ఉద్యోగాలకు సిఫారసు మాట వినని కమిషనర్లపై బదిలీ వేటు కొత్త కమిషనర్ రాకతో పంతం నెగ్గించుకున్న టీడీపీ నేతలు నేటి నుంచి శానిటేషన్లో నియామకాల ప్రక్రియ షురూ నిబంధనల ప్రకారమే మున్సిపాలిటీలోని శానిటేషన్ విభాగంలోకి 25 మందిని నూతనంగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాం. ఈనెల 29వ తేదీ నుంచి ఎంపిక ప్రక్రియ మొదలు పెడతాం. అర్హత ఆధారంగానే నియామకాలు చేపడతాం. ఎలాంటి అవకతవకలకు తావు లేదు. రాజకీయ సిఫారసులకు తలొగ్గే ప్రసక్తే లేదు. – శ్రీనివాసులు, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ -
పర్యాటకం.. ఆధ్యాత్మికం
పుట్టపర్తి అర్బన్: కొండలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారి రాకపోకలతో రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల్లో సీటు దొరకడం కష్టమని భావించిన పలువురు కాస్త ఆలస్యమైనా పర్వాలేదని రైళ్లను ఆశ్రయిస్తున్నారు. తగ్గిన ఎండ ప్రభావం కొన్ని రోజుల క్రితం వరకూ ఎండలు తీవ్ర ప్రభావం చూపడంతో పర్యాటకులు రాకపోకలు తగ్గాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎండ ప్రభావం తగ్గింది. దీంతో వృద్ధులు, చంటి పిల్లలతో సహా ఇంటిల్లి పాది బస్సులు, రైళ్లతో పాటు సొంత వాహనాల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తున్నారు. పుంజుకున్న వ్యాపారాలు జిల్లాలోని పెనుకొండ కోట, లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి, ప్రసిద్ధిగాంచిన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, హేమావతి తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పర్తి యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకుంటున్నారు. వీరందరూ రైలు మార్గం ద్వారానే ప్రయాణిస్తుండడంతో ఆయా మార్గాల్లోని రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పర్యాటకుల సందడితో పుట్టపర్తిలో వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. జిల్లాలో పెరిగిన పర్యాటకుల సందడి ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు -
ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ హిందూపురం: ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని రిమాండ్ ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎన్ఎస్ఏ) కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్జైలును న్యాయమూర్తి తనిఖీ చేశారు. పలు రికార్డులు, బ్యారక్లను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి తెల్లరేషన్ కార్డు కలిగిన రిమాండ్ ఖైదీలు కోర్టులో వాదనలు వినిపించేందుకు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకునేందుకు డీఎల్ఎస్ఏకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి 24 గంటల్లోపు అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా వివక్ష ప్రదర్శిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సబ్జైలర్ హనుమప్ప, న్యాయవాదులు నవేరా, జగదీష్, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, రాజా తదితరులు పాల్గొన్నారు. ‘అనంత’ అతలాకుతలం అనంతపురం అగ్రికల్చర్: భారీ వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 78 మి.మీ, బుక్కరాయసముద్రంలో 65 మి.మీ భారీ వర్షం కురిసింది. అనంతపురం అర్బన్ 56.2 మి.మీ, కణేకల్లు 52, అనంతపురం రూరల్ 48.6, రాయదుర్గం 42.6, రాప్తాడు 38.8, బెళుగుప్ప 33.6, కుందుర్పి 22.6, కళ్యాణదుర్గం 17.4, గుమ్మఘట్ట 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 51.2 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్డ్యాంలు నిండి ప్రవహించాయి. 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు తదితర మండలాల్లో 200 హెక్టార్లలో అరటి, మామిడి, బీర, టమాట తదితర పంటలు దెబ్బతిన్నాయి. రూ.4కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
పట్టు రైతులకు వసతులు కల్పించండి
● కేంద్ర పట్టుమండలి కార్యదర్శి సభ్యుడు శివకుమార్ హిందూపురం: స్థానిక పట్టుగూళ్ల మార్కెట్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను కేంద్ర పట్టు మండలి కార్యదర్శి సభ్యులు శివకుమార్, విజయకర్ ఆదేశించారు. మార్కెట్లో నిర్మాణంలో ఉన్న పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని బుధవారం వారు పరిశీలించారు. నిర్మాణ పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు. భవన నిర్మాణానికి పట్టు మండలి ద్వారా కేంద్రం రూ.4కోట్లు, మరో రూ.4కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. రైతులకు విశాంత్రి గదులు, క్యాంటీన్ వసతి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించి, అవసరమైన సలహాలు సూచనలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టుపరిశ్రమ శాఖ ఏడీ అరుణకుమారి, జేడీ శోభారాణి, ఏపీఎస్ఎస్ఆర్డీఐ డైరెక్టర్ డాక్టర్ సీతారాములు, శాస్త్రవేత్త డాక్టర్ మురళి, అనంతపురం డీడీ ఉమామహేశ్వరరావు, హిందూపురం మార్కెట్ ఇన్చార్జ్ హంపయ్య, మడకశిర ఏడీ హనుమంతరాయ, ఆర్అండ్బీ ఇంజనీర్ మోహన్బాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఐదుగురికి తీవ్ర గాయాలు
బత్తలపల్లి: ఆటో, కారు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తన భార్యను ఆర్డీటీ ఆస్పత్రిలో వదిలి కదిరి రోడ్డు వైపుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళుతుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామం నుంచి ప్రయాణికుల ఆటో ఢీకొంది. ఘటనలో ఆటో డ్రైవర్ శివయ్య, అందులోని ప్రయాణికులు గంగాదేవి (ఏఎన్ఎం), డి.చెర్లోపల్లికి చెందిన లక్ష్మన్న, ఆత్మకూరుకు చెందిన ఓబులమ్మ, కారు నడుపుతున్న ఇంద్రకుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘పచ్చ’ కార్యకర్తల అత్యుత్సాహం ధర్మవరం రూరల్: రోడ్డుకు ఇరువైపులా లేదా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకోవడం ఏ రాజకీయ పార్టీ నాయకులైనా చేస్తుంటారు. అయితే పచ్చపార్టీ కార్యకర్తలు ఏకంగా ఏలుకుంట్ల గ్రామ సచివాలయానికి ఫ్లెక్సీ, తోరణాలు కట్టి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళితే ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని అంటున్నారు. విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతిపెనుకొండ రూరల్: విద్యుత్ షాక్కు గురై వలస కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పశ్చిమ బెంగాల్లోని మదీనాపూర్ జిల్లా సుమిత్ర పూర్ తాలూకా రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాజల్ సింగ్(46) కొంత కాలంగా పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ప్లైఓవర్ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉధయం సెల్ఫోన్కి చార్జింగ్ పెట్టే విషయంలో విద్యుత్ వైర్లును ఒక రేకుల షెడ్డు నుంచి మరో షెడ్డుకు మార్చే క్రమంలో షాక్కు గురయ్యాడు. అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న బాబ్రీసింగ్ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు కియా పీఎస్ ఎస్ఐ డి.రాఘవయ్య తెలిపారు. -
అధికారుల తీరు మెరుగుపడాలి
చిలమత్తూరు: పనితీరు మెరుగుపడకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హిందూపురం మున్సిపాలిటీ అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం హిందూపురంలోని పలు వార్డులు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన మున్సిపల్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ (సర్)లో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల మ్యాపింగ్, బుత్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్ను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ఓల ఫీల్డ్ వెరిఫికేషన్ మెరుగుపడాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎస్ఐఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిని అర్హులైన వారిని కొత్త ఓటరుగా నమోదు చేయించాలన్నారు.ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు కల్పించేలా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన 110, 113 పోలింగ్ కేంద్రాలు, 8, 9 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రీ సర్వేను వేగవంతం చేయాలి లేపాక్షి: మండలంలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలనిసంబంధిత అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. బుధవారం లేపాక్షి మండలం కల్లూరు గ్రామ సచివాలయాన్ని ఆయన తనికీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. భూముల రీసర్వే ప్రక్రియపై ఆరా తీశారు. గడువు లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం 164వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కుమార్స్వామిరెడ్డి, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ -
నేడు బక్రీద్
ప్రశాంతి నిలయం: త్యాగ నిరతికి, అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్–ఉల్–ఆదా)ను ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం ఖబ్రస్థాన్లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాట్లు చేశారు. ముస్లింలకు కలెక్టర్ పండుగ శుభాకాంక్షలు.. జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ త్యాగానికి, దాతృత్వానికి ప్రతీక అన్నారు. ఈ నెల 31లోపు బ్యాంకు ఖాతా తెరవాలి పుట్టపర్తి అర్బన్: ఇంటర్లో చేరే విద్యార్థులు ‘తల్లికి వందనం’ పొందాలంటే ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా షెడ్యూల్ కులాల సాధికారత అధికారి రెడ్డి బాలాజి సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తల్లికి వందనం’ పథకం నిధులు జూన్లో విడుదలయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఇంటర్లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు లేదా పోస్టాఫీస్లలో నూతన ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఈ ఖాతాను ఎన్పీసీఐ లింక్ చేయించడం ద్వారా మాత్రమే తల్లికి వందనం ప్రయోజనాలు అందుతాయన్నారు. కళాశాల యాజమాన్యాలు, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది విద్యార్థి పేరు మీద తప్పని సరిగా ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
బక్రీద్కు కట్టుదిట్టమైన భద్రత
హిందూపురం: త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగను ముస్లిం కుటుంబాలు శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హిందూపురంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా పట్టణంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు, పోలీసు పికెట్లును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని ముఖ్య ప్రార్థనా మందిరాలు, ఈద్గాలను పరిశీలించి మతపెద్దలతో మాట్లాడారు. ప్రార్థనల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలోని పీస్ కమిటీ సభ్యులు, మత పెద్దలతో సమావేశమై పలు సూచనలు చేశారు. పండుగను అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దన్నారు. పండుగ సందర్భంగా పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు జనార్దన్, ఆంజనేయులు, రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన.. గోరంట్ల: బక్రీద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం ఏఎస్పీ అంకిత సురాన, సీఐ శేఖర్తో కలిసి స్థానిక ఈద్గాతో పాటు పలు మసీదులను సందర్శించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాటు చేయాలని సీఐ శేఖర్ను ఆదేశించారు. ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ వాహనాలను నిర్ణీత ప్రదేశంలోనే నిలపాలని ముస్లింలకు సూచించారు. హిందూపురంలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ సతీష్కుమార్ -
తాగునీటి కోసం సచివాలయం ముట్టడి
అమరాపురం: మండల పరిధిలోని ఉదుగూరు గ్రామంలోని ఆర్డీటీ కాలనీ వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి పోరుబాట పట్టారు. కాలనీలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చినా స్పందించని అధికారుల వైఖరిని నిరసిస్తూ ఖాళీ బిందెలతో బుధవారం సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వార్డు మాజీ సభ్యుడు శివన్న, మహిళలు గంగమ్మ, భాగ్యమ్మ, చంద్రమ్మ, లోకమ్మ తదితరులు మాట్లాడారు. ఆర్డీటీ కాలనీలో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, నెలరోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. దీంతో తాము వ్యవసాయ బోరు బావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. తమ సమస్యను కార్యదర్శికి తెలిపినా స్పందన కరువైందన్నారు. అందువల్లే సచివాలయం ముట్టడించామన్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని, లేదంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఉదుగూరులో తాగునీటి కోసం మహిళల పోరుబాట -
దంచేసిన వాన
పుట్టపర్తి అర్బన్: భనుడి భగభగలతో అల్లాడిపోయిన జిల్లా వాసులపై వరుణుడు కరుణ చూపాడు. నైరుతికి ముందే కరువు తీరా వర్షించాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా వాగులు, వంకలు, చెక్డ్యాంలు నిండి ప్రవహించాయి. 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులకు అరటి, మామిడి, బీర, టమాటా తదితర పంటలు ఉద్యాన పంటలు తిన్నాయి. చాలాచోట్ల పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లు పాక్షకింగా దెబ్బతినడంతో ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ● పుట్టపర్తి మండలం రాయలవారిపల్లి నుంచి పుట్టపర్తికి రావాలంటే చిత్రావతి నది దాటాల్సి ఉంది. బ్రిడ్జి కింద వర్షపునీరు భారీగా చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గాలివానకు ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని భారీ వృక్షం కూకటివేళ్లతో సహా ఆస్పత్రి భవనంపైకి పడింది. ● బత్తలపల్లి మండలం సంజీవపురం కాలనీలోకి వర్షపునీరు రావడంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అక్కడే ఉన్న ఆలయంలోకి సైతం వర్షపునీరు చేరింది. ● తాడిమర్రి మండలం దాడితోటలో పాత రేకుల షెడ్డు కూలింది. గోడలు కూలడంతో 5 గొర్రెలు మృతి చెందాయి. మరో 5 గొర్రెలకు, ఓ ఎనుముకు కాళ్లు విరిగాయి. దీంతో రూ.1.3 లక్షలు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరి కుళ్లాయప్ప తెలిపారు. ● ఇక కదిరిలో వడగళ్ల వాన దంచేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆలయంపై పిడుగు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ● ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. హిందూపురంలో అత్యధిక వర్షపాతం మంగళవారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి చినుకుచినుకుగా ప్రారంభమైన వాన..ఆ తర్వాత జోరందుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ కురుస్తూనే ఉంది. ఒక్క అగళి మండలంలో తప్ప జిల్లాలోని 31 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా హిందూపురం మండలంలో 54.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే నల్లచెరువు మండలంలో 54.2 మి.మీ, తలుపుల 47.4 మి.మీ, నల్లమాడ 47.2 మి.మీ, గాండ్లపెంట 46.4, కదిరి 45.2, గోరంట్ల 45.2, పుట్టపర్తి 42.6, కనగానపల్లి 42.4, బుక్కపట్నం 39.6, సీకేపల్లి 38.8, తనకల్లు 37.8, కొత్తచెరువు 32.8, రామగిరి 32.6, ధర్మవరం 32.4, లేపాక్షి 27.0, అమరాపురం 25.8, చిలమత్తూరు 25.8, అమడగూరు 25.2, పెనుకొండ 24.6, ఎన్పీ కుంట 22, సోమందేపల్లి 21, పరిగి 19.6, బత్తలపల్లి 18.4, ఓడీచెరువు 18.2, రొద్దం 11.2, తాడిమర్రి 10.2, ముదిగుబ్బ 9.6, మడకశిర 8.6, రొళ్ల 8.2, గుడిబండ మండలంలో 7.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో మొత్తం 922 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగుకు అనుకూలం.. తాజా వర్షాలు ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావడానికి ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు లోతుగా దుక్కులు చేసుకోవడంతో గత ఖరీఫ్ పంట అవశేషాలు తొలగించుకుని సాగుకు సిద్ధం కావాలని సూచించారు. ఎల్–నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారాంతం లేదా రెండో వారం మొదట్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాల్లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కూలిన ఇళ్లు.. నేలవాలిన కరెంటు స్తంభాలు -
ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే.. కార్డు రద్దు!
ప్రశాంతి నిలయం: రేషన్ కార్డుదారులు జూన్ 2వ తేదీలోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని, లేకపోతే కార్డులు రద్దు చేస్తామని జేసీ మౌర్య భరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... అధికారులు కార్డుదారుల ఈ–కేవైసీ పూర్తి చేయడాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను గడువులోపు పరిశీలించి పూర్తి చేయాలని సీఎస్డీటీలను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ, రేషన్ పంపిణీ, అక్రమ రవాణా, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల తనిఖీ నిరంతరం కొనసాగాలన్నారు. అనంతరం హాస్టళ్లలో వసతులు, ఐసీడీఎస్ పరిధిలోని వివిధ పథకాల అమలు, ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, మధ్యాహ్న భోజనం అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి సన్నిధిలో సినీ నటులు ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం సినీ నటులు రాధిక, శరత్కుమార్ బుధవారం సాయంత్రం పుట్టపర్తికి విచ్చేశారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారు నేరుగా శాంతి భవన్ చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం దర్శన వేళల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వారికి ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు. ‘పసుపు’ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు ● టీడీపీ కార్యకర్తలతో కలిసి కూడేరు సీఐ హల్చల్ సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీ ‘పసుపు పండుగ’ మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులు తరించారు. బుధవారం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో నాయకులు, కార్యకర్తల మధ్యలో సీఐ రాజు ఆశీనులయ్యారు. అంతేకాదు సెల్ఫీలు దిగి.. కేకులు కట్ చేశారు. దీంతో ఖాకీ ముసుగులోని ‘పసుపు రంగు’ను ప్రదర్శించినట్లయ్యింది. గతంలో కూడేరు పోలీస్స్టేషన్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చడం విమర్శలకు దారి తీసింది. అప్పట్లో సీఐ తీరును ఎండగడుతూ అనంతపురంలో ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించింది. అయినా సీఐ తన పద్ధతి ఏమాత్రమూ మార్చుకోకుండా మహానాడులో ‘పసుపు’ కార్యకర్తల భుజాలపై చేతులు వేసుకుని హల్చల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసుపు జెండాలు కట్టిన ‘పంచాయతీ’ ఉరవకొండలోని దేవాంగ కల్యాణ మండపం, టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఆవరణమంతా టీడీపీ జెండాలు కట్టారు. పంచాయతీ మేసీ్త్రలు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వ జీతం తీసుకుని పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తించకుండా రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. -
31న జిల్లా ఫుట్బాల్ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 31న జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాలుర ఫుట్బాల్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్ బుధవారం వెల్లడించారు. సబ్ జూనియర్ విభాగంలో 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్య జన్మించిన వారై ఉండాలి. జూనియర్స్ విభాగంలో 2011 జనవరి నుంచి 2012 డిసెంబర్ మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మూడు ఫొటోలు, తల్లితండ్రుల సమ్మతి పత్రం తీసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు క్రీడా మైదానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 80995 98958 లో సంప్రదించవచ్చు. -
ఆచరణలో విఫలం
ప్రతి పల్లెకూ సదుపాయం..మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికీ సెల్ఫోన్ సేవలను విస్తరిస్తున్నట్లు గొప్పగా ప్రకటించిన భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆచరణలో మాత్రం విఫలమైంది. ఉమ్మడి జిల్లాలోని 38 గ్రామాల్లో 4జీ బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 18న ప్రకటన విడుదల కాగా, ఆరు నెలలు కావస్తున్నా... నేటికీ ఒక్కటంటే ఒక్క టవర్ కూడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. రొళ్ల: మానవ జీవన విధానాన్ని, సమాచార వ్యవస్థను సెల్ఫోన్ సమూలంగా మార్చేసింది. తొలి దశలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితమైన పరికరం.. నేడు అరచేతిలో యావత్ ప్రపంచాన్నే ఇమిడి పోయేలా చేసింది. ఇంటర్నెట్, బ్యాంకింగ్, కెమెరా, వినోదం వంటి సకల సౌకర్యాలను అందించే స్మార్ట్ఫోన్గా మారింది. వంద గ్రాముల బరువున్న ఈ డబ్బా మానవ జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతాఇంతా కాదు. ఈ క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ సిమ్ కార్డు ప్రొవైడర్లు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన సేవలను వినియోగదారులకు చేరువ చేసేందుకు పోటీ పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్ఎన్ఎల్ మాత్రం పూర్తిగా చతికిలపడింది. 5జీ సాంకేతిక విప్లవం దుమారం లేపుతున్న ప్రస్తుత రోజుల్లోనూ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను సక్రమంగా అందించలేకపోతోంది. బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు సెల్ఫోన్ వినియోగదారులకు సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రైవేట్ నెట్వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్టెల్, వోడా అందుబాటులోకి తెచ్చాయి. రీచార్జ్ ధరలు తక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. అయితే తరచూ నెట్వర్క్ సమస్య తలెత్తడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ అందక గ్రామీణులు కొండల పైకి ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ నుంచి ప్రైవేట్ సిమ్ కార్డుల వైపు దృష్టి సారించారు. దీంతో బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 గ్రామాల్లో 4జీ టవర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 18న ప్రకటన విడుదల చేసింది. అయితే దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ కనీసం టవర్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని కూడా గుర్తించలేదు. ఇప్పటికై నా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 38 గ్రామాలకు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు మంజూరైనట్లు ప్రకటన ఆరు నెలలు కావస్తున్నా ఏర్పాటు కాని వైనం నెట్వర్క్ సమస్యతో వినియోగదారులకు తప్పని ఇబ్బందులు అత్యవసర సమయంలో కొండ గుట్టలను ఆశ్రయిస్తున్న దుస్థితి ఉత్తర్వులు రాలేదు రొళ్ల మండల వ్యాప్తంగా నెట్వర్క్ సమస్య ఉన్న గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, దాసప్పపాళ్యం, పిల్లిగుండ్ల గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే సెల్ టవర్ల ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఆదేశాలు అందితే వెంటనే స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేస్తాం. – చంద్రశేఖర్, ఇన్చార్జ్ తహసీల్దార్, రొళ్ల మండలం -
ఉమ్మడి పాసుబుక్కు.. ఇదేమి చిక్కు?
కదిరి: రైతుల పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు.. ‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్న చందంగా ఉంది. ప్రతి గ్రామంలో ఒక సర్వే నంబర్ పరిధిలో ఎంతమంది రైతులుంటే వారందరికీ కలిపి ఉమ్మడి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడంతో బాధలు వర్ణనాతీతం. వాటిని చూసి రైతులు అవాక్కవుతున్నారు. 10, 20 మంది రైతుల భూముల వివరాలన్నీ అందులో కనబరచడంతో తమకు సంబందించిన భూముల వివరాలు ఎక్కడున్నాయో.. తమకు ఎంత భూమి ఉందోకూడా తెలుసుకోవడం కష్టంగా మారింది. ఉమ్మడి ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్)తో రైతులు భూములు అమ్ముకోవడానికి, కొనడానికి లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, దాయాదుల మధ్య ఏకాభిప్రాయం లేని చాలా చోట్ల వ్యవసాయం, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు గొడవలు పడాల్సి వస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్ని.. దాయాదులందరికీ ఒకే పాసుబుక్ మంజూరు గొడవలకు దారి తీస్తున్న చంద్రన్న సర్కారు తీరు పంట రుణాల రెన్యూవల్కు రైతుల ఇబ్బందులు సచివాలయంలో సంప్రదించాలి జాయింట్ ఎల్పీఎంలు వేరు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లి నిర్దేశించిన డబ్బు చెల్లిస్తే సంబంధిత సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎల్పీఎం సమస్య పరిష్కరిస్తారు. తర్వాత క్రయ,విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సమస్యలు ఉండవు. – మౌర్య భరధ్వాజ్, జేసీ ఏ ఊరికెళ్లినా అదే మాట పట్టాదారు పాసుపుస్తకంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మను చూసి జీర్ణించుకోలేక చంద్రబాబు ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త పాసుబుక్కులిచ్చింది. అందులో ఎవరి భూమి ఎంత ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. వాటిని బ్యాంకు రుణాల రెన్యూవల్కు తీసుకెళ్తే బ్యాంకర్లు ఒప్పుకోవడం లేదు. –రైతు శ్రీధర్రెడ్డి, నల్లచెరువు -
తోపుదుర్తి కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పెనుకొండ రూరల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. అందులో భాగంగానే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇటీవల ప్రకాశ్ రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా కక్షపూరితంగా తొలగించారన్నారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం ప్రశాంతినిలయం: ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్డీ చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీంకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్డ్ కులాలు, డీ నోటిఫైడ్ సంచార తెగలు, సెమీ సంచార తెగలు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, సంప్రదాయ కళాకారుల వర్గాల్లో తక్కువ ఆదాయం కలిగిన వారి పిల్లలు ఇందుకు అర్హులు. ఈ పథకం కింద 125 కొత్త స్కాలర్షాప్లు మంజూరవుతాయి. https:// nosmsje.gov.in ద్వారా జూన్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చేసిన దరఖాస్తుల్లో సవరణలకు జూన్ 4 నుంచి 7వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. 55 మంది మంది గైర్హాజరుపుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో హిందీ పరీక్ష జరిగిందని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. 200 మందికి గానూ 200 మంది హాజరుకాగా, 20 మంది గైర్హాజరయ్యారన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 106 మందికి గాను 71 మంది హాజరు కాగా 35 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 55 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇంటర్ పరీక్షల్లో 127 మంది... పుట్టపర్తి: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 127 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 32 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులకు బయాలజీ, గణితం ఒకేషనల్ విద్యార్థులకు పేపర్–3 పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,263 మందికి గాను 1,195 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 988 మందికి గాను 929 మంది విద్యార్థులు హాజరు కాగా 59 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులుప్రశాంతినిలయం: కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీ లోపు https://apsportsschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారన్నారు. అనంతలో భారీ వర్షంఅనంతపురం క్రైం: భారీ వర్షం అనంతపురాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నవోదయ కాలనీలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణం, లక్ష్మీనగర్, కోవూరునగర్, జీసస్ నగర్, అశోక్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్టు కొమ్మలు విరిగి పడటంతో లక్ష్మీనగర్లో విద్యుత్ స్తంభం నేలకూలింది. జీసస్ నగర్లో కూలిన భారీ వృక్షం కారణంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
గెలిచి.. గాలికి విడిచి
పుట్టపర్తి: ‘ఏరుదాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడిమల్లన్న’ అన్నట్లుంది హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం ఎమ్మెల్యేల తీరు. ఎన్నికల ముందు ఏవేవో చెప్పిన వారు నేడు ప్రజలకు అసలు అందుబాటులోనే ఉండడం లేదు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్లో ఉంటూ సినిమా షూటింగ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలియడం లేదు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం, అమరావతిలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర అనంతపురంలో ఉంటూ అప్పుడప్పుడూ తన మామ వెంట పుట్టపర్తికి వస్తూ వెళ్తున్నారు. పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన సవిత అమరావతి, హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. కదిరి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నా ఉపయోగం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో వారి పీఏలు స్థానికంగా అధికారం చెలాయిస్తూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యకూ డబ్బుతో ముడిపెట్టి అందినంత లాగేస్తున్నట్లు తెలిసింది. పట్టించుకునే నాథుడే లేడు.. జిల్లావ్యాప్తంగా సమస్యలు తాండవం చేస్తున్నాయి. రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. చలానా కట్టి నెలలు గడిచినా విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేత సబ్సిడీలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశనిస్పృహల్లో కూరుకుపోయారు. తాగునీటి ఎద్దటి తీవ్రతరం కావడంతో గ్రామీణులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దిక్కుతోచని స్థితిలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అండగా నిలిచి రూపాయి ఖర్చు లేకుండా సమస్యలను చక్కబెట్టేవారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, సర్టిఫికెట్లు ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందజేసేవారు. అర్హులైతే చాలు పథకాల లబ్ధి చేకూర్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి తలకిందులు కావడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చుట్టపుచూపుతో సరి ప్రజల బాధలు పట్టని ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు గెలిచాక పంగనామాలు కష్టాలు కొని తెచ్చుకున్నామని ప్రజల ఆగ్రహావేశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు 5 సంవత్సరాల పాటు తమ బాగోగులు చూసుకుంటారని, ఏ సమస్య వచ్చినా తీరుస్తారని నమ్మితే నట్టేట ముంచారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పంగనామాలు పెట్టారు. చుట్టపుచూపుగా వస్తూ పోతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే సూపర్ సిక్స్ పథకాలు, గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు, పంట నష్ట పరిహారాలపై నిలదీస్తారనే భయంతోనే జంకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికేతరులకు పట్టం కట్టిన పాపానికి కష్టాలు కొని తెచ్చుకున్నట్లయిందని జిల్లా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా గెలిపించింది..? తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, జాతర్లు, ఆలయాల్లో పూజలు, విగ్రహ ప్రతిష్టలకు ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. అనుకోకుండా నియోజకవర్గాల్లో ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహిస్తే హామీలపై మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తూ ఆనందం పొందుతున్నారు. నెలకోసారి ఆర్భాటంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నా వాటిలో 10 శాతం కూడా పరిష్కారం కావడం లేదు. ఎవరైనా తమకు సంక్షేమ పథకాలు అందలేదు.. సమస్యలు వినండి అంటే వారిపై దాడులు చేయించడం, అధికార బలంతో కక్ష సాధింపులకు దిగుతుండడంతో ఇందుకేనా గెలిపించింది అంటూ ప్రజలు మండిపడుతున్నారు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
పరిగి: మండలంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. స్థానిక అవసరాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వాదాయానికి అక్రమార్కులు గండికొడుతున్నారు. పరిగి, శ్రీరంగరాజుపల్లి, శాసనకోట, నేతులపల్లి, బాలిరెడ్డిపల్లి, పైడేటి, గణపతిపల్లి, పైడేటి, ఊటుకూరు తదితర ప్రాంతాల్లోని పెన్నా, జయమంగళి నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయమే మోదా పంచాయతీ గ్రామ శివారులో ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉచితం మాటున ఇలా అక్రమార్జనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి పెనుకొండ రూరల్: పని ప్రాంతంలో విద్యుత్ షాక్ గురై ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లికి చెందిన వేణుగోపాలరెడ్డి (45)కి భార్య, అనిత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వేణుగోపాలరెడ్డి మంగళవారం ఓ రైతు పొలంలోకి ఎరువును తోలెందుకు వెళ్లాడు. పొలంలో ఎరువును అన్లోడ్ చేసే క్రమంలో ట్రాలీ పైకెత్తడంతో పైనున్న విద్యుత్ తీగలు తగలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం పట్టివేతపెనుకొండ రూరల్: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కియా పీఎస్ ఎస్ఐ డి.రాఘవయ్య తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం అనంతపురం నుంచి బెంగళూరుకు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ధాన్యం తరలింపులకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో డ్రైవర్ ప్రకాష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్డీటీ ప్రభావతికి అప్పగించారు. పోలీసునని బెదిరించి.. విద్యార్థినిపై అత్యాచారయత్నం అనంతపురం సెంట్రల్: నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో ఉన్న వనమిత్ర పార్కులో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం యత్నం ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రూరల్ పరిధిలోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి, యువకుడు సోమవారం అటవీశాఖకు చెందిన వనమిత్రపార్క్కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వారిని నిలువరిస్తూ తాను పోలీసునని, స్టేషన్కు పదండి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామంటూ దబాయించాడు. దీంతో తాము విద్యార్థులమని వారు చెప్పుకొచ్చినా వినకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఒకానొక సమయంలో యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో యువకుడు గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి సదరు వ్యక్తి జారుకున్నాడు. ఘటనపై వన్టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా, యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అనంతపురానికి చెందిన హరిగా పోలీసులు గుర్తించారు. వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. స్వర్ణకారుడి ఇంట్లో చోరీ గుంతకల్లు టౌన్: స్థానిక భాగ్యనగర్లో నివాసముంటున్న జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు ఎం.ఖాదర్బాషా ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో దాచిన 7.5 తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... ఖాదర్బాషా చిన్నమ్మ ఫాతిమాబీ 10 రోజుల క్రితం తన బంధువుల ఊరికి వెళ్తూ తనకు సంబంధించిన 7.5 తులాల బంగారు నగలను బీరువాలో భద్రపరచాలని ఖాదర్బాషాకు అప్పగించి వెళ్లారు. ఈ నెల 23న తిరిగి వచ్చిన ఆమెకు నగలు ఇచ్చేందుకు బీరువా తెరిచి చూడగా కనిపించలేదు. ఆందోళనకు గురైన ఖాదర్బాషా కుటుంబసభ్యులను ఆరాతీసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. -
వెంటాడి.. వేటాడి
బత్తలపల్లి: సినిమాలో గూండాలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేసే సీన్లను తలపించేలా పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు మంగళవారం తెల్లవారుజామున జాతీయ హదారిపై 60 కిలోమీటర్ల మేర పందుల దొంగల వేట ఉత్కంఠను రేపింది. గత రెండేళ్లుగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు పందుల దొంగతనాలు చేస్తూ కలకలం రేపుతుండగా.. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘటనతో దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. ప్రత్యక్ష సాక్షులు, బత్తలపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... పులివెందుల వాసి అంజినప్పకు సంబంధించిన పందులను గత రెండేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు అపహరించుకుని పోతున్నారు. సీసీ కెమెరాల్లో, ఇతరత్రా పరిశీలించినప్పుడు వాహనాలకు నంబర్ లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టమైంది. అయితే.. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంజినప్పకు చెందిన పందులను బొలెరో వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా, యజమాని బంధువైన ఓ పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా ఉన్న ఆ వాహనాన్ని గుర్తించారు. వెంటనే ఆయన అంజినప్పకు సమాచారం అందించారు. అంజినప్ప తక్షణమే పులివెందుల పోలీసులకు తెలియజేశాడు. దీంతో అంజినప్ప, పోలీసులు వేర్వేరుగా దొంగలను వెంబడించారు. దాడులు చేస్తూ తప్పించుకునే యత్నం తమను వెంబడిస్తున్న వాహనాలపైకి దొంగలు రాళ్లతోనూ, బీరు సీసాలతోనూ దాడులకు దిగారు.అప్పుడప్పుడు పందులను ఆ వాహనాలపైకి వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అంజినప్ప బంధువైన పులివెందుల కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. మార్గమధ్యంలోని ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఎదురుపడ్డ రెండు ద్విచక్ర వాహనాలను సైతం పందుల దొంగల వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ముదిగుబ్బ వైపునకు దొంగల వాహనం వెళుతుండడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముదిగుబ్బ వద్ద కూడా పోలీసుల కళ్లుగప్పి దొంగలు బైపాస్ మీదుగా బత్తలపల్లి వైపు పరారయ్యారు. దీంతో ముదిగుబ్బ సీఐ శివరాముడు వెంటనే ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్గౌడుకు సమాచారం ఇచ్చారు. ఆయన బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, పోలీసులను అప్రమత్తం చేశారు. సిబ్బందితో కలిసి ఎస్ఐ టోల్గేట్ వద్ద కాపు కాశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగలు జాతీయ రహదారి వదిలేసి గుమ్మల్లకుంట ఎస్సీ కాలనీ మార్గంలో గంటాపురం గ్రామంలోకి వెళ్లి, అక్కడి నుంచి బైపాస్కు చేరుకున్నారు. వెంబడిస్తున్న పోలీసులు బత్తలపల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు గంటాపురం వద్దకు చేరుకున్నారు. ఆలోపు బైపాస్ చేరుకున్న దొంగల వాహనం ఎలాగైనా తప్పించుకునే అవకాశముందని భావించిన యజమాని అంజినప్ప ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. పందుల దొంగల కోసం సినీ ఫక్కీలో వేట పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు కొనసాగిన ఛేజింగ్ యజమాని సాహసం.. పోలీసుల చాకచక్యం ఏడుగురు దొంగల పరారీ.. ఒకరిని బంధించిన పోలీసులు -
లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి
అగళి: రోడ్డు పక్కన ఆపిన లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోలీసులు తెలిపిన మేరకు... కర్టాటకలోని సిరా పట్టణం కోటేలో నివాసముంటున్న దంపతులు తిప్పేస్వామి(60), జయమ్మ రొళ్ల మండలం వట్టేబెట్ట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు అగళి మండలం పి.బ్యాడగెర సమీపంలోకి చేరుకోగానే జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపిన లారీని ఢీకొన్నారు. ఘటనలో తిప్పేస్వామి తలకు, భుజంపై బలమైన రక్తగాయాలయ్యాయి. జయమ్మ తలకు రక్త గాయమైంది. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సిరాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో తుమకూరు ఆస్పత్రిలో తిప్పేస్వామి మృతి చెందాడు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై అగళి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమ్మా.. అంతా క్షేమమేనా!
● మహిళలతో ఎస్పీ సతీష్కుమార్ ఆరా ● ధర్మవరంలో పలు కాలనీల్లో పర్యటన ధర్మవరం అర్బన్: ‘అమ్మా క్షేమంగా ఉన్నారా.. మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలున్నాయా.. ఎవరైనా వేధిస్తున్నారా.. రాత్రివేళ మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారు ఉన్నారా... ఎలాంటి భయం లేకుండా పోలీసులకు సమాచారం ఇస్తే మీకు రక్షణగా మేముంటాం’ అంటూ ఎస్పీ సతీష్కుమార్ భరోసానిచ్చారు. మంగళవారం ధర్మవరంలోని తిక్కస్వామినగర్, శివానగర్, నేసేపేట, మాధవనగర్, దర్గాసర్కిల్, లోనికోట, చెరువుకట్ట, లక్ష్మీచెన్నకేశవపురం, మహాత్మాగాంధీ కాలనీల్లో ఎస్పీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. మహిళల భద్రత, సంఘ విద్రోహ కార్యకలా పాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, యువతపై ప్రభావం చూపుతున్న పరిస్థితులు, ప్రజా భద్రత అంశాలపై ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, ఈవ్ టీజింగ్, బెదిరింపులు తదితర సమస్యలను ఆలస్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీస్శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంతతకు భంగం కలిగించే సంఘ విద్రోహశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికలకు భరోసా కల్పించేలా ఫీల్డ్ విజిట్స్ను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం ధర్మవరం చెరువును ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూ టౌన్ సీఐ రెడ్డెప్ప, ఎస్ఐలు ఉమాదేవి, వీరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
పుట్టపర్తి అర్బన్: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్ రైలు కింద పడి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న అతన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుడిని కొత్తచెరువుకు చెందిన బద్వేలు అర్షాద్ 928)గా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఓ యువతితో వివాహం కాగా, రెండేళ్ల క్రితం మతపరమైన విడాకులు పొందాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేక బాధపడుతుంటే కుటుంబసభ్యులు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్షాద్ నేరుగా పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ల్యాప్టాప్ దొంగ అరెస్ట్ ధర్మవరం అర్బన్: స్థానిక శివానగర్ సచివాలయంలో ల్యాప్టాప్ను అపహరించిన దొంగను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. సచివాలయం పరిధిలో నివాసముంటున్న ఓ మైనర్ బాలుడు ఆదివారం రాత్రి సచివాలయం తాళాన్ని ఇనుప రాడ్తో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించాడు. అనంతరం ల్యాప్టాప్, ట్యాబ్ను అపహరించి, ఇంటికి చేరుకున్న తర్వాత వేలి ముద్రల ఆధారంగా తనను పోలీసులు గుర్తిస్తారనే భయంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసుకెళ్లి సచివాలయంలో తాను తాకిన ప్రాంతాల్లో పోసి నిప్పుపెట్టాడు.సీసీ కెమెరా ఫుటేజీలు, పక్కా సమాచారంతో మంగళవారం ఎర్రగుంట సర్కిల్లో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని, ల్యాప్టాప్, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. లారీ ఢీ – రైతు మృతి గార్లదిన్నె: మండలంలోని ఎగువపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన రైతు పెద్ద ఓబయ్య (80) మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జాతీయ రహదారికి అవతలి వైపు ఉన్న తన పొలానికి రోజూ కాలి నడకన వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలానికి వెళ్లిన ఓబయ్య... అక్కడ పని ముగించుకుని ఇంటికి వెళుతూ.. జాతీయ రహదారిపై రైస్ మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుత్తి వైపుగా వెళుతున్న హర్యానాకు చెందిన లారీ ఢీకొంది. పెద్ద ఓబయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ ఆచూకీ కోసం గాలిస్తుండగా కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద ఆపి డ్రైవర్ పరారైనట్లుగా గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భక్తుల ఇలవేల్పు సప్తమాత్రుక అమ్మవారు
పరిగి: మండల కేంద్రంలో వెలసిన పురాతన ఆలయం సప్తమాత్రుక అమ్మవారి (పన్నాడమ్మ) ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఇక్కడి ప్రజలు కొలుస్తుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయానికి మండలంలోనే కాకుండా కర్ణాటక ప్రాంతంలోను పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 ఏళ్ల తర్వాత ఉత్సవం పరిగి చెరువు కట్ట కింద వెలసిన సప్తమాత్రుకాదేవి ఆలయంలో సాధారణ నిత్య పూజలే కాకుండా కార్తీక మాస పూజలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా గత పదకొండేళ్లుగా ఉత్సవాలకు బ్రేక్ పడింది. పరిగి చెరువులో నీరుండడమే ఇందుకు కారణం. చెరువులో నీరుంటే అమ్మవారికి జాతర నిర్వహించరని ఆలయ కమిటీ సభ్యులు. ఈ క్రమంలో ఇటీవల చెరువు ఖాళీ కావడంతో జాతరను నిర్వహించేందుకు సన్నద్ధమయినట్లు పేర్కొన్నారు. దాసన్నకు ఇచ్చిన హామీకి కట్టుబడి... మహిమాన్వితురాలిగా పేరుగాంచిన సప్తమాత్రుక అమ్మవారు పరిగిలో వెలిసేందుకు ఓ పురాణగాథ నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం పరిగి చెరువు వర్షాలతో నిండిపోయింది. ఆ సమయంలో కట్ట తెగిపోయే పరిస్థితి ఉండడంతో గ్రామానికి చెందిన దాసన్న అనే నీరుగంటికి అమ్మవారు కలలో కనిపించి చెరువు కట్ట కింద ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజలు తమ సొంతూళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చాటింపు వేసి రావాలని ఆదేశాలిచ్చింది. అయితే తాను చాటింపు వేసి వచ్చే లోపు గ్రామాలన్నీ జలమయం కాకుండా తనకు రక్షణ కల్పించాలని దాసన్న కోరడంతో అమ్మవారు అందుకు సమ్మతించారు. చాటింపు వేసి తిరిగి పరిగికి వచ్చే వరకూ తాను చెరువు కట్ట తెగకుండా రక్షణ కల్పిస్తానని భరోసానిచ్చారు. దీంతో అతను గ్రామగ్రామాన చాటింపు వేస్తూ చివరగా ఓ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ చాటింపు అనంతరం అమ్మవారు ఇచ్చిన మాటను గ్రహించిన స్థానికులు దాసన్న వెనుదిరిగి వెళితే చెరువు కట్ట తెగిపోతుందని, అతను ఎన్నటికీ పరిగికి వెళ్లకూడదని నిర్ణయించుకుని చంపేశారు. అప్పటి నుంచి దాసన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేటికీ చెరువు కట్ట తెగకుండా అమ్మవారు కాపాడుతూ వస్తోందని భక్తులు విశ్వసిస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకూ సప్తమాత్రుక అమ్మవారి ఆలయంలో జాతరను నిర్వహించనున్నారు. 27న అంకురార్ఫణ, ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 28న విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 29న కలశ ప్రతిష్ఠాపన, చండీయాగం, దీపోత్సవం, గ్రామోత్సవంతో వేడుకలు ముగుస్తాయి. కొంగు బంగారమై విరాజిల్లుతున్న పన్నాడమ్మ ఆలయం నేటి నుంచి మూడ్రోజుల పాటు జాతర -
వినతుల వెల్లువ
● ‘పరిష్కార వేదిక’కు 336 అర్జీలు ప్రశాంతి నిలయం: ఒకే సమస్య.. అర్జీ ఇవ్వడం.. అధికారులు ఆన్లైన్లో మాత్రం పరిష్కారం చూపడం.. దీంతో బాధితులు మళ్లీ అదే సమస్యపై అర్జీలు పట్టుకుని కలెక్టరేట్కు రావడం మామూలై పోయింది. అందుకే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో సమస్యల పరిష్కారించిన అర్జీల సంఖ్య మాత్రం వేలల్లో ఉంటున్నాయి. తాజాగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లోనూ అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు 336 అర్జీలు అందజేశారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య తదితరులు అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎప్పటిలాగే వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమవేశమై అర్జీల పరిష్కారంపై దిశా నిర్దేశం చేశారు. ‘పరిష్కార వేదిక’ ద్వారా అందే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి సమస్యనూ పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, రీఓపెనింగ్, గడువు దాటకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. కదిరి ఆర్డీఓగా కళావతి కదిరి: నూతన ఆర్డీఓగా కళావతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఆమె ఒంగోలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన భూసేకరణ వ్యవహారాలు చూస్తున్నారు. కళావతి గతంతో కదిరి ప్రాంతంలో పలు మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. కాగా, ప్రస్తుతం కదిరిలో ఆర్డీఓగా ఉన్న వీవీఎస్ శర్మకు బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 30న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30న స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశ భవన్లో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. గ్యాస్ మిత్ర యాప్ను రూపొందించిన బాలుడు అనంతపురం: గోరంట్లకు చెందిన శ్రీధర్, చందన దంపతుల కుమారుడు, 14 ఏళ్ల గంధం ధీరజ్.. పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే 8వ తరగతి అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో గ్యాస్ మిత్ర యాప్కు రూపకల్పన చేశాడు. సామాన్య ప్రజల్లో ఎల్పీజీ భద్రత, పొదుపు, సైబర్ మోసాలపై అవగాహన పెంపొందించేలా ఈ యాప్ను రూపొందించడం గమనార్హం. ఎల్పీజీ బుకింగ్ అర్హత కాలిక్యులేటర్, గ్యాస్ లీకేజీపై భద్రత సూచనలు, గ్యాస్ పొదుపు చిట్కాలు, డీఏసీ మోసాలపై 12 భారతీయ భాషలకు వాయిస్ సపోర్ట్ చేసేలా అందుబాటులోకి తెచ్చారు. యాప్ రూపకర్త ధీరజ్ను సోమవారం జేఎన్టీయూ (ఏ)లోని రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కార్యాలయంలో సీఈఓ డాక్టర్ ఆర్.హఫీజ్ బాషా అభినందించారు. పరిష్కార వేదికకు 85 వినతులుపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలు ఏర్పాటు చేయగా... తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 1,985 మంది హాజరుకావాల్సి ఉండగా 1,574 మంది హాజరయ్యారని, 411 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కిష్టప్ప తెలిపారు. అలాగే ఏపీఓఎస్ఎస్ విద్యార్థులు 147 మందికి గాను 110 మంది హాజరు కాగా, మరో 37 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా తొలిరోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 448 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు డీఈఓ తెలిపారు. 185 మంది గైర్హాజరు.. జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నాల్గో రోజు సోమవారం 32 కేంద్రాల్లో జనరల్ విద్యార్థులకు మ్యాథ్స్, సివిక్స్, ఒకేషనల్ విద్యార్థులకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 185 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. ఉదయం ప్రథమ సంవత్సరానికి సంబంధించి 2,688 మందికి గాను 2,580 మంది హాజరు కాగా, 108 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష 1,334 మందికు గాను 1,257 మంది విద్యార్థులు హాజరు కాగా, 77 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. 28న జరగాల్సిన పరీక్ష వాయిదా.. ఈనెల 28న జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను బక్రీద్ పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఈ పరీక్షలను జూన్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక జూన్ 5వ తేదీన జరగాల్సిన ‘నైతికత, మానవ విలువలు’ పరీక్షను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
కొబ్బరి చెట్టుపై పిడుగు
చిలమత్తూరు: మండలంలో సోమవారం ఉదయం ఆరుగంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది. చిన్నన్నపల్లిలో రైతు నాగభూషణరెడ్డి పొలంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు రాలడంతో మంటల్లో కాలిపోయింది. బీటెక్ ఫలితాల విడుదలఅనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, ఎగ్జామినేషన్స్ ఇన్చార్జ్ కె.మాధవి, ప్రొఫెసర్ ఆర్.రాజశేఖర్, ప్రొఫెసర్ జయలక్ష్మి, డాక్టర్ కళ్యాణి రాధ పాల్గొన్నారు. నేడు మెగా జాబ్ మేళా హిందూపురం టౌన్: స్థానిక ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ సోమవారం వెల్లడించారు. మొత్తం 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా కంపెనీల అవసరాల నిమిత్తం మానవ వనరులను ఎంపిక చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారు అర్హులు. ఎంపికై న వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ జీతం చెల్లిస్తారు. పెనుకొండ, హిందూపురం, పాలసముద్రం, అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 99594 16770, 96767 06976 లో సంప్రదించవచ్చు. -
సప్లై ఛానల్ ఇలా.. నీరు పారేదెలా?
రొళ్ల: మండల కేంద్రంలోని చెరువుకు ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న సప్లై ఛానల్ పూర్తిగా ముళ్ల పొదలు, మట్టితో పూడుకుపోయింది. హొట్టేబెట్ట పంచాయతీ పరిధిలోని హొట్టేబెట్ట, కల్లురొప్పం, గొల్లహట్టి, కొత్తపాళ్యం, కొత్తపాళ్యం తండా, కొడగార్లగుట్ట కాలనీ సమీపంలోని బసవన్నకొండ ప్రాంతం, కొడగార్లగుట్ట గ్రామాలు అనుకుని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని వృథా కానివ్వకుండా రొళ్ల చెరువుకు మళ్లించేలా 1996లో రూ.5 లక్షల వ్యయంతో సప్లై ఛానల్ను నిర్మించారు. ఛానల్ నిర్మాణం పూర్తయిన కొత్తలో రొళ్ల చెరువుకు సమృద్ధిగా నీరు అందేది. ప్రస్తుతం 14 ఏళ్లుగా ఈ ఛానల్ ద్వారా చుక్క నీరు అందకుండా పోయింది. కర్ణాటక వైపుగా మళ్లిన వరద రొళ్ల చెరువు నిండితే వందలాది ఎకరాల ఆయకట్టుతో పాటు ఆగళి మండలంలోని దొక్కలపల్లి, బీరనపల్లి, హళ్లికెర, ముత్తేపల్లి తదితర గ్రామాల్లోనూ భోరు బావుల్లో నీటి మట్టం పెరిగి వందల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చేవి. భూగర్భజలాలు పెరిగి రెండు మూడేళ్ల పాటు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే సప్లై ఛానల్లో మట్టి పెళ్లలు విరిగి పడి, పిచ్చి మొక్కలు పెరగడంతో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరంతా దిగువన ఉన్న కర్ణాటక ప్రాంతానికి మళ్లిపోతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక వైపుగా వెళుతున్న నీటికి అడ్డు వేసేందుకు అప్పట్లో చెక్డ్యాంను నిర్మించారు. అయితే ఈ చెక్డ్యాం ఎత్తు పెంచకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారింది. ఇటీవల సుమారు రూ.7 లక్షల వ్యయంతో సప్లై ఛానల్లో పూడిక, పిచ్చి మొక్కలను ఆర్డీటీ తొలగించింది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు మళ్లీ మట్టి పెళ్లలు విరిగి పడి ఛానల్ మూసుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి పోయాయి. కొడగార్లగుట్ట వద్ద పూడిపోయిన సప్లై ఛానల్ రొళ్ల మండలం కొడగార్లగుట్ట వద్ద మట్టి, పిచ్చి మొక్కలతోనిండిన సప్లై ఛానల్ 14 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని సప్లై ఛానల్ వృథా అవుతున్న వర్షపు నీరు చెక్డ్యాం ఎత్తు పెంచాలి చెరువులకు నీటిని అందించే సప్లై ఛానల్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూడికతో నిండిపోయింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా జనధార–జల హారతి కార్యక్రమం కింద అభివృద్ధి చేసే అవకాశమున్నా.. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా రొళ్ల చెరువుకు నీరందకుండా పోతోంది. రొళ్ల చెరువు నిండితే అగళి మండలంలోని దొక్కలపల్లి, భీరనపల్లి, ముత్తేపల్లి చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు నీటి కొరత లేకుండా ఉండేది. కొడగార్లగుట్ట గ్రామం వద్ద సప్లై ఛానల్ పూర్తిగా పూడుకుపోయింది. దీంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా కర్ణాటక వైపుగా పోతున్నాయి. అధికారులు స్పందించి సప్లై ఛానల్ మరమ్మతుకు చర్యలు తీసుకోవాలి. – దేవరాజు, రైతు, దొక్కలపల్లి, అగళి మండలం కొడగార్లగుట్ట సమీపంలోని సప్లై ఛానల్ వద్ద ఉన్న చెక్డ్యాం ఎత్తు పెంచాలి. ఎత్తు తక్కువగా ఉండడంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా కర్ణాటక వైపు పోతున్నాయి. మట్టి పెళ్లలు విరిగి పడి సప్లై ఛానల్ పూడిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో చెరువుకు నీరందక పంటల సాగు కష్టమైంది. నాకున్న 1.5 ఎకరాల ఆయకట్టుకు పక్క రైతు పొలం నుంచి నీళ్లు విడిపించుకుని వరి సాగు చేస్తున్నా. – నగేష్ రంగారెడ్డి, ఆయకట్టు రైతు, రొళ్ల -
చెట్ల తొలగింపుపై కలెక్టర్ ఆగ్రహం
చిలమత్తూరు: మండల పరిధిలోని మరవకొత్తపల్లి సమీపంలో సుమారు 200 చింత చెట్ల తొలగింపుపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మరవకొత్తపల్లి సమీపంలో 200 చింత చెట్ల తొలగింపుపై ఆదివారం ‘పర్యావరణంపై గొడ్డలి వేటు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. అదే అంశంపై సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో పర్యావరణవేత్త భాస్కర్రెడ్డి ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెట్లు అనుమతుల కోసం ఇచ్చిన ఆర్డర్ను రద్దు చేయడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ అటవీశాఖ అధికారులపై ఆగ్రహించినట్లు సమాచారం. పర్యావరణాన్ని కాపాడాల్సిన డీఎఫ్ఓ వందలాది చెట్లు తొలగించడానికి ఎలా అనుమతులు ఇచ్చారని మండిపడినట్లు తెలుస్తోంది. -
ఆగని దారి దోపిడీలు
రొళ్ల: మండల పరిధిలో దారి దోపిడీలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారు. తరచూ ఒకే ప్రాంతంలో దారి దోపిడీలు చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. రొళ్ల మండలం హనుమంతనపల్లి గ్రామ పొలిమేరలో ఉన్న బైలాంజనేయస్వామి ఆలయం దారి దోపిడీ ముఠాకు అడ్డాగా మారింది. వివరాల్లోకి వెళితే.. బైలాంజనేయస్వామి ఆలయం రెండు వైపులా పూర్తిగా దిగువ ప్రాంతంలో ఉంది. అగ్రహారం, హనుమంతనపల్లి రెండు గ్రామాల పరిధిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రిజర్వు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. బైలాంజనేయస్వామి ఆలయం సమీపాన ప్రధాన రోడ్డు దిగువ ప్రాంతం కావడంతో ఎంత గట్టిగా కేకలు వేసినా చుట్టుపక్కల వారికి వినిపించదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పట్టపగలే వాహనాలు అడ్డగించి దారి దోపిడీలు సాగిస్తున్నారు. ఆయా ఘటనలపై పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారే తప్ప దుండగులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ● 2023 జూన్ 9న రాత్రి బైలాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన రోడ్డుకు అడ్డుగా కంచెకు ఉపయోగించే ఇనుప తంతిని కట్టి దారి దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనదారులు ఒకరి వెనుక మరొకరు వస్తూ ముళ్ల కంచెను గమనించి వాహనాలను ఆపారు. వేగంగా దూసుకెళ్లి ఉంటే ఛాతి లేక మెడకు తంతి తగిలి ప్రాణాపాయం కలిగేది. ● 2025 జూన్ 16న రొళ్ల మండలం హెచ్టీ హళ్లికి చెందిన వివాహిత అనిత పట్టపగలే ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బైలాంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాన్ని దుండగులు అడ్డుకుని ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు మాంగల్యం చైన్ లాక్కొని ఉడాయించారు. ● ఈ నెల 23న మధ్యాహ్నం టీడీపల్లి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి ద్విచక్ర వాహనంలో రొళ్ల నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు అడ్డుకుని అతని ఎడమ చేతి వేలికి ఉన్న దాదాపు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని లాక్కొని ఉడాయించారు. అడ్డాగా మారిన బైలాంజనేయస్వామి ఆలయ ప్రాంతం తరచుగా ఒకేచోట దారి దోపిడీలు దుండగులను పట్టుకోవడంలో పోలీసుల విఫలం -
సచివాలయంలో ల్యాప్టాప్ అపహరణ
● రికార్డుల కాల్చివేత ధర్మవరం అర్బన్: మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గ కేంద్రంలోని శివానగర్లో ఉన్న 5వ వార్డు సచివాలయంలో దుండగులు చొరబడి ల్యాప్టాప్ను అపహరించారు. పలు రికార్డులను కాల్చి వేశారు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సచివాలయానికి చేరుకున్న ఉద్యోగులు తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో భద్రపరిచిన ల్యాప్టాప్ కనిపించలేదు. బూడిదగా మారిన రికార్డులను గమనించి సమాచారం ఇవ్వడంతో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, ఇన్చార్జ్ డీఎస్పీ నర్శింగప్ప, టూ టౌన్ సీఐ రెడ్డప్ప, వన్టౌన్ ఎస్ఐ ఉమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 31న మాదిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 2026 పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు‘ అందజేయనున్నారు. ఈ మేరకు ఎంఈఎఫ్ జాతీయ అదనపు కార్యదర్శి బండారు శంకర్ సోమవారం వెల్లడించారు. దరఖాస్తులను ఎంఈఎఫ్ జిల్లా అధ్యకుడు రమేష్ వాట్సాప్ నంబర్ (99853 38646) ద్వారా అందజేయాలన్నారు. ఈ నెల 31న అనంతపురం 4వ పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ఉన్న ఏ7 కన్వెన్షన్ హాల్లో పురస్కారాలు అందజేస్తారని పేర్కొన్నారు. అమ్మవారి వెండి ఆభరణాల అపహరణ యాడికి: మండలంలోని కేశవరాయునిపేట సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి అమ్మవారి మూలవిరాట్ను అలంకరించిన 40 తులాల వెండి కిరీటం, ఆభరణాలను అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి నారాయణమ్మ చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 40 కిలోల బరువైన వెండి ఆభరణాలను అపహరించికెళ్లినట్లుగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఆలయంలో చోరీ పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లిలో వెలసిన పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ప్రతిమ, 500 గ్రాముల వెండి గొడుగు, 5 గ్రాముల బంగారు తాళిబొట్లను అపహరించారు. ఉదయాన్నే గుడికి వెళ్లిన భక్తులు చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పూజారి గురుస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
విజయభాస్కర్ది సహజ మరణమే
● ఎస్పీ సతీష్కుమార్ మడకశిర: గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన దళిత విజయభాస్కర్(24) ది సహజ మరణమేనని ఎస్పీ సతీష్కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. సోమవారం మడకశిర రూరల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న మందలపల్లిలో విజయభాస్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఏప్రిల్ 22న విజయభాస్కర్ వెళ్లి అపస్మారకంగా పడిపోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ ఫోన్ ద్వారా విజయభాస్కర్ బంధువు సంతోష్కు తెలిపింది. సమాచారం అందుకున్న బంధువులు పుట్టలింగప్ప, హనుమంతరాయుడు, సోదరుడు హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విజయభాస్కర్ని వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మోటార్ సైకిల్పై గుడిబండ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరిశీలించి విజయభాస్కర్ మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విజయభాస్కర్ను సదరు మహిళతో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేశారంటూ బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులతో పాటు 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సాంకేతిక విశ్లేషణ అనంతరం విజయభాస్కర్పై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, అధిక మోతాదులో మద్యం సేవించడంతో పాటు కార్డియో మెగాలితో మృతి చెందినట్లుగా నిర్ధారణ అయింది. సహజ మరణం అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్పీ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, స్థానిక రూరల్ సీఐ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కబ్జా స్థలం పరిశీలన
కదిరి: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా కూటమి నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సోమవారం కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రెడ్డిశేఖర్తో పాటు సర్వేయర్లు పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కూటమి నేతలు ప్లాట్లు వేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్న వైనంపై ‘దర్జాగా కబ్జా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందించారు. కదిరి ఆర్డీఓకు ఫోన్ చేసి భూకబ్జాలపై ఆరా తీశారు. ‘సాక్షి’లో ప్రచురించిన సర్వే నం.1782–1లోని 99 సెంట్లు, 1782–2లో ఉన్న 33 సెంట్లతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయో పరిశీలించి సమగ్ర నివేదిక పంపాలని ఆర్డీఓను ఆదేశించారు. అలాగే ఆయా స్థలాల్లో మొక్కలు నాటాలని, లేదంటే కంచె వేయాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కబ్జా స్థలాల పరిశీలన కోసం కొందరు రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని వేసి, స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఆర్డీఓ తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురించి వార్త వాస్తమని, అక్కడ కొందరు పునాదులు కూడా వేసుకున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. బాధితుల గగ్గోలు.. కూటమి నేతల నుంచి ఇప్పటికే భూములు కొన్న వారు అది ప్రభుత్వ భూమి అని తెలిసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం వారు సదరు స్థలం వద్దకు వచ్చి తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి మోసపోయామని న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని అమ్మడానికి వారికి ఎలాంటి హక్కులు లేవని, ఇలాంటి స్థలాలు కొనుగోలు చేసినా తప్పేనని, ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆర్డీఓ వారికి తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై కేసులు కూడా పెడతామని ఆర్డీఓ హెచ్చరించారు. -
నిద్రిస్తున్న మహిళను లేపి బంగారు గొలుసు అపహరణ
ధర్మవరం అర్బన్: నిద్రిస్తున్న మహిళను లేపి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన ధర్మవరంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని పార్థసారధినగర్లో వీఆర్ఓ బాలపెద్దన్న, లక్ష్మీదేవి దంపతులు నివాసముంటున్నారు. సోమవారం ఉదయం భర్త విధుల కోసం పెనుకొండకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి మధ్యాహ్న సమయంలో తలుపులు వేసుకుని నిద్రపోయారు. ఆ సమయంలో ఓ యువకుడు ఇంటి ఎదుట బైక్ ఆపి కాలింగ్ బెల్ నొక్కడంతో నిద్ర మేల్కొన్న లక్ష్మీదేవి తలుపు తీయగానే ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని బైక్పై ఉడాయించాడు. గొలుసు లాగే సమయంలో ఆమె గట్టిగా పట్టుకోవడంతో చేతిలో ఓ ముక్క తెగి పడింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకునేలోపు యువకుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘సర్’పై సర్వత్రా ఆందోళన
పుట్టపర్తి అర్బన్: కేంద్ర ఎన్నికల సంఘం మూడోదశ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్)కు సిద్ధమైంది. జిల్లాలో జూన్ 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటరు జాబితాపై ఇంటింటి సర్వే చేపడతారు. ఈ ప్రక్రియపైనే అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి. 23 ఏళ్ల ధ్రువీకరణతోనే ఇబ్బంది.. భారత ఎన్నికల సంఘం ఏటా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులూ చేస్తుంది. దీన్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. ఇందులో భాగంగా ఓటరు జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించడం, 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా జాబితాలో చేర్చడం, ఓటరు అడ్రస్లను మార్చడం, జాబితాలో అచ్చు తప్పులు, ఫొటోలు, చిరునామాల మార్పు, నియోజక వర్గాల మార్పు తదితర వాటికి అవకాశం కల్పిస్తారు. కానీ ఈసారి ‘సర్’ సర్వేలో ప్రతి ఓటరూ బీఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లుగా భారతదేశంలోనే ఉన్నట్లు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ ధ్రువీకరణపేరుతో ఓటరు జాబితా నుంచి గల్లంతు చేస్తుందా..అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్ఏల నియామకంపై పార్టీల కసరత్తు.. ‘సర్’ సర్వే నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే జిల్లాలో గుర్తింపు పార్టీలన్నీ తమ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నాయి. అలాగే బీఎల్ఓల వెంట ఉండేందుకు బూత్లెవల్ ఏజెంట్లను నియమించుకోవడంలో తలమునకలయ్యాయి. తమ మద్దతుదారుల ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. జిల్లాలో 1,840 పోలింగ్ బూత్లుండగా...గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ ఒక్కో బూత్కు ఒకరిని బీఎల్ఏగా నియమించుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీఎల్ఏల జాబితా తయారీలో ఆయా పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. జూన్ 4 నుంచి శిక్షణ.. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం జిల్లాలోని 16,56,775 మంది ఓటర్లకు ఎన్నికల కమిషన్ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను బీఎల్ఏలు నిశితంగా పరిశీలించి డూప్లికేట్ ఓటర్లు ఉంటే జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 8,24,039 మంది పురుష ఓటర్లు, 8,32,660 మంది మహిళా ఓటర్లు ఉండగా... ఇతరులు 76 మంది ఓటర్లు ఉన్నారు. షెడ్యూల్ ఇలా... ● జిల్లాలో జూన్ 5 నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ● జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలిస్తారు. ● జూన్ 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారం–2ను ఇచ్చి పూర్తి చేయించి తిరిగి తీసుకుంటారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది. ● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ● సెప్టెంబర్ 22న ఓటరు తుది జాబితాను విడుదల చేస్తారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లపై కన్నేసిన అధికార పార్టీ వివిధ కారణాలు చూపి ఓట్ల గల్లంతుపై దృష్టి! అప్రమత్తమైన రాజకీయ పార్టీలు... కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు బీఎల్ఏల నియామకంపై దృష్టి సారిస్తున్న వైనంఆందోళన వద్దు ‘సర్’ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఇందుకోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కచ్చితంగా బీఎల్ఏలను నియమించుకోవాలి. ‘సర్’ కార్యక్రమాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తారు. ఎక్కడైనా తప్పులు చేస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయి. – శ్యాం ప్రసాద్, కలెక్టర్ -
● ఆత్మీయ కలయిక
కదిరి టౌన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 1984–87 డిగ్రీ పూర్తి చేసిన వారు అదే కళాశాల అడిటోరియంలో 40 సంవత్సరాల తర్వాత సోమవారం కలుసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు రాయసం హరిప్రసాద్, అంకె నరహరి, మిత్రులు నేతృత్వం వహించారు. ఒకరి యోగ క్షేమాలను మరొకరు తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ స్నేహితుడు తనకల్లుకు చెందిన ఖాదర్బాషాకు ఆర్థిక సాయం అందించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. భోజన విరామం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కళాశాల అవరణలో మొక్కలు నాటారు. -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష అనంతపురంలో సజావుగా జరిగింది. అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. రెండు సెషన్లుగా ఏడు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,514 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం సెషన్కు 1,658 మంది అభ్యర్థులు (66 శాతం) హాజరవగా 856 మంది (34 శాతం) గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం సెషన్కు 1,635 మంది అభ్యర్థులు (65 శాతం) హాజరుకాగా 879 మంది (35 శాతం) గైర్హాజరయ్యారు. రెండు సెషన్లూ కలిపి అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. యూసీఎస్పీ జిల్లా పరిశీలకులు గంధం చంద్రుడు, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భ్రద్రత ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. ఆలస్యమై బాధతో వెనుదిరిగి.. నిర్దేశిత సమయం తరువాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి లోనికి అనుమతించలేదు. దీంతో వారంతా బాధతో వెనుదిరిగారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే తమ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ప్రత్యేకంగా సూచించారు. యూపీఎస్సీ నిబంధన మేరకు ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కొందరు అభ్యర్థులు సమాయానికి చేరుకోలేక పోయారు. దీంతో వారిని లోనికి అనుమతించలేదు. ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షకు మహబూబ్, చరిత్ర, మౌళి, హర్ష, కుమార్, నందకిషోర్, నరేష్, యువరాజ్, శ్రావణ్ (కర్నూలు), మరికొంత మంది అభ్యర్థులు తొమ్మిది గంటల తరువాత కేంద్రానికి చేరుకున్నారు. నిబంధన ప్రకారం వారిని లోనికి అనుమతించలేదు. ఇలాగే మిగతా ఆరు కేంద్రాల్లోనూ కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు. అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదు -
‘అరసం’ రాష్ట అధ్యక్షుడిగా రాచపాలెం
అనంతపురం కల్చరల్: అరసం (అభ్యుదయ రచయితల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతిలో అరసం 20వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అరసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్కేయూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అనంత సాహితీక్షేత్రంలోనే దశాబ్దాలుగా స్థిరనివాసమేర్పరచుకున్న డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డిని అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన సీనియర్ రచయితలు గుత్తా హరిసర్వోత్తమనాయుడు, ఈశ్వరరెడ్డి, వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, తన్నీరు నాగేంద్రలకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. తిరుపతి మహాసభల్లో అనంత రచయితలు ద్విభాషా కవి డాక్టర్ జూటూరు షరీఫ్, చెట్ల ఈరన్న తదితరులు పాల్గొన్నారు. కండక్టర్ నిజాయితీ● బంగారు నగలు, డబ్బు ఉన్న పర్సు అందజేత హిందూపురం: ప్రయాణికురాలు బస్సులో మర్చిపోయిన బంగారు నగలు, డబ్బు ఉన్న బ్యాగ్ను తిరిగి ఆమెకు అప్పగించి కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు.. ఆదివారం కదిరి నుంచి హిందూపురం వెళ్లే పల్లె వెలుగు సర్వీస్లో లచ్చమ్మ ప్రయాణించారు. గోరంట్లలో బస్సు ఎక్కిన ఆమె హిందూపురంలో దిగేటప్పుడు తన పర్సును పోగొట్టుకుంది. బస్సు కండక్టర్ శ్రీనివాసులు ఆ పర్సును గమనించిన హిందూపురం డిపో కంట్రోలర్ నాగచంద్రుడికి అందించారు. పర్సు పోగొట్టుకున్న లచ్చమ్మ ఆందోళనతో అంత వెతికుతూ బస్టాండ్ కంట్రోల్ పాయింట్లో తన పర్సు బస్సులో పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. పర్సులో నాలుగు తులాల బంగారు చైన్, రెండు మొబైల్స్, కొంత డబ్బు ఉందని చెప్పింది. ప్రయాణికురాలు చెప్పిన వివరాలు అన్ని సరిగా ఉండటంతో పోగొట్టుకున్న పర్సును ఆర్టీసీ సిబ్బంది లచ్చమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కండక్టర్ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాసులును నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు, తోటి ఉద్యోగులు అభినందించారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతినల్లచెరువు: మండల పరిధిలోని పాత రైల్వేస్టేషన్ సమీపంలో కదిలే రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాలమేరకు.. కదిరి పట్టణంలోని జగనన్న కాలనీ చెందిన రాము రైలులో చిన్న పిల్లల బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాము రైలులో ఫుట్పాత్ వద్ద నిలబడి ఉన్నాడు. అయితే పాత రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా రైలు నుంచి కాలు జారి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గవిమఠం ఏజెంట్ రాజన్నగౌడ్ మృతి ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం ఏజెంట్ పాటిల్ రాజన్నగౌడ్ (72) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆదివారం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 20 ఏళ్లుగా గవిమఠం ఏజెంట్గా పనిచేస్తూ ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి సేవలందిస్తున్నారు. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామీజీ, మఠం సిబ్బంది గోపి, నారాయణస్వామి, మధు తదితరులు రాజన్నగౌడ్ మృతికి సంతాపం తెలిపారు. -
సామాజిక న్యాయానికి పాతర
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో ఉన్నతస్థాయి పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి పాతర వేశారు. ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతికుమార్ పూర్తిస్థాయి వీసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిజిస్ట్రార్గా రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు కేటాయిస్తారని అందరూ భావించారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన ఔత్సాహిక ప్రొఫెసర్లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రిజిస్ట్రార్గా ఉన్న రమేష్బాబును మార్పు చేయకుండా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లే లేనట్లు నాన్ టీచింగ్ విభాగంలో రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్గా ఉన్న రమేష్బాబును ఎలా రిజిస్ట్రార్గా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా రిజిస్ట్రార్ పదవి రిజర్వేషన్ వర్గాలకు దక్కనీయకుండా సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంతకుముందు రెక్టార్గా ప్రొఫెసర్ వెంకటనాయుడు ఉండేవారు. దీంతో వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్గా ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కొలువుదీరడంతో... ప్రొఫెసర్ వెంకటనాయుడు రెక్టార్ పదవికి రాజీనామా చేశారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ బి.అనితకు రెక్టార్ పదవిని అప్పగించారు. గతంలో పెద్దపీట గత వైఎస్సార్సీపీ హయాంలో ఎస్కేయూ కీలక పదవుల్లో ఎస్సీ, బీసీ కేటగిరి వర్గాలకు న్యాయం జరిగింది. అప్పట్లో వీసీగా రహంతుల్లా, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డిని నియమించారు. రహంతుల్లా రాజీనామా చేయడంతో ఇన్చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ అయిన అహ్మద్బాబుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ జయరాజ్ను నియమించారు. ఆయన గుండెపోటుతో చనిపోయాక తిరిగి ఇన్చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మల్లికార్జునరెడ్డి రిజిస్ట్రార్గా రాజీనామా చేశారు. మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి వీసీగా నియమితులైన తరువాత రిజిస్ట్రార్గా బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ రమణ (కెమిస్ట్రీ)ను నియమించారు. అనంతరం బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణకుమారి, ఎస్సీ కేటగిరికి చెందిన ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య రిజిస్ట్రార్లుగా పనిచేశారు. ఆనాడు వీసీ ఓపెన్ కేటగిరీ వారు అయితే.. బీసీ, ఎస్సీ కేటగిరీ వర్గాలకు రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్గా ఒకే సామాజికవర్గం వారు రిజర్వేషన్ కేటగిరీలకు రిజిస్ట్రార్ పదవి అందని ద్రాక్షేనా? -
కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్
కళ్యాణదుర్గం రూరల్: పట్టణ పరిధిలో పలువురికి చెందిన ఫోన్లు ఆదివారం హ్యాక్కు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది, దేవాదులకొండ గ్రామాలకు చెందిన పలువురి ఫోన్ల నుంచి ‘తాను ఆస్పత్రిలో ఉన్నానని, ఫోన్పే ద్వారా డబ్బు పంపండి’ అంటూ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు వెళ్లాయి. వెంటనే సదరు వ్యక్తులు ఫోన్ చేసి నిజమా అని కనుక్కోవడంతో అలాంటిదేమీ లేదని, తమకు తెలియకుండానే తమ ఫోన్ నుంచి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పడంతో హ్యాక్ విషయం బయటకు వచ్చింది. ఆందోళన చెందిన కొందరు వెంటనే తమ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు జమచేశారు. అయితే హ్యక్ అయిన ఫోన్ల్లో నగదు పోయినట్లు ఎవరూ చెప్పలేదు. దీనిపై క్రైంబ్యాచ్ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా... నగదు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే సెల్ఫోన్లో అనవసరమైన లింక్లు, ఫైళ్లు ఓపెన్ చేయొద్దని ప్రజలకు సూచించారు. డబ్బు పంపాలని బంధువులు, స్నేహితులకు మెసేజ్లు -
అలరించిన సంగీత కచేరి
ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ సుమధుర స్వరాలతో ఆలపించిన గీతాలు భక్త కోటిని మురిపించాయి. వైట్ఫీల్డ్లోని సత్యసాయి వైద్య సంస్థలకు చెందిన నర్సింగ్ కాలేజీ అనుబంధ విభాగాల 15వ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహా సమాఽధిని దర్శించుకున్నారు. మహా సమాధిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యసాయి మహా సమాఽధిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) వీఎల్ సంతోష్ దర్శించుకున్నారు. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణలో భాగంగా జిల్లాలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన సాయి కుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆయనకు మంత్రి సత్యకుమార్యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి, కత్తి రాజారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. -
కథా రచయిత్రి బాల భారతమ్మ కన్నుమూత
అనంతపురం కల్చరల్: అనంత సాహితీలోకంలో అందమైన కథలను వండివార్చిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త భాస్కర బాల భారతమ్మ (86) అనారోగ్య కారణాలతో విజయవాడలో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, సాహితీప్రియులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. కేఎస్ఆర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్గా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విభాగం ఇన్చార్జ్గా, ఇంటర్మీడియెట్ బోర్డు మెంబర్గా పనిచేసిన భాస్కర బాల భారతమ్మ వేల సంఖ్యలో కవితలు, 120 కథలను రచించి ‘కవితా భూషణ్’ అ వార్డు అందుకున్నారు. సొంతంగా మూడు స్కూళ్లను స్థాపించారు. బాల భారతమ్మ కుమార్తె రాధిక ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా సేవలందిస్తున్నారు. అనంత సాహిత్యానికి తీరని లోటు బాల భారతమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కవియిత్రులు డాక్టర్ ప్రగతి, డాక్టర్ అనంత మాలతి, డాక్టర్ ప్రసూన, నిర్మలారాణి తదితరులు మాట్లాడుతూ అనేక హృద్యమైన కథా సంపుటాలతో, ఆలోచనాత్మకమైన వ్యాసాలతో అనంత సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాల భారతమ్మ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలోనూ ఎంతో మంది యువ రచయిత్రులకు స్ఫూర్తినింపారన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి రొద్దం: గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్, కేంద్ర సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ అధ్యక్షతన ఆదివారం మండల పరిధిలోని ఎల్జీబీ నగర్ సమీపంలోని సాయి గీతా కన్షెన్ హాల్లో పండిట్ దీనదయళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీజేపీ సిద్దాంతాలు, కార్యవిస్తారణ, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీని బుత్స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంబ్రాయిడరీ, పెయింటింగ్పై ఉచిత శిక్షణ పుట్టపర్తి టౌన్: కెనరాబ్యాంక్ రీసెట్ ఐ సౌజన్యంతో హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ మగ్గం వర్క్స్పై నెల రోజులు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణా ప్రాంతానికి చెందిన 18 నుంచి 50 సంవత్సరాల్లోపు వారికి పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కెనరాబ్యాంక్ రీసెట్ ఐ కార్యాలయంలో శిక్షణ ఇస్తామన్నారు. జూన్ 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ ,రేషన్కార్డు, నాలుగు ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యవకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9705091727, 9391486292 లను సంప్రదించాలన్నారు. -
హనుమా.. భక్తుల కష్టాలు కనుమా..
గుంతకల్లు రూరల్: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో వసతి గదుల లేమి పట్టిపీడిస్తోంది. ఆలయంలో భక్తులకు అవసరమైన వసతి గదులు లేకపోవడం, అంతంత మాత్రంగా ఉన్న వసతి గదులు కాస్తా అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చిన వర్కర్లకే సరిపోతుండటంతో భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు అద్దె గదులకు భారీ మొత్తంలో ఖర్చుచేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆలయ ప్రాంగణంలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. అయినా కూడా దేవస్థానంలో ముందునుంచి వసతి గదుల లేమి భక్తులను వెంటాడుతూనే ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయంలో భక్తుల వసతి కోసం, లక్ష్మణ సదనంలో 39 రూములు (అద్దె రూ.50), కేసరి సదనంలో 28 అద్దె గదులు (అద్దె రూ.500), ఉండేవి. గంగా నిలయం ప్రాంగణంలో దాదాపు 12 కాటేజీలు ఉండేవి. రామదూత నిలయంలో 20 ఏసీ, నాన్ ఏసీ అద్దె గదులు (అద్దె రూ.1500) మాత్రమే ఉండేవి. అయితే 9 నెలల క్రితం ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మేడేపల్లి విజయరాజు దాతల సహకారంతో ఆలయంలో నూతన గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం, గోశాల, ప్రసాదాల తయారీశాల వంటి వాటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆలయంలో మాడ వీధుల ఏర్పాటులో భాగంగా అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మణ సదనంలోని 39 అద్దె గదులను కూల్చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాక ఆ పనుల నిమిత్తం వచ్చిన వర్కర్లకు కేసరి సదనంలోని అద్దె గదులను, హోదా గల వారికి గంగా నిలయంలోని కాటేజెస్ను కేటాయించారు. దీంతో ప్రస్తుతం కేసరి సదనంలో 13 అద్దె గదులు, రామదూతలో ఉన్న 20 అద్దె గదులు మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నారు. మంగళ, శనివారాల్లో వేలాదిగా భక్తులు మంగళ, శనివారాల్లో వేల సంఖ్యలో ఆలయానికి వచ్చే భక్తులకు ఉన్న అద్దె గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో భక్తులు ఆలయ ముందు భాగంలో ఆరుబయటనే నిద్రించాల్సి వస్తుంది. అయితే శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మొదలైన వర్షం రాత్రంతా జల్లులతో కొనసాగడంతో భక్తులు షెడ్ల దగ్గరికి పరుగులు తీశారు. భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో పడుకోవడం మాట అటుంచితే కనీసం షెడ్ల కింద కూర్చోవడానికి కూడా స్థలం లేక నానా అవస్థలు పడ్డారు. త్వరలోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని, అప్పుడు ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వసతి గదుల సముదాయం నిర్మాణం ఎన్నడో... ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో వివిధ రకాల పనులను చేపడుతున్న ఆలయ అధికారులు రూ.17.60 కోట్ల అంచనా వ్యయంతో 107 వసతి గదులతో జీప్లస్టు సముదాయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే అన్ని రకాల పనులు ప్రారంభం అయినప్పటికీ వసతి గదుల సముదాయ నిర్మాణం మాత్రం ఫ్లెక్సీలకే పరిమితమైంది. దీంతో భక్తుల కష్టాలు కొనసాగుతూనే వస్తున్నాయి. భక్తులకు అవసరమైన వసతులు సమకూరితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్న విషయం ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వసతి గదుల లేమితో ఆలయ ప్రాంగణంలోనే సేదదీరుతున్న భక్తులు కసాపురంలో వసతి గదుల లేమితో భక్తుల ఇక్కట్లు ఆలయ ప్రాంగణంలోనే నిద్ర ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అవస్థలు -
సర్పాల సయ్యాట
పెనుకొండ: సోమందేపల్లి మండలం మంచేపల్లిలో ఆదివారం సర్పాలు సయ్యాటలాడాయి. రెండూ పెనవేసుకుని అంతెత్తు పైకిలేస్తూ ముందుకు సాగాయి. దాదాపు రెండు గంటలపాటు సాగిన సయ్యాటను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. వివాహిత నిరాహార దీక్ష పెనుకొండ: అనంతపురానికి చెందిన అశ్విని అనే వివాహిత పట్టణంలోని భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు... అనంతపురానికి చెందిన అశ్వినికి పట్టణంలోని ఓ యువకుడితో 1996లో వివాహమైంది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో అశ్విని అనంతపురానికి వెళ్లిపోయింది. అయితే కోర్టులో విడాకుల కేసు జరుగుతున్న నేపథ్యంలో తమ కుటుంబం ఇచ్చిన బంగారు నగలు ఇవ్వాలని పెనుకొండ పట్టణంలోని భర్త ఇంటి వద్దకు వచ్చింది. తలుపులు మూసి వేయడంతో అశ్విని ఆమె కుమారుడితో కలిసి నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వద్ద ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వివరాలు... పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డు ప్రశాంతి గ్రామం వద్ద చంద్రశేఖర్, లక్ష్మి దంపతులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కూడా హోటల్ పెట్టుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాలేదు. ఆఖరికి ఫైర్సిబ్బందికి ఫోన్ చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన వల్ల రూ.లక్ష నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధి కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉందాం
ధర్మవరం: దొడ్దిదారిన గెలిచేందుకు ఎంతకై నా దిగజారి కుట్రలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నార్పల సత్యనారాయణరెడ్డి, జిల్లా డిజిటల్ కో ఆర్డినేటర్ మారుతీరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పది నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి బీఎల్వోలతో సమన్వయం చేసుకుని ఆధారాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తే వెంటనే తెలియజేయాలన్నారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ నుంచి చాలామంది వలస వెళ్లి ఉంటారని, వారికి సంబంధించి ఆధారాలు సమర్పించి ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్రమత్తంగా లేని కారణంగా లక్షలాది ఓట్లు తొలగించారని, ఫలితంగా అధికారం తలకిందులైన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఎల్ఏలు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. దొడ్డిదారిన గెలిచేందుకు చంద్రబాబు ఎంతకై నా దిగజారతారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ ‘వజ్ర’ -
వీరభద్రుని సేవలో జస్టిస్ చిత్తరంజన్దాస్
లేపాక్షి: లేపాక్షిలో వెలసిన వీరభద్ర స్వామిని ఆదివారం సాయంత్రం ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిత్తరంజన్దాస్ దర్శించుకున్నారు.కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు నరసింహశర్మ,శ్రీనివాసులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించిన జస్టిస్ చిత్త రంజన్దాస్ ఆనందం వ్యక్తం చేశారు. దుర్గాదేవి, వీరభద్ర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుల ద్వారా తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో న్యాయమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయా ల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మౌంటెనీర్ సందీప్ మృతి.. ‘పురం’లో విషాదఛాయలు హిందూపురం: పర్వతారోహకుడు (మౌంటెనీర్) సందీప్ అరే మృతితో హిందూపురంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనంతరం కిందకు దిగుతున్న క్రమంలో ఐదు రోజుల క్రితం ఆయన మృత్యువాత పడిన విషయం తెలిసిందే. హిందూపురానికి చెందిన ఆర్అండ్బీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నారాయణస్వామి కుమారుడైన సందీప్ అరే (46) బెంగళూరులో స్థిరపడ్డారు. గతంలో కిలిమంజారో శిఖరాన్ని ఆయన అధిరోహించారు. యూపీకి చెందిన అరుణ్ కుమార్ తివారితో కలిసి సందీప్ అరే ఈ నెల 20న ఎవరస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. తిరుగు ప్రయాణంలో విపరీతమైన మంచు గాలుల కారణంగా శ్వాస ఆడక ఇద్దరూ మృతి చెందారు. సందీప్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
ఆశలు వదిలేసుకున్నాం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక బీమా పథకం అమలు కావడం లేదు. ఖరీఫ్, రబీ ఏ సీజన్లో పంట నష్టపోయినా బీమా మాత్రం చేదికందలేదు. దీంతో బీమా పథకంపై ఆశలు వదిలేసుకున్నాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పంటల బీమా అమలు చేసి రైతులను కష్టకాలంలో ఆదుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ రైతుల గురించి పట్టించుకోకపోవడం విచారకరం. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గిపోవడంతో చీనీ తోటలను బతికించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు. కనీసం సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు తీసుకుందామన్నా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – బోయ గోపాల్, చీనీ రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం -
భల్లూకాన్ని పరుగెత్తించి.. రైతుల ప్రాణాలు రక్షించి..
పెనుకొండ: ఓ ఎలుగుబంటి బారి నుంచి రైతులను శునకాలు కాపాడిన ఘటన పెనుకొండ మండలం గోనిపేటలో జరిగింది. గోనిపేటకు చెందిన పలువురు రైతులు ఆదివారం రాత్రి తమ వ్యవసాయ పొలాల్లో నిద్రిస్తుండగా ఉన్నఫళంగా ఎలుగుబంటి దాడికి యత్నించింది. రైతుల పక్కనే పడుకుని ఉన్న శునకాలు ప్రమాదం గ్రహించి ఎలుగుపై ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలోకి ఎలుగుబంటి పరుగు లంకించింది. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. గృహ నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలి గోరంట్ల: గృహ నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం గోరంట్లలో జిల్లా హౌసింగ్ అధికారులతో మంత్రులు పార్థసారథి, సవిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజ్ కన్వర్షన్ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రూఫ్ లెవెల్కు చేరుకున్న లబ్ధిదారులకు అవసరమైన మెటీరియల్ అందజేయాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఈ కృష్ణయ్య, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
సా..గుతున్న ఎన్హెచ్ పనులు
పుట్టపర్తి అర్బన్: జాతీయ రహదారి–342 నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం పనులు నెమ్మదించాయి. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకల్లా అందుబాటులోకి రావాల్సిన రోడ్డు ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసిన అనంతరం కనెక్టివిటీ పెంచేందుకు, తద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 82 కిలోమీటర్ల మేర ఏర్పాటయ్యే రోడ్డుకు రూ.1,745 కోట్లు విడుదల చేశారు. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా కోడూరు వరకూ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. అంతా ఇష్టారాజ్యం.. ముదిగుబ్బ నుంచి ప్రారంభమయ్యే జాతీయ రహదారి–342 పనులను మూడు విడతలుగా చేపడుతున్నారు. మొదటి విడతలో భాగంగా బుక్కపట్నం వరకూ పనులు పూర్తవడంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా జగరాజుపల్లి నుంచి కోడూరు వరకూ పనులు జరుగుతున్నాయి. బత్తలపల్లి సమీపంలో టోల్గేట్, గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి వద్ద ఫ్లై ఓవర్ పనులు చేపడుతున్నారు. ఇంకా ఎక్కడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయలేదు. గ్రామాల్లోకి వెళ్లే చోట తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పుట్టపర్తి పట్టణంలోకి వెళ్లడానికి రోడ్డు కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించిన బండరాళ్లు, మట్టిని పొలాల వద్ద ఇష్టారాజ్యంగా వేయడంతో రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. ఎప్పటికప్పుడు బిల్లులు వస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. రెండో విడత పనుల్లో భాగంగా ఇంకా బడేనాయక్ తండా, ఎనుములపల్లి వద్ద రెండు కొండలు తొలగించాల్సి ఉంది. రహదారి అందుబాటులోకి వస్తే పుట్టపర్తి నుంచి కేవలం రెండున్నర గంటల్లో బెంగళూరు చేరుకునే వీలుండడంతో ప్రజలంతా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా పనులను వేగిరం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లావాసులు, సత్యసాయి భక్తులు కోరుతున్నారు. మూడేళ్లవుతున్నా పూర్తి కాని జాతీయ రహదారి– 342 చంద్రబాబు ప్రభుత్వమొచ్చాక నెమ్మదించిన పనులు ప్రజలకు తప్పని ఇబ్బందులు -
బీమాయ.. రైతులకు ధీమా లేకపాయ
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినపుడు రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేది పంటల బీమా. అటువంటి పథకాన్ని చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తం చేసింది. అసలు బీమా పథకం అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా మాయ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఖరీఫ్, రబీకి సంబంధించి నాలుగు సీజన్లు ముగిసినా రైతుకు పైసా కూడా బీమా అందలేదు. ప్రీమియం చెల్లించినా.. రిక్తహస్తమే రాష్ట్రంలో పంటల బీమా పథకాలు 1999లో అమలులోకి వచ్చాయి. నిబంధనలు మారుతూ వస్తున్నా ఏటా బీమా పథకం మాత్రం అమలు చేస్తూ వచ్చారు. 2025 రబీలో తొలిసారిగా బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. అంతకు మునుపు 2025 ఖరీఫ్లో బీమా కోసం జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. 2024 రబీలో కూడా 35 వేల మంది పప్పుశనగ రైతులు ప్రీమియం చెల్లించారు. పంటలు దెబ్బతిన్న సమయంలో బీమా పరిహారం మాత్రం అందలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. ఇప్పుడు 2026 ఖరీఫ్ మొదలవుతుండగా పంటల బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీలో ప్రీమియం కట్టాలా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో 18 పంటలకు బీమా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులపై పైసా భారం పడకుండా ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి నిబంధనల మేరకు బీమా కింద పరిహారం ఇస్తూ వచ్చారు. ఏటా ఖరీఫ్లో 12 రకాల పంటలు, రబీలో ఆరు రకాల పంటలకు అటు వాతావరణ బీమా, ఇటు ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాలు వర్తింపజేశారు. ఈ–క్రాప్ ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసి నిబంధనలకు అనుగుణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఏకంగా రూ.1,882 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు. అందులో అనంతపురం జిల్లా రైతులకు రూ.1,160.19 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా రైతులకు రూ.722.61 కోట్ల బీమా పరిహారం జమ అయింది. రెండేళ్లుగా పంటల బీమా కింద పరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కారు ఉచితానికి మంగళం పాడేసి ప్రీమియం భారం మోపినా ప్రయోజనం నిల్ వైఎస్ జగన్ హయాంలో జిల్లా రైతులకు రూ.1,882 కోట్ల బీమా పరిహారం ప్రీమియం లేకుండా ఉచితంగా పంటల బీమా పథకాలతో అప్పట్లో రైతుల్లో ధీమా -
సవితా.. జగనన్నను విమర్శించే స్థాయా నీది?
పరిగి: ‘జగనన్నను విమర్శించే స్థాయిగానీ, కనీస అర్హత గానీ నీకెక్కడుంది మంత్రి సవితా’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.ఆదివారం మండలంలోని మోదా పంచాయతీ చెర్లోపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సొంత తల్లి చేత కేసులు పెట్టించుకున్న సవిత హీనమైన చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు సంస్కారం ఉంది కాబట్టే సవిత చరిత్ర గురించి మాట్లాడడం లేదన్నారు. బీసీలకు ఏం న్యాయం చేశావని ఆ శాఖ మంత్రిగా ఉంటున్నావో చెప్పాలని నిలదీశారు. గుడికట్లకు పింఛన్, 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత క్షేమంగా ఉంటావని హితవు పలికారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేర్పిన క్రమశిక్షణ, విలువలతో రాజకీయం చేస్తున్నామని, హద్దు దాటితే సవిత కంటే బాగా మాట్లాడగలమని హెచ్చరించారు. ఆ పత్రికపై అక్కసు చూపించు పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్ అంశాల్లో చిట్టచివరి స్థానంలో ఉన్నారని రాసిన ఈనాడు పత్రికను వదిలేసి నిజాలను నిర్భయంగా రాసే సాక్షిపై చిందులేస్తావా అంటూ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ జగన్ను విమర్శిస్తావా? ప్రజల దృష్టిలో నీవే పెద్ద సైకో. పెనుకొండ మెడికల్ కాలేజ్ను చూసి కళ్లు బైర్లు కమ్మి నేలను చూపించి అసలు కాలేజే లేదని చెిప్పి పెద్ద జోకరయ్యావు.హాఫ్ నాలెడ్జ్ మంత్రిగా పేరొందావు. ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలను ప్రోత్సహిస్తూ సొమ్ముచేసుకుంటున్న నీవు జగన్మోహన్రెడ్డిపై మాట్లాడితే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అవినీతి అక్రమాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో చరణ్రెడ్డి, మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంపై నిందారోపణలు చేస్తే ఖబడ్దార్ మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజం సాక్షి పత్రికపై చిందులేస్తే సహించబోమని స్పష్టీకరణ -
రాత్రివేళల్లో నిఘా మరింత పెంచండి
కదిరి టౌన్/నల్లచెరువు : ‘‘పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతో రాత్రి వేళ ప్రజలంతా నిద్రపోతారు. వారి నమ్మకాన్ని మనం వమ్ముచేయకూడదు. రాత్రివేళ నిఘా మరింత పెంచాలి. చోరీలు, అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించండి.’’ అని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి వేళ ఆయన కదిరి అర్బన్ పోలీసుస్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం కదిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసుల నైట్ బీట్ విధులను స్వయంగా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా నల్లచెరువు స్టేషన్కు వెళ్లి నైట్ బీట్ విధుల్లో ఉన్న పోలీసుల పనితీరు, స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. నైట్ బీట్ పరిశీలన.. తొలుత కదిరి అర్బన్ పోలీస్ స్టేషన్ను తనికీ చేసిన ఎస్పీ సతీష్కుమార్ అనంతరం వలీసాబ్ రోడ్డు, నిజాంవలీ కాలనీ, కుటాగుళ్ల తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల నైట్బీట్ విధులను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో నేరుగా మాట్లాడిన ఎస్పీ... ప్రజల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంతో రాత్రి వేళ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా కొనసాగుతోందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రాత్రి గస్తీ నిర్వహణ, అనుమానితుల కదలికలపై సమాచారం సేకరణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైతే వేలిముద్రలు సేకరించాలని ఎస్పీ సూచించారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, చోరీలు, ఇతర అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనంతరం ఆయన నల్లచెరువు పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్స్టేషన్లోని పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాత్రి సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న గస్తీని పరిశీలించారు. ఎస్పీ వెంట కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, పట్టణ సీఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించండి పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం శుక్రవారం అర్ధరాత్రి కదిరి, నల్లచెరువు స్టేషన్ల తనిఖీ -
ముఖం చూపితేనే హాజరు!
● హిందూపురానికి చెందిన ప్రకాష్ ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత చదువుకోసం లీవ్ తీసుకున్నాడు. కోర్సులో చేరినప్పటికీ కళాశాల యాజమాన్యంతో హాజరు విషయం మాట్లాడుకుని ఇంటివద్దే ఉంటూ మరోపని చేస్తున్నాడు. ● పుట్టపర్తికి చెందిన రాము అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ కోర్సులో చేరాడు. కానీ రోజూ కళాశాలలకు వెళ్లకుండా హాజరు వేసేలా యాజమాన్యంతో మాట్లాడుకున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతూ కేవలం పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందేలా ప్లాన్ చేసుకున్నాడు. ...ఇలా కళాశాల ముఖమే చూడకుండా కోర్సు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇలాంటి వారికి చెక్ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేసేలా ఆదేశాలిచ్చింది. కదిరి: అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు (డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, తదితర) అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఏఐ ఆధారిత ముఖ హాజరు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు తాజాగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్ తదితర కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచే ఎఫ్ఆర్ఎస్ అమలు చేయనున్నారు. రోజూ రెండుసార్లు ముఖ హాజరు.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ముఖ ఆధారిత హాజరు వేస్తున్నారు. ఉదయం వెళ్లగానే ఒకసారి, తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇంకోసారి ఇలా రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేస్తారు. ఇదే తరహాలో ఇకమీదట ఉన్నత కళాశాలల్లో కూడా బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం ఇలా రెండు సార్లు ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. డుమ్మా కొట్టేవారికి కష్టమే.. జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాల్లో విద్యార్థులు హాజరు కాకపోయినా హాజరైనట్లు చూపుతూ వారినుండి కొంత డబ్బు తీసుకుంటున్నారు. ముఖ హాజరుతో ఇకమీదట వీరి ఆటలు సాగవు. అలాగే కొందరు ఎస్జీ టీచర్లు బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల పేరుతో స్టడీ లీవ్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇలాంటి వారు జిల్లాలో 130 మంది ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం తీసుకురావడంతో ఇకమీదట వీరు కాలేజ్కి డుమ్మా కొట్టేందుకు అవకాశం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కు లింక్.. ఉన్నత విద్య చదివే విద్యార్థులు ఇక మీదట ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే కచ్చితంగా కళాశాలకు వెళ్లాల్సిందే. నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో సుమారు 70 శాతం మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. వీరికి రూ.35 కోట్ల మేర ఖర్చు అవుతోంది. వీరి హాజరుతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొస్తోందని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన ఒక లెక్చరర్ పేర్కొన్నారు. కళాశాలల్లో హాజరుకు కఠిన నిబంధనలు ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులకూ ముఖ హాజరు 2026–27 విద్యా సంవత్సరం నుంచే అమలు -
‘అనంత’ త్యాగధనుడు ‘కల్లూరు’
–: సందర్భం :– రేపు కల్లూరు సుబ్బారావు జయంతిఅనంతపురం కల్చరల్: కళ, సాహిత్య రంగాల్లో విశిష్ట వ్యక్తులకందించే ‘పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు స్మారక పురస్కారాలు –26’ కు గాను జిల్లాకు చెందిన సీనియర్ నటులు సంగాల నారాయణస్వామి, ఆదినారాయణరెడ్డి, ప్రసిద్ధ సాహితీవేత్త, బహు గ్రంథకర్త డాక్టర్ పతికి రమేష్నారాయణను ఎంపిక చేశారు. ఈ మేరకు లలితకళాపరిషత్తు ప్రధాన కార్యదర్శి గాజుల పద్మజ శనివారం వెల్లడించారు. ఎనిమిది పదుల వయసులోనూ యువతరానికి స్ఫూర్తినిచ్చేలా జీవితాలను గడుపుతున్న ఈ ముగ్గురిని పురస్కారాలకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా, తెలుగు, కన్నడ భాషా పండితుడిగా, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బరావు స్ఫూర్తిదాయక జీవితానికి మరింత ప్రాచూర్యం కల్పించడంలో భాగంగా అనంతపురంలోని లలితకళాపరిషత్తు ఆధ్వర్యంలో ఏటా ఆయన జయంతి నాడు పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన జయంతిని పురస్కరించుకుని లలిత కళాపరిషత్లో అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 16వ ఏటనే జాతీయోధ్యమంలో.. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897 మే 25న జన్మించిన కల్లూరు సుబ్బారావు తన 16వ ఏట 1913లో దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకులు అనిబిసెంట్ ప్రసంగాలతో ప్రభావితమై జాతీయోధ్యమంలో చేరి జైలుకు వెళ్లారు. 1921 సెప్టెంబర్ 28న శిక్షా కాలం పూర్తయిన వెంటనే బళ్లారి సభలో గాంధీజీతో కలసి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. 1928 నవంబర్లో నంద్యాలలో జరిగిన సభలో దత్తమండలాలకు రాయలసీమగా పేరు పెట్టిన వారిలో కల్లూరు సుబ్బారావు ప్రముఖులు. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి అనంత ఆణిముత్యాలు కల్లూరి సుబ్బారావు శిష్యులు కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని లలిత కళాపరిషత్తుకు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన సొంత స్థలాలను విరాళంగా ఇచ్చేసి త్యాగానికి ప్రతిరూపంగా మారారు. జిల్లాల్లోని అభ్యుదయ కార్యక్రమాలకు నాంది పలికిన అనంత త్యాగధనుడు కల్లూరు సుబ్బారావు 1973 డిసెంబర్ 20న శాశ్వతంగా కన్నుమూసినా ఆయన విగ్రహాన్ని ఎల్కేపీ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుని కళాకారులు నిత్య నీరాజనాలర్పిస్తూనే ఉన్నారు. -
పర్యావరణంపై గొడ్డలి వేటు
● మరువకొత్తపల్లిలో 22 ఏళ్ల చింతచెట్ల నరికివేత చిలమత్తూరు: సైబీరియన్ పక్షుల విడిది కేంద్రానికి కూతవేటు దూరంలోని మరవకొత్తపల్లి సమీపంలో 22 ఏళ్లనాటి చింత చెట్లను కొందరు ఇష్టారీతిన తొలగిస్తున్నారు. పూతదశలో ఉన్న భారీ వృక్షాలను తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయకుండా ఓ ప్రైవేటు భూమిలో ఉన్న చింత చెట్లు తొలగించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆగినా... సైబీరియన్ పక్షుల విడిది కేంద్రానికి సమీపంలో సుమారు 300 చెట్లు తొలగించేందుకు కొందరు గతంలోనే పూనుకున్నారు. పలువురు గ్రామస్తులు, పర్యావరణవేత్తలు అడ్డుకోవడంతో అప్పుడు చెట్ల తొలగింపు తాత్కాలికంగా ఆగింది. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నేతల అండతో భారీ వృక్షాలను ఇష్టానుసారం తొలగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాలను తొలగించడం ముమ్మాటికీ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించడమేనని పర్యావరణవేత్త భాస్కర్రెడ్డి మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారని, ఏమాత్రం పరిశీలన చేయకుండా చెట్లు తొలగింపునకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, లేనిపక్షంలో వృక్షాలు తొలగించకుండా అడ్డుకుంటానని హెచ్చరించారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శనివారం 32 కేంద్రాల్లో జనరల్ విద్యార్థులకు హిస్టరీ, బోటనీ, ఒకేషనల్ విద్యార్థులకు పేపర్–1 పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 370 మంది విద్యార్థులకు గాను 337 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరైనట్లు ఇంటర్విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఇక మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 395 మందికి గాను 374 మంది విద్యార్థులు హాజరు కాగా, 21 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో మొత్తంగా 54 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
నోటిఫికేషన్ విడుదలైంది
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు ఉంది. ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. మా కళాశాలలో చదివిన పిల్లలు చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత కేవలం ఉద్యోగాలే కాకుండా అధునాతన వ్యవసాయం, డెయిరీ ఫాం, పాడి, ఎరువుల కంపెనీలు తదితర రంగాల్లో రాణించవచ్చు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చు. – డాక్టర్ వసుంధర, ప్రిన్సిపాల్, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల -
ఆర్టీసీకి డీజిల్ సెగ
పుట్టపర్తి టౌన్: చమురు ధరల సెగ ఆర్టీసీకి తగులుతోంది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థపై డీజిల్ ధర పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం జిల్లాలో లీటర్ డీజిల్ రూ.102.15కు చేరుకోవడంతో జిల్లా పరిధిలో ఆర్టీసీకి నెలకు రూ.36 లక్షల మేర అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ఇప్పుడప్పుడే వీడే అవకాశం లేకపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఈక్రమంలోనే ఈనెల 20వ తేదీ వరకూ లీటర్ డీజిల్ రూ.98.07 ఉండగా...ఈ నెల 21వ తేదీన కేంద్రం డీజిల్ పై రూ.3.12 పెంచడంతో లీటర్ రూ.101.19కి చేరింది. తాజాగా శనివారం డీజిల్పై 96పైసలు పెరగ్గా... ప్రస్తుతం లీటర్ డీజిల్ రూ.102.15కి చేరింది. రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఆర్టీసీకి గడ్డుకాలమేనని సంస్థ అధికారులే చెబుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఇప్పటికే పలు సర్వీసులు రద్దు చేసిన ఆర్టీసీ..రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులకు బ్రేక్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రజారవాణాపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజూ 30 వేల లీటర్ల వినియోగం.. జిలాల్లో ధర్మవరం, హిందూపురం, మడకశిర, పెనుకొండ, కదిరి, పుట్టపర్తిలలో ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ ఆరు డిపోల్లోని 380 బస్సులున్నాయి. రోజూ 1.40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజూ సగటున 1.45 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా..30,000 లీటర్లు డీజిల్ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సగటున 6 కిలోమీటర్లలోపు మైలేజీ వస్తుంది. కొన్ని బస్సులు లీటర్కు 5 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తున్నాయి. ఈలెక్కన నెలకు ఎంతలేదన్నా రూ.36 లక్షల మేర ఆర్టీసీపై అదనపు భారం పడనుంది. జనం బెంబేలు.. ఆర్టీసీపై డీజిల్ రూపంలో అదనపు భారం పడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ల ధర పెంచేందుకు సిద్ధమవుతారని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. చాలా గ్రామాలకు ఇప్పటికీ పల్లెవెలుగు బస్సులు మాత్రమే వెళ్తుండగా..చార్జీలు పెంచితే సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. వరుసగా రెండుసార్లు డీజిల్ ధర పెంచిన కేంద్రం నాలుగు రోజుల్లోనే లీటర్పై రూ.4.08 పెరిగిన వైనం జిల్లాలో ఆర్టీసీపై రోజూ రూ.1.20 లక్షల అదనపు భారం సర్వీసులను రోజురోజుకూ కుదిస్తున్న అధికారులు -
అగ్రి కోర్సులు
ఆదరణ పొందుతున్న బుక్కరాయసముద్రం: తక్కువ ఖర్చుతో విశేష ఆదరణ ఉన్న వ్యవసాయ విద్యను అభ్యసించడం ద్వారా త్వరగా ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 10 తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తర్వాత ఇంటర్ చేసి డిగ్రీలు, పీజీ, బీఈడీ, బీటెక్ కోర్సులంటూ చదివి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేకంటే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే మరో 2 ఏళ్లలో ఉద్యోగాలు పొందడానికి చాలా మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. అదే విధంగా మడకశిరలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. వీటితో పాటు అనంతపురం, కదిరి, తాడిపత్రి పట్టణాలలో ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం సీట్లు, అంగవైకల్యం కలిగిన వారికి 3 శాతం సీట్లు కేటాయించారు. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. అగ్రికల్చర్ కోర్సులు చదవడానికి పెద్ద విద్యార్హతలతో పని లేదు. వీటిలో ప్రవేశానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఇప్పటికే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, హర్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వెలువడ్డాయి. దరఖాస్తులను www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా అందజేయాలి. పూర్తి సమాచారం వెబ్సైట్లో పొందుపరిచారు. కావలసిన విద్యార్హతలు తక్కువ ఫీజులకే వ్యవసాయ విద్య కోర్సు వివరాలు.. కోర్సు కాల వ్యవధి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఏళ్లు డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 ఏళ్లు డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ 2 ఏళ్లు డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ 3 ఏళ్లు -
ఎరువు.. ధరల దరువు
కదిరి: ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులను రసాయనిక ఎరువులు సంకటంలో పడేశాయి. ధరలు అమాంతం పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పాటు అంతర్జాతీయ ముడి చమురు ధరల పేరుతో ఎరువుల కంపెనీలు బస్తాకు రూ.250 నుంచి రూ.400 వరకూ ధర పెంచేశాయి. 50 కేజీల కాంప్లెక్స్ ఎరువుల బస్తా మొన్నటి దాకా రూ.2 వేలు ఉంటే ఇప్పుడు రూ.2,350పైగా అమ్ముతున్నారు. సాధారణంగా ఎకరాకు రెండు బస్తాల ఎరువులు వాడతారు. ఈ లెక్కన ఎకరాకు రూ.600 నుంచి రూ.700 వరకూ అదనపు భారం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది రెండుసార్లు ఎరువుల ధరలు పెంచగా, ఈసారి ఖరీఫ్ ప్రారంభంలోనేఽ భారీగా పెంచింది. రానున్న రోజుల్లో మళ్లీ ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఫర్టిలైజర్ షాపుల యజమానులు చెబుతున్నారు. రైతులపై రూ.30 కోట్ల అదనపు భారం.. జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,69,167 హెక్టార్లు. జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన ఏడాదికి 3,500 టన్నుల రసాయనిక ఎరువులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.3 వేలు వరకూ ఎరువుల ధరలు పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కువగా వాడే 20.20.0.13 రకం ఎరువుల బస్తా ధర భారీగా పెరిగింది. ఇందులో 13 శాతం గంధకం ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే దీని ధర సుమారు 15 శాతం పెరిగింది. పెంచిన ఎరువుల ధరల కారణంగా జిల్లా రైతులపై ఈ ఖరీఫ్ సీజన్లోనే రూ.30 కోట్ల దాకా అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు. అప్పుడూ ఇంతే.. రాష్ట్ర విభజన తర్వాత 2014–19 మధ్య కాలంలో కూడా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఐదేళ్లలో నాలుగు సార్లు ఎరువుల ధరలు పెంచింది. ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తోంది. ఈ రెండేళ్లలోనే మూడు సార్లు పెంచింది. కానీ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లూ ఏనాడూ ఎరువుల ధరలు పెంచకపోగా విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల వద్దే అందుబాటులో ఉంచారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువుల కోసం పట్టణాలకు వెళ్లక తప్పలేదు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి ఎరువుల ధరలు ఇలా అమాంతం పెంచేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఎరువుల ధరలు పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఖరీఫ్ సమీపించినా నేటికీ సబ్సిడీ విత్తనం ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలు భారీగా పెంచేసి రైతుపై మోయలేని భారం మోపింది. రెండేళ్లుగా పంటలు చేతికందక ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఎరువుల అదనపు ధరల బరువు మోయలేక కాడి కిందపడేసే పరిస్థితులు నెలకొన్నాయి. బస్తాపై రూ.250 నుంచి రూ.400 వరకు పెంపు జిల్లా రైతులపై రూ.30 కోట్ల దాకా అదనపు భారం ఎరువుల భారంతో రైతన్నల ఆందోళన చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు సేంద్రియ ఎరువులే మేలురైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. అలా చేస్తే దిగుబడులు పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. జిల్లాలో ఎక్కడైనా నిర్దేశించిన ధరలకన్నా అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తాం. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవు. – నారాయణ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
‘సాక్షి’పై మంత్రి సవిత అక్కసు
సాక్షి పుట్టపర్తి: సాక్షి దినపత్రికపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తన అక్కసు వెళ్లగక్కారు. పెనుకొండ పట్టణంలో శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి.. ‘చెత్తను క్లీన్ చేస్తున్నాం, ఈ చెత్త పేపర్ను కూడా చెత్తలోనే వేస్తున్నాం, అబద్దాల పేపర్’ అంటూ చెత్తకుప్పలోకి విసిరారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దందాలు, భూకబ్జాలు, అక్రమాలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా కథనాలు రావడాన్ని మంత్రి సవిత జీర్ణించుకోలేకపోయారు. రొళ్ల సమీపంలో దారిదోపిడీ రొళ్ల: పట్టపగలే ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని బంగారు ఉంగరాన్ని అపహరించిన ఘటన రొళ్లలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం టీడీపల్లికి చెందిన తిమ్మారెడ్డి శనివారం ఉదయం వ్యక్తిగత పనిపై రొళ్లకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా హనుమంతనపల్లి పొలిమేరలో బైలాంజనేయస్వామి ఆలయం వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఒకరు వెనుక నుంచి తిమ్మారెడ్డిని గట్టిగా పట్టుకోగా మరో దుండగుడు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో బాధితుడు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు బోల్తా.. ఐదుగురికి గాయాలుచిలమత్తూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పెద్దనపల్లి క్రాస్ సమీపంలో శనివారం కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వైపుగా వెళుతున్న కారు బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్సాహంగా జాతీయ స్థాయి రాతి దూలం పోటీలుపెద్దవడుగూరు: మండలంలోని ఆవులాంపల్లిలో జాతీయ స్థాయి వృషభాల బల ప్రదర్శన మూడో రోజు సీనియర్ విభాగం పోటీలు హోరాహోరీగా సాగాయి. 11 జతల వృషభాలు పోటీలో పాల్గొనగా తెలంగాణలోని హుజునగర్కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి ఎస్ఎస్ఆర్ బుల్స్ ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్కే బుల్స్, తృతీయ స్థానంలో హైదరాబాద్లోని ప్రగతి రీస్టార్ట్ బుల్స్, నాల్గో స్థానంలో అనంతపురం జిల్లా చౌటపల్లి రైతు ఓబుళరెడ్డి, అక్కంపల్లి ఇంద్రారెడ్డి వృషభాలు, ఐదో స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్కే బుల్స్, ఆరో స్థానంలో అనంతపురం జిల్లా రేగడికొత్తూరు ఆలగనురు గౌతమిరెడ్డి వృషభాలు, ఏడో స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ వృషభాలు, ఎనిమిదో సాఓ్థనంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి రైతు తోట తిరుపాల్రెడ్డి వృషభాలు, కామాలాపురం ఆదిల్కు చెందిన వృషభాలు, తొమ్మిదో స్థానంలో వైఎస్సార్ జిల్లా కల్లూరు శివకృష్ణయాదవ్ వృషబాలు నిలిచాయి. విజేతలకు ఎస్ఐ ఆంజనేయులు, నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. -
పర్యవేక్షణ నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమర్థవంతమైన పర్యవేక్షణ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే విద్యారంగ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతామని డీవైఈఓలు, ఎంఈఓ–2లకు శ్రీసత్యసాయి జిల్లా విద్యాధికారి కృష్ణప్ప సూచించారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (ీపీఏఎల్), టీచ్ టూల్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ అంశాలపై జోన్–6 పరిధిలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని డీవైఈఓలు, ఎంఈఓల–2లకు శనివారం అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణప్ప మాట్లాడుతూ.. ఈ శిక్షణ ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఎంతో ఉపయుక్తం కానుందన్నారు. ‘పీఏఎల్’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కిషోర్ బాబు మాట్లాడుతూ... ట్యాబ్ల ద్వారా విద్యార్థులు స్వయంగా అభ్యసన కొనసాగించే ‘పీఏఎల్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. టీచ్ టూల్ స్టేట్ రిసోర్స్ పర్సన్ నాగేంద్ర మాట్లాడుతూ.. డాష్బోర్డ్, మానిటరింగ్ విధానాలను వివరించారు. టీసీఎస్ రిసోర్స్ పర్సన్ విజయ్ మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణ విధానాలను వివరించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణలో ఏఎంఓలు వేణుగోపాల్, చంద్రశేఖర్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణి రాజు పాల్గొన్నారు. డీవైఈఓలు, ఎంఈఓ–2లకు శిక్షణ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా విద్యాధికారి కృష్ణప్ప -
కట్టడం పైనుంచి కిందపడి వ్యక్తి మృతి
హిందూపురం: స్థానిక గుడ్డం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కట్టడం పైనుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. శనివారం సాయంత్రం భవనం పై అంతస్తులో ఎర్రకొట్టాలకు చెందిన ఎలక్ట్రీషియన్ బాబ్జాన్ (30) పని చేస్తూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో అతనితో పాటు సవార్లపై నిలబడిన మరో కార్మికుడు జావీద్ఖాన్ కూడా కిందపడ్డాడు. తోటి కార్మికులు గమనించి ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాబ్జాన్ మృతి చెందాడు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
విత్తన పంపిణీకి చర్యలు చేపట్టండి
● సిబ్బందికి జిల్లా వ్యవసాయాధికారి నారాయణ నాయక్ ఆదేశం ధర్మవరం రూరల్: ఖరీఫ్లో పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో విత్తన పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) నారాయణ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో కలిసి ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి సీడ్స్, విజేత అగ్రిటెక్ ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. విత్తన శుద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టోన్ రిమూవర్ యంత్రాన్ని పరిశీలించి సిబ్బందితో వివరాలు ఆరా తీశారు. వీలైనంత త్వరగా విత్తనాలు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్లాంట్ యజమానులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. బీటెక్, ఎం ఫార్మసీ, బీబీఏ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్, ఎంఫార్మసీ, బీబీఏ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23), రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, బీటెక్ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఎం ఫార్మసీ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్, సప్లిమెంటరీ, రెండో సంవత్సరం (ఆర్–21) సప్లిమెంటరీ, బీబీఏ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎస్.శారద, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం వెబ్సైట్లో చూడాలని సూచించారు. ఎస్కేయూలో పలు పదవుల భర్తీ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా పలు పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ రమేష్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీడీసీ డీన్గా డి.ప్రభాకర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్గా ఎంవీ లక్ష్మయ్య, ఫార్మాసూటికల్స్ డైరెక్టర్గా సి.సురేష్కుమార్, యూజీసీ డీన్గా జి.నరసింహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా జీవీ రమణ, అడిషనల్ వార్డెన్ (మెన్) సదాశివారెడ్డి, అడిషనల్ వార్డెన్ (ఉమెన్) ఖేజియారాణి, ఉమెన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా ఎస్.అనిత, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ను దాశరథి రవీంద్ర, పీఆర్వోగా డాక్టర్ మాధవిని నియమించారు. -
బాధితుడికి పరామర్శ
బత్తలపల్లి: పేదరికం కారణంగా సరైన వైద్య చికిత్సలు పొందలేకపోతున్న రాజాకు అండగా బత్తలపల్లి పీహెచ్సీ వైద్యులు నిలిచారు. రాజా దుస్థితిపై ‘పేదకుటుంబానికి పెద్ద కష్టం’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై పీహెచ్సీ వైద్యాధికారి అరుణ్కుమార్ స్పందించారు. ఎంపీహెచ్ఏ డేవిడ్, ఎంఎల్హెచ్పీ, ఆశా వర్కర్లతో కలిసి శనివారం బత్తలపల్లిలోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వైద్య సేవలు అందించారు. రాజా కోలుకునేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. దాతలు సైతం ఎవరైనా ముందుకు వచ్చి ఆ పేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ప్రథమ చికిత్స కేంద్రం సీజ్ హిందూపురం టౌన్: స్థానిక రహమత్పురలో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని వైద్యశాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. కేంద్రంలో ఇంజక్షన్లు, వైద్య వినియోగ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రహమత్పుర నివాసి విజయలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణకు జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యాధికారి నవీన్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రం పరిమితులను దాటి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్రాన్ని సీజ్ చేశారు. గంజాయి విక్రేత అరెస్ట్గోరంట్ల: మండలంలోని కొండాపురం క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న కదిరికి చెందిన షేక్ ఖాజావలిని అరెస్ట్ చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సమయంలో షేక్ ఖాజావలి పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 1,010 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు వివరించారు. -
అర్హత లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలి
హిందూపురం టౌన్: ఎలాంటి అర్హతలు లేకున్నా హిందూపురంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హత లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలని హిందూపురం ప్రైవేట్ ఆస్పత్రుల, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ధన్య గ్లోరీ హాస్పిటల్ పేరుతో అర్హత లేని వ్యక్తులు ఆస్పత్రి నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ వైద్యుల వ్యవహారాన్ని బయటపెట్టినందుకు తనపై కొందరు వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తామని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యురాలిగా చలామణి అవుతూ గత ఎనిమిదేళ్లుగా ఆస్పత్రి నిర్వహిస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆస్పత్రిలో తనిఖీ చేపట్టి నకిలీ వ్యవహారం నిజమని తేల్చి సీజ్ చేశారని గుర్తు చేశారు. అయితే సీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే మళ్లీ అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి అర్హత లేని ఆసుపత్రులను వెంటనే మూసివేయాలని, లేకపోతే వైద్యులందరూ కలిసి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జక్కా నరేంద్ర, డాక్టర్ అశ్వత్థరెడ్డి, డాక్టర్ రోహిల్కుమార్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ వస్తుంది.. బొమ్మలు తెస్తుంది!
బత్తలపల్లి: ‘అమ్మ ఊరికెళ్లింది... ఇప్పుడొస్తుంది. మనకు బొమ్మలు తెచ్చిస్తానంది’ అంటూ అన్న చెల్లెలు ముచ్చటించుకోవడం చూసిన స్థానికులకు కన్నీరు ఆగలేదు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నతల్లి మృతి చెందిందనే విషయం తెలియని చిన్నారులను చూసిన వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే... తాడిమర్రి మండలం నార్శింపల్లి గ్రామానికి చెందిన భూమే దివ్యప్రసాద్, భూమే శివమ్మ(32) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. గురువారం బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామంలో ఓ శుభకార్యానికి దివ్యప్రసాద్, శివమ్మ ద్విచక్రవాహనంలో వెళుతుండగా రామాపురం సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున శివమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలియని చిన్నారులు.. మరికాసేపట్లో అమ్మ వస్తుందని, ఆడుకునేందుకు బొమ్మలు తెచ్చిస్తుందంటూ మాట్లాడుకోవడం గమనించిన స్థానికుల హృదయాలు బరువెక్కిపోయాయి. కాసేపటి తర్వాత తల్లి మృతదేహం ఇంటి వద్దకు చేరుకోవడంతో చిన్నారులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శివమ్మ(ఫైల్), తల్లి మృతి విషయం తెలియక ముందు చిన్నారులు తల్లి మృతి విషయం తెలియని చిన్నారులు -
ఐదు కాళ్ల దూడ జననం
రొళ్ల: స్థానిక మారుతీ కాలనీలో నివాసముంటున్న రైతు దాసేగౌడు పాడి ఆవు శనివారం ఐదు కాళ్లు కలిగిన దూడను ప్రసవించింది. ముందు రెండు కాళ్లు, వెనక మూడు కాళ్లు ఉండడం గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి పుట్టుకలు ఉంటాయని పశువైద్యాధికారి పేర్కొన్నారు. శస్త్రచికిత్స ద్వారా అదనపు కాలిని తొలగించే అవకాశముందని, ఇందు కోసం మడకశిరలోని ప్రశువైద్యాధికారులను సంప్రదించాలని రైతుకు సూచించారు. పీఆర్సీని నియమించాలి : ఆపస్పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) ఆధ్వర్యంలో శనివారం బుక్కపట్నంలో జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ.. పీఆర్సీ నియామకం చేయాలని, ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు పరీక్షల్లో తెలుగులో సమాధానాలను రాసినా మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులలో నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అమరా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సురేష్బాబు, మహిళా ప్రముఖ్ ప్రసన్న లక్ష్మి, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేబుల్ అపహరణ కదిరి అర్బన్: మండలంలోని వీరేపల్లిపేటలో రైతుల వ్యవసాయ మోటార్లకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ ప్రాంతంలో ప్రవహిస్తున్న మద్దిలేరులో 16 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్ల విద్యుత్ కేబుల్ అపహరణకు గురైనట్లు బాధితులు శనివారం కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.1 లక్షకు పైబడి ఉంటుందని పేర్కొన్నారు. -
బంధువును పరామర్శించి వస్తూ పరలోకాలకు..
● లారీ ఢీ కొనడంతో మహిళ మృతి రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే భార్యను కోల్పోయాడో భర్త. పోలీసుల వివరాలమేరకు... బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లకు చెందిన నాగవేణి (36), రామచంద్ర దంపతులు సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివిస్తూ జీవనం సాగిస్తున్నారు. బంధువుకు తేలు కుట్టడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి దంపతులు పరామర్శించేందుకు వెళ్లారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. అనంతపురం నగరం దాటిన తర్వాత అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైకును బలంగా ఢీకొంది. వెనుక కూర్చున్న నాగవేణి రోడ్డుపై పడిపోయింది. అంతలోనే లారీ ఆమైపె నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మృతదేహాన్ని చూసి రామచంద్ర కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనం ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. -
నిండు ప్రాణం తీసిన ‘పిడుగు’
● శబ్ధానికి మృతి చెందిన యువకుడు బత్తలపల్లి: పిడుగు పడిన శబ్ధానికి ఓ యువకుడి గుండె ఆగిన ఘటన మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల వివరాలమేరకు.. ఉప్పర్లపల్లికి చెందిన చాకలి గంగాధర్(40) కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీతో పాటు కుమార్తెలు హారిక (ఇంటర్ ద్వితీయ సంవత్సరం), శమిత (9వ తరగతి), కుమారుడు అభిలేష్ (4వ తరగతి) చదువుతున్నారు. గురువారం రాత్రి పిల్లలతో కలిసి లక్ష్మీ ఇంట్లో నిద్రిస్తుండగా.. ఉక్కపోత కారణంగా గంగాధర్ ఆరుబయట నిద్రపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడడంతో ఆ శబ్ధానికి గంగాధర్ గుండె ఆగి చనిపోయాడన్నారు. వర్షం పడుతోందని కుటుంబ సభ్యులు గంగాధర్ను లేపేందుకు ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించి 108కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, తంబాపురం మాజీ సర్పంచు సానే జయచంద్రారెడ్డి గ్రామానికి చేరుకుని గంగాధర్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవుల మృతి తలుపుల: మండలంలోని దేవరపల్లిలో గురువారం రాత్రి కురిసిన గాలి వానకు 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి. మల్లినాయుడు ఇంటి వద్ద వైర్లు కింద పడగానే వర్షపు నీటికి తగలడంతో పక్కనే ఉన్న రెండు ఆవులకు విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాయి. రెండు ఆవులు చనిపోవడంతో రూ.90 వేలు నష్టం వచ్చిందని బాధితుడు మల్లినాయుడు తెలిపారు. ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సెల్ఫోన్ చూస్తూ కానరాని లోకాలకు... ● నీటి సంపులో పడి యువకుడి మృతి బ్రహ్మసముద్రం: నీటి సంప్లో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిల్లలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు... మండల పరిధిలోని పిల్లలపల్లికి చెందిన మాల మల్లన్న నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. వారింట్లో టైల్స్, గ్రానైట్ బండలు వేసే పనికి అనంతపురం నుంచి యువకులు వచ్చారు. వారిలో అనంతపురంలోని చంద్రబాబునగర్కు చెందిన మహ్మద్ గౌస్ (25) కూడా ఉన్నాడు. గురువారం రాత్రి మహ్మద్ గౌస్ సెల్ఫోన్ చూసుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి వ్యక్తి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని తాడిపత్రి–చల్లవారిపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం గూడ్స్ కింద పడి వ్యక్తి (45) మృతి చెందాడని జీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు. గూడ్స్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ కోసం తనిఖీ చేశామన్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. -
●తాగునీటి కోసం మహిళల నిరసన
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. తాజాగా శుక్రవారం పట్టణంలోని మొలకాల్మూరు రహదారిపై మహిళలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వారం రోజులవుతున్నా నీరు సరఫరా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
గంజాయి విక్రేత అరెస్టు
గుత్తి: పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన తపిల రఘు అనే గంజాయి విక్రేత, మట్కా బీటరును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 1,10,000 నగదుతో పాటు 50 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ గతంలో కొందరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశామన్నారు. అయితే తపిల రఘుతో పాటు మరో ఇద్దరు పరారయ్యారన్నారు. వారిలో తపిల రఘును అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. -
ప్రశ్నించే గొంతును నొక్కడమే
● నారా లోకేష్ మౌఖిక ఆదేశాలతోనే గన్మెన్లను తొలగించారు ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసుకున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్కు తనపై తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా కట్టడి చేయాలనే కుట్ర జరిగిందని ఆరోపించారు. లోకేష్ మౌఖిక ఆదేశాలతోనే ఎస్పీ కార్యాలయం ఎలాంటి నోటీసూ లేకుండా తనకు గన్మెన్లను తొలగించిందని విమర్శించారు. రాప్తాడు అరాచకాలపై గళమెత్తా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యలు, దళిత బాలికపై అత్యాచారం, భూవివాదాలు, ఇసుక దోపిడీ, టమాట మార్కెట్లో అక్రమ వసూళ్లు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం వంటి అంశాలపై తాను గళమెత్తానని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్, పేరూరు డ్యాంలో నీరు లేక రైతుల బోర్లు ఎండిపోవడం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపానన్నారు. రాప్తాడులో జరుగుతున్న అన్యాయాలపై కూడా స్పందించాలని లోకేష్ను కోరారు. ప్రజలే నాకు రక్షణ ‘నా ప్రాణానికి ముప్పు ఉందని భావించి పదేళ్లుగా గన్మెన్లను కొనసాగించిన అధికారులు, ఇప్పుడు ఒక్కసారిగా తొలగించడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. గన్మెన్లు లేకపోయినా ప్రజలే నాకు రక్షణ’ అని ప్రకాష్రెడ్డి అన్నారు. పాపంపేటలో ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం ‘పాపంపేటలో ఇళ్లన్నీ కూల్చేస్తామని ఇటీవల ఎవడో ఒకడు అక్కడికి వచ్చి అన్నాడంట. వాడి తల నేలకూల్చుతాం తప్ప ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం’ అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. 1991, 1997 మధ్యనే 106, 119 సర్వే నంబర్లలోని భూములను పూర్తిగా శోత్రియంధారులకు స్వాధీనం చేసిందన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించి తెచ్చుకున్న ఆర్డర్తో ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ భూములు స్వాధీనం చేసుకుని అప్పట్లోనే అమ్ముకున్నారన్నారు. 30 ఏళ్ల తర్వాత తాను వారసుడినని ఒకడు వచ్చాడన్నారు. గత ప్రభుత్వంలో కోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తే... ప్రజల తరఫున వెళ్లి అప్పటి కలెక్టర్ నాగలక్ష్మిని కలిశానన్నారు. జడ్జిమెంట్ పట్టణానికి సంబంధించిన సర్వే నంబరుదని, సదరు వ్యక్తి అధికారికంగా వారసుడు కాదని, వారు పేర్కొన్న భూములన్నీ 1990–97 మధ్యే స్వాధీనం చేసినట్లు ఆధారాలతో కలెక్టర్ కోర్టుకు సమర్పించడంతో జడ్జి దీన్ని పక్కన పెట్టారన్నారు. ప్రభుత్వం మారాక హైకోర్టు పీపీని లోబరుచుకుని ప్రభుత్వాన్ని నమ్మించి, ఇక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో 14 ఇళ్లను కూల్చివేయించారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి వపన్, నీరుగంటి నారాయణరెడ్డి, పాపంపేట ప్రసాద్రెడ్డి, ఈశ్వరయ్య, ఎంపీటీసీలు వెంకటేశులు, సందీప్యాదవ్, పాపంపేట భూముల బాధితులు పాల్గొన్నారు. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లి బాలికల ఉన్నత పాఠశాల వెనుక వేల్పుమడుగు రోడ్డులో నారాయణ, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒకే ఒక్క కుమారుడు రాజా (36) ఉన్నాడు. వారు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి వద్ద హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రస్తుతం హోటల్ జరగక తీసేశారు. పదో తరగతి వరకూ చదివిన రాజా బెంగళూరులో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. అతనికి పెళ్లి అయినా దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో విడిపోయారు. అయితే రాజా కామెర్ల బారిన పడ్డాడు. ఆ సమయంలో సరైన చికిత్స చేయించుకోకపోవడంతో కిడ్నీలు చెడిపోయాయి. బోధకాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. మూడేళ్లుగా సపర్యలు కిడ్నీలు చెడిపోవడంతో పాటు బోధకాలు రావడంతో రాజా మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆయన ఆలనపాలనా అంతా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పటికే రాజాను బతికించుకునేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స, ఆపరేషన్ చేయించాలంటే రూ.40 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారని నారాయణ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు, మానవతావాదులు సాయం చేసి తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. తనకు బతకాలని ఉందని, సాయం చేయాలని రాజా ఆర్థిస్తున్నాడు. చెడిపోయిన కిడ్నీలు, బోధకాలుతో ఒక్కగానొక్క కుమారుడి అవస్థలు కొడుకును బతికించాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు మానవతావాదులు, దాతలు సాయం చేయాలని వినతి సాయం చేయాలనుకునే వారు.. రాజా చికిత్స, ఆపరేషన్ కోసం మానవతా దృక్పథంతో ఆర్థికసాయం చేయాలనుకునే వారు పేరు: DEVARA NARAYANA, APGP BANK A/C NUMBER : 19111576036, IFSC CODE : APGP0001056కు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే సెల్ నంబర్ 8978422487కు ఫోన్ పే ద్వారా కూడా ఆర్థికసాయం అందించవచ్చని తెలియజేశారు.విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచి, వారిని పోషించాల్సిన వయస్సులో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యానికి గురై మంచాన పడటంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు. మూడేళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడిని బతికించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. -
మడకశిరలో రోడ్డెక్కిన దళితులు
మడకశిర: మడకశిరలో శుక్రవారం దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళితులు రోడెక్కారు. గుడిబండ మండలం మందలపల్లికి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ దళిత సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దళితులు పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విజయభాస్కర్ మృతి మిస్టరీని వెంటనే ఛేదించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్ సాకే హరి మాట్లాడుతూ విజయభాస్కర్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికీ విజయభాస్కర్ది హత్యేనన్నారు. పోలీసులు హంతుకులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ వెంటనే పోలీసులు కేసు మిస్టరీని తేల్చాలన్నారు. పోస్ట్మార్టం నివేదికను బయటపెట్టాలని కోరారు. అనంతరం దళిత సంఘాల నాయకులు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రమిచ్చారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతు, ఎస్సీ జన సంఘం అధ్యక్షుడు కుళ్లాయప్ప, బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామక్రిష్ణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జేబీపీ నాయకుడు గట్ట రామాంజనేయులు, గుడిబండ జెడ్పీటీసీ భూతరాజు, మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రంగనాథ్, దళిత సంఘం నాయకులు నిజవల్లిబాబు, రొళ్ల శ్రీనివాస్, నారాయణప్ప, నరసింహ, లక్ష్మీనారాయణ, తిప్పయ్య, సురేష్, చంద్రశేఖర్, కాంతరాజు పాల్గొన్నారు. విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ -
పనులు పారదర్శకంగా చేపట్టాలి
తనకల్లు: ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిఽషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది గ్రామాల్లో పనులపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో దాదాపు రోజూ 2,500 పైగా కూలీలు పనులకు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే కేవలం 1500 మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకొని పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ టార్గెట్ను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామానాయక్, ఏపీఓ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. 14 తులాల బంగారు చోరీధర్మవరం రూరల్: మండల పరిధిలోని కుణుతూరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి ఎదురుగా నివాసం ఉన్న లక్ష్మినారాయణరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. రూరల్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు మేరకు.. లక్ష్మినారాయణరెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి గురువారం పుట్టపర్తికి వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లో ఉన్న సెల్ఫ్లో పెట్టుకున్న సుమారు 14 తులాల బంగారు నగలు చోరీ జరిగినట్లు గుర్తించామని బాధితుడు లక్ష్మినారాయణరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. పాముకాటుతో యువకుడి మృతి పరిగి: మండల కేంద్రంలోని 90 ఇండ్ల ఎస్సీ కాలనీ అంబేడ్కర్నగర్కు చెందిన పవన్(18) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. మూడు రోజుల క్రితం పవన్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేసిందన్నారు. హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అతని ఆరోగ్య స్థితి మెరుగుపడకపోవడంతో శుక్రవారం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని పేర్కొన్నారు. చేతికొచ్చిన కుమారుడు ఇలా అకాల మరణంతో పొందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రేమ పేరుతో బాలికలపై అత్యాచారం?! ● పోలీసుల అదుపులో నిందితులు తాడిపత్రిటౌన్: సెల్ఫోన్, టీవీలను చూస్తూ ప్రేమకు ఆకర్షితులై అభం శుభం తెలియని బాలికలు కేటుగాళ్ల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. తాడిపత్రి పట్టణం సంజీవనగర్కు చెందిన 8వ తరగతి విద్యార్థినిని అదే కాలనీకి చెందిన 10వ తరగతి చదివి మానేసిన బాలుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో పాటు బాలికతో దాదాపు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఇప్పించుకొని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి జల్సా చేశారు. అలాగే టైలర్స్ కాలనీకి చెందిన మరో 8వ తరగతి విద్యార్థినిని.. ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నుంచి దాదాపు 6 తులాలు బంగారు ఆభరణాలు ఇప్పించుకొని ఇంటికి ఏసీ, తల్లిదండ్రులకు విలువైన సెల్ఫోన్లను కొనిచ్చినట్లు తెలిసింది. అయితే ఇంట్లోని బంగారం మాయం కావడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు బాలికలను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. విషయాన్ని బాలికల తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితులతో పాటు వారి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గుట్టుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి శెట్టూరు: మండలంలోని ఎర్రబోరేపల్లికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకోంది. గ్రామస్తుల వివరాలమేరకు.. గ్రామ సమీపంలోని నల్లకొండ ప్రాంతంలోకి శ్రీకాంత్ గొర్రెలను మేపు కోసం తీసుకెళ్లాడు. అదే సమయంలో పొదల చాటున దాగి ఉన్న ఎలుగుబంటి శ్రీకాంత్పై ఒక్కసారిగా దాడిచేసి గాయపర్చింది. చుట్టు పక్కల రైతులు గమనించి ఎలుగుబంటిని తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
హోరాహోరీగా రాతిదూలం పోటీలు
పెద్దవడుగూరు: మండల పరిధిలోని ఆవులాంపల్లిలో శుక్రవారం జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రెండవరోజు న్యూ కేటగిరి విభాగంలో వృషభాల పోటీలు ప్రారంభం కాగా పోటీల్లో 17 జతలు పాల్గొన్నాయి. హోరా హోరీగా జరిగిన పోటీలో మొదటిస్థానంలో కడప జిల్లా చౌటపల్లె మూర్థల చంద్ర ఓబుళరెడ్డి, రెండో స్థానంలో పల్నాడు జిల్లా ఇర్లపాడు మంగు రమాదేవి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా ఏ.నారాయణపురంకు చెందిన షేక్ మహ్మద్ ఫరీద్ ఎద్దులు నిలిచాయి. వారికి వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు నగదు బహుమతులను అందజేశారు. -
శాంతించిన సూరీడు
●రానున్న నాలుగు రోజులూ వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ‘అనంత’ను భగభగలాడించిన సూరీడు శాంతించాడు. గురువారం అర్థరాత్రి వరుణుడు కరుణించడంతో శుక్రవారం పగలంతా సూర్య ప్రతాపం తగ్గిపోయింది. వేసవితాపం, ఉక్కపోత, వడగాల్పుల మధ్య నెలల తరబడి అలమటించిన జిల్లా ప్రజలు చల్లదనంతో సాంత్వన పొందారు. ఇదిలా ఉండగా రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఈ నెల 27 వరకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. 23న 8 మి.మీ, 24న 10 మి.మీ, 25న 0.5 మి.మీ, 26న 6 మి.మీ, 27న 7 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. అక్కడక్కడా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఉక్కపోతతో పాటు వర్షం, గాలులు సంభవించే వాతావరణం ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నేత బైండోవర్ ● ప్రొ.నాగేశ్వర్ వీడియోను షేర్ చేయడంతో చర్యలు చిలమత్తూరు: పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం హరిస్తోంది. చివరకు ఇతరులు చేసిన వీడియోను షేర్ చేసినా కేసులు పెట్టి వేధిస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న కారణంతో వైఎస్సార్సీపీ రజక విభాగం జిల్లా అధ్యక్షుడు సి.రమేష్ను చిలమత్తూరు పోలీసులు శుక్రవారం బైండోవర్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దండంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సూచించినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు రమేష్పై చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలను వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా..? లేక నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. బైండోవర్లు చేసి పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. రమేష్కు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. నీటి కోసం మహిళల నిరసనాగ్రహం● చిలమత్తూరులో ఖాళీ బిందెలతో రాస్తారోకో ● బాలకృష్ణ ఇలాకాలో తాగునీరు కరువు చిలమత్తూరు: పాలకులు పట్టించుకోరు...అధికారులు కళ్లుండీ కన్నీటి కష్టాలు చూడటం లేదు.. దీంతో విసిగిపోయిన జనం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయిస్తున్నారు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో గుక్కెడు నీరు కరువు కావడంతో రోజుకో గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా చిలమత్తూరు బీసీ కాలనీ మహిళలు తాగునీటి సమస్య పరిష్కారానికి ఖాళీ బిందెలతో నడిరోడ్డుపై నిరసనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, నాయకులు తమ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. రోడ్కెక్కి తమ సమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపైకి చేరుకుని వాహనాలను ఆపేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కావడంతో అధికారులు అప్పటికప్పుడు ఒక ట్యాంకర్ పంపించి చేతులు దులుపుకున్నారు. -
‘స్పాట్ బిల్లింగ్’ టెండర్లు పిలిచేవారేరీ?
అనంతపురం టౌన్: నెలవారీ విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లులు ఇచ్చే స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టు గడువు ముగిసినా కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇద్దరే కాంట్రాక్టర్లు స్పాట్ బిల్లింగ్ టెండర్లు దక్కించుకున్నారు. మార్చి నెలకు టెండర్ గడువు ముగిసింది. అయితే అధికారులు కొత్తగా టెండర్లు పిలవకుండా పాత వారికే నెలనెలా పొడిగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు విద్యుత్ డివిజన్ల పరిధిలో దాదాపు 16 లక్షలకు పైగా సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. వీటిని 24 సబ్ డివిజన్లుగా విభజించి.. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టుకు టెండర్లు పిలవాల్సి ఉంది. నిబంధనలు పాటించని అధికారులు స్పాట్ బిల్లింగ్ టెండర్ల విధానంలో విద్యుత్శాఖ అధికారులు నిబంధనలు పాటించడంలేదు. టెండర్ల గడువు ముగిసిన వెంటనే టెండర్లు పిలవకుండా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పాతవారినే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ‘చిన్న బాస్’గా పిలిచే ఓ మంత్రితో విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి గతంలో టెండర్లు పొందారు. 413 మందిపైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటే అందరినీ పక్కన పెట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 24సబ్ డివిజన్లను వీరికే కట్టబెట్టారు. టెండర్లు దక్కించుకున్న నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సంస్థకు సక్రమంగా డిపాజిట్లు సైతం చెల్లించలేదని తెలుస్తోంది. అలాంటి కాంట్రాక్టర్లనే కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రతి నెలా రూ.90 లక్షలకు పైగా బిల్లులు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు బిల్లింగ్ రీడర్లకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. జీతాలు అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నా విద్యుత్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్పాట్ బిల్లింగ్కు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది. గడువు ముగిసి రెండు నెలలు పూర్తి పాత కాంట్రాక్టర్లకే ప్రతి నెలా పొడిగింపు బిల్లు రీడర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్లుఆదేశాలు రాగానే టెండర్లు పిలుస్తాం ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి ఆదేశాలు రాగానే స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్లు పిలుస్తాం. ప్రస్తుతం బిల్లింగ్ ఆలస్యమతుందనే ఉద్దేశంతోనే నెల నెలా పొడిగించుకుంటూ వస్తున్నాం. వినియోగదారులకు సకాలంలో విద్యుత్ బిల్లులు ఇచ్చే బాధ్యత మాపై ఉంది. – శేషాద్రిశేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ -
ఇంటర్ సప్లిమెంటరీకి 243 మంది గైర్హాజరు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 32 కేంద్రాల్లో శుక్రవారం జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు మొదటి సంవత్సరం విద్యార్థులు 3,525 మందికి గాను 3,351 మంది హాజరు కాగా 171 మంది గైర్హాజరైనట్లు ఇంటర్విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,164 మందికిగాను 1,092 మంది హాజరు కాగా, 72 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు. మొత్తంగా 243 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రీసర్వే తప్పులపై అర్జీల వెల్లువ● నల్లమాడ ‘పరిష్కార వేదిక’లో రైతుల గగ్గోలు పుట్టపర్తి అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన రీసర్వే మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది. రీసర్వే పూర్తయ్యాక రైతులకు ఇస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల్లో వివరాలన్నీ తప్పులు తడకగా ఉంటున్నాయి. సర్వే నంబర్ తప్పుగా నమోదుకావడం, భూ విస్తీర్ణం లెక్కింపులో తేడా ఉండటం, హద్దులు మారిపోవడం తదితర సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం ‘ఒక నెల –ఒక నియోజక వర్గం –నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా నల్లమాడలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించగా...రీ సర్వే తప్పులపై స్థానిక రైతులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు అందాయి. దీంతో కలెక్టర్ స్థానిక తహసీల్దార్తో అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు. మిగతా వాటినీ పరిష్కరిస్తామని అర్జీదారులకు తెలిపారు. మొత్తంగా 97 అర్జీలు అందగా... 34 సమస్యలను అక్కడే పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక పుట్టపర్తి మండలానికి చెందిన వారు 18 అర్జీలు, బుక్కపట్నం మండలానికి చెందిన వారు రెండు అర్జీలిచ్చారన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూర, డీఆర్ఓ కొడయ్య, ఆర్డీఓ సువర్ణ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో చోటుపుట్టపర్తి: వైఎస్సార్ సీపీ అనుబంధ రాష్ట్ర కమిటీల్లో జిల్లా వాసులకు స్థానాలు దక్కాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని రాష్ట్ర కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన భూక్యా కృష్ణానాయక్ను నియమించారు. అలాగే వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుట్టపర్తికి చెందిన పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా మడకశిరకు చెందిన జయప్రకాష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కదిరికి చెందిన భూమిరెడ్డి నరసింహారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా పుట్టపర్తికి చెందిన సాయిగీత, మడకశిరకు చెందిన నేత్రావతి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన ఈరన్న, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన అనంతరాజు, కల్చరల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా మడకశిరకు చెందిన మహేంద్రప్ప, ఆర్టీఐ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన సత్యనారాయణ యాదవ్లను నియమించారు. జిల్లా కమిటీలో పలువురికి స్థానం వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన నరసారెడ్డిని నియమించారు. అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా హిందూపురానికి చెందిన అంజినరెడ్డిని, పార్టీ అనుబంధ కమిటీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన నారాయణస్వామిని నియమించారు. నియోజకవర్గం కమిటీల్లో పలువురి నియామకం కదిరి నియోజకవర్గ వలంటీర్స్ విభాగం అధ్యక్షుడిగా యు.నారాయణస్వామి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కలవ రామాంజనేయులు, పుట్టపర్తి నియోజక వర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన ఉదయ్భాస్కర్రెడ్డిని నియమించారు. ఇక నల్లచెరువు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన ఈ.బాలకృష్ణానాయక్ను నియమించారు. అలాగే కదిరి మున్సిపల్ ప్రచార విభాగం అధ్యక్షుడిగా కదిరికి చెందిన కోలార్ హసీన్ షహజాదే, మడకశిర నగర పంచాయతీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మడకశిరకు చెందిన అంజలిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
మట్టి మాఫియాను నియంత్రించకపోతే ఉద్యమం
పరిగి: సహజవనరులను కాపాడాల్సిన పాలకులే అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడితే ప్రజల గోడు ఎవరు పట్టించుకుంటారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత తన అనుచరుల అక్రమాలకు అండగా నిలవడంతో పాటు అధికారులను సైతం కట్టడి చేయడం దారుణమన్నారు. మట్టిమాఫియాను నియంత్రించి.. చెరువుల్లోని సారవంతమైన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకునే అవకాశం కల్పించాలన్నారు. లేకపోతే రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని పరిగి పెద్ద చెరువు వద్ద రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. చెరువు పరిసర ప్రాంతాలైన ధనాపురం, వన్నంపల్లి సమీపంలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతులను పరిశీలించారు. పొలాలకు తరలిస్తే అక్రమ కేసులా? మంత్రి అనుచరులు రాత్రింబవళ్లు మట్టి తోలుకుంటున్నా అటువైపు చూడని ఇరిగేషన్ అధికారులు... చెరువు మట్టిని పొలాలకు తోలుకునే రైతులకు మాత్రం సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారని ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత అనుచరులే మట్టిమాఫియాగా ఏర్పడి నిత్యం వందలాది ట్రాక్టర్ల, టిప్పర్లతో మట్టిని తరలిస్తూ రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసి వాహనాలను పట్టుకున్నా...వెంటనే మంత్రి సవిత ఫోన్ చేసి వాటిని విడిచిపెట్టాలని ఆదేశిస్తున్నారని ఆరోపించారు. అధికారులు మంత్రి సవిత అనుచరుల ఆగడాలను అరికట్టకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చెరువుల్లోని మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వాలి మంత్రి సవిత అనుచరుల మట్టిదందాను అరికట్టాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ -
సర్కారు చోద్యం
రైతు సిద్ధం..పుట్టపర్తి అర్బన్: కీలకమైన ఖరీఫ్ సీజన్ జూన్ 1న ప్రారంభం కానుంది. జిల్లాలో ఎక్కువగా వేరుశనగ సాగులోకి రానుండగా...ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాలు సిద్ధంచేసుకుంటున్నారు. మే నెల సాధారణ సగటు వర్షపాతం 42.4 మి.మీ కాగా, ఇప్పటి వరకూ 39.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి విత్తనాలు సిద్ధం చేసి ఉంచాలి. కానీ ఈసారి విత్తన పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లే ప్రారంభం కాలేదని, వ్యవసాయాధికారులను అడిగితే మౌనమే సమాధానమవుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేక.. ఖరీఫ్ జిల్లా సాధారణ సాగువిస్తీర్ణం 2,69,152 హెక్టార్లుకాగా, అత్యధికంగా 1,51,824 హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వస్తుంది. అయితే సాగు ఖర్చు పెరగడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం, ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది వేరుశనగ కేవలం 69,420 హెక్టార్లలోనే సాగులోకి వచ్చింది. దిగుబడి కూడా అంతంతమాత్రమే కావడంతో రైతులు నష్టపోయారు. ఇక రబీలో సాగు చేసిన వేరుశనగ కూడా పెద్దగా లాభం చేకూర్చలేదు. జిల్లాలో పండిన పంటను ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేసి శుద్ధి చేసి విత్తనానికి సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయమే మరచిపోయింది. దీంతో వేరుశనగను పక్క రాష్టాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించారు. ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఒక్క బస్తా కాయలు కూడా కొనుగోలు చేయక పోవడం, విత్తన ఏజెన్సీలకు బకాయి పడ్డ మొత్తాన్ని సకాలంలో చెల్లించక పోవడంతో తాజాగా విత్తన సరఫరాలో జాప్యం జరుగుతోంది. ధర మాత్రం ఖరారు జిల్లాకు 72,289 క్వింటాళ్ల విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించింది. రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు ధరలను సైతం ఖరారు చేశారు. కే–6 రకం విత్తన వేరుశనగ కాయలను క్వింటా పూర్తి ధర రూ.10,200 కాగా 40 శాతం సబ్సిడీ పోను రైతు రూ.6,120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 30 కిలోల బస్తాకు రూ.1,836 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీసీజీఎస్ రకం వేరుశనగకు రూ.1,836, కదిరి లేపాక్షి(కేఎల్) రకం విత్తనానికి రూ.1,710 మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే రిజిస్ట్రేషన్ల వివరాలు నేటికీ వెల్లడించలేదు. కనీసం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం కూడా చెప్పక పోవడం గమనార్హం. ఏటా రైతులు వేరుశనగతో పాటు అధికంగా కంది సాగు చేస్తారు. కానీ ఈసారి కంది విత్తన పంపిణీకి మంగళం పాడినట్లు తెలుస్తోంది. కాకపోతే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు మాత్రం 50 శాతం సబ్సిడీతో అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ విత్తన రిజిస్ట్రేషన్లు నేటికీ ప్రారంభించని వైనం వేరుశనగ ధరలు ఖరారు చేసినా.. పంపిణీపై మౌనం ఆందోళనలో అన్నదాతలురెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు. సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాల్సిన సర్కార్ చోద్యం చూస్తోంది. వారంలో సీజన్ ప్రారంభం కానుండగా... నేటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో రైతులు అధిక ధర వెచ్చించి వ్యాపారుల వద్ద విత్తనం కొనేందుకు సిద్ధమవుతున్నారు. నేటివరకూ పైసా సాయం చేయని చంద్రబాబు సర్కార్.. అదనపు భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గాలీవాన బీభత్సం
ఉరుములు, మెరుపులతో కూడిన గాలీవానకు ఎన్పీకుంట మండలం మరికొమ్మదిన్నె గ్రామానికి చెందిన కేవీ రమణ ఇంటి రేకుల షెడ్డు ఎగిరిపోయింది. ఇళ్లు కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తు సామగ్రి, 16 బస్తాల బియ్యం, దుస్తులు మొత్తం తడిసిపోయాయి. సుమారు రూ.ఒక లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. పుట్టపర్తి అర్బన్: గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోగా, జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి 8 గంటల నుంచి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. తీవ్రమైన గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు బెంబేలెత్తారు. తీవ్రమైన గాలులకు అక్కడక్కడా కరెంటు స్తంభాలు, పాత ఇళ్లు కూలాయి. పలు గ్రామాల్లో రేకులషెడ్లు కొట్టుకుపోయాయి. పలు వంకలు పొంగిపొర్లాయి. అమరాపురంలో 49.2 మి.మీ వర్షం గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 32 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక కనగానపల్లి మండలంలో 32.6 మి.మీ, రొళ్ల 32.2, పెనుకొండ 30.2, తాడిమర్రి 29.2, కొత్తచెరువు 28.6, గాండ్లపెంట 28.4, రామగిరి 27.8, బత్తలపల్లి 27.4, తలుపుల 27.4, కదిరి 27, ఎన్పీ కుంట 25.4, అగళి 23.4, లేపాక్షి 20, నల్లమాడ 19.2, ధర్మవరం 18.6, మడకశిర 16.4, సీకేపల్లి 15.2, తనకల్లు 12.8, ముదిగుబ్బ 12.6, ఓడీచెరువు 12.4, నల్లచెరువు 12.2, రొద్దం 9.2, బుక్కపట్నం 7.2, గుడిబండ 7.2, పుట్టపర్తి 6.6, గోరంట్ల 6.4, సోమందేపల్లి 4.2, చిలమత్తూరు 4.2, హిందూపురం 3.6, పరిగి, అమడగూరు మండలాల్లో 2.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందన్నారు. శుక్రవారం కూడా రోజంతా ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. తాజా వర్షాలు ముంగారు సేద్యానికి మేలు చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం 580.8 మి.మీ వర్షపాతం నమోదు -
వెంటనే విత్తనాలివ్వాలి
చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎరువుల ధరలు అమాంతం పెరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా విత్తన పంపిణీపై మౌనం పాటిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు దుక్కులు చేసుకున్నారు. రెండు రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో సేద్యం పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించలేదు. విత్తనం ధర కూడా గత ఏడాదితో పోలిస్తే రూ. 200 మేర పెంచింది. ఇక అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు జమ చేస్తుందో కూడా చెప్పడం లేదు. – నరసింహారెడ్డి, రైతు, వెంకటగారిపల్లి -
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది
పరిగి: గిట్టుబాటు ధరలు లేక రైతులు సర్వనాశనమవుతున్నా.. ఏమాత్రమూ పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె పరిగి మండలంలోని బీచిగానిపల్లి పంచాయతీ వంగలపల్లిలో బాలకృష్ణారెడ్డి, యోగానందరెడ్డి మామిడి తోటలను పరిశీలించారు. సాగువ్యయం, గిట్టుబాటు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు పూర్తిగా విస్మరించారన్నారు. కనీసం పెట్టుబడి సాయం చేయడం లేదని మండిపడ్డారు. పైగా ‘వరి వేయొద్దండి...యూరియాను వాడొద్దండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏటా మే నెలలోనే పెట్టుబడి సాయం అందిచేవారని గుర్తు చేశారు. అలాగే ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవేమీ లేకపోవడంతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నా..విత్తన పంపిణీపై నేటికీ ప్రకటన చేయలేదన్నారు. రైతాంగాన్ని నాశనం చేసిన చంద్రబాబుకు... రైతుకు మేలు చేసిన జగనన్నకు చాలా తేడా ఉందన్నారు. మొక్కజొన్న, మామిడికి గిట్టుబాటు ధర కల్పించేంతవరకూ పోరాటం చేస్తామన్నారు. రైతులకు అనుమతులు లేవా? పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియాతో పాటు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా... అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్న అధికారులు... రైతులు తమ పొలాలకు మట్టికోలుకునేందుకు ఎందుకు అనుమతులివ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బందులు కలిగితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీచరణ్రెడ్డి, నరసింహమూర్తి పాల్గొ న్నారు. అటవీ భూములను పరిరక్షించాలి ప్రశాంతి నిలయం: అటవీ భూములను పరిరక్షించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓతో కలిసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ పరిధిలోని అటవీ భూములు, అడవులను పోలిన భూముల వివరాలను సేకరించి వాటిని అటవీ శాఖకు బదలాయించాలన్నారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి, సిబ్బంది పాల్గొన్నారు. చర్చలు సఫలం.. విధుల్లోకి ‘సత్యసాయి’ కార్మికులు బత్తలపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 17 రోజులుగా సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులతో గురువారం అనంతపురంలోని సత్యసాయి బోర్డు కార్యాలయంలో ఎస్ఈ ప్రభాకరరావు, డీఈ రామారావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఐదు నెలల వేతనాన్ని మే నెలాఖరులోపు చెల్లించడం, సమ్మె చేసిన 17 రోజుల కాలాన్ని పని దినాలుగా గుర్తించడం, కార్మికులను జెడ్పీలో విలీనం చేసే ప్రతిపాదన రద్దుచేయడం తదితర డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. దీంతో కార్మికులు సమ్మె వీడారు. ఆయా గ్రామాల్లోని పంప్హౌస్ల వద్దకు చేరుకొని నీటి సరఫరాను పునరుద్ధరించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ● అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ధర్మవరం అర్బన్: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన పోలీసులను ఆదేశించారు. పోక్సో, మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులను ప్రత్యేక దృష్టితో దర్యాప్తు చేయాలన్నారు. గురువారం ఆమె ధర్మవరం డీఎస్పీ గెస్ట్హౌస్లో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. రోడ్డు భద్రత చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. విచారణలో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళా సంబంధిత నేరాలు, పోక్సో కేసుల్లో కోర్టుకు సాక్ష్యాధారాలు అందించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో సీఐలు రెడ్డెప్ప, ప్రభాకర్, మహమ్మద్ అలి, సునీత, శివరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర కల్పించని కూటమి సర్కార్ కూలక తప్పదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ఆస్పత్రుల్లో అల్లకల్లోలం..
మూడు రోజుల క్రితం ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో హైకోర్టు న్యాయవాది అంజన్రెడ్డిపై బీజేపీ నేతలు హరీశ్బాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారు. మంత్రి సత్యకుమార్ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అక్కసుతో దుర్మార్గంగా ప్రవర్తించారు. తన బంధువును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన అంజన్రెడ్డిని చూసిన బీజేపీ అనుచరులు సీసీ కెమెరాలు లేని ప్రాంతాలకు తీసుకెళ్లి చితకబాదారు. గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రిలోని రోగులు వెళ్లడంతో పరారయ్యారు. రెండు రోజుల క్రితం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ధర్మవరానికి చెందిన బీజేపీ కార్యకర్త వేణుగోపాల్ ఓ రోగితో గొడవపడి కుర్చీలు విసిరాడు. దీంతో అక్కడున్న రోగులంతా వణికిపోయారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి
● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం పుట్టపర్తి అర్బన్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను, పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ను పరిశీలించారు. పెండింగ్ కేసుల స్థితి గతులను ఆరా తీశారు. నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, పురోగతిపై ఆరా తీయడంతో పాటు వివిధ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలోనే ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులపై ఎస్పీ సమీక్షించారు. ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పేకాట, మట్కా, గంజాయి వంటి వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాత నేరస్తులపై కన్నేసి ఉంచాలన్నారు. డ్రోన్ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐ సురేష్, ఎస్ఐ క్రాంతి, సిబ్బంది ఉన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి 340 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే 340 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 32 కేంద్రాల్లో తొలిరోజు జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 1,681 మందికి గాను 1,387 మంది హాజరు కాగా, 294 మంది గైర్హాజరైనట్లు ఇంటర్విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,115 మందికి గాను 1,069 మంది విద్యార్థులు హాజరు కాగా 46 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. -
బాలుడిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు
తాడిపత్రి రూరల్: కుటుంబసభ్యులు బలవంతంగా తీసుకెళుతున్న బాలుడిని పోలీసులు సకాలంలో కాపాడి తల్లి వద్దకు చేర్చారు. వివరాలు.. తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్లో నివాసముంటున్న ఆంజనేయులుకు పదేళ్ల క్రితం శ్రీసాయితో వివాహమైంది. వీరికి 8 ఏళ్ల వయసున్న కుమారుడు అభిరామ్ ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఆంజనేయులు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి శ్రీసాయి పలు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించుకుంటోంది. ఇటీవల పెయింటర్ రాముతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు తల్లి, కుటుంబసభ్యులు బుధవారం శ్రీసాయి ఇంటి వద్దకు చేరుకుని గొడవ పడ్డారు. మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తమ వారసుడు అభిరామ్ను అప్పగించాలంటూ అత్తతో పాటు ఆంజనేయులు సోదరులు శివ, మధు ఒత్తిడి చేశారు. అయితే కుమారుడిని అప్పగించేందుకు శ్రీసాయి నిరాకరించింది. దీంతో ఆమెను కొట్టి అభిరామ్ను బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని శివ, మధు వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీసాయి ఏడ్చుకుంటూ కిలోమీటర్కు పైగా ఉన్నా పట్టణ పోలీసుస్టేషన్కు పరుగునా వెళ్లి జరిగిన ఘటను సీఐ ఆరోహణరావుకు వివరించింది. తన కుమారుడిని వారి బారి నుంచి కాపాడి తనకు అప్పగించాలని ప్రాధేయపడింది. స్పందించిన సీఐ వెంటనే శ్రీసాయి అత్తింటి వారి వివరాలు ఆరా తీసి సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లారు. టైలర్స్ కాలనీలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివ, మధుని వెంబడించి బాలుడిని కాపాడి ఏఎస్పీ రోహిత్కుమార్ సమక్షంలో హాజరుపరిచారు. వివాదానికి కారణమైన శ్రీసాయి అత్తతో పాటు ఆమె కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి శ్రీసాయి ఇంటి వద్దకెళ్లి గొడవపడినా, బాలుడిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించి పంపించారు. తన కుమారుడిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు ఈ సందర్భంగా శ్రీసాయి ధన్యవాదాలు తెలిపారు. -
ఉపాధి కూలీలకు నీడ, నీరు కల్పించాలి
కదిరి అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి పనుల ప్రాంతంలో కూలీలకు నీడ, నీరు కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన నడింపల్లి సమీపంలో ఎర్రగుట్ట నుంచి ఎర్రకుంటకు చేపట్టిన ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలుగు, పార చేతపట్టి కాసేపు కూలీలతో కలిసి కాలువలో మట్టి తీశారు. అంతకుముందు గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ సేకరణ పనులపై గ్రామస్తులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట డీఎల్డీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పోలప్ప, తహసీల్దార్ రెడ్డిశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. నైపుణ్యంతోనే ఉజ్వల భవిత.. నైపుణ్యం కలిగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, యువకులు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన కదిరి ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఏంకేవీవై) శిక్షణ తరగతులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి కళాశాలకు వచ్చిన ఆయన ట్రైనర్లతో మాట్లాడారు. ఏ అంశాలపై, ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారని ప్రశ్నించగా.. సంప్రదాయ వృత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) డ్రోన్ టెక్నాలజీ, 5జీ టెక్నాలజీ వంటి సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు ట్రైనర్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారికి టీషర్ట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ డా. స్మిత, పలువురు అధ్యాపకులు ఉన్నారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
పడకేసిన వ్యవసాయం
అనంతపురం అగ్రికల్చర్: రైతులను మోసపుచ్చడం కష్టం కాదని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. గతంలో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగాన్ని, రైతులను చాలా చిన్న చూపు చూస్తూ వచ్చినా... ఈసారి ఏదో చేస్తారని ఆశించి నాలుగో సారి కూడా మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వ్యవసాయం దండగ మారి... ఉచిత విద్యుత్ అనేది తీగలపై బట్టలు ఆరేసుకునేందుకే.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇస్తూపోతే చివరకు ఆ పరిహారం కోసమే చస్తారు... పావలా వడ్డీ వేస్ట్... రాయితీలు ఇవ్వకూడదు’ అంటూ గతంలో వ్యవసాయ రంగాన్ని చులకనగా, రైతులను హేళన చేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూడో పర్యాయంలో రుణమాఫీ... నాలుగో సారి సూపర్సిక్స్, సుఖీభవ అంటూ రైతులను మభ్యపెట్టి వారి ఓట్లతో మరోసారి అధికారంలోకి వచ్చినా.... తన నైజాన్ని ఏమాత్రం మరచిపోకుండా రైతులను దగా చేశారు. ఈ రెండేళ్లలో అరకొరగా సుఖీభవ మినహా ఎటువంటి సాయం చేయకుండా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన పట్టు, పాడి, పశుపోషణ, ఉద్యాన తదితర రంగాలపై ఆధారపడిన రైతులనూ నష్టాల బాట పట్టించారు. పట్టుపరిశ్రమశాఖ ద్వారా మల్బరీ (రేషం) రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, బడ్జెట్ ఇవ్వకపోవడంతో మల్బరీ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. 5 వేల ఎకరాలు ఉందని పట్టుశాఖ అధికారులు చెబుతున్నా... ఈ–క్రాప్లో మాత్రం కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే నమోదు కావడం గమనార్హం. రాయితీలు, ప్రోత్సాహం లేక చాలా మంది రెతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉన్న ‘అమూల్ పాలవెల్లువ’ను అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు బలవంతంగా ఆపేశారు. హెరిటేజ్ లాంటి ప్రైవేట్ డెయిరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాల ధరలు పెంచకుండా గత ప్రభుత్వం కన్నా లీటర్పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించాయి. పశుబీమా లాంటి పథకాలు లేకపోవడంతో పాడి రైతులు, జీవాల కాపర్లు నష్టపోతున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత బీమా పథకం అమలు చేయడంతో పశువులు, జీవాలు చనిపోయిన 8 వేల మంది లబ్ధిదారులకు రూ.26 కోట్ల మేర బీమా పరిహారం దక్కింది. వర్షాభావంతో ఎండిపోయిన చీనీ చెట్లు పథకాలు, ప్రోత్సాహకాలు లేక పట్టు రైతుల కుదేలు పాలవెల్లువను బలవంతంగా ఆపేయడంతో పాడి రైతులకు నష్టం గిట్టుబాటు ధరల్లేక భారీ నష్టాలు మూటగట్టుకున్న ఉద్యాన రైతులు చంద్రబాబు పాలనలో అడుగడుగునా దగా పడుతున్న అన్నదాతలు ‘ఎల్–నినో’ పేరుతో భయపెడుతున్న సర్కార్ నష్టాల్లో ఉద్యాన రైతులు ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీగా, ఉద్యానహబ్గా పిలవబడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2020, 2021 రెండేళ్లు కరోనా కష్టాలు మినహా మిగిలి మూడేళ్లు ప్రోత్సాహకం, రాయితీలు, గిట్టుబాటు ధరలు ఉన్నందున రైతులు ఆర్థికంగా గట్టెక్కారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలవడంతో ఉద్యాన రైతులు మనోధైర్యంతో ముందడుగు వేశారు. ఉచిత పంటల బీమాను ఉద్యాన పంటలకు వర్తింపజేయడంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వాటిల్లినప్పుడు పెద్ద మొత్తంలో పరిహారం దక్కి నష్టాల ఊబి నుంచి రైతులు బయటపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశారు. 5 శాతం ప్రీమియం కట్టాల్సిందేనని నిబంధనల పెట్టారు. ప్రధాన ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్లో గిట్టుబాటు ధరల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రధానంగా అరటి, చీనీ, టమాట రైతులు చిక్కిపోయారు. ఉద్యాన పంటలు సాగుకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హార్టికల్చర్ కాంక్లేవ్ అంటూ గతేడాది రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా వాటి ఫలితాలు కనుచూపు మేరలో ఎక్కడేగాని కనిపించడం లేదు. వీటికి తోడు ఈ ఏడాది ‘ఎల్–నినో’ వల్ల వర్షాలు గతి తప్పి కరువు పరిస్థితులు తప్పవంటూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం భయాందోళనలకు గురిచేస్తోంది. పట్టు లేదు, పాడి లేదు: చంద్రబాబు పాలనలో గత రెండేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. పైసా బడ్జెట్ కేటాయించకపోవడంతో మల్బరీని నమ్ముకున్న రైతులు అవస్థలు పడుతున్నారు. పథకాలు లేక పాడి, పశుపోషణ రైతులకు భారంగా పరిణమించింది. ప్రోత్సాహకాలు లేక జీవాల కాపర్లు సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయితీలు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సదుపాయం లేక ఉద్యాన పంటల సాగు అధ్వానంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనుబంధ వ్యవసాయ రంగాలు కూడా రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. -
తాగునీరు ఇవ్వండయ్యా!
● అధికారులకు ముదిగుబ్బవాసుల మొర ● తాగునీటి సమస్యపై రాస్తారోకో ముదిగుబ్బ: ‘‘మండల కేంద్రంలో రెండు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. అడుక్కున్నాం... ధర్నాలు చేశాం.. కార్యాలయాలను ముట్టడించాం..ఇంకేం చేస్తే నీళ్లిస్తారో చెప్పండి..మాకు కాసిన్ని నీళ్లు సరఫరా చేయండయ్యా’’ అంటూ ముదిగుబ్బ వాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. మండల కేంద్రంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి రెండోరోజు బుధవారం కూడా ప్రజలు ముదిగుబ్బలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపైకి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మహిళలు ర్యాలీగా, వివిధ పార్టీల నేతలు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ముట్టడించారు. మహిళలకు మద్దతుగా సీపీఐ, వైఎస్సార్ సీపీతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... రెండు నెలలైనా తాగునీటి సమస్య పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. బోర్లను తక్షణం రిపేరీ చేయించి తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం తహసీల్దార్ మహేశ్వర్రెడ్డికి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ ప్రసాద్కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మల్లాగుండ్ల భాస్కర్, చిన్న బాలముని, సీపీఐ నాయకులు శ్రీనివాసులు, తుమ్మల మధు, అలిమినేని రామాంజనేయులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో జీఎస్టీ, వృత్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో జీఎస్టీ రెవెన్యూను గణనీయంగా పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ స్వర్ణలత, పుట్టపర్తి ఏసీ చందు, హిందూపురం ఏసీ కృష్ణవేణి, ఏడీ అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో మందులు విక్రయించొద్దు ● కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతల డిమాండ్ ● జిల్లా వ్యాప్తంగా మెడికల్ స్టోర్ల బంద్ హిందూపురం టౌన్: ఆన్లైన్ మందుల (మెడిసిన్)అమ్మకాలను నిలుపుదల చేయాలని ఆలిండియా కెమిస్ట్ అండ్ డ్రగ్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆన్లైన్లో హానికర, మత్తు పదార్థాల అమ్మకాలు చేస్తున్నారని, ఫలితంగా యువత మత్తుకు బానిస అవుతోందని ధ్వజమెత్తారు. ఆన్లైన్ అమ్మకాల నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో దేశ వ్యాప్తంగా 12.50 లక్షల మెడికల్ స్టోర్లను బుధవారం మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్ స్టోర్లను మూసి వేసి ఆందోళన నిర్వహించారు. ఈక్రమంలోనే హిందూపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ...కరోనా సమయంలో అందరికీ అందుబాటులోకి రావాలని ఆన్లైన్లో మందులు అమ్మకం చేశారన్నారు. కానీ ఈ అవకాశాన్ని వెసులుబాటుగా చేసుకున్న కొందరు అక్రమంగా నిషేధిత మందులు అమ్ముతున్నారన్నారు. అందువల్ల ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిషేధించాలని, నాసిరకం మందులను అరికట్టాలని, జీఎస్ఆర్ 220ఈను రద్దు చేయాలన్నారు. సామాన్య కెమిస్ట్, ఫార్మసిస్టుల హక్కులను కాపాడాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, ట్రెజరర్ రాజేష్, హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. వివాహితకు వేధింపులు.. యువకుడికి అరగుండు విడపనకల్లు: ప్రేమపేరుతో వివాహితను వేధించినందుకు ఓ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి అరగుండు గీయించి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడేకల్లు గ్రామంలో భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీనివల్ల ఆమె కుటుంబంలో కలతలు వచ్చాయి. ఇందుకు ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవారం అతనికి దేహశుద్ధి చేశారు. అర గుండు గీయించారు. మెడలో చెప్పుల దండ వేసి.. డప్పు వాయిస్తూ గ్రామమంతా ఊరేగించారు. ఎవరైనా సరే అమ్మాయిలను, మరీ ముఖ్యంగా వివాహితలను వేధిస్తే ఇదే శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. కాగా.. ఈ ఘటనపై విడపనకల్లు పోలీసులు విచారణ చేశారు. వివాహిత వేధించిన భాస్కర్పై కేసు నమోదు చేశారు. -
పీఏబీఆర్లో తగ్గిన నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్న క్రమంలో.. గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏబీఆర్ జలాశయం వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. బుధవారం నాటికి 2.3 టీఎంసీలకు చేరుకుంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా ఎలాంటి ఇన్ఫ్లో లేదు. తాగునీటి పథకాలకు సంబంధించి రోజూ 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నీటి ఆవిరి, లీకేజీల రూపంలో మరో 100 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. నీటి మట్టం తక్కువగా ఉన్నా.. తాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కొరత ఉండదని రిజర్వాయర్ అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కింద పడి యువకుడి మృతిరొద్దం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన మాల వెంకటరమణ కుమారుడు శివ (23) కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఓ రైతు పొలానికి ట్రాక్టర్ ద్వారా చెరువు మట్టిని తరలించే పనికి వెళ్లాడు. పొలం వద్ద మట్టిని అన్లోడ్ చేసేందుకు ట్రాలీ పైకెత్తుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ ముందున్న శివ తప్పించుకునేలోపు అతని మీదుగా చక్రాలు దూసుకెళ్లాయి. ఘటనలో తీవ్రంగా గాయపడడంతో వెంటనే పనుకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్కుమార్ పుట్టపర్తి టౌన్: ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా బుక్కపట్నం నివాసి పోలేపల్లి ప్రశాంత్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కర్నూలు నగరంలోని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయంలో ఆర్య వైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు టీజీ వెంకటేష్, మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఎనిమిదేళ్లయినా పెన్షన్ లేదుకదిరి అర్బన్: ఆర్టీసీలో 30 ఏళ్లు డ్రైవర్గా పనిచేసి 2019లో ఉద్యోగ విరమణ చేసిన తనకు ఇప్పటి వరకూ ఈపీఎఫ్ పెన్షన్ మంజూరు చేయలేదని కదిరి డిపో విశ్రాంత ఉద్యోగి గంగప్ప వాపోయాడు. రిటైర్మెంట్కు ముందుగానే పెన్షన్ పేపర్లను అధికారులకు పంపినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బర్కత్పురలోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే అక్కడి అధికారులు వాటిని పోగొట్టినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారన్నారు. కార్యాలయం చుట్టూ తిరగడంతోనే తాను అనారోగ్యం పాలయ్యానని, ఇప్పటికై నా తన సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖా మంత్రికి విన్నవించినట్లు వివరించాడు. పెన్నహోబిలంలో హుండీ కానుకల లెక్కింపు ఉరవకొండ రూరల్: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. శాశ్వత హుండీల ద్వారా రూ.25,96,507, అన్నదాన హుండీ ద్వారా రూ.1,109 మొత్తం రూ25,97,616 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ సాకే రమేష్బాబు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.10,11,728 ఆదాయం పెరిగినట్లు వివరించారు. దేవదాయ శాఖ ఏసీ గంజి మల్లికార్జునప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గుంతకల్లు హనుమాన్ సేవా సమితి సభ్యులు, అనంతపురం భవానీ సేవా సమితి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జిల్లాను ప్రగతి పథంలో నిలపాలి
ప్రశాంతి నిలయం: జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 32 మండలాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్, ‘సాసా’ ప్రగతి ర్యాంకులను జిల్లా యంత్రాంగం వెల్లడించిందన్నారు. 84 పాయింట్లతో మడకశిర, అమరాపురం మండలాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉండగా... 83 పాయింట్లతో రొళ్ల మండలం ఆ తర్వాతి స్థానంలో ఉందన్నారు. 65 పాయింట్లతో హిందూపురం జిల్లాలోనే చివరి స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓడీఎఫ్ 100 శాతం సాధించగా, చెత్త సేకరణ 59.62 శాతం నమోదైందన్నారు. జిల్లాలో 3,366 సౌర విద్యుత్ యూనిట్ల స్థాపన పూర్తి కాగా, 1,108 దరఖాస్తులను సబ్సిడీ జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య పాల్గొన్నారు. పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి శింగనమల: మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందిద. ఏకులనాగేపల్లిలో పిడుగుపాటుకు రైతు వసంతకుమార్ రెడ్డికి చెందిన రెండు ఎద్దులు చనిపోయాయి. రెండు వారాల క్రితమే వాటిని రైతు కొనుగోలు చేశారు. దాదాపు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. టెంకాయ చెట్టుపై పిడుగు గార్లదిన్నె: మండల వ్యాప్తంగా గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఎం.కొత్తపల్లి గ్రామంలో రైతు కిష్ట ఇంటి వెనుక ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగు రాలడంతో మంటలు చెలరేగాయి. అలాగే కల్లూరు, ఇల్లూరులో వడగండ్ల వర్షం కురిసింది. వ్యక్తి దుర్మరణం అనంతపురం సెంట్రల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం నిదనవాడకు చెందిన శేషానందరెడ్డి(40) బుధవారం అనంతపురంలోని తపోవనం నుంచి 44వ జాతీయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా బళ్లారి మార్గం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయం కావడంతో శేషానందరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
విద్యార్థులు లేకున్నా పోస్టులు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బోధన పోస్టుల భర్తీకి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రాధాన్యత లేని విభాగాలకు ప్రొఫెసర్ పోస్టులు కేటాయించడం, అప్రాధాన్యత గల విభాగాలకు రిక్తహస్తం చూపించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ప్రొఫెసర్ పోస్టుల కేటాయింపునకు విద్యార్థుల అడ్మిషన్లే ప్రామాణికం. అయితే విద్యార్థులు లేని విభాగాలకూ పోస్టులు నిర్ధారించడం గమనార్హం. రోస్టర్ కమిటీల్లో ఉన్న ప్రొఫెసర్లు తమ విభాగాలకు అనుకూలంగా నివేదిక సమర్పించి.. ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేయించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఏకంగా తప్పుదోవ పట్టించి పోస్టుల కేటాయింపులో పక్షపాతం ప్రదర్శించారు. దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కేటాయింపులో పారదర్శకతేదీ? ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలోని పలు విభాగాల్లో మూడేళ్ల నుంచి ఒక్క అడ్మిషన్ కూడా లేదు. అయినప్పటికీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కేటాయించారు. అనుకూలమైన రోస్టర్ పాయింట్ వచ్చే వరకు పోస్టులు పెంచడం.. లేదా తగ్గించడంపై అనుమానాలు బలపడుతున్నాయి. ● సోషియాలజీలోనూ మూడు సంవత్సరాలుగా అడ్మిషన్లు లేకపోయినా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. ● ఆర్ట్స్లో పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అధికంగా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రెండు అసిస్టెంట్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే కేటాయించారు. ● జాగ్రఫీలో మూడు విద్యాసంవత్సరాల్లో వరుసగా అడ్మిషన్లు నమోదు కాలేదు. వచ్చే జూన్కు రెగ్యులర్ ప్రొఫెసర్ ఉద్యోగ విరమణ చేస్తారు. నోటిఫికేషన్లో ఒక అసిస్టెంట్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ను కేటాయించారు. ● ఫిజికల్ ఎడ్యుకేషన్లో సెకండియర్కు విద్యార్థులే లేరు. అయినా అసోసియేట్, రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇచ్చారు. ● పాలిమర్ సైన్సెస్కు ఒక్క విద్యార్థీ లేరు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ను కేటాయించారు. ● హిస్టరీలో తక్కువ అడ్మిషన్లు ఉన్నప్పటికీ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారు. ● ఇంజినీరింగ్ కళాశాలలో శాంక్షన్ పోస్టులు లేవు. కంప్యూటర్ సైన్సెస్కు మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఈఈఈకి ఒక పోస్టు, ఈసీఈకి రెండు పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్కు ఒక అసిస్టెంట్.. ఇవి కాకుండా ఆరు ప్రొఫెసర్ పోస్టులు కేటాయించారు. నాలుగు ప్రొఫెసర్లు పోస్టులు మాత్రమే ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లోని విభాగాలకు కేటాయించారు. మొత్తం 10 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తుంటే.. ఆరు పోస్టులు ఇంజినీరింగ్ కళాశాలకు, తక్కిన నాలుగు పోస్టులు క్యాంపస్ కళాశాలకు కేటాయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ యూనివర్సిటీలో శాంక్షన్ పోస్టులు లేని ఇంజినీరింగ్ కళాశాలకు సింహభాగం ప్రొఫెసర్ పోస్టులు కేటాయించి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ● ఎడ్యుకేషన్ విభాగంలో అడ్మిషన్లు గణనీయంగా ఉన్నాయి. అయినప్పటికీ ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు. పోస్టుల భర్తీ ఇలా... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ పోస్టులు 81 ఖాళీలు ఉన్నాయి. బ్యాక్లాగ్ 22 పోస్టులు ఉన్నాయి. మొత్తం 103 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్– 49, అసోసియేట్ ప్రొఫెసర్ – 22, ప్రొఫెసర్– 10 పోస్టులతో పాటు బ్యాక్లాగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ –18, అసోసియేట్ –4 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్ పోస్టుల కేటాయింపులో పక్షపాతం ఎస్కేయూ బోధనా పోస్టుల భర్తీపై విమర్శలు -
‘మైనింగ్’ కోసం మంత్రాంగం
చిలమత్తూరు: మైనింగ్ మాఫియా పెద్ద మంత్రాంగం నడిపింది. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఉత్తుత్తి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. ఎవరికీ తెలియకుండా కొండ ప్రాంతంలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల ముసుగులో అక్కడికి హాజరైన తమవారితో అనుకూలంగా చెప్పించి అనుమతులు పొందేందుకు ప్లాన్ వేసింది. విషయం తెలుసుకున్న చివరి నిమిషంలో గ్రామస్తులు అక్కడికి వెళ్లడంతో వారి గుట్టురట్టయ్యింది. ఏం జరిగిందంటే.. మండలంలోని యగ్నిశెట్టిపల్లి సమీపంలోని శ్రీధర గుట్ట వద్ద ఉన్న కొండల్లో మైనింగ్ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా బుధవారం గ్రామ సభ నిర్వహించారు. పర్యావరణ చట్టాల ప్రకారం 30 రోజుల ముందే ప్రజలకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా... అవేవీ చేయకుండానే గుట్టుగా గ్రామానికి దూరంగా కొండ ప్రాంతంలో సభ ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ముసుగులో తమకు అనుకూలమైన వారిని అక్కడికి తరలించారు. ఇక పర్యావరణ వేత్తలమని కొందరు, ఎన్జీఓలమని మరి కొందరు విచ్చేశారు. ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా తమవారితోనే మాట్లాడించారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత అంజినప్ప మాట్లాడుతూ.. మైనింగ్ చేసుకోవడంలో తమకేమీ అభ్యంతరం లేదని, పైగా కంకర కోసం తమకు ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. ఇక ఎన్జీఓల మంటూ అక్కడికొచ్చిన కొందరు మైనింగ్ కు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. అంతా సవ్యంగా సాగుతుందని సంబరపడిన మైనింగ్ మాఫియాకు చివరి నిమిషంలో గ్రామస్తులు షాక్ ఇచ్చారు. ‘మైనింగ్’కు అంగీకరించం.. శ్రీధరగుట్ట సమీపంలో మైనింగ్ కోసం గ్రామ సభ జరుగుతున్నట్లు తెలుసుకున్న పలువురు రైతులు హడావుడిగా అక్కడికి వచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మైనింగ్ వద్దంటూ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు నెలకు రూ.8 వేలు ఇస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఆ పొలంలో రేషం మేపుకొని నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించేవాడినని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారంపై దెబ్బకొట్టే మైనింగ్ వద్దంటూ తేల్చిచెప్పారు. అధికారుల తీరుపై ఆగ్రహం.. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఎన్జీఓ నిర్వాహకుల పేరుతో వచ్చిన వారితో, టీడీపీ నేతలతో అభిప్రాయాలను అధికారులు నోట్ చేసుకోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య ఎదుర్కొనే తమ అభిప్రాయం కాకుండా ఎవరినో అడిగి వాటినే రాసుకోవడం అన్యాయమన్నారు. కలెక్టర్ వెంటనే ఈ అక్రమ గ్రామసభను పరిగణనలోకి తీసుకోకుండా గ్రామస్తుల అభిప్రాయాలనే తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీధరగుట్ట సమీపంలో మైనింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ గుట్టుగా గ్రామానికి దూరంగా కొండ ప్రాంతంలో గ్రామసభ తమకు అనుకూలమైన వారితో నిర్వహణ విషయం తెలిసి అక్కడివెళ్లి నిలదీసిన జనం రిజర్వు ఫారెస్ట్ సరిహద్దులో మైనింగ్ అనుమతులపై ఆగ్రహం -
దొంగ ఓట్లు ఎక్కిస్తారు జాగ్రత్త!
చిలమత్తూరు: ‘‘టీడీపీ రెండేళ్ల పాలనతో జనం విసిగిపోయారు. ఏ ఎన్నిక వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే అధికార పార్టీ అక్రమాలకు ప్లాన్ వేసింది. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు అక్రమంగా తొలగించడంతోపాటు దొంగ ఓట్లు భారీగా చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందువల్ల బూత్లెవల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ అక్రమాలను సాక్ష్యాలతో అధికారుల ముందు ఉంచి అడ్డుకోవాలి’’ అని వైఎస్సార్సీపీ జోన్–5 కోఆర్డినేటర్ చల్లా మధుసూదన్రెడ్డి బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికతో కలిసి హిందూపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. చల్లా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ... పార్టీలో బీఎల్ఏలదే కీలకపాత్ర అన్నారు. ప్రతి ఓటరు కార్డును క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లును పార్టీ తప్పక గుర్తిస్తుందని, వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వారికి వైఎస్ జగన్ సముచిత గుర్తింపు ఇస్తారన్నారు. హిందూపురంలో ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే.. రానున్న అన్ని ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండానే ఎగురుతుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అందువల్లే అధికార పార్టీ గ్రామాల్లో, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే కుట్రలు చేస్తోందన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్ లెవెల్ కన్వీనర్లు, ఏజెంట్లు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కేసులకు భయపడవద్దని తాను అండగా ఉంటానని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఫయాజ్ భాషా మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. ఈ మూడేళ్లు పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలోని బీఎల్ఏలు పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, బూత్ లెవెల్ జోన్ –5 వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్కుమార్రెడ్డి, రాష్ట్ర నాయకులు జీను మహేష్, అనుబంధ విభాగాల రాష్ట్ర, నియోజకవర్గ నాయకులు, హిందూపురం పట్టణ, నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు, బూత్ కమిటీ కన్వీనర్లు, బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధికార పార్టీ అక్రమాలకు సిద్ధమైంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్లాన్ బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ తప్పక గుర్తిస్తుంది బీఎల్ఏల సమావేశంలో చల్లా మధుసూదన్రెడ్డి, టీఎన్ దీపిక -
మంత్రి ఇలాకాలో తాగునీటికి కటకట
ముదిగుబ్బ: మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో తాగునీటి ఇక్కట్లు తీవ్రమయ్యాయి. మూడు నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ముదిగుబ్బకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సత్యకుమార్ హామినిచ్చారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికీ ఈ ప్రాంతం వైపుగా కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. ముదిగుబ్బలోని 20వేల జనాభాకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటే బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. కాగా, తాగునీటి కోసం మహిళలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సమయంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనను కార్యాలయంలోకి వెళ్లకుండా మహిళలు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేని వారికి పదవులు ఎందుకని నిలదీశారు. కార్యక్రమంలో ముల్లగూరు ఆనంద్, అన్నమనేని దామోదర్నాయుడు, చల్లా శంకర్ నాయుడు, తుమ్మల శ్రీనివాసులు, తుమ్మల మధు, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు మాట నిలబెట్టుకోలేదని మంత్రిపై మండిపాటు -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కదిరి అర్బన్: అక్రమంగా ఇసుకు తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మంగళవారం సీఐ నారాయణరెడ్డి స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇసుక తరలింపులకు అనుమతులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో జీవాల మృతి పెనుకొండ(సోమందేపల్లి): విద్యుత్ షాక్కు గురై గొర్రెలు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఉప్పర గోపాల్ వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలో గొర్రెల కోసమని షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం రాత్రి వీచిన పెనుగాలులకు తోడు స్వల్పంగా వర్షం కురవడంతో షెడ్డుకు విద్యుత్ ప్రసరించి 20 గొర్రెలు మృతువాత పడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన గోపాల్ వెంటనే విద్యుత్ సరఫరా ఆపి వేయడంతో మిగిలిన జీవాలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాయి. ఘటనతో రూ.1.60 లక్షల మేర నష్టం వాటిల్టినట్లు బాధిత కాపరి వాపోయాడు. -
కార్పొరేట్ సేవలో చంద్రబాబు
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థల సేవలో సీఎం చంద్రబాబు తరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని అనంతపురంలోని శాంతినగర్ సర్కిల్ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ముఖ్యఅతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టిన సీఎం చంద్రబాబు తీరును తప్పుబట్టారు. విశాఖలో దేవదాయ భూములను కంపెనీలకు కట్టబెడుతున్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వెనుక ప్రధానంగా కార్పొరేట్ ప్రయోజనాలే ఉన్నాయన్నారు. కంపెనీలకు బానిసలుగా మార్చి శ్రమదోపిడీ చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద పిల్లలకు సరైన వైద్యం లేదు.. విద్య లేదు... పౌష్టికాహారం లేదన్నారు. మాత శిశుమరణాలు సంభవిస్తూనే ఉన్నాయన్నారు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేని సీఎం చంద్రబాబు... పిల్లల్ని కనమనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాల కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పెరిగిపోతోందన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యహరిస్తోందని మండిపడ్డారు. ‘సర్’ పేరుతో బెంగాల్లో 34 లక్షల ఓటు తొలగించారన్నారు. ఏడు లక్షల దొంగ ఓట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇరాన్, రష్యాల నుంచి చమురు కొనుగోలును మోదీ నిలిపివేశారన్నారు. కేజీ బేసిన్లో 21 వేల టన్నుల గ్యాస్ లభిస్తుండగా రాష్ట్రానికి దక్కాల్సిన 50 శాతాన్ని గుజరాత్కు తరలించి అమ్ముకుంటున్నా ప్రశ్నించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు ఓబుళు, నగర కార్యదర్శి ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, వలి, ముత్తుజ, ప్రకాశ్రెడ్డి, మసూద్, పాల్గొన్నారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు పౌష్టికాహారం ఇవ్వలేని సీఎం... పిల్లల్ని కనమనడం దుర్మార్గం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు


