Sri Sathya Sai
-
రహదారుల కోసం భూసేకరణ వేగవంతం
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ప్రశాంతి నిలయం: జిల్లా పరిధిలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ చేస్తామని భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. జయశ్రీ తెలిపారు. ఏపీ ట్రాన్స్కోలో ఎస్టేట్ ఆఫీసర్గా విజయవాడలో పనిచేస్తూ పదోన్నతిపై జిల్లా భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులైన జయశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, ఎన్హెచ్–342, 716జీ జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఆయా రహదారులకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు. అలాగే రైతులకు త్వరితగతిన పరిహారం అందించడంతోపాటు రహదారులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతామన్నారు. భూ సమస్యలు పునరావృతం కారాదు ● రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రశాంతి నిలయం: జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన.. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, రీ సర్వే, రెవెన్యూ సదస్సులతో పాటు పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ టీఎస్ చేతన్తో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భూముల వర్గీకరణతో కూడిన మ్యాప్లు తయారు చేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్, 22ఏ, డి.నోటిఫైడ్, భూసేకరణ, సమీకరణ, ఫ్రీహోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్పీఎంల రూపకల్పనతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్కుమార్, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయం ప్రశాంతి నిలయం: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. ఇందుకోసం జిల్లాలో 20 సూత్రాల అమలు కార్యక్రమం పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ టీఎస్ చేతన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల అమలు, వివిధ ప్రాజెక్ట్ల పురోగతిపై సమీక్షించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చేపట్టిన 10 అంశాలను సంబంధించిన వివరాలను కలెక్టర్ చేతన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్, లక్ పతి దీదీ, జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ తదితర ప్రాజెక్టులు జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాయలసీమ టూరిజం సర్క్యూట్లో భాగంగా లేపాక్షి–పెనుకొండలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ముందే చిత్రావతి సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సుత్తితో కొట్టి.. నగల అపహరణ
ఓడీచెరువు: రాత్రి వేళ ఓ ఇంటి తలుపుతట్టిన దుండగులు...డోరు తీసిన మహిళ నెత్తిపై సుత్తితో కొట్టి ఆమె వంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఓడీచెరువులో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... వైద్య,ఆరోగ్యశాఖ విశ్రాంత ఉద్యోగి లక్ష్మమ్మ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా...దుండగులు తలుపుతట్టి పేరుపెట్టి పిలిచారు. దీంతో ఆమె తలుపుతీయగానే సుత్తితో తలపై కొట్టారు. ఈ హఠాత్పరిణామంతో లక్ష్మమ్మ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో దుండగులు ఆమె మెడలోని గొలుసు, చేతికున్న బంగారు గాజులు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత లక్ష్మమ్మకు ఎప్పటికో మెలకువ రాగా, అతికష్టమ్మీద తన కూతురుకు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో ఆమె వచ్చి లక్ష్మమ్మను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అనంతరం స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మొత్తంగా 14 తులాల బంగారు నగలు దుండగులు అపహరించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి రైతు కంట్లో నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో ఆశించినంత ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే సరుకును కోల్డ్స్టోరేజీలో నిల్వ ఉంచిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది జిల్లా రైతులు 1.32 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల లోపే దిగుబడులు వచ్చాయి. ఇక కర్ణాటకలోని మధుగిరి, చెలికెర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు కూడా తగ్గింది. అనంతపురం, కర్నూలు ప్రాంతాల నుంచి సైతం అంతంత మాత్రంగా ఎండు మిర్చి వచ్చింది. పైగా చీడపీడలు పంటను భారీగా దెబ్బతీశాయి. కూటమి ప్రభుత్వంలో నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించడంతో దిగుబడులు సగానికి తగ్గాయి. వచ్చిన సరుకు కూడా నాణ్యతగా లేకపోవడంతో ధర భారీగా పడిపోయింది. హిందూపురం వ్యవసాయ మార్కెట్లో మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా రైతులు మిర్చిని ఇక్కడికే తీసుకువస్తుంటారు. గత మూడేళ్ల క్రయవిక్రయాలు పరిశీలిస్తే హిందూపురం మిర్చి యార్డుకు 55,500 క్వింటాళ్లకుపైగా పంట వచ్చింది. 2023–24 సంవత్సరంలో అత్యధికంగా క్వింటా నాణ్యమైన మిర్చి రూ.35 వేల మేర పలికింది. ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్కు 12,955 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, క్వింటా గరిష్ట ధర రూ.18,500 మాత్రమే పలికింది. దీంతో మిర్చిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల కంట కన్నీరే మిగిలింది. మిర్చి సాగుకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి కుటుంబంతో కలిసి ఆరుగాలం శ్రమించిన రైతుకు ధర పతనంతో తీవ్ర నిరాశ మిగిలింది. క్వింటా రూ.19 వేలు కూడా పలకని పరిస్థితుల్లో నిండా మునిగిపోయాడు. మరోవైపు ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ధర తగ్గిన సమయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేసి రైతును ఆదుకోవాల్సి ఉన్నా... ఇప్పుటి వరకూ క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతు పరిస్థితి అమగ్యగోచరమైంది. ఎండు మిర్చికి మంచి ధర వస్తుందని భావించిన వ్యాపారులు ఇప్పటికే కొనుగోలు చేసిన పంటను హిందూపురం సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ల్లో నింపేశారు. ప్రస్తుతం మంచి ధర లేకపోవడంతో మిర్చి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో గోదాముల్లో ఎండుమిర్చి నిల్వలు భారీగా పేరుకుపోయాయి. మిర్చి రైతు దిగాలు భారీగా పడిపోయిన ఎండుమిర్చి ధర గత ఏడాది క్వింటా గరిష్టంగా రూ.35 వేలు ఈసారి గరిష్టంగా రూ.19 వేలు కూడా పలకని వైనం ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో పేరుకుపోయిన నిల్వలు ఆందోళనలో రైతులు.. ‘గిట్టుబాటు’ కోసం వేడుకోలు రూ.19 వేలు కూడా పలకని వైనం.. కోల్డ్ స్టోరేజ్లలో భారీగా నిల్వలు.. తగ్గిన దిగుబడి.. ఆదుకోని ప్రభుత్వం.. -
విద్యార్థినులకు అస్వస్థత
ఆహారం కలుషితం.. కనగానపల్లి: కలుషిత ఆహారం తిని స్థానిక మోడల్ స్కూల్లోని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటున్న పలువురు విద్యార్థినులు మంగళవారం రాత్రి కడుపునొప్పి, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. బుధవారం ఉదయం కూడా మరో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని కూడా పీహెచ్సీకి తరలించి వైద్యం చేయించారు. వీరిలో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి మెరుగపడగా డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ముగ్గురు (తులసి, కళావతి, మానస) విద్యార్థినులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆహారం, నీరు కలుషితం కావడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. కనగానపల్లి మోడల్ స్కూల్లో ఘటన పీహెచ్సీలో విద్యార్థినులకు చికిత్స ముగ్గురిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలింపు -
హంద్రీ–నీవా లైనింగ్ పనుల అడ్డగింత
కనగానపల్లి: హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎవరికో మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగరకుంట సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద లైనింగ్ పనులు చేపట్టేందుకు బుధవారం కాంట్రాక్టర్లు యంత్రాలతో రాగా, విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడికి వెళ్లి పనులు చేపట్టకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణాజలాలు తరలించేందుకు తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాలువ వెడల్పు, జంగిల్ క్లియరెన్స్కు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాలువకు సిమెంట్ వేసి లైనింగ్ చేస్తే ఒప్పుకోబోమన్నారు. దీనివల్ల కాలువ సమీపంలో భూగర్భజలమట్టంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో తగరకుంట, పాతపాల్యం గ్రామాల సర్పంచ్లు మాధవరాజులు, రాజాకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు. కాలువకు సిమెంట్ లైనింగ్ వల్ల భూగర్భజలమట్టం తగ్గుతుంది తమకు అన్యాయం చేయవద్దని రైతుల వేడుకోలు -
తెగుళ్లతో ధర పతనం
వర్షాలు, తెగుళ్ల ప్రభావం ఈ సారి ఎండుమిర్చి దిగుబడిపై చూపింది. ప్రస్తుతం మార్కెట్లో తెల్లమచ్చల సరుకే ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్లే ధర తగ్గింది. దీనికితోడు గత ఏడాది కోల్డ్ స్టోరేజీల్లో భారీగా నిల్వలు ఉంచిన సరుకు కూడా కదలడం లేదు. నాణ్యత సరిగా లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా మార్కెట్లో క్రయవిక్రయాలు తగ్గాయి. – జి. చంద్రమౌళి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి, హిందూపురం -
No Headline
● అవినీతికి నిలయంగా మారిన ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ● దస్తావేజు, సెంట్కు వేర్వేరుగా ధర నిర్ణయించిన వైనం ● గడచిన 8 నెలల్లో గణనీయంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ● కూటమి పార్టీల నేతల అండతో యథేచ్ఛగా అవినీతి ● లంచాలు ఇవ్వకపోతే నెలల తరబడి పెండింగ్లో దస్తావేజులు -
ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి కృషి
పుట్టపర్తి టౌన్: ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎస్పీ రత్న తెలిపారు. ఏఆర్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి స్థానిక పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బకాయిలు, బదిలీలు, డిప్యూటేషన్లు, తదితర సమస్యలను ఎస్పీ దృష్టికి ఏఆర్ కానిస్టేబుళ్లు తీసుకెళ్లారు. తమ సమస్యలు దృష్టిలో ఉంచుకుని టర్న్వైజ్ రొటీన్ పద్ధతిలో సీనియారిటీ ఉన్న వారిని జిల్లాల విభజన సమయంలో ఉద్యోగుల స్థానికత ఆధారంగా ఆయా జిల్లాలు కేటాయించాలని కోరారు. జిల్లా విభజన సమయంలో ఏఆర్ సిబ్బందిని బ్యాచ్ వైజ్ సీనియారిటీ ఆధారంగా ఒక ఏడాది పాటు ఆర్డర్ టు సర్వీస్ అని చెప్పి పాస్పోర్టు ఇచ్చి పంపారన్నారు. ప్రస్తుతం తాము శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చి 30 నెలలు అవుతోందని ఇప్పటికై నా తమకు సొంత జిల్లాకు పంపాలని వేడుకున్నారు. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఎస్పీ భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, ఆర్ఐ వలి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ దర్బార్ కార్యక్రమంలో ఎస్పీ రత్న -
ఉచిత ఎంబీఏ విద్య కోసం 23న పరీక్ష
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి కళాశాలలో ఉచిత ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్ష ఈ నెల 23 ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం విద్యాసంస్థల చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి విడుదల చేశారు. అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రిన్సిపాల్ అండ్ డీన్ డాక్టర్ బాలకోటేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల ఎంబీఏ విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలను పొందడానికి సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ కోర్సు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 91000 64545, 91009 74544, 91009 74537 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జర్మనీకి చెందిన అన్హటా స్టప్టుంగ్ ఫౌండేషన్ సహకారంతో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రశాంతి నిలయం: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్ద, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకం, బ్యూటీషియన్, టైలరింగ్పై నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 నుంచి 38 సంవత్సరాల్లోపు ఉన్న యువతీయువకులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ జిరాక్స్, ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నంబర్ను నమోదు చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు పుట్టపర్తిలోని ఎస్వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో అందజేయాలి. నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ అనంతరం కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. లేదా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. పూర్తి వివరాలకు స్కిల్ హబ్ సెంటర్ కో–ఆర్డీనేటర్ సాయి గణేష్ (99666 82246, 79899 23515)ను సంప్రదించవచ్చు. తాళం వేసిన ఇంట్లో చోరీ అగళి: తాళం వేసిన ఇంట్లో దుండగులు చొరబడి విలువైన బంగారు, వెండి సామగ్రిని అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం ఎంఎం పాళ్యం గ్రామానికి చెందిన ఓబుళప్ప, ప్రేమకుమారి దంపతులు ఈ నెల 17న ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని దొడ్డరి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంటి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేశారు. అందులో దాచిన 50 గ్రాముల బంగారు నెక్లెస్, 250 గ్రాముల వెండి సామగ్రిని అపహరించారు. బుధవారం ఇంటికి చేరుకున్న ఓబుళప్ప దంపతులు తలుపులు తీసి ఉండడంతో గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వీరేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
● గొంతు తడవక సొమ్మసిల్లి...
పుట్టపర్తి: గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్కపోవడంతో ఓ మామిడి తోటలో వాలిన జాతీయ పక్షి నెమలి... అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. బుక్కపట్నం గ్రామానికి చెందిన రైతు చిట్రా నారాయణస్వామి తోటలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విపరీతమైన దాహంతో సొమ్మసిల్లిన నెమలిని గమనించిన కొత్త చెరువుకు చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవిచంద్ర వెంటనే దానికి సపర్యలు చేపట్టారు. బిందెలతో నీటిని దానిపై పోసిన కాసేపటికి తేరుకుంది. అయినా పైకి స్వేచ్ఛగా ఎగరలేక ఇబ్బంది పడుతుంటే రైతు నారాయణస్వామితో కలసి పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గొంతు తడుపుకునేందుకు మూగజీవాలు పడుతున్న ఇబ్బందులకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలో కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నా.. వెలుగులోకి కొన్ని మాత్రమే వస్తున్నాయి. సకాలంలో రైతులు గుర్తించడంతో నెమలికి ప్రాణాపాయం తప్పింది. -
ధర్మమార్గంలో పయనిస్తేనే సార్థకత
ప్రశాంతి నిలయం: ధర్మ మార్గంలో పయనిస్తేనే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం ఆరో రోజు ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో కొనసాగింది. ఉదయం వేదపండితులు వేదపఠనం నడుమ అతిరుద్ర మహాయజ్ఞ క్రతువులను నిర్వహించారు. సాయంత్రం వేదపండితుడు డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి అతిరుద్ర మహాయజ్ఞం విశిష్టతను వివరించారు.అతిరుద్ర మహాయజ్ఞం అగ్ని దేవుడిని మిక్కిలి సంతృప్తిపరిచి విశ్వశాంతిని ప్రసాదిస్తుందో చక్కగా వివరించారు. మనుధర్మం మేరకు మానవుడు ధర్మ మార్గంలో, చట్టబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో వివరించారు. వేదాలు అందించిన సందేశం మేరకు ధర్మం అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఆచారం మానవుని వెంట జంటగా ఉంటూ ఎలా రక్షిస్తుందో తెలియజేశారు. అనంతరం హిందూస్థానీ సంగీత విద్వాంసుడు కలైమణి డాక్టర్ ఘటమ్ కార్తీక్ బృందం సంగీత కచేరీ నిర్వహించారు. పరమేశ్వరుడిని, సాయీశ్వరుడిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. -
భార్యను భయపెట్టాలని భర్త డ్రామా
బత్తలపల్లి: భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త పిల్లలను తీసుకుని చనిపోతున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయాడు. భయపడిపోయిన భార్య మరిది ద్వారా డయల్ 100కు ఫోన్ చేయించడంతో పోలీసులు సెల్నంబర్ లొకేషన్ తెలుసుకుని సురక్షితంగా వారిని కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గంటాపురం గ్రామానికి చెందిన కురుబ నాగభూషణ, వీరదేవి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. నాగభూషణ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాగుడు మానాలంటూ భర్తతో గొడవపడింది. మనస్తాపానికి గురైన నాగభూషణ తాను ఇక బతకనని చెప్పి ఇంట్లోనే సెల్ఫోన్ వదిలేసి వెళ్లిపోయాడు. బత్తలపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న కుమారుడు, కుమార్తెను పిలుచుకెళ్లాడు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వీరదేవి కుటుంబ సభ్యులతో విషయం తెలిపింది. దీంతో నాగభూషణ తమ్ముడు హరి డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. ఇంతలో వీరదేవి సెల్కు నాగభూషణ ఫోన్ చే సి పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని చెప్పి పెట్టేశాడు. తన భర్త కాల్ చేసిన విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు సదరు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు, బాధితుల బంధువులు కదిరికి వెళ్లి నాగభూషణతో పాటు పిల్లలను తీసుకువచ్చారు. ఎస్ఐ సోమశేఖర్ కౌన్సెలింగ్ నిర్వహించగా.. తన భార్యను భయపెట్టేందుకు పిల్లలను చంపి, తాను చస్తానని బెదిరించానని తెలిపాడు. ఇలాంటి ఆకతాయి పనులకు దూరంగా ఉండాలని, భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించాలని హితవు పలికారు. ఇకపై అన్యోన్యంగా ఉంటామంటూ తెలిపి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయారన్నారు. సకాలంలో స్పందించిన పోలీసులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్, ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్లు అభినందించారు. -
కింద పడి వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: ఉన్నఫళంగా రోడ్డుపై కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన గార్లదిన్నె భాస్కర్ (40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఆయన రోడ్డుపై ఉన్నఫళంగా కుప్పకూలాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు. యువకుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సత్యసాయి నగర్కు చెందిన అశోక్ (35) ఇటుకల బట్టీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలయ్యాడు. దీంతో ఆన్లైన్ అప్పులు తీర్చేందుకు ఇంటిని తాకట్టు పెట్టి రూ.8 లక్షలు తీసుకున్నాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా మదన పడుతున్న అశోక్ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై చెన్నేకొత్తపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ప్యాదిండి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య ఉంది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.దానిమ్మ తోట దగ్ధం ● రూ.5లక్షలు నష్టపోయిన రైతులు బత్తలపల్లి: ఆకతాయిల చేష్టలకు రూ.5లక్షలను రైతులు నష్టపోయారు. బీడు పొలంలో ఎండిన గడ్డికి నిప్పు పెట్టడంతో బోరు బావులు కింద సాగు చేసిన పంటలు అగ్నికి ఆహూతయ్యాయి. వివరాలు.. బత్తలపల్లికి చెందిన రైతులు గడిపూటి శేషయ్య, రామానాయుడు, రమేష్బాబు, గోపీనాథ్కు ముష్టూరు రెవెన్యూ పరిధిలో మొత్తం పది ఎకరాల పొలం ఉంది. ఏడేళ్లుగా ఈ పొలంలో 3,250 దానిమ్మ చెట్లను పోషిస్తూ వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ పొలానికి సమీపంలో ఉన్న బీడు భూమిలో ఎండు గడ్డికి కొందరు నిప్పు రాజేశారు. చూస్తుండగానే మంటలు ఉధృతంగా చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దానిమ్మ చెట్లతో పాటు డ్రిప్ పరికరాలు, మూడు స్టార్టర్లు, విద్యుత్ కేబుల్ కాలిపోయాయి. ఘటనతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. -
బాడుగకిస్తే బాధే మిగులుతోంది!
● అనంతపురం రాజు రోడ్డులోని ఓ ఆప్టికల్ (కళ్లద్దాల) భవనాన్ని భాస్కర్రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. అనంతరం అమ్మిన వ్యక్తికే అద్దెకిచ్చారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డికి సదరు వ్యక్తి అద్దె ఇవ్వకుండా మొండికేశారు. తన బంధువులతో కోర్టులో కేసు వేయించారు. అష్టకష్టాలు పడిన భాస్కర్ రెడ్డి ఎలాగోలా మూడేళ్ల తర్వాత తన భవనాన్ని సొంతం చేసుకోగలిగారు. ● భవనానికి బాడుగ ఇవ్వక, ఖాళీ చేయక ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల ఓ ఫిర్యాదుదారు అనంతపురం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఓ న్యాయవాదిని పిలవగా.. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ రెండే కాదు.. జిల్లాఅంతటా ఇదే పరిస్థితి. అద్దెకు తీసుకున్న వాళ్లు సరిగా బాడుగ డబ్బు కట్టక, భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో ఓనర్లు నానా తంటాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనవాళ్లే కదా.. అంతా బాగుంటుంది లే’ అనుకుంటూ భవనాన్ని అద్దెకిచ్చిన పాపానికి ఓనర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అద్దెదారులు చివరకు ‘ఖాళీ చేయం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ ధిక్కరిస్తున్న పరిస్థితి. పైగా కోర్టుకు వెళ్లడం.. ఇప్పుడే ఖాళీ చేయలేమని గడువుతో కూడిన స్టే ఆర్డర్ తెచ్చుకోవడం.. ఆ గడువు కూడా ముగిసినా ఖాళీ చేయకపోవడం... ఇదీ దుస్థితి. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో భవన యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అద్దె కరెక్టుగా ఇచ్చేవారికి కూడా కొందరి ఆగడాలతో బాడుగకు భవనం దొరకడం కష్టతరమవుతోంది. ‘క్రాంతి’.. భ్రాంతి అనంతపురం గుత్తిరోడ్డులోని ఓ అద్దె భవనంలో క్రాంతి హాస్పిటల్ నడుస్తోంది. నెలకు అద్దె రూ.3.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 2021లోనే భవనం అద్దె లీజు ముగిసింది. ఈ క్రమంలో భవనాన్ని ఖాళీ చేయాలని అనేక సార్లు ఓనరు అడిగినా స్పందన లేకుండా పోయింది. పైగా గడిచిన 14 నెలల నుంచి అద్దె కూడా చెల్లించలేదు. దీంతో భవన యజమాని నగేష్ 2024 డిసెంబరులో ఎస్పీకి ఫిర్యాదు చేయగా... పరిష్కారం చూపాలంటూ అనంతపురం త్రీ టౌన్ పోలీసులను ఆయన ఆదేశించారు. అయితే, సదరు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆస్పత్రి వద్ద భవన యజమాని బుధవారం ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు మురళి దిగిరాకపోగా బాధితుడిపైనే దౌర్జన్యం చేశారు. ‘దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ బెది రించాడని నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కేసులు.. అనంతపురంలోనే కాదు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు పట్టణాల్లోనూ ఇలాంటి కేసులు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సగటున రోజుకు 10 కేసులు నమోదవుతున్నాయి. అద్దెకున్న వారు ఖాళీ చేయకపోవడంతో బిల్డింగ్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉంటూ ఇక్కడ అద్దెకిస్తే ఆ ఇళ్లకు ఏకంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కుదువకు పెట్టిన వారూ ఉన్నట్లు సమాచారం. భవనాలను ఖాళీ చేయని అద్దెదారులు అవసరమైతే కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు చేసేది లేక పోలీసులను ఆశ్రయిస్తున్న ఓనర్లు పోలీసుల వద్దకు రోజుకు 10 పైనే కేసులు అద్దె ఇప్పించే ఉద్యోగం కాదు మాది అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇప్పించడమో, ఖాళీ చేయించేడమో చేసే ఉద్యోగం కాదు మాది. ఇలాంటి వాటి జోలికొస్తే సివిల్ పంచాయితీల్లో ఎందుకు తలదూరుస్తారు అంటారు. అందుకే కోర్టుకెళ్లి తేల్చుకోండి అని చెబుతున్నాం. మా పరిధిలో ఉన్నవి మాత్రమే చేస్తాం. – శాంతిలాల్, సీఐ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ -
లంచం కొట్టు.. దస్త్రం పట్టు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్మవరంలోని సబ్ రిజిస్ట్రార్ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ కార్యాలయాన్ని అవినీతికి నిలయంగా మార్చేశారు. దీంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సెంట్కు ఒక రేటు, ఎకరానికి ఒక రేటు చొప్పున ధరను అధికారులు నిర్ణయించి అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఇక్కడ అధికారులు చెప్పిన ధర చెల్లించకపోతే పని ముందుకు సాగడం లేదు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా లంచం ఇవ్వని వారి దస్తావేజులను నెలల తరబడి పెండింగ్లో ఉంచేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో దస్తావేజుల లేఖరుల ఏజెంట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. స్వీకరించిన అవినీతి సొమ్ములో కూటమి పార్టీల నేతలకు కొంత ముడుపులు చెల్లిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏటా రూ.150 కోట్ల ఆదాయం.. జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాలలో ధర్మవరం ఒకటి. గతంలో ఒక్క ధర్మవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిఽధిలో నెలకు 500 నుంచి 800 వరకు దస్తావేజులు రిజిస్ట్రర్ అయ్యేవి. తద్వారా ప్రభుత్వానికి రూ.1.20కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకూ ఆదాయం సమకూరేది. అప్పట్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ భారీగా జరుగుతుండేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తిష్టవేసి లావాదేవీలన్నీ పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. వారు రిజిస్ట్రర్ చేయమంటే అధికారులు చేస్తారు.. వద్దు అంటే ఆపేస్తున్నారు. మూడు భాగాలుగా పంచుకున్న నేతలు.. ధర్మవరం పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పంచుకున్నట్లుగా సమాచారం. పట్టణంలోని బెంగుళూరు రోడ్డు, పుట్టపర్తి రోడ్డు వైపు రిజిస్ట్రేషన్లు టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. అనంతపురం రోడ్డు వైపు బీజేపీ నాయకులు, రేగాటిపల్లి జాతీయ రహదారి వైపు జనసేన నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు ఒప్పందం చేసుకుని మరీ అక్రమాలకు తెరలేపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైన వెంచర్ వేయాలన్నా, గతంలో వేసిన వెంచర్లకు సంభందించిన ప్లాట్లు రిజిస్ట్రర్ చేయాలన్నా ఆయా పార్టీల నాయకులకు కప్పం చెల్లించి అనుమతి తీసుకుంటేనే రిజిస్ట్రేషన్కు అధికారులు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఈ దోపిడీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా మందగించింది. ఒకప్పుడు 800 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం 200 నుంచి 300కు మించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. కంచె చేను మేసిన చందంగా అందిన కాడికి దండుకుంటున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు . ఎంతలా అంటే లంచం ముట్టజెప్పందే ఒక్క పనీ చేయడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ మొత్తం ప్రక్రియ కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. తమ స్వలాభం కోసం అవినీతి అధికారులకు నేతలు వత్తాసు పలుకుతుండడంతో సామాన్య ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. మంత్రి పీఏ హల్చల్ ధర్మవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను మంత్రి సత్యకుమార్ పీఏ హరీష్బాబు తరచుగా తనిఖీ చేస్తూ వివరాలు ఆరా తీస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తనదైన శైలిలో కార్యాలయ అధికారులను, సిబ్బందిని బెదిరిస్తూ అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని హెచ్చరించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యే, మంత్రి హోదాలో చేయాల్సిన తనిఖీలను ఓ పీఎ చేపట్టడం ధర్మవరం చరిత్రలో ఇంత వరకూ ఎన్నడూ జరగలేదని రియల్టర్లు అంటున్నారు. అలాగే టీడీపీ, జనసేన నాయకులు క్రమం తప్పకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తాము చెప్పినట్లే రిజిస్ట్రేషన్లు జరగాలని అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం ప్రశ్నార్థకమేనని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం
అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని సంబంధిత వైద్య సిబ్బందికి అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
‘సైబీరియన్’ స్నేహితులొచ్చారు!
ఖైదీల ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు ● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ హిందూపురం అర్బన్: సబ్జైలులోని ఖైదీల ఆరోగ్యంపై జైలు అధికారులు శ్రద్ధ చూపాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యాధికారులతో చికిత్సలు చేయించాలన్నారు. మంగళవారం ఆయన స్థానిక సబ్జైలును తనిఖీ చేశారు. సబ్ జైలులో ప్రస్తుతం ఖైదీలు ఎంత మంది ఉన్నారు? ఏయే నేరాల్లో జైలుకు వచ్చారు? వారి న్యాయ సాయం కోసం న్యాయవాదులు ఉన్నారా.. తదితర విషయాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు ప్రభుత్వ పరంగా ఉచిత న్యాయ సాయం అందిస్తామన్నారు. అలాంటి ఖైదీలు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జైలులో ఎవరైనా కుల వివక్ష ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే 18 ఏళ్లు దాటని, 80 ఏళ్లు పైబడిన ఖైదీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘ కాలిక రోగాలున్న ఖైదీలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం జైలు గదులు, వంట గది, శుద్ధజలం, న్యాయ సహాయ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది నవేరా, పారా లీగల్ వలంటీర్ సురేష్, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి పాల్గొన్నారు. ‘జ్ఞానజ్యోతి’తో బోధన మెరుగు పర్చుకోవాలి ● అంగన్వాడీలకు డీఈఓ కృష్ణప్ప సూచన పుట్టపర్తి టౌన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇస్తున్న ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ ద్వారా బోధన సామర్థ్యాలు మెరుపర్చుకోవాలని డీఈఓ కృష్ణప్ప అంగన్వాడీలకు సూచించారు. మంగళవారం కొత్తచెరువులో ఎంపీపీ పాఠశాలలో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లకు ‘జ్ఞానజ్యోతి’ పేరుతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంఽధించి కిట్లు కూడా అందజేసినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీల బోధన సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. శిక్షణ సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జయచంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత, ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్, రిసోర్స్ పర్సన్లు సాయిశివ, బిందుమాధవి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ వరప్రసాద్, ఓబులేసు పాల్గొన్నారు.చిలమత్తూరు: సైబీరియన్ స్నేహితులొచ్చారు. మండలంలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సందడి చేస్తున్నారు. సంతానోత్పత్తి కోసం ఏటా మార్చిలో వీరాపురానికి వచ్చే సైబీరియన్ పక్షులు...ఈసారి కాస్త ముందుగానే వచ్చేశాయి. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలోనే వచ్చిన పక్షుల గుంపు... ఇక్కడి వాతావరణ పరిస్థితులను చేసుకుని వెళ్లింది. సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండటంతో వందలాది పక్షులు వేల కి.మీ దూరం ఎగురుతూ వచ్చి వీరాపురం, వెంకటాపురం చేరుకున్నాయి. చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ఎర్రకాళ్ల కొంగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకొని తిరిగి మళ్లీ సైబీరియన్ వెళ్లిపోతాయి. -
రాజకీయ అండతోనే నాపై దాడి
పెనుకొండ రూరల్: రాజకీయ అండదండలతోనే బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని గుంతకల్లు ప్రభాకర్ అన్నారు. ‘కియా’ పరిశ్రమ సమీపంలోని ఓ భూవివాదానికి సంబంధించి, ఆదివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అనుచరుడైన గుంతకల్లు ప్రభాకర్పై ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ అనుచరులు దాడికి దిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుట్టూరులో బాధితుడు గుంతకల్లు ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మునిమడుగు పొలం సర్వే నంబర్ 433లో 1.12 ఎకరాలు, గుట్టూరు పొలం 324లో 61 సెంట్లు మేర తనకు పొలం ఉందన్నారు. తన భూమిలో పనులు చేసుకుంటుంటే రౌడీలను పంపి దాడి చేయడం సరికాదన్నారు. వాటిని కప్పిపుచ్చు కునేందుకు ఎక్కడో ప్రెస్మీట్లు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చర్చకు సిద్ధమా ఆదీ..? ‘‘నువ్వు నిజంగా నిజాయితీ పరుడవైతే..న్యాయమైన చర్చకు సిద్ధమా ఆదీ’’ అని గుంతకల్లు ప్రభాకర్ సవాల్ విసిరారు. ‘‘హైదరాబాద్కు చెందిన ఓ.. ప్రముఖ వ్యాపారవేత్తను నువ్వు కిడ్నాప్ చేసింది నిజం కాదా...ఈ కేసులో నిన్ను పోలీసులు అరెస్టు చేసింది నిజం కాదా’’ అని ప్రశ్నించారు. ఆదినారాయణపై అక్రమాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు, ఫోర్జరీ కేసులు పది వరకు ఉన్నాయన్నారు. అతని లాగా తాను పార్టీలు మార్చేరకం కాదన్నారు. గ్లోబుల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి 250 ఎకరాల భూమిపై కోర్టు కేసు నడుస్తున్న మాట వాస్తవమేనని, అందులోని 88 ఎకరాలకు తన భాగస్తుడికి కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఆ భూములకు, దాడికి కారణమైన తన భూమికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తాము నిజాయితీ పరులమని, కాబట్టే తాము మోసపోయామన్నారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని ఆదినారాయణను ఈ సందర్భంగా ప్రభాకర్ హెచ్చరించారు. సమావేశంలో గుంతకల్లు ప్రభాకర్ -
కంది పంట దగ్ధం
గోరంట్ల: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో పది ఎకరాల్లో రైతులు సాగు చేసిన కంది పంట దగ్ధమైంది. గోరంట్ల మండలం వానవోలు తండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన కుంటి సోమ్లనాయక్, తిప్పేనాయక్, రామచంద్రనాయక్ తమకున్న 10 ఎకరాల్లో కంది సాగు చేశారు. పంట చేతికి రావడంతో కొంత మేర కోతలు జరిగి, నూర్పిడి కోసం కుప్ప పోశారు. ఈ క్రమంలో కంది కట్ట కుప్పలకు సమీపంలోని బయలు భూమిలో మంగళవారం మధ్యాహ్నం ఆకతాయిలు నిప్పు రాజేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతూ పంటను చుట్టుముట్టింది. నూర్పిడి కోసం సిద్ధంగా ఉంచిన కంది కట్టెతో పాటు పది ఎకరాల్లోని పంట పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో రూ. లక్షల్లో నష్టపోయినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
ఎంజాయ్మెంట్ చెల్లదు
నదులు జాతీయ సొత్తు. ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ రెవెన్యూలోని కొందరు అధికారులు వాటిని కొందరికి ధారాదత్తం చేశారు. పైసల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఒక్క సంతకంతో చిత్రావతి నదికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఎంజాయ్మెంట్ పేరుతో 43 ఎకరాలు రాసిచ్చేశారు. ఇలా ఎంజాయ్మెంట్ హక్కులు పొందిన బడా రియల్టర్ చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జికట్టి నదీ జలాలకు అడ్డుకట్ట వేశాడు. కింద భాగంలో పొలాలున్న రైతులనూ అష్టకష్టాలు పెడుతున్నాడు. నదికే యాజమాన్య హక్కులు పొందిన రియల్టర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.చిలమత్తూరు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ‘చిత్రావతి’ ఒకటి. వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ నదిని చిలమత్తూరు మండలంలో రెడ్డెప్ప శెట్టి అనే వ్యక్తి ఆక్రమించాడు. ఏకంగా బ్రిడ్జి నిర్మించి నీటి వనరులను సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇది అక్రమమని ఇరిగేషన్ అధికారులు తేల్చగా...గతంలో తాను పొందిన ‘ఎంజాయ్మెంట్’ పత్రం చూపుతున్నాడు. రాజేంద్రసింగ్ హయాంలో... 2019 ఎన్నికల సమయంలో చిలమత్తూరు తహసీల్దార్గా రాజేంద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో జిల్లా యంత్రాంగం అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉండగా.. రాజేంద్ర సింగ్ మాత్రం కాసుల కోసం ప్రభుత్వ భూములను ఎడాపెడా పరాధీనం చేశారు. ఈ క్రమంలోనే రియల్టర్ రెడ్డెప్పశెట్టికి జూన్ 18 తేదీన కోడూరు పొలంలో సర్వే నంబరు 661, 680–1,2లలో 43 ఎకరాల నదిని ధారాదత్తం చేశారు. ఆ ఎంజాయ్మెంట్ పత్రంతోనే రెడ్డెప్పశెట్టి చిత్రావతి నదిని చెరబట్టి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు నోటీసులిచ్చినా... రియల్టర్ రెడ్డెప్పశెట్టి చిత్రావతికి అడ్డంగా బ్రిడ్జి కట్టి నీటి వనరులు కిందకు వెళ్లకుండా వాడుకుంటుండంతో పాటు నది పోరంబోకు భూములను సైతం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. నదికి ఆవలవైపు భూములున్న రైతులను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ కథనం ప్రచురించగా... రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సోమవారం అక్రమ బ్రిడ్జిని పరిశీలించారు. రియల్టర్కు నోటీసులు జారీ చేశారు. కానీ రియల్టర్ రెడ్డెప్పశెట్టి 2019లో అప్పటి తహసీల్దార్ రాజేంద్రసింగ్ తనకు మంజూరు చేసిన ఎంజాయ్మెంట్ పత్రాన్ని చూపుతూ రుబాబు చేస్తున్నాడు. ఇదే పత్రాన్ని తాను 2023లోనే అధికారులకు ఇచ్చానని చెప్పడం గమనార్హం. అయినా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్టర్కు ప్రభుత్వ భూములా..? పోరంబోకు స్థలాలను సాధారణంగా పేదలకు లీజుకు ఇస్తుంటారు. పంటల సాగు, మొక్కల పెంపకం వంటి వాటికి అనుమతి మంజూరు చేస్తారు. అయితే వందల ఎకరాలు కలిగిన రియల్టర్ రెడ్డెప్ప శెట్టికి సుమారు 43 ఎకరాల నదికి ఎంజాయ్మెంట్ పత్రాలు మంజూరు చేయడం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని సదరు రియల్టర్ అధికారులు అడిగిన ప్రశ్నలకు వివరణలో పేర్కొనడం విశేషం. ఏ నిబంధన మేరకు నదికి ఎంజాయ్మెంట్ అనుమతులు ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.నదులపై రెవెన్యూ పెత్తనం రియల్టర్కు నదిని ధారాదత్తం చేసిన తహసీల్దార్ 2019లోనే నదీ పోరంబోకు 43 ఎకరాలకు ఎంజాయ్మెంట్ నదిపై ఏకంగా బ్రిడ్జి కట్టించుకున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమ నిర్మాణమని నోటీసులిచ్చిన ఇరిగేషన్ అధికారులు బదులుగా గతంలో పొందిన ఎంజాయ్ మెంట్ కాపీని పంపిన వైనంచిత్రావతి పరీవాహకంలోని పోరంబోకు భూములకు ఎంజాయ్మెంట్ ఇవ్వడం చట్ట విరుద్ధం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నీటి ప్రవాహానికి దూరంగా ఉండి ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉంటేనే ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రిడ్జిని కచ్చితంగా తొలగిస్తాం. అదేవిధంగా పోరంబోకుకు ఇచ్చిన ఎంజాయ్మెంట్ రద్దు చేయాలని నోటీసులు అందించాం. ఇందుకు వారం రోజులు గడువిచ్చాం. మాట వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – యోగానంద, ఇరిగేషన్ డీఈ, హిందూపురంరైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు తనకున్న వందల ఎకరాల భూములకు కంచె వేసుకున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి... ఇతర రైతుల పొలాలకు వెళ్లేందుకు ఎప్పటి నుంచో ఉన్న దారిని సైతం మూసివేశారు. దీంతో ఇటీవలే కొడికొండకు చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవ్వరూ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.ప్రభుత్వ భూములూ ఆక్రమణ..? రియల్టర్ రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూములనూ తన ఆధీనంలో ఉంచుకున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనడంతో పాటు సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తే అసలు విషయాలు నిగ్గు తేలుతాయని ప్రజలు చెబుతున్నారు. -
నిలకడగా ఎండుమిర్చి ధరలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు మార్కెట్లో నిలకడగా ఉన్నాయి. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 113.50 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటిరకం ఎండుమిర్చి క్వింటా రూ.15 వేలు, రెండో రకం రూ.13,500, మూడో రకం క్వింటా ఎండుమిర్చి రూ.8 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రశేఖర్ తెలిపారు. శ్రీవారి పాదాలను తాకిన సూర్య కిరణాలు హిందూపురం అర్బన్: స్థానిక పేట వేంకటరమణ స్వామి మూలవిరాట్ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే తొలి మంగళవారం ఉదయం 7 గంటలకు ఈ అరుదైన ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తెల్లవారుజామునే ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూలవిరాట్ను సూర్వకిరణాలు తాకిన అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
‘అసంఘటిత’ కార్మికులను నమోదు చేయాలి
ప్రశాంతి నిలయం: ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా స్థాయి అమలు కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రెండు లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో నమోదు కావాల్సి ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పనిచేసే చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు తాపీ మేసీ్త్రలు, శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు, రిక్షా డ్రైవర్లు, టైల్స్ పరిశ్రమల్లో పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారస్తులను గుర్తించాలన్నారు. ‘ఉపాధి’ కూలీలు, చేనేత కార్మికులు, అంగన్వాడీ కార్మికుల వివరాలనూ ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. నమోదైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక యూనివర్సల్ గుర్తింపు కార్డు జారీ చేస్తారని, ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయన్నారు. ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో నమోదైన ప్రతి కార్మికుడికీ ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ప్రయోజనాలు దక్కుతాయన్నారు. దీని గురించి విస్తృత ప్రచారం చేసి కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ అధికారి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి పుట్టపర్తి అర్బన్: జాతీయ రహదారి 342 నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి పుట్టపర్తి నుంచి గోరంట్ల మండలం, చిలమత్తూరు మండలం కోడూరు వరకూ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఏడాదిగా పనులు సాగుతున్నాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా ఈ మార్గంగుండా రవాణ మెరుగవుతుందన్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన వెంగటగారిపల్లి వద్ద ఉన్న ఘాట్ పనులను పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా భూ సేకరణ పూర్తి కాకపోయినా, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందక పోయినా.. తన దృష్టికి తీసుకురావాలన్నారు. భూముల్లో ఉన్న మట్టి కుప్పలు, రాళ్లు, తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎన్హెచ్–342 ఈఈ గిడ్డయ్య, సంబంధిత కంట్రాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. ‘ఈ–శ్రమ్’లో వివరాల నమోదుతో ఎన్నో ప్రయోజనాలు సమీక్ష సమావేశంలో కలెక్టర్ టీఎస్ చేతన్ -
సాయీశ్వరా.. మముబ్రోవరా
ప్రశాంతి నిలయం: సాయీశ్వర నామంతో ప్రశాంతి నిలయం మార్మోగింది. సత్యసాయి.. ఈశ్వరుడి ప్రతిరూపమంటూ కీర్తించారు. సాయీశ్వరా...మముబ్రోవరా అంటూ వేడుకున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా నార్త్ బిల్డింగ్స్ మైదానంలో చేపట్టిన అష్టోత్తర శత సహస్త్ర సాయీశ్వర లింగార్చన ఘట్టం మంగళవారం ముగిసింది. చివరి రోజు లింగార్చనలో పాల్గొన్న భక్తులు ప్రత్యేకంగా రూపొందించిన సాయీశ్వర లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు దంపతులు సాయీశ్వరునికి పూజలు నిర్వహించారు. ఇక అతిరుద్ర మహాయజ్ఞం 6వ రోజు మంగళవారమూ కొనసాగింది. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ మధ్య యజ్ఞ క్రతువు నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు సంబుద్దా ఛటర్జీ బృందం సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతిష్య శాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ ఎస్.మురళీ భక్తులనుద్దేశించి ప్రసంగించారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన మంగళవారం ముగిసాయి. ఆరు పళ్లు, న్యూ కేటగిరి, సీనియర్ విభాగాల్లో జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగం పోటీల్లో నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నెకు చెందిన రైతు కుందూరు రాంభూపాల్రెడ్డి వృషభాలు మొదటి స్థానం, వైఎస్సార్జిల్లా కల్లూరుకు చెందిన రైతు పెరుమాల్ శివకృష్ణయాదవ్ వృషభాలు రెండవ స్థానం, అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రైతు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి వృషభాలు మూడవ స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహాకాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ అందజేశారు. అలాగే సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వృషభాల యజమానికి ఓ పాడి ఆవును రైతులు రమేష్రెడ్డి, చిలుకూరు కుమార్రెడ్డి బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిన్నరెడ్డి యాదవ్, రంగస్వామిరెడ్డి యాదవ్, లక్ష్మీరంగయ్య పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు భరోసానివ్వాలి
● జిల్లా స్థాయి మహిళా సదస్సులో ఎస్పీ రత్నపుట్టపర్తి అర్బన్: మహిళల భద్రతకు భరోసానివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ రత్న అన్నారు. ‘మహిళల భద్రత – భవిష్యత్తుకు భరోసా’ పేరుతో మంగళవారం పెడపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై మాట్లాడారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాల్య వివాహాలు, సైబర్ క్రైం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొబైల్ను మంచికి వినియోగించాలని సూచించారు. రోజూ ఓ నియోజకవర్గం చొప్పున మార్చి 15వ తేదీ వరకూ సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల చేకూరే అనర్థాలపై చైతన్యపరిచారు. సైబర్ క్రైం, హనీ ట్రాప్ వలలో పడరాదన్నారు. అనంతరం ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల నియంత్రణపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఎస్పీ విజయ్కుమార్, ఆర్డీఓ సువర్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, ఐసీడీఎస్ పీడీ సుధావరలక్ష్మి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, పెడపల్లి సర్పంచ్ మంగ్లీబాయి, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు గుంతకల్లు టౌన్: ధర్మరక్ష వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. మత ప్రబోధకుల్లో 90 శాతం మంది సరిగా లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నినదిస్తే హైదరాబాద్లోని ఒవైసీతో పాటు ఇతరులకు వణుకు పుట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిచోటా హిందుత్వానికి శత్రువులు ఎక్కువయ్యారని, సెక్యులర్ వాదులను తాను శిఖండీలుగా అభివర్ణిస్తున్నానని అన్నారు. -
నేడు లంకా దినకర్ రాక
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 19న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా కడప నుంచి బయలుదేరిన ఆయన రోడ్డు మార్గాన మంగళవారం రాత్రి 8 గంటలకు పుట్టపర్తిలోని శాంతి భవన్కు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. జిల్లాలో 20 సూత్రాల అమలుపై బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకూ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. చెలరేగిన ‘కేబుల్’ దొంగలు యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. -
ఉద్యోగులతో బంతాట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఉన్నతాధికారులు సైతం ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నారు. ఎప్పటివరకూ ఉంటామో.. ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. శాఖల హెచ్ఓడీలకే దిక్కులేకుండా పోయిన పరిస్థితి. రాజకీయ జోక్యంతో రాత్రికి రాత్రే బదిలీలు జరుగుతుండటంతో పనిచేయాలంటేనే మనసొప్పడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు తమ పనులు చేయకుంటే మెడపై కత్తి పెట్టి మరీ బదిలీ చేయిస్తున్న దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కలెక్టర్ పూర్తిగా నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈ బదిలీతో అలజడి.. కూటమి సర్కారు వచ్చేనాటికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు విద్యుత్ శాఖ ఎస్ఈగా సురేంద్ర ఉండేవారు. ఈయనపై రాజకీయ ముద్రవేసి అనంతపురం జిల్లా ఎస్ఈగా తెచ్చారు. మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు సంతకాలు చేసి మరీ ఆయన్ను తీసుకొచ్చారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్కుమార్ నాలుగు నెలలు పని చేశారో లేదో ఉన్నఫళంగా రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్శాఖలో అలజడి మొదలైంది. ఐదుగురు ఎస్పీలు.. కూటమి సర్కారు వచ్చాక జిల్లాకు ఐదుగురు ఎస్పీలు వచ్చి వెళ్లారు. ఎస్పీలపై ఇక్కడి నాయకులు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఉన్న అన్బురాజన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ బర్దార్, గౌతమి శాలి, మురళీ కృష్ణలు వచ్చిన రెండు మాసాలకే తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుత ఎస్పీ జగదీష్పై కూడా బదిలీ కత్తి వేలాడుతోందని అంటున్నారు. సంతకం చేయకుంటే ఊడినట్లే.. కూటమి ప్రభుత్వంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరీ భ్రష్టు పట్టింది. ఇక్కడ ఐదు నెలల్లో ఐదుగురు కమిషనర్లు మారారు. నేతలు చెప్పిన చోట సంతకం చేయకపోతే మరుసటి రోజే బదిలీ కావాల్సి వస్తోంది. మేఘ స్వరూప్ అనంతరం నాగరాజు, రామలింగేశ్వర్, మల్లికార్జునరెడ్డిలు బదిలీ అయ్యారు. తాజాగా బాలస్వామి వచ్చారు. ఈయన ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి. దీంతో కార్పొరేషన్లో పాలన స్తంభించి పోయింది. రెండు నెలలు తిరక్కముందే ఏఎస్పీపై.. శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ డీఎస్పీగా ఉన్న ఆర్ల శ్రీనివాసులుకు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది.అదే జిల్లాకు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా పనిచేస్తున్న సమయంలో ఉన్నఫళంగా ఆయనకు బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. ఆ జిల్లా ఎస్పీకి నచ్చలేదని అడిషనల్ ఎస్పీని బదిలీ చేయించారనే విమర్శలొస్తున్నాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు ఆరుమాసాల్లో ఐదుగురు ఎస్పీలను మార్చిన వైనం అనంతపురం కార్పొరేషన్లో ఇష్టారాజ్యంగా కమిషనర్ల మార్పు తాజాగా విద్యుత్ శాఖ ఎస్ఈ బదిలీ అటకెక్కిన పాలన -
సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్యాదవ్ధర్మవరం అర్బన్/పెనుకొండ: సత్ప్రవర్తన అలవర్చుకుంటే మెరుగైన జీవితం ఉంటుందని సబ్జైల్లోని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్యాదవ్ సూచించారు. ధర్మవరం, పెనుకొండలోని సబ్జైళ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్లు, రికార్డులు పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. కోర్టు కేసుల్లో వాదించేందుకు న్యాయవాది లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి, బిల్లే రవి, పారా లీగల్ వలంటీర్ షామీర్బాషా, విశ్రాంత న్యాయవాది అశ్వత్థనారాయణ, ఉప్పర నరసప్ప, ఆయా జైళ్ల అధికారులు పాల్గొన్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం గుంతకల్లు రూరల్: కనిపించకుండా పోయిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు 24 గంటలు గడవక ముందే హంద్రీనీవా కాలువలో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లుకు చెందిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు తిరుమలరెడ్డి (45) గత ఆదివారం బుగ్గ సంగాల క్షేత్రం సమీపంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం గుంతకల్లు–మద్దికెర మార్గంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువలో సోమవారం కొట్టుకువచ్చింది. తల, ముఖం, కాళ్లపై ఉన్న గాయాలను బట్టి తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తిరుమలరెడ్డి అదృశ్యమైన ప్రాంతంలో దెబ్బతిన్న ఆయన బైక్ తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వ్యక్తుల పేర్లను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అంతా వాళ్లు చెప్పినట్లే వినాలి
కనుమలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం● టీడీపీ నేతల కనుసన్నల్లో ఆలయం ● కనుమ లక్ష్మీనారసింహస్వామి ఆదాయం రూ.లక్షల్లో ఉన్నా పట్టించుకోని దేవదాయ శాఖ ● ప్రశ్నార్థకంగా 183 ఎకరాల మాన్యం భూమి చిలమత్తూరు: జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆస్తులకు రక్షణ కరువైంది. పాలక మండలి సభ్యులందరూ స్థానికులే కావడం, టీడీపీ నేతల కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు కొనసాగించాల్సి రావడంతో విసుగు చెందిన దేవదాయ శాఖ అధికారులు ఆలయ నిర్వహణను గాలికి వదిలేశారు. ఫలితంగా 183 ఎకరాల దేవుడి మాన్యం పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే రూ. కోట్లు విలువ చేసే మాన్యం భూములను కబ్జా చేసే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయని, దేవుడి స్థిరాన్ని అన్యాక్రాంతం కావడం ఖాయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు పక్కదారి చిలమత్తూరు సమీపంలోని కనుమలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం రూ. లక్షల్లోనే ఉంటోంది. హుండీ, విరాళాల రూపంలో ఏటా రూ.15 లక్షలకు పైబడే ఆదాయం ఉంటోందని భక్తులు అంటున్నారు. దీనికి స్వామి వారి భూముల్లో పంటలు సాగుచేస్తున్న రైతులు చెల్లిస్తున్న కౌలు అదనంగా ఉంటోంది. అయితే ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వెచ్చించడంలో దేవదాయ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆలయ పాలక మండలి సభ్యులు అక్రమాలకు తెరలేపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ. కోట్లలో స్థిరాస్తులున్నా ఆలయ అభివృద్ది, నిర్వహణను గాలికి వదిలేసి, నిత్య పూజలు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆలయానికి ఆదాయమే లేదు, సొంత డబ్బు పెట్టుకుని పూజలు సజావుగా జరిగేలా చూస్తున్నామని ఆలయ పాలక మండలి సభ్యులు పేర్కొనడం గమనార్హం. అన్యాక్రాంతమైన స్థిరాస్తులు కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి చిలమత్తూరులోని భూముల్లో ఇప్పటి వరకూ చాలా భాగం అన్యాక్రాంతమైంది. మరి కొంత స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. దేమకేతేపల్లి సమీపంలో 183 ఎకరాల పైచిలుకు భూములున్నాయి. ఇందులోనే 544ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 2.50 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన రూ.50 లక్షల పరిహారాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించలేదు. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకూ అధికారికంగా అభివృద్ధి కమిటీని సైతం దేవదాయ శాఖ అధికారులు నియమించలేదు. దీంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా స్థానిక టీడీపీ నేతలు అనధికారికంగా కొనసాగుతూ ఆలయ అభివృద్ధిని గాలికి వదిలేశారనే పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిలమత్తూరు మండలంలోని కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పేరుకు మాత్రమే దేవదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయ పాలక మండలి కమిటీ లేదు. ఇప్పటి వరకూ స్థానికులే ఆలయ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఉత్సవాలు కూడా వారే నిర్వహిస్తుంటారు. ఆదాయం, తదితర అంశాలకు సంబంధించిన విషయాలేవీ మాకు తెలియవు... వారు తెలపరు కూడా. అంతా వాళ్లు చెప్పినట్లు వినాలి. ఆలయ స్థిరాస్తుల పరిరక్షణ మాత్రమే మా బాధ్యత. – నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి, దేవదాయశాఖ పట్టించుకోని దేవదాయ శాఖ కనుమ లక్ష్మీనారసింహస్వామి ఆలయం దేవదాయ శాఖ పరిదిలో ఉన్నా ఏనాడూ ఆలయ అభివృద్ధి గూరించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ ఆదాయం, ఉత్సవాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. రూ. కోట్లు విలువ చేసే మాన్యం ఉన్నా ఈ ఆలయానికి ఈఓ లేకపోవడం, ఆలయ ఆదాయంపై కనీసం దృష్టి పెట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న లోకల్ పాలకమండలి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామికి చెందిన 183 ఎకరాల మాన్యం భూములకు రక్షణ కరువైంది. ఈ భూములను చాలా మంది రైతులు కౌలుకు చేస్తున్నారు. వారిచ్చే ధాన్యం, లేక నగదుపై లెక్కలేమీ ఉండడం లేదు. హుండీ, విరాళాలు వీటన్నింటికీ అధికారిక లెక్కలేవీ చూపడం లేదు. వచ్చే ఆదాయమంతా ఏమవుతుందో ఒక్క నరసింహస్వామికి , లోకల్ పాలక మండలి సభ్యులకు తప్ప మూడో కంటికి తెలియడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
25 నుంచి లేపాక్షిలో ఉత్సవాలు
లేపాక్షి: ఈ నెల 25 నుంచి లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రమానందన్, ఈఓ నరసింహమూర్తి మంగళవారం తెలిపారు. 15వ శతాబ్దం నాటి ఆలయం కావడంతో ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 25న మాఘ బహుళ ద్వాదశి నాడు విశేష పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల జాగారణ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల వివిధ సాంస్కృతిక కార్యాక్రమాలు ఉంటాయి. భజనలు, శాసీ్త్రయ నృత్యనీరాజనాలు ఉంటాయి. 28న రాత్రి పూల పల్లకీ ఉత్సవం ఉంటుంది. కాలువలో పడి విద్యార్థి మృతి గుమ్మఘట్ట: ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలోని నీటి ప్రవాహంలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... బేలోడుకు చెందిన అన్నపూర్ణకు 11 సంవత్సరాల క్రితం గలగల గ్రామానికి చెందిన లోకేష్తో వివాహమైంది. అనారోగ్యంతో 2020లో అన్నపూర్త మృతి చెందింది. అప్పటి నుంచి వారి కుమారుడు జాని పోషణను అమ్మమ్మ హనుమక్క, తాత హనుమప్ప తీసుకున్నారు. ప్రస్తుతం జాని (7) బేలోడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన జాని.. మధా్య్హ్నం తోటి స్నేహితుడు లక్కీతో కలసి గ్రామ సమీపంలోని బీటీపీ సాగునీటి కాలువ వద్దకెళ్లాడు. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న గాలాన్ని తీసి కాలువలో వేసే క్రమంలో జాని ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో లక్కీ కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకుని జానీని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోస్టల్ ఉద్యోగిని అదృశ్యం ముదిగుబ్బ: మండలంలోని దొరిగిల్లు పోస్టాఫీసులో పనిచేస్తున్న అనూష రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఆమె తల్లి ఈశ్వరమ్మ మంగళవారం ఫిర్యాదు చేశారు. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన అనూష సోమవారం విధులకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఓ దుకాణం వద్ద తనను ఉండమని చెప్పి వెళ్లిన కుమార్తె తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత దుర్మరణం కణేకల్లు: ద్విచక్ర వాహనంఅదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, అనసూయమ్మ (38) దంపతులు. మంగళవారం ఉదయం బొమ్మనహళ్ మండలంలోని కృష్ణాపురంలో జరిగిన బంధువుల పెళ్లికి తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ వెళ్లాడు. అనంతరం రాయదుర్గం మండలంలోని కదరంపల్లిలో ఉన్న అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్య కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వర్కి రెండేళ్ల క్రితం డి.హిరేహళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కావేరితో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకునే ఈశ్వర్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయమని భార్య పలుమార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె కుమారుడిని పిలుచుకుని మంగళవారం సాయంత్రం తన పుట్టింటికెళ్లింది. దీంతో అత్తింటి వారు మందలిస్తారేమోననే అనుమానంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాము నివాసముంటున్న గుడిసెలోనే ఈశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్లోని రూ.33 వేలు ఫోన్పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్ను కూడా కలిశాడు. -
ఢిల్లీలో భూకంపం.. నిమ్మలకుంటలో భయం
ధర్మవరం రూరల్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో నిమ్మలకుంట వాసులు ఆందోళన చెందారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతి కుటుంబ సభ్యులతో పాటు మరో పదిమంది తోలుబొమ్మల కళాకారులు మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీరుంటున్న ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారి బంధువులు, కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ఢిల్లీలో ఉంటున్న తమవారికి ఫోన్ చేసి బాగోగులను ఆరా తీశారు. అయితే తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఢిల్లీలో ఉంటున్న కళాకారులు తెలపడంతో బంధువులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ వాహన డ్రైవర్పై ‘తమ్ముళ్ల’ దాడి సాక్షి, టాస్క్ఫోర్స్: బత్తలపల్లి మండల తహసీల్దార్ స్వర్ణలత కారు డ్రైవర్ బాషాపై సోమవారం తెలుగు తమ్ముళ్లు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ టీడీపీ నాయకుడు పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణాకు సిద్ధమయ్యాడు. అయితే ఇందుకు తహసీల్దార్ కారు డ్రైవర్ అడ్డు తగిలాడు. గట్టిగా ప్రశ్నిస్తే తహసీల్దార్ పేరు చెప్పి భయపెట్టాడు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు... పోలీసుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకున్నా... మీ(తహసీల్దార్ కార్యాలయం) పెత్తనం ఏమిటని డ్రైవర్ బాషాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇసుక అక్రమ రవాణా గురించి డ్రైవర్ బాషా ఆరా తీయడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు సోమవారం దంపెట్ల పంచాయతీ కట్టకిందపల్లి, ఉప్పర్లపల్లి గ్రామాల నుంచి 10 మంది టీడీపీ నాయకులను వెంట తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే డ్రైవర్ బాషాపై దాడి చేశాడు. ఇసుక అక్రమ రవాణాను కప్పిపుచ్చేందుకు ఉప్పర్లపల్లిలో రస్తా సమస్యను సాకుగా చూపుతూ దాడి చేసినట్లు తెలుస్తోంది. -
అక్రమ బ్రిడ్జి నిర్మాణంపై ఆగ్రహం
చిలమత్తూరు: చిత్రావతి నదిపై అక్రమంగా బ్రిడ్జి కట్టిన రియల్టర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చిత్రావతిని చెరబట్టారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ఉదయమే ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ అధికారులు అక్రమ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. నదిపై అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిని తొలగించాలని సదరు రియల్టర్కు నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించని నేపథ్యంలో ఇదే ఆఖరు నోటీసు ఇచ్చినట్టు ఇరిగేషన్ డీఈ యోగానంద వెల్లడించారు. ఈ నెల 28వ తేదీలోపు అక్రమ బ్రిడ్జి తొలగించకపోతే నేరుగా తామే రంగంలోకి దిగి తొలగిస్తామని హెచ్చరించారు. కాగా, అధికారులు చిత్రావతి బ్రిడ్జి వద్దకు రియల్టర్కు చెందిన భూముల గుండా వెళ్లేందుకు ప్రయత్నించగా..అతను గేట్లు తీయలేదు. దీంతో అధికారులు రెండు కిలోమీటర్ల మేర నడిచి అక్రమ వంతెన వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. సొంత అవసరాలకే... నదికి ఇరువైపులా రియల్టర్ రెడ్డెప్పశెట్టికి చెందిన భూములున్నాయి. దీంతో అక్కడివరకూ వచ్చి వెళ్లేందుకు అతను బ్రిడ్జి నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చిత్రావతి నదీ జలాలను తన భూములకు వినియోగించుకునేందుకు గుట్టుగా వంతెన నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నాలుగేళ్లుగా చిత్రావతి ప్రవహిస్తుండగా సదరు రియల్టర్ తన భూములకు వాటిని వినియోగించుకునేందుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారని, కేవలం ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే నీరు దిగువకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని నోటీసులు ఇచ్చారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 28లోపు చిత్రావతిపై నిర్మించిన వంతెన తొలగించాలి రియల్టర్కు నోటీసులు జారీ చేసిన అధికారులు -
బిగుస్తున్న ఉచ్చు!
హిందూపురం అర్బన్: అనధికార తనిఖీలు.. అక్రమ వసూళ్లతో చర్చనీయాంశమైన హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. జీరో బిజినెస్ను ప్రోత్సహించడం ఇందుకోసం భారీగా మామూళ్లు తీసుకుంటున్న వైనంపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 12న కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటి కమిషనర్ మురళీమనోహర్ హిందూపురం వచ్చి ఫిర్యాదుదారులతో పాటు సీటీఓ కృష్ణవేణి, డీసీటీఓలు, ఏసీటీఓలతో సమావేశమై ఆరోపణలపై విచారణ చేపట్టారు. అయితే ఆ నివేదిక సక్రమంగా లేదంటూ సోమవారం కమర్షియల్ ట్యాక్స్ రీజినల్ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ నాగేంద్ర, జాయింట్ కమిషనర్ శేషాద్రితో పాటు డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్ హిందూపురం చేరుకుని మరోమారు ఫిర్యాదుదారులను రహస్యంగా విచారించారు. అనంతరం కార్యాలయానికి చేరుకొని అధికారులతో సమావేశమై పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. హిందూపురం సర్కిల్ పరిధిలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణలతో పలువురు డీలర్లు, వ్యాపారులను కలిసి ప్రాథమికంగా విచారించామన్నారు. నివేదికను మంగళవారం కమిషనర్కు నివేదిస్తామన్నారు. కాగా ‘కియా’ పరిశ్రమ నుంచి నేరుగా ఆదాయం రావడం లేదని అధికారులు తెలిపారు. కియా అనుబంధ పరిశ్రమలు ఏడాదికి రూ.60 వేల కోట్ల వరకు లావాదేవీలు చేస్తుండగా.. వాటి ద్వారానే ఆదాయం సమకూరుతోందన్నారు. తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడ నుంచి టాక్స్ వసూలు అవుతోందన్నారు. గతంలో అక్కడి పరిశ్రమల వారు రికార్డులు సరిగా నిర్వహించక పోవడంతో రూ. 100 కోట్లకుపైగా జరిమానా విధించామన్నారు. ‘కమర్షియల్ ట్యాక్స్’ అవినీతిపై మరోసారి విచారణ అవినీతి అధికారుల గుండెళ్లో పరుగెడుతున్న రైళ్లు -
చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
పుట్టపర్తి టౌన్: అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేస్తామని ఎస్పీ రత్న భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 75 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, మహిళా పోలీస్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థలం ఆక్రమించి.. మాపైనే రివర్స్ కేసులు చిలమత్తూరు మండలం మురుసవాండ్లపల్లి పొలం 244–2 సర్వేనంబర్లో 64 సెంట్ల భూమికి సంబంధించి తమ వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయని, అయినా అధికార పార్టీకి చెందిన శ్రీనివాసులు, వెంకటేషులు తమ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటున్నారని అశ్వత్థరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. తమపైనే ఆక్రమణదారులు రివర్స్ కేసు పెట్టారని తెలిపాడు. చంపుతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కోరాడు. ఎస్పీ స్పందిస్తూ చిలమత్తూరు పోలీసులకు ఫోన్ చేసి విచారణ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు. అడవికి నిప్పు పెడితే చర్యలు అడవికి నిప్పు పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పలుచోట్లు ఆకతాయిలు, గొర్రెల కాపరులు కొండలకు, అడవులకు నిప్పు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. నిప్పు పెట్టడం వల్ల దట్టమైన అడవులు అంతరించిపోతున్నాయని తెలిపారు. వందలాది వన్య ప్రాణులు అగ్నికి ఆహుతైపోతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యాన రైతులు, పశుపోషకులు కూడా తీవ్రంగా నష్టపోతారన్నారు. అడవులను, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. బాధితులకు ఎస్పీ రత్న భరోసా -
కుమార్తెను చంపి.. తల్లి ఆత్మహత్య
పావగడ: కుమార్తెను చంపి... ఆపై తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం బాగలకుంటె పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పావగడ తాలూకా బ్యాడనూరు గ్రామపంచాయతీ అధ్యక్షురాలు శృతి (30), ఆడిటర్ గోపాలకృష్ణ దంపతులు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె రోషిణి ఉంది. ఆదివారం రాత్రి బాగలకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంటిలో శృతి నిద్రపోతున్న తన కుమార్తెను చంపి.. తర్వాత ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా డెత్ నోట్ దొరికింది. అందులో తన చావుకు భర్త గోపాలకృష్ణ, ఓ రాజకీయ నాయకురాలు కారణమని పేర్కొంది. గోపాలకృష్ణ వివాహేతర సంబంధం కారణంగానే తన కూతురు శృతి బలవన్మరణానికి పాల్పడిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తల్లీ కూతుళ్ల మృతదేహాలను శిర తాలూకా గుళికేనహళ్ళికి చెందిన పుట్టింటి వారికి అప్పగించారు. -
పచ్చదనం పెంపొందిద్దాం
ఎన్పీకుంట: అడవుల్లో అగ్నిప్రమాదాలు నివారించి, పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ, ఎఫ్ఈఎస్ సంస్థ కలిసి ప్రణాళికలు రూపొందించుకొని పనిచేద్దామని జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి పిలుపునిచ్చారు. పెడబల్లి జలాశయ పరిసర ప్రాంతాలతో పాటు ఎగువతూపల్లి, పాపన్నగారిపల్లి, సారగుండ్లపల్లి, నాగంవారిపల్లిలో సోమవారం ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంస్థ (ఎఫ్ఈఎస్), అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ కార్యక్రమం నిర్వహించారు. డీఎఫ్ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటవీశాఖ అధికారులు, ఎఫ్ఈఎస్ సభ్యులు ఐదు బృందాలుగా ఏర్పడి రిజర్వ్ఫారెస్ట్, ఉమ్మడివనరులు, చెరువులు, చిత్తడి నేలలు, వ్యవసాయ భూములలో 45 రకాల పక్షి జాతులను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ రకాల పక్షులు, జంతుజాతులు, వృక్షజాతులు ఒకదానికి ఒకటి పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, వాటి ఆవాసాలను కాపాడాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. విచక్షణరహితంగా క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడటం, కొండలు, అడవులకు నిప్పుపెట్టడం వల్ల పక్షులు అంతరించిపోతున్నాయన్నారు. పక్షులతో పర్యావరణ సమతుల్యత సాధ్యమని, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ఈఎస్ రాష్ట్ర ప్రతినిధి భక్తర్వలి, అటవీశాఖ అధికారులు, ఎఫ్ఈఎస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
నిలకడగా చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా ఉంది. హిందూపురం వ్యవసాయ మార్కెట్కు సోమవారం 1,217 క్వింటాళ్ల చింతపండు రాగా.. అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.15 వేలు పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.11 వేలు, కనిష్టంగా రూ. 4 వేలు, సరాసరిన రూ.5 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. నేడు పెడపల్లిలో ‘మహిళా భద్రతకు భరోసా’ పుట్టపర్తి అర్బన్: మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పుట్టపర్తి మండలం పెడపల్లిలో ‘మహిళా భద్రతకు భవిష్యత్తుకు భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పెడపల్లి ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యే కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలా వెళ్లి.. ఇలా వచ్చారు! ● చర్చనీయాంశమైన ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య వ్యవహారం ● నెల క్రితమే కమిషనరేట్కు అటాచ్ ● మళ్లీ హిందూపురం సీఐగా పోస్టింగ్.. హిందూపురం అర్బన్: ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య హిందూపురాన్ని వదలడం లేదు. ఎక్కడికి బదిలీ చేసినా నెలల వ్యవధిలోనే మళ్లీ హిందూపురానికే పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం... మహారాష్ట్ర, గోవా మద్యం రవాణా అవుతున్నా కట్టడి చేయలేకపోవడం, బెల్టు దుకాణాలు విచ్చల విడిగా ఏర్పాటు కావడంతో ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు సీఐ లక్ష్మీ దుర్గయ్యపై నెల రోజుల క్రితమే బదిలీ వేటు వేశారు. విజయవాడ ఎకై ్సజ్ కమిషనరేట్కు అటాచ్ చేశారు. కానీ నెల తిరక్కముందే ఆయన హిందూపురానికి పోస్టింగ్ తెచ్చుకున్నారు. సెలవురోజైనా ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మీ దుర్గయ్య వ్యవహారం అటు ఎకై ్సజ్ శాఖలోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఆశీస్సులతోనే... హిందూపురం ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 9 మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలను లాటరీ ద్వారా ఇతరులు దక్కించుకన్నా... ఆ తర్వాత వారి నుంచి అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు తీసుకున్నారు. ఇప్పుడా దుకాణాలన్నీ ఆ నలుగురే నడిపిస్తున్నారు. ఆయా దుకాణాల పరిధిలో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం దుకాణాల్లోనే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఎకై ్సజ్ వ్యవహారాల్లో’ ఆరితేరిన లక్ష్మీ దుర్గయ్య అయితేనే తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన అధికార పార్టీకి చెందిన మద్యం సిండికేట్దారులు.. రాష్ట్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో లక్ష్మీదుర్గయ్యకు మళ్లీ హిందూపురానికే పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. -
వినతులు.. వేడుకోళ్లు
కదిరి అర్బన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయం సోమవారం జనంతో కిక్కిరిసింది. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న జనం అర్జీలు సమర్పించేందుకు తరలిరాగా రెవెన్యూ డివిజన్న స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కిటకిటలాడింది. సంక్షేమ పథకాలు అందివ్వాలని ఒకరు.. భూమి కబ్జా చేశారని ఇంకొకరు.. న్యాయం చేయాలని మరొకరు..ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఏకరువు పెట్టారు. కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమానికి మొత్తంగా 420 అర్జీలు అందగా..వాటిని ఆయా శాఖలకు పంపారు. గ్రీవెన్న్స్కు రాలేని వారు మెయిల్ ద్వారా కూడా అర్జీలను పంపించవచ్చని కలెక్టర్ సూచించారు. అర్జీ దారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువగా అర్జీలు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడ సుదర్శన్, డీపీఓ విజయ్కుమార్, హౌసింగ్ పీడీ వెంకటరమణారెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ విజయశాంతిబాయి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, ఎల్డీఎం రమణకుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా... ● దివ్యాంగుడైన తాను మానసికంగానూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎన్పీకుంట మండలం దాసరివాండ్లపల్లికి చెందిన వేమనారాయణ కలెక్టర్కు కలెక్టర్కు విన్నవించారు. ● తమ కులస్తుల కోసం పాలిటెక్నిక్ కళాశాల పక్కనే కేటాయించిన స్థలంలో బంజారా కమ్యూనిటీ భవనం నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాంప్రసాద్నాయక్ కలెక్టర్ చేతన్ను కోరారు. ● మరాఠాల శ్మశానవాటిక కోసం కేటాయించిన స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని పట్టణానికి చెందిన మరాఠా కులస్తులు కలెక్టర్ చేతన్ను కోరారు. ● పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు చెల్లించి, టాస్క్లు ఇవ్వాలని కదిరి మండలానికి చెందిన ఫీల్ట్ అసిస్టెంట్లు మారెప్ప, భాస్కర్, రవినాయక్ తదితరులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ‘పరిష్కార వేదిక’కు భారీగా అర్జీలు వివిధ సమస్యలపై 420 వినతులు సంతృప్తికర పరిష్కారం చూపాలని కలెక్టర్ చేతన్ ఆదేశం ఈ చిత్రంలోని చిన్నారి పేరు పార్వతి. వయసు ఆరేళ్లు. తనకల్లు మండలం పాలెంవాండ్లపల్లి గ్రామం. పుట్టుకతో నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. తండ్రి శ్రీకాంత్ కూలిపనులు చేసుకుని జీవిస్తున్నాడు. కుటుంబ పోషణకే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాను కూతురు పార్వతికి చికిత్స చేయించేందుకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చేతన్ను వేడుకున్నారు. ఇతనిపేరు హనుమంతరెడ్డి. కదిరి మండలం చిప్పలమడుగు గ్రామం. ప్రభుత్వం యర్రదొడ్డి పొలం సర్వేనంబర్లు 362–18, 362–17లో ఐదెకరాల భూమి ఇచ్చింది. రామకృష్ణారెడ్డి పేరుమీద పట్టా, పాసుపుస్తకం కూడా మంజూరు చేసింది. కానీ సాగు చేసుకునేందుకు వెళితే.. కుటాగుళ్ల గ్రామానికి చెందిన నరసింహులు, గణేష్ అడ్డుతగులుతున్నారు. దీంతో హనుమంతరెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చేతన్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసులు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంతృప్తికర పరిష్కారం చూపాలి.. -
సాత్వికాహారమే ఆరోగ్య రహస్యం..
కళ్యాణదుర్గం: ఆయనో విశ్రాంత ఉపాధ్యాయుడు. పెన్షన్ కోసం ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని కళ్యాణదుర్గం సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చారు. ఎంతో చలాకీగా కనిపించిన ఆయన్ను చూసి తోటి రిటైర్డు ఉద్యోగులు మల్లికార్జున, తిప్పేస్వామి, హంపన్న, అంజినప్ప, మారెన్న, విశ్వనాథ్, భగవాన్ దాస్ తదితరులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ మాస్టారు పేరు బండయ్య. 103 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యకరంగా ఉన్న ఆయన్ను పెన్షనర్ భవనంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండయ్య విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి తన వంతుగా రూ.5 వేల విరాళం అందజేశారు. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చెందిన బండయ్య మాస్టారు 1922 జూలై 10న జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివి జ్యోతిష్యం నేర్చుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చూసి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. తొలి నెల జీతం రూ.30.10 పైసలు. 1978లో ఉద్యోగ విరమణ పొందే నాటికి జీతం రూ.90. ప్రస్తుతం ప్రతి నెలా రూ.26 వేల పెన్షన్ అందుకుంటున్నారు. బండయ్య మాస్టారు ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం పొబ్బర్లపల్లిలో వ్యవసాయంపై దృష్టి సారించారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడితో ఆదర్శ రైతుగా రాణించారు. కొత్త రకం వంగడాలు పరిచయం చేస్తూ గ్రామంలోని రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. శ్రీశైలంలో సదాశివయ్య అన్న సత్రం చైర్మన్గా పనిచేశారు. పలుచోట్ల విరాళాలు సేకరించి నిత్యాన్నదాన సత్రాన్ని విజయవంతంగా నడిపారు. ఆదర్శ రైతుగా రాణింపు.. ఉద్యోగ ప్రస్థానం... బండయ్య మాస్టారు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం రెండు పూటల స్నానం చేస్తూ.. సాత్విక ఆహారం, మజ్జిగ, పాలు స్వీకరిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వయసు రీత్యా కంటి చూపు మందగించింది. ఈయన భార్య శివలింగమ్మ నాలుగేళ్ల క్రితం మరణించింది. ఇక ఏడుగురు సంతానంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో కుమారుడు గౌరీ శంకర్తో కలిసి మాస్టారు ఉంటున్నారు. -
మహిళపై అత్యాచారం
లేపాక్షి: మండలంలోని గౌరిగానపల్లిలో మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఎస్ఐ నరేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో 26 ఏళ్ల మహిళ, అక్కడే ఉండే అశోక్, వెంకటేష్ కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న అశోక్, వెంకటేష్ ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్కు మెజిస్ట్రేట్ ఆదేశించారు. వివాహితపై అత్యాచారయత్నం తాడిపత్రి రూరల్: బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు జరిగిన విషయం ఇంట్లో తెలిపింది. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంకన్నపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కాటమయ్య తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పరిష్కరించాలని డీఆర్ఓ విజయ సారథి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి డీఆర్ఓ 123 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. విద్యుత్ తీగలు తగిలి 15 గొర్రెలు మృతి శెట్టూరు: విద్యుత్ తీగలు తెగి మందపై పడటంతో అందులో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మల్లేటిపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కురుబ గోవిందప్ప సుమారు 100 గొర్రెలతో తన పొలంలేనే మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మంద వద్దే నిద్రించాడు. గొర్రెల మంద నిద్రిస్తున్న స్థలం వద్దే విద్యుత్ మెయిన్లైన్ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడుగంట సమయంలో విద్యుత్తీగ తెగి గొర్రెల మందపై పడింది. మెరుపుతో కూడిన శబ్దం రావడంతో రైతు ఉలిక్కిపడి లేచాడు. రైతు వెంటనే లైన్మెన్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. విద్యుత్షాక్కు గురికాంకుండా జాగ్రతపడి గొర్రెలను మందనుంచి బయటకి తీశాడు. అయితే అప్పటికే 15 గొర్రెలు మృతి చెందాయి. -
ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు
చెన్నేకొత్తపల్లి: ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని పోలీసులు సకాలంలో నిలువరించి ప్రాణాలు కాపాడారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నేకొత్తపల్లికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి సోమవారం కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమీపంలోని రైల్వే ట్రాక్పైకి వెళ్లాడు. అతని మిత్రుడి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ సత్యనారాయణ వెంటనే హరి, నరసింహ అనే ఇద్దరు పోలీసులను సంఘటన స్థలానికి పంపించారు. అక్కడ ఆ వ్యక్తిని వారు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మహిళా కూలీ దుర్మరణం
మడకశిర: ట్రాక్టర్ ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండంపల్లి దొమ్మరహట్టికి చెందిన కొల్లమ్మ (45) ట్రాక్టర్ కూలీగా వెళ్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పనికి వచ్చింది. ట్రాక్టర్ పరిగి నుంచి ఇసుకను లోడ్ చేసుకుని మడకశిరకు వస్తుండగా వ్యవసాయ మార్కెట్ వద్దకు రాగానే ఇంజిన్ – ట్రాలీకి మధ్యన గల ఇనుపరాడ్ విరిగి పోయింది. ట్రాక్టర్ ట్రాలీలో ఇసుకపై కూర్చున్న కొల్లమ్మ జారి కిందకు పడిపోయింది. క్షణాల్లో ట్రాలీ చక్రం తలపై వెళ్లడంతో కొల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడుకుంటూ రైలెక్కేశాడు! ● హిందూపురం స్టేషన్లో దిగిన యలహంక బాలుడు హిందూపురం అర్బన్: కర్ణాటక రాష్ట్రం యలహంక రైల్వే స్టేషన్ సమీపంలో సరిత అనే మహిళ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్టేషన్ వద్ద ఆడుకుంటున్న ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ముఖేష్సింగ్ రైలు ఎక్కాడు. అది కాసేపటికే కదిలింది. అలా హిందూపురం రైల్వే స్టేషన్లో ఆ బాలుడు బోగీ నుంచి కిందకు దిగాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్న బాలుడిని పోలీసులు గమనించారు. వివరాలు ఆరా తీయగా.. యలహంక తమ ఊరు అని చెప్పాడు. దీంతో పోలీసులు యలహంక రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆటో డ్రైవర్ బాలుడి ఫొటోను గుర్తుపట్టి తల్లికి విషయం చెప్పాడు. ఆమె హుటాహుటిన హిందూపురం వచ్చింది. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచుకున్న బాలుడిని సీఐ జనార్దన్ తల్లి సరితకు అప్పగించాడు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. శతాధిక వృద్ధుడు కన్నుమూత రాయదుర్గంటౌన్: పట్టణానికి చెందిన మున్సిపల్ విశ్రాంత ఉద్యోగి ఎస్.అమీరుద్దీన్సాబ్ (104) అనారోగ్యంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు చనిపోయారు. ఈయన భార్య 40 ఏళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గుకు కుమార్తెలు ఉన్నారు. సాయంత్రం బళ్లారి రోడ్డులోని ఖబర్స్థాన్లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుమారుడు మెహబూబ్బాషా తెలిపారు. -
ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు
చెన్నేకొత్తపల్లి: ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని పోలీసులు సకాలంలో నిలువరించి ప్రాణాలు కాపాడారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నేకొత్తపల్లికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి సోమవారం కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమీపంలోని రైల్వే ట్రాక్పైకి వెళ్లాడు. అతని మిత్రుడి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ సత్యనారాయణ వెంటనే హరి, నరసింహ అనే ఇద్దరు పోలీసులను సంఘటన స్థలానికి పంపించారు. అక్కడ ఆ వ్యక్తిని వారు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి అదృశ్యం
● ద్విచక్రవాహనంపై బండరాళ్లతో దాడి గుంతకల్లు రూరల్: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు బి.తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. సంఘటన స్థలంలోనే మొబైల్, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బైక్పై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో ఏమైనా పడేశారా అన్నది తెలియడం లేదు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన బి.వెంకటరెడ్డి కుమారుడైన బి.తిరుమలరెడ్డి కొన్నేళ్లుగా గుంతకల్లుకు వచ్చి నివాసముంటున్నాడు. బుగ్గ సంగమేశ్వర ఆలయ సమీపంలో తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తండ్రి పేరున బీవీఆర్ అనే యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య కామేశ్వరి, అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న కూతురు మోనా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బావమరిదిని చూసేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లిన తిరుమలరెడ్డి ఆదివారం సాయంత్రం తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి పొలానికి పల్సర్ బైక్పై బయల్దేరాడు. అయితే మరో ఐదు నిమిషాల్లో పొలానికి చేరుకుంటాడనగా అదృశ్యం అయ్యాడు. బుగ్గ సంగాల వద్ద బండరాళ్లతో బైక్ను ధ్వంసం చేసి ఉంది. సమీపంలోనే చెప్పులు, మొబైల్ చెల్లాచెదురుగా పడ్డాయి. అటుగా వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు మద్దికెర, ఇటు గుంతకల్లు నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాస్, గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. సంఘటన స్థలం నుంచి గుట్ట వరకూ వెళ్లి అటు నుంచి పక్కనే ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్ద ఆగిపోయింది. తిరుమలరెడ్డిని చంపి కాలువలో పడేశారా లేక, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా.. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏమైనా కాలువలో పడిపోయాడా.. ఇంకేమైనా జరిగిందా.. తిరుమలరెడ్డికి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురికి రిమాండ్ సోమందేపల్లి : కావేటి నాగేపల్లి సమీపంలోని నాసన్ పర్రిశమ వద్ద గతంలో ఆందోళన నిర్వహించిన వారిలో ఏడుగురికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఇందుకు ంసబంధించిన వివరాలను ఎస్ఐ రమేష్బాబు మీడియాకు వెల్లడించారు. 2020–21లో జరిగిన ఆందోళనలపై నాసన్ పరిశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. నిందితులు సకాలంలో కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అరెస్టు వారెంటు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఏడుగురు నిందితులను పెనుకొండ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి సయ్యద్ ముజీబ్ ఫసల్ 15 రోజుల రిమాండ్ విధించారు. -
జవాన్కు కన్నీటి వీడ్కోలు
బ్రహసముద్రం : బీఎస్ఎఫ్ జవాన్ వడ్డే లక్ష్మన్నకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్మీ సిబ్బంది కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఢిల్లీ సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన వడ్డే లక్ష్మన్న (33) భౌతికకాయం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామం బ్రహ్మసముద్రానికి అధికారులు తీసుకువచ్చారు. కుమారుడిని చూసి తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రప్ప గుండెలవిసేలా రోదించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం జవాన్ భౌతికాయాన్ని ప్రతేక వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. వందలాది మంది అభిమానుల మధ్య ‘వీరుడా... నీకు వందనం.. అమరుడా లక్ష్మన్నా నీకు వందనం’ అంటూ ఆర్మీ అధికారులు నినదించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జైజవాన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పశువైద్యశాల సమీపాన శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఎస్ఐ మాధవ్రావ్, హెడ్కానిస్టేబుల్ మాంతేష్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు కవాతు నిర్వహించారు. జవాన్ భౌతికకాయంపై ఉన్న జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం కుటుంబ సభ్యుల కడసారి వీడ్కోలు అనంతరం ఆర్మీ అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యక్రమంలో సీఐ నీలకంఠేశ్వర్ , తహశీల్దార్ సుమతి, ఎస్ ఐ నారేంద్రకుమార్ , ఆర్ ఐ నాగిరెడ్డి, ఎంపీడీఓ నందకిశోర్, ఎంఈఓ ఓబుళపతి, క్రిష్ణానాయక్, ఎంపీపీ చంద్రశేకర్ రెడ్డి జెడ్పీటీసీ ప్రభవతి రాజకీయ పార్టీల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనుల్లో భారీగా అక్రమాలు
రాయదుర్గం: కూటమి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ పథకం కూలీలకు కాకుండా కూటమిలోని కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. సోమవారం రాయదుర్గంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన ఆయన జిల్లాలోని పలు మండలాల ఎంపీపీలు, సర్పంచులతో కలసి కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రవీంద్రారెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ చెప్పిన వారికి ఉపాధి పనులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కూలీలతో కాకుండా ఉపాధి పనులను కాంట్రాక్టర్లకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ఉపాధి పనులు జరిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన నేమ్బోర్డుల బిల్లుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందించారు. నేమ్బోర్డుల నిధులు తమ బంధువుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజినేయులు, నాయకుడు శివారెడ్డి పాల్గొన్నారు. కూలీలకు కాకుండా కాంట్రాక్టర్లతో పనులు ఎలా చేయిస్తారు? -
మహిళపై అత్యాచారం
లేపాక్షి: మండలంలోని గౌరిగానపల్లిలో మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఎస్ఐ నరేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో 26 ఏళ్ల మహిళ, అక్కడే ఉండే అశోక్, వెంకటేష్ కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న అశోక్, వెంకటేష్ ఆమైపె అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్కు మెజిస్ట్రేట్ ఆదేశించారు. వివాహితపై అత్యాచారయత్నం తాడిపత్రి రూరల్: బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు జరిగిన విషయం ఇంట్లో తెలిపింది. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంకన్నపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కాటమయ్య తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పరిష్కరించాలని డీఆర్ఓ విజయ సారథి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి డీఆర్ఓ 123 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. విద్యుత్ తీగలు తగిలి 15 గొర్రెలు మృతి శెట్టూరు: విద్యుత్ తీగలు తెగి మందపై పడటంతో అందులో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మల్లేటిపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కురుబ గోవిందప్ప సుమారు 100 గొర్రెలతో తన పొలంలేనే మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మంద వద్దే నిద్రించాడు. గొర్రెల మంద నిద్రిస్తున్న స్థలం వద్దే విద్యుత్ మెయిన్లైన్ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడుగంట సమయంలో విద్యుత్తీగ తెగి గొర్రెల మందపై పడింది. మెరుపుతో కూడిన శబ్దం రావడంతో రైతు ఉలిక్కిపడి లేచాడు. రైతు వెంటనే లైన్మెన్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. విద్యుత్షాక్కు గురికాంకుండా జాగ్రతపడి గొర్రెలను మందనుంచి బయటకి తీశాడు. అయితే అప్పటికే 15 గొర్రెలు మృతి చెందాయి. -
కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు
గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి నిద్రించి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సెటైర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. నేడు ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. -
పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది
సాక్షి, పుట్టపర్తి పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు – ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే తరహాలో పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పుట్టపర్తి, మడకశిర, హిందూపురంలో ప్రజలకు వింత పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎమ్మెల్యే కాకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను పక్కకు నెట్టి.. షాడోలు హవా సాగిస్తుండటం గమనార్హం. ఉనికి కోసం ఆరాటం గడిచిన ఎన్నికల్లో టికెట్ రాలేదు. ప్రజలు మరిచిపోకుండా ఉండాలంటే నిత్యం జనాల్లో ఉంటూ ఉనికి చాటుకోవాలనే క్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి షాడో ఎమ్మెల్యే అవతారమెత్తారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కంటే ఆమెకు మామ అయిన పల్లె రఘునాథరెడ్డి ప్రతి విషయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో నేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి వచ్చిన కొత్త అధికారులు కూడా ఆయనను భేటీ అయి శాలువా కప్పి సన్మానం చేస్తుండటం విశేషం. మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ హవా ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో పెత్తందారుడు అయిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హవా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు లేకున్నా.. ఆయన స్థానంలో గుండుమల ఉంటూ ఆదేశాలు ఇస్తుండటం గమనార్హం. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎవరైనా.. పెత్తనం మాత్రం గుండుమలదే అన్న చందంగా మడకశిరలో పాలన తయారైంది. అధికారుల బదిలీలు, పాలనా వ్యవహారాలతో పాటు కార్యకర్తలతో నిత్యం టచ్లో ఉంటూ ఎమ్మెల్యే హోదాలో అధికారం చెలాయిస్తున్నారు. హిందూపురంలో బాలయ్య పీఏలదే పెత్తనం సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో హిందూపురం నియోజకవర్గంలో ఆయన మార్కు లేదనే చెప్పాలి. చుట్టపుచూపుగా వస్తూ రిబ్బన్ కటింగ్ కార్యక్రమాల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తుంటారు. అయితే షాడో ఎమ్మెల్యేల తరహాలో ఆయన పీఏలు ఇక్కడ రాజ్యమేలుతున్నారు. గత పదేళ్లుగా హిందూపురంలో ఇలాంటి పరిస్థితే దాపురించింది. ధర్మవరంలో శ్రీరామ్ చక్రం ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ఉన్నప్పటికీ.. చాలా విషయాల్లో టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ జోక్యం చేసుకుంటున్నారు. అధికారులను బదిలీలు చేయిస్తానని.. తాను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి హోదాలో ఉన్నానని చెబుతూ పెత్తనం చెలాయిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ తరఫున హరీష్బాబు, జనసేన నుంచి చిలకం మధుసూదన్రెడ్డి.. ఎవరికి వారుగా షాడో ఎమ్మెల్యే అవతారమెత్తి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక రాప్తాడులో పరిటాల సునీత ఎమ్మెల్యే అయినప్పటికీ.. అక్కడ ఆమె కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారు. కలవరపెడుతోన్న ఐవీఆర్ఎస్ సర్వే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారుగా ప్రజాక్షేత్రంలో ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) నిర్వహిస్తుండటం కలవరపెడుతోంది. పరిటాల శ్రీరామ్, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, గుండుమల తిప్పేస్వామి వ్యవహార శైలిపై పలువురికి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై కూటమి పార్టీలోని కొందరు నాయకుల కుట్ర ఉందని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం విశేషం. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ప్రాబల్యం తగ్గించేందుకు కందికుంట ప్లాన్ వేశారని తెలిసింది. పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలో వింత పరిస్థితులు షాడో ఎమ్మెల్యేల తీరుతో తలలు పట్టుకుంటోన్న అధికారులు ధర్మవరం, రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అనుచరుల హల్చల్ అధికారులతో సమీక్షలు నిర్వహించి అడ్డదిడ్డంగా ఆదేశాలు జారీ -
రాత్రివేళల్లో ముమ్మర గస్తీ
పుట్టపర్తి టౌన్: అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట, చోరీల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా గస్తీ, వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్లో కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. హెల్మెట్ వినియోగం, నిద్రమత్తు పోయేలా ఫేస్ వాష్పై అవగాహణ కల్పిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటుసారాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని సూచిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొత్త ఫాస్టాగ్ రూల్స్ తప్పనిసరి హిందూపురం అర్బన్: జాతీయ రహదారులు, ఇతర చోట్ల టోల్గేట్స్ దాటి వెళ్లే వాహనదారులు (కార్లు, బస్సులు, లారీలు తదితర వాహనాలు) తప్పనిసరిగా సోమవారం నుంచి నూతన ఫాస్టాగ్ రూల్స్ పాటించాలి. ఈ నెల 17 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమలులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం వాహనదారులు కొత్త చెల్లింపు విధానాలు పాటించకపోతే ఆదనంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్ ప్లాజా వద్దకు వెళ్లే 75 నిమిషాల ముందే తగిన రెండింతల మొత్తం ఫాస్టాగ్లో ఉండేలా రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రవాణా కార్యాలయంలో కేవైసీ చేయించుకొని తీరాలి. కొంతమంది ఇప్పటికీ అడపాదడపా వాహనాలు బయటకు తీసి తిప్పేవారు టోల్ప్లాజా వద్దకు వెళ్లేందుకు 5 నిమిషాల ముందు రీచార్జ్ చేస్తుంటారు. ఇకమీదట అలా కుదరదు. అందుకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) స్వస్తి పలికింది. తగిన మొత్తం ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేని పక్షంలో డబుల్ మొత్తం చెల్లించక తప్పదు. త్వరిత గత ప్రయాణం, డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను సోమవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఏటి గంగమ్మా.. చల్లంగ చూడమ్మాఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన ఏటి గంగమ్మ తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి. జిల్లా నలమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముందుగా భక్తులు పెన్నహోబిళంలో లక్ష్మీనృసింహస్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర పెన్నా నదిలో మాఘమాస పుణ్యస్నానాలు ఆచరించారు. నది సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయంలో ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి కోళ్లు, గొర్రెలు, మేకలు బలి ఇచ్చి పచ్చని చెట్ల మద్య వనభోజనాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వైఎస్సార్సీపీ యువనేత వై.భీమిరెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వనజాక్షి, ఆకుకూర నాగరాజులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ ఈఓ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనానికి నిప్పు
హిందూపురం అర్బన్ : మండల పరిధిలోని మోత్కుపల్లిలో శనివారం రాత్రి తిప్పన్న అనే వ్యక్తి చెందిన ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో వాహనం కాలిబూడిదైంది. ఈ ఘటనపై బాధితుడు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ధర్మవరం అర్బన్: పట్టణంలోని కదిరిగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెందాడన్నారు. మృతుని ఆచూకీ తెలిస్తే వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నరబలి కేసులో ఇద్దరి అరెస్ట్ పావగడ: నరబలి కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలమేరకు.. పశ్చిమ దిక్కుకు వెళ్లి నరబలి ఇస్తే నిధులు దొరుకుతాయని తాలూకాలోని కోటగుడ్డకు చెందిన జ్యోతిష్కుడు రామకృష్ణ... కుందిర్పి మండలానికి చెందిన ఆనందరెడ్డికి చెప్పాడు. దీంతో ఈ నెల 9న పావగడ నుంచి పడమటి దిక్కుగా ఉండే చళ్లకెరె తాలూకా పరశురాంపురం గ్రామానికి ఆనందరెడ్డి వెళ్లాడు. పక్కా ప్లాన్ ప్రకారం స్థానిక బస్టాండ్లో చెప్పులు కుట్టే చర్మకారుడు ప్రభాకర్తో మాట కలిపాడు. అతను పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా తానూ అదే దారిలో వెళ్తున్నానని.. ఇంటి వద్ద విడిచిపెడతానని నమ్మబలికాడు. మార్గ మధ్యలో నిందితుడు ఆనందరెడ్డి వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో ప్రభాకర్పై దాడి చేయడంతో అతను చనిపోయాడు. విచారణ అనంతరం పోలీలసులు జ్యోతిష్కుడు రామకృష్ణ , కుందిర్పి ఆనందరెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 22 వరకూ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆమిద్యాలలో భారీ చోరీ ● 20 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఇంట్లో బీరువాలోని 20 తులాల బంగారుతో పాటు రూ1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆమిద్యాలకు చెందిన దర్జీ నారాయణరావు, సర్వసతీ దంపతులు 10 రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ జనార్దన్నాయుడు కేసు నమోదు చేసుకొని క్లూస్టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. -
రాజుకున్న భూ వివాదం
పెనుకొండ రూరల్: కియా కార్ల తయారీ పరిశ్రమ సమీపంలో భూ వివాదాలు రాజుకుంటున్నాయి. రెండు వారాల కిందట స్వల్ప వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఆదివారం భూ సమస్యతో ఒక వర్గంపై మరో వర్గం దాడికి తెగబడింది. వివరాలిలా ఉన్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు, గుంతకల్లుకు చెందిన ప్రభాకర్కు మునిమడుగు పొలం సర్వే నంబర్ 433లో 1.12 ఎకరాలు, గుట్టూరు పొలం సర్వే నంబర్ 324లో 61 సెంట్ల భూమి ఉంది. దీనికి ఫెన్సింగ్ వేసి.. ఆదివారం చదును చేయిస్తున్న సమయంలో బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ అనుచరులు సాయితేజ, వీరాంజనేయులు, బోయ వినోద్కుమార్ మరికొందరు అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఇక్కడ ఎనిమిది సెంట్ల స్థలం ఎంపీపీకి చెందినది ఉందంటూ ఫెన్సింగ్ను ధ్వంసం చేశారు. జేసీబీతో ప్రహరీని కూలదోశారు. అడ్డుకోబోయిన ప్రభాకర్పై ఇనుపరాడ్లు, కట్టెలు, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో ఎంపీపీ అనుచరులు అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం బాధితుడు ఘటనపై కియా ఏరియా పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని, ఎంపీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరానన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరికొంతమంది పరారీలో ఉన్నారని చెప్పారు. పల్లె అనుచరుడిపై దాడి పొలంలో ఫెన్సింగ్, ప్రహరీ కూల్చివేత -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అనంతపురం కల్చరల్: జిల్లా కేంద్రమైన అనంతపురంలో నిర్వహిస్తున్న బాలోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆదివారం నిర్వహించిన ముగింపు వేడుకల్లో జానపద గీతాలు, సందేశాత్మక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలతో విద్యార్థులు అలంరించారు. పెద్ద సంఖ్యలో వీక్షకులు తరలిరావడంతో స్థానిక లలితకళాపరిషత్తు, గిల్డ్ ఆఫ్ సర్వీసు ప్రాంగణాలు కిటకిటలాడాయి. సాయంత్రం నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రతిభ చాటిన వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ చైర్పర్సన్ షమీమ్, ఆర్ఐఓ వెంటరమణనాయక్, నిర్వాహకులు సావిత్రి, లలితకళాపరిషత్తు కార్యదర్శి పద్మజ, బాలోత్సవం కార్యదర్శి శ్రీనివాసరావు, ట్రెజరర్ జిలాన్, తరిమెల అమరనాథరెడ్డి, సీనియర్ కవి నబీరసూల్, డాక్టర్ కొండయ్య, కత్తి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువనో, వంకనో కాదు.. ఏకంగా నదినే ఆక్రమించాడో రియల్టర్. దానిపైన పెద్ద బ్రిడ్జి కట్టేశాడు. ఇదేదో ప్రజావసరాల కోసం అనుకుంటే పొరపాటే! సొంత అవసరాల కోసం ఈ నిర్మాణం చేపట్టాడు. బ్రిడ్జి నిర్మించడమే కాదు..నదీ జలాలను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. ఇంత జరుగుతున్
చిత్రావతి నదిపై అనధికారికంగా నిర్మించిన బ్రిడ్జి చిలమత్తూరు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ‘చిత్రావతి’ ఒకటి. హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల మీదుగా ప్రవహించే ఈ నది పరివాహక ప్రాంతం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. నదిలో నీటి ప్రవాహం సాఫీగా కొనసాగితే వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. కానీ ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలు, ఇసుక తరలింపు వంటి వాటితో నది ఉనికి కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చిత్రావతి పరిరక్షణకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చిలమత్తూరు మండలంలో రెడ్డెప్ప శెట్టి అనే వ్యక్తి చిత్రావతిని ఆక్రమించి ఏకంగా బ్రిడ్జి నిర్మించినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. బెంగళూరులో నివాసం ఉంటున్న రెడ్డెప్పశెట్టి ప్రముఖ రియల్టర్. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట చిలమత్తూరు మండలం మొరసలపల్లి, కోడూరు, నారేముద్దేపల్లి, మర్రిమాకులపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటికీ కంచె వేసుకుని పెద్ద వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు. అందులోకి బయటి వ్యక్తులెవరూ వెళ్లలేని పరిస్థితి. అనధికారికంగా బ్రిడ్జి నిర్మాణం చిత్రావతి నదికి ఇరువైపులా రెడ్డెప్పశెట్టి వ్యవసాయ క్షేత్రం విస్తరించి ఉంది. దీంతో నదీ పోరంబోకు భూములను సైతం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. సుమారు 19 ఎకరాలను ఆక్రమించుకుని కంచె వేయడంతో పాటు కోడూరు సమీపంలో నదిపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలు సాగిస్తున్నాడు. సాధారణంగా నదులపై బ్రిడ్జీల నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉన్నతస్థాయిలో అనుమతులు తీసుకోవాలి. అదీ ప్రజావసరాలకు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలాంటి అనుమతులూ ఇవ్వరు. కానీ ఇక్కడ స్థానిక అధికారులను లోబరుచుకుని అక్రమ నిర్మాణం చేపట్టారు. అతని ‘సామ్రాజ్యం’లోకి వెళ్లేందుకు సామాన్యులకు అవకాశం ఉండదు. చుట్టూ కంచె ఉండటంతో అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఇదే అదనుగా అక్రమ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు స్పష్టమవుతోంది. నదీ జలాల మళ్లింపు బ్రిడ్జి నిర్మాణంతోనే ఆగకుండా నదిలో చెక్డ్యాంలు కట్టి.. వ్యవసాయ క్షేత్రంలోని పెద్దపెద్ద ఫారం పాండ్లకు నీటిని మళ్లించుకుంటున్నారు. చెరువులకు వచ్చే నీటి దారులను ఫారం పాండ్లకు మళ్లించారు. ఫలితంగా దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదు. రెడ్డెప్పశెట్టి అరాచకాలపై పలు గ్రామాల రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా..ఏమాత్రమూ పట్టించుకోలేదు. పైగా అతనికే అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నదిని ఆక్రమించిన రియల్టర్ చిత్రావతిపై బ్రిడ్జి నిర్మాణం నదీ జలాల అక్రమ వినియోగం పట్టించుకోని అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతి తీసుకోలేదు చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని మా దృష్టికి వచ్చింది. ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అదీ ప్రజలకు అవసరం అనుకుంటేనే అనుమతులు మంజూరు చేస్తాం. ప్రజావసరాలు లేనప్పుడు నదిపై బ్రిడ్జి నిర్మించడం తప్పు. హద్దులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ వారికి లేఖ రాశాం. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ లేఖ రాస్తాం. మేము నేరుగా చర్యలు చేపట్టడానికి లేదు. రెవెన్యూ వాళ్లే తీసుకోవాలి. – యోగానంద, ఇరిగేషన్ డీఈ -
హ్యాండ్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ధర్మవరం: జిల్లాస్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ ఉమెన్ హ్యాండ్బాల్ జట్లను ఎంపిక చేసినట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రియాజ్ తెలిపారు. పట్టణంలోని యశోద పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ ఉమెన్ హ్యాండ్బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, వైఎస్ఎల్ ఎంటర్ ప్రైజెస్ చంద్రశేఖర్, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రియాజ్, కార్యదర్శి సాకే శివశంకర్ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో కర్నూల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. బాలుర జట్టు: సాయికిరణ్, హరినాథ్బాబు, వినయ్, సిద్విక్, ప్రసాద్ నాయక్, జశ్వంత్, నాగ మహేష్, ధనుష్, వినోద్ నాయక్, సాంబ, అశ్విన్ చౌదరి, రోహిత్, వినీత్రెడ్డి, కార్తీక్నాయక్, అశోక్, లోకేష్ సీనియర్ మహిళా జట్టు: ధనూషా, గీతిక, లాస్య, లిఖిత, తన్మయి, రిషిక, ధనలక్ష్మి, హర్షవల్లి, మహేశ్వరి, మంజుల, మహిత, కీర్తి, హర్షప్రియ, తేజశ్విని, మెహరున్నీసా, మధుమతి -
చెత్త విషయంలో డిష్యుం.. డిష్యుం
గుత్తి: చెత్త పడేసి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం గుత్తి ఆర్ఎస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రసూల్– సాయమ్మ ఇళ్లు పక్క పక్కనే ఉన్నాయి. అయితే చెత్త పడేసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు కుటుంబానికి చెందిన వారు కత్తులు, కట్టెలతో పరస్పరం దాడులు దిగారు. ఈ ఘటనలో తల్లీ కొడుకు వంశీ, సాయమ్మ , రసూల్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వందశాతం ప్రగతి సాధించాలి
హిందూపురం టౌన్: ప్రాథమిక, అర్బన్, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని పారామీటర్లలో నూరుశాతం ప్రగతి సాధించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్ఓ ఫైరోజ బేగం సూచించారు. ఆదివారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని పీపీ యూనిట్ను పరిశీలించారు. అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాసరెడ్డితో పాటు పీహెచ్సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలోని కాన్పుల వార్డు ఎస్ఎన్సీయూ విభాగాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. అలాగే పరిగి రోడ్డులోని ఆర్కే నర్సింగ్ హోమ్ను సందర్శించి పీసీపీఎన్డీటీ రిపోర్టులను పరిశీలించారు. డీఎంహెచ్ఓ ఫైరోజ బేగం మాట్లాడుతూ ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, అనవసర మందులు ఉపయోగించి అనర్థాలు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుతో పాటు ఆర్ఎంపీలు వైద్యం అందించే కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 14 మంది వైద్యులతో ఏడు కమిటీలను ఇదివరకే నియమించామన్నారు. ఆర్ఎంపీలు పేరుకు ముందు ‘డాక్టర్ ‘అని‘ క్లినిక్’ అని బోర్డులలో ఉండకూడదని, కేవలం ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండేలా చూడాలన్నారు. హద్దుమీరి వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్సీడీ సర్వేలో జిల్లాలో లక్ష్మీపురం ఆరోగ్య కేంద్రం చివరి స్థానంలో ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యులు పద్మజ, ఆనంద్బాబుతో పాటు పరిసర పీహెచ్సీ వైద్యులతో బాటు వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
శ్రవణానందభరితంగా సంగీత విభావరి
ప్రశాంతి నిలయం: మృదు మధురమైన స్వరాలొలికిస్తూ నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత విభావరి శ్రవణానందభరితంగా సాగింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత అతి రుద్రమహాయజ్ఞం నాలుగో రోజు ఆదివారం కొనసాగింది. వేదపండితులు వేదపఠనం నడుమ యజ్ఞ క్రతువులు నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ రామరత్నం అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పిదప కలైమణి ఎంబార్ కన్నన్, కలైమణి సత్వనరవనన్ల బృందం ఆధ్యాత్మిక భక్తిరస సంగీత విభావరి నిర్వహించారు పిదప భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
నేడు ఎస్పీ కార్యాలయంలో ‘పరిష్కార వేదిక’
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఎస్పీ సూచించారు. జీబీఎస్పై ఆందోళన వద్దు పుట్టపర్తి అర్బన్: జీబీఎస్ (గిలన్ బారీ సిండ్రోమ్)పై ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ పరిధిలోని నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో కండరాల బలహీనత ఏర్పడే వ్యాధి జీబీఎస్ అని వివరించారు. ఇది చాలా అరుదైన వ్యాధని, ఇది అంటువ్యాధి కాదని తెలిపారు. వైరస్, బ్యాక్టీరియాల సంక్రమణ అనంతరం ఇది వస్తుందని వెల్లడించారు. వ్యాధి లక్షణాలు వేగంగా తీవ్రమవుతాయన్నారు. చూడడానికి అంతా ఆరోగ్యంగానే ఉంటూ రక్త పరీక్షల్లో నాడీ, రక్త పోటు నార్మల్ గానే కనిపిస్తాయన్నారు. దేశంలో మొదటి కేసు పూనేలో నినిర్ధారణ అయ్యిందని, జిల్లాలో ఇంత వరకూ ఒక్కటీ నమోదు కాలేదని తెలిపారు. వ్యాధి లక్షణాలు నరాల బలహీనతతో కాళ్లు, చేతులు, చచ్చుబడడం, గొంతు పొడి బారడం, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతాయని డీఎంహెచ్ఓ తెలిపారు. ఇందుకు పలు జాగ్రత్తలను సూచించారు. కాళ్లు, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు, సమూహాల్లో ఉన్నప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. అసాధారణ నీరసం, కాళ్లు చేతులు తిమ్మిర్లు ఉన్నప్పుడూ, ఫ్లూ జ్వరం లక్షణాలు ఉన్నప్పుడు, మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇమ్యునో గ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తారని తెలిపారు. కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి నిద్రించి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సైటెర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. నేడు ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. -
పెళ్లి చేయలేదని యువకుడి హల్చల్
నల్లమాడ: పెళ్లి చేయలేదని అలిగిన ఓ యువకుడు హల్చల్ చేశాడు. సెల్టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంతో అతడిని కిందకు దింపి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లికి చెందిన రంగప్ప అనే యువకుడు పూటుగా మద్యం తాగి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సమీపంలోని రిలయన్స్ సెల్ టవర్ ఎక్కాడు. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని, టవర్పై నుంచి దూకి చనిపోవాలని ఉందని బిగ్గరగా అరిచాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ వై.నరేంద్రరెడ్డి వెంటనే అప్రమత్తమై ఓడీ చెరువు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి యువకుడికి నచ్చజెప్పి సెల్ టవర్ నుంచి కిందకు దిగేలా చర్యలు తీసుకున్నారు. యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఎస్పీ రత్నతతో పాటు గ్రామస్తులు అభినందించారు. -
17 నుంచి కార్మికుల సమ్మె
హిందూపురం టౌన్: ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్న కార్మికులు ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు సీఐటీయూ నాయకులు, నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్ సప్లయి స్కీమ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వగృహంలో పీఏకు సమ్మె నోటీసును అందజేశారు. వారు మాట్లాడుతూ పెనుకొండ పరిధిలో ఉన్న కార్మికులకు 10 నెలల వేతనాలు, 32 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. హిందూపురం పరిధిలో ఉన్న కార్మికులకు 10 నెలల వేతనాలు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి రాము, యూనియన్ అధ్యక్షుడు సోమశేఖర్, ఆర్గనైజర్ మురళీ, కార్యదర్శి గిరీష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టుతప్పుతున్న టీనేజ్
టీనేజీ పట్టు తప్పుతోంది. సినిమాలు కూడా విపరీతంగా ప్రభావితం చేస్తుండటంతో యువతీ యువకులు చేస్తున్న తప్పులతో కుటుంబాలే కాదు వారి జీవితాలు కూడా దెబ్బతింటున్నాయి. వివాహమైన తక్కువ వ్యవధిలోనే విభేదాల కారణంగా పోలీసుస్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. హిందూపురం అర్బన్: పాతిక ఏళ్ల క్రితం వరకూ తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే ఎక్కువ మంది పిల్లలు నడిచేవారు. పెళ్లిళ్లు సైతం ఎక్కువ భాగం తల్లిదండ్రులు నిశ్చయించిన విధంగానే జరిగేవి. పెళ్లిళ్ల తరువాత ఏవైనా సమస్యలు వస్తే రెండు కుటుంబాలు కూర్చొని తమ పిల్లలకు సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్థలను తొలగించి భార్యాభర్తలను ఒకటి చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వందలో 30 కేసులు అగ్ని సాక్షిగా జీవితాంతం కలిసి ఉంటామని ఒక్కటవుతున్న ఎన్నో జంటలు .. పైళ్లెన ఆరు నెలలు, ఏడాది గడవక ముందే మనస్పర్థలతో గొడవలకు దిగుతున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నా సంపాదన ఉండటంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించక పోవడం, మొండిగా వ్యవహరిస్తుండటంతో చివరకు విడాకుల దాకా వచ్చి దూరమై పోతున్నారు. వందలో 30 వరకూ ఇలాంటి కేసులే పోలీసుస్టేషన్లకు వస్తున్నాయి.పెద్దలు నచ్చ జెప్పే ప్రయత్నాలకే అవకాశమే ఇవ్వడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు నలిగిపోతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాలు ఎక్కువ మంది తల్లిదండ్రులు సంపాదనపై దృష్టి పెట్టడం, పిల్లలను పట్టించుకోకపోవడం వారు వేరే వారికి ఆకర్షితులవుతుండటంతో ఇబ్బందులొస్తున్నాయి. దీనికితోడు సినిమాలు, సామాజిక మాధ్యమాలు, ఓటీటీలు, సీరియళ్ల ప్రభావం యువత మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. హైస్కూల్, ఇంటర్ చదివే వయస్సు నుంచే ప్రేమ వ్యవహారాలు ప్రారంభమై పక్కదారి పడుతున్నాయి. ప్రేమ, పెళ్లి అంటూ ఎంతో మంది యువతీ యువలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబాల్లో అలజడి రేగుతోంది. సంపాదనలో ఇరువురు తీసిపోకపోవడం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వక పోవడం, ఇరువురిలో అహం పెరగడం, అత్తమామలు, ఆడపడుచులు ఉన్నారన్న సాకులతో ఎక్కువ జంటలు విడిపోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ మంచి, చెడ్డలను వివరించి వివాహ వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మేలు. – రాజగోపాల్నాయుడు, పట్టణ సీఐ, హిందూపురం సినిమాలు, సామాజిక మాధ్యమాలతో యువత పెడదారి పైళ్లెన తక్కువ వ్యవధిలోనే విడాకుల బాట పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణ కుటుంబాలకు మనోవేదన మిగుల్చుతున్న వైనం -
మెట్టినింటికి తీసుకెళ్లాలని అడిగినందుకు దాడి
● న్యాయం చేయాలంటున్న బాధితురాలు బెళుగుప్ప: మెట్టినింటికి తీసుకెళ్లాలని అడిగినందుకు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు చితకబాదారని బాధితురాలు సాయిలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శివ విచారణ చేపట్టారు. బాధితురాలి వివరాలమేరకు.. మండల పరిధిలోని తగ్గుపర్తికి చెందిన సాయిలీల, కణేకల్లు మండలం కలేకుర్తికి చెందిన లాలుస్వామి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో గత నెల 24న పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తగ్గుపర్తిలోని తన అక్క ఇంట్లో ఉంటున్న లాలుస్వామి.. భార్య సాయిలీల దగ్గరకు మాత్రం అప్పుడప్పుడూ వెళ్లేవాడు. అయితే మొట్టినింటికి తీసుకెళ్లాలని సాయిలీల భర్త లాలుస్వామిని అడిగింది. తన అక్కలకు, అమ్మకు తనను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని, మెట్టినింటికి తీసుకెళ్లాలని గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలో సాయిలీలతో పాటు ఆమె అక్క ప్రవళ్లిక, అన్న ఎర్రిస్వామి, వదిన శిల్ప, మామ నాగరాజుపై లాలుస్వామితో పాటు వారి కుటుంబ సభ్యులు దాడి చేశారు. వారంతా గాయపడటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులే తనకు న్యాయం చేయాలని బాధితురాలు సాయిలీల విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని సజ్జలదిన్నె క్రాస్లో ఆదివారం రంగనాయకులు(65) ద్విచక్ర వాహనంలో వెళ్తూ లారీ కింద పడి మృతి చెందినట్లు అప్గ్రేడ్ ఎస్ఐ కాటయ్య తెలిపారు. మండలంలోని ఆలూరుకు చెందిన రంగనాయకులు మోటర్ సైకిల్లో తాడిపత్రి నుంచి ఆలూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గార్లదిన్నెలో మరొకరు.. గార్లదిన్నె: మండల పరిధిలోని రామ్దాస్పేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు... శింగనమల మండలం నిదనవాడకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి లాగేజీ ఆటోలో గేదేలను అనంతపురం మార్కెట్కు తరలిస్తున్నాడని చెప్పారు. అయితే రామ్దాస్పేట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడిందన్నారు. దీంతో లక్ష్మీనారాయణ (45) అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురము ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్మికుల సమస్యలపై అలసత్వం తగదు కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు, ప్రభుత్వం అలసత్వం వహించడం తగదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. ఆదివారం ఆయన పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ను సందర్శించారు. కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేస్–4లో కళ్యాణదుర్గం , రాయదుర్గం కార్మికులకు పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు, 30 నెలల ఫీఎప్ చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికై ఈ నెల 18 నుంచి కార్మికుంతా సమ్మెబాట పడుతున్నట్లు చెప్పారు. కారు బోల్తా .. వ్యక్తికి గాయాలు చెన్నేకొత్తపల్లి: అనంతపురం వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన మైకేల్ ఫెర్నాడెజ్ మరో వ్యక్తితో కలసి అనంతపురము వైపు నుంచి బెంగళూరుకు కారులో వెళుతున్నారు. అయితే మండల పరిధిలోని ఉన్న ఫారెస్ట్ నర్సరీ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న మైకేల్ ఫెర్నాడెజ్ గాయపడగా చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి అతను చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులకు గాయాలు
తాడిపత్రిటౌన్: పట్టణం నుంచి కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులు ఆదివారం ప్రమాదానికి గురయ్యారు. తాడిపత్రి నుంచి కుంభమేళాకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో దాదాపు 40 మంది వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాశీకి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో వారి బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడప రోడ్డులో ఉన్న శివాలయం నిర్వాహకుడు రంగస్వామి, బాలరంగయ్య దంపతులకు గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను వారణాసి కలెక్టర్, ప్రజాప్రతినిధులు పరామర్షించారు. -
‘మిస్టర్ సౌత్ ఇండియా’ పోటీల్లో ప్రతిభ
రాయదుర్గంటౌన్: బెంగళూరులో ఆదివారం జరిగిన మిస్టర్ సౌత్ ఇండియా మెన్స్ ఫిజిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన యువకుడు కొలిమి దస్తగిరి మూడో స్థానం సాధించారు. ఆయన మొదటిసారిగా ఈవెంట్లో పాల్గొని ఈ ఘనత సాధించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది బాడీబిల్డర్లు పాల్గొనగా మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఏకై క పోటీదారుడు దస్తగిరి కావడం విశేషం. మొత్తం 60 మంది పోటీల్లో పాల్గొనగా దస్తగిరి మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మన్ముందు రాష్ట్రం నుంచి మరిన్ని పోటీల్లో పాల్గొంటానని దస్తగిరి పేర్కొన్నారు. -
తడక ఉత్సవం.. భక్తి పారవశ్యం
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం మండలం చెండ్రాయునిపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి తడక ఉత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఏటా మాఘమాసంలో మూడో శనివారం ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే శనివారం తరుగు వంశీయులు, పూజారుల ఉపవాస దీక్షలతో అటవీ ప్రాంతంలో దొరికే వెదురుతో అల్లిన తడకను తీసుకువచ్చి ఆలయం పైభాగాన కప్పారు. ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. చెన్నేకేశవస్వామిని దర్శించుకుని తరించారు. పల్లె రాక.. భక్తుల కాక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తడకోత్సవానికి రావడంతో పోలీసులు హడావిడి చేశారు. ఎమ్మెల్యే పూజల్లో ఉన్నంతవరకూ ఆలయం వద్దకు భక్తులు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుమారు గంటన్నర పాటు రోడ్డు మార్గాన్ని మూసి వేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజల అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోయాక... భక్తుల వాహనాలు అనుమతించారు. అప్పటికే ప్రధాన రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. దేవుడి వద్ద కూడా ప్రొటోకాల్ ఏమిటంటూ జనం పల్లెతీరును తూర్పారబట్టారు. -
పింఛన్ సరిపోవడం లేదు
నేను ఏడేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నా. హిందూపురం ఆస్పత్రిలో డయాలసిస్ మాత్రమే చేస్తున్నారు. మందులు మాత్రం బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. ఇందుకు నెలకు రూ. 5 వేలు ఖర్చవుతోంది. దీనికి తోడు ఆస్పత్రికి వచ్చి వెళ్లేందుకు భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. వచ్చే పింఛన్ సొమ్ము వాటికే సరిపోతోంది. ఏ పనీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నా లాంటి వారికి ప్రభుత్వం రవాణా ఖర్చులైనా అదనంగా ఇచ్చి ఆదుకోవాలి. ఇందుకోసం పింఛన్ మొత్తం పెంచాలి. – గోపాల్, కిరికెర, హిందూపురం -
గ్రామాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ చేతన్ పిలుపు పుట్టపర్తి అర్బన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన డీఈఓ కృష్ణప్పతో కలిసి మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో న్యూట్రి గార్డెన్, వంటగది, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రక్షిత తాగునీరు అందజేయాలన్నారు. న్యూట్రి గార్డెన్పై విద్యార్థులకు అవగాహన కల్పించి వన సంరక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలలో తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. అలాగే స్వచ్ఛంధ్రా లక్ష్య సాధనలో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. పేరుకు పోయిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలన్నారు. చెత్త కాగితాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాగితాలను పూర్తిగా తొలగించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ శుభదాస్, హెచ్ఎం రమామణి తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రూపశ్రీ సత్తా ● స్కిప్పింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం కై వసం అమరాపురం: మండల పరిధిలోని హలుకూరు సమీపంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి రూపశ్రీ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం దక్కించుకుంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రూపశ్రీ జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ పద్మావతి, పీడీ రోజా అన్నారు. రూపశ్రీ స్ఫూర్తితో గురుకుల పాఠశాలకు చెందిన మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కందుల కొనుగోలులో రాజకీయం
రొద్దం: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక అధికారులంతా ఆ పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇలా అన్నింటిలోనూ కూటమి పార్టీల నేతలు చెప్పినట్లే వ్యవహరిస్తున్నారు. చివరకు రైతులకూ రాజకీయం అంటగట్టారు. టీడీపీ మద్దతుదారులైన రైతుల నుంచే కందులు కొనుగోలు చేస్తూ వివాదానికి తెరతీశారు. కొందరికే సమాచారం ఇచ్చి... కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం రొద్దం కేంద్రం ఏర్పాటు చేసింది. ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ద్వారా రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తోంది. శనివారం కందులు కొనుగోలుకు సిద్ధమైన అధికారులు కేవలం టీడీపీ మద్దతుదారులైన రైతులకే ముందస్తు సమాచారం ఇచ్చారు. కందులు తీసుకువచ్చేందుకు అవసరమైన సంచులనూ కొందరికే అందజేసి కొనుగోళ్లు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా రైతులు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. పావగడ–పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకూ రాజకీయాలు ముడిపెట్టడం సబబుకాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రైతుల అందోళనతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులే సొంతంగా సంచులు సమకూర్చుకుంటే అందుకు సంచికి రూ.25 చొప్పున చెల్లించాలి కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. ఆందోళనలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్.నారాయణరెడ్డి, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, బూదిపల్లి రామంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. టీడీపీ మద్దతుదారుల నుంచే కొనుగోళ్లు రోడ్డుపై బైఠాయించిన రైతులు -
17న కదిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కదిరి అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 17న కదిరిలో రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతివారం ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17న కదిరి ఆర్డీఓ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చేతన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజల తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు. తపశ్య గానం.. సమ్మోహనం ప్రశాంతి నిలయం: దేవదేవుళ్లను కీరిస్తూ విధుషీ శ్రీరంజని తపశ్య నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను సమ్మోహనభరితులను చేసింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయాగం రెండోరోజూ కొనసాగింది. చైన్నెకి చెందిన శ్రీనివాస్ శర్మ నేతృత్వంలోని రుత్వికుల బృందం ఉదయం గణపతి ప్రార్థనతో ప్రారంభించి మహాన్యాస పారాయణం, షోడశ ఉపచార పూజ, రుద్రపారాయణం, రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. వేదపఠనంతో రుత్వికులు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. సాయంత్రం కర్మార్చనం, అష్టావధాన సేవ నిర్వహించారు. పుదిచ్చేరి యూనివర్సిటీ సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ రాధాకృష్టన్ అతి రుద్రమహా యజ్ఞం విశిష్టతను వివరించారు. అనంతరం విధుషీ శ్రీరంజని శంతనగోపాలన్ తపశ్య బృందం సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి స్వరాలతో దేవదేవుళ్లను కీర్తిస్తూ సాగిన కచేరీతో భక్తులు మైమరచిపోయారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
పుట్టపర్తి టౌన్: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో జూమ్ ద్వారా నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గ్రేవ్, నాన్గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, హత్యలు, చోరీలు తదితర కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నిందితుల అరెస్ట్ అయిన కేసుల్లో చార్జ్షీట్ త్వరగా దాఖలు చేపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి పరిష్కారం చూపాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని.. సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలని సూచించారు. ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టి.. అక్కడ ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. రోజూ విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేసి పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించాలన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీల బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్ కుమార్, ఐటీ కోర్ ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణను ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది, ఏఆర్ పోలీసులు శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు. ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఆర్ఐ మహేష్, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్కుమార్తో పాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ పుట్టపర్తి టౌన్: అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వక్తలు తెలిపారు. శనివారం పుట్టపర్తిలో ఉన్న ఆర్టీసీ డిపో ఆవరణలో జిల్లాలో అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్, పర్సనల్ అకౌంట్ సూపర్వైజర్లు, అసోసియేషన్ సభ్యులతో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ రత్న, ఆర్టీఓ కరుణసాగర్రెడ్డి, ప్రజారవాణాధికారి మధుసూదన్, రెడ్క్రాస్ సొసైటీ సెక్రటరీ విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం 21 మందికి డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు అందజేసి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపాటి ప్రమాదానికి కూడా కారకులు కాకుండా 30 ఏళ్లకు పైగా డ్రైవింగ్ వృత్తిలో కొనసాగుతూ వచ్చిన కొంతమంది డ్రైవర్ల అంకితాభావాన్ని కొనియాడారు. -
యువరైతు ఆత్మహత్య
తనకల్లు: అప్పులు యువ రైతును బలిగొన్నాయి. పూలకుంటపల్లికి చెందిన ఈశ్వరప్ప కుమారుడు చంద్రశేఖర్ (32)కు ఐదు ఎకరాలు పొలం ఉంది. అందులో రెండు బోర్లు వేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంటల కోసం తెలిసిన వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. మూడేళ్లుగా పంటలు చేతికందకపోవడంతో నష్టాలు వచ్చాయి. ఆరు నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు ఓ వైపు.. ట్రాక్టర్ కంతులు ఎలా చెల్లించాలోనన్న ఆందోళన మరోవైపు వెంటాడుతుండేది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చంద్రశేఖర్కు భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గుత్తి రూరల్: రజాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయ తెలిపారు. 2025–26 సంవత్సరానికి బీఆర్ఏజీ సెట్–2025 ప్రవేశ పరీక్ష ద్వారా ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో 80 సీట్లు, ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మార్చి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 93916 39001 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
గాయపడిన యువకుడి మృతి
పెద్దవడుగూరు/ గుంతకల్లు రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం కదిరంపల్లికి చెందిన నరేష్ (32) ఈ నెల 12న పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గం మధ్యలో అడవిపందుల గుంపు అడ్డు వచ్చింది. దీంతో అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన నరేష్ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
వడ్డీ వ్యాపారుల వేధింపులపై కేసు
గార్లదిన్నె: అధిక వడ్డీల కోసం మహిళను వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్మహమ్మద్ బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. కోటంక గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ అనే మహిళ తన పెళ్లికి ముందు అనంతపురంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తుండేది. రెండేళ్ల క్రితం అనంతపురంలోని రాణీనగర్కు చెందిన మణికుమార్ వద్ద అవసరాల నిమిత్తం వారానికి నూటికి రూ.10 వడ్డీతో రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. తన బంగారు ఆభరణాలు అమ్మి అసలు, వడ్డీ కలిపి రూ.3లక్షలు చెల్లించింది. పెళ్లయిన తర్వాత భర్త సురేష్రెడ్డిని బెదిరించి అప్పు ఇంకా తీరలేదని గత ఏడాది జూలైలో రూ.5.30లక్షలకు ప్రాంసరీ నోటు రాయించుకున్నారు. అంతేకాదు బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారు. అప్పటి నుంచి డబ్బు కోసం వేధిస్తూనే ఉన్నారు. స్వగ్రామం కోటంకకు వెళ్లినా అక్కడకూ కొంతమంది మహిళలు వెళ్లి అప్పు తీర్చాలంటూ కుళ్లాయమ్మను బెదిరించారు. వడ్డీ వ్యాపారి మణికుమార్, అతని భార్య మణి, తల్లి కొత్తమ్మ నుంచి ప్రాణహాని ఉందని కుళ్లాయమ్మ గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
జనసేన కార్యకర్త ఇంటిపై దౌర్జన్యం
ధర్మవరం అర్బన్: పట్టణంలో జనసేన కార్యకర్త ఇంటిపై టీడీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేతిరెడ్డికాలనీ ఎల్–4లో జనసేన కార్యకర్త శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు రేకుల షెడ్డులో హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు. శనివారం టీడీపీ నాయకుడు వీరన్న, అతని అనుచరులు గోపాల్, నరసింహులు వెళ్లి ఈ స్థలం తమదంటూ షెడ్డు ఖాళీ చేయాలని బెదిరించాడు. వారు ఒప్పుకోకపోవడంతో టీవీ, ఫ్రిడ్జ్ ఇతర సామగ్రిని బయటకు విసిరేసి.. బండరాళ్లు వేసి పైకప్పు ధ్వంసం చేశాడు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. రెండేళ్ల కిందట తనకిచ్చిన స్థలంలో షెడ్డు వేసుకున్నానని బాధితుడు శ్రీనివాసులు తెలిపాడు. అయితే వీరన్న తన స్థలమంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించాడు. న్యాయం కోసం కోర్టును సైతం ఆశ్రయించానని చెప్పాడు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడు వీరన్న, గోపాల్, నరసింహులుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారిలో పడిపోయిన బంగారు నగల బ్యాగు
తాడిపత్రి టౌన్: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో దారి మధ్యలో పడిపోయిన బంగారు నగల హ్యాండ్బ్యాగును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పది నిమిషాల్లో కనుక్కొని బాధితురాలికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పోరాట కాలనీకి చెందిన కవిత తన తల్లి లక్ష్మీ తో కలిసి శనివారం రాయదుర్గం వెళ్లేందుకు ఇంటి నుంచి ఆటోలో బస్టాండ్కు బయల్దేరారు. కొంత నగదుతో పాటు బంగారు నెక్లెస్, చైన్ను భద్రపరచిన హ్యాండ్బ్యాగును దుస్తుల సంచిపై పెట్టుకుంది. బస్టాండ్కు వెళ్లిన తర్వాత చూస్తే హ్యాండ్బ్యాగ్ కనిపించలేదు. దీంతో కవిత ఏడుస్తూ నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ సాయిప్రసాద్కు జరిగిన విషయం చెప్పింది. అదే బ్యాగులో తన సెల్ఫోన్ కూడా ఉందని తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు లొకేషన్ను కనుగొని బాధితురాలిని బైక్పై ఎక్కించుకుని ఆ ప్రదేశానికి బయల్దేరారు. చింతల వెంకటరమణస్వామి ఆలయ సమీపంలో బేకరీ నిర్వహిస్తున్న నాగమణి వద్ద ఆ బ్యాగు లభించింది. బ్యాగు దొరికిన వెంటనే పోలీసులకు అప్పగించాలి కదమ్మా అని పోలీసులు ప్రశ్నిస్తే.. ఈ రోజు ఇంట్లో ఎవ్వరూ మగవారు లేక పోవడంతో పోలీస్స్టేషన్కు రాలేక పోయానని నాగమణి చెప్పి.. బ్యాగు అందజేసింది. బ్యాగులో బంగారు నగలు, నగదు అన్నీ భద్రంగా ఉండడంతో కవిత ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పోలీసులకు, బ్యాగు అందజేసిన నాగమణికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. 10 నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు -
ఒంటరి వృద్ధులే టార్గెట్
అనంతపురం: ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులే టార్గెట్. రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడడం.. అవసరమైతే హత్యకు తెగబడడం. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఓ కసాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ పి.జగదీష్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో పొమ్మల సావిత్రి (63) సొంతింటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె భర్త అటవీశాఖలో ఉద్యోగ విరమణ చేసిన కొన్నాళ్లకు చనిపోయారు. ఈమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వేరుగా కాపురం ఉంటున్నారు. సావిత్రి తన భర్త పెన్షన్ సొమ్ముతో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో గత జనవరి నెల ఆరో తేదీన ఆమె ఇంటిలోనే హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపేసిన ఆనవాళ్లు ఉండడంతో పాటు మెడలోని ఉండాల్సిన రెండు బంగారు చైన్లు, సెల్ఫోన్ కనిపించలేదు. కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నేర స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ల ద్వారా ఆధారాలు సేకరించారు. రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగు వారిని పోలీసులు విచారణ చేశారు. అనంతరం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. సీసీ కెమెరాలు ఫుటేజీలు పరిశీలించి అనంతపురం పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్ అన్సర్ అలియాస్ చీమిడోడు అలియాస్ నాకులు అలియాస్ చాబూసాను నిందితుడిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి.. హత్య చేసి.. షేక్ అన్సర్ వెల్డింగ్ వర్కర్. ఇతడు తాగుడు, వ్యభిచారం, తదితర చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు తీర్చుకునేందుకు అప్పులు చేశాడు. అయితే తిరిగి చెల్లించడానికి తగినంత ఆదాయం లేకపోవడం.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో డబ్బు కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని.. వారి వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదు కాజేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా రెక్కీ నిర్వహించిన తర్వాత జనవరి ఆరో తేదీన టీచర్స్ కాలనీలో టూలెట్ బోర్డు ఉన్న సావిత్రి ఇంటికి వెళ్లాడు. తనకు ఇల్లు బాడుగకు కావాలని వివరాలు అడిగిన తర్వాత తాగునీరు అడిగాడు. ఆమె లోనికి వెళ్లగానే అన్సర్ తన వెంట తెచ్చుకున్న స్టిక్కర్ బ్లేడ్తో గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు చైను, 16 గ్రాముల పగడాల బంగారు చైను, రెడ్మీ సెల్ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం చెరువుకట్ట వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కె.సాయినాథ్, సీసీఎస్ సీఐ జయపాల్రెడ్డి, ఎస్ఐలు రాంప్రసాద్, రాజశేఖర్రెడ్డిల ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల తొమ్మిదో తేదీన అనంతపురం రూరల్ మండలం కురుగుంటలోని ఓ ఇంట్లో కూడా షేక్ అన్సర్ చోరీకి పాల్పడ్డాడు.రూ.34,500 చోరీ నగదును నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదింపులో శ్రమించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. కుదిరితే చోరీ.. లేకుంటే హత్య కసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారు నగలు, నగదు స్వాధీనం -
డయాలసిస్ రోగులపై పచ్చ పగ
ఈ చిత్రంలోని మహిళ పేరు పద్మ. పెనుకొండ మండలం తురకలాపట్నం స్వగ్రామం. ఎనిమిదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పద్మ వైద్యుల సూచన మేరకు.. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటోంది. ఇందుకోసం 50 కి.మీ దూరంలోని హిందూపురం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో వైఎస్సార్ సీపీ సర్కార్ డయాలసిస్ బాధితులను 108 వాహనం ద్వారా ఆస్పత్రులకు తీసుకువెళ్లి...తిరిగి ఇంటికి చేర్చేది. కానీ కూటమి ప్రభుత్వం డయాలసిస్ చేయించుకునే వారికి 108 ద్వారా రవాణా సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో పద్మ ఆస్పత్రికి వచ్చి వెళ్లేందుకు ఆటోపై ఆధారపడుతోంది. ఇందుకోసం నెలకు సుమారుగా రూ.10 వేలు ఖర్చు చేస్తోంది. ఇక ఆస్పత్రిలో మందులు అందుబాటులో లేక నెలకు రూ.6 వేలు వెచ్చించి బయట కొంటోంది. ప్రభుత్వం రూ.10 వేల పింఛన్ ఇచ్చినా అవి సరిపోక అతికష్టమ్మీద కూలి పనులకు వెళ్తోంది. రవాణా సౌకర్యం లేక పద్మలా ఇబ్బంది పడుతున్న వారు జిల్లాలో వందల మంది ఉన్నారు. చిలమత్తూరు: డయాలసిస్ రోగులపై కూటమి సర్కార్ కత్తి గట్టింది. కిడ్నీలు పనిచేయక.. ఏ పనీ చేసే వీలులేక అల్లాడిపోతున్న అభాగ్యులకు అండగా నిలవాల్సింది పోయి కీడు తలపెట్టింది. ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు, మందులు తదితర విషయాలు పక్కన పెడితే కనీసం వారిని ఆస్పత్రి వరకూ చేర్చే 108 సేవలనూ రద్దు చేసింది. దీంతో వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి రాలేక అష్టకష్టాలు పడుతున్నారు. హిందూపురంలో యూనిట్లోనే 160 మంది హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ సంస్థ నిర్వహిస్తోంది. రెండు పాజిటివ్, 20 నెగిటివ్ బెడ్లు ఉన్నాయి. రోజుకు 60 నుంచి 65 మందికి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ యూనిట్లో హిందూపురం , మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాలకు చెందిన 160 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం డయాలసిస్ రోగులను ఆస్పత్రికి చేర్చేందుకు గతంలో ఉన్న 108 సేవలను రద్దు చేసింది. దీంతో రోగులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం సరిగా లేక ఒకేసారి రానుపోను కలిసి ఆటో మాట్లాడుకుంటున్నారు. దీంతో ఒకసారి ఆస్పత్రికి రావాలంటే రవాణా ఖర్చే కనీసంగా రూ.500 వెచ్చించాల్సి వస్తోంది. ఇలా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి మందులు, రవాణా ఖర్చులు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు అవుతోంది. వేధిస్తున్న మందుల కొరత కూటమి సర్కార్ డయాలసిస్ రోగులకు మందులను సరఫరా చేయలేక చేతులెత్తిసింది. కీలకమైన మందులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులు వాటిని బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో నెలకు మందుల ఖర్చే రూ.5 వేలు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల మందులను అందివ్వాలని కోరుతున్నారు. 108 సేవలను రద్దు చేసిన కూటమి సర్కార్ పింఛన్ డబ్బుకు మించి అధికంగా ఖర్చులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు -
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.