Sri Sathya Sai
-
‘పరమేశ్వర్..నీ సేవలిక చాలు’
కదిరి: అధికార తెలుగుదేశం పార్టీని అడ్డంపెట్టుకొని రెండేళ్లుగా మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్న సచివాలయ శానిటరీ సెక్రటరీని ఎట్టకేలకు తప్పించారు. ‘పచ్చ’ ఉద్యోగి..పరిధి దాటి’ శీర్షికన ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో రెండు రోజుల క్రితం ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి మున్సిపల్ కమిషనర్ సందీప్ స్పందించారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాల డీజిల్ స్కాంలో పెద్ద మొత్తంలో ఇతను అవినీతికి పాల్పడ్డారని, ఇతని అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన ప్రతి అంశం వాస్తవమని కమిషనర్ చేపట్టిన విచారణలో బయట పడింది. బదిలీపై వెళ్లిన కమిషనర్ కిరణ్కుమార్కు ఇతను పీఏ తరహాలో వ్యవహరిస్తూ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు అన్ని వార్డుల సచివాలయ ఉద్యోగులను బెదిరిస్తూ వచ్చారనే విషయం కూడా కమిషనర్ విచారణలో వెలుగుచూసింది. దీంతో అతన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మున్సిపాలిటీ ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజు బాబుకు బాధ్యతలు అప్పగించారు. ‘మున్సిపాలిటీలో మీ సేవలు ఇక చాలు. సచివాలయానికే పరిమితం కండి’ అంటూ కుటాగుళ్ల–3వ వార్డు సచివాలయానికి పరిమితం చేస్తూ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఆర్ఓ కొండయ్య
ప్రశాంతి నిలయం: నూతన డీఆర్ఓ కొండయ్య మంగళవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర అధికారులను కలిశారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రెవెన్యూ పరంగా మెరుగైన సేవలు అందిస్తామని, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేలా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. 15న పుట్టపర్తికి కేంద్ర మంత్రి రాక పుట్టపర్తి అర్బన్: కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, సీఎం చంద్రబాబు ఈనెల 15న పుట్టపర్తికి రానున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వేదికతో పాటు ప్రజలు కూర్చునే సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. విద్యుత్, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి ● డీఈఓ కిష్టప్ప పుట్టపర్తి: పిల్లల భవిష్యత్కు ప్రభుత్వ పాఠశాలలే పునాది అని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో వాహన ర్యాలీని మంగళవారం ప్రారంభించారు. కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి డీఈఓ వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచిత బోధన అందిస్తామన్నారు. అలాగే విద్యార్థి మిత్ర కిట్లో యూనిఫారం, పుస్తకాలు, స్కూల బ్యాగ్, షూ అందిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందిస్తారని, అలాగే రాగిజావ, కోడిగుడ్లు చిక్కీలు పంపిణీ చేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. టన్ను మామిడి రూ.44 వేలుఅనంతపురం అగ్రికల్చర్: అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.44 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 260 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని బహిరంగ వేలం వేశారన్నారు. అందులో హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.44 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.28 వేలు కాగా పలికాయని వివరించారు. ఇక మల్లికా రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో లక్షలాది మంది నీట్ పరీక్ష రాస్తే ఆ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నిర్వహణలో ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత, సమన్వయం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరీక్ష రద్దుతో లక్షల కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి ఏడాది పేపర్ లీక్ ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. పరీక్ష లీక్కు సంబంధించి ఇంత వరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. కేవలం పరిపాలనా లోపం కాదని ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. – శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
రామగిరి: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం రామగిరి పోలీసుస్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన వడ్డే మర్రిస్వామి అలియాస్ సంకేత కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన ఇతను పలు చోట్ల అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే దేవాలయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ముందుగా భక్తుడి వేషంలో వెళ్లి జనసంచారం తక్కువగా ఉండే ఆలయాలను గుర్తించేవాడు. రాత్రి సమయంలో ఇనుప రాడ్ల సహాయంతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడు. బంగారం, వెండి ఆభరణాలు, హుండీ నగదును అపహరించేవాడు. దొంగిలించిన వెండి వస్తువులను కరిగించి వెండి బిస్కెట్లుగా మార్చి విక్రయించేవాడు. జిల్లాతో పాటు కర్ణాటకలోని పలు దేవాలయాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిపై నిఘా ఉంచిన ఎస్ఐలు టి. ప్రదీప్ రాజ్, ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుంచి 27.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 380 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి బిస్కెట్తో పాటు చోరీలకు వినియోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి సర్కిల్ సీఐ ఎస్ఎం అలీ, ఎస్ఐలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. 27.5, గ్రాముల బంగారం, 380 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం -
విద్యార్థుల డాక్టర్ కలను చిదిమేశారు
● ‘నీట్’ రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల మూడో తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)ను రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. నీట్లో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష ప్రారంభానికి ముందే లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏళ్ల తరబడి సన్నద్ధమై, కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే ఇప్పుడు రద్దు చేశారన్న వార్త విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించింది. ప్రశ్నలు సులువుగా ఉన్నాయి.. పరీక్ష బాగా రాశాం.. మంచి ర్యాంకు వస్తుంది.. ఎంబీబీఎస్ కల నెరవేరుతుందనే ఆశను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చిదిమేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అయితే.. అక్కడ పరీక్షను రద్దు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,534 మంది నీట్ యూజీ రాశారన్నారు.పరీక్ష రద్దు చేయడం సరికాదు -
●తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
గుత్తి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గుత్తిలోని జంగాల కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 20 రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాటర్ ట్యాక్స్ కడుతున్నా ఎందుకు నీటిని సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. తాగునీటిని డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనాలు బారులు తీరాయి. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఒక నమ్మకం.. ఒక అనుబంధం.. ఒక ఆప్యాయత.. ఒక భరోసా.. అందుకే ఆయన్ను చూసేందుకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పామిడి పెన్నానది తీరాన మండుటెండలోనే గంటల తరబడి వేచి ఉండి తమ అభిమాన నాయకుడిని
అనంతపురం/ పామిడి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీబీ) మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు లిఖిత, చైతన్య మిత్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 3 కిలో మీటర్లు.. 35 నిమిషాలు వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కల్లూరులో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పామిడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది. వైఎస్ జగన్ ఉదయం 11:10గంటలకు హెలికాప్టర్లో హెలిప్యాడ్కు చేరుకున్నారు. 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిసెప్షన్ వేదిక వద్దకు బయల్దేరారు. వైఎస్ జగన్ కారుమీద నిలబడి ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన సందోహం నడుమ కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితితో 35 నిమిషాల సేపు ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. పామిడిలో భవనాలు, మిద్దెలు ఎక్కిన ప్రజలు .. జగన్ను చూసి మురిసిపోయారు. జాతీయ రహదారి–44 జనంతో నిండిపోయింది. అన్ని దారులూ పామిడి వైపే అన్నట్లు.. జన సందోహం వెళ్లింది. ఉదయం 7 గంటలకే హెలిప్యాడ్ వద్దకు జనం చేరుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా జగన్ను చూసేందుకు వేచి ఉన్నారు. అడుగడుగునా నీరాజనం పామిడి వీరాంజనేయులు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోగానే అక్కడి పరిసరాలు జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. వైఎస్ జగన్తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 12.20 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరారు. ఆత్మీయ స్వాగతం హెలిప్యాడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంపీ పీవీ మిథున్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకరనారాయణ, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాప్తాడు, తాడిపత్రి, మడకశిర, రాయదుర్గం సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఈరలక్కప్ప, మెట్టు గోవిందరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతీరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ వసీం, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. పామిడిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం ఏడీసీసీబీ మాజీ చైర్పర్సన్ లిఖిత వివాహ రిసెప్షన్కు హాజరు జగన్ను చూసేందుకు తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు హెలిప్యాడ్ నుంచి పామిడి వీరా ఇంటి వరకు నీరాజనమే అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మాజీ ముఖ్యమంత్రి -
యానిమేటర్ భర్త ఘరానా మోసం
బ్రహ్మసముద్రం: ఓ యానిమేటర్ భర్త ఘరానా మోసానికి పాల్పడిన విషయం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎర్ర కొండాపురం గ్రామంలో 16 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. యానిమేటర్గా గ్రామానికి చెందిన అంజలి ఉన్నా ఆమె భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 8 సంఘాలకు చెందిన రూ.3 లక్షలకుపైగా పొదుపు సొమ్మును తన తల్లి తిమ్మక్క, భార్య అంజలి ఖాతాల్లో వేసుకున్నాడు. మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ సంఘాలకు సంబంధించి లావాదేవీలపై వేపులపర్తి యూనియన్ బ్యాంక్లో ఆరా తీయగా శ్రీకాంత్ బాగోతం వెలుగుచూసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బ్రహ్మసముద్రం వెలుగు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండకు చెందిన మోహన్, లలితమ్మ దంపతుల కుమార్తె రేవతి (21)ని ఆమె చిన్నతనంలోనే కళ్యాణదుర్గంకు చెందిన వారి బంధువు శకుంతల దత్తత తీసుకుంది. డిగ్రీ వరకూ చదివించింది. రేవతికి ఇంకా చదవాలనే కోరిక ఉండేది. కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన రేవతి మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అభయాంజనేయుడికి వెండి కవచం వితరణ గుంతకల్లుటౌన్: హనుమాన్ సర్కిల్లో ఉన్న అభయాంజనేయస్వామి మూలవిరాట్కు 3 కేజీల వెండి కవచాన్ని దాతలు వితరణ చేశారు. మంగ ళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బెల్డోన స్వామి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన గౌరీలక్ష్మి, కుమారులు పవన్కుమార్, రవికుమార్, ఆదినారాయణలు వెండి కవచాన్ని అర్చకుడికి అందజేశారు. -
దివ్యాంగ డీలర్కు వేధింపులు
హిందూపురం: వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో ఓ దివ్యాంగ డీలర్పై టీడీపీ నాయకులు కక్ష కట్టారు. హైకోర్టు నుంచి బాధితుడు ఉత్తర్వులు తెచ్చుకున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. హిందూపురం మండలం కగ్గల్లు ఎఫ్పీ షాపు డీలర్ పొట్టి ఆదినారాయణప్ప 18 ఏళ్లుగా డీలర్గా పనిచేస్తున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే స్థానిక టీడీపీ నాయకులు ఇతనిపై కక్ష కట్టారు. రెండేళ్ల క్రితం అక్రమంగా డీలర్షిప్ తొలగించారు. దీనిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లాడు. తన దయనీయ పరిస్థితిని కోర్టుకు తెలిపి డీలర్షిప్నకు తిరిగి అనుమతి తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆగలేదు. గత జనవరిలో మళ్లీ డీలర్ షిప్ తొలగించడంతో తనకు జరిగిన అన్యాయంపై ఆదినారాయణ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతని దీన పరిస్థితిని చూసి డీలర్గా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మే 1 నుంచి 3 వరకు బియ్యం వేయడానికి అనుమతి పొందిన ఆదినారాయణప్ప కార్డు పంచింగ్ మిషన్ల కోసం ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న గ్రామ అధికార పార్టీ నాయకుల ఎదుటనే నారాయణప్పను రెవెన్యూ అధికారి నానా దుర్భాషలాడి అవమానించాడు. ‘ఈ సారి తీసేస్తాం.. దిక్కున్న వారికి చెప్పుకో’ అంటూ బెదిరించాడు. విషయాన్ని ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు స్పందించి ఈనెల 8న కార్డు పంచింగ్ మిషన్ ఇచ్చి బియ్యం పంపిణీ చేయాల్సిందిగా నారాయణప్పకు సూచించారు. నాలుగు రోజుల్లో మళ్లీ.. స్టాక్ను పంపిణీ చేసిన నాలుగు రోజులకే స్టోర్ వద్దకు విజిలెన్సు అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి లోపాలు లేవని తేల్చారు. దీన్ని తట్టుకోలేని స్థానిక అధికార పార్టీ నాయకులు గ్రామంలో తమకు అనుకూలమైన వారితో ఫిర్యాదు చేయించడం గమనార్హం. దీంతో దివ్యాంగుడైన ఆదినారాయణ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఉన్న ఫలంగా డీలర్షిప్ తీసేస్తే కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను వేధిస్తున్న వారిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో కక్ష కట్టిన టీడీపీ నాయకులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా ఆగని వేధింపులు -
వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ధర్మవరం అర్బన్: వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక కార్యదర్శి ఈశ్వరయ్య, సీనియర్ నాయకుడు బీకే ముత్యాలప్ప తెలిపారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులైతే 450 మార్కులకుపైగా ఉండాలని, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 500 మార్కులకు పైగా ఉండాలన్నారు. ఇంటర్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 750 మార్కులు, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 850 మార్కులు తెచ్చుకున్న వారు అర్హులన్నారు. ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, మార్కుల పత్రం 9652800038, 9394798674 ఫోన్ నంబర్లకు వాట్సాప్లో పంపించాలన్నారు. ఈనెల 31న పట్టణంలోని షిరిడీ సాయిబాబా కల్యాణ మండపంలో ప్రతిభా అవార్డులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో వాల్మీకీ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, జెన్నే నాగప్ప, నరసింహులు, చంద్రశేఖర్, నాగరాజు, వెంకటేష్, శివయ్య, పోతలయ్య పాల్గొన్నారు. విమానయానం.. ఆదర్శం లేపాక్షి: ఆ టీచర్ దంపతులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం శేషగిరిబాబు తమ పాఠశాలలో పదో తరగతిలో 550 పైన మార్కులు సాధించే విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని గతంలో మాట ఇచ్చారు. అదేవిధంగా శేషగిరిబాబు భార్య బయాలజీ సైన్సు టీచర్ టీఎన్ మాధవి తాను పనిచేసే చిలమత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి విమాన ప్రయాణం చేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భార్యాభర్తలు తమ తమ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన కే.నాని(574 మార్కులు), ఎం.సుప్రజ (589 మార్కులు)ను మంగళవారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లారు. విమానయానంతో విద్యార్థులను ప్రోత్సహించడం గొప్ప విషయ మని పలువురు వారిని అభినందించారు. వ్యక్తి బలవన్మరణం గుంతకల్లు టౌన్: కుటుంబ కలహాల కారణంగా పట్టణంలోని మోమినాబాద్కు చెందిన కె.రవికుమార్ (36) మున్సిపల్ పాత ఎస్ఎస్ ట్యాంక్లో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మెయిన్రోడ్డు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా తోపుడు బండిని ఏర్పాటు చేసుకుని బొప్పాయికాయలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తున్న రవికుమార్కు భార్య సంధ్య, ఐదుగురు పిల్లలున్నారు. 9వ తేదీ (శనివారం) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్ మంగళవారం ఉదయం పాత రిజర్వాయర్లో శవమై తేలాడు. మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్ తెలియజేశారు. -
బలిపశువులను చేశారు
డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుని ప్రిపేర్ అయ్యాం. ‘నీట్’ పరీక్ష బాగా రాశాం. కీ ఆధారంగా మంచి స్కోరు వస్తుందని అంచనా వేశాం. సీటు వస్తుందని కలలు కంటున్న వేళ ప్రభుత్వం ‘నీట్’ను రద్దు చేసినట్లు ప్రకటించడం చాలా బాధ కలిగించింది. ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయిందని దేశ వ్యాప్తంగా ఆ పరీక్ష రద్దు చేయటం మంచిది కాదు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి విద్యార్థులను బలిపశువులను చేశారు. ఇదెక్కడి న్యాయం? – వడుగూరు అర్షియా, పెద్దవడుగూరు -
డిజిటైడ్లో ఉద్యోగావకాశాలు
పుట్టపర్తి అర్బన్: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ డిజిటైడ్ పూల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, అర్హత కలిగిన అభ్యర్థులు సద్విని యోగం చేసుకోవాలని పుట్టపర్తి సంస్కృతీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ విజయ్ భాస్కర్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 15న కళాశాలలో సంప్రదించాలన్నారు. ముందస్తుగా 9100974544 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యతకు ప్రతిరూపం భారతి సిమెంట్ ధర్మవరం: నాణ్యత, మన్నికకు ప్రతిరూపం భారతి సిమెంట్ అని కంపెనీ టెక్నికల్ హెడ్ ఓబుళరెడ్డి తెలిపారు. ధర్మవరంలో మంగళవారం భారతి సిమెంట్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతుందని వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటించి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్రెడ్డి, టెక్నికల్ ఇంజనీర్ మోతీలాల్నాయక్, డీలర్ చాంద్భాష, పలువురు డీలర్లు పాల్గొన్నారు. ఆలయంలో చోరీ కదిరి అర్బన్: మండల పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. అమ్మవారి కిరీటం, రెండు గొడుగులను భక్తుని అవతారంలో వచ్చిన దొంగ అపహరించాడు. దుండగుడు కారులో వచ్చి మరీ దొంగ తనం చేయడం గమనార్హం. చోరీ విషయమై రూరల్ అప్గ్రేడ్ పోలీస్టేషన్లో సిబ్బంది, అర్చ కులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహం లభ్యం గుమ్మఘట్ట: మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో అదృశ్యమైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.. తాళ్లకెరకు చెందిన మారెన్న, సుమక్క దంపతులకు కుమారుడు ఉమేష్ (14), ముగ్గురు కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించేవారు. తండ్రికి తోడుగా ఉమేష్ గొర్రెలు మేపేందుకు సోమవారం గ్రామ సమీపంలోని బీటీపీ రిజర్వాయర్ దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రిజర్వాయర్లోని ఓ గుంతలోకి ఉమేష్ ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. -
అర్హులకు అందే పరిస్థితి లేదు
సబ్సిడీ ట్రాక్టర్ల పథకం కోసం రైతులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే చందబ్రాబు ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా పథకం అమలుకు అలవిగాని నిబంధనలు పెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడిగిన వారందరికీ సబ్సిడీతో ట్రాక్టర్లు మంజూరు చేసింది. ట్రాక్టర్ పంపిణీ చేసే రోజే సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ ప్రస్తుత నిబంధనల పేరుతో అర్హులకు అందకుండా చేస్తున్నారు. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నిబంధనల మేరకు మంజూరు ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు అందజేస్తాం. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే లాటరీ తీసి జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే నెల చివరి నాటికి యంత్రాలు అందజేసినా సబ్సిడీ మొత్తం జూలై నెలలో అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. – కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు
పెనుకొండ(సోమందేపల్లి): సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు పడ్డాయి. అక్రమంగా మట్టి తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. 15 రోజులుగా మట్టి దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. కొందరు టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ‘మామూలు’గా పోతుండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో పారదర్శకత పాటించాలి ● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రశాంతినిలయం: జిల్లాలో అర్బన్ ఫ్రేమ్ సర్వే (యూఎఫ్ఎస్), గణాంకాల సేకరణలో పారదర్శకత పాటించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, సీపీఓ విజయ్కుమార్, డీపీఓ సమత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. టన్ను మామిడి రూ.40 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో సోమవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 183 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.24 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే తోతాపురి రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు ఉద్యోగావకాశాలు ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు వేతనం ప్రాతిపదికన పనిచేసేందుకు హెవీ లైసెన్స్ కలిగి ఉండి అనుభవం కలిగిన డ్రైవర్లు అర్హులన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, లైసెన్సుతో ఆర్టీసీ డిపోలోని మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఖాళీలు పరిమితంగా ఉండటంతో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. -
వంట ఏజెన్సీలకు ‘స్మార్ట్’ మంట
కదిరి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వండి.. వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న బోజన పథకం కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్గా వేటు వేస్తోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి ఉపాధికి గండి కొట్టే చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి జిల్లాలోనూ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి వస్తే 1,500 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మికులు రోడ్డున పడనున్నారు. గరిష్టంగా 30 పాఠశాలలకు ఒకటి మండల కేంద్రాల్లో ఒకట్రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆ మండలంలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి రూ.55 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా టీడీపీ కార్యకర్తలకే అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా 4 స్మార్ట్ కిచెన్లు నిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖామంత్రి లోకేష్ ఆదేశించారు. వేడి భోజనం ఇక లేనట్లే! జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,159, ప్రాథమికోన్నత పాఠశాలలు 230, ఉన్నత పాఠశాలలు 307 ఉన్నాయి. వీటి పరిధిలో 1,27,104 మంది విద్యార్థులున్నారు. వీరికి 1,438 భోజనం ఏజెన్సీల ద్వారా అప్పటికప్పుడు ఆయా పాఠశాలల్లోనే వేడివేడి భోజనం వండి పెడుతున్నారు. భోజనం నాణ్యతను సైతం అక్కడున్న టీచర్లు రోజూ పరిశీలిస్తున్నారు. కానీ మండల కేంద్రంలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే అక్కడ సిద్ధం చేసిన భోజనాన్ని 5 నుంచి 10 కి.మీ పరిధిలో సగటున 30 పాఠశాలలకు ప్రత్యేక వాహనంలో చేరవేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భోజనం కోసం విద్యార్థులకు పడిగాపులు తప్పవనిపిస్తోంది. చివరి పాఠశాలకు అందేసరికి వేడి భోజనం కాస్తా చల్లారి పోతుంది. అలాగే నాణ్యతపై ప్రశ్నించే అధికారం కూడా టీచర్లకు ఉండకపోవచ్చు. భవిష్యత్లో పాఠశాలలకే కాకుండా అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలతో పాటు హాస్టళ్లకూ స్మార్ట్ కిచెన్ల నుంచే భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడుల రూపురేఖలు మార్చేసిన వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పటిష్టంగా అమలు చేశారు. పిల్లలకు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పటికే చాలా మంది పిల్లలు సర్కారు బడి వీడి, ప్రైవేటు, కార్పొరేట్ బాట పట్టారు. ఇలాంటి తరుణంలో స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల పొట్ట కొట్టే చర్యలకు ప్రభుత్వం దిగడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పాఠశాలలు 2,078 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 1,438 విద్యార్థుల సంఖ్య 1,27,104 ఉపాధ్యాయుల సంఖ్య 8,307 పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా బాబు ‘స్మార్ట్’ ఆలోచన జిల్లాలో తొలివిడతలో 10 స్మార్ట్ కిచెన్లకు ప్రతిపాదనలు ఒక్కొక్కటి రూ.55 లక్షలతో ఏర్పాటు జిల్లాలో రోడ్డున పడనున్న 1,500 మంది కార్మికులు త్వరలో మధ్నాహ్న భోజన ఏజెన్సీలకు మంగళం గోరంట్ల మండలంలోని ఒక ఎంపీపీ స్కూల్లో 23 మంది విద్యార్థులున్నారు. అక్కడ పిల్లలకు ఓ వితంతు మహిళ మధ్యాహ్న భోజనం వండి పెట్టగా వచ్చిన డబ్బుతో తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. చంద్రబాబు సర్కారు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారు. అప్పుడు ఆమె జీవనం దుర్భరంగా మారనుంది. ఈ పరిస్థితి కేవలం ఆమె ఒక్కరిదే కాదు... చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ‘స్మార్ట్ కిచెన్’ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు రోడ్డున పడనున్నారు. -
వాహనం ఢీకొని జింక మృతి
పెనుకొండ: స్థానిక యోగా నరసింహస్వామి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరెడ్డి, అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రెండు రోజల క్రితం రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రోడ్డు పక్కనే పోస్టుమార్టం నిర్వహించి జింక కళేబరాన్ని దహనం చేశారు. ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగికి తీవ్ర గాయాలుధర్మవరం రూరల్: మండలంలోని పోతుకుంట వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగి బి.హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని స్వగ్రామమైన మామిళ్లపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గం మధ్యలో పోతుకుంట వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో కాలు పూర్తిగా విరిగింది. మూగదెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న కోటా స్కూల్ వద్ద తోపుడు బండిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి బేల్దారి పనులకు వెళ్లి రాత్రి ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తుండేవాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్ కారణంగా కాలు మొత్తం వాచిపోయి చీము కారుతోంది. జీవించి ఉన్నప్పుడు తన పేరు కిష్టప్ప అని, కొత్త చెరువు గ్రామమని స్థానికులకు తెలిపినట్లుగా సమాచారం. మృతుని పూర్తి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికఅనంతపురం టౌన్: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లబోతుల వాణి, రాఘవేంద్ర, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకు చెందిన నవీన్నాయక్ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాండురంగారావు, అనంతపురం డీఎస్డీఓ మంజుల అభినందించారు. -
అదనపు అతిథి గృహం ఏర్పాటు చేయండి
లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అదనపు అతిథి గృహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజయవాడలో సోమవారం జరిగిన టూరిజం సమావేశంలో టూరిజం డైరెక్టర్ జయప్ప సూచించారు. ప్రస్తుతమున్న అతిథి గృహంలోని 10 గదులు పర్యాటకులకు సరిపోవని, దీంతో పర్యాటకులు హిందూపురం, బాగేపల్లి ప్రాంతాలకు వెళ్లి బస చేస్తున్నారని వివరించారు. మరో 10 గదులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎనిమిది గదుల నిర్మాణానికి నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై డైరెక్టర్ జయప్ప మాట్లాడుతూ.. పక్కనే నంది విగ్రహం ఉండడంతో గదుల నిర్మాణానికి పురావస్తు శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. అయితే టూరిజం గెస్ట్ హౌస్ వెనుక భాగంలో అదనపు గెస్ట్ హౌస్ నిర్మించేందుకు అనువైన స్థలం ఉందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. త్వరలో స్థలాన్ని పరిశీలించి పర్యాటకులకు అనుకూలంగా మంచి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో ఈడీ పద్యావతి, డైరెక్టర్లు పాల్గొన్నారు. పర్యాటక శాఖ చైర్మన్కు ౖ డెరెక్టర్ జయప్ప వినతి -
ఏసీబీ వలలో నగర పాలక ఉద్యోగులు
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్చౌత సోమవారం అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు... అనంతపురంలోని గుత్తి మార్గంలో భారత్ ట్రేడర్స్ పేరుతో రఘుప్రసాదరావు ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు కోరుతూ నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శానిటరీ సర్టిఫికెట్ జారీకి నగర పాలక సంస్థ అధికారులు రూ.30 వేలు డిమాండ్ చేయడంతో అంత మొత్తం తన వల్ల కాదని, చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం రూ.25 వేలు ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ సందీప్చౌతాకు ఫోన్ చేయగా... నగర పాలక సంస్థ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉండాలని తెలిపాడు. ఆ తర్వాత డ్వామా కార్యాలయం వద్దకు రమ్మని తెలిపాడు. దీంతో రఘుప్రసాద్ డ్వామా కార్యాలయం వద్దకెళ్లి అక్కడ వేచి ఉన్న సందీప్కు రూ.25 వేలు ఇస్తుండగా... అప్పటికే అక్కడ కాపుకాసిన అనంతపురం–కర్నూలు ఏసీబీ బృందాలు మెరుపు దాడి చేసి పట్టుకున్నాయి. సందీప్ను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాను లంచం డిమాండ్ చేయలేదని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ నరసింహులు సూచన మేరకే డబ్బు తీసుకున్నానని సందీప్ తెలిపాడు. దీంతో ఏసీబీలోని మరో బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ చాంబర్కు వెళ్లి నరసింహులును అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలోనూ సోదాలు ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ఓ నరసింహులు ఫ్లాట్తో పాటు అనంతపురంలోని పాతూరులో ఉన్న సందీప్ చౌతా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అధికారి, ఉద్యోగికి సంబంధించిన ఫోన్పే నంబర్లు కూడా పరిశీలించారు. వారి ఫోన్పేలకు చాలా మంది కాంట్రాక్టర్లు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. సార్ కొత్తగా పైళ్లెంది ఏసీబీ అధికారులకు దొరికిపోగానే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌతా తప్పించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఎక్కడ తన చేతులు కడిగిస్తారోనని పదే పదే చేతులను తన చొక్కాకు, ప్యాంటుకు తుడుచుకున్నాడు. చివరికి ఏసీబీ అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వగానే ఏడుపు మొదలెట్టాడు. ‘సార్...ఈ మధ్యే నాకు పైళ్లెంది. నన్ను అరెస్ట్ చేస్తే నా జీవితం నాశనమవుతుంది సార్’ అంటూ లబోదిబోమన్నాడు. ఇన్చార్జ్ ఎంహెచ్ఓ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నానంటూ గగ్గోలు పెట్టాడు. నేనేమైనా ఉగ్రవాదినా? కాంట్రాక్టర్లు, కొందరు మీడియా ప్రతినిధులు, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ సిబ్బంది అందరూ ఉండగానే నరసింహులు చాంబర్లోకి ఏసీబీ అధికారులు దూసుకెళ్లారు. బీఎల్ నరసింహులు అంటే మీరేనా అంటూ ఆరా తీసి ఏసీబీ అని చెప్పిన అధికారులు అతని సెల్ఫోన్ లాక్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. తీరా సందీప్చౌతా గురించి అడగగానే తెల్లమొహం వేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం శానిటరీ సర్టిఫికెట్ జారీకి రూ.25 వేలు డిమాండ్ -
వినూత్నంగా సత్యసాయి కార్మికుల నిరసన
బత్తలపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం ఏడవ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జిల్లాలో ప్రజల దాహార్తి తీరుస్తున్న పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే సమ్మె చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతకు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పాల్గొన్నారు. -
పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దుదాం
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గణేష్ కూడలి నుంచి ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు అధికారులు, విద్యార్థులతో కలసి 330 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మొక్కలకు మనం రక్షణ ఇస్తే అవి మనకు రక్షణ ఇస్తాయన్నారు. అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఈఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ -
నేడు పామిడికి వైఎస్ జగన్
పామిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పామిడికి విచ్చేయనున్నారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ ఎం. లిఖిత వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.10 గంటలకు పామిడిలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. 11.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి బయల్దేరి 11.35 గంటలకు రిసెప్షన్ వేదిక వద్దకు చేరుకుంటారు. 11.50 గంటల వరకు రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులు ఎం.లిఖిత, ఎ.చైతన్యమిత్రను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పామిడి నుంచి హెలికాప్టర్లో తిరుగుపయనమవుతారు. హెలీప్యాడ్ సిద్ధం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పామిడి – కల్లూరు మార్గంలో ఉన్న పామిడి వీరా ఫంక్షన్ హాలు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు పరిశీలించారు. అలాగే పామిడి వీరాంజనేయులు గృహ సమీపంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదికను కూడా పరిశీలించారు. వారితో పాటు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, పామిడి సీఐ శివశంకర్నాయక్ హెలిప్యాడ్, రిసెప్షన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అత్యవసర సేవల్లో ‘రక్షక్’ కీలకం
పెనుకొండ రూరల్: ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో రక్షక్ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కియా పోలీస్ స్టేషన్కు సంఘు హైటెక్ కంపెనీ వారు సీఎస్ఆర్ నిధులతో రక్షక్ వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ‘రక్షక్’ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. కియా యాజమాన్యం జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లకు సీఎస్ఆర్ నిధులతో వాహనాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘూ హైటెక్ పరిశ్రమ ప్రతినిధులు చున్సీబ్ కిమ్, డీఎస్పీ నరసింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు రాఘవయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కానీయొద్దు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులను ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ‘ప్రజాసమస్యల పరిష్కారి వేదిక’ నిర్వహించారు. వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సూచనలు చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో సీఐ బొజ్జప్ప, డీటీఆర్సీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర రక్షణ మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బ్రాహ్మణపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలిని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సీఎం, కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు తలెత్తరాదన్నారు. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నుంచి రూట్ మ్యాప్లను పక్కాగా సిద్దం చేయాలన్నారు. నిరంతర విద్యుత్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు, ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కంటితుడుపు జీఓలు వద్దు
అనంతపురం అగ్రికల్చర్: కంటితుడుపు జీఓలు కాకుండా న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు తేల్చిచెప్పారు. పీఏసీఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దగ్ధం చేసే కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జీఓ 322 ప్రతులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ... తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు జేఏసీ పిలుపు మేరకు గత ఫిబ్రవరిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టామని గుర్తు చేశారు. ఆ సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. నేడు కంటితుడుపుగా జీఓ 322 విడుదల చేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ జీఓలో ఎక్కడేగానీ ఉద్యోగులకు న్యాయం చేకూరే అంశం కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేలా మరో జీఓ విడుదల చేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన ధర్నాలో పీఏసీఎస్ ఉద్యోగులు -
విద్యార్థికి కలెక్టర్ అభినందన
ప్రశాంతి నిలయం: అంగ వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన విద్యార్థిని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అభినందించారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా 25 మంది విద్యార్థుల బృందం గత నెల 25న 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ను చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వీరిలో జిల్లాలోని తనకల్లుకు చెందిన పసల ప్రసాద్ ఉన్నారు. తిరిగి వచ్చిన ప్రసాద్ సోమవారం కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ సమయంలో శాలువా కప్పి కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కడపల శంకర్, పుల్లన్న తదితరులు ఉన్నారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతికనగానపల్లి: విద్యుత్ షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్ధలాపురం గ్రామానికి చెందిన మధుకుమార్గౌడ్ నూతన గృహ నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో ఇంటి పనులకు నీటి సరఫరా చేసేందుకు సింగిల్ ఫేజ్ మోటర్ను ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం ఉదయం మధుకుమార్ గౌడ్ కుమారుడు చరిత్గౌడ్ (8) మోటార్ ఆన్ చేస్తుండగా షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలుఅనంతపురం కల్చరల్ : తిరుపతిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా చేనేత, జౌళీశాఖ అధికారి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిప్లోమా కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశముంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. మరింత సమాచారం కోసం 93999 36872, 90102 43054 లో సంప్రదించవచ్చు. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుపుట్టపర్తి అర్బన్: మండలంలోని మార్లపల్లి గంగమ్మ ఆలయం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు.. పెడపల్లికి చెందిన మక్తర్ అల్లుడు అల్లాబకాష్, సుబ్బరాయనిపల్లికి చెందిన శంకరప్ప కుమారుడు రమేష్ ఇద్దరూ సోమవారం రాత్రి 7.30 గంటలకు ద్విచక్ర వాహనంపై కియా పరిశ్రమకు బయలుదేరారు. మార్లపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే ఆ మార్గంలో వెళుతున్న కారులో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
53 గ్రామ పంచాయతీల్లో ‘వాల్టా’
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 53 గ్రామపంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం (వాల్టా–2002) అమలు చేయనున్నారు. ఈ పంచాయతీల పరిధిలో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో తాగునీటి అవవసరాల కోసం మాత్రమే బోరుబావుల తవ్వకం చేయాలంటూ జీఓలో పేర్కొన్నారు. వాల్టా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో అత్యధికంగా భూగర్భజలాలు, నీటి వినియోగం (ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్) ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో 258 గ్రామ పంచా యతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు ఉండగా.. శ్రీకాకుళంలో 76, శ్రీసత్యసాయి జిల్లాలో 39, పల్నాడులో 20, అనంతపురంలో 14, వైఎస్సార్ కడపలో 10, చిత్తూరు జిల్లాలో 8 చొప్పున మొత్తం 258 గ్రామ పంచాయతీల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో గ్రామాలివే... అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి,నరసాంబూది, పి.బ్యాడిగెర, అమడగూరు మండలం కర్ణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, చిలమత్తూరు మండలం హుస్సేనాపురం, గాండ్లపెంట మండలం సామచేనుబైలు, చామాలగొంది, గాండ్లపెంట–1, జీనులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుల పల్లి–1, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె–2, కిరికెర, కొట్నూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి,కాకి,ఎం.రాయాపురం, రొళ్ల–1, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం–1, బొంతలపల్లె, చీకటిమానిపల్లి, దిగువమందలపల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుం గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి చేర్చారు. కొత్తగా బోరుబావుల తవ్వకం నిషేధం శ్రీసత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు -
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు
ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ సోమవారం కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. టన్ను మామిడి రూ.35 వేలుఅనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో ఆదివారంం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.35 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 40 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే హిమాయత్ రకం టన్ను గరిష్టంగా రూ.27 వేలు, కనిష్టంగా రూ.9 వేలు, సరాసరిన రూ.18 వేలు, మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికధర్మవరం అర్బన్: జాతీయస్థాయిలో జరిగే బాస్కెట్బాల్ పోటీలకు విద్యార్థిని కిరణ్మయి ఎంపికై నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకూ పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగే 76వ నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల బాస్కెట్బాల్ జట్టుకు కిరణ్మయి ఎంపికై ందని పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో ఈనెల 20 వరకూ జరిగే కోచింగ్ క్యాంపునకు విద్యార్థిని వెళ్తోందని చెప్పారు. జాతీయస్థాయిలో జరిగే పోటీల్లోనూ కిరణ్మయి ప్రతిభ చూపి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ విజేత పశ్చిమ గోదావరి జట్టుకదిరి అర్బన్: పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ జూనియర్ బాలికలు, బాలుర చాంపియన్ షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. -
కొండెక్కితే బాదుడే !
అబ్బుర పరిచే రహదారి.. కనువిందు చేసే కోట అందాలు.. ఆహ్లాద పరిచే వాతావరణం.. అందుకే పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు ఉమ్మడి అనంతపురం వాసులే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా టోల్ ట్యాక్స్ అంటూ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో పర్యాటక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి, పుట్టపర్తి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పెనుకొండ కోటకు పూర్వ వైభవం తెచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు రూ.20 కోట్లు వెచ్చించి కొండపై వరకు రోడ్డు కూడా నిర్మించారు. ఇన్నాళ్లూ రూపాయి ఖర్చు లేకుండా పర్యాటకులు పెనుకొండ కోటను సందర్శించే వారు. అయితే తాజాగా అటవీశాఖ ఆధ్వర్యంలో టోల్గేట్ ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండలో టోల్ బాదుడుపై ప్రజలు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతంలో కిట కిట పెనుకొండ కోటను సందర్శించేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా బెంగళూరు నుంచి వేలాది మంది పర్యాటకులు బైక్లు, కార్లలో వస్తుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండపైకి రోడ్డు వేసినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అంతకు ముందు వందల సంఖ్యలో వెళ్లే పర్యాటకులు రోడ్డు పూర్తయ్యాక వేల సంఖ్యకు చేరారు. అయితే తాజాగా టోల్ గేట్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానికులతో పాటు పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ.. పెనుకొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణ మంత్రిగా పని చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అప్పట్లోనే పెనుకొండ కోట అభివృద్ధి చేయాలని భావించారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడి రూ.20 కోట్లు వెచ్చించారు. అయితే గతంలో సుంకం వసూలు చేయలేదు. కానీ పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సవిత టోల్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, పర్యాటకుల గురించి ఆలోచించకుండా టోల్ ప్రారంభోత్సవంలోనూ పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి సవిత ఇలాకాలో ‘టోల్’ దందా పెనుకొండ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్ వసూలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లతో అభివృద్ధి టోల్ వసూలుపై సర్వత్రా విమర్శలు టోల్ వసూలు దుర్మార్గం గత ప్రభుత్వంలోనే కొండపైకి రోడ్డు పెనుకొండ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే కాకుండా, వాణిజ్య, వ్యాపారంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పెనుకొండ కొండ రోడ్డు కారణంగా సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం దుర్మార్గం. దీని వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. వెంటనే టోల్ ట్యాక్స్ వసూళ్లను రద్దు చేయాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన పెనుకొండను పర్యాటక ప్రాంతంగా మార్చాలనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నో చర్యలు చేపట్టాము. ఇందులో భాగంగానే రూ.20 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మించాము. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అభివృద్ధిని కొనసాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండటం సరికాదు. కొండ ఎక్కే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం అన్యాయం. – మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
బత్తలపల్లి: మండల పరిధిలోని పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన గోనుగుంట్ల ఆంజనేయులు కుమారుడు గోనుగుంట్ల దేవేంద్రనాయుడు (29) ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి దుకాణం మూసి వేసి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు దాటిన తరువాత కల్వర్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతని తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లగా.. చికిత్స ఫలించక ఆదివారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. లేపాక్షిలో కుక్క స్వైర విహారంలేపాక్షి: లేపాక్షిలోని బస్టాండు ఆవరణంలో ఆదివారం ఓ కుక్క స్వైర విహారం చేసింది. 12 మందిని కరిచి గాయపరిచింది. వెంటనే వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 మందికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసి మందులు పంపిణీ చేశారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు కుక్కను కొట్టి చంపేశారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి వెంకటచిరంజీవికి సూచించారు. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణబత్తలపల్లి: తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం బత్తలపల్లిలోని సత్యసాయి వాటర్ ట్యాంకు వద్ద సత్యసాయి కార్మికులు నల్ల బ్యాడ్జ్లు ధరించి ఆరవ రోజు సమ్మె కొనసాగించారు. నిరసన శిబిరం వద్దకు సత్యసాయి బోర్డు ఎస్ఈ ప్రభాకర్రావు చేరుకొని కార్మికులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు అనుకూలంగా ప్రకటన చేశారని, సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. అయితే, కార్మికులు మాత్రం తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేయడంతో ఆయన వెనుదిరిగి వెళ్లారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు. ఐషర్ను ఢీకొన్న లారీ ●16 మంది భక్తులకు గాయాలు మదనపల్లె టౌన్: ఐషర్ను లారీ ఢీకొనడంతో 16 మంది భక్తులకు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 60 మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో బయలుదేరారు. మదనపల్లె బైపాస్లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గర ఆదివారం వేకువజామున ఐషర్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు.. రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర, అశ్వని, లక్ష్మీదేవి, రమాశ్రీ, అరుణ, పుల్లమ్మ, గంగాధర్, వెంకటరాయుడు, కుల్లాయమ్మ, శివశంకర్, లక్ష్మి, రాజా, లక్ష్మీదేవి, భవ్యశ్రీ మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి తెలిపారు. -
లోప భూయిష్టంగా భూసేకరణ
● వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి విమానాశ్రయ సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరిస్తున్న భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణపల్లి, బీడుపల్లి రెవెన్యూ గ్రామాలలో వివిధ వర్గాలకు చెందిన రైతులకు ఒకటి, రెండు ఎకరాల భూమి ఉందన్నారు. గతంలో కూడా సత్యసాయి విమానాశ్రయం కోసం కొంత మేరకు భూములు తక్కువ ధరలకు ఇచ్చారన్నారు. మళ్లీ నేడు రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారన్నారు. అందులో 70 శాతం గిరిజనుల కుటుంబాలకు సంబంఽధించి భూమి ఉందని, నూతన జిల్లా ఏర్పాటు చేయడంతో ఎకరం భూమి కోటి రూపాయలకు పైగా పలుకుతోందన్నారు. అలాంటి భూములను రెవెన్యూ అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. ఇందులో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకత లేకుండా పోయిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారంతోపాటు ఇంటి స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ అద్దె బస్సు ఓడీచెరువు(నల్లమాడ): ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నల్లమాడ మండలంలో జరిగింది. వివరాలు.. పుట్టపర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రయాణికులతో కదిరి నుంచి కొత్తచెరువుకు వెళుతుండగా నల్లమాడ సమీపంలోని షాదీమహల్ వద్ద అదుపు తప్పింది. బస్సు బ్రేకులు పడకపోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పొలాల్లోకి మళ్లించాడు. కొద్దిదూరం వెళ్లాక బస్సు ఆగిపోయింది. ఈ క్రమంలో భయపడిన కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల ద్వారా బయటకు దూకారు. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు కండక్టర్ నాగేంద్రనాయక్ తెలిపాడు. వడదెబ్బతో యువరైతు మృతి ఓడీచెరువు(నల్లమాడ): నల్లమాడ మండలం మస్కవంకపల్లిలో ఓ యువరైతు వడదెబ్బతో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... మస్కవంకపల్లికి చెందిన చాగలేటి రామచంద్ర(37) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. తనకున్న రెండెకరాల్లో వేరుశనగ సాగుచేసిన రామచంద్ర...రెండురోజుల క్రితం పంటకు పురుగుల మందు కొడుతూ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబీకులు నల్లమాడలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా కోలుకోలేక ఆదివారం ఉదయం రామచంద్ర మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. మూగ మహిళపై అత్యాచారయత్నం పుట్లూరు: కూలీ పనులకు వెళ్లిన ఓ మూగ మహిళపై అరటి తోట యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ మహిళ ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అరటి తోటలోకి కూలీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో మహిళపై గాలి రమణారెడ్డి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మ కడుపులోనే హత్య!
● ధర్మవరం మండలానికి చెందిన దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మూడోసారి మగబిడ్డ కావాలనుకున్నారు. సదరు మహిళ గర్భందాల్చగానే భర్త ఓ స్కానింగ్ సెంటర్ను సంప్రదించాడు. వారు చెప్పిన అడ్రెస్కు వెళ్లగా.. స్కానింగ్ మాత్రమే అయితే రూ.6 వేలు, ఆడబిడ్డ అయితే తీసేసేందుకు మరో రూ.20 వేలు అంటూ ధరల పట్టిక చెప్పారు. స్కానింగ్లో అమ్మాయి అని తేలగానే మొత్తంగా రూ.30 వేలు తీసుకుని అబార్షన్ చేశారు. .. ఇలా జిల్లాలో నిత్యం బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ అని తెలిస్తే చాలు పిండాన్ని కరిగించేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండగా... గర్భిణులు ఒప్పుకోకపోయినా కుటుంబీకుల బలవంతంతో కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం, వివిధ రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలో నుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ఊరూరా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా చాలా ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అయితే తీసేయండి అని దంపతులు సహకరిస్తున్న దాఖలాలు వెలుగు చూస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత గర్భిణి ఒప్పుకుంటే.. అబార్షన్ చేసేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గర్భంలోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు నిత్యం ఆస్పత్రులు తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ లింగ నిర్ధారణ చేస్తున్న సెంటర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేసి కోడ్ భాషలో ఆడ, మగ అనేది గర్భిణులకు తెలియజేస్తున్నారు. మగ పిల్లాడు అయితే ‘6’ అని.. ఆడ పిల్ల అయితే ‘9’ అనే నంబర్లు వినియోగిస్తూ సమాధానం ఇస్తున్నారు. ముందుగానే ఫోన్లో సంప్రదించి.. బస్టాండు చేరుకోవాలని చెబుతారు. అక్కడికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి.. కేవలం గర్భిణిని మాత్రమే తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక తర్వాత ఫోన్ కాల్ చేసి కోడ్ భాషలో రిపోర్టుల గురించి వివరిస్తారు. గుట్టు చప్పుడు కాకుండా.. గ్రామస్థాయిలో ఆర్ఎంపీలు, చిన్న క్లినిక్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు ఆర్ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురు చూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. పుట్టబోయేది ఆడబిడ్డ అనేది తెలిస్తే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పంపించి అబార్షన్ చేయిస్తున్నారు. ‘ఆ’ పేరు చెబితే కడుపులోనే ఖతం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు డబ్బు తీసుకుని అబార్షన్ చేస్తున్న సిబ్బంది ల్యాబ్లు, నర్సింగ్ హోమ్లపై దృష్టి సారించని అధికారులు తనిఖీలు చేస్తున్నాం గర్భస్థ లింగ నిర్ధారణ ప్రక్రియ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. పోలీసు ఇతర శాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులిస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
‘గుక్కెడు నీళ్లివ్వలేని స్థితిలో బాబు సర్కారు’
కదిరి: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీళ్లిచ్చే స్థితిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లేదని మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ఏమైంది బాబూ అని ప్రశ్నించారు. ఆదివారం వారు కదిరిలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా స్వగృహానికి విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములను రీ సర్వే చేసి, క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. చంద్రబాబు రైతులకు సకాలంలో పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందలేక పోతున్నారని, బిడ్డ పెళ్లికి ఎకరం భూమి అమ్మాలన్నా ఇబ్బంది పడుతున్నారని వారు వాపోయారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కానీ వారికి న్యాయబద్ధంగా రావాల్సిన డీఏలు గానీ, పీఆర్సీ గానీ.. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, నిరుద్యోగులకు రూ. 3 వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తావు బాబూ అని ప్రశ్నించారు. అంతకు మునుపు వారిరువురినీ అత్తార్ ఘనంగా సన్మానించారు. -
వర్షం కోసం వింత ఆచారం
అగళి: వరుణుడి కరుణ కోసం గ్రామాల్లో వింత ఆచారాలను పాటిస్తున్నారు. కప్పలు, గాడిదల పెళ్లిళ్లు, ఊరి నుంచి వలస వెళ్లడం, బండరాయిపై నైవేద్యాన్ని నాలుకతో నాకడం లాంటివి చేస్తుంటారు. ఇందులో భాగంగానే అగళి మండలం నరసంబూదిలో ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పిల్లలు చెరువులోని మట్టిని సేకరించి దాన్ని విగ్రహంగా తయారు చేశారు. గ్రామంలోని ఇంటింటికీ వరుణ దేవుడు (మండ్రయ) విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతిమ ఎత్తుకున్న వారిపై నీరు పోసి ధాన్యాన్ని సేకరించారు. కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చెట్టు కింద కొలువుదీర్చి ధాన్యంతో భోజనాలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మట్టి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్న పిల్లలు -
తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వొద్దు
పుట్టపర్తి టౌన్: తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వకుండా విద్యార్థులు కష్టపడి చదవాలని ఆర్టీఓ సువర్ణ సూచించారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాల సామాజికవర్గానికి చెందిన విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమానికి ఆర్డీఓ సువర్ణ, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కోట్ల గంగాధర్, ఉపాధ్యక్షుడు జూటూరు మహేంద్ర, జిల్లా అధ్యక్షుడు శంకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చదువుతోనే దేనినైనా సాధించవచ్చన్నారు. చిన్నతనంలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కలలు గన్న సమాజ నిర్మాణానికి విద్య ఏకై క మార్గమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు మూర్తి, రామాంజనేయులు, చెరుకూరి గంగులయ్య, గోవిందు, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, మనోహర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆర్డీఓ సువర్ణ సూచన -
భక్తిశ్రద్ధలతో గంగమ్మకు జ్యోతులు
గాండ్లపెంట: మండల కేంద్రమైన గాండ్లపెంటలో గంగమ్మ తిరునాల వైభవంగా ముగిసింది. మూడోరోజు భక్తులు అమ్మవారికి బోనాలు, జ్యోతులను సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు. ఉత్సాహంగా ఉట్ల తిరునాల ఆలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ఉట్ల తిరునాల నిర్వహించారు. ఉట్టిని అందుకునేందుకు యువకులు బృందాలుగా ఏర్పడి పోటీపడ్డారు. చివరకు నాయనివారిపల్లికి చెందిన యువకుల బృందం ఉట్టిని అందుకుంది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన గంగమ్మ తిరునాల ముగిసింది. -
అ‘పూర్వ’ కలయిక
కదిరి అర్బన్: మండల పరిధిలోని పట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2007–08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. తమకు పాఠాలు నేర్పిన గురువులను శాలువలు, పూలమాలలతో పూర్వ విద్యార్థులు సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఓడీ చెరువులో.. ఓడీచెరువు: ఓడీచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989–90 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 36 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. పాఠశాల ప్రాంగణంలో ఆటల పోటీలతో మైమరిచిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు అందుబాటులో లేకపోవడంతో వారిని ఫోన్లో పలకరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బొడ్డు నాగరాజు, అదే పాఠశాలలో ప్రస్తుతం పీడీగా పనిచేస్తున్న గోపినాథ్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గౌడ్, మామిళ్లకుంట్లపల్లికి చెందిన రామస్వామిరెడ్డి, మమత, రవీంద్రరెడ్డి, సుధాకర్, బాలరాజు, ఇనగలూరు లక్ష్మన్న, రామకృష్ణ, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
సొంత ఖర్చుతో నీరందిస్తే అడ్డుకుంటారా?
ముదిగుబ్బ: యువకులు సేవాభావంతో ముందుకు వచ్చి తమ సొంత ఖర్చులతో నీరందిస్తే అడ్డుకుంటారా అంటూ పంచాయతీ కార్యదర్శిపై మహిళలు తిరగబడిన ఘటన ఆదివారం మద్దన్నగారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని మద్దన్నగారిపల్లిలో 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. పంచాయతీ తరఫున మూడు బోర్లు వేయించినా మోటార్లను బిగించకపోవడంతో కొద్దిరోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామానికి చెందిన రఘు, మునీంద్ర, హర్ష, బాబులు తమ సొంత ఖర్చుతో రెండు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేశారు. అయితే ఆర్డబ్ల్యూఎస్ జేఈ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఆ యువకులకు ఫోన్ చేసి ఎవరి అనుమతితో నీరు సరఫరా చేస్తున్నారంటూ బెదిరించినట్లు సమాచారం. గ్రామస్తులకు స్వచ్ఛందంగా నీరందిస్తే బెదిరించడమేమిటని యువకులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి వచ్చి ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. స్థానిక మహిళలు ఒక్కసారిగా కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు స్వచ్ఛందంగా సమస్యను పరిష్కరిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏమిటంటూ నిలదీయడంతో కార్యదర్శి అక్కడి నుంచి జారుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉందని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించు కోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిపై తిరగబడ్డ మహిళలు -
రైతులకు ఫ్రీహోల్డ్ కష్టాలు
ముదిగుబ్బ: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా రైతులకు ఫ్రీహోల్డ్ కష్టాలు మొదలయ్యాయి. ఫ్రీహోల్డ్ భూముల వివరాలు వన్బీ అడంగల్లో రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అలాగే రీ సర్వే చేసిన భూములకు కూడా కొన్ని సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతల కష్టాలు చెప్పనలవిగా మారాయి. దిక్కుతోచని స్థితిలో.. రైతులు పంటలు సాగు చేసుకునే నిమిత్తం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి భూమి వివరాలు తెలిపే వన్బీ అడంగల్ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన వన్బీ అడంగల్ ఆన్లైన్లో రావడం లేదు. ‘మీ సేవ’ వారు తెల్లకాగితంపై వివరాలు రాసిస్తున్నారు. ఆ కాగితంపై వీఆర్ఓ, తహసీల్దార్తో సంతకం చేయించుకున్న అనంతరం రైతులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బంది వెబ్ల్యాండ్లో భూముల వివరాలు పరిశీలన చేస్తున్నారు. వారికి ఆయా భూముల వివరాలు కనిపించకపోవడంతో పంట రుణ పరిమితి పెంచడం లేదు. దీనికితోడు రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రూ.లక్ష తిరిగి బ్యాంకుకు చెల్లించమని సిబ్బంది చెబుతుండడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇక.. రీ సర్వే జరిగిన గ్రామాల్లోనూ ఒకే సర్వే నంబర్లో అన్నదమ్ముల భాగాలు వన్బీ అడంగల్లో కనిపించకపోవడం గమనార్హం. మెలిక పెట్టి.. కష్టాల్లోకి నెట్టి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల అనుభవంలో ఉన్న భూమిని క్రయ విక్రయాలు చేసుకునేందుకు జీవోను విడుదల చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భూముల వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా హోల్డ్లో పెట్టారు. విచారణ తరువాత భూములను విడుదల చేస్తామని మెలిక పెట్టి రెండేళ్లు గడుస్తున్నా ఎటూ తేల్చకుండా రైతులను అవస్థలకు గురి చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు మండిపడుతున్నారు. వన్బీలో కానరాని భూముల వివరాలు రీ సర్వేలో తప్పులతోనూ ఇబ్బందులు నానా కష్టాలు పడుతున్న అన్నదాతలు పట్టించుకోని చంద్రబాబు సర్కారు ముదిగుబ్బ మండలంలో క్రాప్ లోన్ వివరాలిలా.. ని‘బంధనాల’తో కష్టాలు పంట రుణాలు ఒక బ్యాంక్లో మాత్రమే తీసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతుండడం అన్నదాతలను మరింతగా కుంగదీస్తోంది. గతంలో చాలా మంది రైతులు సొసైటీల్లో పాసుపుస్తకం జిరాక్స్లతో పంట రుణాలను తీసుకున్నారు. నేడు ఒక రైతుకు ఒక బ్యాంక్లో మాత్రమే పంట రుణం ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని, పౌరాణిక విశిష్టతను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక భక్తి రస కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి భక్తులు రెండోరోజు ఆదివారం సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సత్యసాయి యూత్ సంగీత విభావరి నిర్వహించింది. ఈ సందర్భంగా వారు చక్కటి భక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం ‘చిత్త రోగానికి చికిత్స ఎక్కడ ’అన్న పేరుతో నృత్య నాటిక నిర్వహించారు. సత్యసాయి తన జీవిత గమనంలో భక్త కోటికి తలెత్తే ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించిన విధానాన్ని వివరించారు. అనంతరం అదిలాబాద్ భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
‘రక్షక్’ వాహనాల ప్రారంభం
హిందూపురం: పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణంలో ఎస్పీ సతీష్కుమార్ ఏడు నూతన ద్విచక్ర వాహనాలకు పూజ చేసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత, పోలీసుల తక్షణ స్పందన, రాత్రి పహారా బలోపేతమే లక్ష్యంగా రక్షక్ వాహనాలను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తారన్నారు. హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. రూ.15 లక్షల విలువ గల ఏడు వాహనాలను దాతలు అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే ప్రత్యేక యాగశాలలో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో కలశ ప్రతిష్ట, గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ మన్యుసూక్తపారాయణ హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తమలపాకులతో లక్షార్చన చేసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
డీఎస్పీని భిక్షమడిగారని స్టేషన్కు తరలించారు!
లేపాక్షి: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేసి జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచడం చర్చనీయాంశమైంది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ రాగా, ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. ఆయనకు అసౌకర్యం కలిగించారనే కారణంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నామని, తమను ఇలా స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి ఎవరూ దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులుంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
ఆరుగురు కిడ్నాపర్లకు రిమాండ్
● భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆరుగురిపై రౌడీషీట్ ● ఇన్నోవా కారు, టూవీలర్, ప్రామిసరీనోట్ల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప ధర్మవరం అర్బన్: భూ వివాదంలో రైతును కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ఆరుగురు కిడ్నాపర్లను రిమాండ్ పంపినట్లు ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. శనివారం ఆయన స్థానిక వన్ టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరుగురు కిడ్నాపర్లపై రౌడీషీట్ ఓపెన్ చేశామని తెలిపారు. 140(2), 308(5) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రైతు కిడ్నాప్..నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. భూవివాదంలో కిడ్నాప్.. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతు ముసుగు నారాయణస్వామి 1997 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన కంద్యాల నారాయణతో 1.65 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే కంద్యాల నారాయణ కుమారుడు కంద్యాల రవీంద్రనాయుడు మాత్రం ముసుగు నారాయణస్వామి కొనుగోలు చేసిన భూమిపై తనకు హక్కు ఉందంటూ నారాయణస్వామితో తరచూ గొడవపడేవాడు. ఈ భూ వివాదంపై ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఈనెల 8వ తేదీన ఆర్డీఓ కోర్టుకు రైతు ముసుగు నారాయణస్వామి రావడంతో కంద్యాల రవీంద్రనాయుడు, అతని కుమారుడు కంద్యాల అరుణ్కుమార్, అతని స్నేహితులు మార్కెట్వీధికి చెందిన నారా మధుసూదన్నాయుడు, వైఎస్సార్కాలనీకి చెందిన తులచూరి ప్రదీప్కుమార్, పోతుకుంట బీసీ కాలనీకి చెందిన పసుపులేటి ఉదయ్, బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి గ్రామానికి చెందిన బిల్లే హరి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న రైతు నారాయణస్వామిని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. మామిళ్లపల్లి మీదుగా రామగిరి మండలం శ్రీహరిపురం వద్దకు తీసుకెళ్లి రైతును విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ‘‘భూమి ఇస్తావా... లేక రూ.50 లక్షలు ఇస్తావా..ఏదో ఒకటి డిసైడ్ చేయకపోతే చంపేస్తాం’’ అని బెదిరించి ప్రాంసరీనోట్లపై బలవంతంగా సంతకాలు చేయించారు. రైతును కిడ్నాప్ చేశారన్న సమాచారం రాగానే ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్ఐ ఉమాదేవి అప్రమత్తాయరన్నారు. సిబ్బందితో కలిసి వెళ్లి శ్రీహరిపురం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని రైతును విడిపించారు. అలాగే కిడ్నాపర్ల నుంచి ఏపీ03బీయూ 1177 నంబరు గల ఇన్నోవా కారు, ఏపీ39 ఎల్వి 3446 నంబరు గల టూవీలర్, ఐదు ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురు కిడ్నాపర్లను కోర్టు ఎదుట హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
అన్న క్యాంటీన్ సిబ్బంది కొడుతున్నారు
● అన్నం తక్కువగా పెడుతున్నారన్నందుకు దాడి చేశారు ● బాధితుల ఆవేదన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ ధర్మవరం: ‘అన్నం ఎందుకు తక్కువ పెడుతున్నారు. కూరలు కూడా నాసిరకంగా ఉన్నాయి’ అంటూ ప్రశ్నించినందుకు నిరుపేద కూలీలపై అన్న క్యాంటీన్ సిబ్బంది దాడి చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. క్యాంటీన్ సిబ్బందితో బాధితులు వాగ్వాదం చేస్తుండగా, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. వివరాలు.. ధర్మవరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు ఇటీవల రాత్రి వేళ నిరుపేద కూలీలు వెళ్లారు. ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో క్యాంటీన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అన్న క్యాంటీన్ నిర్వాహకుడు కూలీలపై రెచ్చిపోయాడు. కర్రతో దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్న క్యాంటీన్ సిబ్బందిని వివరణ కోరగా తాము ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. శభాష్ సాయిగౌతం ● ఐఎఫ్ఎస్కు ఎంపికై న శ్రీ సత్యసాయి పాఠశాల పూర్వ విద్యార్థి ప్రశాంతినిలయం: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థి కే.సాయిగౌతం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. దేశస్థాయిలో 113వ ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన జిల్లాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. సాయిగౌతం తండ్రి వినాయక ప్రసాద్ విద్యుత్ శాఖలో డీఈగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయన తల్లి సుశీల గృహిణి కాగా సోదరుడు ప్రవీణ్ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆర్థోపెడిక్ సర్జన్గా పని చేస్తున్నారు. సాయి గౌతం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూను 3 సార్లు ఎదుర్కోవడం గమనార్హం. పట్టు వదలకుండా ప్రయత్నించిన ఆయన తాజాగా ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. 100 మందికి పైగా సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లకు సాయి గౌతం మార్గదర్శనం చేయడం గమనార్హం. చిన్నారిని మింగిన స్విమ్మింగ్ పూల్ పావగడ: స్విమ్మింగ్ పూల్లో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన పావగడలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కన్మాన్ చెరువు వీధిలో నివసిస్తున్న రిజ్వాన్ కుమారుడు తాహిర్ (13) శనివారం స్థానిక వీరమ్మనహళ్లి గేటు వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యాసంస్థల బస్సుల్లో తనిఖీలు ముమ్మరంపుట్టపర్తి టౌన్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి కరుణసాగర్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్కూల్బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుల పరిశీలనకు ఐదు తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా, డ్రైవర్ లైసెన్స్ వంటి పత్రాలతో పాటు లోపాలు, స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఫైర్ డిటెక్షన్పై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. లోపాలు ఉంటే విద్యాసంస్థల యజమానులకు నోటీసులు జారీ చేసి గడువు లోపు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నట్లు వివరించారు. మహిళపై టీడీపీ కార్యకర్తల దాడికనగానపల్లి: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ భూలక్ష్మి కనగానపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గ్రామానికి చెందిన తిప్పేస్వామి, అతని భార్య భూలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దీంతో పాటు జీవనోపాధికి సొంతంగా ఒక ఆటో కూడా పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ఆటోను వారి ఇంటి పక్కనే రోడ్డుపై నిలిపి ఉంచగా, స్థానిక కాలనీకి చెందిన టీడీపీ కారకర్తలు లక్ష్మిదేవి, ముత్యాలు, లక్ష్మేంద్ర, సుబ్బరాయుడు, రామలీలు వచ్చి రాజకీయ కక్షతో వీరితో గొడవకు దిగారు. తర్వాత భర్త తిప్పేస్వామి ఇంటి వద్ద లేని సమయంలో వచ్చి భూలక్ష్మిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం బాధితురాలు కనగానపల్లి పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. -
గ్రామాలకు అందని జలం
బకాయి చిట్టాలో జీతం...ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాకు సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ ఓ వరం. 1995లో ప్రజల దాహార్తిని గుర్తించిన సత్యసాయి బాబా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్కు జీవం పోశారు. 1997లో ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చిత్రావతి, పీఏబీఆర్ నుంచి నీటిని తీసుకుని శుద్ది చేసి ప్రత్యేక పైప్లైన్లు, సంపుల ద్వారా ఉమ్మడి అనంత పురం జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 870 గ్రామాలకు నీటిని అందజేస్తున్నారు. మహోన్నత ఆశయంతో నాడు సత్యసాయి ప్రారంభించిన ఈ పథకం కాస్త.. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో నిర్వీర్యమైంది. సకాలంలో జీతాలు అందక రెండేళ్లుగా పలు దఫాలుగా కార్మికులు ఆందోళన బాట పడుతూ వచ్చారు. నిరవధిక సమ్మె చేపట్టిన ప్రతిసారీ ఎంతో కొంత చెల్లించడం... ఆ తర్వాత చేతులెత్తేస్తుండడంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు రోజుల క్రితం మరోసారి కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జీతాలు చెల్లించే వరకూ సమ్మె విరమించబోమంటూ భీష్మించారు. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష బకాయి సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్లో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 572 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదు నెలలుగా కార్మికులు జీతాలు అందడం లేదు. ఈ క్రమంలో కార్మికుడికి రూ.లక్ష వరకూ బకాయి పేరుకుపోయింది. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కీలకమైన పండుగలు, పర్వదినాల్లోనూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వం కనీసంగానూ స్పందించలేదు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. ఫలితంగా 870 గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది. వేసవిలో ఎందుకింత నిర్లక్ష్యం? తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవిలో తాగునీటి కోసం తరచూ ఏదోక గ్రామంలో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో సత్యసాయి కార్మికుల దశల వారీ సమ్మెతో పది రోజులుగా గ్రామాల్లో నీరు అందకుండా పోయింది. ఐదు రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు జీతాలు చెల్లించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఐదు నెలలుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు అందని జీతాలు అప్పులతో కుటుంబాల పోషణ ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి ఉమ్మడి జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ పరిధి మొత్తం గ్రామాలు : 870 మొత్తం కార్మికులు : 572 మంది జీతం బకాయిలు : ఐదు నెలలు ఒక్కో కార్మికుడికి చెల్లించాల్సిన బకాయి : రూ.లక్ష -
‘కియా’ అనుబంధ పరిశ్రమ కార్మికుడి మృతి
పెనుకొండ రూరల్: ‘కియా’ అనుబంధ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... వైఎస్సార్ కడప జిల్లా అట్లూరి మండలం బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు(22) ఆరు నెలలుగా ‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఎప్పటికలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగా...పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఉన్నట్టుండి భారీ యంత్రం తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు రామాంజనేయులును హుటాహుటీన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, పరిశ్రమలోని ఆపరేటర్ అజాగ్రత్త వల్లే కార్మికుడు రామాంజనేయులు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ‘కియా’ ఎస్ఐ రాఘవయ్య తెలిపారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. ‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తూ మృతి చెందిన రామాంజనేయులు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పౌరసరఫరాలశాఖ గోడౌన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్మికులకు పరిశ్రమల్లో భద్రత లేకుండా పోతోందన్నారు. కార్మిక శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలమీదకు రాకుండా పరిశ్రమలలో అత్యాధునిక సెన్సార్ వంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలన్నారు. రామాంజనేయులు మృతి ఘటనలోనూ ఆ పరిశ్రమ నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలు కూడా చాలా కంపెనీల్లో లేవన్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు ఆయా కంపెనీల్లో తనిఖీలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబావలి, వెంకటరాముడు, నారాయణ, నాగభూషణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ ఫ్యాక్టరీలోనే దుర్మరణం -
ట్రాన్స్‘ఫార్మర్’ కష్టాలు
పుట్టపర్తి అర్బన్: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకుని స్వేదం చిందించి పంటలు సాగుచేసే రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సాగునీరు ఇబ్బందులతో రూ.లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసుకున్నా...కరెంటు కనెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. విద్యుత్శాఖలోని కొందరు అవినీతి అధికారుల వల్ల రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండుతుండగా కన్నీటిపర్యంతమవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేలు అదనం.. వ్యవసాయబోరుకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. ముందుగా విద్యుత్ లైను లాగాలి. ఇందుకు విద్యుత్ స్తంభాలతో పాటు పలు పరికరాలు అవసరమవుతాయి. వీటిని ధర్మవరంలోని ఓ ప్రైవేటు వ్యాపారి వద్ద అధికారులు బలంవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. ఇక ట్రాన్స్ఫార్మర్ కోసం ఒక్కో రైతు నుంచి రూ.20 వేల వరకూ డిపాజిట్ వసూలు చేస్తున్నారు. దీనికి అదనంగా ఒక్కో రైతు నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించినా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి మాత్రం రోజుల వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు ఇచ్చి పంపుతున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. ఇటీవల రొద్దం మండలానికి చెందిన పలువురు రైతులు విద్యుత్ అధికారుల తీరుపై కలెక్టర్ శ్యాం ప్రసాద్కు ఫిర్యాదు చేసి ఆందోళన చేయడంతో అదే వారంలో కొంత మందికి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. రొద్దం మండలంలోని రొద్దం, కొత్తూరు దొడగట్ట తదితర గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండుతుండగా.. ఇటీవల విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెకమండేషన్ ఉంటే వెంటనే... కొత్తచెరువు మండలంలో ట్రాన్స్ఫార్మర్ల కోసం పలువురు రైతులు డిపాజిట్లు చెల్లించారు. కానీ రెకమండేషన్ ఉన్న కొందరు రైతులకే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. కొత్తచెరువు ఏఈ కేవలం టీడీపీ మద్దతుదారులకు రాత్రి వేళల్లో దొంగగా పరికరాలు అందజేస్తూ అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మామూళ్లు సైతం రూ.50 వేలపైన ఇస్తే వెంటనే అన్ని సమకూరుతాయి. లేదంటే కొన్ని పరికరాలు ఇచ్చి తక్కినవి పెండింగ్ పెడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల మంజూరు ఆలస్యంపై విద్యుత్ శాఖ డీఈ శివరాములును వివరణ కోరగా... త్వరలోనే అందరికీ అందజేస్తామని చెప్పారు. డిపాజిట్ కట్టినా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయని అధికారులు నెలల తరబడి విద్యుత్శాఖ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ పంటలు ఎండుతున్నా పట్టించుకోని వైనం మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రం వెంటనే మంజూరు -
కసాపురంలో నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ, మన్యుసూక్త పారాయణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. రెండో రోజు సోమవారం ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజను నిర్వహించి తీర్థప్రసాదాల పంపిణీ చేయనున్నారు. చివరిరోజు మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి లక్ష పుష్పాలతో అర్చన చేసి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగించనున్నారు. -
భిక్షమడిగినందుకు స్టేషన్కు పిలిచారు!
లేపాక్షి: లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ వచ్చారు. ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. అయితే ఆయనకు అసౌకర్యం కలిగించారంటూ వారిని స్థానిక పోలీసుస్టేషన్కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము కటిక పేదరికం కారణంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తమను ఇలా స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. వృద్ధాప్యంలో ఆదుకునే వారు లేక భిక్షాటన చేసి పొట్ట నింపుకుంటున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. ఇందులో వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. డీఎస్పీకి అసౌకర్యం కల్గించారంటూ ఖాకీల చర్యలు వృద్ధ మహిళలను గంటల తరబడి స్టేషన్లో ఉంచడంపై సర్వత్రా విమర్శలు -
కిడ్నాప్ కలకలం
● కిడ్నాపర్ కదిరి ఎమ్మెల్యే కందికుంట అనుచరుడిగా గుర్తింపు ● ఓడీ చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ● పోలీసుల అదుపులో కిడ్నాపర్ షాబాజ్ కదిరి/ఓడీచెరువు: ఓడీ చెరువు మండలం బాబాసాహెబ్పల్లెలో శనివారం కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామస్తులు ఒక్కటై ప్రతిఘటించారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతలోగా కిడ్నాపర్లు కొందరు పారిపోగా, ప్రధాన నిందితుడు కదిరికి చెందిన వేముల షాబాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతను కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్తో దిగిన ఫొటోలను బట్టి ఆయన అనుచరుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు మహబూబ్బాషా కథనం ప్రకారం... కదిరి–మదనపల్లి రోడ్డులో నాగిరెడ్డిపల్లి సమీపాన మహబూబ్బాషాకు 1.68 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఇటీవల కదిరి ఎమ్మెల్యే కందికుంట అనుచరుడిగా భావిస్తున్న వేముల షాబాజ్కు రూ.30 లక్షలకు విక్రయించాడు. రూ.15 లక్షలు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేయించాడు. మిగిలిన రూ.15 లక్షలు ఇవ్వగానే రిజిష్టర్ చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేయించాలని మహబూబ్బాషాను రెండు,మూడు సార్లు షాబాజ్ బలవంత పెట్టాడు. తనకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్కు వస్తానని, లేదంటే మీరు అడ్వాన్స్గా ఇచ్చిన రూ.15 లక్షలు వాపసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముందే మాట్లాడుకుని రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధం చేశారు. షాబాజ్తో పాటు మరికొందరు ఒక వాహనంలో వెళ్లి మహబూబ్బాషాను బలవంతంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా వారు బాబాసాహెబ్పల్లెకు వెళ్లి అతన్ని బలవంతంగా ఎత్తుకెళ్లాలని ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో షాబాజ్ పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. బాధితుడు మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ సీఐ శ్రీనివాసులు తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్తకూడదు ● యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకూడదు. ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతు పనులు ఉంటే వెంటనే చేయించండి..ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లండి..పల్లెల్లో నీటి సరఫరా మరింత మెరుగు పరచండి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ వన్ యాప్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ రిపోర్టులను రోజూ అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. నీటి కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేటు బోర్లను వినియోగించుకోవాలన్నారు. పైప్లైను, మోటర్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. క్లోరినేషన్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మురళీధర్, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. టన్ను మామిడి రూ.32 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శనివారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.32 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 358 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.32 వేలు, కనిష్టంగా రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. తోతాపురి రకం టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.15 వేలు పలికాయని, మల్లికా రకం టన్ను గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు వెల్లడించారు. -
చతికిల బడి
నాడు–నేడు కింద సుందరంగా రూపుదిద్దుకున్న ఓడీ చెరువు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలపుట్టపర్తి: ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘ప్రైవేట్’కు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేస్తోంది. గత జగన్ సర్కార్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1,45,000 మంది విద్యార్థులు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 1,02,500 మంది విద్యార్థులు మిగిలారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరికలు పూర్తిగా పడిపోయాయి. 163 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే ఎంతగా చతికిలబడ్డాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల పునఃప్రారంభానికి నెలు రోజులే మిగిలి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు 1వ తరగతి ప్రవేశాల కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. జగన్ హయాంలో మహర్దశ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఓ వెలుగు వెలిగాయి. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. బడులన్నీ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు అందజేశారు. క్రమం తప్పకుండా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ‘జగనన్న గోరుముద్ద’తో నాణ్యమైన భోజనం అందించారు. వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల ఇంటి వద్దనే చిక్కీలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అప్పట్లో ప్రవేశ పెట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో న్యూ అడ్మిషన్’ బోర్డులు కనిపించా యంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రకరకాల కొర్రీలతో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులను తగ్గించేశారు. కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. సర్వత్రా ఆందోళన చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా క్రమేపీ కనుమరుగువుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 2,074 ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రభుత్వ బడులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్లలోనే చాలా పాఠశాలలు మూతపడ్డాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల సంఖ్య 1,965కు పడిపోనుందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో రాబోవు రోజుల్లో పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సర్కారు బడులకు చంద్రగ్రహణం 163 పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు నిల్ కొత్త చేరికలపై ఎలాంటి చర్యలూ తీసుకోని చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన ప్రభుత్వ బడులు జిల్లాలో వివరాలిలా.. నియోజకవర్గం పేరు 1వ తరగతిలో విద్యార్థులు చేరని పాఠశాలల సంఖ్య పుట్టపర్తి 25 ధర్మవరం 18 కదిరి 47 హిందూపురం 12 పెనుకొండ 18 మడకశిర 28 రాప్తాడు 15 మొత్తం 163 టీచర్లపైనా ఒత్తిడి.. చంద్రబాబు ప్రభుత్వం టీచర్లపైనా ఒత్తిడి పెంచు తోంది. సాధారణంగా పాఠశాలల ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి విద్యార్థులను పాఠశాలలో చేర్చాలని కోరడం జరుగుతుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా శిక్షణలు, బదిలీల పేరుతో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరకుండా కావాలనే చంద్రబాబు ఇలా చేస్తోందని, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలలో చేరే విధంగా పెద్ద కుట్రకు తెరలేపిందనే విమర్శలున్నాయి. -
రూ.100 కోట్ల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను
సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు రూ.100 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పంజాబ్కు చెందిన వారికి అమ్మి, ఆ తర్వాత ఓ ప్రైవేటు కాలేజీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత రైతులు ఆ భూమి తమదేనని కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. దీంతో ఫిర్యాదు చేసిన రైతులను మంత్రి అనుచరులు బెదిరించినట్లు తెలిసింది. మంత్రి అండదండలు ఉండటంతో కబ్జాదారుల ఆగడాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో తొలగించి.. ఆ తర్వాత బెదిరించి.. సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమి కరణం రామప్పగారి కొండప్ప, కరణం నానెప్ప గారి వెంకటరామప్ప అనే ఇద్దరికి సంబంధించినది. 1987లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం (17–1406, 18–4106) ఆ భూమిని 39 మంది పేద రైతులకు పంచి పెట్టారు. నిబంధనల ప్రకారం ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూమిని ఎవరూ కొనకూడదు, అమ్మకూడదు. కానీ, మంత్రి సవిత అనుచరులు ఈ భూమిని రైతుల నుంచి కాజేసి ఓ ప్రైవేటు కాలేజీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి కొంత మొత్తం ముట్టజెప్పి పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.అమ్మడానికి ముందుకు రాని రైతులను బెదిరించారు. ఆ రైతుల భూముల వివరాలను ఆన్లైన్లో తొలగించారు. ఇప్పటికే కొన్ని మ్యుటేషన్లు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ‘తిరిగి భూమి పొందే అవకాశం లేదు. ఇచి్చనంత తీసుకుని సంతకాలు పెట్టాలి’ అంటూ కొందరు టీడీపీ నేతలు రైతులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు కలెక్టర్ను ఆశ్రయించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితమూ లేదు.కాలేజీకి అమ్మి కమీషన్ తీసుకోవాలనిల్యాండ్ సీలింగ్లో ఉన్న 97.5 ఎకరాలను పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత వారి నుంచి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి అమ్మి రూ.కోట్లలో కమీషన్ తీసుకోవాలని టీడీపీ నాయకులు ఈ భూ దందాకు తెరలేపారు. మంత్రి సవిత అండ చూసుకుని అధికారులపై కూడా పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ సీలింగ్ భూమిని విక్రయించకూడదు. అయినా ఈ భూమిని కొనడమే కాకుండా, కొంత భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎవరి ప్రోద్బలంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారనేది సస్పెన్స్గా మారింది. -
దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం!
‘ప్రభుత్వం మాది. ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి.. చూద్దాం’ అంటూ అధికారులకే సవాల్ విసురుతున్నారు కొందరు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు సాగిస్తున్న ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సహజ వనరులపై కన్నేసిన వారు చెరువులు, వాగులు, వంకలతో పాటు చివరకు ప్రభుత్వ భూముల్లోని ఎర్రమట్టినీ వదలడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో సహజ వనరుల దోపిడీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేల్లలో చియ్యేడు, పూలకుంట, మన్నీల, కృష్ణమరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి భారీగా గ్రావెల్, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోలేకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ఆస్తిగా భావించాల్సిన సహజ వనరులను చేజిక్కించుకున్న కొందరు.. వాటిని రూ.కోట్ల విలువైన అక్రమ వ్యాపారంగా మార్చేశారు. స్థానికుల ఫిర్యాదులు బుట్టదాఖలు గతం నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ కిమ్మనకుండా ఉండిపోయారని, తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులు కాస్త బుట్టదాఖలవుతున్నాయని అంటున్నారు. రేయింబవళ్లు టిప్పర్లతో గ్రావెల్, ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో చిన్నపాటి జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమినీ వదలని వైనం తాజాగా రెండు రోజుల క్రితం కృష్ణమరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 90/3 లో జగనన్న కాలనీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా మట్టిని తవ్వడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో మట్టిని తవ్వి, ఇటుకలపల్లి సమీపంలో డంప్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలోని ప్రధాన సూత్రధారులు తమ వెనుక రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఉన్నారంటూ వారి పేర్లు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కూడా బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మట్టితరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు, విజిలెన్స్, భూగర్భ గనుల శాఖ అధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్, ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్చగా సహజ వనరుల దోపిడీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అటుగా కన్నెత్తి చూడని అధికారులు ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన సమయంలో నామమాత్రపు చర్యలు -
ముగ్గురు హోంగార్డులపై వేటుకు రంగం సిద్ధం!
గుత్తి: స్థానిక పీఎస్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు హోంగార్డులపై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని అనంతపురం హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యభిచార నిర్వాహకులతో సన్నితంగా ఉంటూ అవినీతి, అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో హెడ్ క్వార్టర్స్ను నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. వీఆర్వో సస్పెన్షన్ తాడిపత్రి రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వీఆర్వో రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ నెల 2న జారీ చేసినట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఓ రైతుకు చెందిన భూమిని ఆన్లైన్లో ఎక్కించేందుకు గత నెల 29న వీఆర్వో రామకృష్ణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అశ్వవాహనంపై శ్రీవారు రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్వేట ఉత్సవం, అశ్వవాహనోత్సవం కనులపండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వేంకటరమణస్వామి దర్శనమిచ్చారు. రాయదుర్గం రెడ్డి సంక్షేమ సంఘం, ఆరెకటిక, నాయీబ్రాహ్మణ, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, సాయంత్రం మయూర వాహన సేవలు ఉంటాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
బాబోయ్ ఇదెక్కడి చోద్యం!
పుట్టపర్తి టౌన్: రోడ్డు నిర్మాణ పనుల్లో గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి కాంట్రాక్టర్ శ్రీకారం చుట్టాడు. దీనికి రోడ్లు భవనాల శాఖ అధికారులు వత్తాసు పలికారు. సాధారణంగా రోడ్డు నిర్మించాక రెన్యువల్ పనులు ఐదేళ్ల పాటు చేస్తారు. ఈ క్రమంలో పాత రోడ్డు మీద తారు, బిటుమిన్తో కొత్త లేయర్ వేస్తుంటారు. అయితే పుట్టపర్తిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయి. గత ఏడాది నవంబర్లో వేసిన రోడ్డును పూర్తిగా పెకలించి అవశేషాలను పక్కన పరుస్తూ మధ్యలో కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి కొత్తగా వేసిన రోడ్డుకు పక్కన గ్రావెల్ పరిచి చదును చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ చేపట్టిన పనులను అధికారులు చూస్తూ మిన్నకుండి పోయారు. పట్టుమని ఏడు నెలలు తిరక్కుండానే భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది నవంబర్లో రూ.2.20 కోట్ల వ్యయంతో సత్యసాయి సూపర్ ఆస్పత్రి నుంచి బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి క్రాస్ మీదుగా గణేష్ కూడలి వరకూ తారు రోడ్డు వేసే పనిని ఓ కాంట్రాక్టర్కు రోడ్లు భవనాల శాఖ అప్పగించింది. ఈ పనులు కొద్ది మేర మిగిలి ఉన్నాయి. ఇక్కడ వరకూ అంతా బాగున్నా... ఈ నెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో మరోసారి తారు రోడ్డు వేసేందుకు అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టాడు. కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును పిక్కింగ్ చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా మొత్తం తారు రోడ్డును పెకలించేశాడు. అనంతరం దానిని ముక్కలుగా చేసి కొత్త రోడ్డుకు పక్కగా పరిచేశాడు. వాస్తవానికి వాహనాలు దిగి, ఎక్కేందుకు వీలుగా కొత్త రోడ్డు ఎత్తుకు సరిపడేలా గ్రావెల్ పరచాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా తారు కంకర ముక్కలు పరిచేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఖర్చు తగ్గించుకునే క్రమంలో కాంట్రాక్టర్ పెడదారి పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నూతన రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేసి చదను చేయించాలని స్థానికులు కోరుతున్నారు. కొత్త రోడ్డు నిర్మాణంలో పాత రోడ్డు అవశేషాలు నిబంధనలకు విరుద్ఢంగా పనులు కాంట్రాక్టర్ పనితీరుపై అవాక్కవుతున్న ప్రజలు -
కవి మాణిక్యం ఇషాక్కు సింగపూర్లో సన్మానం
పుట్టపర్తి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కవి మాణిక్యం ఇషాక్కు సింగపూర్లో ఘన సన్మానం లభించింది. సింగపూర్ విద్య అధ్యయనంపై ఈ నెల 2న పలువురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. ముగింపు రోజున సింగపూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ)లో జరిగిన కార్యక్రమంలో తాను రాసిన ‘మాణిక్య శతకం’ పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఆవిష్కరింపజేశారు. ఇషాక్ రాసిన పాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయనతో పాటు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన 37 మంది ఉపాధ్యాయులతో పాటు ఎస్సీఈఆర్టీ అధికారులు వెంకటరమణ, మహేశ్వర్రెడ్డి, జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు జాబిలి చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్కుమార్కు ఆ అర్హత లేదు
కదిరి: ‘‘కిరణ్కుమార్కు మన్సిపల్ కమిషనర్గా ఉండే అర్హత లేదు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కదిరి కమిషనర్గా కొనసాగిస్తూ ఆదేశాలిస్తే హార్టికల్చర్ శాఖ అభ్యంతరం చెప్పాలి. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ కమిషనర్గా హార్టికల్చర్ ఏడీని నియమించడం సరికాదు. ఆయన డిప్యుటేషన్ కూడా చెల్లదు’’ అంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కదిరి మున్సిపల్ కమిషనర్గా కిరణ్కుమార్ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, ఆయన నియామకాన్ని రద్దు చేయాలని గతంలోనే శివశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి వి.సుజాత కీలక వ్యాఖ్యలు చేశారు. హార్టికల్చర్ ఏడీగా ఉన్న కిరణ్కుమార్ను డిప్యుటేషన్పై కదిరి మున్సిపల్ కమిషనర్గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కదిరి మున్సిపాలిటీలో ఈయన హయాంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే కిరణ్కుమార్ అదనంగా పొందిన జీత భత్యాలను సైతం తిరిగి రాబట్టాలని ఆదేశించారు. ఒకవేళ మళ్లీ ఆయననే కదిరి మున్సిపల్ కమిషనర్గా నియమిస్తే హైకోర్టు తలుపు తట్టవచ్చని పిటిషనర్ శివశంకర్కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. కాగా, ఇప్పటికే కిరణ్కుమార్ను కదిరి కమిషనర్ బాధ్యతలనుంచి తప్పించి, మాతృశాఖకు పంపించేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కొత్త కమిషనర్గా అజయ్? కదిరి మున్సిపల్ కమిషర్గా ఉన్న కిరణ్కుమార్ను తప్పించి ఆయన స్థానంలో ఇక్కడే ఏఈగా ఉన్న సందీప్కు కమిషనర్గా పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అండదండలున్నాయని, మళ్లీ తానే కమిషనర్గా వస్తానని కిరణ్కుమార్ ధీమాగా ఉన్నా.. హైకోర్టు ఆదేశాలతో ఆయన ఇక్కడ తట్టా, బుట్టా సర్దుకోవాల్సిందే. కాగా కొత్త కమిషనర్గా ఆడిట్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న అజయ్ కుమార్ రావచ్చని విశ్వసనీయ సమాచారం. కదిరి మున్సిపల్ కమిషనర్ విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం కిరణ్నే మళ్లీ నియమిస్తే కోర్టు తలుపు తట్టాలని పిటిషనర్కు సూచన -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన వడ్డె కిష్టప్ప, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్ (15) ఈతకని వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. గుంతకల్లులోని ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని, వేసవి సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ శివారున ఉన్న బావిలోకి ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి చేరుకున్న ప్రవీణ్ అక్కడే పూడికలో ఇరుక్కుపోయాడు. ఎంత సేపటికీ బయలకు రాకపోవడంతో కంగారు పడిన స్నేహితుల సమాచారంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే బావిలో దిగి బాలుడిని వెలికి తీసి ఆగమేఘాలపై మాజీ ఎంపీపీ రామచంద్ర ద్విచక్ర వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ (ఫైల్) -
లంచం కేసులో పీఆర్ ఏఈకి ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్: సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంబుక్లను ప్రాసెస్ చేసి బిల్లు మంజూరు చేయడానికి లంచం తీసుకున్న కేసులో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండారు చిన్నపుల్లయ్యకు కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... 2018 సంవత్సరంలో అమడగూరు మండలం సీతిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఎంబుక్లను ప్రాసెస్ చేసి బిల్లుల మంజూరుకు అప్పటి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిన్నపుల్లయ్య (ప్రస్తుతం రిటైర్డ్) రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటనారాయణపల్లికి చెందిన లక్ష్మీపతి 2018 అక్టోబర్ 8న అనంతపురం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటుండగా చిన్న పుల్లయ్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసు విచారణ అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య తీర్పు వెలువరించారు. చిన్నపుల్లయ్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. జరిమానా డబ్బులు చెల్లించలేకపోతే అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. జరిమానా మొత్తంలో రూ.2 లక్షలను ఫిర్యాదుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ముద్దాయిని కర్నూలు శివారులోని జిల్లా జైలుకు తరలించారు. -
చదువు మానేయలేక.. బాలిక ఆత్మహత్య
గార్లదిన్నె: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి
గోరంట్ల: విద్యుత్ షాక్కు గురై తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పాలసముద్రం నుంచి కదిరి వైపుగా ఖాళీగా శుక్రవారం బయలుదేరిన కంటైనర్ గోరంట్ల సమీపంలోకి చేరుకోగానే ఏఎన్కే డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు పక్కన ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో పైనున్న విద్యుత్ తీగలు తగిలి కంటైనర్కు విద్యుత్ ప్రసరించి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే కిందకు దిగి కాలుతున్న టైర్లపై నీరు చల్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తమిళనాడుకు చెందిన ప్రదీప్ (27)గా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ కేసుల్లో నిందితుడికి రిమాండ్ గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయం, సాదులవాండ్లపల్లిలోని బొగాదమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని భక్తుల కానుకలను అపహరించిన కేసులో నిందితుడు కరుణాకర్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుమతి తెలిపారు. తలుపుల మండలం మామిళ్లపల్లికి చెందిన కరుణాకర్రెడ్డి.. ఈ నెల 1న రెండు ఆలయాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు వివరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించి శుక్రవారం కదిరిలోని కోర్టు రోడ్డులో తచ్చాడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పాము కాటుతో రైతు మృతి కనగానపల్లి: మండలంలోని తల్లిమడుగుల గ్రామానికి చెందిన రైతు ఈడిగ వన్నూరప్ప (53) పాముకాటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య యల్లమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన పొలం గట్టుపై తిరుగుతుండగా పాము కాటేసింది. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకుందని భావించిన ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత నోటి నుంచి బురుగు వస్తుండడంత గమనించిన కుటుంబసభ్యులు ఆగమేఘాలపై ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటుతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చైన్ స్నాచర్ అరెస్ట్ శింగనమల(నార్పల): ఈ నెల 5న నార్పలలోని సుల్తాన్పేటలో చైన్స్నాచింగ్కు పాల్పడిన బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన రాయల తరేష్ని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు నార్పల పీఎస్ ఎస్ఐ సాగర్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళలకు కత్తి చూపి బెదిరించి, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న సుల్తాన్పేటలో ఒంటరిగా వెళుతున్న నంద్యాల నరసమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
ఏడాదిగా తిప్పుతున్నారు
నా భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన పేరుమీద ఉన్న పాసుబుక్కు నా పేరుమీద మార్చాలని ఏడాదిగా తిరుగుతున్నా. మాకు 6 ఎకరాలంటే కేవలం 4 ఎకరాలు మాత్రం 1–బీలో ఎక్కించారు. కానీ పాసుబుక్కు మాత్రం ఇవ్వలేదు. మిగిలిన రెండెకరాలు 1–బీలో కూడా నమోదు చేయలేదు. బ్యాంకులో అప్పు తీసుకుందామని పోతే పాసుబుక్కు అడుగుతున్నారు. – శ్యామలమ్మ, పులిమివాండ్లపల్లి, నల్లచెరువు మండలం రైతుల ఉసురు తగలక తప్పదు ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. వైఎస్ జగన్ సర్కార్ క్యూఆర్ కోడ్తో ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా పాసుపుస్తకం ఇచ్చింది. దానిపై జగన్ ఫొటో ఉందనే ఒకే ఒక్క కారణంతో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రీ సర్వే విషయంలో గగ్గోలు చేసిన చంద్రబాబు.. చివరకు జగన్ను అనుసరించక తప్పలేదు. –ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ ప్రతి రైతుకు ఇస్తాం రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. తప్పులున్న వాటిని సరిదిద్దేందుకు కొన్నిచోట్ల వెనక్కు తీసుకున్నాం. కొత్త పాసుపుస్తకాలు చైన్నెలో ప్రింట్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే రైతులకు అందజేస్తాం. భూమి ఉన్న ప్రతి రైతుకూ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు అందిస్తాం. – మౌర్య భరద్వాజ్, జాయింట్ కలెక్టర్ -
టన్ను మామిడి రూ.52 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.52 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 420 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.52 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.35 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి కాయలు టన్ను గరిష్టంగా రూ.48 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు పలికాయని తెలిపారు. ఇక హిమాయత్ రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ వెల్లడించారు. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అనంతపురం: ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ కింద అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ (ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2026) ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 90.60 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 91.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 1,541 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 1,389 మంది (90.14 శాతం), అమ్మాయిలు 736 మంది రాయగా, 674 మంది (91.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 122 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 107 మంది (87.70 శాతం), అమ్మాయిలు 74 మంది రాయగా, 72 (97.30 శాతం) మంది అర్హత సాధించారు. ఎంజేపీ స్కూళ్లలో ప్రవేశాలు ప్రశాంతి నిలయం: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తొలివిడతలో 5వ తరగతిలో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు సంబంధిత పాఠశాలలో అడ్మిషన్ పొందాలని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జమున బాయి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు తమ వెంట అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9440111302 నంబరులో సంప్రదించాలన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
పరిగి: మండలంలోని శీగిపల్లికి చెందిన ఈడిగ శ్రీనివాసులు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామనికి చెందిన బోయ అనితను 2007లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... వివాహం అనంతరం శ్రీనివాసులు తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటూ అక్కడే పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. దీంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3న దంపతులిద్దరూ శీగిపల్లికి వచ్చారు. అదే రోజు అనిత బెంగళూరుకు తిరిగి వెళ్లింది. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి పైనున్న గదిలో పడుకుంటానంటూ కుటుంబసభ్యులకు తెలిపి శ్రీనివాసులు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 10 గంటలైనా కిందకు దిగి రాకపోవడంతో తల్లి వెళ్లి తలుపు తట్టింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. అప్పటికే లుంగీతో ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తల్లి ఈడిగ రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మొదటి హత్యను బయటపెట్టిన రెండో హత్య
● దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలనాలు రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆగ్రహానికి లోనైన ఆదినారాయణ టవల్తో రాధ మెడ బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఆదినారాయణ ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు కూచి సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతున్న ఆదినారాయణను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచలనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం తెలుసుకున్న భర్త రవిచంద్రనాయుడు ఇద్దరినీ మందలించడంతో రాధ, ఆదినారాయణ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్ర నాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
రైతు కోసం రణన్నినాదం
మడకశిర: రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. శుక్రవారం మడకశిరలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి రణన్నినాదం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించపోతే రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ.. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కృష్ణా జలాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. రైతు సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్ విఫలం.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్రెడ్డి అన్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్ట పోతున్నా.... చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మడకశిర ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని కూడా రద్దు చేసిందన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం మండలాల కన్వీనర్లు శ్రీనివాస్, యంజారేగౌడ్, సంతోష్, త్రిలోక్నాథ్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్రెడ్డి, నాయకులు తిప్పేస్వామి, రంగనాథ్, తిమ్మారెడ్డి, శేషాద్రి, నరసింహ, మల్లికార్జున, లక్ష్మీనారాయణగౌడ్, సికిందర్, శివన్న, జయకుమార్, గోపి, అంజలి తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు మడకశిరలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీ కృష్ణానీరివ్వడంతో పాటు పంటలకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా.. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు సర్కార్ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న నాయకులు -
‘ఉద్యాన పాలిటెక్నిక్’ ప్రవేశాలకు నోటిఫికేషన్
మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉద్యాన, ల్యాండ్ స్కేపింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఉద్యాన పాలిటెక్నిక్లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బయ్యన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ (శుక్రవారం) నుంచి 23వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు https:// drysrhu.ap.gov.in వెబ్సైట్ చూడాలన్నారు. మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు ప్రభుత్వం 60 సీట్లు కేటాయించిందన్నారు. పూర్తి వివరాల కోసం 7382633687, 9182677322, 9492328008 నంబర్లలో సంప్రదించాలన్నారు. 14వ శతాబ్దం నాటి ఆలయం గుర్తింపు పుట్టపర్తి: బుక్కపట్నం గ్రామానికి దక్షిణాన ఉన్న నల్లకొండ మీద ఉన్న తిరుమల దేవర ఆలయం 14వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర ద్వారాలతో పాటు దక్షిణ మార్గం కూడా ఉందన్నారు. గుప్త నిధుల తవ్వకాల కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఇదే కొండపై విజయనగర రాజులు నిర్మించిన సైనిక పహారా బురుజు, నీటి తొట్టె ఉన్నాయన్నారు. తిరుమల దేవర ఆలయంతో పాటు అహోబిలేశ్వర ఆలయం, అక్క దేవతల ఆలయాలను కలుపుతూ రహదారి ఏర్పాటు చేస్తే నల్లకొండ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేడుకగా ధ్వజ అవరోహణం ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముక్కోటి దేవతలకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి శయనోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘ఇన్స్టా’లో ప్రేమ.. పెళ్లికి నిరాకరణఅనంతపురం సెంట్రల్: ఇన్స్టాగ్రామ్లో పరిచడం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమాయణం సాగించిన యువకుడు... పెళ్లి పేరు ఎత్తగానే ‘నో’ అనేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఓ యువతికి తెలంగాణలోని కరీంనగర్ నివాసి, డెలివరీ బాయ్గా పనిచేస్తున్న పర్వేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో నువ్వంటే నాకిష్టమంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. పలు దఫాలు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామంటూ కొన్ని రోజులుగా యువతి అభ్యర్థిస్తూ వచ్చింది. ఈ అభ్యర్థనను సదరు యువకుడు తిరస్కరిస్తూ రావడంతో చివరకు అనంతపురం వన్టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కరీంనగర్ నుంచి పర్వేజ్ను రప్పించుకుని మాట్లాడారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ససేమిరా అనడంతో చివరకు కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
తీరిన నీటి సమస్య
అమరాపురం: మండలంలోని తమ్మిడేపల్లిలో నెలకొన్ని తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించారు. కొన్ని రోజులుగా తాగునీరు అందకపోవడంతో స్థానికులు బుధవారం సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశం ‘ప్రజల కష్టాలు పట్టని మారాజు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి యోగానంద గురువారం ఉదయం రాజీవ్నగర్కు వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాటర్మెన్ను పిలిపించుకుని బోరుబావి వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించి కుళాయిల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి : డీపీటీఓపుట్టపర్తి టౌన్: ఆదాయ మార్గాలు అన్వేషించి జిల్లాలో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి కృషి చేద్దామని ఉద్యోగులకు డీపీటీఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆర్టీపీ డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్, పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్ సూపర్వైజర్లతో గురువారం తన కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రతి బస్సు రూటును సూపర్వైజర్లు పరిశీలించాలన్నారు. సెక్టార్ వారీగా పనితీరు బాగాలేని సర్వీసులను రీసెట్ చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు కండెక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్టేజ్లోనూ బస్సులు సక్రమంగా ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, స్టేజ్ల్లో బస్సులు ఆపలేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పనవి హెచ్చరించారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బస్టాండ్లలో తాగునీరు, శుభ్రమైన టాయిలెట్లు, ప్రయాణికులకు కుర్చీలు, ఫ్యాన్లు, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని మేనేజర్లను ఆదేశించారు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ తుమకూరు: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు కర్ణాటకలోని తుమకూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. గురువారం మధుగిరి తాలూకా కొడిగెనహళ్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. కొడిగెనలహళ్లి హోబలి జి.హోసహళ్లి గ్రామానికి చెందిన రామకృష్ణప్ప ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగుడు బీరువాలో ఉన్న 37 గ్రాముల బంగారు నగలను అపహరించుకెళ్లాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొడిగెనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు గురువారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన నరసింహమూర్తిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. అశ్వ వాహనంపై శ్రీవారు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవేరులతో కలిసి అశ్వ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున సాగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువు దీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి ఉరవకొండకు చెందిన అంగదాల నారాయణస్వామి, అంగదాల ఆంజనేయులు, అంగదాల అభినయ్, గాజుల నాగరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
గోరంట్ల: చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోరంట్ల పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. 2024, ఏప్రిల్ 2న గోరంట్లలోని చైతన్య పాఠశాల బయట నిలిపిన స్కూటర్ డిక్కీ ధ్వంసం చేసి అందులోని రూ. 5.90 లక్షలను దుండగులు అపహరించారు. అలాగే 2025, జూలై 14న గోరంట్లలోని వాసవి ఫంక్షన్ హాల్ ఎదుట నిలిపిన కారు అద్దాలు ధ్వంసం చేసి అందులోని రూ.7 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనకాపల్లి జిల్లా కె.కొత్తపాటు మండలం గొట్లం గ్రామానికి చెందిన ఎరికల రావుల ఆనంద్, ఇదే జిల్లా దేవరపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మ పాళ్యం గ్రామానికి చెందిన కోరుకొండ త్రిమూర్తులు, విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్, ఇదే జిల్లా కొత్తవలస మండలం గొల్లల పాళ్యం నివాసి నంబారు సుధీర్ని గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వీరు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లారని, అక్కడి నుంచి విడుదలైన అనంతరం గోరంట్లకు చేరుకుని చోరీలు కొనసాగిస్తూ వచ్చారని పోలీసులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కారు ఢీకొని యువకుడి మృతిలేపాక్షి: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణానికి చెందిన శేఖర్ (27)కు భార్య మాధవి, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి హిందూపురంలో పని ముగించుకుని ద్విక్రవాహనంపై లేపాక్షి మండలం కొండూరుకు బయలుదేరిన శేఖర్... చోళసముద్రంలోని హెరిటేజ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనతో రోడ్డుపై పడిన శేఖర్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మంచం పట్టిన పెద్దిరెడ్డిపల్లి
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి మంచం పట్టింది. గ్రామంలోని పలువురు గురువారం అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సలు అందిస్తోంది. ఆహారం, నీరు కలుషితం.. మంగళవారం పెద్దిరెడ్డిపల్లి, బిందూనగర్, దామోదర్ కాలనీ, మారుతీనగర్ ప్రాంతాల్లో ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి జ్యోతుల సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల వారు బంధువులు, మిత్రులను ఆహ్వానించడంతో గ్రామాలన్నీ జనంతో నిండిపోయాయి. ఈ క్రమంలో ఆహారంతో పాటు నీరు కూడా కలుషితమైనట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడి చికిత్సలు అందించారు. డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం కూడా గ్రామానికి వెళ్లి మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల పరిస్థితిపై మెడికల్ ఆఫీసర్లు స్వరూపరెడ్డి, సురేష్తో ఆరాతీశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యంపై పంచాయతీ అధికారులతో పాటూ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించారు. కాగా వాంతులు, విరేచనాల బాధితులకు ఇబ్బంది లేదని, తగిన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలోని మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. పీహెచ్సీ తనిఖీ పరిగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫైరోజాబేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలతో పాటూ నిత్యం ఓపీ నమోదు శాతంపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత జిల్లా వైద్యాధికారి పర్యటన -
టీడీపీ నేత ఇంట పేకాట
గార్లదిన్నె: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు ప్రతి దానినీ ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో యథేచ్ఛగా జూదాలనూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గార్లదిన్నెలో ఓ టీడీపీ నేత తన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి పెద్ద ఎత్తున జూదాన్ని నిర్వహిస్తుండడం కలకలం రేపింది. విషయం పసిగట్టిన పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టడంతో గుట్టు కాస్త రట్టయింది. అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కోటి బళ్లారి వెంకటేష్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తూ ఫోన్ ద్వారా ముందస్తుగానే జూదరులకు సమాచారం ఇచ్చి, ఆయా ప్రాంతాలకు రప్పించుకునేవాడు. ఈ క్రమంలో ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపురము మూడో పట్టణ పీఎస్ పరిధిలోనూ పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులుగా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నేత ఖాసీం నాయుడుతో కుమ్మకై స్థానిక కెనరాబ్యాంక్ సమీపంలో ఉన్న ఆయన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి జూదరులకు అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికుల ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. గురువారం తనిఖీలు చేపట్టడంతో ఖాసీం నాయుడు ఇంట్లో సాగుతున్న పేకాట వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తం 14 మంది జూదరులను అరెస్ట్ చేసి, వీరి నుంచి 14 సెల్ఫోన్లు, రూ.3.85 లక్షల నగదు, ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 14 మంది జూదరుల అరెస్ట్ రూ.3.85 లక్షల నగదు, కారు స్వాధీనం -
ఎండకు మూగ జీవాలు విలవిల
కనగానపల్లి: గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో ఈ వేసవిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులతో పాటు మూగజీవాలూ విలవిలలాడుతున్నాయి. రోజంతా మెట్ట భూముల్లో తిరుగుతూ మేత మేసే గొర్రెలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. దీంతో మధ్యాహ్నాం ఒంటి గంట దాటిందంటే ఎండలో ఉండలేక చెట్ల నీడన చేరుతున్నాయి. ఎండ వేడిమి తాళలేక చిన్న గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. రాప్తాడు నియోజక వర్గంలో నాలుగు లక్షల పైగా గొర్రెలు ఉండగా, ఒక్క కనగానపల్లి మండలంలోనే అత్యధికంగా 1.35 లక్షల గొర్రెలు ఉన్నాయి. మండలంలోని పర్వతదేవరపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి, కోనాపురం, ఎలకుంట్ల, నరసంపల్లి, కేఎన్ పాళ్యం గ్రామాలలో గొర్రెల పోషణతో జీవించేవారు ఎక్కువగా ఉన్నారు. వడదెబ్బ ప్రభావంతో.. ప్రస్తుత వేసవిలో పగటి పూట 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా గ్రామాల్లో గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడిమికి గొర్రె పిల్లలు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నాయని కాపరులు భాస్కరగౌడ్, జ్యోతప్ప, ఓబులేసు, నరసింహులు అంటున్నారు. ఎండ వేడిమి నుంచి జీవాలను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఒక మందలో రోజుకు ఒకటి, రెండు జీవాలు వడ దెబ్బ సోకి చనిపోతున్నాయన్నారు. పర్వతదేవపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి గ్రామాల్లో 30 రోజుల వ్యవధిలోనే వందకు పైగా గొర్రె పిల్లలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. మధ్యాహ్నా సమయంలో ఎండ వేడిమి తాళలేక గొర్రెలను చెట్ల నీడనే చేర్చాల్సి వస్తోందని, అయితే వందలాది జీవాలకు ఒకేచోట నీడనిచ్చే చెట్లు దొరకాలంటే కష్టంగా ఉందంటున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిందని, దీంతో రైతులు నీటిని బయటకు వదలడం లేదని అంటున్నారు. మృత్యువాత పడుతున్న గొర్రె పిల్లలు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో మనుషులే కాదు.. మూగ జీవాలూ విలవిల్లాడిపోతున్నాయి. పెరిగిన వేసవి తాపంతో పశు, పక్షులు అల్లాడిపోతున్నాయి. చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక కొన్ని.. నీళ్లు లేక గొంతెండి మరికొన్ని పక్షులు నేలరాలుతున్నాయి.. జీవాలు మృత్యువాతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నోరు లేని మూగజీవాల వేసవి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. -
బైక్ పైనుంచి కిందపడి ఒకరి మృతి
బత్తలపల్లి: అనంతపురం రూరల్ మండలం మన్నీల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన తిరుపాలు వ్యక్తిగత పనిపై బుధవారం ఉదయం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రామకృష్ణ (65) అభ్యర్థన మేరకు ఆయనను కూడా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. మన్నీల క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుపై పడిన కంకర రాళ్లపై చక్రం ఎక్కడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్రగాయమైన తిరుపాలును స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, గ్రామంలో రామకృష్ణ ఆర్ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తూనే ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్గా పనిచేస్తున్నారు. గతంలోనే ఆయన భార్య మృతి చెందింది. పిల్లలు లేరు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సింగపూర్ వేదికగా బోద్ధ కావ్యం ఆవిష్కరణపెనుకొండ: స్థానిక కవి, రచయిత జాబిలి చాంద్బాషా కలం నుంచి జాలువారిన బోద్ధ కావ్యాన్ని మంగళవారం రాత్రి సింగపూర్లో ఆవిష్కరించారు. సింగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాబిలి చాంద్బాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్ది సమాజానికి అర్పించే ఉపాధ్యాయుడు ఒక సజీవ విశ్వవిద్యాలయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి కీలక రంగం ఉపాధ్యాయుడి బోధన నుంచే ఉద్భవిస్తుందన్నారు. బోద్ధ కావ్యం ఉపాధ్యాయ లోకానికి గొప్ప ప్రేరణనిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, మహేశ్వరరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమల శ్రీదేవి, ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి, అరుణాయాదవ్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, మక్బూల్బాషా, విద్యాభారతి, మాణిక్యం, ఇషాక్, బండి శ్రీనివాసులు, ఖాదర్, నౌషాద్, ఆది, సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు. దుకాణదారుడిపై కత్తితో దాడి ముదిగుబ్బ: సిగరెట్లు అప్పుగా ఇవ్వలేదంటూ దుకాణదారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం ముదిగుబ్బ గేటు కొట్టాలలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ గేటు కొట్టాలలో దుకాణం నిర్వహిస్తున్న మణికంఠ వద్దకు బుధవారం ఉదయం స్థానికుడు వసంత్ వెళ్లి సిగరెట్లు అడిగాడు. నగదు చెల్లిస్తేనే సిగరెట్లు ఇస్తానని మణికంఠ తెలపడంతో వసంత్ అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో దాడి చేసి పొట్టలో బలంగా పొడిచి ఉడాయించాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కదిరికి తీసుకెళ్లారు. -
రమణీయం.. నృసింహుడి రథోత్సవం
ఉరవకొండ : పెన్నహోబిలం క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నమో నారసింహ నామం మార్మోగింది. రథోత్సవం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తెచ్చి మహా రథంలో కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. అశేష భక్త జనం నడుమ బ్రహ్మ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మ రథోత్సంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్ పట్టువస్త్రాలను సమర్పించారు. -
జనగణన పక్కాగా చేయాలి
● అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం మడకశిర రూరల్: జనగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి సర్వే సిబ్బంది కూడా జనగణనను పక్కాగా చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని కదిరేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందించే సేవలు, జనగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనగణన సర్వేలో వెనుకబడి ఉన్నారని, వెంటనే సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించాలన్నారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ మైనుద్దీన్, ఎంపీడీఓ సోనిబాయి, ఆర్ఐ సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు. రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం గుడిబండ: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు పండించిన రాగులను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మోరబాగల్ గ్రామంలో రాగుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... క్వింటా రాగులను రూ. 4,886 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, రాగులు పండించిన రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో వివరాలను అందించాలన్నారు. ఒక రైతు నుంచి ఎకరాకు 13.50 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, ఏడీఏ కృష్ణమీనన్, సివిల్ సప్లయీస్ డీఎం రాజు, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ రామారావు, ఏఓ వీరనరేష్ పాల్గొన్నారు. -
‘పచ్చ’మూక దౌర్జన్యకాండ
పెనుకొండ: స్థానిక అర్బన్ కాలనీలో టీడీపీ నేతలు ఏకపక్షంగా జరిపిన దాడిలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో అర్బన్ కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనపై బాధితులు బుధవారం వాట్సాప్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. అర్బన్ కాలనీలో ఇష్టారాజ్యంగా ద్విచక్రవాహనాలను డ్రైవింగ్ చేస్తున్న యువకులను బాబా అనే వ్యక్తి నిలువరించి జిగ్జాగ్ డ్రైవింగ్ చేయొద్దని సూచించాడు. కాలనీలో చిన్నపిల్లలు రోడ్డుపై ఆడుకుంటూ ఉంటారని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే అందరూ బాధపడాల్సి ఉంటుందని హితవు పలికాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు నవాజ్, మరికొందరు మంగళవారం అర్ధరాత్రి సమయంలో అర్బన్ కాలనీకి చేరుకుని బాబాతో ఘర్షణకు దిగారు. సర్థి చెప్పడానికి వచ్చిన బాబా అల్లుళ్లపై ఇష్టారాజ్యంగా రాళ్లు,, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాబా, అతని అల్లుళ్లు, మరి కొందరిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బుధవారం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసి, తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దాడిలో 10 మంది యువకులు పాల్గొన్నారని పేర్కొన్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యం
హిందూపురం/ ధర్మవరం అర్బన్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ధర్మవరంలో రెండు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, హిందూపురంలో ఒక సివిల్ జడ్జి న్యాయస్థానాలను బుధవారం ఆమె అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. న్యాయమూర్తులు భానుమతి, సురేష్రెడ్డి, చల్లా గుణరంజన్ వర్చువల్గా పాల్గొన్నారు. అనంతరం హిందూపురం, ధర్మవరం కోర్టులను ఉమ్మడి అనంతపురం జిల్లా న్యాయమూర్తి భీమారావు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి భీమారావు అదనపు కోర్టుల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కక్షిదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేసులను సత్వరం పరిష్కరించాలని అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయమూర్తులు సైతం కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా న్యాయమూర్తిని ధర్మవరం, హిందూపురంలో స్థానిక బార్ అసోసియేషన్ల నేతలు సన్మానించారు. హిందూపురం నూతన కోర్టు విధులను ఇన్చార్జి న్యాయమూర్తి లలితా లక్ష్మీ హారిక ప్రారంభించారు. న్యాయమూర్తులు హేమలత, రమణయ్య, రమాదేవి పాల్గొన్నారు. ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్కుమార్, సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నందిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీష్ పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ వర్చువల్గా జిల్లాలో మూడు న్యాయస్థానాల ప్రారంభం -
అధ్వాన ఆస్పత్రులు!
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అటకెక్కాయి. ఓపీ విభాగం దగ్గర నుంచి మార్చురీ గది వరకు సేవలు సరిగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు మందుల కొరత పట్టిపీడిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రులను ‘సాక్షి’ విజిట్ చేయగా రోగుల అవస్థలు, డాక్టర్ల నిర్లక్ష్యం, వసతుల లేమి, మందుల కొరత స్పష్టంగా కనిపించాయి. చిన్న పిల్లల వార్డులో ఉక్కపోత హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ విభాగంలో చీటీలు ఇస్తున్నా... రోగులకు వైద్యం చేసేందుకు ఆస్పత్రిలో డాక్టర్లు ఉండటం లేదు. గైనిక్ వార్డులో ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉండటంతో అత్యవసర సమయాల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని రోగులకు సూచిస్తున్నారు. మాతాశిశు భవనం పైభాగంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాన్పుల వార్డు, చిన్న పిల్లల వార్డులో ఏసీలు పని చేయడం లేదు. ఎండాకాలం కావడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆస్పత్రిలో రక్త పరీక్షలకు ఎక్కువ సమయం పడుతోందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్ వార్డులో జనరేటర్ లేకపోవడంతో కరెంట్ పోతే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందకొడిగా నిర్మాణాలు మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లు కేటాయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ అటకెక్కాయి. రెండేళ్లు గడిచినా సగం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో రోగులు, సిబ్బంది, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో సమయానికి రోగులకు వైద్య సేవలు అందడం లేదని, రాత్రి పూట డాక్టర్లు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తున్నారని రోగులు చెబుతున్నారు. పెనుకొండలో సేవలు అధ్వానం మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. అయితే రోగులకు కూర్చునేందుకు వసతి లేదు. డాక్టర్ల కొరత ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదు. ట్రామా కేర్ నిర్వహణలో లేదు. మార్చురీ గది అధ్వానంగా ఉంది. హాస్పిటల్ ఆవరణలో ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే డయాలసిస్ రోగులకు సకాలంలో సేవలు అందడం లేదని చెబుతున్నారు. మందులు కూడా అందజేయడం లేదని వాపోతున్నారు. ఆక్సిజన్ ఉన్నా .. కనెక్షన్ లేదు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా... సిలిండర్లకు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆపరేషన్ థియేటర్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. మిగతా వార్డుల్లోని రోగులకు ఆక్సిజన్ అవసరమైతే అంతే సంగతి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమితో రోగుల అవస్థలు తీసికట్టుగా సేవలు.. మందుల కొరత ప్రముఖ విభాగాల్లో డాక్టర్ పోస్టుల ఖాళీ వెంటాడుతున్న వసతుల లేమి -
ఆదర్శం.. ఈశ్వరమ్మ జీవితం
ప్రశాంతి నిలయం: సత్యసాయికి జన్మనిచ్చిన ఈశ్వరమ్మ అవనికే ఆదర్శమూర్తి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు అన్నారు. బుధవారం ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలో బాల వికాస్ చిన్నారులు భక్తి గీతాలు ఆలపించారు. ఈశ్వరమ్మను, సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి గీతాలతో ఆకట్టుకున్నారు. అనంతరం స్వయం ఉపాధి కల్పన కోసం పలువురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత సత్యసాయి పూర్వ ప్రసంగాల్లో మాతృమూర్తి ఈశ్వరమ్మ గొప్పతనాన్ని వివరించే సందేశాన్ని డిజిటల్ స్క్రీన్ల మీద భక్తులకు వినిపించారు. ఆ తర్వాత పట్టణంలోని సమాధి రోడ్డులోని సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ, తండ్రి పెదవెంకమరాజు సమాధుల వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు కుటుంబ సభ్యులు, పలువురు ట్రస్ట్ సభ్యులు, సత్యసాయి విద్యాసంస్థల సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థులు, భక్తులు సంగీత విభావరి నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పుట్టపర్తి వీధుల్లో పూలు, కూరగాయలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు ఎండ వేడిమి నుంచి తట్టుకునే విధంగా గొడుగులను పంపిణీ చేశారు. సాయంత్రం పలువురు బాలవికాస్ విద్యార్థులు ఈశ్వరమ్మ ఆదర్శ విలువల గురించి ప్రసంగించారు. అనంతరం సంగీత విద్వాంసురాలు ఎల్. కీర్తన బృందం సంగీత విభావరి నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు. వర్ధంతి వేడుకల్లో ఆర్జే రత్నాకర్ రాజు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటిన వైనం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
● విజయవాడలో నినదించిన వైఎస్సార్టీఏ నాయకులు పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడ వేదికగా వైఎస్సార్టీఏ నాయకులు బుధవారం నినదించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు విజయవాడ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. వీరిలో వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కరరెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందరాదు●ఆర్టీసీ కడప జోన్ ఈడీ రాఘవకుమార్ పుట్టపర్తి టౌన్ : ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా నాణ్యమైన సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులను కడప జోన్ ఈడీ రాఘవకుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తిలోఆర్టీసీ బస్టాండ్, డిపో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, డిపోలోని విడిభాగాలను పరిశీలించారు. అందుతున్న సౌకర్యాలపై ప్రయాణికులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగి హెల్త్ కార్డులు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల ఽశ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ప్రతిభ కనబరచిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో డీపీటీఓ మధుసూదన్, డీవైఈఈ సురేంద్రబాబు, డిపో మేనేజర్ ఇనాయతుల్లా, సూపర్వైజర్ విజయానంద్, శోభారాణి పాల్గొన్నారు. పత్తి విత్తనం విక్రయ దుకాణాల తనిఖీపెనుకొండ: స్థానికంగా పత్తి విత్తనాన్ని విక్రయిస్తున్న దుకాణాలను వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ జి.కళ్యాణ్ బుధవారం తనిఖీ చేసారు. హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్టీ) రకం పత్తి విత్తనాల అమ్మకాలను నిరోధించేందుకు స్థానిక అధికారులతో కలసి తనిఖీలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హెచ్టీ రకం పత్తి విత్తనాల సాగుతో మానవాళికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భూసారం తీవ్రంగా దెబ్బతింటుందని, వీటిని రైతులకు విక్రయించరాదని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం మండల వ్యవసాయాధికారి ముస్తాఫా, అనంతపురం వ్యవసాయాధికారి శ్రీనాథరెడ్డి, పెనుకొండ మండల ఏఓ చందన, ఏఈఓ అశోక్కుమార్ పాల్గొన్నారు. దారితప్పితే కఠిన చర్యలు ● రౌడీ షీటర్లను హెచ్చరించిన అదనపు ఎస్పీ అంకితా సురానా హిందూపురం: దారి తప్పి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను అదనపు ఎస్పీ అంకితా సురానా హెచ్చరించారు. బుధవారం హిందూపురంలో డీఎస్పీ మహేష్, సీఐలతో కలిసి ఆమె పర్యటించారు. గుడ్డం ఏరియా, రహమత్పూర్, బోయపేట, నింకంపల్లి, మోతుకపల్లి తదితర ప్రాంతాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను పరిశీలించారు. కుటుంబసభ్యులకు పలు సూచనలు చేశారు. మళ్లీ గొడవల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ ఉంటుందన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. -
గ్రాసం కరువు.. పోషణ బరువు
కదిరి: కరువు మేఘం కమ్ముకోవడంతో జిల్లాలో పశుగ్రాసం కరువైంది. మండు వేసవిలో భానుడి ఉగ్రరూపంతో పచ్చని మొక్కలన్నీ ఎండిపోయాయి. మరోవైపు వరి, వేరుశనగ కోతలకు యంత్రాల వినియోగం, వాతావరణ మార్పులు, వర్షాభావంతో బోరు బావుల్లో నీరు అడుగంటి పోవడంతో సాగు భూమి తగ్గిపోవడం..ఇలా పలు కారణాలతో పశువులకు గ్రాసం కరువైంది. పచ్చగడ్డి, నీటి లభ్యత లేకపోవడంతో పశువులు బక్కచిక్కి పోయాయి. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ధరలు ఆకాశంలో ఉండటంతో పాడిరైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేకపోయినా వాటిని కబేళాలకు విక్రయిస్తున్నారు. దీంతో పశు సంపద కూడా బాగా తగ్గిపోతోంది. ట్రాక్టర్ గడ్డి రూ.30 వేలుపైనే మామూలు రోజుల్లో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపేవారు. అయితే ప్రస్తుతం ఎక్కడా మేత దొరకడం లేదు. దీంతో మేతకు డిమాండ్ పెరిగి గ్రాసం ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.10 వేలు ఉన్న ట్రాక్టర్ గడ్డి ధర ఇప్పుడు రూ.30 వేలకు చేరింది. అది కూడా స్థానికంగా మేత దొరక్కపోవడంతో ఇతర జిల్లాల నుంచి గడ్డిని ట్రాక్టర్లు, లారీలలో తెచ్చుకుంటున్నారు. వీధుల్లో తిరిగే పశువుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మేత దొరక్క చెత్త, ప్లాస్టిక్ కవర్లు వంటివి తింటూ, మురుగునీరు తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నాయి. పాడిరైతుల దీనావస్థ వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో పాడిపశువుల సంఖ్య కూడా బాగానే ఉంది. ధర్మవరం డివిజన్లో 65,966 ఆవులు, ఎద్దులు, 28,009 బర్రెలు, 9,14,202 గొర్రెలు, 1,19,031 మేకలు ఉన్నాయి. అలాగే హిందూపురం డివిజన్లో 1,00,945 ఆవులు, ఎద్దులు, 29.611 గేదెలు, 6,34,832 గొర్రెలు, 1,15,923 మేకలు ఉన్నాయి. అదే విధంగా పెనుకొండ డివిజన్ పరిధిలో 1,14,325 పశువులు, 37,925 బర్రెలు, 10,80,253 గొర్రెలు, 2,37,138 మేకలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు పాడిపశువుల పెంపకం చేపట్టే రైతులకు ప్రోత్సాహకాలు అందించి పాడిపశువుల సంఖ్య పెరుగుదలకు కృషి చేశాయి. అలాగే గ్రాసం కొరత ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మూగ జీవాల వేదన ఏమాత్రమూ పట్టలేదు. రైతులకు కేవలం గడ్డి విత్తనాల పంపిణీతో చేతులు దులుపుకుంటోంది. రాయితీ ఏదీ? గ్రాసం సాగుచేసుకునే పశుపోషకులకు రాయితీ ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా హామీలిచ్చింది. 10 సెంట్ల భూమిలో పశుగ్రాసం సాగు చేసిన రైతులకు కూలీల ఖర్చు, సామగ్రితో కలిపి రూ.6,599, అలాగే 20 సెంట్లలో సాగుచేస్తే రూ.13,197, ఇక 30 సెంట్లలో సాగుచేసిన వారికి రూ.19,795, 40 సెంట్లలో సాగుచేస్తే రూ.26,394, అర ఎకరం(50 సెంట్లు)లో సాగు చేస్తే రూ.32,992 చొప్పున పశుపోషకులకు రాయితీ ఇస్తామని సర్కార్ చెప్పింది. కానీ జిల్లాలో ఈసారి 325 మంది రైతులు గ్రాసం సాగుచేసినప్పటికీ వారికి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పశుగ్రాసం పథకం ఉందనే విషయం జిల్లాలో 90 శాతం మంది రైతులకు తెలియదని ఆ శాఖ అధికారే ఒకరు చెప్పడం గమనార్హం. పాడి పరిశ్రమపై కరువు పోటు మేతలేక బక్కచిక్కుతున్న పశువులు రెండేళ్లలో మూడు రెట్లు పెరిగిన గ్రాసం ధర పాడిపశువులను పస్తుపెట్టలేక అమ్ముకుంటున్న పోషకులు గడ్డి ధర పెరిగింది నాకు నాలుగు గేదెలున్నాయి. గతంలో మేతకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రసుత్తం బయట ఎక్కడా పచ్చగడ్డి లేదు. దీంతో దానాతో పాటు గడ్డి ధర విపరీతంగా పెరిగింది. అంత డబ్బు వెచ్చించలేక పశువులను పస్తు పెట్టలేక చాలా మంది అమ్ముకున్నారు. నాకు పశువులను అమ్మేందుకు మనస్సురాక అలాగే ఉంచుకున్నా. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోకపోతే భవిష్యత్లో పశువులు కనబడవు. – ఆంజనేయులు, పాడి రైతు, కదిరి గ్రాసం కొరత ఉంది గ్రాసం కొరతకు చాలా కారణాలున్నాయి. యంత్రాలతో వరికోతలు, కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు కారణంగా గడ్డి కొరత నెలకొంది. గడ్డి విత్తనాలు పంపిణీ చేశాం. గడ్డి కొరతపై నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం. – శుభదాస్, జేడీ, పశుసంవర్ధక శాఖ -
● ప్ర’జల’ కష్టాలు పట్టని మా‘రాజు’
అమరాపురం/అగళి: స్థానికేతరుడైనా మా‘రాజు’ అని ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడేమో మా కష్టాలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తిరుగుతున్నారని అమరాపురం మండలం తమ్మడేపల్లి, అగళి మండలం కురసాంగనపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమ్మడేపల్లిలోని రాజీవనగర్ సచివాలయం ఎదుట కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీ వాసులు శ్రీనివాస్, గంగమ్మ, కెంచమ్మ, మంజమ్మ, భాగ్యమ్మ, తిమ్మక్క తదితరులు మాట్లాడుతూ.. తమ కాలనీ కోసం ఏర్పాటు చేసిన బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉన్నా, 15 రోజులుగా చుక్క తాగునీరు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. గ్రామ సచివాలయంలో విన్నవించేందుకు వస్తే ఇక్కడ ఒక్కరూ కూడా అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ ఆయన అందుబాటులో ఉండడం లేదని, కనీసం అధికారులైన అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అగళి మండలం కురసాంగనపల్లిలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోరు బావిలో నీరు అడుగంటిందని, మూడు రోజులుగా తాగునీటి కోసం నానా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సురేష్ అక్కడకు చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు అగళి మండలం కురసాంగనపల్లిలో ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులు -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలపై విచారణ చేపట్టాలి
ప్రశాంతినిలయం: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కలెక్టర్ను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. నకిలీ డాక్యుమెంట్ల దందా, రెవెన్యూ రికార్డులను అక్రమంగా తారుమారు చేయడం, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తుండడం తదితర అంశాలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై గతంలో తాము ఫిర్యాదు చేసినా అధికారులు నేటికీ సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ భూములు సైతం ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారని, అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూదిలి సుదర్శన్, కొండమరాజు, కత్తి రాజారెడ్డి, జ్యోతి ప్రసాద్, తిరుమలేష్, బాలగంగాధర్, కళ్యాణ్కుమార్, లక్ష్మీనారాయణ, నారాయణ, భాస్కర్ ఉన్నారు. -
కల్యాణం.. కమనీయం
రాయదుర్గం: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశిష్ట సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కల్యాణం జరిపితే, ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల నమ్మకం. అందులో భాగంగా ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానాహొసళ్లికి చెందిన అరవ నగేష్, పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కులపెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపుతాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్ర రెడ్డి, బీఎన్టీ, కేకేటీ కుటుంబాల ఆధ్వర్యంలో 4,500 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. ● ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గురువారం (రేపు) ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం -
తరుముకొస్తున్న కరువు
రాయదుర్గం: గత ఐదేళ్లు సమృద్ధిగా కురిసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేయనున్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో రైతు పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఇప్పటి వరకూ వేసవి దుక్కులు సైతం ఊపందుకోలేని పరిస్థితి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తే కరువు కరాళనృత్యం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఖరీప్లో జిల్లాలో 16,54,080 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో వేరుశగన, కంది, ఆముదం, పత్తి మెజార్టీ పంటలు. జూన్ నుంచి సెఫ్టెంబర్ వరకు ఎల్నినో ముప్పు పొంచి ఉండవచ్చునని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. రుతుపవనాలు ముందే వచ్చినా? నైరుతి రుతుపవనాలు జాన్ మొదటి వారంలోనే జిల్లాలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినా ఎల్నినో దెబ్బకు ఆ తర్వాత పెద్ద విరామం ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆలోచించి అడుగేయాల్సి వస్తోంది. జిల్లాలో సాధారణంగా ఖరీప్లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, సజ్జ, ఉలువ లాంటి పంటలు సాగుచేస్తారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సారి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనంగా ఉంటుంది. అలాగే తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉండడంతో బోరుబావుల కింద వరి కాకుండా ఇతర ఆరుతడుల పంటలు సాగు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. సూపర్ ఎల్నీనో ఎఫెక్ట్ కారణంగా ముఖం చాటేయనున్న వర్షాలు ఆలోచించి అడుగేయాలి ఎల్నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై ఇటీవల ఓ సమావేశం కూడా జరిగింది. సరైన స్పష్టత వెలువడాల్సి ఉంది. అలాంటిదేదైనా ఉంటే రైతులు ఆలోచించి అడుగేయాలి. తక్కువ వర్షాపాతానికి తట్టుకునే పంటల సాగుపై దృష్టిసారించడం మంచిది. – మల్లికార్జున, సేద్యం విభాగపు శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం -
● ఇల్లే.. వ్యవసాయ క్షేత్రం
తాడిపత్రి టౌన్: ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. గ్రీనరీ అంటే ఎవరికై నా ఇష్టం.. చెట్లు, పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు... ఇక మొక్కలు పెట్టేందుకు స్థలమెక్కడిది? అయితే ఓ ఫర్టిలైజర్ షాపు యజమాని తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వివిధ రకాల ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు పండిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఈ నందన వనాన్ని చూడాలనుకుంటే తాడిపత్రిని సందర్శించాల్సిందే. పట్టణంలోని సంజీవనగర్కు చెందిన రాజేష్, శ్రీలత దంపతులు తమ ఇంటి ఆవరణతో పాటు మిద్దైపె కూడా డ్రమ్ములు, బ్యాగ్లలో మట్టి నింపి 25 రకాల మందార మొక్కలు, నాలుగు రకాల మల్లె మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, ఆకుకూరలు, మామిడి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు. తన తండ్రి వెంకటరమణారావు మొక్కలపై మమకారంతో ఇంట్లో పచ్చని చెట్లను పెంచారని, ఆయన మరణాంతరం తండ్రి జ్ఞాపకాలను మొక్కల్లో చూసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేలు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. రైలు కింద పడి యువకుడి మృతి గుంతకల్లుటౌన్: స్థానిక హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ కుమారుడు కె.బాలచంద్ర (34)గా గుర్తించారు. గుంతకల్లులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఆర్డీటీ బిల్డింగ్స్లో అద్దెకుంటున్నాడు. అవివాహితుడు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో క్లీనర్గా దినసరి కూలి పనితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం వేకువజామున రైలుకింద పడి మృతి చెందాడు. కాగా, మద్యం మత్తులో రైలు కిందపడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్సాహంగా గ్రామీణ క్రీడా పోటీలుఆత్మకూరు: మండలంలోని ముట్టాల, పాపంపల్లి గ్రామాలకు సంబంధించిన అక్కమ్మగార్ల పరుష ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరుష కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అక్కమ్మ గార్లకు పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సాహంగా రాతి దూలం లాగుడు, ఇరుసు ఎత్తే పోటీలను నిర్వహించారు. -
ఆగిన సత్యసాయి నీటి సరఫరా
● డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించబోమంటున్న కార్మికులు బత్తలపల్లి: శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికుల సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 మంది కార్మికులు నిరవధిక సమ్మెను సత్యసాయి పంప్హౌస్ల వద్ద చేపట్టారు. బత్తలపల్లిలో కార్మికులు నీటి ట్యాంకుల వద్ద సమ్మెకు దిగారు. పథకం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనం మంజూరు తదితర డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపట్టినట్లు కార్మికులు పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు అప్పరాచెరువు సమీపంలోని సత్యసాయి పంపుహౌస్ వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సత్యసాయి కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్ఓ ప్లాంట్లు పనిచేసేలా చూడండిధర్మవరం అర్బన్: సెలవులు ముగిసిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయని ఆర్ఓ ప్లాంట్లకు మరమ్మతులు చేయించి పనిచేసేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పది మండలాల హెచ్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. డీఈఓ కిష్టప్ప మాట్లాడుతూ ‘మన బడి – మన భవిష్యత్తు’ కింద జిల్లాలో 1248 ఆర్ఓ ప్లాంట్లు ఫేస్–1, ఫేస్–2 కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదని చెప్పారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే సమయానికి ప్రతి పాఠశాలలో ఉన్న ఆర్ఓ ప్లాంటు పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమెడియన్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంఈఓ గోపాల్నాయక్, సీఎంఓ హరిప్రసాద్, ఏపీఓ ఫణిరాజ్శర్మ, ఏఎస్ఓ మాధవరెడ్డి, కొత్తపేట పాఠశాల హెచ్ఎం పద్మావతి, ఆర్ఓ ప్లాంట్ల టెక్నీషియన్లు కిశోర్, నగేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతం విద్యార్థి మృతి
రాప్తాడు రూరల్: ఓవైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబానికి అండగా ఉంటున్న విద్యార్థిని కరెంటు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన మంగళవారం రాప్తాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం రూరల్ జాకీర్కొట్టాలుకు చెందిన రితేష్ఖాన్ కుమారుడు అజాంఖాన్ (20) ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీ సమయంలో టైల్స్ పనికి వెళ్లేవాడు. మంగళవారం రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో టైల్స్ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటున్న అజాంఖాన్ దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య రాప్తాడు రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కార్మికులకు వేతనాలు చెల్లించాలి ముదిగుబ్బ: సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులకు బకాయివేతనాలను తక్షణమే చెల్లించాలని సీపీఐ నాయకుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి వేతనాల కోసం సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీపీఐ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. -
యోగి వేమనకు అవమానం
చిలమత్తూరు: మహాకవి యోగి వేమనకు తీరని అవమానం జరిగింది. హిందూపురం పట్టణంలోని ఆయన విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చీర కట్టి పూలు వేసి అవమానించారు. ఘటనపై రెడ్డి సంఘాలు భగ్గుమన్నాయి. మహాకవిని అవమానించడం సిగ్గుచేటని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్రెడ్డి పేర్కొన్నారు. వేమన విగ్రహానికి వేసిన చీరను తొలగించి క్షీరాభిషేకం చేశారు. ఇది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మీడియా కోఆర్డినేటర్ ప్రణయ్రెడ్డి, సోషియల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, రెడ్డిసంఘం నాయకులు పరమేష్రెడ్డి, నంజుండరెడ్డి, శివారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతు ఖాతా నుంచి రూ.లక్ష మాయంఉరవకొండ: తన ప్రమేయం లేకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.లక్ష నగదు మాయమైందని ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన రైతు జంగం రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇటీవల మిర్చి పంట విక్రయించడంతో రూ.14 లక్షలను వ్యాపారి తన బ్యాంక్ ఖాతాలోకి జమ చేశాడన్నారు. ఇందులో రూ.11 లక్షలను మూడు రోజుల క్రితం విత్డ్రా చేశానని, మిగిలిన రూ.3లక్షలను ఇంటి నిర్మాణం కోసం ఖాతాలోనే నిల్వ చేసినట్లు వివరించాడు. ఈ నెల 4న వరుసగా రూ.50వేలు, రూ.34వేలు, రూ.10వేలు, రూ.6వేలు చొప్పున నగదు మరో ఖాతాకు బదిలీ అయిందన్నారు. డబ్బు బదిలీ అయినట్లు తనకు ఎలాంటి మెసేజ్ కానీ, ఓటీపీ కాని రాలేదని, దీనిపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. బాలుడి అప్పగింత హిందూపురం: సడ్లపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు 13ఏళ్ల ప్రజ్వల్రెడ్డిని తల్లిదండ్రుల వద్దకు పోలీసులు సురక్షితంగా చేర్చారు. తరచూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండడంతో మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు పట్టణ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. సాయంత్రం రైల్వేస్టేషన్ పరిసరాల్లో కనిపించడంతో వెంటనే పీఎస్కు పిలుచుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. చైన్ స్నాచర్కు దేహశుద్ధిశింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్పలలోని సుల్తాన్పేటలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అప్రమత్తమై దుండగుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్యశవంతపుర (బెంగళూరు): ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం బెంగళూరులోని హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి రూ.41.67 లక్షల విలువైన 51 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్, నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా ఉన్నారు. వీరి నుంచి 501 నకిలీ ఆర్సీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్లు చోరీ అయినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ క్రమంలో హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితుడిని పట్టుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంటర్నెట్ సెంటర్లో డూప్లికేట్ ఆర్సీ కార్డులను రూపొందిస్తున్నట్లు విచారణలో వెల్లడయిందన్నారు. ఫేస్బుక్లో ప్రకటనలిచ్చి చోరీ వాహనాలను అసలుగా నమ్మించి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. -
పాలీసెట్లో ప్రతిభ
ధర్మవరం అర్బన్: పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని జిల్లాలో రెండో ర్యాంకు సాధించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. అలాగే హిందూపురం పట్టణానికి చెందిన కురుబ గోవిందరాజులు 120 మార్కులకు 113 మార్కులతో 575 ర్యాంకుతో జిల్లా మొదటి స్థానం సాధించారన్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని గాండ్ల చరణ్య 120 మార్కులకుగాను 112 మార్కులతో 664 ర్యాంకుతో జిల్లా రెండో స్థానం సాధించారన్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన పామిశెట్టి ప్రణవ్ కార్తీక్ 111 మార్కులతో 809 ర్యాంకు సాధించారన్నారు. విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మామిడి టన్ను రూ.45 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.45 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 344 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.45 వేలు, కనిష్టంగా రూ.25 వేలు, సరాసరిన రూ.33 వేల ప్రకారం ధర పలికిందన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.30 వేలు, సరాసరిన రూ.35 వేలు పలికిందని వివరించారు. అలాగే హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించారు. -
ఆక్సిటోసిన్తో రోగాలపాలు
అనంతపురం: యూరియా, డిటర్జెంట్, రసాయనాలతో తయారు చేస్తున్న పాల గురించి విన్నాం. కొన్నిసార్లు చూశాం కూడా. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గేదెలు, ఆవులు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు వాటికి డ్రగ్స్ ఇస్తున్నారు. తమ స్వలాభం కోసం నిషేధాన్ని ఉల్లంఘిస్తూ వీటిని ఉమ్మడి జిల్లాలోని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ల నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నమ్మిస్తూ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను కట్టబెడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఆక్సిటోసిన్ అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అయితే ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ వీటి విక్రయాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పాడి సంపద ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోని మెడికల్ స్టోర్లలో ఆక్సిటోసిన్ విక్రయాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గోపాల మిత్రల ద్వారా ఈ విక్రయాలను మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనర్థాలు మెండు.. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరమే అయినా, మెడికల్ స్టోర్ల నిర్వాహకులు మాత్రం వాటిని పాడి రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ అంటగడుతున్నట్లుగా సమాచారం. వీటి వినియోగం వల్ల ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. వాటి పాలను తాగితే మనుషుల్లోనూ చాలా రకాల దుష్ట్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలురల్లో హార్మోన్ల అసమతుల్యత, బాలికల్లో రజస్వల అయ్యే వయసు తగ్గిపోవడం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. చిన్నారులకు పచ్చకామెర్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో అసౌకర్యం, నొప్పితో పాటు మెదడులోని కణాలు క్షీణించి మతిమరుపు సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. గర్భం ధరించిన వారు ఈ పాలు తాగితే గర్భస్రావం అవుతుందని, ఒకవేళ బిడ్డ పుట్టినా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, బిడ్డ పుట్టిన తర్వాత బాలింతల్లో హెమరేజ్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిటోసిన్ అనే మందును వైద్య రంగంలో ప్రసవ సమయంలో గర్భాశయ కుదుపులను సులభతరం చేయడానికి కానీ, కొన్ని ప్రత్యేక హార్మోన్ అసమతుల్యత సమస్యల పరిష్కారానికి మాత్రమే ఉపయోగిస్తారు. వైద్యుల సిఫారసు లేనిదే ఈ ఇంజక్షన్ను విక్రయించరాదు. అయితే పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో దీనిని వాడటం సరికాదు, అలాగే నేరం కూడా. ఆక్సిటోసిన్ వాడిన పశువుల పాలు తాగిన చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను ఇవ్వడం మానుకోవాలి. – డాక్టర్ హేమలత, ఆర్ఎంఓ, జీజీహెచ్, అనంతపురం నిషేధాన్ని ధిక్కరించి మెడికల్ స్టోర్లలో స్టెరాయిడ్స్ విక్రయం అధిక పాల ఉత్పత్తి కోసం పాడిపశువులకు వేస్తున్న వైనం పాలు తాగిన వారిపై తీవ్ర దుష్ప్రరిణాలు -
బీమాతో కుటుంబానికి రక్ష
మడకశిర: వ్యక్తిగత బీమా (ఇన్సూరెన్స్) కుటుంబానికి రక్షణగా నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మడకశిర డిపోను తనిఖీ చేశారు. డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించారు. సీ్త్రశక్తి పథకం అమలు తీరుపై సమీక్షించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కార్మికులందరూ ఎస్బీఐ బీమా చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమయపాలనతో ఆర్టీసీకి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. సమావేశంలో డీపీటీఓ మధుసూదన్, డీఎం ధర్మకీర్తి తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించండి మడకశిర డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కడప జోనల్ ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్కు ఎన్ఎంయూఏ, ఈయూ నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. ప్రధానంగా శ్రీశైలం బస్సు పని గంటలను సవరించాలని కోరారు. డిపో మేనేజర్ కార్యాలయం నిర్మాణానికి చొరవ తీసుకోవాన్నారు. గ్యారేజీలో బస్సుల మరమ్మతుకు అదనపు పిట్స్ ఏర్పాటు చేయాలని, సిబ్బంది, కార్మికులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, రద్దు చేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం ఈడీని ఘనంగా సన్మానించారు. డీపీటీఓ మధుసూదన్, స్థానిక డీఎం ధర్మకీర్తి, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హనుమంతరాయప్ప, రంగప్ప, చెన్నారెడ్డి, ఉలిగమ్మ, ఈయూ డిపో అధ్యక్షుడు రఫిక్, కార్యదర్శి రంగనాథ్, రీజియన్ సభ్యుడు సిద్ధగంగప్ప, కేటీస్వామి, గంగరాజు, ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు ముద్దప్ప, కార్యదర్శి కరియప్ప, ఎన్ఎంయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్ -
మేం చెప్పిందే జరగాలి.. ఖబర్దార్ !
రొళ్ల: ‘మేము అధికారంలో ఉన్నాము.. మేము చెప్పిందే జరగాలి.. లేకపోతే నీరు, నీడ లేని చోటికి ట్రాన్స్ఫర్ చేయిస్తాం.. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఖబర్దార్’ అని మడకశిర మార్కెట్ యార్డు చైర్మన్ బీఎస్ గురుమూర్తి స్థానిక ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావుతో పాటు ఇతర శాఖ అధికారులపై చిందులు వేశారు. ఆ తర్వాత సభ మధ్యలో నాయకుల కోసం వేసిన కూర్చీలను చెప్పు కాళ్లతో తన్ని సర్వసభ్య సమావేశాన్ని అగౌరవ పరచడంతో పాటు సభ జరగకుండా అడ్డుకున్నారు. వివరాలు... రొళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం మండలాధ్యక్షురాలు ఎస్ఆర్ సుమ అధ్యక్షతన సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే సభావేదికపై తమవారికి ప్రత్యేకంగా చైర్లు వేయలేదంటూ మడకశిర మార్కెట్ యార్డ్ చైర్మన్ బీఎస్ గురుమూర్తి అధికారుల మధ్య వేసిన చైర్లను చెప్పు కాళ్లలో తన్నారు. వేదికపై ఉన్న ఎంపీపీ సుమ, జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైస్ ఎంపీపీలు లింగరాజు, సౌమ్య, ఎంపీటీసీ సభ్యులు దీన్ని తీవ్రంగా ఖండించారు. సభను అగౌర పరచడం ఏంటని టీడీపీ నాయకులు తీరును నిలదీశారు. అరగంట పాటు గురుమూర్తితో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు దాసరెడ్డి కింద కూర్చొని మూడు గంటల పాటు సమావేశాన్ని అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికల్లో గెలుపొందిన వారిని మాత్రమే వేదికపై ఉన్న చైర్లలో కూర్చోవడానికి అనుమతి ఉందని అధికారులు టీడీపీ నాయకులకు చెప్పారు. ఆఖరికి టీడీపీ నాయకులు కూడా వేదికపై కూర్చోడానికి మండల పరిషత్ పాలక వర్గం అనుమతివ్వడంతో సమావేశాన్ని నిర్వహించారు. తమవారికి చైర్లు వేయలేదని మండల మీట్లో టీడీపీ ప్రజాప్రతినిధుల రచ్చ -
ఆయన ఇక్కడ ..‘కీ’ అక్కడ !
కదిరి: వారం రోజుల క్రితం బదిలీపై వెళ్లిన కమిషనర్ కిరణ్కుమార్ ఇంత వరకూ ప్రస్తుత కదిరి మున్సిపల్ కమిషనర్ వి.సందీప్కు డిజిటల్ ‘కీ’ అప్పగించలేదు. ఆయన కదిరిలోనే ఉంటూ ఇప్పటికీ తానే కమిషనర్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఫైళ్లన్నీ తన ఇంటికి తెప్పించుకొని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సిఫారసు చేస్తున్న పనులు చక్కబెడుతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీకే చెందిన కొందరు తాజా మాజీ కౌన్సిలర్లు చెబుతున్నారు. ఫైళ్ల ఆమోదం, పత్రాల ధ్రువీకరణతో పాటు డిజిటల్ లావాదేవీలన్నింటికీ ‘డిజిటల్ కీ’ చాలా అవసరం. మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్నులు, వర్తక లైసెన్సులు, బిల్డింగ్ ప్లాన్ల ఆమోదం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి అది తప్పనిసరి. అలాగే మున్సిపల్ ఆన్లైన్ లావీదేవీలకు, ఫైల్ ఎక్కడ పెండింగ్లో ఉందో తెలుసుకునేందుకు కూడా మున్సిపల్ కమిషనర్కు డిజిటల్ కీ ఎంతో అవసరం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న డిజిటల్ కీని గత కమిషనర్ అప్పగించకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సందీప్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్ కీ ఎక్కడుందో కనుక్కుంటా అని బదులీచ్చారు. ఇప్పటికీ ఏఈ సీట్లోనే మున్సిపల్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఏఈ కిరణ్కుమార్ ఇప్పటికీ ఏఈ సీట్లోనే కూర్చుంటున్నారు. కమిషనర్ చాంబర్లోకి వెళ్లేందుకు కూడా ఆయన భయపడుతున్నారు. ఆయనను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు బెదిరించనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కమిషనర్ కుర్చీలో కూర్చోకుండా ఏఈ సీటుకే పరిమితమయ్యారని సిబ్బంది చెబుతున్నారు. రెండేళ్లుగా కదిరిలో డెప్యుటేషన్పై మున్సిపల్ కమిషనర్గా ఉన్న కిరణ్కుమార్ను ఇటీవల మాతృశాఖ (హార్టికల్చర్)కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏఈ సందీప్ను నియమించిన విషయం తెలిసిందే. నేను ఎక్కడికీ పోను..ఇక్కడే ఉంటా.. ‘నాకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఆశీర్వాదాలు ఉన్నంతవరకూ నేనే ఇక్కడ కమిషనర్. త్వరలోనే మళ్లీ నన్నే కొనసాగించాలంటూ ఉత్తర్వులు వస్తాయి. సీఎం స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నా విషయంలో చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. నా కింద పని చేసే ఏఈ సందీప్ నా సీట్లో ఎలా కూర్చుంటారు ’ అని మాతృశాఖకు బదిలీ అయిన కిరణ్కుమార్ అంటున్నారని కొందరు మున్సిపల్ ఉద్యోగులతో పాటు టీడీపీ తాజా మాజీ కౌన్సిలర్లు సైతం చెబుతున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించని గత కదిరి కమిషనర్ కిరణ్ ఏఈ సీట్లోనే కూర్చుంటున్న ప్రస్తుత కమిషనర్ సందీప్ -
పీడీఓ, డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీ సెక్రటరీలను స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3గా పునర్విభజన చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ), డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఆర్సీ భవనంలో డీపీఓ నాగరాజనాయుడు ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన చేస్తున్నారు. ఎంపీడీఓలు, వారి ఆఫీసు సిబ్బంది, ఉమ్మడి జిల్లా ట్రెజరీ అధికారులు, ఆడిట్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశీలన చేస్తున్నారు. -
హనీట్రాప్ వ్యవహారం ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపింది. బీజేపీ నేతలపై ఆ పార్టీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీ ఆరా తీసింది. టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీకి జిల్లా నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రాష్ట్ర పార్టీ దృష్టికి వా
సాక్షిప్రతినిధి, అనంతపురం : హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తీవ్ర చర్చ నడుస్తోంది. బాధితుల నుంచి నిందితులు ప్రామిసరీ నోటు బాండ్లు సేకరించిన తర్వాత పోలీసులతో చెప్పి నిందితులకు అనుకూలంగా పంచాయితీలు చేసిన వారిలో టీడీపీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పలు పత్రికలు, టీవీల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ‘హనీట్రాప్ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం’ వివరాలు రాష్ట్రపార్టీకి చెప్పాలి కదా..’ అని సునీల్ ఆరా తీస్తే హనీట్రాప్ వ్యవహారంలో తనకు తెలిసిన అంశాలను సునీల్కు నాగరాజు వివరించారు. అలాగే తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కారని తెలుస్తోంది. కాలవతో పూల నాగరాజుకు ఇక్కట్లు.. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు అదే నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజుకు మధ్య వైరం నడుస్తోంది. పూల నాగరాజు దుర్గానికి స్థానికుడు కావడంతో వాల్మీకి కోటాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ‘దుర్గం’ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరకు కాలవ టిక్కెట్ దక్కించు కుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, ఎప్పటికై నా నాగరాజుతో ప్రమాదమని భావించి, పథకం ప్రకారం నాగరాజును అణగదొక్కే చర్యలను కాలవ ముమ్మరం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాలవ పూజలు నిర్వహించారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని పిలిపించారు. గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, సత్యకుమార్ విచ్చేశారు. వీరితో పాటు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరిని కూడా ఆహ్వానించారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజును మాత్రం ఆహ్వానించలేదు. ‘దుర్గం’లో నిర్వహించిన కార్యక్రమానికి సాటి సామాజికవర్గం నేత, పైగా జిల్లా అధ్యక్షుడిని విస్మరించడం చూస్తే కావాలనే దూరం పెడుతున్నారనేది స్పష్టమవుతోంది.దీన్ని నాగరాజు కూడా తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ చేపట్టిన బీసీ గళం సదస్సు దిగ్విజయమైంది. ఈ క్రమంలో కాలవ, ఎంపీ బీకే ప్రెస్మీట్ నిర్వహించారు. బీసీ అంశం మాట్లాడే క్రమంలో బీసీ నేతగా ఉన్న జిల్లా అధ్యక్షుడిని కాలవ ఆహ్వానించలేదు. అలాగే చాలా సందర్భాల్లో పార్టీ వ్యవహారాలపై ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో కాలవ ప్రెస్మీట్ నిర్వహిస్తే, మళ్లీ అధ్యక్షుడిగా పార్టీ ఆఫీసులో నాగరాజు రెండోసారి అదే అంశంపై ప్రెస్మీట్ నిర్వహిస్తున్నారు. ఇది వీరిమధ్య విభేదాలను స్పష్టం చేస్తోంది. చివరకు ఇద్దరూ రైలు ప్రయాణం చేసే సమయంలో కాలవ ఎదురుగా సీట్లో నాగరాజు కూర్చుంటే ‘ఇక్కడ వద్దు పక్కకు వెళ్లి కూర్చోపో’ అని చెప్పారంటే నాగరాజుపై ఏస్థాయిలో కాలవ విద్వేషం పెంచుకున్నారో స్పష్టం అవుతోంది. దీన్నిబట్టి జిల్లా అధ్యక్షుడిని కాలవ ఎలా అవమానిస్తున్నారో అర్థమవుతోంది. నాగరాజు, అంబికా, గుమ్మనూరుతో పాటు చాలామంది వాల్మీకి నేతలు కాలవ ధోరణిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మినహా వాల్మీకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకూడదనే ధోరణిలో కాలవ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఒకే జిల్లాలో తనతో పాటు అంబికా, గుమ్మనూరు రూపంలో బలమైన పోటీ కూడా నెలకొంది. దీంతో తన రాజకీయ ప్రయాణానికి అడ్డు తొలగించుకునే క్రమంలోనే కాలవ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే ‘దుర్గం’లో అక్రమ మైనింగ్, ఇసుక, కల్తీకల్లు తదితర అంశాల్లో కాలవ శ్రీనివాసులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న వివరాలను కూడా కొందరు నేతలు సునీల్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఏకమయ్యారా..? వాల్మీకి కార్డుతోనే కాలవ రాజకీయాల్లో చెలామణీ అవుతున్నారు. తమపై కాలవ అనుసరిస్తోన్న వైఖరితో గుమ్మనూరు జయరాం, అంబికా, నాగరాజు ఏకమైనట్లు తెలుస్తోంది. పైగా గుమ్మనూరు జయరాం కుమార్తెను పూల నాగరాజు కుమారుడికి ఇచ్చి వియ్యం కలుపుకుంటున్నారు. ఇలా బంధువులుగా మారి తర్వాత రాజకీయంగానూ ఏకం కానున్నారు. మరో వాల్మీకి నేత అంబికా వీరితోనే చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ముగ్గురు వాల్మీకి నేతలు ఏకమైతే పార్టీ అధిష్టానం వద్ద బలంగా తమ వాణీ విన్పించొచ్చని, తద్వారా కాలవకు చెక్ పెట్టొచ్చనేది వీరి భావనగా ఉన్నట్లు సమాచారం. టీడపీ కీలకంగా ఉన్న లోకేశ్తోనూ సన్నిహితంగా ఉంటూ కాలవ ఎత్తులకు పై ఎత్తులు వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా హనీట్రాప్ చిచ్చు టీడీపీలోని వర్గ విభేదాలను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లేలా చేసిన విషయం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంగా మారింది. వాల్మీకీ నేతల మధ్య తారస్థాయిలో విభేదాలు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును అవమానించేలా కాలవ ప్రవర్తన అంబికా, గుమ్మనూరు, నాగరాజులను నిరోధించేలా చర్యలు కాలవకు చెక్ పెట్టేందుకు ఏకమైన ముగ్గురు వాల్మీకీ నేతలు టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ సునీల్కు ఫిర్యాదు -
మద్యం ఫుల్ .. తాగునీరు నిల్ !
చిలమత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో తాగునీరు దొరకడం లేదుగాని... మద్యం మాత్రం ఫుల్గా దొరుకుతోంది. వేసవి వేళ తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి వీధినా మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారని, అలాంటప్పుడు తాగునీటిని ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అన్ని చోట్లా తాగునీటి కష్టాలు హిందూపురం నియోజకవర్గంలో నీటి కష్టాలు పెరిగిపోయాయి. హిందూపురం పట్టణం, రూరల్ , చిలమత్తూరు , లేపాక్షి మండలాల్లో గుక్కెడు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావులు ఎండిపోవడం, నీరు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. ఎక్కడ చూసినా నీటి సమస్యలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా చిలమత్తూరు మండలంలో ఏడాది కాలంగా నీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలోని చిలమత్తూరులోని బీసీ కాలనీ, కోడూరు పంచాయతీలోని మదిరేపల్లి, మొరసలపల్లి పంచాయతీల్లో నీటి సమస్య పట్టిపీడిస్తోంది. లేపాక్షి మండలంలో లేపాక్షి, కల్లూరుల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఎమ్మెల్యేతో పాటు అధికారులకు పట్టదా? తాగునీటి కష్టాలు తొలగించాలని ప్రజలు రోడ్డెక్కుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. వేసవికి ముందే నీటి సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరిస్థితి ఏంటని సమీక్షించిన దాఖలాలు లేవు. కేవలం శుభకార్యాలకు వచ్చినప్పుడు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేసి వెళ్లిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు. బాలయ్య ఇలాకాలో ప్రజలకు తాగునీటి కష్టాలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
15న మంత్రి లోకేష్ ఇల్లు ముట్టడి
పుట్టపర్తి: విద్యాశాఖలో పని చేస్తున్న ‘సమగ్ర’ ఉద్యోగులు పోరుబాట పట్టారు. పాదయాత్రగా వెళ్లి ఈనెల 15వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటిని ముట్టడించనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి సోమవారం డీఈఓ కిష్టప్పకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమగ్రశిక్షలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్లు, ఐఈఆర్పీలు, రిజర్వ్ మొబైల్ టీచర్లు, ఫిజియోథెరపిస్ట్లు, ఆయాలు, పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు తదితర 18 విభాగాల వారు 21 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారన్నారు. అందరూ చాలీ చాలని జీతాలతో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా రూపాయి జీతం పెంచలేదన్నారు. ఏ సమస్యా పరిష్కరించలేదన్నారు. విద్యాశాఖకు లోకేష్ మంత్రిగా ఉన్నా... తమకు న్యాయం చేయక పోవడం బాధాకరమన్నారు. ఇందుకు నిరసనగా ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలసి మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్రగా వెళ్లి ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో ‘సమగ్ర’ ఉద్యోగుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబులేసు, నాయకులు శ్రీరాములు, పోతులయ్య, శ్రీనివాసులు, రామ్మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవీ... ● సమగ్ర శిక్షలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. ● అందరికీ వేతనాలు వెంటనే ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ఏ, డీఏ అమలు చేయాలి. ● పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.10 లక్షలు గ్రాట్యుటీ కల్పించాలి. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, అమలు చేయాలి. ● పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. మెరుగైన హెల్త్ స్కీం అమలు చేయాలి. ఎక్స్గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి. డీఈఓకు నోటీసులు అందజేసిన ‘సమగ్ర’ ఉద్యోగుల జేఏసీ -
నేటి నుంచి ‘సత్యసాయి’ కార్మికుల సమ్మె
బత్తలపల్లి: సత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. నేటి నుంచి (5వ తేదీ నుంచి) నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. సోమవారం వారు బత్తలపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పథకం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు తమకు బకాయిగా ఉన్న 5 నెలల వేతనం మంజూరు చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. 1997 నుంచి 2019 వరకు సత్యసాయి రక్షిత తాగునీటి పథకం సవ్యంగా నడిచిందన్నారు. 2019 నుంచి ఈ పథకం నిర్వహణకు బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర స్థాయి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సమ్మె చేస్తేనే బడ్జెట్ గురించి, నీటి పథకం గురించి ఆలోచించే ఆనవాయితీ ఏర్పడిందన్నారు. 2025–2026 సంవత్సరానికి సత్యసాయి రక్షిత తాగునీటి పథకం నిర్వహణకు రూ.35 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.13.7 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. దీంతో పథకం నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ఇక 2026–27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సత్యసాయి తాగునీటి పథకానికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీనిబట్టి చూస్తే సత్యసాయి రక్షిత తాగునీటి పథకాన్ని నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? అనే సందేహం వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లోనే తాము సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని సమ్మెకు సహకరించి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. రాగిజావ పంపిణీకి లైన్ క్లియర్ ● సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్తో సర్కార్ ఎంఓయూ ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగిజావ అందించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్తో ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా రాగిజావ అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని 2026 నుంచి 2029 వరకు కొనసాగించేందుకు సోమవారం అమరావతిలో విద్యాశాఖ మంత్రి లోకేష్తో ట్రస్ట్ సభ్యులు కలిసి ఎంఓయూపై సంతకాలు చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు గ్లాసు రాగిజావను అందజేస్తారన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ధర్నా రొళ్ల: గ్యాస్ సిలిండర్ బుక్ చేసి వారం రోజులు దాటుతున్నా... ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేయకపోవడంతో రొళ్లలో పలువురు వినియోగదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్ర జాప్యం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల వారికి సిలిండర్ బుక్ చేసినా రెండు, మూడు రోజులకే సరఫరా అవుతోంది. కానీ రొళ్ల మండలంలోని వినియోగదారులు సిలిండర్ బుక్ చేసి 15 రోజులు దాటినా సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో సోమవారం వారంతా స్థానిక బస్డాండ్ ఆవరణలో ఖాళీ సిలిండర్లతో ధర్నాకు దిగారు. తమకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేంత వరకూ ఆందోళన విరమించబోమన్నారు. స్పందించిన స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సాయంత్రంలోపు సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. దీంతో వారంతా ఆందోళన విరమించగా.. సాయంత్రం 4 గంటలకు 80 శాతం మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. -
టీడీపీకి జిల్లా కార్యదర్శి రాజీనామా
రొళ్ల: మండలంలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవిభూషణ్ రాజీనామా చేశారు. తన అనుచరులు 30 మందితో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ ఆ లేఖలను వాట్సాప్ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. టీడీపీకి రాజీనామా చేసిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు బీఎన్ నాగరాజు, డి.హనుమంతరాయుడుతో పాటు కార్యకర్తలు బి.తిప్పేస్వామి, జి.మల్లేశప్ప, హెచ్.హనుమంతరాయ, టి.తిమ్మప్ప, ఈ.హనుమంతరాయప్ప, బి.అశ్వత్థనారాయణ, మంజునాథ్, గోవిందప్ప, పరమేష్, గోవిందరాజు, అంబరీష్, రాజు, రఘు, మల్లేష్, తిప్పేస్వామి, దేవరాజు, మురళిమోహన్, రవి, రఘు, చంద్రన్న, తిమ్మరాజు, వెంకటేష్, హెచ్.సుధాకర్, హనుమంతరాయప్ప, మంజునాథ్, హెచ్. గోవింద, సి.హనుమంతరాయప్ప, కేటీ నాగరాజు, వీటీ నాగరాజు, వీటీ ఈరప్ప, వీటీ హనుమప్ప తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రవిభూషణ్ విలేకరులతో మాట్లాడారు. విలువలు, విశ్వసనీయతలేని తెలుగుదేశం పార్టీలో ఒక్క క్షణం కూడా కొనసాగకూడదని నిర్ణయించుకుని అనుచరులతో కలిసి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్లో ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేయాలన్న విషయాన్ని త్వరలోనే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ డీఎల్ఓగా గతంలో పనిచేసిన రవిభూషణ్...ప్రస్తుతం టీడీపీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజీనామా లేఖ పంపిన రవిభూషణ్ 30 మంది అనుచరులతో కలిసి రాజీనామా లేఖల సమర్పణ -
రాష్ట్రాన్ని కుదిపేసిన ‘అనంత’ హనీట్రాప్ ఉదంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిని పోలీసులు రిమాండ్కు పంపారు. తమ శాఖలోని అధికారులపై వేటు వేశారు. అలాగే బీజేపీ కూడా రిమాండ్కు వెళ్లిన ముగ్గురు మహిళా మోర్చా నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. వీరి
సాక్షిప్రతినిధి అనంతపురం: ‘హనీట్రాప్’ బీజం బీజేపీలో పడి టీడీపీలో విషవృక్షంగా ఎదిగి ‘అనంత’ వాసులను వేధించింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరికొంత మందిపై చర్యలు తీసుకునే దిశగా కేసును విచారిస్తున్నారు. రిమాండ్కు వెళ్లిన ముగ్గురు బీజేపీ మహిళా మోర్చా నేతలు చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి మరో ఇద్దరు నేతల ప్రమేయంపైనా చర్చ నడిచింది. ఇద్దరిలో ఒకరి బ్యాంకు ఖాతాలోకి రంగమ్మ ఖాతా నుంచి రూ.15 లక్షల నగదు బదిలీ జరిగింది. అలాగే రంగమ్మను ప్రోత్సహించిన మరో మాజీ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం కూడా హనీట్రాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు కావడంతో పోలీసుస్టేషన్లలో ఆర్థిక వ్యవహారాలలో పంచాయితీలు కూడా చేశారు. రంగమ్మ బీజేపీలో ఉన్నప్పుడు ఆమెను, ప్రస్తుతం చంద్రకళను ప్రోత్సహించారు. చంద్రకళ మహిళా మోర్చా రాయలసీమ జోనల్ అధ్యక్షురాలిగా పని చేస్తూ హనీట్రాప్ కేసులో రిమాండ్కు వెళ్లారు. చంద్రకళకు జమ్మలమడుగులో ఇసుక క్వారీ ఇప్పించి ఆర్థికంగా స్థితిమంతురాలిని చేసే చర్యలు చేపట్టారు. ఇదంతా మంత్రి సత్యకుమార్ సహకారంతోనే జరిగిందనేది బీజేపీ నేతలే చెబుతున్న మాట! దీన్నిబట్టే చంద్రకళ వ్యవహారాలలో మంత్రి అనుచరుడికి ఏ మేరకు ప్రమేయం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. ఆయనపై హనీట్రాప్ ఆరోపణలు రావడంతో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన ప్రమేయం లేదని చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆరోపణలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దాన్ని పార్టీకి ఆపాదించడమేంటని, ప్రెస్మీట్ వద్దని రాష్ట్ర నేతలు అడ్డుచెప్పారు. దీంతో ప్రెస్మీట్ చివరి నిమిషంలో ఆపారు. బీజేపీ చీఫ్కు జిల్లా నేతల ఫిర్యాదు హనీట్రాప్ ఉదంతం, పార్టీ నేతల ప్రమేయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్కు జిల్లా నేతలు వివరించారు. ఈ వ్యవహారంతో ‘అనంత’ బీజేపీ పరువు బజారున పడిందని ఇద్దరు కీలక నేతలు గట్టిగా ఫిర్యాదు చేశారు. ‘నగదు బదిలీ’ అయిన నేతపై వెంటనే చర్యలు తీసుకుందామని మాధవ్ చెప్పినట్లు సమాచారం. అలాగే మరో నేతపై చర్యలకు మంత్రి సత్యకుమార్ అడ్డుపడే అవకాశం ఉన్నందున అదను చూసి వేటు వేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఓ నేతపై ఏ క్షణమైనా వేటు పడొచ్చు! మరో నేతపై ఆలస్యంగా చర్యలు తీసుకోవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. హనీట్రాప్లో ప్రమేయం ఉన్నవారిపై వేటుకు బీజేపీ నిర్ణయం రంగమ్మ ఖాతా నుంచి నగదు బదిలీ అయిన నేతను బహిష్కరించే యోచన రంగమ్మను ప్రోత్సహించిన మాజీ జిల్లా అధ్యక్షుడి అంశంలో ఆచితూచి నిర్ణయం మంత్రి సత్యకుమార్ అడ్డుపడతారనే కారణంతో ఆయనపై ఆలస్యంగా చర్యలు..! జిల్లా నేతలకు సూచించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇప్పటికే ముగ్గురు మహిళా మోర్చా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ బీజేపీ తరహాలో టీడీపీ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు -
బాల సదన్ విద్యార్థులకు కలెక్టర్ అభినందన
పుట్టపర్తి అర్బన్: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాల సదనాల విద్యార్థులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం అభినందించారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఎన్నో కష్టాలకోర్చి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశంసిస్తూ వారికి బహుమతులు అందజేసి సత్కరించారు. పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తున్న సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (హిందూపురం), హ్యాపీ హోం స్టే (పుట్టపర్తి), ఆర్డీటీ, ఆర్జీటీ సంస్థల నిర్వాహకులకు కూడా సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, బాలల సంరక్షణ అధికారి మహేష్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు మురళీధర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పన్నుపై 5 శాతం రాయితీ ప్రశాంతి నిలయం: ఇంటి పన్నును సకాలంలో చెల్లించే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 5 శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తోందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటిపన్ను రాయితీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందన్నారు. పాత బకాయిలకు గానీ, యూజర్ ఛార్జీలకు గానీ రాయితీ వర్తించబోదన్నారు. ‘పోలీసు పరిష్కార వేదిక’కు 83 అర్జీలు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు 83 అర్జీలు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు ఆయనే వెళ్లి వారి సమస్య తెలుసుకున్నారు. అప్పటికప్పుడు సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. దివ్యాంగులు, మహిళలు ఇచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు బొజ్జప్ప, లక్ష్మీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
సాక్షి తోడు... పదింతల ఫలితం
అనంతపురం ఎడ్యుకేషన్: నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన ‘సాక్షి’ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు అండగా నిలిచింది. బాగా కష్టమని భావించే గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ‘సాక్షి’ యాజమాన్యం తొలిసారి మెటీరియల్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో తాము మంచి మార్కులు సాధించడం వెనుక ఈ మెటీరియల్ దోహదపడినట్లుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సగర్వంగా చెబుతున్నారు. ముఖ్యంగా గణితంలో సమస్యలను పరిష్కరించే విధానం, సైన్స్లో ముఖ్యమైన ప్రశ్నలపై స్పష్టమైన సమాధానాలివ్వడంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ మెటీరియల్ను ప్రశంసిస్తూ, విద్యార్థుల అభ్యాసంలో ఇది కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. సమయానికి సరైన మార్గదర్శకం లభించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ‘సాక్షి’ అందజేసిన ప్రత్యేక మెటీరియల్పై పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే. 70 శాతం ప్రశ్నలు అందులోవే అమ్మ కూలి పని చేస్తుండగా, నాన్న వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్లోని ప్రశ్నలు 70 శాతం వరకు వచ్చాయి. ఆ మెటీరియల్ చదువుకుని నేను గణితంలో 79, సైన్స్లో 96 మార్కులు సాధించాను. మొత్తంగా 523 మార్కులతో రాప్తాడు కేజీబీవీలో టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – ఉమాదేవి గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం చాలా ఉపయోగపడింది నేను రాప్తాడు కేజీబీవీలో చదువుకున్నా. ‘సాక్షి’ అందజేసిన గణితం, సైన్స్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు చదువుకున్నా. అత్యధికంగా ప్రశ్నలు అందులోనివే వచ్చాయి. దీంతో సైన్స్లో 81, గణితంలో 80 మార్కులు వచ్చాయి. మొత్తం 482 మార్కులు సాధించాను. అమ్మానాన్న ఇద్దరూ కూలి పనులకు వెళుతుంటారు. – సుప్రజ, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం ‘సాక్షి’కి రుణపడ్డాం చాలామంది పేద విద్యార్థులు మెటీరియల్ కొని చదివే పరిస్థితిలో లేరు. అయితే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా విద్యార్థులందరికీ మెటీరియల్ అందజేసి అండగా నిలిచిన ‘సాక్షి’కి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ‘సాక్షి’ యాజమాన్యం అందజేసిన మెటీరియల్ చదువుకోవడం వల్ల మొత్తం 560 మార్కులు వచ్చాయి. – ఎస్.మానస, జెడ్పీహెచ్ఎస్, ఆత్మకూరు ‘సాక్షి’ మెటీరియల్ చాలా ఉపయోగపడిందంటున్న విద్యార్థులు -
పాము కాటుతో రైతు మృతి
గాండ్లపెంట: మండలంలోని పోతవాండ్లపల్లికి చెందిన రైతు పొతా వెంకటరెడ్డి (72) శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు..రోజూ గ్రామ సమీపంలోని జీనులకుంటకు వెంకటరెడ్డి డెయిరీకి పాలు వేసేందుకు వెళ్లేవాడు. శనివారం రాత్రి డెయిరీకి పాలుపోసి పొతవాండ్లపల్లికి వెళ్తుండగా, దారి మధ్యలో పాము కాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంకటరెడ్డి విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు బత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య, నాగమ్మ దంపతులు ధర్మవరం సమీపంలోని చిన్నూరు వద్ద ఇల్లు నిర్మాణం చేపట్టారు. రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఆదివారం కూడా ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్తుండగా, ఇదే సమయంలో బత్తలపల్లి వైపు నుంచి ధర్మవరం వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోతలయ్యకు ఎడమ కాలు విరిగింది. నాగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వారిని ఆర్డీటీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. క్షతగాత్రుల కుమారుడు సాకే చిన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యగోరంట్ల: వుండల కేంద్రంలోని ఆంజనేయస్వామి కాలనీకి చెందిన బేల్దారి రాజు (47) కడుపు నొప్పి తాళలేక శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బేల్దారి రాజు తాగుడుకు బానిసయ్యాడు. దీనికితోడు తరచూ కడుపునొప్పితో బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కడుపు నొప్పి తీవ్రమైంది. భార్య ప్రమీలమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి ముంగిట ఆరుబయట నిద్రించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రామనాయక్ తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టరేట్కు రాకుండా www. meekosam. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో .. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వెంట కచ్చితంగా ఆధార్కార్డు తీసుకురావాలన్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని మత్తన్నగారిపల్లికి చెందిన గంగులయ్య (45) ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. శనివారం రాత్రి గాండ్లపెంట మండలంలోని మలమీదపల్లిలో జాతరకు వెళ్లాడు. ఉదయం ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త ఎండకు ప్రయాణం చేయడంతో వేడికి తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని మృతుని భార్య సుగుణమ్మ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. హిందూపురంలో... హిందూపురం: పట్టణంలోని 4వ వారు్ోడ్లని త్యాగరానగర్లో నివాసం ఉంటున్న ప్రేమ్కుమార్ (27) తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆదివారం ఉదయం త్యాగరాజునగర్లోని ఆటోస్టాండ్ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా ప్రేమ్కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కుమార్ను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఖైదీ నుంచి కానిస్టేబుల్ డబ్బు వసూలు ● రూ.65 వేలు ఫోన్ పే ద్వారా వసూలు అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలోని ఏఆర్ విభాగం కానిస్టేబుల్ అవినీతి వ్యవహారం హాట్టాపిక్గా మారింది. రిమాండ్ ఖైదీలను కోర్టు వాయిదా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదరు కానిస్టేబుల్ ఏకంగా నిందితుడితోనే డీల్ కుదుర్చుకున్నాడు. ఓ దొంగతనం కేసులో సదరు నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. రెడ్డిపల్లి సబ్జైలు నుంచి పలుమార్లు రాయదుర్గం కోర్టుకు సదరు నిందితుడిని వాయిదాలకు తీసుకుపోయేవారు. ఎస్కార్ట్ వాహనంలో నిందితులకు బందోబస్తుగా సదరు కానిస్టేబుల్ వెళ్లేవాడు. ఇలా పలుమార్లు సదరు నిందితుడితో చర్చలు జరిపాడు. ఈ కేసులో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను..బెయిల్ రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సదరు కానిస్టేబుల్ నమ్మబలికాడు. నిందితుడి బంధువుల నుంచి రూ.65 వేలు ఒకేసారి ఫోన్ఫే ద్వారా తన బ్యాంకు ఖాతాకు వేయించుకున్నాడు. బెయిల్ రావడానికి కావాల్సిన ష్యూరిటీలు ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ చేతులెత్తేశాడు. దీంతో నిందితుడు, వారి బంధువులు డబ్బులు తీసుకొని పనిచేయలేదు.. డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా ఘటన బయటకు పొక్కింది. గుట్టుగా విచారణ : ఏఆర్ కానిస్టేబుల్ అవినీతి ఉదంతంపై గుట్టగా పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు తీసుకున్న మాట వాస్తమని విచారణలో కానిస్టేబుల్ అంగీకరించినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీకి.. కానిస్టేబుల్కు మధ్య ఓ లాయర్ రాయభారం నడిపినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రెండు, మూడు రోజుల్లో సదరు కానిస్టేబుల్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
సజావుగా నీట్
● హాజరు 96.62 శాతం నమోదు అనంతపురం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో సజావుగా జరిగింది. పరీక్షకు విద్యార్థుల హాజరు 96.62 శాతం నమోదైంది. అనంతపురం నగర పరిధిలోని ఆరు కేంద్రాల్లో, గుత్తి పట్టణ పరిధిలోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఉక్కపోతకు గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 3,494 మంది హాజరయ్యారు. 122 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నీట్ నోడల్ అధికారి, డీఆర్ఓ ఎ.మలోల సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయాంటూ అధికారులను అడిగారు. -
కేబుల్ గుంతలో పడి బైకర్ మృతి
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆలూరురోడ్ విద్యానగర్–1 క్రాస్ దగ్గర కేబుల్ పనుల కోసం తవ్విన గోతి వద్ద బైక్ అదుపు తప్పి రామిరెడ్డి కాలనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఉప్పర ప్రసాద్ (52) ఆదివారం మృతి చెందాడు. వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. ఆయిల్ ట్యాంకర్ను నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రసాద్.. బర్మాశాలలో మృతి చెందిన తన స్నేహితుడి మృతదేహాన్ని సందర్శించి బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో తిరిగి తన బైక్పై ఇంటికి బయల్దేరాడు. విద్యానగర్ క్రాస్–1 వద్ద ఓఎఫ్సీ కేబుల్ కోసం తవ్విన గుంత దగ్గర మట్టి,కంకర అడ్డుగా వేయడంతో అదుపుతప్పి గోతిలో పడ్డాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాద్ ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దోపిడీ కేసు ఛేదింపు.. సొమ్ము రికవరీ
హిందూపురం: పట్టణంలో జరిగిన దోపిడీ కేసు ఛేదించి..ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సొమ్ముతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. ఆదివారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఆటో కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు రాజేశ్వరమ్మను బెదిరించి 83 గ్రాముల బంగారు నగలు రూ.50 వేలు నగదు లాక్కెళ్లిన ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి, నిందితులను గుర్తించారు. ఘటన జరిగిన పది గంటల్లోపే చాకచక్యంగా కేసు ఛేదించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న రాజేశ్వరమ్మ వద్ద నగలు, నగదు ఉన్నట్లు గుర్తించి పతకం ప్రకారం బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ భార్య, 13 ఏళ్ల బాలుడు పెనుకొండకు వెళ్తున్నట్లు చెప్పి డీజిల్ ఆటోలో ఎక్కారు. పక్కనే వేచి ఉన్న రాజేశ్వరమ్మను కూడా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటో.. కొంతదూరం వెళ్లిన తర్వాత కత్తితో బెదిరించి, ఆమె వద్దనున్న బంగారు నగలు, నగదు లాక్కొని, కొట్నూరు బైలు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆమెను వదిలివేసి, అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలు ఫోన్లో సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి, హిందూపురం, పెనుకొండ పోలీసుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసును గంటల వ్యవధిలో ఛేదించారు.నిందితులను సూపర్బీ స్నిన్నింగ్ మిల్లు వద్ద అదుపులోకి తీసుకొని,వారి నుంచి బంగారు నగలు, నగదు, నేరానికి ఉపయోగించిన కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐలు జనార్ధన్, ఆంజనేయులు, అబ్దుల్ కరీం, ఎస్ఐ రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బంగారు, నగదుతోపాటు ఆటో, కత్తి స్వాఽధీనం -
రోడ్డు ప్రమాద రూపంలో ‘కూలి’న జీవితం
రాప్తాడురూరల్: దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రమేష్ (49) జీవితం రోడ్డు ప్రమాదంలో విషాదంగా ముగిసింది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదం కూలీల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన కూలీలు రోజులాగే పని కోసం అనంతపురం శివారు ప్రాంతానికి ఆటోలో బయల్దేరారు. రామినేపల్లి దాటి కాస్తా దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో ఆటో అదుపుతప్పి కిందపడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురయ్యారు. వారిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటోను స్టేషన్కు తరలించారు. -
నయనానందం.. పుష్పయాగం
ధర్మవరం అర్బన్: అనేక రకాల పూల అభిషేకాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఉభయదాతలు అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పొరాళ్ళ పుల్లయ్య కుటుంబ సభ్యులు పట్టణ పురవీధుల్లో వివిధ రకాల పుష్పాలను ఊరేగించారు. అనంతరం స్వామివారికి సమర్పించి పుష్పయాగం చేయించారు. సాయంత్రం 6 గంటలకు శయనోత్సవం(ఏకాంత సేవ) కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమాల్లో ఆలయ ఈఓ వెంకటేష్, అడహక్ కమిటీ ఛైర్మన్ చెన్నంశెట్టి జగదీష్, అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్, చక్రధర్, భక్తులు పాల్గొన్నారు. అలంకరణలో లక్ష్మీచెన్నకేశవస్వామి -
డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల స్వాధీనం
హిందూపురం:పట్టణంలోని రహమత్పూర్ సర్కిల్లో అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని రెవెన్యూ, పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ల నుంచి హోటళ్లకు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ నింపి అధిక ధరలకు విక్రయాలు చేసే వ్యక్తిని రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి, అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 25 కమర్షియల్ సిలిండర్లు, 13 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని డిప్యూటీ తహసీల్దార్ హారతి సీజ్ చేసి తరలించారు. ఈ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్ పక్కనే ప్రైవేట్ విద్యాసంస్థ పంచజన్య బ్రిలియంట్ స్కూల్ ఉండడం ఆందోళన కలిగించే విషయం. గోడౌన్ పక్కనే రైల్వేలైన్ ఉండటంతో నిత్యం రైళ్లు రాకపోకలు సాగుతుంటాయి. ఈమేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమ వాహనంపై నృసింహుడు
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాఽథ్ సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ అర్చకులు, పాల్గొన్నారు. -
విశిష్ట సంప్రదాయం.. శ్రీవారి కల్యాణం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం విశిష్ట సంప్రదాయంగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నెల 10 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 5న జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తరాలుగా కొనసాగుతున్న వివాహ ఆచారానికి మంగళవారం ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం వేదిక కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల ఓ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం ఇక్కడ ఆచారం. నిశ్చితార్థం మొదలుకొని కల్యాణం వరకూ అన్ని బ్రాహ్మణ పండితులు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే వివాహ తంతు, బాలికతో శ్రీవారికి వివాహం జరిపించాలనే ఆలోచన, ఆచారం దాదాపు వందేళ్ల క్రితం నుంచి పద్మశాలీయ వంశస్తుల ద్వారా కొనసాగుతూ వస్తోంది. ఏటా శ్రీవారితో పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపించడం ఆన వాయితీ. 5న బాలికతో శ్రీవారి కల్యాణ ఘట్టం.. ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5న ఉదయం 11.30 గంటలకు అభిజిన్ లగ్నంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన అరవా నాగేష్, పావని దంపతుల కుమార్తె శ్రీస్వర జాహ్నవి అనే బాలికతో శ్రీవారి వివాహం జరిపించనున్నారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (జాహ్నవి) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కూతురిని అలంకరించి, కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహం జరిపిస్తారు. తొమ్మిదేళ్ల బాలికతో రేపు శ్రీవారి వివాహ ఘట్టం కల్యాణోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు -
వేపకుంటలో పచ్చ రౌడీయిజం
కనగానపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. అధికారం అండతో రెచ్చిపోతున్న పచ్చమూకలు భౌతికదాడులకూ పాల్పడుతున్నాయి. తాజాగా మండలంలోని వేపకుంట గ్రామంలో స్థానిక టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడి, ముగ్గురిని గాయపరిచారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేపకుంట గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసే స్థలంపై చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. రాజకీయ దురుద్దేశంతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులు పోతిరెడ్డి, శ్రీరామరెడ్డి ఇళ్ల ముందు ప్రధాన రహదారి పక్కనే విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంతో గ్రామస్తులతో కలసి వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయినా గ్రామంలో తమ మాటనే నెగ్గాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు రాత్రికి రాత్రే విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేయటంతో పాటు అక్కడున్న గుడ్డం రామలింగారెడ్డి, గంగుల లింగారెడ్డి, నాగసుధపై టీడీపీ నాయకులు తలారి రమేష్, సురేష్, అనిల్, లింగన్న, చండ్రాయుడు, గోపాల్తో పాటు 20 మంది కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తర్వాత వారంతా గ్రామంలో కేకలు వేసుకుంటూ అరగంట పాటు అలజడి సృష్టించి వివాదాస్పద స్థలంలో విగ్రహాన్ని పెట్టారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమీ తెలియనట్లు ఆలస్యంగా అక్కడి చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముగ్గురినీ వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు కనగానపల్లి ఎస్ఐ ఎం.రిజ్వాన్ తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ నేతల దాడి గ్రామంలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు స్థలంపై వివాదం కోర్టు ఆదేశాలు ధిక్కరించి రాత్రి పూట విగ్రహం ఏర్పాటు అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ మూకల దాడి ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు సంఘటనపై స్పందించని పోలీసులు -
‘రీల్స్’ పిచ్చి.. విద్యార్థికి గాయాలు
పుట్టపర్తి టౌన్: రీల్స్ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పబ్లిసిటీ పొందాలన్న పిచ్చిలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ సంఘటన కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు శివకుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తరచూ రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఆనందపడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పోతులకుంటలోని పాత సచివాలయం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా... పెట్రోల్ ఒక్కసారిగా మీద పడి మంటలు చెలరేగాయి. స్నేహితులు అప్రమత్తమై వెంటనే షర్టు తీసేయడంతో యువకుడికి పెను ప్రమాదం తప్పింది. అనంతరం శివకుమార్ను హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన గుర్తు చేసింది. -
మాతాశిశు మరణాలు నివారించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన... కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మాతా శిశు మరణాలపై సమీక్షించారు. గర్భిణుల్లో రక్త హీనత, అధిక బరువు, ఆరోగ్య సమస్యలను మొదటి త్రైమాసికంలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు. రక్త హీనత ఉన్న గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు. హైరిస్క్ కేసులను ప్రసవానికి వారం ముందే పెద్దాసుపత్రుల్లో చేర్చాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, డీఐఓ నాగేంద్రనాయక్ పాల్గొన్నారు. ఉత్తమ వైద్య సేవలకు ఎన్క్యూఎస్ గుర్తింపు.. జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ముందున్న 20 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఉపకేంద్రాలకు కేంద్రం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల (ఎన్క్యూఎస్) అవార్డుల ప్రకటించింది. శనివారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆ అవార్డులను ఉపకేంద్రాల సిబ్బందికి ప్రదానం చేశారు. ‘ఉపాధి’ పనుల తనిఖీ.. పెనుకొండ రూరల్: ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం పెనుకొండ వైపు వెళ్తున్న కలెక్టర్... మార్గమధ్యంలో రాంపురం పంచాయతీ శివారులో ఉపాధి హామీ కింద మరువపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు నీరందించేందుకు ఉపాధి హామీ కింద చేపట్టిన కాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి, ఎంపీడీఓ ఉమాదేవి, ఏపీఓ సంజీవ రెడ్డి ఉన్నారు. చైన్ స్నాచర్.. విద్యుత్ ఉద్యోగి ● మహిళ మెడలోని గోల్డ్ చైన్ అపహరణ..అరెస్టు కదిరి టౌన్: అతను విద్యుత్ శాఖలో ఉద్యోగి.. జీతం సరిపోలేదో...లేక వ్యసనాలకు బానిసయ్యాడో గానీ చోరీల బాట పట్టాడు. ఓ మహిళ మెడలోని బంగారు చైను లాక్కెళ్లి కటకటాల పాలయ్యాడు. ఈ కేసు వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి పట్టణ పోలీసుస్టేషన్లో విలేకరులకు తెలిపారు. దొంగను పట్టించిన సీసీ కెమెరాలు.. కదిరి ఏపీఎస్పీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే భూక్యా రమేష్నాయక్ చెడు వ్యసనాలకులోనయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఏప్రిల్ 28న ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగించే మగ్గాల క్వార్టర్స్కు చెందిన పైపల్లి శాంతి హిందూపురం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వెళ్లి ఆమె మెడలోని రూ.2 లక్షల విలువైన (2 తులాలు) బంగారు తాళిబొట్టు గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా భూక్యా రమేష్ నాయక్ను శనివారం అరెస్టు చేసి అతడి నుంచి 2 తులాల బంగారు తాళి బొట్టు స్వాధీనం చేసుకున్నారు. -
సూర్య సెగ.. జనం విలవిల
కదిరి: సూర్యుడు సెగలు కక్కుతుండగా...జనం విలవిల్లాడిపోతున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 43 డిగ్రీల మార్కును దాటడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ వేసవిలో వడదెబ్బ సోకి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారు. రానున్న రోజుల్లోనూ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ ఖాళీ.. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి హడలి పోతున్నారు. దీంతో ఆ సమయంలో జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి ఎండలు ఎక్కువే.. గత ఏడాది మే 2వ తేదీన జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి అదే రోజు గతంతో పోలిస్తే మరో 5 డిగ్రీలు పెరిగింది. శనివారం కదిరిలో 43.4 డిగ్రీలు, ధర్మవరంలో 42.1 డిగ్రీలు, పెనుకొండ 41.3, హిందూపురం 41.2, పుట్టపర్తి 41.8, మడకశిర 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎవరి నోట విన్నా ఎండల మాటే వినపడుతోంది. అకాల వర్షాలు.. ఈసారి వేసవిలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండల తీవ్రత ఒకవైపు ఉంటే.. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. పుట్టపర్తిలోని ఎనుములపల్లిలో నారపరెడ్డి అనే రైతు ఇంటి సమీపంలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. గోరంట్ల మండలంలో శుక్రవారం అత్యధికంగా 120.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ధర్మవరం మండలం ఆకుతోటపల్లిలో మురళీమోహన్రెడ్డికి చెందిన సుమారు 2,500 అరటిచెట్లు గాలి, వానకు నేలకొరిగాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత 43 డిగ్రీల మార్కును దాటిన గరిష్ట ఉష్ణోగ్రత జిల్లాలో అక్కడక్కడా అకాల వర్షాలు విచిత్ర వాతావరణంతో జనం ఉక్కిరి బిక్కిరి -
అకాల వర్షం.. అపార నష్టం
ధర్మవరం రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అపార నష్టం జరిగింది. మామిడి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ధర్మవరం మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో రైతు మురళీమోహన్రెడ్డి మూడు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో సుమారు 2500 దాకా అరటి చెట్లు నేలకొరిగాయాని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.3 లక్షల దాకా నష్టం వాటిల్లిందన్నారు. ఎన్పీకుంట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాలి, వాన బీభత్సం సృష్టించింది. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గెంగినాయునిపల్లి, నేరెడుచెరువు గ్రామాల్లో ఇంటి పైకప్పులకు వేసిన రేకులు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మొక్కజొన్నకు నష్టంతనకల్లు: మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి టీ. సదుంలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. శంకర, అంజినప్ప మూడు ఎకరాల చొప్పున ఆరు ఎకరాలలో మొక్కజొన్న దెబ్బతింది. పంట బాగుండటంతో లాభం వస్తుందనుకున్న సమయంలో రూ.2 లక్షల దాకా నష్టపోయామని బాధితులు వాపోయారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నేలరాలిన మామిడికనగానపల్లి: మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన మోస్తరు వర్షానికి పంట నష్టం జరిగింది. గాలీవానతో కనగానపల్లి, రాంపురం గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కనగానపల్లిలోని రైతు లక్ష్మీనారాయణకు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోవడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. పుట్టపర్తి టౌన్: పట్టణంలో గురువారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దంచికొట్టిన వానకు రహదారులు వాగులను తలపించాయి. వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పుట్టపర్తి సమీపంలో ఎనుములపల్లిలో నారపరెడ్డి ఇంటి వెనుక భాగాన కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. 30 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 30 మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. జిల్లా మొత్తం 512.8 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. గోరంట్ల మండలంలో అత్యధికంగా 120.4 ఎంఎం, రొద్దం 48.2, కనగానపల్లి 41.8,అమడగూరు 23.2, రామగిరిలో 20.6, సోమందేపల్లిలో 20.6 ఎంఎం వర్షం కురిసింది. పెనుకొండ 19.2, నల్లమాడలో 19, పరిగిలో 18.4, చిలమత్తూరులో 16.4, సీకేపల్లిలో 15.2 వర్షం పడింది. -
ప్రతిభావంతులకు అవకాశం
గతంలో ఆర్డీటీ సెట్ నిర్వహించి 400 ప్రతిభావంతులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు దోహదపడేవాళ్లం. ఈ సారి మరింత విస్తృతం చేస్తూ అదనంగా వెయ్యి మందిని ఎంపిక చేయనున్నాం. అయితే ఇందుకు సెట్ నిర్వహించడం లేదు. పదో తరగతిలో సాధించిన ఉత్తమ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి స్పెషల్ స్కాలర్షిప్, సెమీ స్కాలర్షిప్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 400 మందికి స్పెషల్ స్కాలర్షిప్, 1000 మందికి సెమీ స్కాలర్షిప్ ఇస్తున్నాం. – మోహన మురళీ, ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ -
పేదల భూమి కబ్జాకు కూటమి నేతల యత్నం
● అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 75–1లో పేదలకు ఇంటి పట్టాల కోసం కేటాయించిన భూమిని శుక్రవారం ఉదయం కూటమి నాయకులు చదును చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నేత, మాజీ సర్పంచ్ శివశంకర్, నాయకులు పెద్ద వీరనారప్ప, నరసింహయ్య, ఓబులేసు, నారాయణస్వామితో పాటు మరికొందరు గ్రామస్తులు అక్కడకు చేరుకుని కూటమి నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. 2023లో గుంజేపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల కోసం అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్ 75–1లోని భూమిని కేటాయించిందని, దీంతో అప్పట్లో రూ. 2లక్షల ప్రభుత్వ నిధులతో ఆ ప్రాంతాన్ని చదును చేయించినట్లు గుర్తు చేశారు. అప్పటి తహసీల్ధార్ సహకారంతో 80 ప్లాట్లతో లేఅవుట్ను రూపొందించి రాళ్లను కూడా పాతించామన్నారు. గ్రామంలోని 80 మంది నిరుపేదలను గుర్తించి వారికి ప్లాట్లను కేటాయించి, వారి పేర్లతో జాబితాను సిద్ధం చేశారని, ఇంటి పట్టాలు పంపిణీ చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయిందన్నారు. అయితే పేదల కోసం కేటాయించిన స్థలాన్ని కూటమి నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. విషయాన్ని ఫోన్ ద్వారా చేరవేయడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని పరిశీలించారన్నారు. వివాదానికి సంబంధించి విచారణ నిమిత్తం సరైన పత్రాలతో తహసీల్ధార్ కార్యాలయానికి రావాలని ఆదేశించారన్నారు. డీఆర్ఓగా కొండయ్య ప్రశాంతినిలయం: డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్ఓ)గా కొండయ్యను నియమిస్తూ ప్రభుత్వ చీప్ సెక్రెటరీ సాయిప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో పని చేస్తున్న విజయ సారథి ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. కొండయ్య గతంలో జిల్లాలో పని చేస్తూ నెల్లూరు డిప్యూటీ కలెక్టర్గా వెళ్లారు. తిరిగి జిల్లాకు డీఆర్ఓగా బదిలీ అయ్యారు. కేఎఫ్ఆర్ వర్సిటీతో జేఎన్టీయూ ఒప్పందం అనంతపురం: అంతర్జాతీయ స్థాయి పోటీకి దీటుగా విద్యా ప్రమాణాలు పెంపుదల చేసేలా జర్మనీలోని కేఎఫ్ఆర్ యూనివర్సిటీతో జేఎన్టీయూ(ఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు వర్సిటీల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలను శుక్రవారం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యత పెంపొందించేలా రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. జర్మనీలోని ఆ విశ్వవిద్యాలయ నాలెడ్జ్ ఫౌండేషన్ సీఈఓ డేనియల్ గీగిస్ వర్చువల్గా మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అలాగే, ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీతో అన్ని విధివిధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. జర్మనీ వర్సిటీ ప్రతినిధులు రాజ్ వంగపండు, శ్యామ్ సుందర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, అడ్మిషన్లు – విదేశీ వ్యవహారాల డైరెక్టర్ ఎ.సురేష్బాబు, ప్రొఫెసర్ భానుమూర్తి , ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఓ.దేవన్న తదితరులు పాల్గొన్నారు. దళిత యువకుడిపై హత్యాయత్నం ● అనంతపురంలోని జీజీహెచ్కు తరలింపు తాడిమర్రి: మండలంలోని దాడితోట గ్రామంలో దళిత యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కుళ్లాయప్ప కుమారుడు బద్రి పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదువు మానేసి గ్రామంలో అరటి కాయల వ్యాపారి వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. ఈ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కూలి సొమ్ము తీసుకుని మిగిలిన కూలీలతో కలసి స్వగ్రామానికి బయలుదేరిన బద్రిపై గ్రామానికి చెందిన రమణారెడ్డి కుమారుడు శశిభూషణ్రెడ్డి కొడవలి విసిరాడు. దీంతో బద్రి వీపుపై లోతైన గాయమైంది. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణవేణి... దాడికి పాల్పడిన శశిభూషణ్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రూ.500 ఇచ్చి మృతదేహం తీసుకెళ్లు
హిందూపురం టౌన్: శవాలపై పడిన చిల్లర ఏరుకోవడం అనేది పాత సామెత, కానీ శవాల్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేయడం అనేది కొత్త నానుడి. సీఎం చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలోని జిల్లాస్పత్రిలో ఈ దందా వెలుగు చూసింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గురువారం మధ్యాహ్నం హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రామాంజి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వెంటనే స్థానిక జిల్లాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధులు తీవ్ర ఆగ్రహానికి లోనై ఆందోళనకు దిగారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగిస్తారని పేర్కొనడంతో శాంతించారు. అయితే శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఒకరి మీద ఒకరు చెబుతూ పోస్టుమార్టం నిర్వహించడంలో తీవ్ర ఆలస్యం చేశారు. కేసు నమోదు కాలేదని ఒకసారి, ఉత్తర్వులు అందినప్పుడు చేస్తామని మరోసారి చెబుతుఊ కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం డీకంపోస్ట్ అవుతూ దుర్వాసన వెదజల్లుతుండడంతో చివరకు పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మృతుడి సంబంధీకుల వద్ద నుంచి రూ.3,800 నగదు తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.500 ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న తమ వద్ద అంత్యక్రియలకు సంబంధించిన డబ్బు తప్ప మరేమీ లేదని తెలిపినా వినలేదు. చివరకు రూ.500 చెల్లించడంతో మృతదేహాన్ని అప్పగించారని బంధువులు తెలిపారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య మృతుడి బంధువుల అభ్యర్థన మేరకు మృతదేహాన్ని శుభ్రం చేయడం, దుర్వాసన వెదజల్లకుండా సెంట్ చల్లడం, ప్యాకింగ్కు అవసరమైన సామగ్రి కోసం సంబంధీకుల వద్ద నుంచి డబ్బు తీసుకోవడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యే ఉంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ఇవ్వడం లేదు. అయినా ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టాం. – డాక్టర్ జనార్దన్, సూపరింటెండెంట్, జిల్లాస్పత్రి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో అమానుషం మార్చురీ వద్ద దందాపై మృతుడి కుటుంబ సభ్యుల ఆవేదన హిందూపురం ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు -
● ఘనంగా బుద్ధ పూర్ణిమ
ప్రశాంతినిలయం: సత్యసాయి మహాసమాధి చెంత బుద్ద పూర్ణిమ వేడుకలు శుక్రవారం ఘనంగా సాగాయి. వేడుకల్లో బౌద్ధ ధర్మాన్ని ఆచరించే బ్రూనై, ఇండోనేషియా, జపాన్, లావో, మలేషియా, మయన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, థైవాన్ తదితర దేశాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వేడుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు ప్రారంభించగా, బౌద్ద గురువులు వేద పఠనంతో సత్యసాయి పల్లకీ ఉత్సవాన్ని చేపట్టారు. మహాసమాధి చెంత బుద్దుని ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను ఉద్దేశించి కో–ఆర్డినేటర్ డాక్టర్ నరోత్తమ్ ఉపాధ్యాయ ప్రసంగించారు. అనంతరం భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం జరిగిన వేడుకల్లో భాగంగా నేపాల్కు చెందిన సత్యసాయి బాలవికాస్ విద్యార్థులు బుద్ద పూర్ణిమ వేడుకల ప్రాశస్త్యాన్ని చాటుతూ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. -
బంగారు గొలుసు అపహరణ
హిందూపురం: గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఓ ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసును ఆటో డ్రైవర్ అపహరించుకెళ్లిన ఘటన హిందూపురంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురానికి చెందిన రాజేశ్వరమ్మకు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద తోట ఉంది. రోజూ ఆటోలో తోట వద్దకెళ్లి వచ్చేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన తోట వెళ్లేందుకు సిద్ధమైన రాజేశ్వరమ్మ స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ఆటో కోసం వేచి చూస్తుండగా ఓ డ్రైవర్ తన ఆటోను ఆపి సోమందేపల్లికి వెళుతున్నట్లు తెలిపాడు. అయితే ఆటోలో ఓ ప్రయాణికురాలు ఉండడంతో రాజేశ్వరమ్మ ధైర్యం చేసి ఎక్కింది. కేతగాని చెరువుకట్ట వద్దకు చేరుకోగానే నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను డ్రైవర్ ఆపేశాడు. అనంతరం ప్రయాణికురాలిగా ఉన్న తన భార్యతో కలిసి రాజేశ్వరమ్మను బెదిరించి ఆమె మెడలోని 5 తులాల బంగారు నగను అపహరించి, ఆటో నుంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆటో ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
కొత్తవి వద్ద్దు.. పాతవి రద్దు
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నూతన పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను తొలగించుకుంటూపోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ ఆనందం వెల్లివిరిసేలా చేస్తే... చంద్రబాబు ప్రభుత్వంలో వారి ఆనందం ఆవిరైపోయింది. రెండేళ్ల బాబు పాలనలో జిల్లాలో సుమారు 14,364 పింఛన్లు కోత వేయడంతో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి. ఎన్నాళ్లో ఎదురుచూపులు.. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి దాకా ఎంతో మంది మహిళలు భర్తను పోగొట్టుకొని కుటుంబ పోషణ భుజాన వేసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంటి పట్టున ఉండే వృద్ధులు, అంగ వైకల్యంతో నానా అవస్థలు పడుతున్న దివ్యాంగులు నూతన పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 32 మండలాల ఎంపీడీఓ కార్యాలయాలు, కలెక్టరేట్, వెలుగు కార్యాలయాల్లో వితంతువుల దరఖాస్తులు సుమారు 10 వేలకు పైగా ఉంటాయని అంచనా ఉంది. అధికారులు, ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు వెళ్లిన ప్రతిసారీ వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రెండేళ్లుగా అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ దాటవేస్తూనే ఉన్నారు. బీసీలదీ అదే పరిస్థితి.. అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లు వయస్సు పూర్తయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకూ అటువైపుగా కనీసం ఆలోచించలేదు. ఆయా క్యాటగిరిల్లో జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది ఉన్నట్లు తెలిసింది. గ్రామాల్లోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే మాత్రం అది పాలసీ మ్యాటర్ అంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందు కోసమేనా మేము మిమ్మల్ని గెలిపించింది అంటూ విమర్శిస్తున్నారు. ఒకటో తారీఖు వస్తోందంటే చాలు పింఛన్దారులు సంతోషించాల్సింది పోయి ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్లలో కోతలు పెడుతుండటమే ఇందుకు కారణం. కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సింది పోయి.. ఉన్న పింఛన్లు తొలగిస్తుండటంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేయని చంద్రబాబు సర్కార్ ఉన్న వాటినీ తొలగిస్తున్న వైనం రెండేళ్లలో 14,364 పింఛన్ల రద్దు లబోదిబోమంటున్న పింఛన్దారులు -
వైభవం.. బ్రహ్మరథోత్సవం
రొళ్ల: మండలంలోని కాల్వేపల్లిలో వెలసిన లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయంలో విశేష పూజలు, హోమాలు జరిగాయి. అనంతరం లక్ష్మీదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను రథంపైకి చేర్చి గోవిందనామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా శనివారం వసంతోత్సవం, 101 ప్రసాద వినియోగం, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
హంస వాహనంపై చెన్నకేశవుడు
ధర్మవరం అర్బన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి హంస వాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు చక్రస్నానం చేయించారు. శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు పసుపు, కుంకుమ, వివిధ రకాల రంగులతో వసంతోత్సవం జరిపించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై చెన్నకేశవస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. టన్ను మామిడి రూ.1.20 లక్షలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మామిడి మార్కెట్లో శుక్రవారం టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 310 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు, కనిష్టంగా రూ.40 వేలు, సరాసరిన రూ.80 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. -
భక్తిశ్రద్ధలతో గిరి రఽథోత్సవం
పుట్టపర్తిటౌన్: సత్యసాయి గిరి రథోత్సవం శుక్రవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ప్రశాంతి నిలయం ముఖద్వారం వద్ద అలకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, ెపెట్రోల్ బంక్, చింతతోపులు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా ఊరేగింపుగా ప్రశాంతి నిలయానికి చేర్చారు. అనంతరం మహా మంగళ హారతులతో ముగించారు. ఈ ఉత్సవంలో దేశ, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ‘మగువ మహోన్నతి’ పోస్టర్ల ఆవిష్కరణ ప్రశాంతినిలయం: ‘స్పార్క్ 8.0 –మగువ మహోన్నతి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో జేసీ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రతన్టాటా ఇన్నోవేషన్ హబ్, అనంతపురం స్పోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. మహిళల జీవనోపాధి, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 8 నుంచి జూన్ 8వ తేదీ వరకూ రోజూఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిందూపురంలోని సంఘమిత్ర మండల సమాఖ్య సమావేశ మందిరం, డ్వామా ప్రాంగణంలో కార్యక్రమం ఉంటుందన్నారు. నెట్వర్క్ల అభివృద్ధి, మార్కెట్ అవకాశాల విస్తరణ, స్టార్టప్స్కు మద్దతు, మహిళల ఆర్థిక సాధికారత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికృష్ణ, హబ్ ప్రతినిధులు సమీరా పరమేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ సతీష్ ధర్మవరం అర్బన్: పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ను ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు, నమోదు అవుతున్న కేసుల సంఖ్య, సీసీ కెమెరాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలన్నారు. వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్ఐ ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు. -
తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకే హత్య
● ముగ్గురు నిందితుల అరెస్టు ధర్మవరం అర్బన్: ఇచ్చిన డబ్బు వెనక్కి అడిగినందుకు వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రెడ్డెప్ప మాట్లాడారు. మదనపల్లికి చెందిన పూల రమణారెడ్డి నాలుగేళ్ల క్రితం ధర్మవరం గాంధీనగర్కు చెందిన మాయకుంట్ల చక్రధర్ అలియాస్ చక్రికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల అనంతరం తిరిగి రూ.లక్ష రమణారెడ్డికి ఇచ్చాడు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వాలని చక్రధర్ను పలుమార్లు రమణారెడ్డి డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవానికి ధర్మవరానికి వచ్చిన రమణారెడ్డి తన డబ్బులు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి అడిగాడు. దీంతో ధర్మవరంలో ఉన్న రమణారెడ్డిని చక్రధర్, అతని స్నేహితులు సింగెటి రాజు, నీలూరి రమేష్లతో కలిసి గతనెల 29న అర్ధరాత్రి మార్కెట్యార్డు సమీపంలోని ఎస్ఆర్ కార్ వాషింగ్ షెడ్కు తీసుకెళ్లారు. ‘రూ.మూడు లక్షల అప్పు కోసం నాకే ఫోన్ చేసి అడుగుతావా, నిన్ను చంపి మీ ఇంటి వద్దనే పారేస్తాం. ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం’ అని రమణారెడ్డిని ఇనుపు పైపు, కట్టెలతో విచక్షణ రహితంగా కొట్టి అతని బంధువుల ఇంటి వద్ద గత నెల 30న తెల్లవారుజామున పడేసి వెళ్లిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని రమణారెడ్డిని విచారించగా జరిగిన విషయం చెప్పాడు. అనంతరం రమణారెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తుండగా గూడ్స్షెడ్ కొట్టాలలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఉచితం కాదు.. ఉపకార వేతనం
అనంతపురం: కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న ఆర్డీటీ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దన్నుగా నిలిచే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పదో తరగతిలో మంచి మార్కులతో సత్తా చాటిన వారికి గతంలో ఆర్డీటీ సెట్ నిర్వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఆరేళ్ల పాటు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తూ వచ్చింది. తాజాగా వీటిని మరింత విస్త్ర ృత పరుస్తూ.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తీపి కబురు అందించింది. అన్ని సామాజిక వర్గాల వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను గురువారం జారీ చేసింది. అర్హులు ఎవరంటే ● ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి (స్టేట్ సిలబస్ విధానం) 520 ఆపై మార్కులు, సీబీఎస్ఈ సిలబస్ విధానంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 430/500 సాధించి ఉండాలి. వీరు స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం, సెమీ స్కాలర్షిప్కు అర్హులు. ● పదో తరగతిలో స్టేట్ సిలబస్కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు 550 ఆపై మార్కులు, సీబీఎస్ఈ సిలబస్ విధానంలో 450/500 ఆపై మార్కులు సాధించి ఉండాలి. వీరు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు అర్హులు. ● ఆర్డీటీ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ● సమాన మార్కులు వస్తే .. సైన్స్, మేథమేటిక్స్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ● కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని బట్టి ఎంపిక ఉంటుంది. ● ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో మంచి స్థాయిల్లో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అనర్హులు. ● నెలకు రూ.15 వేలు, ఆ లోపు వేతనం తీసుకుంటున్న చిరుద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు. వేతన ధృవీకరణ పత్రం సమర్పించాలి. 1,400 మందికి అవకాశం స్పెషల్ స్కాలర్షిప్ కింద 400 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్, బీటెక్ వరకు (మొత్తం ఆరేళ్లు) కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లిస్తారు. సెమీ స్కాలర్షిప్ కింద 1000 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ కోర్సులో ఏడాదికి రూ.40 వేలు చొప్పున రెండేళ్లు పాటు చెల్లిస్తారు. ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి ఆర్డీటీ స్పెషల్ స్కాలర్షిప్, సెమీ స్కాలర్షిప్కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంది. పదో తరగతి హాల్టికెట్, పదో తరగతి మార్కుల జాబితా, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్, ఇటీవల జారీ చేసిన రేషన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (జిరాక్స్) అందజేయాలి. ఆయా ఆర్డీటీ ఏరియా కార్యాలయాల్లో సంప్రదించి.. దరఖాస్తులు అందజేయవచ్చు. ఆర్డీటీ సెట్లో కీలక మార్పులు స్పెషల్ స్కాలర్షిప్కు ఎంపికై తే ఆరేళ్ల వరకు నేరుగా విద్యా సంస్థకు ఫీజు చెల్లింపు సెమీ స్కాలర్షిప్కు ఎంపికై తే ఇంటర్మీడియట్ రెండేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లింపు అన్ని సామాజిక వర్గాల వారికీ అవకాశం -
ప్చ్.. ఫలితం మారలేదు
పుట్టపర్తి: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా జిల్లా పల్టీ కొట్టింది. 100 రోజుల ప్రణాళిక పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం మాత్రం మారలేదు. జిల్లా నుంచి 21,183 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 16,977 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 80.14 నమోదుకాగా, రాష్ట్రస్థాయిలో 22వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఫలితాల్లో జిల్లాకు 23వ స్థానం రాగా, ఈ సారి ఒక మెట్టు ఎక్కి 22వ స్థానానికి చేరుకుంది. 13,629 మందికి ఫస్ట్ క్లాస్ జిల్లాకు చెందిన 16,977 మంది ఉత్తీర్ణులుకాగా, అందులో 13,629 మంది ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. అలాగే 2,422 మంది సెకండ్ క్లాస్లో, 926 మంది థర్డ్ క్లాస్లో పాసయ్యారు. సత్తా చాటిన బాలికలు పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు సత్తా చాటారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా టాపర్లుగా ఇద్దరూ బాలికలే నిలిచారు. జిల్లా నుంచి 10,162 మంది బాలికలు పరీక్ష రాయగా, 8,553 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 84.17 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. పలువురికి 590పైగా మార్కులు జిల్లాలోని 74 పాఠశాలల్లోని విద్యార్థులు 590పైగా మార్కులు సాధించటం విశేషం. పరిగి సేవా మందిరం పాఠశాలకు చెందిన టి. శిరీష 593 మార్కులు, కదిరి బాలికల పాఠశాల విద్యార్థి ఆఫీఫా ఫాతిమా 593 మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సందీప్ రెడ్డి 592 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో నలుగురు విద్యార్థులు కూడా ఈ ఘనత సాధించారు. ఇక ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించి గోరంట్ల శ్రీచైతన్య పాఠశాలకు చెందిన శ్రీజరెడ్డి 597 మార్కులు సాధించి ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచాడు. సత్తా చాటిన విద్యార్థులను యాజమాన్యాలు అభినందించాయి. గురుకులాల ఫలితాలు ఇలా... పదో తరగతి ఫలితాల్లో గురుకులాలు వెనుకబడ్డాయి. ఏపీఆర్ఈఐఎస్ 96.05 శాతం, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు 95.04 శాతం, ఏపీ వెల్ఫేర్ పాఠశాలలు 92.34 శాతం, కేజీబీవీలు 87.11 శాతం ఫలితాలు సాధించాయి. 25 నుంచి సప్లిమెంటరీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25వ తేదీ నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 9వ తేదీ లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 25 వరకు ఫీజు చెల్లింవచ్చని డీఈఓ కిష్టప్ప తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడుకంటే తక్కువ సబ్జెక్టులకు రూ. 110, మైగ్రేషన్ రుసుం రూ. 80 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్ కోరే విద్యార్థులు రూ. 500, రీ వెరిఫికేషన్, జవాబుపత్రాలు జిరాక్స్ ప్రతులు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి ఈనెల 7వ తేదీ లోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో మాత్రమే దరఖాస్తు చేయాలని డీఈఓ స్పష్టం చేశారు. నేరుగా డీఈఓ కార్యాలయానికి గాని, బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారికి పోస్ట్ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ అందజేసినా స్వీకరించబోమని స్పష్టం చేశారు. పది ఫలితాల్లో జిల్లాకు అట్టడుగు స్థానం 22వ స్థానంతో సరిపెట్టుకున్న వైనం గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగు ఈసారి సత్తా చాటిన బాలికలుఆఫీఫాకు అభినందన కదిరి అర్బన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కదిరి జెడ్పీహైస్కూల్లో చదివే ఆఫీఫా ఫాతిమా 593 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. ఆఫీఫా ఫాతిమా తండ్రి మొఘల్ మన్సూర్ అలీ బంగారం దుకాణం నిర్వహిస్తారు. తల్లి మొఘల్ రుక్సానా గృహిణి. గురువారం కదిరి జెడ్పీహైస్కూల్లో డీఈఓ కిష్టప్ప బాలికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో అభినందించారు. ఆయన వెంట హెచ్ఎం వెంకటాచలం, ఎంఈఓ చెన్నకృష్ణ, ఓబుల్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
ధర్మవరం అర్బన్: చేతి బదులుగా తెలిసిన వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగితే మద్యం తాపించి దాడి చేసి హతమార్చారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరానికి చెందిన పూల రమణారెడ్డి(40)కి భార్య రామంజినమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబంతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నివాసముంటూ అక్కడే మరమగ్గాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధర్మవరానికి చెందిన తన స్నేహితుడు చక్రవర్తి అలియాస్ చక్రికి కొన్నేళ్ల క్రితం రూ.4 లక్షలు చేతి బదులుగా ఇచ్చాడు. ఆ డబ్బు ఇవ్వాలని రమణారెడ్డి అడగడంతో రూ.లక్ష చెల్లించాడు. మిగిలిన రూ.3 లక్షలు కూడా ఇవ్వాలని తరచూ చక్రికి రమణారెడ్డి ఫోన్ చేసేవాడు. అయినా చక్రి పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం సందర్భంగా ఇటీవల స్థానిక చంద్రబాబునగర్లో ఉన్న తన అక్క సుజాత ఇంటికి రమణారెడ్డి వచ్చాడు. బుధవారం రాత్రి చక్రిని కలిసి తన స్నేహితులతో కలిసి డిన్నర్ ఉందని రమణారెడ్డిని పిలుచుకుని మార్కెట్యార్డు సమీపంలో ఉన్న ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్లోకి పిలుచుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో రమణారెడ్డి తనకివ్వాల్సిన రూ.3లక్షల గురించి చక్రిని అడిగాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒకానొక దశలో చక్రి తన స్నేహితులతో కలిసి రమణారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన రమణారెడ్డిని కారులో తీసుకెళ్లి అతని అక్క సుజాత ఇంటి ఎదుట పడేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో శబ్దం రావడంతో సుజాత బయటకు వచ్చి చూసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న రమణారెడ్డిని గమనించి ఆరా తీయడంతో చక్రి, అతని స్నేహితులు కొట్టి అక్కడ పడేసి వెళ్లారని తెలిపాడు. వెంటనే రమణారెడ్డిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమణారెడ్డి అక్క సుజాత, భార్య రామంజినమ్మ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగినందుకు దాడి తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఇంటి వద్ద పడేసిన వైనం ఆస్పత్రికి తరలించేలోపే మృతి -
త్వరలోనే సెకండ్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
హిందూపురం: వీలైనంత త్వరగా హిందూపురంలో సెకండ్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి భీమారావు తెలిపారు. హిందూపురం వాసులకు న్యాయ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురానికి ఇటీవల రెండో జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం మంజూరు కావడంతో న్యాయస్థానం నిర్వహణకు అనువైన భవనాన్ని పరిశీలించేందుకు గురువారం ఆయన హిందూపురంలో పర్యటించారు. అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మి హారిక, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యలతో కలిసి స్థానిక పశుసంవర్ధక శాఖ భవనంలో నిర్వహిస్తున్న న్యాయస్థానాల సముదాయంలోని మూడవ అంతస్తును పరిశీలించారు. భవనం అనువుగా ఉన్నందున నూతన న్యాయస్థానానికి అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు తదితర వాటిని సమకూర్చేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం న్యాయమూర్తుల చాంబర్లు రికార్డు గదిని పరిశీలించారు. నూతన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఛాంబర్, ప్రత్యేక న్యాయస్థానం ఆఫీసు నిర్వహణకు మార్పులు చేయాలన్నారు. హిందూపురంలో న్యాయసేవలకు ఇబ్బందులు కలగనివ్వం జిల్లా న్యాయమూర్తి భీమారావు -
టాప్ లేపారు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణం లక్ష్మీనగర్కు చెందిన చేనేత కార్మికుడు జయరాములు, నాగమణి దంపతుల కుమార్తె ఉడుముల చంద్రిక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 592 మార్కులు సాధించింది. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ అత్యధిక మార్కులు సాధించింది. తల్లిదండ్రులు మగ్గం నేస్తూ కుమార్తెను చదివించారు. ఉత్తమ ఫలితంతో రాణించిన చంద్రికను ఎంఈఓ గోపాల్నాయక్, పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్ అభినందనలు తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 590పైగా మార్కులు సాధించి జయకేతనం ఎగురవేశారు. ఇందులో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. కానిస్టేబుల్ కుమార్తెకు 596 మార్కులు కదిరి పట్టణంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న మంజుల కుమార్తె జి.చందనశ్రీ రాయల్ 596 మార్కులు సాధించింది. చందనశ్రీ గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి చదివింది. తల్లి మంజుల కదిరి పోలీస్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. తండ్రి రాఘవేంద్ర బిజినెస్ చేస్తుంటాడు. -
స్వార్థం కోసమే ‘రాయలసీమ ఎత్తిపోతల’ నిర్వీర్యం
పెనుకొండ రూరల్: చంద్రబాబు తన స్వార్థం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి రైతుల నోట్లో మట్టికొట్టారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. 9.6 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటికే రూ.800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నేటి పాలకులు స్వార్థ రాజకీయాల కోసమే ప్రాజెక్టును తాకట్టు పెట్టారన్నారు. దీనివల్ల లక్షల ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి, వేలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టకుండా నిలువరించిందని ఉషశ్రీచరణ్ అన్నారు. గత జగన్ సర్కార్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పథకాలు అమలు చేసిందన్నారు. ఈ క్రమంలోనే రైతులు సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని వివరించారు. శ్రీశైలం కుడిగట్లు కాలువ, తెలుగు గంగా, గాలేరు, నగరి సుజల స్రవంతి నుంచి కృష్ణా జలాలు వాడుకుని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలను సశ్యామలంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేడు మంగళం పాడేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. రాయలసీమ జీవనాడిని దెబ్బతీస్తున్న చంద్రబాబు...రైతుల కడుపుకొడుతున్న విషయం గమనించాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని సీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. లేకపోతే రాయలసీమ వాసులు తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
వీడిన ‘పీఠం’ ముడి
కదిరి: స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎవరన్న సందిగ్ధం వీడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కాగా, గురువారం ఏఈ వజ్ర సందీప్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల క్రితమే కదిరి కమిషనర్గా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు బెదిరించడంతో సందీప్ సందిగ్ధంలో పడ్డాడు. దీంతో మళ్లీ ఇటీవల బదిలీ అయిన కిరణ్కుమార్కే కమిషనర్ సీటు అంటూ కొందరు ప్రచారం చేశారు. అయితే గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు బాధ్యతలు చేపట్టక పోతే సస్పెన్షన్ ఆర్డర్స్ పంపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో సందీప్ బాధ్యతలు చేపట్టారు. దీంతో కదిరి మున్సిపల్ కమిషనర్ ‘పీఠం’పై సందిగ్ధం తొలగింది. మళ్లీ నేనంటూ ధీమా రెండేళ్లుగా ఇక్కడ కమిషనర్గా ఉంటూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మాతృశాఖ (హార్టికల్చర్)కు బదిలీ అయిన కిరణ్కుమార్ ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యేందుకు సముఖత చూపలేదు. తనకు ఎమ్మెల్యే కందికుంట మద్దతు ఉన్నంత వరకూ ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాను ఇక్కడే కొనసాగుతానని కొందరు తాజా మాజీ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సిబ్బందితో అన్నట్లు సమాచారం. ఈ నెల 4వ తేదీ లోపు మళ్లీ తనను ఇక్కడే కొనసాగించే విధంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు వారు పేర్కొంటున్నారు. రూ.కోటి సంగతేంటి? తనను కదిరి మున్సిపల్ కమిషనర్గా కొనసాగించేందుకు కిరణ్ కుమార్ స్థానికంగా ఓ ముఖ్యనేతకు రూ.కోటి సమర్పించినట్లు కూటమి పార్టీ నేతలే కొందరు ఆరోపిస్తున్నారు. ఈ రెండేళ్లలో ఆయన సుమారు రూ.10 కోట్ల వరకూ అక్రమంగా సంపాదించారని, అందులో 60 శాతం (రూ.6 కోట్లు) విడతల వారీగా ఆ నేతకు ముట్టజెప్పారని వారు ఆరోపిస్తున్నారు. ఆయన అవినీతి చిట్టా మొత్తం వివరాలతో సహా త్వరలోనే బహిర్గతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. బాణసంచా పేల్చి సంబరాలు సాధారణంగా ఒక ఉద్యోగి బదిలీపై వెళ్తుంటే తోటి ఉద్యోగులు బాధపడటం సర్వ సాధారణం. బదిలీపై వెళ్లే అధికారిని ఘనంగా సన్మానించి వీడ్కోలు చెప్పడం కూడా చూస్తుంటాం. కానీ కదిరిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్ బదిలీపై వెళ్తుంటే మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా మున్సిపల్ కార్యాలయం ముందే బాణసంచా పేల్చి ఆయన పట్ల తమకున్న వ్యతిరేకతను చాటుకున్నారు. -
7 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ జిల్లాలోని 7 మండలాల పరిధిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా తనకల్లు మండలంలో 34.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే అమడగూరు మండలంలో 24 మి.మీ, మడకశిర 12.6, నల్లచెరువు 12.2, హిందూపురం 11.2, చిలమత్తూరు 9.0, లేపాక్షి మండలంలో 2.0 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. జనగణన పక్కాగా జరగాలిప్రశాంతి నిలయం: జనగణన పక్కాగా నిర్వహించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. జనగణనలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవసరమైన కిట్లు, మ్యాపులు, మాన్యువళ్లు ఇప్పటికే పంపామన్నారు. మే 30వ తేదీ నాటికి జనగణన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సిబ్బంది మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ క్షేత్రస్థాయి పర్యటనలు నివారించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుప్తనిధుల వేటగాడిని పట్టుకున్న గ్రామస్తులుచిలమత్తూరు: మండలంలోని మాదిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న వెంకన్న కొండ గుహలో గుప్త నిధుల కోసం గురువారం తవ్వకాలు సాగిస్తున్న విశాఖపట్నంకు చెందిన మంకు నాయుడుని మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, మంకు నాయుడు కొడికొండ చెక్పోస్ట్ సమీపంలోని ఓ గదిని అద్దెకు తీసుకుని పది రోజులుగా గుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో నిందితుడి గదిని పోలీసులు పరిశీలించారు. బ్లాస్టింగ్ యంత్రాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పుట్బాల్ విజేత అనంత అనంతపురం: శాప్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. అండర్–15 బాయ్స్ విభాగంలో కృష్ణా జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరి జట్టుపై శ్రీసత్యసాయి జట్టు గెలుపొందింది. అండర్ –21 పురుషుల విభాగంలో విశాఖపై విజయనగరం, మహిళల విభాగంలో కర్నూలుపై అనంతపురం గెలుపొందింది. -
వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న వివాహిత గంగాపావని (19) ఆత్మహత్య చేసుకుంది. గంగాపావని, సాయి ప్రేమించి 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రెండు కుటుంబాలకు ఇష్టం లేదు. ఈ కారణంగా తరుచుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన గంగాపావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. చీటింగ్ కేసు నమోదు తలుపుల: డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మూడిళ్లపల్లికి చెందిన రామాంజనేయులు, ఓబులరెడ్డి తలుపుల మండలం సంగటివారిపల్లికి చెందిన మల్లినాయుడు వద్ద గత ఏడాది జనవరిలో 105 పొట్టేళ్లను రూ.11.20 లక్షలతో కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.4.20 లక్షలు అడ్వాన్స్గా చెల్లించారు. ఈ క్రమంలో మిగిలిన డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రామాంజనేయులు, ఓబులరెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. -
సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్
తనకల్లు: మండల పరిధిలోని మంగదిన్నెపల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త కాయల గణేష్ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు. అనంతరం నోటీస్ జారీ చేసి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టాడని గణేష్పై గతంలో స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే బుధవారం గణేష్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి
యాడికి: మండలంలోని చందన గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మర ఆంజనేయులు, అనిత దంపతుల కుమార్తె నైనిక (6) అధిక గుండెపోటుతో మృతి చెందింది. రాయలచెరువులోని ఓ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న నైనిక వేసవి సెలవులు కావడంబతో బుధవారం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో ఆడుకుంటూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే రాయలచెరువులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అధిక గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. -
భారత్ విజయంలో కదిరి వాసి
కదిరి అర్బన్: ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన దక్షిణ ఆసియా గోల్షాట్ బాల్ పోటీల్లో భారత్ జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టుతో భారత్ జట్టు తలపడింది. భారత్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థి శైలజ కీలకమైన నాలుగు గోల్స్ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కదిరి రైల్వే స్టేషన్కు చేరుకున్న శైలజను ఆమె చదువుకుంటున్న హరీష్ పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. గోల్షాట్ బాల్ ఫౌండర్, సెక్రటరీ నోట్ల రాజేంద్రప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ కిరణ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. బాణాసంచా పేలుస్తూ గ్రామంలో అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. -
తిరుమల ఎక్స్ప్రెస్ గుంతకల్లు వరకు పొడిగింపు
గుంతకల్లు: విశాఖపట్నం – కడప జంక్షన్ల మధ్య రాకపోకలు సాగిస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకూ పొడిగించారు. ఈ మేరకు రైల్వేబోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు డివిజన్ అధికారులు బుధవారం వెల్లడించారు. రోజు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం జంక్షన్ నుంచి బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ రైలు (18521) మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కడపకు చేరుతుండేది. అయితే తిరుగు ప్రయాణంలో (18522) సాయంత్రం 5 గంటలకు కడప నుంచి బయలుదేరేది. దాదాపు పది గంటల పాటు కడప జంక్షన్లోనే ఈ రైలు నిలిచిపోతుండడంతో, ఆ సమయాన్ని వృథా కానివ్వకుండా కడప – గుంతకల్లు మధ్య నడిపేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. మే 12 నుంచి విశాఖపట్నం–గుంతకల్లు మధ్య ఈ రైలు నడవనుంది. దీంతో గుంతకల్లు జంక్షన్ నుంచి రోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడదవోలు, తెనాలి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడం, కొవూరు, రాజమండ్రి, ద్వారంపూడి, అనపర్తి, సామర్లకోట, పుత్తపురం, అన్నవరం, తూని, నర్సీపట్నం, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్నం చేరుతుంది. నేటితో ముగియనున్న శాప్ ఫుట్బాల్ టోర్నీ అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శాప్ ఫుట్బాల్ టోర్నీ గురువారంతో ముగియనుంది. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో అండర్–15 బాలుర విభాగంలో ముందంజలో అన్నమయ్య, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, ఏలూరు, పల్నాడు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జట్లు ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు, అన్నమయ్య జట్లు, అండర్–21 పురుషుల విభాగంలో అల్లూరి సీతారామరాజు, తిరుపతి, ఏలూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, గుంటూరు, అన్నమయ్య, మహిళా విభాగంలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జట్లు ముందంజలో ఉన్నాయి. -
ఇంతలా ఇబ్బంది పెడతారనుకోలేదు
పెనుకొండ: మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న అమ్మవారుపల్లి ఒకప్పుడు ఓ కుగ్రామమే. ప్రస్తుతం అక్కడ కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచింది. అక్కడ సౌకర్యాలు మెరుగు పడ్డాయి. దేశవిదేశాలకు చెందిన వారి రాకపోకలూ ఎక్కువయ్యాయి. ముడి సరుకు దిగుమతులు, ఉత్పత్తయిన కార్ల ఎగుమతులకు సంబంధించి రోజూ వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ఓ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధిని ఆకాంక్షిస్తూ... కియా పరిశ్రమ ఏర్పాటైన తర్వాత పెనుకొండ చుట్టుపక్కల అద్దె భవనాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్కో ఇంటికి ఎంత లేదన్నా నెలకు రూ.10 వేలకు పైగానే అద్దె చెల్లించాల్సి వస్తోంది. 2017లో కియా పరిశ్రమ ఏర్పాటు కాగా, సొంత భవనం లేకపోవడంతో 2019లో అద్దె ఇంటిలో పోలీస్ స్టేషన్ను నెలకొల్పారు. ఆ సమయంలో పలు అపోహల కారణంగా పోలీసులకు అద్దెకు భవనాన్ని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రైతు వెంకటరెడ్డి ముందుకు వచ్చాడు. వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న ఆయన పొలాలు అమ్మవారుపల్లిలోనే ఉండగా, పెనుకొండలో నెలకు రూ.10 వేలు చొప్పున అద్దె చెల్తిస్తూ ఓ ఇంటి పై పోర్షన్కు మకాం మార్చాడు. స్థలం కేటాయించినా.. నిర్మాణం శూన్యం వెంకటరెడ్డి నుంచి భవనాన్ని అద్దెకు తీసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి నెలకు రూ.4,327 చొప్పున అద్దె చెల్లించేలా 2019 జనవరి నుంచి 2022 వరకూ లీజు అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే దుద్దేబండ క్రాస్ వద్ద పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. అయితే నాటి నుంచి నేటి వరకూ ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు లీజు అగ్రిమెంట్ ముగియడంతో అదే ఏడాది డిసెంబర్లో మరో అగ్రిమెంట్ (2025 డిసెంబర్ 13వ తేదీ వరకు) ను పోలీసులు రాయించారు. ఈ లీజు అగ్రిమెంట్ గడువు ముగిసింది. ప్రస్తుతం తన ఇంటిని అప్పగించాలని వెంకటరెడ్డి పోలీసులను వేడుకుంటున్నాడు. ఇటీవల భార్య ఆరోగ్యం క్షీణించిందని, వయోభారం కారణంగా రోజూ స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చూసుకోవడం భారంగా మారిందని వెంకటరెడ్డి వాపోతున్నాడు. ఎంతలా ప్రాధేయపడినా ఫలితం దక్కకపోవడంతో చివరకు 2025, డిసెంబర్ 1న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందించాడు. ఈ వినతిపై ఎస్పీ స్పందిస్తూ పెనుకొండ డీఎస్పీ నర్శింగప్పకు రెఫర్ చేశారు. దీంతో వెంకటరెడ్డిని డీఎస్పీ తన కార్యాలయానికి రప్పించుకుని మాట్లాడారు. సమస్య తెలుసుకుని కొన్ని నెలల గడువు కావాలని, ఈ లోపు సరైన భవనం చూసుకుంటామని పేర్కొన్నారు. నెలలు గడుస్తున్నా... నేటికీ తన భవనాన్ని పోలీసులు స్వాధీనం చేయకపోవడంతో పోలీసులు ఇంతలా ఇబ్బంది పెడతారని అనుకోలేదని వెంకటరెడ్డి వాపోతున్నాడు. బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాల్సిన పోలీసులే గతి తప్పారు. ఏళ్లుగా అద్దె భవనంలోని పోలీస్ స్టేషన్ను ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వృద్ధాప్యంలో భార్యతో కలిసి సొంతింట్లో నివసించాలనుకుంటున్న వృద్ధుడి ఆశలను అణిచివేస్తున్నారు. ఇది అమ్మవారుపల్లి వెంకటరెడ్డి దీనగాథ. పోలీసుల తీరుపై వృద్ధుడి ఆవేదన పీఎస్ను ఖాళీ చేసి తన ఇల్లు ఇప్పించాలని వేడుకోలు కొన్నేళ్లుగా అలుపెరుగని పోరాటం మాటలతో పోలసుల కాలయాపన -
బాలుడ్ని బలిగొన్న ఈత సరదా
పెనుకొండ(సోమందేపల్లి): ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు... హిందూపురంలోని హస్నాబాద్కు చెందిన సమీర్ (18) బుధవారం కుటుంబసభ్యులతో కలసి సోమందేపల్లిలోని నక్కల గుట్ట ప్రాంతానికి ఈత కొట్టేందుకు వచ్చాడు. జోరుగా ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువ నీటిలో దిగిన వెంటనే గల్లంతయ్యాడు. ఆ సమయంలో కుటుంబసభ్యుల కేకలు విన్న పరిసరాల్లోని యువకులు వెంటనే కాలువలో దిగి గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి నీటి అడుగుభాగంలో చిక్కుకుపోయిన సమీర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూన్ నాటికి లే అవుట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్ ధర్మవరం రూరల్: మండలంలోని కుణుతూరు వద్ద అహుడా లే అవుట్ అభివృద్ధి పనులు జూన్ నాటికి పూర్తి కావాలని సంబంధిత అధికారులను అహుడా వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. లేఔట్లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ దుష్యంత్, డీఈ రేవంత్, పబ్లిక్ హెల్త్ డీఈ జ్వోతి తదితరులు పాల్గొన్నారు. పిడుదుల మందు తాగిన చిన్నారి తనకల్లు: మండలంలోని గందోడివారిపల్లికి చెందిన గణేష్ కుమార్తె, నాలుగేళ్ల చిన్నారి పూజిత పిడుదల మందు తాగింది. బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా దాహం వేయడంతో బాటిల్ ఉన్న ద్రావకాన్ని నీరుగా భావించి తాగడంతో కుటుంబసభ్యులు గమనించి వెంటనే తనకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏపీలో దళితులకు రక్షణ కరువు
మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విమర్శించారు. గుడిబండ మండలం మందలపల్లి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని బాధితులకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయభాస్కర్ది సాధారణ మరణం కాదని, అలాగని అనుమానాస్పద మరణం కూడా కాదని అన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. హతుడి కుటుంబసభ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనుమాన్పాద మృతి కింద కేసు నమోదు చేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా నేటికీ పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వెంటనే పోస్టుమార్టం నివేదికను వెల్లడించడంతో పాటు హత్య కేసు నమోదు చేసి విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు హనుమంతు, సాకే ఓబులేసు, మిణుగు రామాంజనేయులు, కుళ్లాయప్ప, తలారి నాని తదితరులు పాల్గొన్నారు. విజయభాస్కర్ది ముమ్మాటికీ హత్యే బాధిత కుటుంబానికి న్యాయం చేకూరకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు -
గంజాయి ముఠా అరెస్ట్
● 10.55 కేజీల గంజాయి స్వాధీనం తాడిపత్రి టౌన్: తాడిపత్రి మీదుగా సూరత్కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రోహిత్కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన బలరాం స్వామ్స్, ఆకాష్ సాహగ్ ఒడిశా నుంచి గంజాయిని తాడిపత్రి మీదుగా సూరత్కు సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సూరత్కు రైలులో గంజాయి తీసుకెళ్తుండా అందిన సమాచారం మేరకు తాడిపత్రి పోలీసులు బుధవారం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన బలరాం స్వామ్స్, ఆకాష్ సాహగ్ను సోదా చేయగా వారి వద్ద 10.55 కేజీల గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో తదుపరి చర్యల కోసం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న కానిస్టేబుల్ గోవిందుకు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఆరోహణరావు, ఎస్ఐ దయాకర్రెడ్డి, ఏఎస్ఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ దుర్మరణం ● క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహం రాప్తాడు రూరల్: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కొత్తవారిపల్లి గ్రామానికి చెందిన బి.భాస్కర్రెడ్డి (32) కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా పొట్టోళ్లపల్లిలో నివాశముంటూ లారీ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కేఏ40బీ 7198 నంబర్ గల లారీలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గ్రానైట్ లోడుతో బయలుదేరిన భాస్కరరెడ్డి బుధవారం తెల్లవారుజామున రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ప్రమాదతీవ్రతకు గ్రానైట్ బలంగా క్యాబిన్ను తాకడంతో క్యాబిన్ ఛిద్రమైంది. డ్రైవరు భాస్కరరెడ్డి అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మృతదేహన్ని వెలికి తీసి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కదిరి మున్సిపల్ కమిషనర్గా సందీప్
కదిరి: మున్సిపాలిటీలో ఏఈఈ వి.సందీప్కు కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి.సంపత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ఇక్కడ డెప్యుటేషన్పైన కమిషనర్గా ఉన్న కె.కిరణ్కుమార్ను ఆయన మాతృశాఖ (హార్టికల్చర్)కు పంపారు. అయితే కిరణ్నే కమిషనర్గా కొనసాగించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మున్సిపల్ శాఖామంత్రి నారాయణపై ఈ విషయంలో ఆయన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ మంత్రి ఒప్పుకోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కాగా కిరణ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు కొందరు కూటమి పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఎల్లుండి మల్లెపూల ఉత్సవం కదిరి టౌన్: స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి 1వ తేదీన (శుక్రవారం) పట్టణంలోని మద్దిలేరు ఒడ్డున ఉన్న మల్లెపూల మండపం వద్ద మల్లెపూల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయదారులుగా కదిరి వాస్తవులు మల్లెపూల నరసయ్య కుమారులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఖాద్రీ ఆలయం నుంచి స్వామివారు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5 గంటలకు మల్లెపూల మండపం వద్దకు చేరుకుంటారన్నారు. తరువాత అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారని, సాయంత్రం 6 గంటలకు తిరువీధుల్లో స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తాదులు పెద్ద ఎత్తున హజరై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒక్క హామీనైనా అమలు చేశారా?కదిరి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ఒక్కటీ పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. మంగళవారం కదిరి పట్టణంలోని ఆమె నివాసంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై మే 6న విజయవాడలోని ధర్నాచౌక్లో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికై వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ దశలవారీ పోరాటంలో భాగంలో మే 6న మహాధర్నా చేపడుతోందన్నారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్రెడ్డి, శివయ్య, ప్రకాష్రెడ్డి, జమీర్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత సామగ్రి పంపిణీప్రశాంతి నిలయం: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో వినియోగించే సామగ్రిని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్కుమార్కు అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో నేషనల్ హైవేస్ ఎస్ఈ సుబ్బరాయుడు సమకూర్చిన 245 కోన్లు, 245 డిఫ్లెక్టివ్ జాకెట్లు, 90 టార్చ్లైట్లను అందించారు. పనిముట్లు సద్వినియోగం చేసుకోండి పీఎం విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తుల వారికి ఇచ్చిన పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. శిక్షణ పొందిన 17 రకాల చేతివృత్తుల వారికి రూ.15 వేలు విలువ చేసే పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 7,200 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. విశాఖ పట్నం గ్లోబల సమ్మిట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించడానికి అన్ని రకాల అనుమతులు జారీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులిస్తామన్నారు. -
పల్లెలకూ పాకిన పాడు సంస్కృతి
సాక్షి, పుట్టపర్తి: విదేశాల్లోని పాడు సంస్కృతి ప్రధాన నగరాల నుంచి పట్టణాలు, పల్లెల వరకు వ్యాపించింది. రిసార్టులు, స్పా, గ్రాండ్ స్టే, హోం స్టే, లగ్జరీ రూమ్స్ పేరుతో భారీగా దందా జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా మొదలయ్యే వ్యవహారం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తర్వాత బ్లాక్మెయిల్కు దిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. శ్రీసత్యసాయి జిల్లాలోనూ అలాంటివి వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకుంటే కానీ వ్యవహారం అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే ప్రవేశానికి అనుమతిస్తూ.. ‘ఆ ఇద్దరు’ ఎవరనేది నిర్వాహకులు పట్టించుకోవడంలేదు. గంట నుంచి రోజుకు చొప్పున అద్దె నిర్ణయిస్తూ దండుకుంటున్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఏర్పాటైన రిసార్టుల్లో బెంగళూరు నుంచి వారంతపు సెలవుల్లో విచ్చలవిడిగా జంటలు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతి శని, ఆదివారాల్లో ఆయా ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పెడదోవ పడుతున్న యువత పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో గుడి, బడి తేడా లేకుండా పాడు సంస్కృతి విస్తరించింది. ప్రతి వారం గుడికి వెళ్తున్నామని.. పర్యాటక ప్రాంతాల పేరుతో ఇంట్లో చెప్పి బయట తిరుగుతున్న వారి సంఖ్య పెరిగింది. పుట్టపర్తి, లేపాక్షి, పెనుకొండ చుట్టుపక్కల వారంతపు సెలవుల్లో యాత్రల పేరుతో చాలామంది వస్తున్నారు. అక్కడక్కడా పర్యాటకుల సౌకర్యార్థం రిసార్టులు, హోం స్టేలు ఏర్పాటు చేశారు. అనధికారికంగా అన్నింటికీ అనుమతిస్తున్నారు. దీంతో అధికశాతం మంది కాలేజీకి వెళ్లే యువత దారి తప్పుతోంది. ఆరంభంలోనే నియంత్రించకుంటే తొందరలోనే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా యువతీ, యువకులను బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొంతమంది ట్రాప్లో పడి రూ.లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి యువతుల దిగుమతి రిసార్టులు, గ్రాండ్ స్టే, హోంస్టే, లగ్జరీ రూమ్స్ పేరుతో దందా ఆధార్ కార్డుతోనే అద్దె రూముల్లోకి ఎంట్రీ పర్మిట్ ఆ ‘ఇద్దరు’ ఎవరనేది పట్టించుకోని నిర్వాహకులు చిలమత్తూరు మండలం సోమఘట్ట సమీపంలో ఢిల్లీకి చెందిన ఓ బడాబాబు రిసార్ట్ నిర్మించారు. అక్కడ రూములు అద్దెకు ఇస్తారు. ఎవరు వస్తున్నారనే విషయం తెలీదు. డబ్బులు చెల్లిస్తే చాలు.. వసతి కల్పిస్తున్నారు. వారాంతపు సెలవుల్లో విచ్చలవిడిగా జంటలు వస్తుంటారు. రిసార్టు వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉంటాయి. పోలీసులు ఎవరూ పట్టించుకోరని నమ్మబలికి జంటలకు రూములు ఇస్తున్నారు.గోరంట్ల మండలం పాలసముద్రం సమీపాన ఓ పెద్ద రిసార్టు ఉంది. రోజు వారీ బాడుగకు రూములు ఇస్తారు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. ఆ ఇద్దరు ఎవరనే విషయంతో సంబంధం లేకుండా జంటలకు వసతి కల్పిస్తున్నారు. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి ఎక్కువ మంది వస్తున్నట్లు సమాచారం. తెలుగు రాని వారు సైతం అద్దెకు ఉంటున్నారు. గంటల వ్యవధిలోనే ఖాళీ చేసి వెళ్తున్నట్లు తెలిసింది. -
‘అనంత’ హనీట్రాప్లో పాత్రధారులపై డీఐజీ, ఎస్పీ చర్యలు తీసుకున్నారు. వారం రోజుల్లోనే కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమే అయినా ఇదే తరహాలో సూత్రధారుల సంగతి కూడా తేల్చాల్సి ఉంది. ఈ తంతులో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలు, వ్యక్తుల పాత్ర ఉంది. రిమాండ్కు వెళ్ల
సాక్షిప్రతినిధి, అనంతపురం: జిల్లా చరిత్రలోనే అత్యంత నీచమైన వ్యవహారం హనీట్రాప్ దందాలో తవ్వేకొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కింగ్పిన్ రంగమ్మ మొదలెట్టిన ఈ వ్యవహారంలో ‘ఈజీమనీ’గా భావించి నాలుగు గ్యాంగ్లుగా విడిపోయారు. దందా మొత్తాన్ని నిశితంగా పరిశీలిస్తే టీడీపీ, బీజేపీలోని నేతల ప్రమేయంతోనే అంతా జరిగిందని స్పష్టమవుతోంది. ముఠా పుట్టింది...విస్తరించింది ఇలా ఓ బీజేపీ నేత తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రంగమ్మకు మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవి ఇప్పించారు. అప్పట్లోనే రంగమ్మ ‘హనీట్రాప్’ మొదలెట్టారు. ఈ నేత మంత్రి సత్యకుమార్కు అత్యంత సన్నిహితుడు. ఇతను స్టేషన్కు వస్తే పనులు చేయాలని పోలీసులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ఇతనే స్టేషన్లలో పంచాయితీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ చంద్రకళ, మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు అనంతకుమారి, మల్లీశ్వరి కూడా చేరారు. ఆపై వీరి మధ్య విభేదాలతో రంగమ్మ దూరమైంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీలో చేరింది. అక్కడి నేతల అండతో రంగమ్మ దందాను యథేచ్ఛగా నడిపించింది. ఇదే క్రమంలో అనంతకుమారి, మల్లీశ్వరి కూడా ఎవరి దందా వాళ్లు నడిపించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అంతా ఒకేపార్టీలో పని చేసిన వారే. ఈజీమనీని ఆదాయ మార్గంగా ఎంచుకుని మొత్తం నాలుగు గ్యాంగ్లుగా ఏర్పడి చాలామంది పరువును నాలుగు గోడల మధ్య బేరం పెట్టి అక్రమంగా సంపాదించారు. వీరితో పాటు టీడీపీలోని రాజేష్, నరేంద్రరెడ్డి కూడా రిమాండ్కు వెళ్లారు. రంగమ్మ, మల్లీశ్వరి ముఠాల మధ్య విభేదాలతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. హనీట్రాప్లో బీజేపీలో పడిన బీజం టీడీపీకి విస్తరించి ‘అనంత’ సమాజాన్ని వేధించింది. రూ.కోట్లలో అక్రమార్జన... మంత్రి సత్యకుమార్కు సన్నిహితుడైన బీజేపీ నేత ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో వెంచర్ వేశారు. ఇందులో ఇటీవల వేటుపడిన ఓ సీఐ కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. పాపపు సొమ్ముతో ‘అనంత’లో రెండు ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఇతనితో పాటు రంగమ్మ నిర్వహించిన 7 హిల్స్ హోటల్ వద్ద సమావేశమైన టీడీపీ నేతలు కూడా ఈ డబ్బును పెట్టుబడుల కోసం వినియోగించుకున్నట్లు సమాచారం. నిజానికి ఇది చిన్న వ్యవహారం కాదని, బాధితులు కోల్పోయిన డబ్బు రూ.కోట్లలో ఉందని తెలుస్తోంది. రిమాండ్కు వెళ్లిన వారి కాల్లిస్ట్, ఆడియో రికార్డులతో పాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు శోధిస్తున్నారు. పాత్రధారులైన వ్యక్తులు, కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్న డీఐజీ, ఎస్పీ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యుల హస్తం.. హనీట్రాప్ దందాలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల పాత్ర ఉందని తెలుస్తోంది. ఎస్పీ చెప్పినా కేసులు నమోదు చేయని పరిస్థితి ఉందంటే, ‘ఉద్యోగం తీయగలిగే శక్తి ఎస్పీకి లేదు, ఎమ్మెల్యే చెబితే పోస్టింగ్ ఇస్తారు.. ఎమ్మెల్యేలే మా బాస్లు’ అనేలా పోలీసులు ఉద్యోగం చేశారు కాబట్టి కచ్చితంగా ఈ ముడుపుల్లో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలలో మొత్తం ముగ్గురి పాత్ర స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. చర్యలు తీసుకోవాల్సిందేహనీట్రాప్ అంశాన్ని విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు హనీట్రాప్పై సీబీఐ విచారణ చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ‘హనీ’ తంతులో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై సర్వత్రా చర్చ మంత్రి సత్యకుమార్ అనుచరుడి పాత్రపై అనుమానాలు బత్తలపల్లిలోని ఓ వెంచర్లో అతనితో పాటు వేటు పడిన ఓ సీఐ పెట్టుబడులు రాజకీయ పార్టీ నేతల హస్తం నేరుగా ఉండటంపై చీదరించుకుంటున్న జిల్లా ప్రజలు -
మాదక ద్రవ్యాల రహిత జిల్లానే లక్ష్యం
ప్రశాంతి నిలయం: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఎన్ కార్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకోవాలన్నారు. పాత కేసుల్లో నిందితులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వారిని బైండోవర్ చేయాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, డీపీఈఓ గోవింద్, ఏఈఎస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పీఎం రహత్ ద్వారా నగదు రహిత చికిత్స రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా నగదు రహిత చికిత్స అందించడానికి పీఎం రహత్ పథకాన్ని కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీఎం రహత్ పథకానికి సంబంధించి పోస్టర్లు విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన మొదటి 24 గంటల్లో (గోల్డెన్ అవర్)లో ఆస్పత్రి చేరిన వారికి అత్యవసర వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ పథకం కింద ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ అత్యవసర చికిత్సకు కవర్ అవుతుందన్నారు. ఆ మొత్తం దాటితే ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని వర్తింపజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్కుమార్, ఆర్టీఓ కరుణ సాగర్రెడ్డి, ఆరోగ్య సేవ జిల్లా సమన్వయకర్త శ్రీదేవి, డీసీహెచ్ఎస్ మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణే ధ్యేయం ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయం చేసుకొని రహదారి ప్రమాదాలను తగ్గించాలన్నారు. కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్కింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొడికొండ స్పీడ్ బ్రేకర్లు వద్ద 10 మీటర్ల ముందే రంబుల్ స్ట్రిప్, గోస్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. -
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతోంది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుక
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే మందుల విక్రయాలు ఊపందుకున్నాయి. కొన్ని రకాల మత్తు మాత్రలను అవసరమైన రోగులకు మాత్రమే వైద్యులు సూచిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదు. అయితే.. మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం నిబంధనలకు నీళ్లొదిలి అధిక మొత్తం చెల్లిస్తే చాటు ఎన్ని కావాలంటే అన్ని మందు బిల్లలు, సిరప్లు అందజేస్తున్నారు. కండలు తిరిగిన దేహంపై మోజుతో జిమ్లకు వెళుతున్న కొందరు యువకులు క్లినికల్ ట్రీట్మెంట్లో ముఖ్యమైన పాత్ర పోషించే అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు వాడుతున్నట్లుగా తెలుస్తోంది. హిందూపురం, కదిరి, అనంతపురం తదితర ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీటిని వినియోగిస్తే గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, లివర్ సమస్యలు వస్తాయి. యువతలో వంధ్యత్వ సమస్యలకు కూడా ఇవి కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి షెడ్యూల్ హెచ్–1 పరిధిలో ఉన్న నైట్రోవిట్, ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ వంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లను డాక్టర్లు నొప్పి నివారణకు, మరికొన్నింటిని మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నిద్ర వచ్చేలా సూచిస్తుంటారు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మెడికల్ దుకాణాల్లో విక్రయించాలి. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. కొనుగోలుదారు వివరాలను అందులో పొందుపరచాలి. కానీ, మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ అధిక ధరలకు వాటిని విక్రయించి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ (మాదకద్రవ్యం)గా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ట్రెమడాల్ వంటి ప్రమాదకరమైన మాత్రలను సైతం ఉమ్మడి జిల్లాలోని కొన్ని మెడికల్ స్టోర్లలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఐసిస్ డ్రగ్గా పేరొందిన ట్రెమడాల్ను డిమాండ్ను బట్టి ఒక్కో షీట్పై రూ. 200 నుంచి రూ.300 అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుంటున్న విక్రయదారులు హిందూపురం మీదుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యంత గోప్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అతీగతీ లేని ఆడిట్ వాస్తవానికి షెడ్యూల్ హెచ్–1 డ్రగ్స్.. కంపెనీలో తయారీ నుంచి అవి ఏ ఏజెన్సీకి వచ్చాయి? ఏ మెడికల్ షాప్నకు వెళ్లాయి? ఏ కస్టమర్కు విక్రయించారు? అనే అంశంపై ఆడిట్ ఉండాలి. కానీ, ఆ నిఘా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. శస్త్రచికిత్సల్లో వాడే అనస్థీషియా ఇంజెక్షన్లను కూడా మత్తు జల్సాకు ఉపయోగిస్తున్నట్టు తేలింది. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్మరు. కేవలం దవాఖానల్లోనే దొరుకుతాయి. ఈ ఇంజెక్షన్లకు సంబంధించి వైద్యులు ప్రిస్క్రిప్షన్ కూడా రాయరు. కానీ, కొంత మంది ఫార్మా డీలర్లే అక్రమంగా బయటికి తీసుకొచ్చి తెలిసిన వారితో విక్రయిస్తు భారీగా సంపాదిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే యాంటీబయాటిక్స్ అమ్మకూడదు. నిబంధనల మేరకే నిర్వాహకులు నడుచుకోవాలి. లేకపోతే సంబంధిత మెడికల్ స్టోర్ల యజమానులపై చర్యలు తప్పవు. మెడికల్ స్టోర్లను తరచుగా తనిఖీలు చేస్తున్నాం. – వీరకుమార రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న లైఫ్కేర్ మెడికల్, జనరల్ స్టోర్స్లో మత్తు కలిగించే మందులను బిల్లులు లేకుండా కలిగి ఉన్నట్లుగా తనిఖీ అధికారులు గుర్తించారు. అలాగే కొనుగోలు, అమ్మకం రికార్డులూ సరిగా నిర్వహించలేదు.దీంతో ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు రికార్డులనూ చూపించకపోవడంతో ఆ షాపు లైసెన్స్ రద్దు చేశారు. గత ఏడాది అక్టోబర్లో పామిడి గ్రామంలోని బాలాజీ మెడికల్, ఫ్యాన్సీ స్టోర్లో భారీ స్థాయిలో మత్తు కలిగించే మెడికల్ మందులు బయటపడ్డాయి. దీంతో తనిఖీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆ షాపు లైసెన్స్ను రద్దు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విక్రయాలు మత్తులో చిత్తవుతున్న యువత కట్టడి చేయడంలో డ్రగ్స్ నియంత్రణ అధికారులు విఫలం


