breaking news
Sri Sathya Sai
-
అనుమతులు కొంత.. అక్రమం కొండంత
● పుట్టపర్తిలో విచ్చలవిడిగా నిర్మాణాలు ● రెండంతస్తులకు అనుమతులు.. నిర్మించేది పది పైనే ● భవన నిర్మాణ మెటీరియల్తో ఇబ్బందుల్లో వాహనదారులు ● రోడ్డుకు అడ్డంగా కొత్త నిర్మాణాలు చేపట్టినా చర్యలు శూన్యం ● నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు సాక్షి, పుట్టపర్తి: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో భవన నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా అన్నట్టు ఆకాశాన్ని తాకేలా భవంతులు నిర్మిస్తున్నారు. వ్యాపారాల పేరుతో పార్కింగ్ స్థలాలు కూడా లేకుండా చేశారు. భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకునేందుకు భక్తులు పుట్టపర్తి వరకు సులువుగా వస్తారు. కానీ అక్కడి నుంచి ప్రశాంతినిలయం చేరుకోవడం గగనంగా మారింది. ఆర్టీసీ బస్టాండు నుంచి అక్రమ కట్టడాల కారణంగా ట్రాఫిక్ సమస్య, ఇరుకై న రోడ్లు, పార్కింగ్ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు పక్కన పెడితే.. కూటమి ప్రభుత్వంలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల కొత్త నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అడిగేవారు లేరని అడ్డదిడ్డంగా నిర్మాణాలు పుట్టపర్తిలో అక్రమ కట్టడాలు వందకు పైగా ఉంటాయి. కొన్ని సందుల్లో ఎండ కూడా పడనంతగా భవనాలు నిర్మించారు. ఏదైనా ప్రమాద ఘటన జరిగితే కనీసం ఫైరింజన్ కూడా వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్లు విలువ చేసే హోటళ్లకు పార్కింగ్ వ్యవస్థ లేదు. ఎవరైనా వీఐపీలు ఆ హోటల్కు వస్తే.. వాహనాలన్నీ రోడ్డు పైనే. ఏ భవనం చూసినా రెండంతస్తులకు అనుమతులు తీసుకుంటారు. ఆ తర్వాత పది అంతస్తుల వరకు అక్రమంగా నిర్మిస్తారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని వీధుల్లోకి కనీసం జీపు కూడా వెళ్లలేని స్థితి. అలాంటి సందుల్లో పదంతస్తుల భవనాలు దర్శనం ఇవ్వడం గమనార్హం. ఇరకాటంలోనూ ఇష్టారాజ్యంగా.. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన మార్గం ఇరుకుగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, దుకాణాలు, మార్కెట్లు వెలిశాయి. సుమారు 90 శాతం అక్రమ కట్టడాలే. ఏ భవనానికీ పార్కింగ్ వ్యవస్థ ఉండదు. పైగా ఉన్నఫళంగా పైన అంతస్తులు నిర్మిస్తుంటారు. రోడ్డు మీదనే మెటీరియల్ ఉంచి వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
హిందూపురం... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం. నాలుగు దశాబ్దాలుగా ఎన్టీఆర్ కుటుంబానికి, టీడీపీకి ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. బదులుగా ఆ కుటుంబం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిందేమీ లేదనే విమర్శలున్నాయి. వరుసగా మూడుసార్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దాదాపు పుష్కర కాలం నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ, నియోజకవర్గ ప్రజలను పాలిస్తున్నది మాత్రం ఆయన కాదు.. ఆయన పీఏలు! 2014లో పీఏ శేఖర్ అవినీతి అరాచకాలతో చెలరేగిపోగా.. ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. దీంతో శేఖర్ను తొలగించారు. తర్వాత వీరయ్య, బాలాజీ, చిత్తూరు నుంచి సురేంద్ర, గుంటూరు నుంచి శ్రీనివాసులు పీఏలుగా చెలామణి అవుతున్నారు. వీరిలో ఇద్దరు పీఏలు ‘పురాన్ని’ గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరు ఏది చెబితే బాలయ్య అదే చేస్తారు! చెప్పినవారికే పోస్టింగులు కట్టబెడతారు. పోస్టింగ్ను బట్టి రేటు ఫైనల్ చేస్తారు. అవినీతి అడ్డా ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు! హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అత్యంత కీలకం. ప్రభుత్వ భూములు భారీగా ఉన్న ప్రాంతం ఇదే. బాలయ్య పీఏ ఒకరు రూ.20 లక్షలు తీసుకుని ఓ సబ్ రిజిస్ట్రార్కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయనతో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేయించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ సస్పెండయ్యారు. తర్వాత ఆయన్నుంచే రూ.25 లక్షలు తీసుకుని సస్పెన్షన్ ఎత్తేసి, చిలమత్తూరులోనే పోస్టింగు ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, కుదర్లేదు. చివరకు చిలమత్తూరులో కాకుండా కదిరిలో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తన రూ.25 లక్షలు వెనక్కి ఇవ్వాలని సదరు సబ్ రిజిస్ట్రార్ ఒత్తిడి చేయగా.. ‘‘పోస్టింగ్లో బాగా సంపాదించావ్... రూ.25 లక్షలు మళ్లీ అడుగుతున్నావా?’’ అంటూ బాలకృష్ణ పీఏ దబాయించారు. ఇదిలా ఉండగానే... మడకశిరలో రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మరో సబ్ రిజిస్ట్రార్తో రూ.50 లక్షలకు చిలమత్తూరు పోస్టింగ్పై బేరం కుదిరింది. దీనికి సంబంధించిన ఫైలు వేగంగా కదిలింది. రెండు, మూడు రోజుల్లో ఆయనకు నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ ‘పోస్టింగ్’... బాలకృష్ణ పీఏ ఒకరు రూ.30 లక్షలు తీసుకుని... హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(సీటీఓ)గా ఒకరికి పోస్టింగ్ ఇప్పించారు. ఈ అధికారి భారీ జరిమానాలతో వ్యాపారులను భయాందోళనలకు గురిచేసి తన వద్దకు రప్పించుకున్నారు. వారినుంచి డబ్బులు తీసుకుని జరిమానాలు తగ్గించారు. వసూళ్లు, ఇతర వ్యవహారాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో సీటీఓను కమిషనర్ సస్పెండ్ చేయగా.. సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ ఇక్కడే పోస్టింగ్ ఇచ్చేలా బాలకృష్ణ పీఏలు ప్రయత్నించారు. కానీ, కమిషనర్ ఒప్పుకోకుండా కడపకు పంపించారు. హిందూపురానికి అసిస్టెంట్ కమిషనర్గా సుర్రేందరెడ్డిని నియమించారు. అయితే, బాలకృష్ణ నేరుగా కమిషనర్ వద్దకెళ్లి సస్పెండైన సీటీఓనే కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ‘‘సస్పెండైన అధికారిని తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో లేదు. నేను ఆర్డర్స్ ఇవ్వలేను’’ అని కమిషనర్ తేల్చిచెప్పగా.. బాలకృష్ణ నేరుగా సీఎం దగ్గరకు వెళ్లి సస్పెండైన సీటీఓను తిరిగి తెప్పించుకున్నారు. కల్తీ మద్యంలో చర్యలు.. నెలలో తిరిగి ఉద్యోగం అనంతపురం స్క్వాడ్ తనిఖీల్లో లేపాక్షి, చిలమత్తూరులో కల్తీ మద్యం విక్రేతలు పట్టుబడ్డారు. ఇది కంపెనీల నుంచి తయారైంది. కర్ణాటక లిక్కర్ కాకుండా ‘థర్డ్’ (స్పిరిట్తో సొంతంగా తయారు చేసినది) కావడంతో కమిషనర్ విచారణ చేయించారు. సీఐ అండతోనే వ్యవహారం నడిచిందని తేలడంతో సస్పెండ్ చేయాలని భావించారు. కానీ, బాలకృష్ణ పీఏలలో ఒకరు అడ్డుపడ్డారు. దీంతో సీఐను కమిషనర్ ఆఫీస్కు అటాచ్ చేయగా.. నెలలోపే తిరిగి ఆ సీఐ అదే స్థానంలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన పీఏకు రూ.25 లక్షలకు ముట్టజెప్పారని ఎకై ్సజ్ శాఖలో చెబుతున్న మాట. బాలయ్యకు తెలియకుండానే జరుగుతోందా? హిందూపురంలో కేవలం మూడు శాఖల్లోని అవినీతి వ్యవహారాన్ని విశ్లేషిస్తేనే చాంతాడంత ఉంది. మరి... ఇదంతా బాలకృష్ణకు తెలియకుండా జరుగుతుందా? తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనకూ డబ్బు మూటలు వెళ్తున్నట్లే కదా? అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. మద్యం దుకాణాలన్నీ స్వాధీనం! ఎకై ్సజ్ సీఐగా ఓ వసూళ్లరాయుడికి పోస్టింగ్ ఇచ్చారు. ఈయన ఎమ్మిగనూరులో రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. కర్నూలు జిల్లా పంచలింగాలలో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను నియమించి వసూళ్లకు దిగారు. ఈ సీఐ అండతో బాలకృష్ణ ఇద్దరు పీఏలు హిందూపురంలోని మద్యం దుకాణాలన్నింటినీ బినామీ పేర్లతో దక్కించుకున్నారు. రెండు షాపులు ఇతరులకు (వీరిలో ఒకరు మహిళ) రాగా, ఒకరిని కిడ్నాప్ చేసి, ఓ మహిళను భయపెట్టి దుకాణాలను లాక్కున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడా లేనివిధంగా హిందూపురంలో బాటిల్పై రూ.10 ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. ఇందులో మళ్లీ ప్రతి నెలా మూమూళ్లు పీఏలకు వెళ్లాలి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో అవినీతి తాండవం ఏసీబీకి చిక్కిన అధికారులకే ఆదాయం ఉన్న శాఖల్లో పోస్టింగ్ రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, వాణిజ్య పన్ను శాఖల్లో అవినీతి అధికారులకే అందలం -
జిల్లా అంతటా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పెనుకొండ 19.0 మి.మీ, అతి స్వల్పంగా అమడగూరు 1.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 137.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ నూర్పిడి జరుతున్న నేపథ్యంలో తుపాను పట్టుకోవడంతో రైతులు ఉక్కిరిబికిరవుతన్నారు. పంటలసాగుకు దిక్కుతోచడం లేదు. పట్టుగూళ్లపై తీవ్ర ప్రభావం పెనుకొండ: మోంథా తుపాను ప్రభావం పెనుకొండ నియోజకవర్గంలో పట్టుగూళ్లపై తీవ్రంగా చూపింది. మంగళవారం ఉదయం నుంచే వర్షం మొదలైంది. పట్టుగూళ్లు మెత్తబడటం వల్ల కిలో రూ.650 ఉన్న ధర కాస్తా రూ.450కి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రొద్దం మండలం బీదానిపల్లి, తురకలాపట్నం తదితర గ్రామాలతో పాటు పెనుకొండ మండలంలోని మహదేవపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాల పట్టు రైతులకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా మొక్క జొన్న పంట కోసి విత్తనాన్ని కల్లాల్లో ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వైవీఆర్కి వరద పోటు ముదిగుబ్బ: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు యోగివేమన జలాశయం (వైవీఆర్)లోకి వరద పోటెత్తుతోంది. తహసీల్ధార్ నారాయణస్వామి, ప్రాజెక్ట్ జేఈ కృష్ణకుమార్, సీఐ శివరాముడు తదితరులు మంగళవారం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఈ సందర్భంగా డ్యాం దిగువ గ్రామాలైన నక్కలపల్లి, దొరిగిల్లు, ఇందుకూరు, మర్తాడు తదితర గ్రామాల ప్రజలను పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేశారు. మోంథాపై అప్రమత్తంగా ఉండాలి ప్రశాంతి నిలయం: మోంథా తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల నిమిత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్తో కలసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూం ల్యాండ్లైన్ బిజీగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది సెల్ నంబర్లు సంబంధిత శాఖలు, తహసీల్దార్ల అందరి వద్ద ఉండాలన్నారు. ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాల ఢీ – యువకుడి మృతి
సోమందేపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి చెందిన ముత్యాలప్ప కుమారుడు గణేష్ (23) మంగళవారం రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి, మొక్కు చెల్లించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిని దాటుకుంటుండగా పెనుకొండ వైపునుంచి వేగంగా వస్తున్న మరో బైక్ రైడర్ ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గణేష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
గుడిబండ: పండ్ల వ్యాపారంలో నష్టం రావడం.. సరుకు ఇచ్చిన రైతులు డబ్బుల కోసం నిలదీయడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల బంధువులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం దేవరహట్టి గ్రామానికి చెందిన కాంతరాజు, మారెక్క దంపతులు బెంగళూరు నగరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పాతిరెడ్డి, తిమ్మారెడ్డి, రామాంజనేయులు తదితరులు వివిధ రకాల పండ్లను సరఫరా చేసేవారు. నెలకో, రెండు నెలలకో రైతులకు డబ్బులు చెల్లించేవారు. ఇలా చాలా ఏళ్లుగా వ్యాపారం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆరు నెలలుగా రూ.80 లక్షల బకాయి పేరుకుపోయింది. పండ్లు సరఫరా చేసిన రైతులు ఒత్తిడి పెంచడంతో కాంతరాజు, మారెక్క ఫోన్ కాల్ తీయడం మానేశారు. చివరకు బెంగళూరు వదిలి స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పాతిరెడ్డి, తిమ్మారెడ్డి, రామాంజనేయులు మంగళవారం దేవరహట్టిలోని కాంతరాజు, మారెక్క ఇంటి వద్దకెళ్లి డబ్బు కోసం బైఠాయించారు. ఆరు నెలల్లో డబ్బులిస్తామని వారు చెప్పినా వినిపించుకోలేదు. అవమానంగా భావించిన కాంతరాజు, మారెక్క దంపతులు పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన గ్రామస్తులు వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న మారక్క, కాంతరాజు పండ్ల వ్యాపారంలో నష్టం సరుకు సరఫరా చేసిన వారికి రూ.80 లక్షల బకాయి ఇంటిముందు బైఠాయించిన రైతులు మనస్తాపంతో పురుగు మందు తాగిన దంపతులు -
బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడు సుశాంత్ను దారుణంగా హత్య చేసిన పెన్నయ్యను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. సీఐ రాజేంద్రనాథ్యాదవ్ తెలిపిన మేరకు.. నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసముంటున్న గోవిందహరి, నాగవేణి దంపతుల కుమారుడు సుశాంత్(5) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గత శనివారం రాత్రి 12 గంటల సమయంలో టిఫెన్ తినడానికి దంపతులిద్దరూ ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లిన సమయంలో పొరుగింటిలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ పెన్నయ్య బాలుడిని హత్య చేసి సంచిలో తీసుకెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల పొదల్లోకి పడేశాడు. అయితే బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితుడు పెన్నయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇందుకు కారణాలను వెల్లడించాడు. పెన్నయ్య గతంలో పెళ్లి చేసుకున్న ఆమె విభేదించి వెళ్లిపోయింది. దీంతో సావిత్రి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలంగా ఆమెతోనూ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సావిత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు కారణం సుశాంత్ తల్లి నాగవేణి అని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే బాలుడిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్కు తరలించారు. -
భూములు లాక్కుంటే మేమెక్కడికెళ్లాలి?
హిందూపురం: హంద్రీ–నీవా కాలువ ద్వారా భూగర్భజలాలు వృద్ధి చెంది.. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతూ వ్యవసాయానికి యోగ్యంగా ఉన్న భూములను పరిశ్రమల పేరిట బలవంతంగా లాక్కుంటే తాము ఎక్కడకు వెళ్లాలని రైతులు అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమలకు భూ సమీకరణపై మలుగూరులో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. మలుగూరు, రాచపల్లి, చలివెందుల గ్రామ రైతులు హాజరయ్యారు. ఆర్డీఓ ఆనంద్కుమార్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు అన్ని విధాలా న్యాయం చేయడం కోసమే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు. అందరి ఆమోదం మేరకే పరిశ్రమల కోసం భూములు తీసుకుంటామన్నారు. దీంతోపాటు భూములకు న్యాయమైన ధర నిర్ణయించి చట్ట ప్రకారం రైతులకు పరిహారం ఇప్పిస్తామన్నారు. మలుగూరు గ్రామ రెవెన్యూ పొలంలో దాదాపు రెండు వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసి మూడు నెలలు అవుతోందని, అయితే ఎకరాకు ఎంత ధర ఇస్తున్నారో తెలపాలని కోరితే అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేదో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని, బలవంతంగా భూములు లాక్కుని అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. -
● శ్రమదానంలో ఆదర్శం
రొళ్ల: గ్రామీణ ప్రాంతాల అభివృద్దిని ప్రభుత్వం విస్మరించింది. సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన కరువైంది. స్థానిక ప్రజాప్రతినిధి సైతం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నమ్మకం కోల్పోయారు. ఇక ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని వేచి చూడకుండా చెయ్యిచెయ్యి కలిపారు. శ్రమదానంతో 4 కిలోమీటర్ల మేర రహదారిని బాగుపరుచుకున్నారు. వివరాల్లోకెళితే.. రొళ్ల మండలం కొడగార్లగుట్ట క్రాస్ 544ఈ జాతీయ రహదారి నుంచి టీడీ పల్లి గ్రామానికి దాదాపు 4 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి వస్తుంది. పదేళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోడ్డు నిర్వహణను ప్రభుత్వం కానీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. రోడ్డుకు ఇరువైపుల పెరిగిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిస్థితిని ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి బాగు చేయాలని పలుమార్లు విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దాదాపు 150 మందికి పైగా గ్రామస్తులు ఏకమై మంగళవారం శ్రమదానం చేపట్టి ముళ్లకంపలు, పిచ్చి మొక్కలను తొలగించారు. -
శతజయంతి వేడుకలకు గవర్నర్కు ఆహ్వానం
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు మంగళవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై గవర్నర్ ఆరా తీశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రత్నాకర్ కలిసి బాబా శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు. మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్? మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాలు పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అగళి, అమరాపురం మండలాలు పెనుకొండకు దాదాపు 85 కిలోమీటర్లు, రొళ్ల, గుడిబండ మండలాలు 65, మడకశిర మండలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నియోజకవర్గ ప్రజలు పనుల కోసం పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు మండలాలను పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోనుంచి తప్పించి మడకశిర కేంద్రంగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే మడకశిర రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారనున్నట్లు ఓ అధికారి తెలిపారు. -
వీరభద్రుని సేవలో కర్ణాటక ఆర్టీఐ కమిషనర్
లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి ఆలయాన్ని కర్ణాటక ఆర్టీఐ కమిషనర్ మమత మంగళవారం ఉదయం సందర్శించారు. ఆలయ మర్యాదలతో ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. విద్యార్థులకు ఆధార్ కష్టాలు అగళి: పది, ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆధార్ కష్టాలు అడ్డంకిగా మారాయి. చాలా మంది విద్యార్ధుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ, పేర్లలో తేడాలు ఉన్నాయి. దీంతో వీటిని సవరించుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఆయా పాఠశాలల్లోనే సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేసి ఆధార్ అప్డేట్ చేపట్టినా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తప్పడం లేదు. నెట్వర్క్ సమస్య కారణంగా ఈ రప్రకియ నత్తనడకన సాగుతోంది. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేస్తున్న సమయంలో నెట్వర్క్ సమస్య తలెత్తి సచివాలయ ఉద్యోగి బయట ద్విచక్ర వాహనంపై నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఆధార్ అప్డేట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. బీసీ హాస్టల్ వార్డెన్ చేతివాటం చిలమత్తూరు: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులు వినియోగించే ట్రంకు పెట్టెలను వాచ్మెన్ ద్వారా వార్డెన్ శ్రీనివాసులు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బీసీ హాస్టల్లో మంగళవారం ఓ వాహనంలో ట్రంక్ పెట్టెలు, డోర్లను లోడ్ చేస్తుండగా గమనించిన సీపీఎం నాయకులు నిలదీశారు. ఆ సమయంలో అవి హాస్టల్కు సంబంధించినవి కావని బుకాయించారు. పోలీసులకు సమాచారం ఇస్తామని నాయకులు తెలపడంతో కాళ్లబేరానికి వచ్చారు. విద్యార్థులకు సంబందించినవే అయినా పాడైపోతే గుజరీకి విక్రయిస్తున్నట్లుగా వివరించారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి లీలావతి అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో వాచ్మెన్ తన తప్పును అంగీకరించాడు. హాస్టల్ వార్డెన్ సూచన మేరకే ఈ పనికి వాచ్మెన్ తెగించాడని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. -
జెడ్పీలో సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు
అనంతపురం టవర్క్లాక్: జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించారు. మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో పదోన్నతుల ఉత్తర్వులను చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో టి.ఫణిశేఖరరెడ్డి (జెడ్పీ కార్యాలయం), సి.రవి (వజ్రకరూరు), వై.లోక మల్లికార్జునరెడ్డి (అమడగూరు), కె.హనుమంతప్ప (గుమ్మఘట్ట), ఎం.కృష్ణానాయక్ (బెళుగుప్ప), హెచ్.మల్లికార్జున (బత్తలపల్లి), యు.ముత్యాలరెడ్డి (జెడ్పీకార్యాలయం) ఉన్నారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. పదోన్నతుల్లో పదనిసలు జిల్లా పరిషత్ ఉద్యోగుల పదోన్నతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు రకాల క్యాడర్లకు మంగళవారం సాయంత్రం పదోన్నతులు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడి వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే పదోన్నతి పొందిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా స్థాన చలనం కలిగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంగా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లుగా జెడ్పీ ఉద్యోగులు బాహటంగానే విమర్శిస్తున్నారు. -
వెయ్యేళ్ల నాటి శాసనం గుర్తింపు
ధర్మవరం రూరల్: మండలంలోని కుణుతూరు వద్ద ఉన్న ప్రాచీన శివాలయం సమీపంలో ఉన్న శాసనం వెయ్యేళ్ల నాటిదని చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి తెలిపారు. మంగళవారం ఆయన కాలభైరవ శివాలయంలోని రెండు శాసనాలు, కొల్లాపురమ్మ గుడిలోని ఒక శాసనాన్ని పరిశీలించారు. ఈ మూడు శాసనాలు కన్నడ లిపిలో ఉన్నాయన్నారు. ఈ శాసనాన్ని క్రీ,.శ. 1218వ సంవత్సరంలో అక్టోబర్ 22న దేవగిరి యాదవరాజు రెండవ సింహనుడు (సింగనుడు) రాయించినట్లు తెలుస్తోందన్నారు. వీటిపై సమగ్ర అధ్యాయనానికి నమూనాలను తీసి మైసూరులోని భారత పురావస్తు శాఖ కార్యాలయం డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపినట్లు వివరించారు. ఎండీఎం నిర్వాహకులపై అట్రాసిటీ కేసు నమోదు కనగానపల్లి: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని కులం పేరుతో దూషించిన ఎండీఎం (మధ్యాహ్న భోజన ఏజన్సీ) నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కనగానపల్లి ఎస్ఐ మహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో వారం రోజుల క్రితం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఉపాధ్యాయురాలు నాగలక్ష్మిపై స్థానిక టీడీపీ నేత, ఎండీఎం నిర్వాహకుడు నాగేంద్ర దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలిపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూిషించారన్న కారణాలతో మంగళవారం ఎండీఎం నిర్వాహకుడు నాగేంద్రతో పాటు మరో ఇద్దరు మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రీడా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం కార్పొరేషన్: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు నగదు ప్రోత్సాహక పథకానికి వచ్చే నెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్డీఓ మంజుల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్ఏఏపీ కేఆర్ఈఈడీఏ (సాప్ క్రీడా) యాప్ లేదా https://sports.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పామును కాపాడబోయి... గార్లదిన్నె: విష సర్పాన్ని కాపాడబోయిన ఓ వ్యక్తి చివరకు దాని కాటుకు మృతిచెందాడు. వివరాలు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన నెట్టికల్లు (57)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కల్లూరులోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన ఇంటి సమీపంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలుసుకున్న నెట్టికల్లు.. దానిని కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళుతుండగా కాటేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పామిడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు పోకిరి అప్పగింతహిందూపురం: స్థానిక శాంతినగర్ చెందిన 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మహబూబ్బాషాను స్థానికులు పట్టుకుని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మేళాపురంలో నివాసముంటున్న బాలిక తన శాంతినగర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటుండగా మహబూబ్బాషా మాయ మాటలతో పిలుచుకెళ్లి అసభ్య ప్రవర్తించాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే మహబూబ్ బాషాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతినగర్లో మరికొందరు యువకులు.. మహిళలు, బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్బాషాతో పాటు మరో నలుగురు మద్యం తాగి మైనర్ బాలికల పట్ల వేధింపులకు పాల్పడ్డారని వివరించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని వివరించారు. ప్రమాదంలో చేనేత కార్మికుడికి తీవ్రగాయాలు ధర్మవరం అర్బన్: లారీ దూసుకెళ్లడంతో ఓ చేనేత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సాయినగర్కు చెందిన చేనేత కార్మికుడు నాగమునెప్ప మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై శివానగర్కు వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఎన్టీఆర్ సర్కిల్లోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కిందపడిన నాగమునెప్ప కాలిపై లారీ వెనుక చక్రం వెళ్లడంతో కుడి కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నాగమునెప్పను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆకట్టుకున్న ఓపెన్ హౌస్
పుట్టపర్తి టౌన్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, రవికుమార్ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాల పనితీరును వివరించారు. నేర పరిశోధన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాల ప్రదర్శన అబ్బురపరిచింది. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు వీరన్న, వెంకటేశ్వర్లుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం టవర్క్లాక్: తుపాన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తుపాన్ సమయంలో ఎవరూ ఇళ్లను విడిచి బయటకు వెళ్లకూడదని, విద్యుత్ తీగలు, చెట్లు, పాడుబడిన భవనాల సమీపాల్లో ఉండరాదని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ భానుమతిఅనంతపురం: ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల పని తీరు, పరిశీలన, అజమాయిషీ, కేసుల పర్యవేక్షణ, న్యాయ వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇది వరకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న జి.రామకృష్ణ ప్రసాద్ (ఏపీ హైకోర్టు న్యాయమూర్తి) శ్రీకాకుళం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా నియామకం అయ్యారు. యువకుడి ఆత్మహత్య సోమందేపల్లి: స్థానిక దుర్గానగర్కు చెందిన కుమ్మర సురేష్కుమార్(36) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి జయమ్మతో కలిసి నివాసం ఉంటున్న అతను ఆదివారం సాయంత్రం తనకు పెళ్లి చేయాలని, లేకపోతే చనిపోతానంటూ ఇంట్లో ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంతో చుట్టుపక్కల వారి సాయంతో తల్లి కాపాడింది. తిరిగి అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్ రౌడీషీట్ ఉండంతో పాటు చెడు అలవాట్ల కారణంగా పెళ్లి సంబంధాలు రావడం లేదని నచ్చ చెప్పిన విన కుండా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కన్నీటి పర్యంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఈఆర్పీల సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా భవిత కేంద్రాల్లో పని చేసే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల(ఐఈఆర్పీ) సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లా సైన్స్ సెంటర్లో ప్రారంభమైంది. ఒక్కో మండలంలో ఇద్దరేసి చొప్పున మొత్తం 62 మంది ఐఈఆర్పీల సర్టిఫికెట్లను ప్రత్యేక బృందం పరిశీలించింది. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా ఐఈఆర్పీల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. -
స్వాతంత్య్ర సమర యోధుడు వీఎన్ రెడ్డి కన్నుమూత
పావగడ: స్వాతంత్య్ర సమర యోధుడు, తాలూకాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన వి.నరసింహారెడ్డి (103) సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య వెంకటలక్షమ్మ గతంలో మృతి చెందింది. తన సొంత ఇంట్లోనే ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇక సెలవంటూ ఆయన వీడ్కోలు పలికారు. 1923, మార్చి 4న యర్రపరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన వీఎన్ రెడ్డి తన విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. తాలూకా కార్యాలయంలో బ్రిటీష్ పాలకుల చేతిలో ఉన్న రికార్డులను తగుల బెట్టడానికి ప్రయత్నించారు. పోలీసుల పహారా ఎక్కువగా ఉండడంతో ఎలుకలు పట్టుకుని వాటి తోకలకు కిరోసిన్తో తడిపిన దుస్తులు చుట్టి నిప్పు పెట్టి కార్యాలయంలోకి వదిలారు. కాసేపటికే మంటలు ఎగిసి పడి రికార్డులు దగ్ధ మయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక మండల పంచాయతీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పదవి చేపట్టారు. అలాగే వెంకటాపురం గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దాదాపు 30 సంవత్సరాలు పాటు పనిచేశారు. ఆ కాలంలోనే గ్రామ పంచాయతీ పరిధుల్లో రోడ్డుకిరువైపులా చాటిన చింత చెట్లు నేడు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారాయి. పలువురి నివాళి.. హిందూపురం: స్వాత్రంత్ర సమర యోధుడు వి.ఎన్.రెడ్ది ఇక లేరు అని తెలియగానే కవి సడ్లపల్లె చిదంబరరెడ్డి, రైతు సంఘం నాయకుడు ధనాపురం వెంకటరామిరెడ్డి, ఓపీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, లెఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, బహుజన చైతన్య వేదిక కోనాపురం ఈశ్వరయ్య, మాజీ కౌన్సిలర్ దాదాపీర్, తదితరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోమవారం పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చేరుకుని వీఎన్రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. -
జెడ్పీ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి ఇకలేరు
తనకల్లు: కొన్ని రోజులుగా వయోభారం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి (87) పరాకువాండ్లపల్లిలోని తన స్వగృహంలో సోమవారం తుది శ్వాస విడిచారు. 1975లో తనకల్లు సర్పంచ్గా, ఆ తరువాత సమితి ప్రెసిడెంటుగా పనిచేశారు. 1981లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1984లో హిందుపూరం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 1991 నుంచి 1993 వరకు డీసీసీబీ చెర్మన్గా పనిచేశారు. కాగా, ఆయన అంత్యక్రియలను మంగళవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖుల నివాళి దేశాయి రెడ్డెప్పరెడ్డి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరిలో వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్రెడ్డి, అత్తార్ చాంద్బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్రెడ్డి, మండల పరిశీలకులు ప్రణీత్రెడ్డి, మండల కన్వీనర్ అశోక్రెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, రామ్దేశాయి, శ్రీకంఠారెడ్డి, నరేంద్ర, బాలకృష్ణ యాదవ్, అబ్ధుల్ ఉన్నారు. నిజాయితీ రాజకీయాలకు మారుపేరు నిజాయితీ రాజకీయాలకు మారుపేరు దేశాయి రెడ్డెప్పరెడ్డి అని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి కొనియాడారు. సోమవారం వారు రెడ్డెప్పరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిషత్ చైర్మెన్గా, డీసీసీబీ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లా అభివృద్ధితో పాటు వెనుకబడిన కదిరి ప్రాంతం అభివృద్ధికి రెడ్డెప్పరెడ్డి చేసిన కృషిని కొనియాడారు. రైతాంగ సమస్యల పరిస్కారానికి ముందుండేవారన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. అలాగే దేశాయి రెడ్డెప్పరెడ్డి మృతి బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ఓ ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో అనంతపురం టవర్క్లాక్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డప్పరెడ్డి (87) మృతిపై జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జెడ్పీ కార్యాలయంలో ఆయనకు నివాళలర్పించారు. అలాగే వైస్ చైర్మన్లు వేదాంతం నాగరత్నమ్మ, కామిరెడ్డిపల్లి సుధాకర్రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు. -
సర్కారు బడుపై వివక్ష చూపారు
రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 4,168 మంది విద్యార్థులను కూటమి ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 3 వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి సర్కారు బడి పిల్లలపై ఉన్న వివక్ష ఏపాటిదో అర్థమవుతోంది. గత ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరిస్తే వారిలో అత్యధిక శాతం సర్కారు బడి పిల్లలే ఉన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకునేందుకు ఇదొక్కటే చాలు. – పీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్టీఎఫ్ -
‘పరిష్కార వేదిక’కు వినతుల వెల్లువ
కదిరి అర్బన్: అన్ని అర్హతలున్నా పింఛన్ మంజూరు కాలేదని ఒకరు.. తమ భూమిపై ఆన్లైన్లో మరొకరి పేరు చేర్చారని మరొకరు.. సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఇంకొకరు...ఇలా జనం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎదుట సమస్యలు ఏకరవుపెట్టారు. సోమవారం కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలపై అర్జీలిచ్చేందుకు తరలికాగా, ఆర్డీఓ కార్యాలయం కిటకిటలాడింది. మొత్తంగా 551 అర్జీలు అందగా కలెక్టర్ శ్యాంప్రసాద్ వాటిని స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. ● కదిరిలో ఈఎస్ఐ ఆస్పత్రి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్ను కోరారు. కదిరి ప్రాంతంలో 10 వేల మంది బీడీ కార్మికులుగా పని చేస్తున్నారని, వారికి ఈఎస్ఐ ఆస్పత్రి ఎంతో అవసరమని సాంబశివ, రామ్మోహన్, బాబ్జాన్ కలెక్టర్కు విన్నవించారు. ● గొర్రెలు మేపుకునే తనపై సెప్టెంబర్ 20వ తేదీన రత్నమయ్య అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసి గాయపరిచాడని, ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చేయలేదని ఎన్పీకుంట మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అతన్ని శిక్షించి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరారు. రెవెన్యూ సమస్యలే ఎక్కువ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రజలు ఎక్కువగా సంతృప్తి చెందడం లేదని తెలుస్తోందన్నారు. అందుకే రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి సమతతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అర్జీలలో కొన్ని.. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ హాజరు అర్హులమైనా పింఛన్, పథకాలు అందలేదంటూ జనం ఆవేదన పింఛన్ మంజూరు చేయండి.. నాలుగేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఇంటిపెద్ద మృతితో మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబ జీవనం ఇబ్బందిగా మారింది. వితంతు పింఛన్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా...మంజూరు కావడం లేదు. ఇప్పటికై నా నాపై దయ ఉంచి పింఛన్ మంజూరు చేయండి. – శాంతాబాయి, చవిటింతండా, కదిరి మండలం ఇల్లు మంజూరు చేయండి.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం మాది. నేను, నా కుమారుడు గిరి, అతని భార్య, ముగ్గురు పిల్లలు కలిసి ఉంటున్నాం. మాకు సొంతంగా స్థలం ఉంది. ఇల్లు మంజూరు చేస్తే మాకో నీడ దొరుకుతుంది. దయచేసి ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి. – వెంకటరమణ, యర్రగుంట్లపల్లి, కదిరి మున్సిపాలిటీ వైకల్యశాతం తగ్గిస్తున్నారు.. రీవెరిఫికేషన్ పేరుతో వైద్యులు ఇష్టానుసారం దివ్యాంగుల వైకల్యశాతాన్ని తగ్గిస్తున్నారు. గతంలో సదరం ద్వారా 100 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందిన వారికీ 50, 60 శాతం నమోదు చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన వైకల్యశాతం నమోదు చేస్తున్నారో కూడా చెప్పడం లేదు. దీనివల్ల వేలాది మంది పింఛన్తో పాటు ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నారు. వైద్యులు పక్కాగా వైకల్య శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి. – ఇంతియాజ్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు, కదిరి -
అప్గ్రేడ్ .. అస్తవ్యస్తం
ఇది అగళి మండలం హళ్లికెర పంచాయతీలోని అమ్మాజీ క్షేత్రం మినీ అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ కార్యకర్తగా ఉన్న మహాలక్ష్మి 2016లో పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన కార్యకర్తలున్న మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం...అమ్మాజీ క్షేత్రం మినీ అంగన్వాడీ కేంద్రాన్ని మాత్రం విస్మరించింది. కానీ మడకశిర మండలంలోని కోనప్ప పాళ్యం మినీ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త నాగమణి పదో తరగతి పూర్తి చేయకపోయినా ఆ కేంద్రాన్ని అప్గ్రేడ్ జాబితాలో చేర్చారు. మడకశిర: జిల్లాలో మినీ అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మినీ అంగన్వాడీ కేంద్రంలోని కార్యకర్త పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉంటే అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జిల్లాలో ఇష్టారాజ్యంగా సాగింది. అర్హులకు అన్యాయం.. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 2,824 అంగన్వాడీ కేంద్రాలుండగా... ఇందులో 618 మినీ అంగన్వాడీలున్నాయి. ఇందులో 548 అప్ గ్రేడ్ అయ్యాయి. అర్హత ఉన్నా 45 మినీ అంగన్వాడీలు అప్ గ్రేడ్కు నోచుకోలేదు. ఈ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలందరూ టెన్త్ పాసయ్యారు. అయినా ఈ కేంద్రాలను కూటమి ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పుట్టపర్తి ప్రాజెక్టులో 6, సోమందేపల్లిలో 6, ఓడీసీలో 9, పెనుకొండలో 7, నల్లచెరువులో 5, హిందూపురంలో 5, బత్తలపల్లి ప్రాజెక్టులో 3, మిగిలిన ప్రాజెక్ట్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మినీ అంగన్వాడీ కేంద్రాలు అర్హత ఉన్నా... అప్ గ్రేడ్ జాబితాలో లేవని సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే విధంగా అర్హత లేకపోయినా మడకశిర ప్రాజెక్టులో 1, నల్లచెరువు 2,పెనుకొండ ప్రాజెక్టులో 1 చొప్పున మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్ గ్రేడ్ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు టెన్త్ పాస్ కాకపోయినా ఆ కేంద్రాలను అప్ గ్రేడ్ జాబితాలో ఉండడంపై విమర్శలకు దారి తీస్తోంది. కార్యకర్తలకు నష్టం.. ప్రస్తుతం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రం...అప్గ్రేడ్ అయితే కార్యకర్త గౌరవ వేతనం రూ.11,500 పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో 45 మినీ అంగన్వాడీ కేంద్రాల పేర్లు అర్హత ఉండీ కూడా అప్ గ్రేడ్ జాబితాలో లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాం జిల్లాలో అప్గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ కార్యకర్తల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాం. మినీ అంగన్ వాడీ కేంద్రాల అప్ గ్రేడ్ జాబితా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి మాకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ ప్రక్రియలో కొన్ని లోపాలు జరిగినట్లు గుర్తించాం. తప్పులను సరి చేయడానికి చర్యలు తీసుకున్నాం. అర్హత ఉన్న ప్రతి మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రధాన అంగన్వాడీ కేంద్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటాం. – ప్రమీల, పీడీ, ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంపులో ఇష్టారాజ్యం అర్హత ఉన్నా.. 45 కేంద్రాలకు మొండిచేయి -
ఇబ్బందులు పడుతున్నాం
నాలుగు నెలల నుంచి వరుస తుపాన్ల వల్ల మగ్గం నేయడం కష్టంగా మారింది. మగ్గం గుంతలో నీరు ఊరుతోంది. ఎన్నిసార్లు తోడి పోస్తున్నా ఫలితం ఉండటం లేదు. అలాగే మగ్గం నేయాలని చూస్తే కాలికి పుండ్లు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – బండారు శ్రీరాములు, చేనేత కార్మికుడు, ధర్మవరం జీఓ నంబర్ 5ను అమలు చేయాలి అకాల వర్షాలతో చేనేత కార్మికులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కూటమి ప్రభుత్వం జీఓ నంబర్ 5ను అమలు చేసి మగ్గం నీటి ఊటతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నిత్యావసరాలతో పాటు ఆర్థిక సాయం అందించాలి. అలానే భారీ వర్షాలతో నీట మునిగిన చేనేత మగ్గాల కార్మికులకు సత్వర సాయం అందించాలి. – బైముతక రమణ, చేనేత సంఘం నాయకుడు, ధర్మవరం ప్రతిపాదనలు పంపించాం అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మికుల వివరాలు ఆగస్టునెలలోనే ప్రభుత్వానికి పంపించాం. అక్కడి నుంచి అధికారిక ఉత్తర్వులు రాగానే సాయం అందించేందుకు చర్యలు చేపడతాం. –రామకృష్ణ, ఏడీ, చేనేత, జౌళి శాఖ -
టీడీపీలో తారస్థాయికి విభేదాలు
చిలమత్తూరు: మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాయకులు తమ ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం టీడీపీలోని రంగారెడ్డి వర్గం నేతలు ఎమ్మెల్యే పీఏలను కలిశారు. పార్టీలు మారే వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని తెగేసి చెప్పారు. చిలమత్తూరు పంచాయతీ సర్పంచ్ టికెట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో చిలమత్తూరు బరిలో నాగరాజు యాదవ్ సోదరుడు లక్ష్మినారాయణ యాదవ్ను దింపాలనే యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మరోవర్గం బీసీలలో పార్టీ కోసం తొలినుంచి కష్టపడిన వారికి సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని పీఏల వద్ద ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముందు నుంచి టీడీపీలో ఉన్న నేతలంతా ఒక గ్రూపుగా పీఏలను కలవడంపై మరో గ్రూపు గుర్రుగా ఉంది. అయితే సాయంత్రం రంగారెడ్డికి చెందిన పెట్రోల్ బంక్ వద్దకు కొందరు వ్యక్తులు చేరుకొని దుర్భాషలాడి, గొడవ పడినట్టుగా తెలిసింది. ఇదంతా యాదవ్ సోదరులు చేయించారని రంగారెడ్డి తన అనుచరగణంతో పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పార్టీలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఏడాది కిందట మొదలైన విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. ఇన్నాళ్లూ ఆదాయాలపై దృష్టి సారించిన తమ్ముళ్లు ‘స్థానిక’ సమరం దగ్గర పడుతుండటంతో దృష్టంతా ‘స్థానిక’ అధికారంపై పడింది. దీంతో టికెట్లు తమ వర్గానికంటే తమ వర్గానికని బహిరంగంగానే ప్రకటించుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. మాజీ కన్వీనర్ రంగారెడ్డి వర్సెస్ నాగరాజు యాదవ్ పోలీసు స్టేషన్కు చేరిన ‘పంచాయితీ’ -
పెన్షన్ లేదు.. ప్రత్యామ్నాయమూ చూపలేదు
కదిరి అర్బన్: ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్న అయూబ్కు 2021లో పక్షపాతం వచ్చింది. 1991లో సర్వీసులో చేరిన ఆయన 2021లో తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. అదే ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నాడు. ప్రత్యామ్నాయంగా తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలంటూ కారుణ్య నిమాయకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లు గడిచినా పెన్షన్ లేదు... కారుణ్యనియాకం కింద ఉద్యోగం ఇవ్వలేదు. ఫలితంగా జీవనం దుర్భరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. తనకు మందుల ఖర్చు ఎక్కువగా ఉందని కనీసం ఈపీఎఫ్ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు కన్నీటి పర్యతమవుతున్నాడు. ఈ విషయంపై పలుమార్లు మంత్రి లోకేష్కు, కలెక్టర్కు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు, పీఎఫ్ కార్యాలయ అధికారులకు, మైనార్టీ కమిషనరేట్కు విన్నవించినా ఫలితం లేదంటున్నాడు. తన ఆధార్ నంబర్కు బదులు వేరొకరి ఆధార్ నంబర్ను ఆర్టీసీ అధికారులు నమోదు చేయడంతో పీఎఫ్ విత్డ్రా, పెన్షన్ సమస్య తలెత్తినట్లు బాధితుడు వాపోయాడు. తన ఆధార్ నంబర్ను సరిచేయాలని అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నాడు. రోజురోజుకూ తన ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారులు స్పందించి పీఎఫ్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్ అందేలా చొరవ తీసుకోవాలని, కుమారుడికి కారుణ్యనియామకం కింద ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నాడు. అనారోగ్యంతో మంచాన పడిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అయూబ్ కారుణ్యనియామకం కింద దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం -
తాగి గొడవలు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం
●ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరిక హిందూపురం: రాత్రి వేళల్లో తాగి గొడవలు, అల్లర్లకు పాల్పడితే రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిౖపైనెనా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు మహేష్, నరసింగప్ప నేతృత్వంలో 120 మంది పోలీసు సిబ్బందితో పదికి పైగా బృందాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే హిందూపురంలోని గుడ్డం, త్యాగరాజనగర్ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రెండు డ్రోన్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైజెస్, ఫింగర్ప్రింట్ స్కానర్లు తదితర టెక్నాలజీని వినియోగించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లు, పరిసరాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. లైసెన్సులు, రికార్డులు లేని 77 ద్విచక్ర వాహనాలు, 7,ఆటోలు సీజ్ చేశారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజా జీవనం శాంతియుతంగా కొనసాగాలన్నారు. రాబోవు రోజుల్లో జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, జనార్దన్, ఆంజనేయులు, రాజ్కుమార్, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
ఉపాధిలో ‘పచ్చ’ మేత
జిల్లాలో ఉపాధిహామీ గణాంకాలు.. మొత్తం జాబ్ కార్డులు 2,59,895 ఉపాధి కూలీల సంఖ్య 4,76,217 పనులకు వెళ్లే కూలీల సంఖ్య 3,83,025 ఈ–కేవైసీ పూర్తయినవారు 1,52,315 ఫీల్డ్ అసిస్టెంట్లు 520 కదిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కార్యకర్తల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ‘వైఎస్సార్సీపీ’ ముద్ర వేసి తొలగించారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యేల సిఫార్సుతో ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించారు. వీరి ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం ఎంతోమంది ఉపాధి హామీ పనులకు వెళ్లకుండానే డబ్బులు దండుకుంటున్నారు. అలా వారి ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చేసినందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం కొంత డబ్బు తీసుకుంటున్నారు. జిల్లాలో 15 వేల మందికి పైగా బోగస్ కూలీలు ఉన్నట్లు పలు సామాజిక తనిఖీల్లో బయటపడింది. వీరు పనులకు వెళ్లకుండానే డబ్బు కాజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. అక్రమాలకు ముకుతాడు ఇలా... అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఉపాధి కూలీల ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్–నో యువర్ కస్టమర్) తీసుకొని ఆధార్కు అనుసంధానం చేస్తున్నారు. ఈ విధానంతో ఒకరి తరఫున మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు. ఉపాధి పనులు జరిగే చోట సిబ్బంది అక్కడి కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్లైన్లో పొందుపరచాలి. పనికి రాగానే ఒకసారి, నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి వాటిని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతన చెల్లింపులకు ఈ ఫొటోలు తప్పనిసరి. తర్వాతి రోజు ఫొటోలు అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదేరోజు అప్పటికప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకరిద్దరితో వేర్వేరు ఫొటోలతో ఎక్కువ మంది పనికి హాజరైనట్లు మస్టరు నమోదుకు కూడా వీల్లేకుండా ఏఐ సాయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. కూలీల గోల్మాల్కు ప్రయత్నిస్తే ఏఐ ఇట్టే పసిగట్టేస్తుంది. అదే జరిగితే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ను తక్షణం తొలగిస్తారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. ఇకపై పీడీఓల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల పేరును పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్(పీడీఓ)గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై వీరు కూడా ఉపాధి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఉపాధి కూలీల ఫొటోలను పీడీఓలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీఓకు నివేదిక సమర్పిస్తారు. మండల వ్యాప్తంగా వచ్చిన వాటిలో 20 శాతం ఫొటోలను ఎంపీడీఓ జిల్లా అధికారుల పరిశీలన కోసం పంపుతారు. వారు వీటిని జాగ్రత్తగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. పనులు చేయకున్నా కార్యకర్తలకు బిల్లులు బోగస్ రికార్డులతో ఫీల్డ్ అసిస్టెంట్ల మాయ కూటమి పాలనలో బరితెగించి మరీ అక్రమాలు చెక్ పెట్టేందుకు నిబంధనలు కఠినం చేసిన కేంద్రం పనిచేసే చోట రెండుసార్లు హాజరు.. కూలీల ఫొటోలపై పీడీఓల నిఘా చిలమత్తూరు మండలంలోని ఓ పంచాయతీలో ఉపాధి హామీ పనులకు 112 మంది కూలీలు వెళ్తే.. బిల్లులు మాత్రం 180 మంది అందుకుంటున్నారు. వీరంతా టీడీపీ కార్యకర్తలే. అంటే ఉపాధి పనులకు వెళ్లకపోయినా ప్రతి వారం వీరి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. ముదిగుబ్బ మండలంలోనూ పలువురు టీడీపీ కార్యకర్తలు ఉపాధి పనులకు వెళ్లకుండానే డబ్బులు అందుకుంటున్నారు. ఇలా వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చేసినందుకు సదరు ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం కొంత వాటా తీసుకుంటున్నారు. ... ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులకు వెళ్లకుండానే డబ్బులు దండుకుంటున్న ‘పచ్చ’ గ్యాంగ్ 15,550 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి వారి అక్రమాలను కట్టడి చేసేందుకు కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. పని చేస్తేనే పైసలు ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అందరికీ ఈ–కేవైసీ చేయిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు నిజమైన కూలీలకు న్యాయం జరుగుతుంది. అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండదు. నిజంగా పని చేసే వారి బ్యాంకు ఖాతాలకే ఇకపై పైసలు జమ అవుతాయి. –విజయప్రసాద్, పీడీ, డ్వామా -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
అగళి/ రొళ్ల: ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం అగళి మండలంలోని 13 పంచాయతీలు, రొళ్ల మండలంలోని 10 పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త ఈరలక్కప్ప మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. ఇందులో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. మిగిలినవి అందుబాటులోకి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వానికి భారమవుతుందని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. పేదలు బాగుపడతారంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే ప్రైవేటు జపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పేదలకు వైద్య విద్యతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా చేస్తున్న కుట్రలను కోటి సంతకాల సేకరణతో తిప్పి కొడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, సర్పంచ్లు ముద్దరాజు, రామకృష్ణప్ప, శివకుమార్, మజీ సింగిల్విండో అధ్యక్షుడు జయరామప్ప, నాయకులు శివన్న, సదానంద ఆరాధ్య, వేంకటస్వామి, రంగనాథ్, తిమ్మరాయప్ప, సుర్యనారాయణరెడ్డి, కృష్ణ, లింగరాజు, సన్నప్ప, గంగాధర్, శంకరప్ప, ప్రకాష్, కాంతరాజు, హనుమంతరాయప్ప, ఈరన్న, గోవిందప్ప మంజునాథ్, నాగరాజు, మైలారప్ప, గంట నాగరాజు, సురేష్, కాంత, సన్నప్ప, సిద్దలింగ, రమేష్, బాలకృష్ణ, హనుమంతరాయప్ప, లక్ష్మికాంత, హరిష్, లలిత, జగదీష్, రాజన్న, హనుమంతరాయప్ప, మూర్తి, గోవిందప్ప, గిరీష్, మంజునాథ్, నాగేంద్ర, హనుమంతరాజు, గంగాధర్, మల్లికార్జున్, కార్యకర్తలు, పాల్గొన్నారు. రొళ్ల మండలంలో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు రంగనపల్లి నాగేంద్ర, శివరామప్ప, అలుపననల్లి శ్రీనివాస్, శ్రీనివాస్, మల్లేశప్ప, గోవిందరాజు, బాబు, వజీర్ షేక్, సత్యనారాయణరెడ్డి, సిద్దప్ప, రవికుమార్, హనుమంతరాయుడు, యర్రగుంటప్ప, రాజన్న, నరసింహప్ప, తిమ్మప్ప, చంద్రప్ప, మంజునాథ్, హనుమంతరాయప్ప, చిక్కన్న, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాలతో కూటమి కుట్రలను తిప్పికొడతాం వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గసమన్వయకర్త ఈరలక్కప్ప -
రైతుల సమ్మతితోనే భూసేకరణ
సోలార్ పవర్ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు గల ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. పట్టాలున్న రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి భూములు లీజు రూపంలో తీసుకుంటాం. రైతుల సమ్మతితోనే భూసేకరణ చేపడతాం. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం మేరకే ముందుకు వెళతాం. పశువుల కోసం మేత బీళ్ల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. – దేవేంద్రనాయక్, తహసీల్దార్, ఎన్పీ కుంట మండలం -
రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం!
సాక్షి, పుట్టపర్తి అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి అండదండలతో ఐసీడీఎస్లో పని చేసే ఓ మహిళా అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తి పరిధిలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారి... ఇటీవల రాజీనామా చేసిన ఓ ఉద్యోగికి రెండు నెలలుగా వేతనం ఖాతాలో జమ చేస్తున్నారు. ఐసీడీఎస్లో జరిగిన అవినీతి ఆరోపణలపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణకు రావడంతో ‘రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం’ విషయం వెలుగు చూసింది. మరింత లోతుగా విచారణ చేపడితే కోడిగుడ్ల నుంచి పౌష్టికాహారం వరకూ మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు ఐసీడీఎస్ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. రికార్డుల్లోనూ పక్కాగా నమోదు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పెద్ద కమ్మవారిపల్లి అంగన్వాడీ కేంద్రం హెల్పర్ గత జూన్ 5వ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే సెప్టెంబరు వరకు ఆమెకు వేతనం బ్యాంకు ఖాతాకు జమ చేస్తూనే వచ్చారు. ఆ విషయాన్ని రికార్డుల్లో సైతం నమోదు చేశారు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడం.. రికార్డుల పరంగా ఆధారాలు ఉండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాజీనామా చేసిన ఉద్యోగిని పిలిపించి.. నగదు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అయితే వేతనం ఇచ్చారనే విషయమే తనకు తెలియదని.. బ్యాంకు ఖాతాలో పరిశీలించాలని ఆమె చెప్పడంతో.. ఆర్ఆర్ (రివర్సర్ రికవరీ) యాక్ట్ గురించి భయపెట్టి.. ఒప్పించినట్లు తెలిసింది. ఇక వేతనం మంజూరు చేసేందుకు సహకరించిన ఇద్దరు ఉద్యోగులకు మెమో జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తప్పిదం జరిగిందా? లేక అవినీతి అక్రమాల్లో భాగంగా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో చేశారా? అనేది చర్చనీయంగా మారింది. ఆమైపె ఆరోపణలెన్నో.. పుట్టపర్తి ఐసీడీఎస్ విభాగంలో పనిచేసే ఓ మహిళా అధికారిపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో ఉద్యోగిగా ఉండగా.. అధికార పార్టీ నేతల అండదండలతో ఆ మహిళా అధికారి అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయన్న ఆరోపణలున్నాయి. సదరు అధికారిణి సమావేశాల నిర్వహణ పేరుతో అంగన్వాడీ సిబ్బంది నుంచి కనీసం మూడు కిలోల చొప్పున డ్రై ఫ్రూట్స్ తేవాలని డిమాండ్ చేస్తారట. రోజూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంత పనులకు వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. సదరు అధికారి నిర్లక్ష్యంతో కొత్తచెరువు మండల పరిధిలో ఓ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపించి సరుకులు దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పుట్టపర్తి మండల పరిధిలోనూ ఓ చోట ఇదే తంతు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. సదరు అధికారి నిర్వాకంతో సిబ్బంది ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే.. రాజీనామా చేసిన ఉద్యోగికి వేతనం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. రికవరీ చేయిస్తాం పుట్టపర్తి మున్సిపాలిటీలోని పెద్ద కమ్మవారిపల్లిలో అంగన్వాడీ హెల్పర్ గత జూన్ 5వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత రెండు నెలల పాటు వేతనం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులకు మెమో జారీ చేశాం. రాజీనామా చేసిన హెల్పర్తో బ్యాంకు ఖాతా నుంచి ఆ నగదును రికవరీ చేయిస్తాం. – జయంతి, సీడీపీఓ, పుట్టపర్తిఎవరైనా సరే ఉద్యోగానికి రాజీనామా చేస్తే.... ఆ రోజు నుంచే వారికి వేతనం మంజూరు కాదు. కానీ ఘనత వహించిన ఐసీడీఎస్ అధికారులు రాజీనామా చేసిన ఉద్యోగికి రెండు నెలలుగా వేతనం ఖాతాలో జమ చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే నెపం ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నారు. ఐసీడీఎస్లో అవకతవకలు రెండు నెలల పాటు వేతనం అందించిన వైనం గుట్టుచప్పుడు కాకుండా రికవరీకి యత్నం జీతం విషయమే తనకు తెలీదంటోన్న ఉద్యోగి ఓ మహిళా అధికారి కనుసన్నల్లోనే తతంగం -
పేదలకు వైద్యం దూరం చేస్తే ఊరుకోం
పుట్టపర్తి: ‘‘నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. దీనివల్ల వైద్యవిద్య చదవాలనుకునే పేద కుటుంబాల్లోని విద్యార్థులకూ మేలు జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసి పెత్తందార్లకు మేలు చేసేందుకు సిద్ధ పడింది. పేదలకు వైద్యాన్ని దూరం చేస్తే చూస్తూ ఊరుకోం’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొత్తకోట కేశప్ప, ఎంపీపీ శ్రీధర్రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధాకర్ తదితరులతో కలిసి కొత్తకోట, గూనిపల్లి, సిద్దరాంపురం, బుచ్చయ్యగారిపల్లి, నార్శింపల్లి తండా గ్రామ పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సభల్లో శ్రీధర్రెడ్డి మాట్లాడారు. జగన్ మీద కక్ష గట్టిన కూటమి సర్కార్... గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అభివృద్ధికి మంగళం.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలకు మంగళం పాడిందని శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. అరాచకాలకు, అవినీతికి దారులు వేసిందని దుయ్యబట్టారు. కూటమి నేతలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో విచ్చల విడిగా జూదం ఆడించటంతో పాటు బెట్టింగ్, కల్తీ మద్యం అమ్మి పేదల ఉసురు పోసుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలనతో అన్ని వర్గాల వారు విసిగి పోయారన్నారు. 2029లో తప్పక జగన్ను ఆశీర్వదిస్తారన్నారు. పేదలకు మంచి చేసే జగనన్నను మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఉండ్ల కిష్టయ్య, విజయారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కొత్తకోట రఘు, జిల్లా అగ్రి అడ్వయిజరీ మాజీ అధ్యక్షుడు ఆవుటాల రమణారెడ్డి, గ్రామ సచివాలయాల కన్వీనర్ గోవర్దన్రెడ్డి, మండల పరిశీలకులు గంగాధర్, మల్లికార్జున, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుష్ప, నేతలు నాగమల్లీశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అరుణబాయి, సర్పంచులు నాగమణి, గోవిందరెడ్డి, రమణయ్య, భాస్కర్రెడ్డి, కృష్ణమ్మ బాయి, భాస్కర్ నాయక్, రఘునాథరెడ్డి, మదిరేబైలు రవీంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, ఎంపీటీసీలు చెన్నుడు, హర్షవర్దన్రెడ్డి, పుల్లారెడ్డి, వెంకటరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, మల్లేశ్, కేపీ నాగిరెడ్డి, మనోహర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామలింగారెడ్డి, ఓబిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, కేశవరెడ్డి, గోపాల్రెడ్డి, వడ్డె లక్ష్మీనారాయణ, నిరంజన్రెడ్డి, బుచ్చయ్యగారిపల్లి వైస్ సర్పంచ్ కృష్ణరెడ్డి, అమరనాథరెడ్డి, దామోదర్రెడ్డి, నాగభూషణ, మాల్యవంతం మారుతి తదితరులు పాల్గొన్నారు కూటమి సర్కార్ను హెచ్చరించిన దుద్దుకుంట శ్రీధర్రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటిసంతకాల సేకరణ’ -
తాగునీటి కోసం మహిళల ఆందోళన
రొళ్ల: భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలోనూ తాగునీటి కోసం తాము పడరాని పాట్లు పడుతున్నామని పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. శనివారం ఖాళీ బిందెలతో వచ్చి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే తమ కాలనీకి తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా నీరు లేదు.. మండల కేంద్రం రొళ్ల సమీపాన ఉన్న మారుతి కాలనీకి నీటి సరఫరా చేసే బోరులో వారం రోజుల క్రితం మోటర్ ఇరుక్కుపోయింది. అప్పటి నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేంత వరకూ కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ ఈఓఆర్డీ శ్రీనాథ్..మహిళల వద్దకు వచ్చి మాట్లాడారు. రెండు రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సాయంత్రం మరో బోరుబావి నుంచి మారుతి కాలనీకి నీటిని తాత్కాలికంగా నీరు సరఫరా చేశారు. అయితే రెండు రోజుల్లోపు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు హెచ్చరించారు. -
ఏడు మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో వరుసగా ఐదో రోజు శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఒకే రోజు 72.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధర్మవరం మండలం 24.0 మి.మీ, చెన్నేకొత్తపల్లి 19.4 మి.మీ వర్షం కురిసింది. ఇక బత్తలపల్లి మండలంలో 13.4 మి.మీ, రామగిరి 5.6, కనగానిపల్లి 4.2, ముదిగుబ్బ 3.6, సోమందేపల్లి మండలంలో 1.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి● మంథా తుపాను నేపథ్యంలో సిబ్బందికి కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘మంథా’ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి అన్ని డివిజన్ల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు, ప్రత్యేక అధికారులు, విపత్తుల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై చర్చించారు. వాగులు, వంకల ప్రవాహ తీవ్రతను ముందే పసిగట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆయా శాఖల పరిధిలో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సత్యసాయి జయంత్యుత్సవాలకు రైళ్లు గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు–చైన్నె ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నవంబర్ 19, 20, 21, 22 తేదీల్లో నడుస్తాయి. నవంబర్ 19న చైన్నె (06091)లో రాత్రి 11.30 గంటలకు రైలు బయలుదేరి గుంతకల్లు జంక్షన్కు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరిగి ఈ రైలు 20న ఇక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చైన్నె చేరుతుంది. యలహంక, హిందూపురం, పుట్టపర్తి సత్యసాయి నిలయం రైల్వేస్టేషన్, ధర్మవరం, అనంతపురం, గుత్తి మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుంది. అలాగే కాచిగూడ–తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయి. నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (గురువారం) కాచిగూడ జంక్షన్ (07787) నుంచి రాత్రి 10.25 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 7, 14, 21, 28 తేదీల్లో తిరుచూనూరు రైల్వేస్టేషన్ (07788)లో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ జంక్షన్ చేరుతుంది. ఇది షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. బైక్ సర్వీసుకు అదనపు చార్జీ వసూలుపై కొరడా ● తిప్పయ్య మోటార్స్కు రూ.25 వేల జరిమానా అనంతపురం: బైక్ సర్వీసుకు అదనపు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్పై వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. వివరాలు.. నగరంలోని అరుణోదయ కాలనీకి చెందిన అబ్దుల్ గఫూర్ తన స్ల్పెండర్ బైక్ను ఆర్ఎఫ్ రోడ్డులోని తిప్పయ్య మోటార్స్లో సర్వీస్ చేయించాడు. హెడ్లైట్, మరికొన్ని మరమ్మతులు చేసినందుకు గానూ రూ.1,318 బిల్లు చెల్లించాడు. అయితే, ఎక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన గఫూర్ మేనేజర్ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో తిప్పయ్య మోటార్స్కు లీగల్ నోటీసు పంపి వినియోగదారుల కమిషన్లో కేసు దాఖలు చేశాడు. వినియోగదారుడికి ఒక తరహాలో, ప్రభుత్వానికి చూపే జమా ఖర్చుల్లో మరో తరహా బిల్లును ఇస్తున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన కమిషన్.. నైట్రోజన్ గాలికి రూ.20, ఇందుకు అదనంగా జీఎస్టీ రూ.3.60 వసూలు చేయడం సేవాలోపంగా గుర్తించింది. అదనపు సర్వీసు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్కు రూ.25 వేల జరిమానా, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతమైతే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని కమిషన్ అధ్యక్షురాలు శ్రీలత, సభ్యులు డి. గ్రేస్మేరీ, బి. గోపీనాథ్ హెచ్చరించారు. -
వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రణయ్రెడ్డి
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వై.ప్రణయ్రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థి విభాగం నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్కు, సహకరించిన పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డికి ప్రణయ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేసి, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి మడకశిర: వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ అధ్యక్షతన మడకశిర ఉపాధ్యాయ భవనంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. పెనుకొండ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని కోరారు. పీపీపీ విధానం పేరిట ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కళాశాలలను ఇవ్వకూడదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జపాన్ని కూటమి ప్రభుత్వం వీడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల అవసరం ప్రజలకు చాలా ఉందన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాస్పత్రులు, మెడికల్ కాలేజీలు ప్రజలను ఆదుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి పెనుకొండ మెడికల్ కాలేజీని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. తద్వారా పేదలు ఉచితంగా వైద్య విద్య అభ్యసించడానికి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పొదడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, డీహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు భూతన్న, జిల్లా కార్యదర్శి మహలింగప్ప, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు రంగనాథ్, అశ్వర్థ, ఎఎఫ్ఐ నాయకులు మహీంద్ర, గణేష్, సాయి, దేవ, డీవైఎఫ్ఐ నాయకుడు ముత్యాల మూర్తి, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ గౌరవం పెంచాలి ● నేర సమీక్షలో సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం పుట్టపర్తి టౌన్: ప్రతి పోలీసు అఽధికారి నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించి పోలీస్ శాఖ గౌరవం పెంచాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక సాయి ఆరామంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్లతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్, పోక్సో కేసులు, మహిళలపై జరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రసంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించి శిక్ష పడేలా చేయడం కూడా పోలీసుల బాధ్యతేనని గుర్తించాలన్నారు. పోలీసులు అంటే నేరస్తులకు భయంపుట్టే విధంగా పనిచేయాలన్నారు. గస్తీలు ముమ్మరం చేయడంతో పాటు విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నారు. సీసీ కెమెరాల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించి దేవాలయాలు, వీధులు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. అవగాహన కల్పించాలి.. ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలు... వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సందర్శనలు, పల్లె నిద్ర చేపట్టి ప్రజలతో మమేకం కావాలన్నారు. కార్యక్రమంలో పీపీలు రామ్నాయక్, లక్ష్మీ నారాయణ, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్కుమార్, నర్సింగప్ప, శివనారాణస్వామి, ఆదినారాయణ, స్పెషల్బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఐటీకోర్ టీమ్ ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు ఉపాధ్యాయులు
రామగిరి: కళాత్మకమైన విద్యా బోధన అంశంలో జిల్లాలోని ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీఈఆర్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో కళాత్మకమైన విద్యా బోధనపై ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో పేరూరు డ్యాంలోని ఏపీఆర్ఎస్ (మహాత్మా జ్యోతిబా పూలే) బాలుర పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీరాములు, పూలమతి హైస్కూల్ ఉపాధ్యాయురాలు మెర్సీరాణి సంయుక్తంగా పాల్గొని తృతీయ స్థానంలో నిలిచారు. నవంబర్లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ప్రదర్శనలో తామిద్దరం పాల్గొననున్నట్లు శ్రీరాములు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచిన శ్రీరాములును ప్రిన్సిపాల్తోపాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
కనగానపల్లి/ అగళి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాము అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను శనివారం ఉదయం తన తల్లి చెన్నమ్మ (60)తో కలసి బెంగుళూరు నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న దిమ్మెను వేగంగా ఢీకొట్టింది. వెనుక సీటులో కుర్చున్న చెన్నమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రాము తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డ్యాం చూడటానికెళ్లి మృత్యువాత.. ● అగళి మండలం బొమ్మరసనపల్లికి చెందిన రామచంద్రప్ప, అనిత దంపతుల కుమారుడు తనోజ్ (20), రాగేలింగన్నపల్లికి చెందిన రూపా, నరసింహమూర్తి దంపతుల కుమారుడు అక్షయ్ శనివారం కర్ణాటకలోని మారికణవె డ్యాం చూడటానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. మార్గం మధ్యంలోని హరియూర్ సమీపంలోని ధాబా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో తనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అక్షయ్ దావణగెరె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
మంచు కురిసే వేళలో...
ఇల్లు, పొలం, రోడ్లు.. ఇలా ఎటు చూసినా తెల్లటి పొగమంచే. తుపాను ప్రభావంతో ఆకాశం మేఘామృతమై జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అయితే కర్ణాటకకు ఆనుకుని ఉన్న గోరంట్ల, ఓడీచెరువు, అమడగూరు, నల్లచెరువు, తనకల్లు, మడకశిర, లేపాక్షి, రొళ్ల తదితర మండలాల్లో మాత్రం శనివారం తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేసింది. రోడ్డుపై ఎదురుగా ఏమి వస్తున్నాయో కనిపించనంతగా పొగమంచు వ్యాపించింది. ఉదయం ఎనిమిది గంటల వరకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే వేగం తగ్గించి, హారన్ మోగిస్తూ నెమ్మదిగా రాకపోకలు సాగించారు. – పుట్టపర్తి అర్బన్: -
పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ
● 15 నెలలుగా ఇన్చార్జ్ వీసీతోనే నెట్టుకొస్తున్న ఎస్కేయూ ● కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేక ఇబ్బందులు ● ఇప్పటికే రెండు దఫాలు సెర్చ్ కమిటీ నియామకం ● అయినా పూర్తి కాని వీసీ ఎంపిక ప్రక్రియ ● రెండేళ్లుగా డిగ్రీలు ప్రదానం చేయని పరిస్థితి ● స్నాతకోత్సవం నిర్వహించలేని స్థితిలో వర్సిటీ యాజమాన్యం అనంతపురం: పాలనాపరమైన ఇబ్బందులతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కొట్టుమిట్టాడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇన్చార్జ్ వీసీకి లేకపోవడమే ఇందుకు కారణం. వర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ బి.అనిత నియామకమై 15 నెలలు పూర్తయింది. ఇప్పటికే రెండు దఫాలుగా సెర్చ్ కమిటీ నియామకమైనా పూర్తి స్థాయి వీసీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోంది. ఇదిగో..అదిగో అంటూ ఊరడిస్తూ కాలయాపన చేస్తోంది. ఈ క్రమంలో కీలకమైన తీసుకోలేని అసహాయ స్థితిలో సాధారణమైన అంశాలకే ఇన్చార్జ్ వీసీ పరిమితం అవుతున్నారు. అలాగే రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలకు కూటమి సర్కార్ తిలోదకాలు ఇవ్వడంతో పాలన గాడి తప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి కాని, డిప్యూటీ రిజిస్ట్రార్ (డీఆర్) హోదాలో ఉన్న వారిని గాని రిజిస్ట్రార్గా నియామకం చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాటిస్టికల్ ఆఫీసర్ స్థాయి ఉన్న వ్యక్తిని రిజిస్ట్రార్గా నియమించడం వివాదస్పదమైంది. అన్ని అర్హతలున్న వారు ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కేవలం ఓ సామాజిక వర్గానికి పట్టం కట్టాలనే ఉద్దేశ్యంతోనే రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి రిజిస్ట్రార్గా ఉంటే వర్సిటీ, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. మూడేళ్ల క్రితం స్నాతకోత్సవం వాస్తవానికి స్నాతకోత్సవం ఏటా లేదా రెండేళ్లకు ఓ సారి నిర్వహిస్తుంటారు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ డిగ్రీ అందించాలంటే స్నాతకోత్సవ నిర్వహణ తప్పనిసరి. చివరి సారిగా 2023, జులైలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ మూడేళ్లుగా స్నాతకోత్సవం ఊసే లేకుండా పోయింది. ఫలితంగా 20 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. డిగ్రీ పూర్తయి పీజీ కోర్సులు చేయాలంటే యూజీ పట్టా అనివార్యం. దీంతో చాలా మంది ఇన్అడ్వాన్సెడ్ కింద స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకుని పట్టా పొందుతున్నారు. దీంతో అదనపు ఫీజుల రూపంలో వేలాది మంది విద్యార్థుల జేబులకు చిల్లుపడుతోంది. స్నాతకోత్సవం నిర్వహించలేని అసహాయ స్థితిలో వర్సిటీ యాజమాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్అడ్వాన్సెడ్ స్నాతకోత్సవం కింద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టుకునే కుట్ర సాగుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. హేమలత... 2024, జులైలో బీఎస్సీ (కంప్యూటర్ సైన్సెస్) కోర్సు పూర్తి చేసింది. అనంతరం సాఫ్ట్వేర్ కోర్సు ఒరాకిల్ హైదరాబాద్లో అభ్యసించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న ఆమెకు నియామక పత్రం (ఆఫర్ లెటర్) తీసుకున్న తక్షణమే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ అధికారులు సూచించారు. దీంతో సంబంధిత డిగ్రీ కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ను అడిగితే.. వర్సిటీ అధికారులు స్నాతకోత్సవం నిర్వహించలేదు కాబట్టి ఇన్ అడ్వాన్స్డ్ కాన్వొకేషన్ ( ముందస్తు స్నాతకోత్సవ పట్టా) డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ మేరకు ఎస్కేయూకు వెళ్లి ఇన్అడ్వాన్స్డ్ కాన్వొకేషన్కి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు గాను రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి స్నాతకోత్సవం నిర్వహించి ఉంటే పట్టా ఫీజు కేవలం రూ.2,500 మాత్రమే. ఇలా హేమలత ఒక్కరే కాదు.. స్నాతకోత్సవ డిగ్రీ కావాలనుకునే ప్రతి విద్యార్థి అదనంగా చెల్లించాల్సి రావడంతో జేబులకు చిల్లు పడుతోంది. -
చంద్రబాబు పతనం మొదలైంది
రొద్దం: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారుకు పతనం మొదలైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు. లూలూ, ఉర్సా కంపెనీలకు రూ.కోట్లు విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని, పేద విదార్థుల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తూ 17 మెడికల్ కాలేజీలను తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా అప్పజెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సాయంత్రం మండలంలోని తురకలాపట్నం, పెద్దిపల్లి, ఎల్జీబీనగర్, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి తదితర గ్రమాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, అప్పటి వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సమాయత్తం అవుతున్నారన్నారు. మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం ఈ నెల 28న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కోటి సంతకాల సేకరణతో కూటమి కుట్రలను భగ్నం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తిమ్మయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సినిమా నారాయణ, శంకర్, చిలకల రవి, నారేంద్రరెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి, విశ్వనాథ్రెడ్డి, అమిర్, షానవాజ్, ఇస్లాపురం అంజి, గోపాల్రెడ్డి, స్థానిక నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం కూటమి కుట్రలను కోటి సంతకాలతో భగ్నం చేద్దాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపు -
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం 12 మందితో కూడిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కలెక్టరేట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ షేక్ మైనుద్దీన్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, కార్యదర్శిగా రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ట్రెజరర్గా కె.మహబూబ్ బాషాను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడు వెంకటనారాయణ మాట్లాడుతూ కలెక్టరేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు. అనంతరం పుట్టపర్తి డివిజన్ నూతన కమిటీని సైతం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నాగార్జునశెట్టి తెలిపారు. డివిజన్ అధ్యక్షులుగా డిప్యూటీ తహసీల్దార్ కె.నరసింహులు, ట్రెజరర్గా ఆర్ఐ గణేష్రెడ్డి, సెక్రెటరీగా డిప్యూటీ తహసీల్దార్ మనోజ్ కుమార్రెడ్డితో పాటు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నట్లు వివరించారు. సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు పెనుకొండ రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన జవాన్ అంత్యక్రియలు సైనిక లాంఛ నాలతో జరిగాయి. శెట్టిపల్లికి చెందిన శ్యాం ప్రసాద్ నాయుడు 2005లో ఆర్మీ జవాన్గా చేరాడు. జమ్ము కశ్మీర్, అసోం, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఏడాది నుంచి పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్లో పనిచేస్తున్నారు. గత నాలుగు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. శనివారం ఆర్మీ అధికారులు జవాన్ భౌతికకాయాన్ని స్వగ్రామం శెట్టిపల్లికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు జవాన్ను చూసి బోరున విలిపించారు. మృతుని అన్న బీఎస్ఎఫ్ జవాన్ వెంకట నాయుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే బంధువులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి సవిత, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు జవాన్ను కడసారి చూపు చూసి నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు శవపేటికపై పుష్ప గుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం చేశారు. పోలీసులు తుపాకులతో గౌరవ వందనం చేశారు. జవాన్కు చెందిన తోటలోనే ఖననం చేశారు. -
ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో ప్రకృతి సేద్యం సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూమాత రక్షణ, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి సేద్యంపై గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ రసాయన ఎరువుల వినియోగం జరుగుతుందో గుర్తించి ఆయా గ్రామాల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే ఎరువుల అధిక ధరలకు విక్రయించకుండా నిరోధించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనంతపురం సిటీ: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం వెబ్సైట్ చూడాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు గుట్టూరు విద్యార్థులు పెనుకొండ రూరల్: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గుట్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు నలుగురు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు నాగార్జున తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అనంతపురం జిల్లాలో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. అండర్–19 విభాగంలో 8వ తరగతి విద్యార్థి ఉమా లక్ష్మి, అండర్–17 విభాగంలో 8వ తరగతి విద్యార్థి సంధ్యావతి, అండర్– 14 విభాగంలో ఏడో తరగతి విద్యార్థులు పల్లవి, మోనా కర్ణిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం వివరించారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కొనసాగుతున్న వర్షాలు పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో వరుసగా మూడోరోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా జడివాన కురిసింది. 32 మండలాల పరిధిలో 434.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 29.8 మి.మీ, నల్లమాడ మండలంలో 28 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తాడిమర్రి మండలంలో 25.0 మి.మీ, ఎన్పీ కుంట 22.4, సీకేపల్లి 22.2, రామగిరి 20.8, రొద్దం 20.4, కదిరి 18.4, బత్తలపల్లి 17.6, గాండ్లపెంట 16.4, గోరంట్ల 15.2, ధర్మవరం 14.6, తలుపుల 14.2, రొళ్ల 14.2, గుడిబండ 13.2, హిందూపురం 12.8, ముదిగుబ్బ 12.6, కొత్తచెరువు 11, ఓడీచెరువు 10.2, చిలమత్తూరు 10.2, బుక్కపట్నం 9.6, అగళి 9, నల్లచెరువు 9, తనకల్లు 8.4, సోమందేపల్లి 8.2, పెనుకొండ 8.0, మడకశిర 7.0, అమరాపురం 6.4, పుట్టపర్తి 6.2, అమడగూరు 5.8, లేపాక్షి 5.4, పరిగి మండలంలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వారం రోజులుగా వాన తెరిపినివ్వకపోవడంతో పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తాగేందుకు నీళ్లూ ఇవ్వలేరా?
గుడిబండ: వారం రోజుల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కేఎన్ పాళ్యం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహిళలు, గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుడిబండ–మడకశిర ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీటి సమస్యపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా స్పందన కరువైందని మహిళలు వాపోయారు. ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
చెన్నేకొత్తపల్లి: అక్రమంగా కర్ణాటకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చెన్నేకొత్తపల్లి సమీపంలో రెవెన్యూ అధికారులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకెళితే... అనంతపురం నుంచి ఓ ఐచర్ వాహనంలో గురువారం కొందరు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం తుముకూరుకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్ఐ నరసింహమూర్తి సిబ్బందితో కలిసి మాటు వేశారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. వాహనంలో బియ్యం కనిపించగా... డ్రైవర్ రాజును ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాన్ని చెన్నేకొత్తపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వాహనంలో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయని డ్రైవర్ను ప్రశ్నించగా...90 క్వింటాళ్ల (180 పాకెట్లు) బియ్యం ఉన్నాయని, బిల్లులు మాత్రం తన వద్ద లేవని చెప్పాడు. దీంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. దాడుల్లో వీఆర్ఓ నారాయణస్వామి, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
అనంతపురం సిటీ: నగర శివారులోని శ్రీమాస్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కనిపించకుండా పోయాడు. విషయాన్ని కళాశాల యాజమాన్యం దాచిపెట్టి ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన జి.గంగాధర్ కుమారుడు దిలీప్.. శ్రీమాస్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరాడు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దిలీప్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి కుటుంబ సభ్యులకు తెలపకుండా, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాత్రి 10.30 గంటల తరువాత తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని బిడ్డ గురించి ఆరా తీయగా కళాశాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ.. కళాశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ను కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఆర్ఐఓ హామీతో వారు ఆందోళన విరమించారు. తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన యాజమాన్యం గుర్తింపు రద్దు చేయాలంటూ ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా -
సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
తనకల్లు: మండలంలోని చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీ ప్రాజెక్టు) నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా సీజీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. రెండేళ్ల తరువాత సీజీ ప్రాజెక్టు నిండడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి (170 ఎంసీఎఫ్టీ) చేరుకోవడంతో గురువారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జలహారతి చేసి, ఓ గేటు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎడ్ల బండి అదుపు తప్పి రైతు మృతి పరిగి: ఎడ్ల బండి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు పరిగి మండలం గొరవనహళ్లికి చెందిన లింగణ్ణ గారి నారాయణప్ప(69)కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగించే నారాయణప్ప బుధవారం గడ్డి కోసుకుని ఎడ్ల బండిపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు. మలుపు వద్ద గట్టుపైకి బండి చక్రం ఎక్కడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో బండి కింద పడి నారాయణప్ప ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుమారుడు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. గాలిమరపై పిడుగు కూడేరు: గాలిమరపై పిడుగు పడి మంటలు చెలరేగిన ఘటన మండల పరిధిలోని కలగళ్ల గ్రామంలో జరిగింది. కలగళ్లలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన జోరు వర్షం కురిసింది. గ్రామ సమీపాన గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేసిన గాలిమరపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగి గాలిమర కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గాలిమర కాలిపోవడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు కంపెనీకి చెందిన ప్రతినిధులు తెలిపారు. -
పిల్లల ప్రవర్తన గమనించాలి
పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు. పాఠశాలకు వెళ్తున్నారా? లేదా? అనే విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. సెల్ఫోన్లో వారు ఏమి చూస్తున్నారు? ఎవరికి మెసేజ్లు పంపుతున్నారనే దానిపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. ప్రధానంగా యుక్త వయసు అమ్మాయిలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉంటే వారికి చెడు ఆలోచనలు రావు. – ప్రమీల, ఐసీడీఎస్ పీడీ పరిచయం లేని వారితో చాటింగ్ వద్దు అవసరం మేరకే పిల్లలు సెల్ఫోన్ వాడేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. వాటిని ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉంటూ గమనిస్తుండాలి. పరిచయం లేని వారితో చాటింగ్ చేయడం మంచిది కాదు. ప్రేమ మాయలో పడితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, చైతన్య పరుస్తున్నాం. – ఎస్.సతీష్కుమార్, ఎస్పీ -
అదృశ్యం.. ఆందోళనకరం
కదిరి: జిల్లాలో బాలికలు, యువతుల అదృశ్యాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చదువు, ఒత్తిడి ఇతర విషయాలు ఓ కారణమైతే, అత్యధికులు ప్రేమ మోజులో పడి ఇంటి నుంచి కానీ, పాఠశాల నుంచి కాని ప్రియుడితో కలసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. పరిణతి చెందని వయసులో ఆకర్షణకు లోను కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏడాదిగా ఈ తరహా అదృశ్యం కేసులు కలవరపెడుతున్నాయి. ‘హాయ్’..తో మొదలు.. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి రాత్రి నిద్ర పోయే వరకూ ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఇన్స్ట్రాగాంలో రీల్స్ షేర్ చేయడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే వెనుకాముందు ఆలోచించకుండా ఆమోదించేస్తున్నారు. అటు వైపు నుంచి హాయ్.. అని మెసేజ్ రాగానే హలో అంటూ మొదలు పెట్టేస్తున్నారు. చివరకు ఈ హాయ్.. హలోలే ప్రేమ సందేశాలుగా మారిపోతున్నాయి. ఈ మాయలో చిక్కుకున్న ఎంతోమంది బాలికలు కన్నవాళ్లను ఏమార్చి పారిపోతున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకునే లోపే జీవితం చేయిదాటిపోతోంది. పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ కనిపించకుండా పోయిన బాలికల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫొటోలు పంపి చిక్కుల్లో.. కొందరు బాలికలు సోషల్ మీడియాలో పెరిగిన పరిచయంతో అదే లోకంగా ఊహల్లో తేలిపోతున్నారు. కన్నవారి కన్నా సోషల్ మీడియాలో పరిచయమైన వారే గొప్పగా భావిస్తున్నారు. అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మి వారు అడిగినప్పుడల్లా తమ పర్సనల్ ఫొటోలు, వీడియోలు పంపి చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొందరు యువతులు శారీరక సంబంధం వరకూ అవకాశం ఇచ్చి చివరకు మోసపోయామని తెలుసుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. జిల్లా వ్యాపంగా ఈ ఏడాది 287 రోజుల్లో 139 మంది బాలికలు కనిపించకుండాపోయారు. పరువు కోసం పోలీసుల దృష్టికి రాని కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రతి రెండు రోజులకు ఓ మైనర్ బాలిక అదృశ్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో 97 శాతం కేసులు ప్రేమ వ్యవహారాలేనని పోలీసుల విచారణలో బయట పడుతున్నాయి. ● మూడు రోజుల క్రితం నల్లచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు పాఠశాల వదిలిన తర్వాత ముగ్గురు అబ్బాయిలతో కలిసి ద్విచక్ర వాహనాల్లో వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తర్వాత వారు అనంతపురంలో ఉన్నారని తెలుసుకుని వెంటనే తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కదిరి అడపాలవీధికి చెందిన ఓ మైనర్ బాలిక ఓ వస్త్ర దుకాణంలో పని చేసేది. ఈ నెల 11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో అదృశ్యమైంది. అన్ని చోట్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 16న ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ● ఈ నెల 15న మడకశిరకు చెందిన ఒక మైనర్ బాలిక తన మేనత్త ఇంటికి వెళ్లి అక్కడి నుంచి అదృశ్యమైంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ● కదిరి రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన మైనర్ బాలిక ఈ నెల 15న కనిపించకుండా పోయింది. తన కుమార్తె కన్పించడం లేదంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ● కదిరి పట్టణంలోని వలీసాబ్రోడ్డుకు చెందిన ఓ మైనర్ బాలిక సైతం కనిపించడం లేదు. తాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంవలీ కాలనీకి చెందిన ఓ యువకుడు తన మనవరాలితో చనువుగా ఉండేవాడని, అదృశ్యం వెనుక ఆ యువకుడి హస్తం ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు, మహిళల అదృశ్యాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలోనే 139 మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇక పరువు కోసం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉన్న కేసులు అదే స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పెరిగిపోతున్న బాలికల అదృశ్యం కేసులు ప్రతి రెండు రోజులకు ఓ కేసు నమోదు ఆకర్షణకు లోనై మాయమవుతున్న మైనర్ బాలికలు మచ్చుకు కొన్ని.. -
శుద్ధజలం.. అబద్ధం
పుట్టపర్తి టౌన్: ప్రజల అవసరాలే వారికి ఆదాయ వనరులుగా మారుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే నీరు ఆయోదయోగ్యంగా లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో శుద్ధ జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదనుగా అనధికారిక పాంట్లు ఏర్పాటు చేసుకున్న కొందరు శుద్ధ జలాల ముసుగులో బోరుబావి నీళ్లను సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పల్లె.. పట్నం తేడా లేకుండా ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా కొనసాగుతోంది. నిబంధనలకు పాతర.. జిల్లాలోని పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి, మడకశిర పట్టణాల్లో సుమారు 200లకు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో 70 శాతానికి పైగా వాటర్ ప్లాంట్లకు అనుమతులు లేవు. పల్లెల్లో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో వెలుస్తున్న ప్రైవేటు వాటర్ ప్లాంట్ల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటున్నట్లు సమాచారం. అధికారంగా ఆమోదం పొందిన ప్లాంట్ల నిర్వాహకులు సైతం నాణ్యత పాటించకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యూరిఫైడ్ పేరుతో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో జనం జబ్బు బారిన పడుతున్నారు. ఈ అంశంపై జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి రామచంద్ర మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను మూసి వేస్తామని పేర్కొన్నారు. తనిఖీలు చేపట్టి బోరు నీటిని సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. అనారోగ్యాలతో ప్రజలకు తప్పని తిప్పలు ఎలాంటి అనుమతులు లేకుండా పాంట్ల నిర్వహణ పట్టించుకోని అధికారులు -
●జోడెద్దుల జోరు
● 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తిన ఎద్దులు బొమ్మనహాళ్: జోడెద్దులు జోరుగా కదిలాయి. 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తి సన్మానం అందుకున్నాయి. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ గ్రామంలో చిన్న బసయ్య అనే రైతు 20 ఎకరాల ఇసుక నేలలో అలసందలు సాగు చేయాలని నిర్ణయించున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామికి విత్తనాలు విత్తే పని అప్పగించాడు. ఎర్రిస్వామి, శివ, ఇస్సప్పతో కలిసి తన ఎద్దులతో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు అలసంద విత్తనాలు విత్తే పనులను ప్రారంభించాడు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా 20 ఎకరాల్లో విత్తనాలు వేశాడు. విత్తనాలు వేయడానికి రేవప్ప, రాముడు, వన్నప్పల సహాయం కూడా తీసుకొన్నారు. సాధారణంగా ఎద్దులతో 20 ఎకరాల్లో విత్తనాలు విత్తాలంటే 20 గంటల వరకు పడుతుందని, ఎర్రిస్వామి ఎద్దులు కేవలం 8 గంటల్లో విత్తడం విశేషమని గ్రామస్తులు తెలిపారు. ఎద్దులకు పూలమాలలు వేసి గ్రామంలో ఊరేగించారు. -
సత్యసాయి కీర్తిని చాటుతాం..
సత్యసాయి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ భక్తులు గర్వించేలా శతజయంతి వేడుకలు నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 200లకుపైగా దేశాల్లోని సత్యసాయి భక్తులు, సత్యసాయి సేవా కేంద్రాలున్నాయి. ఇప్పటికే ప్రశాంతి నిలయంలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 25 లక్షల మందికిపైగా భక్తులు వేడుకల్లో పాల్గొంటారన్న అంచనాతో ఆహారం, తాగునీరు, బస కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, పలువురు ఆధ్యాత్మిక వేత్తలు వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రతి సాయిభక్తుడూ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. – ఆర్జె.రత్నాకర్ రాజు,సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ -
సాయి కీర్తనం.. ఆధ్యాత్మిక సంబరం
ప్రశాంతి నిలయం: సత్యసాయి కీర్తనలతో ప్రశాంతి నిలయం మార్మోగింది. మూడు రోజులుగా జరుగుతున్న గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు గురువారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్ర సాయికుల్వంత్ సభా మందిరంలో శ్రీ సత్యసాయి స్కూల్ సూరత్ విద్యార్థులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సంగత సంగీత విద్వాంసురాలు దీపికా కన్సారి బృందం సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో భక్తులను అలరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాఽధిని దర్శించుకున్నారు. -
జీతాలివ్వండి మహాప్రభో
పుట్టపర్తి అర్బన్: నాలుగు నెలల నుంచి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్లు వాపోయారు. గురువారం ఇన్చార్జ్ పీడీ శ్రీలక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 200 మంది టీఏలు ఉన్నారన్నారు. కొంత మందికి నాలుగు నెలలు, మరికొంత మందికి రెండు నెలల జీతాలు చెల్లించకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిందన్నారు. ఇంటి అద్దెలు, ఈఎంఐలు, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. మానసిక క్షోభతో పలువురు అనారోగ్యం పాలయ్యారన్నారు. జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
నా బిడ్డను ఇవ్వకపోతే చచ్చిపోతా!
● సర్వజనాస్పత్రిలో దివ్యాంగ బాలింత ఆవేదనఅనంతపురం మెడికల్: ఏందమ్మా నా బిడ్డను నా చేతికెందుకివ్వరూ. రెండ్రోజులవుతోంది నా బిడ్డను నాకిచ్చేయండి. లేకపోతే చచ్చిపోతా’ అంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్నర్సులను ఓ బాలింత వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ 30 ఏళ్ల గర్భిణి (ఓ కాలు లేదు) ఈ నెల 10న ఆస్పత్రికి వచ్చింది. రక్తహీనత, తదితర సమస్యలతో బాధపడుతుంటే లేబర్ వార్డులో అడ్మిషన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు కామెర్లులా ఉండడంతో ఆస్పత్రిలోని నవజాతా శిశు కేంద్రంలో అడ్మిట్ చేశారు. ఫొటోథెరపీ కింద బిడ్డను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. బిడ్డకు తల్లిపాలు ఇబ్బంది లేకుండా మదర్మిల్క్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు. ఆస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో అడ్మిషన్లో ఉన్న బాలింతకు తన బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా ఎస్ఎన్సీయూ వద్దకెళ్లి సిబ్బందిని ప్రాధేయపడుతోంది. బిడ్డకు బాగలేదని మళ్లీ ఇస్తామని చెబుతున్న సిబ్బందితో గొడవ పడి తిరిగి వార్డుకు చేరుకుంటోంది. ఇదే అంశంపై గైనిక్ హెచ్ఓడీ షంషాద్ బేగం మాట్లాడుతూ.. బాలింత సంబంధీకులు ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. తన పేరు మాత్రం మంజుల అని, ఎవరూ లేరని సమాధానం చెబుతోందన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా శిశువును అప్పగిస్తే ఆ పసికందును ఏం చేస్తుందోనని సిబ్బంది భయపడుతున్నారని, సంబంధీకులు ఎవరైనా వచ్చి బాలింతకు మేలుగా ఉంటుందని పేర్కొన్నారు. -
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
ప్రశాంతి నిలయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతున్న నేపథ్యంలో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి నష్టాన్ని నివారించాలన్నారు. ప్రజలు కూడా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్లు, భారీ హోర్డింగ్ల కింద, పాడైపోయిన పాత భవనాలు, పాడుబడిన పాఠశాలల్లో ఉండరాదన్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వాగులు, వంకలు పొంగి పొర్లితే ఇరిగేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లు, కల్వర్టులు, చెరువులు తెగిపోయే అవకాశం ఉంటే... ఆయా శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లకుండా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల ప్రభావం తగ్గే వరకూ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి వారి ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని డీఆర్ఓను ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే తగు చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలు 08555289039 నంబర్కు ఫోన్ చేసి సాయం పొందవచ్చన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి అత్యవసర సాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు అధికారులతో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ -
ఆశల వల.. నమ్మితే విలవిల
సాక్షి, పుట్టపర్తి ఖద్దరు వేస్తారు...ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కలెక్టరేట్లో హడావుడిగా తిరుగుతూ కనిపించిన అధికారినంతా పలకరిస్తూ ఉంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని, తమ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా వడ్డీ ఇస్తామంటూ వృద్ధులు, నిరుద్యోగులు, యువతపై వల విసురుతారు. అందినకాడికి దోచుకుని పత్తాలేకుండా పోతారు. జిల్లాలో ఈ తరహా మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి. పేర్లు మార్చి.. వేషం ధరించి ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ.. అక్కడి ప్రజలకు ఏం అవసరమో గ్రహించి.. వెంటనే కొత్త అవతారం ఎత్తుతారు. ఉన్నఫలంగా కొత్త శైలిలో పరిచయం అవుతూ.. కొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఇల్లు తీసుకుంటారు. టీ స్టాల్, హోటల్స్ దగ్గర ప్రజలతో మమేకం అవుతారు. ‘‘తాను ఫలానా’’ అని నమ్మబలికి అవసరమైతే అవతలి వారికి అప్పుగా కొంత మొత్తం కూడా ఇస్తారు. ఒకరి ద్వారా మరికొందరిని పరిచయం చేసుకుంటారు. నెల రోజుల పాటు అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా.. మరొకరితో డబ్బులు తీసుకుని ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేసుకుని పరారీ అవుతున్నారు. ఆ తర్వాత మారుపేర్లతో వేషం మార్చి మరో ప్రాంతానికి మకాం మారుస్తారు. ‘ఆశ’ల వలకు చిక్కి కొందరు తానో పెద్ద కంపెనీకి యజమానినని, లేదా ఆ కంపెనీ యజమానితో తనకు బాగా పరిచయం ఉందని బిల్డప్ ఇస్తారు. నేరుగా నిరుద్యోగి ఇంటికే వెళ్లి ఉద్యోగం ఇప్పిస్తామంటూ వల విసురుతారు. దీంతో చాలా మంది ఇంటికి వచ్చిన వాడికి అంతో ఇంతో ఇస్తే సరిపోతుందని టక్కున డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇదే సరైన సమయం అంటూ నమ్మిస్తే పడిపోతున్నారు. స్టాక్ మార్కెట్.. సరుకు నిల్వ అనగానే.. ఎక్కడికి పోతాడులే.. రూం కూడా అద్దెకు తీసుకున్నాడని నమ్మి మోసపోతున్నారు. అధిక వడ్డీ అనగానే.. ఆశపడి రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. మాటలు నేర్చిన మాంత్రికులు ఇలాంటి కేటగిరీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని నిత్యం మోసాలకు పాల్పడుతున్నారు. తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాతే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నా రికవరీ సాధ్యం కావడం లేదు. అందుకే ఇలా మాయమాటలు చెప్పే కేటుగాళ్లు బారిన పడవద్దని, ఎవరైనా ఏదైనా చెబితే ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బులు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అమాయకులను టార్గెట్ చేసిన ఫేక్ కాలర్లు ఉద్యోగాలు, అధిక వడ్డీ, పథకాల మంజూరు పేరుతో భారీగా దోపిడీ రూ.కోట్లలో వసూలు చేసుకుని పరారీ రోజుకో చోట వెలుగులోకి వరుస ఘటనలు -
రాత్రి వేళల్లో అత్యవసర సేవలు బంద్
పెనుకొండ రూరల్: పీహెచ్సీల వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో రాత్రి వేళ అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. 44వ జాతీయ రహదారి పక్కనే పెనుకొండ పీహెచ్సీ కేంద్రం ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ అత్యవసర వైద్యం అందక పోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకుండా పోయారు. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు సమ్మెలోకి వెళ్లగా... పీహెచ్సీ ఇన్చార్జ్గా అధికారులు అనే మరో వైద్యుడిని నియమించారు. ఆయన పగటి వేళ అనంతపురం నుంచి వచ్చివెళ్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో అత్యవసర సేవలకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే నర్సు, వాచ్మెన్ వైద్యుల అవతారం ఎత్తాల్సిన దుస్థితి నెలకొంది. లేదంటే 8 కిలో మీటర్లు ప్రయాణించి పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాల్సి వస్తుంది. ఇక చాలా పీహెచ్సీల్లో నర్సులే వైద్యసేవలందిస్తున్నారు. చాలా కేసులను హిందూపురం, అనంతపురం రెఫర్ చేస్తున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఓపీ భారీగా పెరిగిపోయింది. -
ప్రశాంతి నిలయంలో గుజరాత్ వైభవం
ప్రశాంతి నిలయం: గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతి నిలయంలో వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నవ్సారికి చెందిన శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్కు విద్యార్థులు తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే డాంగీ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. చక్కటి నృత్య భంగిమలతో భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం గుజరాత్ బాలవికాస్ చిన్నారులు ‘దీపావళి ఏ టేల్ ఆఫ్ రామాస్ ల్యాంప్ కీపర్’ పేరుతో నాటికను ప్రదర్శించారు. అలనాటి రాముడు, నేటి సత్యసాయి భక్తుల పట్ల చూపిన వాత్సల్యాన్ని, భక్తులకు తోడు, నీడగా ఉన్న వైనాన్ని చక్కగా ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. -
ఘనంగా బాబా అవతార ప్రకటన దినోత్సవం
ఉరవకొండ: సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సోమవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. అవతార ప్రకటన చేసిన రాతి గుండు వద్ద నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి చిత్రపటాన్ని వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి బత్తలపల్లి: స్థానిక టోల్ ప్లాజా సమీపంలో గత నెల 10న రాత్రి ద్విచక్రవాహనం ఢీ కొనడంతో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన నడిపోగుల ఓబన్న(60) గత నెల 10న అనంతపురంలో జరిగిన సీఎం సభకు బస్సులో వచ్చాడు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పొరపాటున కదిరి వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. మాటలు రాకపోవడం, కొత్త వ్యక్తి కావడంతో టోల్ప్లాజా వద్ద బస్సులో నుంచి దింపేశారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో అనంతపురం వైపుగా వెళుతున్న ఆయనను ద్విచక్రవాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. చికిత్సకు స్పందించక సోమవారం మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాటు తుపాకీ స్వాధీనం పుట్టపర్తి: మండలంలోని గూనిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం నాటుతుపాకీతో సంచరిస్తున్న కొత్తకోట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కొత్త వెలుగులు చూడడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. అటవీ ప్రాంతంలో మరిన్ని ఆయుధాలు ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. కాగా, నాటు తుపాకీ విషయం వెలుగు చూడడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ తాడిమర్రి: మండలంలోని దాడితోట గ్రామంలో పేకాట ఆడుతూ పలువురు పట్టుబడ్డారు. అందిన సమాచారం మేరకు ఎస్ఐ కృష్ణవేణి నేతృత్వంలో గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఓ పాడుబడిన ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, రూ.47,755 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
డీఏ జీఓను తక్షణం సవరించాలి : యూటీఎఫ్
ధర్మవరం అర్బన్: డీఏ జారీపై ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ జీఓను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబర్ 60 ఉద్యోగులకు, జీఓ నెంబర్ 61 పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అధికారులతో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని అంశాలను ఈ జీఓలలో ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డీఏ అరియర్స్ను ఉద్యోగ విరమణ అనంతరం చెల్లిస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల అరియర్స్కు సంబంధించి జీఓలలో ఎక్కడ ప్రస్తావన లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027–28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పడం సరికాదన్నారు. నాలుగు పెండింగ్ డీఏలను ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే విడుదల చేసి చెల్లింపులో కొర్రీలు వేయడం సరికాదన్నారు. తక్షణమే జీఓ 60, 61ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ ధర్మవరం పట్టణ శాఖ అధ్యక్షుడు జింకా హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి సాయిగణేష్, నాయకులు లక్ష్మయ్య, హెచ్ రామాంజనేయులు, నాగిరెడ్డి, ఆంజనేయులు, అమర్నారాయణరెడ్డి, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, వెంకటకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఆరుగురిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8.70 లక్షలు విలువ చేసే 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మడకశిర అప్గ్రేడ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్రహ్మణ్యంతో కలసి నిందితుల వివరాలను పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప వెల్లడించారు. రొద్దం మండలం రొప్పాల గ్రామానికి చెందిన సోమశేఖర్, అతని స్నేహితుడు ముద్దరంగయ్య ద్విచక్రవాహనాలు జిల్లేడుగుంట వద్ద 2024లో దుండగులు అపహరించారు. అలాగే అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన రాజేష్రెడ్డి ద్విచక్రవాహనాన్ని 15 రోజుల క్రితం మడకశిరలో ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం కల్లుమర్రి క్రాస్ వద్ద రెండు ద్విచక్రవాహనాలను విక్రయిస్తుండగా రొద్దం మండలం రొద్దకంపల్లి గ్రామానికి చెందిన సురేష్, నరేష్ను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామాలకు చెందిన సంజయ్కుమార్, మల్లేష్, డి.అచ్చంపల్లి గ్రామానికి చెందిన అనిల్, వడ్డే కుమార్తో కలసి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో కర్ణాటకలోని మధుగిరి ప్రాంతంలోనూ ద్విచక్రవాహనాలను అపహరించిన కేసులో రిమాండ్కు వెళ్లినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించి, విక్రయానికి తెచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాఉ. అనంతరం సంజయ్కుమార్ తన పొలంలో దాచిపెట్టిన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను బెంగళూరులోని కోరమంగలలో అపహరించినట్లుగా అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. రూ. 8.70 లక్షల విలువ చేసే 18 ద్విచక్రవాహనాలు స్వాధీనం -
వీడిన హత్య కేసు మిస్టరీ
హిందూపురం: మండలంలోని సంతేబిదనూర్ పంచాయతీ తుంగేపల్లి వద్ద ఈ నెల 13న చోటు చేసుకున్న హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం డబ్బు కోసమే యువకుడిని హత్య చేసి, ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చివేసేందుకు ప్రయత్నించిన నలుగురుని అరెస్ట్ చేశారు. హిందూపురం రూరల్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ ఆంజనేయులుతో కలసి డీఎస్పీ మహేష్ వెల్లడించారు. ఈ నెల 13న గౌరీబిదనూరు తాలూకా కర్ణాటక హనుమంతనగర్కు చెందిన పవన్కుమార్ (29) సంతేబిదనూర్ వద్ద అతిగా మద్యం తాగి తూలుతూ మోటార్ సైకిల్ పక్కన కూర్చొని ఉన్నాడు. గమనించిన సంతేబిదనూర్ పంచాయతీకు చెందిన ఇద్దరు మైనర్ బాలురు.. అతనితో మాట్లాడుతూ కల్లు తాగుతామని నమ్మించి దూరంగా పిలుచుకెళ్లి డబ్బులు, వెండి చైను లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్కుమార్ తిరగబడ్డాడు. దీంతో మైనర్లు తమ వద్ద ఉన్న ఫోల్డింగ్ ఐరన్ రాడ్తో పవన్కుమార్ తలపై కొట్టారు. తర్వాత అక్కడే పడి ఉన్న ఖాళీ బీరు బాటిల్ పగులకొట్టి డొక్కలో, మెడపై, శరీరంపై ఇష్టానుసారంగా పొడిచి హతమార్చారు. అనంతరం హతుడి మెడలోని వెండి చైనుతో పాటు రూ.2,500 నగదు, అతని పల్సర్ బైకు తీసుకుని ఉడాయించారు. ఆ తర్వాత స్నేహితులైన హనుమేపల్లి ఆంజనేయులు, సంతేబిదనూరు ఆకర్ష్ (ఇద్దరూ మేజర్లు)ను తోడుగా పిలుచుకెళ్లి హతుడిపై పెట్రోల్ పోసి ప్లాస్టిక్ బాటిల్లు, కట్టె పుల్లలు వేసి నిప్పంటించారు. 14న ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో రూరల్ పీఎస్ సీఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హతుడిని పవన్కుమార్గా ధ్రువీకరించి, పక్కా ఆధారాలతో మంగళవారం అప్పకుంట గేట్ నుంచి హనుమేపల్లి గ్రామానికి వెళ్లే దారిలో హంద్రీ–నీవా కాలువ వద్ద తచ్చాడుతున్న నలుగురునీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో మేజర్లను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. మైనర్లను జువైనల్ హోంకు అప్పగించారు. డబ్బు కోసమే యువకుడి హత్య గుర్తించకుండా కాల్చివేతకు ప్రయత్నం పట్టుబడిన నలుగురిలో ఇద్దరు మైనర్లు -
ధీమా ఇవ్వని చంద్రన్న బీమా
కదిరి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జగన్ సర్కారు అమలు చేసిన ‘వైఎస్సార్ బీమా’ పథకానికి ‘చంద్రన్న బీమా’ అని పేరు మార్చిందే కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఈ పథకం ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు గొప్పగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా నేటికీ పథకాన్ని అమలు చేయక పోవడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. పథకం అమలుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేదు కానీ, టీడీపీ కార్యకర్త మృతి చెందితే మాత్రం రూ.5లక్షలు చెల్లించడం గమనార్హం. ఏదీ ఆర్థిక భరోసా?: బాధిత కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడా నయా పైసా చెల్లించినది లేదు. ఈ 17 నెలల్లో జిల్లాలో సహజ, ప్రమాదవశాత్తు మరణించిన వారు మొత్తం 289 మంది ఉన్నారు. వీరిలో సహజ మరణం చెందిన వారు 180 మంది కాగా, ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారు 109 మంది ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సహజ మరణం చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున రూ.9 కోట్లు, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున రూ.10.9 కోట్లు ఇలా మొత్తం రూ.19.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబాలు కుమిలిపోతుంటే వారికి బీమా పరిహారం చెల్లించకుండా ఆ వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేసింది. భర్తను కోల్పోయిన మహిళకు కనీసం వితంతు పింఛన్ కూడా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో సకాలంలో చెల్లింపులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్విజయంగా అమలు చేశారు. కుటుంబ పెద్ద మరణిస్తే తక్షణ సాయంగా రూ.10వేలు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా అందజేసేవారు. మిగిలిన సొమ్మును నామినీ బ్యాంకు ఖాతాకు నెల రోజులు తిరక్కుండానే జమ చేస్తూ వచ్చారు. వైఎస్సార్ బీమా ద్వారా గత ప్రభుత్వం జిల్లాలో 723 కుటుంబాలకు రూ40.86 కోట్ల లబ్ధి చేకూరింది. ఇందులో కదిరి నియోజకవర్గంలో 118 మందికి రూ.6.52 కోట్లు, ధర్మవరంలో 118 మందికి రూ.6 కోట్లు, పుట్టపర్తిలో 106 మందికి రూ.5.83 కోట్లు, హిందూపురంలో 113 మందికి రూ.6.26 కోట్లు, మడకశిరలో 115 మందికి రూ.6.06 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 55 మందికి రూ.3.16 కోట్లను బాధిత కుటుంబాలకు చెల్లించింది. బీమా ప్రీమియం డబ్బులు సైతం అప్పట్లో జగన్ ప్రభుత్వమే చెల్లించింది. పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు పరిహారం రాదు.. పింఛనూ ఇవ్వరు కూటమి పాలనలో అమలుకు నోచుకోని చంద్రన్న బీమాఈమె పేరు రామలక్ష్మమ్మ. తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లి గ్రామం. ఈమె ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసులు (35) ఈ ఏడాది సెప్టెంబర్ 29న చీకటిమానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో చంద్రన్న బీమా లబ్ధి కోసం ఆమె తహసీల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయం చుట్టూ తిరగని రోజంటూ లేదు. ఆ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదనే సమాధానమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి బాధిత కుటుంబాలు జిల్లాలో వందల్లో ఉన్నాయి. ఏ ఒక్కరిపై చంద్రన్న సర్కారు కనికరించలేదు. -
వ్యక్తి బలవన్మరణం
నల్లమాడ: మండలంలోని ఎన్.ఎనుమలవారిపల్లికి చెందిన చిల్లా చిన్నగంగప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. తన అల్లుడు భాస్కర్ ప్రమాదవశాత్తు మృతిచెందడంతో కుమార్తె విధవరాలిగా మారడాన్ని తట్టుకోలేక సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కదిరి, అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి 7 గంటలకు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్య పుట్టపర్తి టౌన్: కుటుంబ కలహాలతో పుట్టపర్తిలోని సాయినగర్లో నివాసముంటున్న రాము (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనులతో పిల్లలను పోషించుకుంటున్నారు. తాగుడుకు బానిసైన రాము.. తరచూ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తి సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద మామిడి చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బుక్కపట్నం ఎస్ఐ కృష్ణమూర్తి అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చెరువులో మృతదేహం హిందూపురం: స్థానిక సూరప్పకుంట చెరువులో సోమవారం ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. విచారణలో రహమత్పుర ప్రాంతానికి చెందిన జబీవుల్లా (34)గా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, జబీవుల్లా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. జూదరుల అరెస్ట్ లేపాక్షి: ‘అధికారం మనదే.. ఆడుకోండి’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన పోలీసులు హిందూపురం, లేపాక్షి పరిసరాల్లో దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. లేపాక్షి మండలం బయన్నపల్లి శివారున పేకాట స్థావరంలో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకొని, రూ.34,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ సీఐ జనార్దన్ తెలిపారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
ఓడీచెరువు: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో బైక్పై వెళుతున్న వృద్ధురాలు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఓడీచెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన దాదిరెడ్డి సాలమ్మ (80) సోమవారం తన అల్లుడు శ్రీనివాసరెడ్డితో కలసి ఓడీ చెరువు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. జరికుంటపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో శ్రీనివాసరెడ్డి, సాలమ్మ రోడ్డుపై పడ్డారు. దీంత్ర గాయపడినన సాలమ్మను అంబులెన్స్లో కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మనవడు భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు గణేష్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో దొంగల ముఠా? ఎన్పీకుంట: మండల కేంద్రంలోని సోలార్ పవర్ప్లాంట్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా సభ్యులను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ఎన్పీకుంట మండలానికి చెందిన 8 మందిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. హత్య కేసులో ఐదుగురి అరెస్ట్ కొత్తచెరువు: స్థానిక పీఎస్ పరిధిలో భూవివాదం కారణంగా చోటు చేసుకున్న హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ బి.విజయ్కుమార్ తెలిపారు. వివరాలను మంగళవారం వెల్లడించారు. కొత్తచెరువు మండలం మునిమడుగు గ్రామానికి చెందిన నీరుగంటి ఆంజనేయులు(55) వెంకటేష్, మనోహర్ కుటుంబాల మధ్య మునిమడుగు గ్రామంలోని 31.2 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆధిపత్యం, దివ్యాంగ పింఛన్ మంజూరు విషయంలో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో భూమి విషయంగా ఆంజనేయులు చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకున్న వెంకటేష్, మనోహర్ ఎలాగైనా ఆయనను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన తలారి చిరంజీవి, తలారి పోతులయ్య, బొగ్గు మహేంద్రను ప్రలోభాలకు గురి చేసి ఆంజనేయులుక హత్యకు పథకం రచించారు. ఈ ఏడాది మే 20న సాయంత్రం ఆంజనేయులు కొత్తచెరువు నుంచి మునిమడుగు గ్రామానికి వెళుతుండగా మరకుంటపల్లి గ్రామం వద్ద వాహనాన్ని అడ్డుకుని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 19న కొత్తచెరువు మార్కెట్ యార్డు వద్ద తచ్చాడుతున్న దాసరి వెంకటనారాయణ, కృష్ణక్క గారి వంశి, తలారి చిరంజీవి, తలారి పోతులయ్య, బొగ్గు మహేంద్రను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.అసంబద్ధ జీఓలను సవరించాలి : ఎస్టీయూ ఎన్పీకుంట: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్ధికశాఖ జారీ చేసిన 60, 61 జీఓలు ఆసంబద్ధంగా ఉన్నాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించేలా జీఓలను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. స్ధానిక జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబరు వరకు 21 నెలల డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ సందర్బంగా చెల్లిస్తామనడాన్ని ఖండించారు. బకాయిలను ఉద్యోగ విరమణ, మరణించిన తరువాత ఇస్తామని జీఓలు విడుదల చేయడం దారుణమన్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ దాటవేత ధోరణి ప్రదర్శించడం మంచిదికాదని హితువు పలికారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెల్లెలిపై అన్న అత్యాచారం ● వరుస మరిచి గర్భవతిని చేసిన వైనం ● కాన్పు అయ్యే వరకూ నిజాన్ని దాచిన బాలిక ధర్మవరం అర్బన్: చెల్లెలిని ఇతరుల నుంచి రక్షించాల్సిన అన్నే ఆమె జీవితాన్ని చిదిమేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలో నివాసముంటున్న 17 ఏళ్ల బాలికపై ఆమె పెద్దమ్మ కుమారుడు కన్నేశాడు. పిన్ని ఇంట్లో లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక... విషయం చెబితే కొడతారని భయపడి ఎవరితోనూ చెప్పుకోలేదు. శరీరంలో మార్పులు వచ్చినా... ఏదో కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది. చివరకు ఈ నెల 18న కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పిలుచుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక నిండు గర్భిణి అని నిర్ధారించారు. అనంతరం రక్తస్రావం అవుతుండటంతో కాన్పు చేసి మృత మగ శిశువును వెలికి తీశారు. విషయం తెలిసి కన్నీరుమున్నీరైన బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా.. పెద్దమ్మ కుమారుడే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో అశువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఎమ్మెల్యే సింధూరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి ముఖ్య అతిథులు అమర వీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ పాత్ర చాలా కీలకమన్నారు. పోలీసులు లేని సమాజం ఊహించలేమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించే క్రమంలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరలైన పోలీసులందరికీ ఈ రోజు నివాళుర్పిస్తున్నామన్నారు. పోలీస్ కటుంబాలకు అండగా ఉంటాం దేశ వ్యాప్తంగా 258 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అందులో మన జిల్లాలో కూడా ఇద్దరు పోలీసులు ఉన్నారన్నారు. అమరవీరుల కుటుంబాల స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటామని తెలిపారు. పది రోజులపాటు అమరులైన పోలీసులను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఏఓ సుజాత, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు నరశింగప్ప, విజయకుమార్, హేమంత్కుమార్, ఆదినారాయణ, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు వలి, మహేష్, రవికుమార్, రాష్ట్ర పోలీస్ సంఘం సభ్యులు సూర్యకుమార్, సీఐలు శ్రీనివాసులు, శివాంజనేయులు, సురేష్, ఆర్ఎస్ఐలు వీరన్న, వెంకటేశ్వర్లు, ప్రదీప్సింగ్, ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులను బత్తలపల్లి: వివిధ అంశాలపైన, నేరాలపైన ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఎస్.సతీష్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బత్తలపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో వివిధ గదులను, లాకప్లను, సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల గదులు, కంప్యూటర్ గది తదితర వాటిని పరిశీలించారు. ప్రజలతో ఫిర్యాదులు స్వీకరణ, కౌన్సెలింగ్ గదిని పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై వివిధ అంశాలపైన వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మహిళల అదృశ్యం కేసుల్లోనూ, ప్రేమ పేరుతో వెళ్లిపోతున్న వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉగ్రవాదులు సమాచారం మేరకు విచారణ జరుగుతోందన్నారు. రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్, ట్రైనీ ఎస్ఐ ప్రసన్న, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ -
సత్యసాయి నామం.. దివ్య చరితం
ప్రశాంతినిలయంలో దీపావళి వేడుకలు ప్రారంభిస్తున్న రత్నాకర్ రాజు, టపాసులు పేలుస్తున్న విద్యార్థులు‘మానవ్ టు మాధవ్’ నృత్య రూపకంలోని ఓ ఘట్టంప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా అవతార ప్రకటన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు యజుర్ మందిరం నుంచి నాదస్వరంతో వేదమంత్రోచ్ఛారణలతో ర్యాలీగా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సంగీత విభావరి నిర్వహించారు. ‘సాక్షాత్ పరబ్రహ్మసాయి’ పేరుతో సత్యసాయి పూర్వ విద్యార్థులు బృందం చర్చలు నిర్వహించారు. సత్యసాయి తత్వాన్ని చక్కగా వివరించారు. సాయంత్రం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ‘శతనాద నీరాజనం’ పేరుతో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించారు. 100 మంది సంగీత విద్వాంసులు, 75 మంది సంగీత వాయిద్యకారులు, 25 మంది సంగీతకారులతో కలిసి సంగీత విభావరి సాగింది. భారతీయ, పాశ్యాత్య సంగీత రీతులలో వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరపించింది. సందడిగా దీపావళి వేడుకలు ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు సండిగా సాగాయి. సోమవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకరరాజు ప్రమిదలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, ట్రస్ట్ ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. కనుల పండువగా గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ప్రశాంతి నిలయంలో కనులపండువగా జరిగాయి. సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత గుజరాతీ సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే రీతితో బాల వికాస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సూరత్కు చెందిన శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులు ‘మానవ్ టూ మాధవ్’ పేరుతో నాటిక ప్రదర్శించారు. సత్యసాయి మానవునిగా అవతరించి కోట్లాది భక్తుల హృదయాల్లో మాధవునిగా కీర్తింపబడతున్న తీరును చక్కగా వివరించారు. ఘనంగా సత్యసాయిబాబా అవతార ప్రకటన దినోత్సవం -
నేటి నుంచి భారీ వర్షాలు
● అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ప్రశాంతి నిలయం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి రెండు రోజుల పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గాలి వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 55 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 08555 289039 నంబర్కు కాల్ చేస్తే వెంటనే స్పందించి అధికారులు తగిన సహాయం అందిస్తారని తెలిపారు. మండల కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాలలో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 467.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు ఈ నెల 24 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రైలు ఈ నెల 24న నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రతి శుక్రవారం (6 సర్వీసులు) షోలాపూర్ జంక్షన్ (01477)లో బయలుదేరుతుంది. 25వ తేదీ శనివారం నుంచి నవంబర్ 29 వరకు (6 సర్వీసులు) అనకాపల్లి జంక్షన్ (01478) నుంచి మరొకటి రాకపోకలు సాగిస్తుంది. ఈ రైళ్లు అకల్కోట్, గంగాపూర్, కలబురిగి, వాడీ, యాదగిరి, కృష్ణా, రాయాచూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అన్నవరం, యలమంచిలి రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్తోపాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయన్నారు. రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలి అనంతపురం అర్బన్: అనంతపురం కేంద్రంగా నవంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. క్రీడల నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. ఆయా శాఖల ఉమ్మడి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రొటోకాల్పై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు రాయలసీమ వంటకాల రుచి చూపాలన్నారు. క్రీడలు విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, మహేష్, వీవీఎస్శర్మ, సువర్ణ, ఆనంద్కుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్రావు, సోమశేఖర్, పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి పాల్గొన్నారు. -
జూదరులపై ఉక్కుపాదం
● మొదటిసారి పట్టుబడితే రూ.లక్షకు బైండోవర్ ● మరోసారి పట్టుబడితే రూ.10లక్షలు చెల్లించాల్సిందే హిందూపురం: జూదరులపై ఉక్కుపాదం మోపుతా మని డీఎస్పీ మహేష్ హెచ్చరించారు. హిందూపురం పోలీసు సబ్డివిజన్ పరిధిలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పలు చోట్ల దాడులు నిర్వహించామని చెప్పారు. హిందూపురం మండలం చౌలూరు, కారుడుపల్లిలో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ.10 లక్షలకు తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. జూదం ఆడేవారిని వదిలి పెట్టబోమన్నారు. కేసులు నమోదు చేస్తే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. తొలిసారి జూదమాడుతూ దొరికితే రూ.లక్షకు బైండోవర్ చేస్తామన్నారు. బైండోవర్ అయిన వారు మళ్లీ జూదంలో దొరికితే రూ.10 లక్షలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డబ్బు కట్టని పక్షంలో జైలుకు వెళతారని చెప్పారు. పేకాట, మట్కా వంటి జూదం ఆడేవారిపై ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధికి కృషి ప్రశాంతి నిలయం: అధికారులు, ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ను మంగళవారం కలెక్టరేట్లో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అంశాలపై జేసీ చర్చించారు. -
చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు
రామగిరి/ ముదిగుబ్బ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. దీపావళి పండుగ రోజున జరిగిన ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో చీకట్లు నింపాయి. వివరాలిలా ఉన్నాయి. కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన కురుబ పెండ్లి జీవి చంద్రశేఖర్ (56), దివిటీ రామలింగయ్య (53) నరక చతుర్దశి సందర్భంగా సోమవారం ఉదయం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో గల దేవస్థానానికి టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్పై వెళ్లారు. అక్కడ స్వామిని దర్శించుకుని రాత్రి ఏడు గంటల సమయంలో స్వగ్రామానికి బయల్దేరారు. పేరూరు సమీపంలోని కురుగుండ్ల కాలనీ వద్ద వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఎగిరి కిందపడిన చంద్రశేఖర్, రామలింగయ్య మీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రశేఖర్కు ఇద్దరు కుమారులు, రామలింగయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తారనుకున్న వారు విగతజీవులై రావడంతో గ్రామంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. పేరూరు సమీపంలోని పెన్నా నది నుంచి రోజూ ఇసుక లోడ్తో ట్రాక్టర్లు వేగంగా వస్తుండటంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. జేసీబీని ఢీకొని.. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషయ్య (55), కృష్ణ (53)తో పాటు మోహన్ అనే వ్యక్తి సోమవారం పని నిమిత్తం ముదిగుబ్బ మండల కేంద్రానికి వచ్చారు. పని ముగించుకుని రాత్రి ముగ్గురూ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలోని గుంజేపల్లి చెరువు కట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీని లైట్ల వెలుతురులో గుర్తించక ముందుకెళ్లారు. దీంతో జేసీబీ బకెట్ను ఢీకొని శేషు, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మోహన్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సీఐ శివరాముడు ప్రమాద స్థలిని పరిశీలించారు.మృతి చెందిన శేషయ్య, కృష్ణ (ఫైల్) వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం -
సేవ పేరుతో దోపిడీ
భక్తుల సెంటిమెంట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొందరు స్వార్థపరులు. సేవ పేరుతో చందాలు వసూలు చేస్తూ అక్రమార్జనకు తెరలేపారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం వేదికగా చేసుకున్నారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నా... పెత్తనం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో భక్తులకు అసౌకర్యాలు తప్పడం లేదు. ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోనూ భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలం పంపనూరులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర ప్రతిష్టను కొందరు స్వార్థపరులు దిగజారుస్తున్నారు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయంలో పెత్తనమంతా ప్రైవేట్ వ్యక్తులదే కావడం గమనార్హం. ప్రతి వారమూ రూ.లక్షల్లో ఆదాయం ఉన్నా... ఆ ఆదాయం ఏమవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒక్కప్పుడు 3.90 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయం.. ప్రస్తుతం 50 సెంట్లకు మించి లేదు. మిగిలిన ప్రదేశంలో అనధికార గోశాల, అన్నదాన కమిటీ అంటూ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. స్వామికి సేవ చేస్తున్నామనే పేరుతో నెలకు రూ. లక్షల్లో దోపిడీ సాగిస్తున్నారు. పెత్తనమంతా వారిదే.. దశాబ్దాలుగా పంపనూరు ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతోంది. ఇదేమని అడిగితే స్వామి వారికి సేవ చేస్తున్నామని చెబుతున్నారు. దేవదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేకుండా ఆలయంలో గోశాల నిర్వహణ, అన్నదానం అంటూ కమిటీలు ఏర్పాటు చేశారు. గోశాలను ఆదినారాయణ నాయుడు, అన్నదాన కమిటీని సత్య రంగయ్య అనధికారికంగా నిర్వహిస్తున్నారు. గోశాలలో ప్రస్తుతం 60 వరకు ఆవులు ఉన్నాయి. ఆలయానికి వచ్చే భక్తులను గోపూజ పేరుతో ఆకర్షిస్తూ మేత, ఇతర పోషణకు రోజుకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక చందాల రూపంలో అయితే 15 రోజులకు రూ.300, 30 రోజులకు రూ.500, 90 రోజులకు రూ.1,200 అంటూ బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. అయితే ఆవులకు మేత, ఇతర పోషణ ఖర్చులు మొత్తం ఆలయ నిర్వహణ ద్వారానే సమకూరుతుండడం గమనార్హం. ఇక అన్నదాన కమిటీకు సంబంధించి ఆలయంలోనే మూడు ప్రదేశాల్లో టేబుళ్లు వేసుకుని చందాలు వసూలు చేస్తున్నారు. ఇందుకు రసీదు కూడా ఇస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎలాంటి ఆడిట్ ఉండదు. భక్తుల సెంటిమెంట్ను తెలివిగా వ్యాపారంగా మార్చి నిలువు దోపిడీ చేస్తున్నారు. రికార్డులంటూ ఏమీ ఉండవు.. అనధికారికంగా నిర్వహిస్తున్న గోశాల, అన్నదాన కమిటీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండవు. గోశాల, అన్నదాన కమిటీలకు వారానికి రూ.లక్షల్లోనే ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయానికి సంబంధించి జమాఖర్చులపై నిర్వాహకులు కానీ, దేవదాయ శాఖ ఈఓ కాని సరైన వివరాలు వెల్లడించలేకపోతున్నారు. గోశాల, అన్నదాన కమిటీలకు దాతలు, భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు ప్రస్తుతం ఎంత మేర ఉందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ అంశంపై ఇటీవల నిర్వాహకులను పంపనూరు గ్రామస్తులు నిలదీశారు. ఆ సమయంలో వారికి సరైన సమాధానాలు ఇవ్వలేక నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈఓ బాబు సైతం స్పందించకుండా ఎండోమెంట్తో అన్నదాన కమిటీ, గోశాలకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకున్నారు. ఈ మొత్తం గోల్మాల్ వ్యవహారాన్ని ఎండోమెంట్ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడం వెనుక మర్మమేమిటో సుబ్రహ్మణ్యేశ్వరుడికే తెలియాలని భక్తులు అంటున్నారు. అక్రమాలు పెచ్చుమీరుతున్నా.. దేవదాయ శాఖ ఈఓ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఇదంతా గమనించిన భక్తులు ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ ప్రతిష్ట దిగజారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంపనూరు క్షేత్రంలో అక్రమార్కుల దందా భక్తుల సెంటిమెంట్తో వ్యాపారం అనధికారికంగా గోశాల, అన్నదానం నిర్వహణ సేవ పేరుతో రూ. లక్షల్లో వసూళ్లు ఆడిట్ వివరాలు లేవంటున్న ఎండోమెంట్ అధికారులు -
పుట్ట గొడుగుల పెంపకం లాభదాయకం
బుక్కరాయసముద్రం: పుట్ట గొడుగుల పెంపకం లాభదాయమని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో పుట్ట గొడుగులకు డిమాండ్ ఉందన్నారు. నిరుద్యోగ యువత పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ పొంది కుటీర పరిశ్రమలాగ అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి పుట్ట గొడుగుల పెంపకంలో మెలకువలు, యాజమా న్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. జీవన ఎరువుల వాడకం ఎంతో మేలు రసాయన మందులకంటే జీవన ఎరువులు వాడకం ఎంతో మేలు అని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి కేవీకేలో జీవన ఎరువుల వారోత్సవాల సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ శశికళ జీవన ఎరవుల వాడకంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ, ఎరువుల లభ్యత, పథకాలపై కేవీకే విస్తరణా శాస్త్రవేత్త చందన అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగుపై వాటిలో రాయితీలపై శాస్త్రవేత్త డాక్టర్ మాధవి వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
మారుతి సుజుకి– నివ్యా ఆటోమొబైల్స్షోరూం ప్రారంభం
అనంతపురం సెంట్రల్: నగర శివారులోని శిల్పారామం వద్ద జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ‘మారుతి సుజుకి అరెనా–నివ్యా ఆటో మొబైల్స్ షోరూం’ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై అలరించారు. సినిమా పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఆమెను చూడటానికి యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మారుతి సుజుకి మిడ్ – ఎస్యూవీ విక్టోరిస్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ మారుతి సుజుకి మొదటి నుంచి ఎంతో నమ్మకమైన బ్రాండ్ అన్నారు. తన ప్రయాణం చిన్నప్పుడు మారుతి 800తో మొదలైందని గుర్తు చేసుకున్నారు. జీవితమనేది చాలా విలువైనదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ తొలిసారిగా పెట్రోల్ కార్లను మారుతి సంస్థ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. నివ్యా ఆటో మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లు ప్రసాద్రెడ్డి, మల్లు నివేదితా రెడ్డి మాట్లాడుతూ కొత్త అరెనా షోరూమ్లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయని తెలిపారు. నూతన మారుతి సుజుకి విక్టోరిస్ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, సీఎన్జీ, ఆల్గ్రిప్ వేరియంట్లలో అందుబాటులో ఉందన్నారు. దీని ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. మెరిసిన సినీనటి మీనాక్షి చౌదరి -
పోలీస్ అమరవీరులకు వందనం
పుట్టపర్తి టౌన్: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి సేవలను స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21న పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లు అర్పిస్తూ స్మారకోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7.30 నుంచి 10గంటల వరకు సమావేశం నిర్వహించి ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఆ త్యాగం మరువలేం భారత, చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో 1959 అక్టోబరు 21న చైనా సైనికుల దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించలేని పరిస్థితి. దీంతో అక్కడే ఖననం చేశారు. వారి త్యాగాలకు గుర్తుగా అప్పటి నుంచి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. పది రోజుల పాటు సాగే పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టనున్నారు. 21న జిల్లా పోలీసు కార్యాలయంలో కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్కుమార్ ప్రారంభించనున్నారు. 22, 23తేదీల్లో జిల్లాలో అమరులైన పోలీసుల గ్రామాలను సందర్శించి, నివాళులర్పించనున్నారు. అనంతరం 24 నుంచి 27వ తే9దీ వరకూ విద్యార్థులకు చర్చావేదికలు, వక్తృత్వ పోటీలు, 26న 26న పోలీసుల పరాక్రమాలు, త్యాగాలు తెలిపే చిత్రాల ప్రదర్శన, 26 నుంచి 27 వరకు ఓపెన్ హౌస్, 28న వైద్య శిభిరాలు, అదే రోజు పోలీస్ వాయిద్య బృందాల ప్రదర్శన, 29న పోలీస్ త్యాగాలపై సెమినార్లు, 30న పోలీస్ అమరవీరుల కుటుంబాల్లోని సాధకులకు సన్మానం, 31న సమైక్యతా దినం పాటించి వారోత్సవాలు ముగించనున్నారు. జిల్లాలో ఇద్దరు అమరులు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో భాగంగా కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, బాబావలి అమరులయ్యారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికై న ఆర్.బాబావలి... హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ఉన్న పోలీస్ కారిడార్లో గన్మెన్గా శిక్షణ పొంది పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అంగరక్షకుడిగా పనిచేశారు. 2003, జనవరి 18న అనంతపురంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో వీరమరణం పొందారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి, ఆయన భార్యకు ఎకై ్సజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించింది. అలాగే 1994లో కానిస్టేబుల్గా విధుల్లోకి చేరిన తాటిపి చంద్రశేఖర్.. చిలమత్తూరు, రామగిరి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2003, సెప్టెంబర్ 23న చంద్రశేఖర్తో పాటు మరో కానిస్టేబుల్ హనుమంతును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత హనుమంతుని విడుదల చేశారు. ఆ మరుసటి రోజు సోమరవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. అమరుడైనా చంద్రశేశేఖర్ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించింది. మీ త్యాగాలు మరవలేం శాంతిభద్రత నిర్వహణలో పోలీసుల పాత్ర కీలం రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంపోలీస్ అంటేనే బాధ్యత పోలీస్ ఉద్యోగం అంటే బాధ్యతతో కూడుకున్నది. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో భాగంగా కొన్నిసార్లు అసాంఘిక శక్తుల చేతుల్లో వీరమరణం పొందక తప్పదు. వారి త్యాగాలు గుర్తు చేసుకొనేందదుకు పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం ఈ నెల 31 వరకు అన్ని పోలీస్ స్టేషన్లలో అమరవీరుల వారోత్సవాలు జరుగుతాయి. – సతీష్కుమార్, ఎస్పీ -
బినామీల కోసమే ప్రైవేటీకరణ
సోమందేపల్లి: సీఎం చంద్రబాబు తన బినామీలకు లబ్ధి చేకూర్చడానికే వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు సిద్ధమయ్యారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విమర్శించారు. ఆదివారం ఆమె మండలంలోని పందిపర్తి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పేదల వైద్యానికి భరోసా కల్పించడంతో పాటు పేద విద్యార్థులు కూడా వైద్యవిద్య అభ్యసించాలన్న సదుద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భారీసంఖ్యలో ప్రభుత్వ వైద్యకళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. పెనుకొండ వైద్య కళాశాలను పూర్తి చేస్తే ఈ ప్రాంతానికంతా మేలు జరుగుతుందని, ఆ దిశగా చొరవ చూపడంలో మంత్రి సవిత విఫలమయ్యారని విమర్శించారు. పైగా ఈ వైద్యకళాశాల నిర్మాణం విషయంలో ఇటీవల తప్పుడు ప్రచారం చేసి ఆభాసుపాలు అయ్యారని గుర్తు చేశారు. సూపర్సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసులు, మాజీ కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణ రెడ్డి, సర్పంచులు కిష్టప్ప, జిలాన్, రామాంజి, సోము, వైస్ సర్పంచ్ వేణు, వైస్ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి, స్థానిక నాయకులు సదాశివ రెడ్డి, రవీంద్ర రెడ్డి, రాజశేఖర్ , బాబు, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు తీరుతో పేద విద్యార్థులకు అన్యాయం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
పండగ పూట విషాదం
నల్లమాడ: దీపావళి పండగ పూట సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని గోపేపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నల్లమాడకు చెందిన ఇ.లక్ష్మణ సాయి (19), అరుణ్కుమార్ (19) అక్కడికక్కడే మృతిచెందారు. చారుపల్లి బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, మృతుల సమీప బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుడైన వెంకటనారాయణ కుమారుడు లక్ష్మణ సాయి, కూరగాయల వ్యాపారి కుళ్లాయమ్మ కుమారుడు అరుణ్కుమార్, లేట్ గంగులప్ప కుమారుడు చారుపల్లి బన్నీ ముగ్గురు మంచి స్నేహితులు. స్థానిక గంగా థియేటర్ సమీపంలో ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ సాయి ఇంటర్, అరుణ్కుమార్, బన్నీ పదో తరగతి వరకు చదివి..అనంతరం చదువు మానేశారు. బన్నీ కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిసింది. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్ ఇంటి వద్దనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. చారుపల్లి బన్నీ బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి నల్లమాడలోని షిర్డీ సాయిబాబా గుడి వద్ద ఇతరులు చిన్నమ్మ కథ నాటకం ఏర్పాటు చేశారు. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్, చారుపల్లి బన్నీ ముగ్గురూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చిన్నమ్మ కథ నాటకాన్ని తిలకించారు. బస్సు ఎక్కిద్దామని బయలుదేరి.. నాటకం నుంచి వచ్చిన తర్వాత.. బన్నీ బెంగళూరు వెళ్లడానికి కదిరిలో బస్సు ఎక్కించడానికి ముగ్గురూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కదిరికి వెళ్లారో లేక ఏదైనా కారణంతో మార్గమధ్యం నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టారో తెలియదు కానీ గోపేపల్లి వద్ద రోడ్డు మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. లక్ష్మణ సాయి, అరుణ్కుమార్ ఎగిరి సమీపంలోని బండరాళ్ల మీద పడటంతో ఇరువురికీ తల, ఛాతిపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చారుపల్లి బన్నీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. సీఐ నరేంద్రరెడ్డి తమ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం ఇదేరోజు సాయంత్రం లక్ష్మణ సాయికి నల్లమాడలో, అరుణ్కుమార్కు స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతులిద్దరూ ఏకై క సంతానం కావడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ ఇద్దరు యువకుల దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు -
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పండగ వేళ ప్రతి ఒక్కరి జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని పేర్కొన్నారు. సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాంతులు నింపాలి పుట్టపర్తి టౌన్: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొంటున్న దీపావళి అందరి జీవితాల్లో కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ ఆక్షాంక్షించారు. దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలకు వారు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. మోసగాడిపై కేసురామగిరి: పింఛన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న టీడీపీ వర్గీయుడు సదాశివపై రామగిరి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సదాశివ తన పింఛన్ పునరుద్ధరింపజేస్తానంటూ రెండు విడతలుగా రూ.24 వేలు ఇప్పించుకుని మోసం చేశాడని రామగిరికి చెందిన శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదాశివ ఆగడాలపై ఈ నెల 15న ‘సాక్షి’ దినపత్రికలో ‘సదా మోసమే’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కలెక్టరేట్ ఏఎస్ఓనని చెప్పుకుంటూ పలువురి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అనంతపురం, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి తదితర ప్రాంతాలలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను, పింఛన్ ఇప్పిస్తానంటూ అమాయకులను మోసగించాడు. ఇప్పటికే ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాటిమానుగుంతలో తాగునీటికి కటకటఎన్పీకుంట మండలంలో మారుమూల గ్రామమైన తాటిమానుగుంతలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ బోరు మోటారు చెడిపోయి..పదిహేను రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో చాలా మంది వ్యవసాయ కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తాగునీటి కోసం పనులు మానుకుని బోరుబావుల వద్ద నీళ్లు వదిలినప్పుడు బిందెల్లో పట్టుకోవడానికి పోటీపడుతున్నారు. తమ పొలాలకు నీళ్లు వదులుకోవాలని రైతులు అభ్యంతరం చెబుతుండడంతో ఒకట్రెండు బిందెలతో సర్దుకోవాల్సి వస్తోంది. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు. – ఎన్పీకుంట: -
చితికిన చెనిక్కాయ
జిల్లా రైతులతో దశాబ్దాలుగా పెనవేసుకుని ప్రధానపంటగా వెలుగొందుతున్న వేరుశనగ ప్రాభవం కోల్పోతోంది. గత పదేళ్లుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన పంట విస్తీర్ణం ఈ ఖరీఫ్లో మరింత పతనమైంది. జిల్లా చరిత్రను తిరగేస్తే 1960 దశకం తర్వాత ఇదే అత్యల్ప విస్తీర్ణం కావడం గమనార్హం. అనంతపురం అగ్రికల్చర్: పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, కూలీల సమస్య, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద, పంట నష్ట ఉపశమనం (స్కేల్ ఆఫ్ రిలీఫ్) తక్కువగా ఉండటం, అందులోనూ గరిష్టంగా రెండు హెక్టార్లకే ఇన్పుట్ ఇస్తుండటం, పంటల బీమా కింద పెద్దగా పరిహారం రాకపోవడం ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా క్రమంగా వేరుశనగ తన ప్రాశస్త్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఒకానొక దశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశనగ సాగు విస్తీర్ణం 8 లక్షల నుంచి 9 లక్షల హెక్టార్ల గరిష్టస్థాయికి చేరుకుంది. జిల్లాలో ఎటు చూసినా వేరుశనగ మినహా మరో పంట కనిపించే పరిస్థితి లేకుండా శాసించింది. అక్కడక్కడా ఇతరత్రా పంటలు ఉన్నా వేరుశనగ మధ్యలో అంతర పంటలుగా మాత్రమే సాగవుతూ వచ్చాయి. అలా వేరుశనగ ఏకపంటగా విస్తరించి జిల్లాను పూర్తిగా ఆక్రమించింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక జిల్లాలో ఈ స్థాయిలో వేరుశనగ పంట పండించడం లేదని చెప్పేవారు. ఇలా 1960 దశకం నుంచి మొదలైన వేరుశనగ ప్రాభవం లక్షలాది హెక్టార్లతో 2015 వరకు అప్రతిహతంగా కొనసాగింది. అలాంటి పంట విస్తీర్ణం అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్లో రెండో స్థానానికి దిగజారిపోయింది. గత 30 ఏళ్లలో నాలుగుసార్లు గిట్టుబాటు.. అధికారిక లెక్కల ప్రకారం గత 30 ఏళ్లలో కేవలం నాలుగు సంవత్సరాల్లో వేరుశనగ మంచి దిగుబడులు రావడంతో గిట్టుబాటు అయింది. మరో ఏడేళ్లు పెట్టుబడులు దక్కించుకోగా తక్కిన 19 సంవత్సరాలు రైతులకు నష్టాలు మిగి ల్చింది. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వేయి కిలోల వరకు వేరుశనగ దిగుబడులు వస్తేనే పంట బాగా వచ్చినట్లు లెక్క. 1995 నుంచి 2024 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణిస్తే అందులో 1995లో మాత్రం వేరుశనగ పంట బాగా పండింది. 1995లో హెక్టారుకు సగటున 1,310 కిలోల దిగుబడులు వచ్చాయి. ఆ తరువాత 1998లో 1,145 కిలోలు, 2000లో 1,116 కిలోలు, 2007లో 1,259 కిలోల దిగుబడులు వచ్చాయి. ఈ నాలుగేళ్లు పంట చేతికివచ్చింది. ఇక ఏడు సార్లు హెక్టారుకు 500 కిలోల నుంచి 950 కిలోల మధ్య రావడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కాయి. ఇక తక్కిన 19 సార్లు వేరుశనగ దారుణంగా దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2006లో కేవలం 67 కిలోలు, 2008లో 88 కిలోలు... ఇలా 100 కిలోల లోపే దిగుబడులు రావడంతో ఎకరాకు అర బస్తా కూడా పండిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో వేరుశనగ సమస్య పరిష్కారానికి 2012లో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) అప్పటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలోని దేశవ్యాప్తంగా 18 మంది నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ కూడా జిల్లాలో పర్యటించి వేరుశనగ సాగును తగ్గించి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గోరుచిక్కుడు లాంటి పంటలు వేయాలని సిఫారసు చేసింది. కంది టాప్.. ఈ ఖరీఫ్లో కంది పంట చరిత్ర సృష్టిస్తూ సాగులో మొదటి స్థానంలో నిలిచింది. అనంతపురం జిల్లాలో 55,296 హెక్టార్లుగా అంచనా వేయగా రెండింతలు అధికంగా 1.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావడం గమనార్హం. కందితో పాటు ఆముదం, మొక్కజొన్న పంటల సాగు బాగా పెరుగుతూ వేరుశనగను వెనక్కినెట్టేస్తున్నాయి. ఈ ఖరీఫ్లో అన్ని పంటలు 3,43,232 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేయగా... అననుకూల వర్షాల కారణంగా 88 శాతంతో 3.02 లక్షల హెక్టార్లకు చేరుకున్నాయి. అందులో కంది 1.04 లక్షల హెక్టార్లు, వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు, మొక్కజొన్న 29 వేల హెక్టార్లు, ఆముదం 16 వేల హెక్టార్లు... ఈ ఐదు పంటలే 80 శాతం ఆక్రమించాయి. నీటి వసతి కింద 25 వేల హెక్టార్లలో వరి సాగులోకి వచ్చింది. ఇక సజ్జ, కొర్ర సాగు కొంచెం మెరుగ్గానే ఉన్నా... రాగి, జొన్న, పెసర, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. 65 ఏళ్ల జిల్లా చరిత్రలో కనిష్ట సాగు లక్ష లోపు హెక్టార్లకు పరిమితమైన ప్రధానపంట నష్టాలతో సాగుపై రైతుల అనాసక్తి -
స్వచ్ఛాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
నల్లమాడ: స్వచ్ఛాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం నల్లమాడ మండలంలో పర్యటించిన ఆయన స్వచ్ఛాంధ్రలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి మొక్కలు నాటిన కలెక్టర్.. బాసంవారిపల్లి గ్రామస్తులకు మొక్కలు అందజేశారు. అక్కడి నుంచి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ సైకిల్ ముందు భాగంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కడం విశేషం. తర్వాత చౌటకుంటపల్లి వద్ద రైతు పద్మనాభ రెడ్డి పొలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సూర్య ఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. పంటలకు సేంద్రియ ఎరువుల వాడకంతో కలుషితం లేని దిగుబడిని, తద్వారా నాణ్యమైన ఆహారాన్ని పొందవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని, నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. నల్లమాడ కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినులకు పాఠం చెప్పారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ క్రిష్టప్ప, పలువురు జిల్లా అధికారులు, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
కదిరి టౌన్/ ధర్మవరం అర్బన్/ మడకశిర: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్పై వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని రాజకీయ, జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ఖండిస్తున్నారు. పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మీడియాపై అక్రమ కేసులు హేయం నకిలీ మద్యంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించినందుకు ‘సాక్షి’ మీడియాపై కూటమి సర్కారు అక్రమ కేసులు పెట్టి వేధించడం హేయమైన చర్య. అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. – ఎస్ఎండీ ఇస్మాయిల్, వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త, కదిరి పత్రికా స్వేచ్ఛకు తూట్లు పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. హైదరాబాద్ సాక్షి కార్యాలయం వద్ద నెల్లూరు పోలీసులు ఎడిటర్కు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి చేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. నిజాన్ని రాసే పత్రికలకు కూటమి ప్రభుత్వం కేసులు, నోటీసులు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ చర్యను ప్రతిఒక్కరూ ఖండించాలి. – మాసపల్లి సాయికుమార్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నోటీసుల పేరుతో వేధించడం తగదు నోటీసుల పేరుతో పోలీసులు వేధించడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే. నిజాలను రాసే జర్నలిస్టులకు స్వేచ్ఛ కల్పించాలి. అంతే కానీ వార్తలు నచ్చలేదని జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు దిగడం హేయమైన చర్య. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులపై అధికార జులుం ప్రదర్శించరాదు. వార్త ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసుల పేరుతో వేధించడం తగదు. – పొగాకు రామచంద్ర, వైఎస్సార్సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
దొంగలను చేసిన జల్సాలు
పుట్టపర్తి టౌన్: వారంతా జల్సాల కోసం దొంగలుగా మారారు. ఇళ్లు, ఆలయాలు, పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిఘా వేసిన పోలీసులు వివిధ కేసులకు సంబంధించి 11 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారు నగలు, అల్యూమినియం, అమ్మవారి విగ్రహాల వెండి ముఖాలతో పాటు ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్కుమార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామితో కలిసి మీడియాకు వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. ఇటీవలి కాలంలో పుట్టపర్తి పట్టణం, బ్రాహ్మణపల్లి, ఓడీచెరువు, గోరంట్ల, సోమందేపల్లి, కియా పోలీస్ స్టేషన్ ఏరియా, రొద్దం ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగాయి. పుట్టపర్తి డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ శివాంజనేయులు, ఏఎస్ఐ మధుసూదన్రావ్, కానిస్టేబుల్ శంకరప్పతో పాటు సిబ్బంది ఒక బృందంగా ఏర్పడ్డారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలన్నీ బెంగళూరుకు చెందిన చంతన్ అనే వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న నరసింహమూర్తి పనే అని తేల్చారు. అతని కోసం నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 17న తాను దొంగిలించిన సొమ్మును పుట్టపర్తిలోని ఎస్బీఐ వద్ద ఓ షాపులో అమ్మతుండగా నిందితుడు నరసింహమూర్తిని పుట్టపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువచేసే వంద గ్రామల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటుపడి.. వాటికి అవసరమైన డబ్బు కోసం ఇలా దొంగగా మారినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. వైర్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం.. ఓడీచెరువు, నల్లమాడ, అమడగూరు, బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్, రామగిరి, కదిరి, తలుపుల, గాండ్లపెంట మండలాల్లో ఏడాది కాలంగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి.. అందులోని వైర్లను అపహరించుకుపోతున్నారు. బాధిత రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రంగనాథ, బుక్కపట్నం మండం చండ్రాయునిపల్లికి చెందిన గణేష్, ఎన్పీ కుంట మండల దాసరవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, మహమ్మద్ రఫి, నల్లమాడ మండలం మాలప్పగారిపల్లికి చెందిన సి.వెంకటేష్, సోమందేపల్లి గ్రామానికి చెందిన సాదిక్ఖాన్లను నిందితులుగా గుర్తించారు. వీరిపై పై తొమ్మిది స్టేషన్లలో 22 కేసులు నమోదయ్యాయి. 51 ట్రాన్స్ఫార్మర్లు పగులగొట్టి.. అందులో ఉన్న అల్యూమినియం, కాపర్వైర్ను తీసి విక్రయిస్తుంటారని తేలింది. అలా రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద దొంగిలిస్తుండగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5 లక్షలు విలువచేసే 657 కేజీల అల్యూమినియం వైర్ స్వాధీనం చేసుకున్నారు. దేవుని సాక్షిగా దొంగతనాలు.. కదిరి పరిసర ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో ఆరు నెలలుగా చోరీలు జరుగుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు..ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు కావడి శ్రీనివాసులు (తిరుపతి జిల్లా), బండి సోముశేఖర్, మెనుపడి రమేష్ (అన్నమయ్య జిల్లా), కొండాచారి (కర్ణాటక రాష్ట్రం చింతామణి)గా గుర్తించారు. ఈ నలుగురు అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసి, రూ.1.16 లక్షల నగదు, నాలుగు బంగారు తాళిబొట్లు, నాలుగు అమ్మవారి వెండి విగ్రహాల ముఖాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గరు నిందితులు రాజేంద్ర, శేఖర్, అరుణాచలం పరారీలో ఉన్నారు. ● నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లోని నిందితుడు నల్లమాడ మండలం మాలప్పగారిపల్లి వెంకటేష్ సోదరి దుర్గమ్మ, సర్పంచ్ రామ్మోహన్రెడ్డిని ఎస్పీ సతీష్కుమార్ పూలమాలతో సత్కరించారు. నేరస్తుల పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు నరేంద్రరెడ్డి, శివాంజనేయులు, నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మక్బూల్బాషా, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ కేసుల్లో 11 మంది అరెస్ట్ నగలు, వస్తువులు, నగదు, కారు, సెల్ఫోన్ల స్వాధీనం -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం
పుట్టపర్తి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించాలని, ఇందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తి మండలం బొంతలపల్లి, చెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, అమగొండపాళ్యం, కప్పలబండ, జగరాజుపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘రచ్చబండ’, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, డిజిటల్ బుక్ ఆవిష్కరణ, పోస్టర్ల విడుదల కార్యక్రమాలు నిర్వహించారు. బొంతలపల్లి, చెర్లోపల్లిలో పార్టీ పరిశీలకులతో కలిసి దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ప్రసంగించారు. మున్సిపల్, జిల్లాపరిషత్, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరచి.. రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారిస్తూ కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ముందు చూపుతో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 342 జాతీయ రహదారి, 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాలను చేపడితే అవన్నీ తమ ఘనతే అంటూ ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే డమ్మీగా మారిపోయారన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గ్యాంబ్లింగ్ కేంద్రంగా మార్చారని విమర్శించారు. కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఇవన్నీ కూటమి నాయకులకు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందనిద్రాక్షే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం, అందుబాటులో వైద్య విద్య ఉండేందుకు రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కళాశాలలు తీసుకొస్తే.. వాటిని కొనసాగించకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తోందని దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షే అవుతుందని, వైద్య విద్య అభ్యసించలేని పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, అగ్రీ అడ్వయిజరీ జిల్లా మాజీ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, వైస్ ఎంపీపీ హనుమంతరెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు ఈశ్వరయ్య, రవినాయక్, మాజీ కన్వీనర్లు గంగాద్రి, నరసారెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, పరిశీలకులు మాధవరెడ్డి, ఫొటోసాయి, సంజీవరెడ్డి, చౌడిరెడ్డి, పోతిరెడ్డి, నాయకులు బయపరెడ్డి, నాగరాజు, తిప్పారెడ్డి, కుల్లాయప్ప, వెంకటేషు, ఓబుళప్ప, ఎరదొడ్డి, నరేష్, సర్పంచ్ వెంకటేషు, సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, మాజీ ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, రమణారెడ్డి, అగ్రీ బోర్డు మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట, పరిశీలకులు రఘునాథరెడ్డి -
వక్కచెట్ల నరికి వేత
● రూ.లక్ష నష్టం.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు రొళ్ల: మండల పరిధిలోని హనుమంతనపల్లి గ్రామంలో రైతు రంగనాథ్ వక్కతోటలోని 50 చెట్లను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. వివరాల్లోకి వెళితే.. రంగనాథ్ నాలుగేళ్ల క్రితం వక్క చెట్లను నాటాడు. అప్పటి నుంచి మొక్కలకు సకాలంలో నీరు, ఎరువులు అందిస్తూ వచ్చాడు. ప్రస్తుతం పంట కాపునకు వచ్చింది. శుక్రవారం కూడా రంగనాథ్ తన తండ్రి గోవిందప్పతో కలిసి వక్కతోట వద్దకు వెళ్లి సాయంత్రం వరకు పనిచేశాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వక్కతోటలోకి ప్రవేశించి కాపునకు వచ్చిన 50 చెట్లను నరికి వేశారు. శనివారం ఉదయం తోటకు వెళ్లిన రంగనాథ్ తెగిపడిన వక్కచెట్లను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రొళ్ల ఏఎస్ఐ ఇదాయతుల్లా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మొక్కలను కంటికిరెప్పలా కాపాడుకున్నానని, ఇప్పటికే రూ.లక్ష దాకా ఖర్చు చేశానని బాధితుడు రంగనాథ్ తెలిపారు. సరిగ్గా కాపునకు వచ్చిన సమయంలో ఇలా నరికివేశారని, వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. -
యువత గం'జాయ్'
పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో చీకటి పడగానే యువత ఓ చోటకు చేరుతున్నారు. గంజాయిని గుప్పుగుప్పుమంటూ పీలుస్తూ మత్తులో తూలిపోతున్నారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంతో పాటు సాయినగర్లో విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిసింది. చిత్రావతి రోడ్డులోని చాలామంది యువత గంజాయికి బానిసలైనట్లు సమాచారం. ఇక హిందూపురం, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లోనూ గంజాయి మత్తుకు చాలామంది బానిసలయ్యారు.సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా యువత ‘దమ్మారో దమ్’ అంటూ గంజాయి మత్తులో తూలుతోంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు పల్లెలకూ పాకింది. దీంతో గంజాయి విక్రయిస్తున్న.. వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గుడి, బడి తేడా లేకుండా అన్ని చోట్ల గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి.. గంజాయి ఎక్కువగా ఒరిసా, కర్ణాటక నుంచి జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయి.. తొలుత పెనుకొండ చేరుకుంటుంది. అక్కడక్కడా నిల్వ చేసి చాక్లెట్లు, పెన్నుల్లో నింపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో కొనేవారు కూడా రూ.100 చెల్లిస్తే రోజుకు కావాల్సినంత మత్తు వచ్చే గంజాయి లభిస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బడాబాబుల అండదండలతో కొందరు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుండటంతో యువత, విద్యార్థులు మత్తుకు అలవాటు పడు తున్నట్లు తెలుస్తోంది. మత్తులో నేరాలకు పాల్పడుతూ.. గంజాయి అలవాటు పడిన వారు రోజూ సాయంత్రం కాగానే సరుకు గురించి ఆరా తీస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ల సమాచారం ఆధారంగా గంజాయి దొరికే ప్రాంతానికి వెళ్లి మత్తులో మునిగిపోతున్నారు. అయితే గంజాయి విక్రేతలు రోజుకో ప్రాంతాన్ని ఎంపిక చేయడం... అంతదూరం వెళ్లి గంజాయి తాగిన వారు తిరిగి వచ్చే సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరైతే హత్యలకూ వెనుకాడటం లేదు. ఇటీవల పుట్టపర్తి మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో ఓ హత్య కేసులోని నిందితులు ఘటన సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది.ఇక చిత్రావతి రోడ్డులో ఓ విదేశీయుడు గంజాయి మత్తులో భవనం పైనుంచి పడి చనిపోయిన ఘటన నెల క్రితం వెలుగు చూసింది. ఇక గతేడాది విజయదశమి రోజున చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం చేసిన వారందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. వారిపై గతంలోనూ గంజాయి కేసులున్నాయి.వదిలిపెట్టే ప్రసక్తే లేదు గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత కూడా మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. దాడులు చేసి నిందితులను పట్టుకుంటాం. – సతీశ్కుమార్, ఎస్పీ -
జాతీయ స్థాయి పోటీలకు కదిరి విద్యార్థులు
కదిరి అర్బన్: ఈ నెల 29 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బీహార్లోని బేగుసరాయ్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి గోల్షూట్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్ పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ కిరణ్ శుక్రవారం తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు శైలజ, హిమబిందు, అర్థిక ఎంపికయ్యారన్నారు. ఎంపికై న విద్యార్థులను గోల్ షూట్బాల్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్, ఖాదర్వలీ తదితరులు అభినందించారు. పదో తరగతి విద్యార్థుల బాహాబాహీ కదిరి టౌన్: స్థానిక అడపాల వీధిలో ఉన్న షిరిడీ సాయి స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గురువారం సాయంత్రం అదే పాఠశాల సమీపంలో గొడవపడి పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన మరో విద్యార్థిపై కేసు నమోదు చేసేందుకు సీఐ నారాయణరెడ్డి సిద్ధం కాగా, విద్యార్థి తల్లి ఆందోళనకు గురైంది. పిల్లవాడి భవిష్యత్తు నాశనం అవుతుందని, రాజీ పరిష్కారం చేయాలని వేడుకుంది. అక్కడితో ఆగకుండా క్షణికావేశానికి లోనై బ్లేడుతో తన చేతికి కోసుకుంది. తీవ్ర గాయమైన ఆమెను పోలీసులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వినాయకుడి విగ్రహం అపహరణ అగళి: స్థానిక శంకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. శుక్రవారం ఉదయం నిత్య పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకుడు విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం వినాయకుడి విగ్రహాన్ని పెకలించుకుని వెళ్లినట్లుగా ఆనవాళ్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కూటమి కుట్రలను తిప్పికొట్టండి
గాండ్లపెంట: రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి సర్కార్ తెరలేపిందని కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ మండిపడ్డారు. ఈ కుట్రను కోటి సంతకాలతో తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గాండ్లపెంట మండలం కమతంపల్లి, కటారుపల్లి, తుమ్మలబైలు, తుమ్మలబైలు పెద్దతండా, గొడ్డువెలగల గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొండవీటి నాగభూషణం, పార్టీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మండల పార్టీ పరిశీలకులు లింగాల లోకేశ్వరరెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కళాశాలు పూర్తయితే పేదలుకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చేదన్నారు. అయితే ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం... వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం కావడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందాలన్నా.. పేద విద్యార్థులు వైద్యను అభ్యసించాలన్నా కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోటి సంతకాలతో ఈ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కల్తీ మద్యంతో జనం జీవితాలతో చెలగాట మాడుతున్న కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశం అనంతరం గ్రామ కమిటీలను నియమించి, సభ్యుల పేర్లను ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్లు నాగభూషణంరెడ్డి, గంగోజమ్మ, అబ్బా ఆంజనేయులు, గొడ్డువెలగల ఆంజనేయులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్అలీ, మాజీ జెడ్పీటీసీ భాస్కర్రెడ్డి, మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీకాంత్రెడ్డి, కదిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, మండల వైస్ కన్వీనర్ శంకర్నాయుడు, మాజీ కన్వీనర్ చంద్రశేఖరరెడ్డి, ఉప సర్పంచ్ ఫకృద్ధీన్, మండల యూత్ అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, ఎస్సీసెల్ నరసింహులు, మండల కోఆప్షన్ సభ్యుడు అమీర్ఖాన్, నాయకులు పామిడి ఇక్బాల్, వద్దిరెడ్డి కృష్ణారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, బయన్న, రామాంజులరెడ్డి, ఉత్తన్న, అజీం, దామోదర్, లీగల్ సెల్ అధ్యక్షుడు నాగేంద్రకుమార్రెడ్డి, స్ధానిక నాయకులు హరిప్రసాదరెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణ, మైనుద్ధీన్, శేఖర్, రాజన్న, నవీన్, గోవర్ధన్నాయక్, అజయ్నాయక్, గోవిందరెడ్డి, గిరిబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ -
ఇలా ఉంటే రోగాలు రావా?
ధర్మవరం రూరల్: వీధుల్లో మురుగుపారుతూ అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావా? అని జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపైనే మురుగునీరు, దిబ్బలు ఉండటం చూసి పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరికి వారు తమ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని మురుగు నీటిని రోడ్లపైకి వదలకూడదన్నారు. అనంతరం ఐవీఆర్ఎస్ కాల్స్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిమనోహర్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అపరిశుభ్రతపై జెడ్పీ సీఈఓ అసహనం -
అదరగొట్టిన రాహుల్, అభినవ్
● భారీ స్కోర్ దిశగా ఆంధ్ర జట్టు అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ సెంటర్లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర బ్యాటర్లు ఎస్వీ రాహుల్, అభినవ్ చెలరేగి సూపర్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 4 వికెట్లు కోల్పోయి 470 పరుగులు సాధించింది. గురువారం కురిసిన వర్షం కారణంగా శుక్రవారం రెండో రోజు మ్యాచ్ రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్నైట్ స్కోర్ 210/2తో బరిలో దిగిన ఆంధ్ర బ్యాటర్ తేజ ఆట ప్రారంభమైన కాసేపటికి పెవిలియన్ ముఖం పట్టాడు. ఈ దశలో జత కట్టిన ఎస్వీ రాహుల్, అభినవ్.. ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నిలకడగా ఆడుతూ.. అవకాశం దొరికినప్పుడుల్లా బంతిని బౌండరీలు దాటిస్తూ భారీ స్కోర్కు బాటలు వేశారు. ఎస్వీ రాహుల్ 292 బంతులను ఎదుర్కొని 15 ఫోర్లు,2 భారీ సిక్సర్లతో 151 పరుగులు చేసి, క్రీజ్లో కొనసాగుతున్నాడు. అభినవ్ 190 బంతుల్లో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో యుగల్ షైనీ 2/37, మన్నన్, దేవ్లక్ర చెరో వికెట్ తీసుకున్నారు. -
కేంద్ర మంత్రి పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్
మడకశిర రూరల్: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్ పతాక స్థాయికి చేరుకుంది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ రెన్యూవల్ చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులను అడుగడుగునా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శుక్రవారం మడకశిర ప్రాంతాలో కేంద్ర మంత్రి సోమన్న పర్యటించారు. దీంతో మంత్రిని కలిసి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ రెన్యూవల్ చేయాలంటూ అభ్యర్థించేందుకు జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ కరియన్న, బీసీసెల్ నాయకుడు తిమ్మప్ప పార్టీ వివిధ విభాగాల సభ్యులు శివానంద, లక్ష్మీనారాయణ, నాగభూషణరెడ్డి, రంగనాథ, హరి ప్రసాద్, దేవరాజ్, మైలారప్ప, రామకృష్ణప్ప తదితరులు సిద్ధమయ్యారు. తొలుత మడకశిరలోని వాల్మీకి సర్కిల్ వద్ద మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉండగా పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బుకాయించి వెనక్కు పంపారు. దీంతో పెనుకొండ రోడ్డులో మరోసారి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నంచారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. హరేసముద్రం క్రాస్ వద్ద హైవేలో వేచిఉండగా అక్కడ ఇవ్వడానికి వీలులేదని, రైల్వేస్టేషన్ నిర్మాణ ప్రాంతంలో ఇవ్వాలంటూ పంపించేశారు. రైల్వేస్టేషన్ చేరుకుని మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించినా అక్కడ కూడా అవకాశం కల్పించకుండా అడ్డుకున్నారు. వెటర్నరీ కాలేజీ వద్దనూ షరామాములైంది. దీంతో ఆంధ్ర సరిహద్దున కర్ణాటక పరిధిలోని చంద్రబావి గ్రామ సమీపానికి వెళ్లి రోడ్డుపైనే మంత్రికి వినతి పత్రం అందజేశారు. మడకశిర ప్రాంతంలో వినతిపత్రం ఇవ్వడానికి అనుమతించని పోలీసుల వైఖరిని మంత్రికి వివరించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేసి పేదలను ఆదుకోవాలని విన్నవించారు. మంత్రిని కలవడకుండా వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకున్న వైనం సరిహద్దుకు వెళ్లి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చిన నాయకులు -
రెండేళ్లలో తుమకూరు–రాయదుర్గం రైల్వే లైన్ పూర్తి
మడకశిర: రాయదుర్గం–తుమకూరు రైల్వే లైన్ పనులను 2027లోపు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. శుక్రవారం ఆయన హిందూపురం ఎంపీ పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మడకశిర వద్ద తుమకూరు–రాయదుర్గం రైల్వే పనులను కలిసి పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం–తుమకూరు రైల్వే లైన్ మధ్య మొత్తం 14 రైల్వే స్టేషన్లు ఉంటాయని, అందులో మడకశిర మండలంలోని కొత్తలం, మడకశిరలోనూ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయిన వెంటనే తుమకూరు–దావణగెర రైల్వే లైన్ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సర్వే, భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.47 వేల కోట్లతో 31 ప్రాజెక్టుల ద్వారా 3,840 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో 1,600 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. తుమకూరు– బెంగళూరు– బెంగళూరు– తమిళనాడు మధ్య రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు చేపట్టడానికి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తుమకూరు– దావణగెర మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు రూ.47 వేల కోట్లతో 3,840 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడి -
ఐక్య ఉద్యమాలతో చేనేత పరిరక్షణ
అనంతపురం అర్బన్: ఐక్య ఉద్యమాలతోనే చేనేత రంగం పరిరక్షణ సాధ్యమవుతుందని, ఈ మేరకు ఉద్యమ కార్యచరణను రూపొందిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, గోవిందు తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కూటమి పెద్దలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి చేనేత రంగం నిర్వీర్యమవుతోందన్నారు. నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. మంత్రుల సొంత ఇలాకాలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. చేనేతను రక్షించుకోవడం అంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని రక్షించుకునే లక్ష్యంగా ఉద్యమాలు సాగిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో అధ్యయన యాత్ర చేపట్టి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ధర్మవరం పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, నేతన్న నేస్తం కింద రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలని, నేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత పెన్షన్, ప్రత్యేక చేనేత బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, పురుషోత్తం, రాధాకృష్ణ, రామ్మోహన్ నాయుడు, సూర్యానారాయణ, తదితరులు పాల్గొన్నారు. చేనేతలకిచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఈ నెల 24, 25న అధ్యయన యాత్ర చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు -
రొళ్ల ఎంపీడీఓకు ‘షోకాజ్’
రొళ్ల: విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఎంపీడీఓ నాగేశ్వరరావు శాస్త్రికు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసును జెడ్పీ సీఈఓ శివశంకర్ జారీ చేశారు. విధుల సమయంలో కర్ణాటకలోని చంద్రబావి వద్ద ఉన్న ఓ బార్ ఎంపీడీఓ గడుపుతూ, ప్రజా సమస్యలు పట్టించుకోవడం దంటూ ఎంపీపీ కవిత, ఆమె భర్త విజయరంగేగౌడు పలుమార్లు జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో పాలనా పరమైన ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం కలెక్టర్ శ్యాంసుందర్కు ఎంపీపీ ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓకు జెడ్పీ సీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
పాలన చేతగాకే పత్రికలపై కేసులు
పరిగి: ‘‘కూటమి ప్రభుత్వానికి ఎలా పాలించాలో తెలియడం లేదు. ఆ పార్టీల్లోని వారంతా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చివరకు మద్యాన్ని కల్తీ చేసి జనాల ప్రాణాలు తీస్తున్నారు. పేదలకు వైద్యం అందించే వైద్య కళాశాలలను కమీషన్ల కోసం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అవినీతి, అక్రమాలకను సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ మీడియా ప్రజల ముందు ఉంచుతోంది. దీన్ని జీర్ణించుకోలేని కూటమి పాలకులు అక్రమ కేసులతో ‘సాక్షి’ సంపాదకుడితో పాటు జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తున్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవినీతి కూటమి సర్కార్ను తప్పక కూలదోస్తారు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం ఆమె పరిగిలో విలేకరులతో మాట్లాడారు. నిజాలు నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ ప్రతినిధులపై ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. పోలీసులను ‘సాక్షి’ కార్యాలయంలోకి పంపడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. కేసులకు, బెదిరింపులకు ఎప్పుడూ భయపడేది లేదని, ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలన్నారు. సుగాలి ప్రీతికి పవన్కళ్యాణ్ ఏం న్యాయం చేశారు.. సుగాలి ప్రీతి కుటుంబానికి డిప్యూటీ సీఎంగా ఏం న్యాయం చేశారో పవన్కళ్యాణ్ చెప్పాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. న్యాయం కోసం ప్రీతి కుటుంబసభ్యులు ధర్నా చేస్తున్నా నోరు ఎందుకు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని పాలిస్తారా... అని మండిపడ్డారు. కూటమి నాయకులకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇకనైనా ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై కక్ష సాధింపులకు దిగడం మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి, అక్రమాలను బయటపెడుతోందనే ‘సాక్షి’పై కూటమి కక్ష పత్రికా సంపాదకుడినే అక్రమ కేసులతో బెదిరించడం దుర్మార్గం కార్యాలయాలపైకి పోలీసులను ఉసిగొల్పి రచ్చ చేయడం నియంతృత్వం కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ -
చీనీ ఆశలపై ‘చిరుజల్లు’
తాడిమర్రి: చీనీ రైతుల ఆశలపై ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పంటకోత తర్వాత దాదాపు నెలరోజుల పాటు చెట్లను ‘వాడు’ (నీళ్లు పెట్టకపోవడం) పెడతారు. ఆ తర్వాత నీరు పెడితే పూత బాగా వచ్చి పిందెలు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయి. కానీ రెండు నెలలుగా రోజు విడిచి రోజు కురుస్తున్న వర్షాలతో చీనీ రైతులు కుదేలయ్యారు. చీనీచెట్లను రైతులు వాడు పెట్టినా నిత్యం చిరుజల్లులు కురుస్తుండటంతో చీనీ చెట్లు పూతకు కూడా నోచుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 37,500 ఎకరాల్లో విస్తరించిన చీనీ తోటలు.. ఎర్రనేలల్లో సాగయ్యే చీనీ నాణ్యతగా ఉండటంతో పాటు తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జిల్లాలోని రైతులు ఎర్ర నేలలున్న ప్రాంతంలోనే చీనీ సాగు చేస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో అధికం చీనీ తోటలు ఉన్నాయి. ఇక పెనుగొండ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాల్లో రెండు, మూడు వందల ఎకరాల్లో రైతులు చీనీ తోటలను సాగు చేస్తున్నారు. మొత్తంగా 37,500 ఎకరాల్లో చీనీ తోటలు విస్తరించాయి. దాదాపు 4.50 లక్షలు చీనీ చెట్లను రైతులు సాగు చేస్తున్నారు. దిగుబడిపై వర్షాల దెబ్బ.. ఎకరాకు 120 చెట్ల ప్రకారం ఐదు ఎకరాల్లో 600 చెట్లు ఉంటే ఆశించిన దిగుబడి, మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తే రైతు రూ.లక్షల్లో ఆదాయం చూస్తాడు. ఏడాదికి రెండు పంటలు కావడంతో రైతుకు చీనీ పంట ఎంతో లాభసాటిగా ఉంటుంది. కానీ ఇటీవల వరుసగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక పంట, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మరో పంట చేతికి వస్తుంది. చీనీ తోటల్లో పూత రావడానికి ముందుగా రైతులు దాదాపు నెలరోజుల పాటు చెట్లకు నీరు పెట్టకుండా ‘వాడు’ పెడతారు. చెట్లకు ఎరువులు వేసి వాడు పెట్టిన అనంతరం ఒక్కసారి నీరు పెడితే విపరీతంగా పూత వచ్చి, పిందెలు అధికంగా వస్తాయి. దీంతో రైతుకు ఆశించిన మేర పంట దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం రైతులు తోటలను వాడు పెట్టగా.. వారానికి రెండు, మూడు సార్లు జల్లులు కురుస్తున్నాయి. దీంతో తోటల్లో తడి ఆరక వాడు రాకపోగా పేనుబంక, పులుసు తెగులు సోకుతున్నాయని రైతు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదంటున్నారు. ఉద్యాన అధికారులు చీనీ తోటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. పూత లేదు.. పిందె రాదు ఇటీవలి వర్షాలతో దెబ్బతిన్న చీనీ ఆందోళన చెందుతున్న రైతులు -
ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఇద్దరు అరెస్ట్
పుట్టపర్తి టౌన్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఉత్తర ప్రదేశ్కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్ను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్, ఫోన్కాల్స్ ద్వారా సంబంధాలు నెరపడంతో అతన్ని ఈ ఏడాది ఆగస్టు 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా..ఉత్తర ప్రదేశ్కు చెందిన సాజాద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలమ్ షేక్ పాత్ర తేలింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఆ రాష్ట్రంలోని అమ్రోహోలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సాజాద్ హుస్సేన్ను అరెస్ట్ చేసింది. అతని నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకుంది. అదే రోజు ఆంఽధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ బృందాలు దాడులు నిర్వహించి..మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో మాలేగావ్లో తౌఫీక్ ఆలమ్షేక్ను అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి సింగిల్ బారెల్ రైఫిల్, సెల్ఫోన్లు, జిహాద్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరూ పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఆధారిత వాట్సాప్ గ్రూప్లు, చానల్స్లో కూడా క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. వీరు యువతను జిహాదీ వైపు మళ్లించడంతో పాటు పాకిస్థాన్లో మిలటరీ శిక్షణ తీసుకుని భారతదేశంపై యుద్ధం చేయాలని యోచిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన ఇద్దరినీ పుట్టపర్తి మేజిస్టేట్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పీఎఫ్ఐ ప్రతినిధుల జిహాదీ కార్యకలాపాలు.. దేశంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ప్రతినిధులు ఇతర నిషేధిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని సామాజిక సేవ పేరుతో జిహాదీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పాక్ ఆధారిత సోషల్ మీడియా గ్రూపులపై గట్టి నిఘా ఉంచామన్నారు. యువత సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సందేహాస్పద కార్యకలాపాలు, దేశ వ్యతిరేక, రాడికల్ భావాలను ప్రోత్సహించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. నిందితుల అరెస్టుకు శ్రమించిన ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్తో పాటు ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, ముదిగుబ్బ సీఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. సింగిల్ బారెల్ రైఫిల్, సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ -
‘తమ్ముడా మజాకా’పై కలెక్టర్ సీరియస్
● విచారణకు ఆదేశం ● నోటీసు జారీ చేస్తామన్న ఎంపీడీఓ రాప్తాడు రూరల్: టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం మానసిక వికలాంగ కోటాలో అక్రమంగా పింఛన్ పొందుతున్న వైనంపై ‘తమ్ముడా మజాకా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో నివాసముంటున్న తాడాల నాగభూషణం పదేళ్లుగా ఈ పింఛన్ పొందుతున్నాడు. ఇప్పటి వరకూ పింఛన్లు పొందుతున్న వందశాతం వైకల్యం ఉన్న వేలాదిమంది దివ్యాంగులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం ... టీడీపీ నాయకుడు నాగభూషణం కు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెవడంతో గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ దివాకర్ మాట్లాడుతూ విచారణలో భాగంగా నోటీసు జారీ చేస్తామని పేర్కొన్నారు. -
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి
ఎన్పీకుంట: సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. గురువారం ధనియానిచెరువు గ్రామంలో రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలను వ్యవసాయాధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకునే విధానాలను వివరించారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదు చేసిన ఈ క్రాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ధనియానిచెరువు పంచాయతీ పరిధిలో గుర్తించిన ప్రభుత్వ భూములను ఎన్టీపీసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టా కలిగిన భూములకు లీజు ప్రాతిపదికన ఎకరాకు రూ.30వేలు చొప్పున చెల్లిస్తారని, రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున లీజు పెంచి ఇస్తారని తెలిపారు. అంతకు ముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఏడీఏ సనావుల్లా, ఎంఏఓ లోకేశ్వరరెడ్డి, ఎస్ఐ వలీబాషా, రెవెన్యూ అధికారులు, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. సాగులో రైతుకు సాయంగా నిలవండి కదిరి అర్బన్: పంటల సాగులో రైతులకు తగిన సూచనలిస్తూ సాయంగా నిలవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. గురువారం ఆయన స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధనా స్థానంలోని పంట ప్రదర్శన క్షేత్రాలు, ప్రయోగశాలలు, విత్తన యూనిట్లను పరిశీలించారు. క్షేత్రంలో సాగు చేస్తున్న విత్తన వేరుశనగ రకాలు, దిగుబడి, సాంకేతికత, రైతులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కదిరి పరిశోధనా స్థానంలో ఉత్పత్తయిన వేరుశనగ వంగడాలు దేశంలోని ఎంతో ఖ్యాతిగాంచాయని ప్రధాన శాస్త్రవేత్త భాస్కర్రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ, శాస్త్రవేత్త కిరణ్కుమార్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కర్మాగారంలో ప్రమాదం తాడిపత్రి టౌన్: మండలంలోని అయ్యవారిపల్లి వద్ద ఉన్న సుగుణ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. ద్రవరూపంలో ఉన్న ఇనుము కార్మికులపై పడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కంబగిరి రాముడు, సునీల్, జార్జ్ ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గుట్టుగా ఉంచింది. క్షతగాత్రులను తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రహస్యంగా మరో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కార్మికులతో పని చేస్తుండటంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ధనియానిచెరువు గ్రామంలో పంటలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్యాంప్రసాద్ కలెక్టర్ శ్యాంప్రసాద్ -
ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్ర
నల్లమాడ: మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్పరం చేయడం ద్వారా పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. నల్లమాడ మండలం చారుపల్లిలో గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యర్రవంకపల్లి, రెడ్డిపల్లి, వేళ్లమద్ది, కొండకింద తండా, పాతబత్తలపల్లి పంచాయతీలోని నల్లసింగయ్యగారిపల్లిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో శ్రీధరరెడ్డి మాట్లాడారు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే, ఆ పథకాన్ని మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఏడాదిన్నర పాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించామన్నారు. మళ్లీ ఆ సువర్ణ పాలనను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని, కోటి సంతకాల కార్యక్రమం ద్వారా చంద్రబాబు వైఫల్యాలను నిలదీద్దామంటూ పిలుపునిచ్చారు. కాగా, శ్రీధరరెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయా గ్రామాల్లో విశేష స్పందన లభించింది. నాయకులు, కార్యకర్తలే కాకుండా వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో సంతకాలు చేయడానికి ఆసక్తి చూపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట సంయుక్త కార్యదర్శి పొరకల రమణ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్హెచ్ బాషా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్ కేశప్ప, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, మాజీ ఎంపీపీ జయరామిరెడ్డి, వైస్ ఎంపీపీ కె.సూర్యనారాయణ, సర్పంచ్లు ప్రమీలమ్మ, రజనీకాంత్రెడ్డి, ప్రసాద్, బొజ్జేనాయక్, ప్రమీలబాయి, మాసే రెడ్డెమ్మ, మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జయమ్మ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాజేంద్రనాయక్, చారుపల్లి పంచాయతీ పరిశీలకులు గోవిందరెడ్డి, మాజీ డీలర్లు మధుసూదన్రెడ్డి, యర్ర సూరి, నాయకులు కాళసముద్రం జయరామిరెడ్డి, పుల్లారెడ్డి, రామలింగారెడ్డి, భాస్కర్రెడ్డి, ఎంసీ బయపరెడ్డి, రమణారెడ్డి, సీతారాం, వేళ్లమద్ది హరి, మంగేనాయక్, చంద్రశేఖర్, షరీఫ్, చిన్నా, సుధాకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
తాడిమర్రి: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్యవిద్యను అభ్యసించాలనుకునే వారికి మేలు చేసేలా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ప్రతి పంచాయతీలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు ఉండగా... వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. తన హయాంలోనే 5 కళాశాలను పూర్తి చేశారన్నారు. మిగిలిన 12 కళాశాలలు కూడా అందుబాటులోకి వస్తే వేలాది మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుందన్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని కేతిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మేధావులు, యువత ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును ఖండించాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిందని, కార్యక్రమం అనంతరం ఆ పత్రాలను గవర్నర్కు అందిస్తామని కేతిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు జొల్లిరెడ్డి అశ్వత్థ, బీసీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు కుంటాల పుల్లయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పొరాళ్ల విజయభాస్కర్రెడ్డి, అగిలే శంకర్రెడ్డి, మండల కన్వీనర్ ఆర్వేటి రామాంజనేయులు, యువజన విభాగం మండల అధ్యక్షుడు సిద్దే మోహన్రెడ్డి, సచివాలయాల కన్వీనర్లు మల్లప్పగారి మాధవరెడ్డి, అల్లే సాయినాథ్రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షలు కొండారుపల్లి విశ్వనాథ్, సల్లాపురం బాలరమణారెడ్డి, యలక శ్రీనివాసరెడ్డి, గుజ్జల హనుమంతు, పిట్టు పరమేశ్వర్రెడ్డి, పాటిల్ ప్రకాష్రెడ్డి, హనుమంతరెడ్డి, సన్నప్పయ్య, రాజేష్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఆత్మకూరు, నార్శింపల్లి సర్పంచులు కటనారాయణరెడ్డి, నారాయణస్వామి, కో ఆప్షన్ సభ్యులు బాబా ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి -
సత్యసాయి శత జయంతి వేడుకలకు రాష్ట్రపతికి ఆహ్వానం
ప్రశాంతి నిలయం: త్వరలో జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు కలసి ఆహ్వానించారు. ట్రస్ట్ అందిస్తున్న విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక సేవల గురించి రాష్ట్రపతికి వివరించారు. ఒడిశాలో సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేసినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్రపతిని ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మల్లికా శ్రీనివాస్ కూడా కలిశారు. గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లుగుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య (07498) ఈ నెల 18వ తేదీ మాత్రమే రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు బేగంపేట, వికారాబాద్, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుతుందన్నారు. ధర్మవరం–షోలాపూర్ (01438) ఈ నెల 18న శనివారం మాత్రమే ధర్మవరం జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. కదిరి, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, వికారాబాద్, బీదర్ మీదుగా షోలాపూర్ చేరుతుందన్నారు. -
ఆదాయం ఎర.. దోపిడీ పరంపర
చిలమత్తూరు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టపక్కల వాళ్లను జత చేస్తే బోనస్లు.. బ్యాంక్ ఖాతాలోకి తెరతెరలుగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండడంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త ఖాతాలు పెరగడంతో పాటు వ్యాపారమూ ఊపందుకుంది. అంతా సజావుగా సాగిపోతోందనుకుంటుండగానే రాత్రికి రాత్రి మాయమైంది. ఇది జిల్లాలో సరికొత్తగా వెలుగు చూసిన ఆన్లైన్ మోసం. ఈ చైన్ లింక్ వ్యవహారాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారు రూ.లక్షల్లో నగదు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఆదాయాన్ని ఎరగా చూపి దోపిడీ చేసే యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యాప్ల ఉచ్చులో మహిళలే ఎక్కువగా చిక్కుకుంటున్నారు. తొలుత డబ్బు తమ ఖాతాలకు జమ అవుతుంటే సంతోషపడిన మనసులు, ఆఖరుకు మోసపోయామని తెలుసుకుని లబోదిబో మంటున్నాయి. తెలివైన వాళ్లు ఆదిలోనే ఆదాయం రాగానే ఆపేస్తుండగా, తాజాగా జిల్లాలో చాలా మంది ఈజీ మనీ కదా అని ఎల్జీ డిజిటల్ మీడియా యాప్ ఉచ్చులో చిక్కుకుని రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. రూ. వందల్లో పెట్టుబడి పెట్టి ప్రచార వీడియోలు చూస్తే రూ.వేలల్లో బ్యాంక్ ఖాతాలకు నగదు జమ అవుతుందని వాట్సాప్ నంబర్కు విదేశీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ను చూసి చాలా మంది బోల్తాపడ్డారు. ముందుగా వారు చెప్పినట్లుగానే వెబ్సైట్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొంత మొత్తాన్ని తొలుత పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత కొంత మొత్తం వాలెట్లో కనిపించింది. ఈ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉండడంతో చాలా మంది ఎంతో బాగుందని అనుకున్నారు. ఇదే విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పి వారిని కూడా ఉచ్చులోకి లాగేశారు. చైన్లింక్లో సభ్యులను చేర్పిస్తే బోనస్లు, ఇన్సెంటివ్లు అంటూ ఊరించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా చేరుతూ వచ్చారు. ఎందుకు నగదు జమచేస్తున్నామో తెలియకుండానే పెట్టుబడి పెడుతూ వెళ్లారు. చివరకు సైట్ మూసేయడంతో తాము మోసపోయినట్లుగా తెలుసుకుని ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ముదురుతున్న చైన్లింక్ వ్యవహారం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫేక్ కంపెనీలు రూ.లక్షలు పోగొట్టుకుంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఫేక్ కంపెనీలు ఇచ్చే ప్రకటనలను చూసి విద్యావంతులు సైతం మోసపోతున్నారు. ఇది దురదృష్టకరమన్నారు. పనికి తగ్గ వేతనం ఉంటుంది. అయితే పనీపాట లేకుండా ప్రకటన వీడియోలు చూస్తూ డబ్బు సంపాదించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోతున్నట్లుగా తెలుసుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – జనార్దన్, సీఐ, హిందూపురం రూరల్ సర్కిల్ ఈజీ మనీ కదా అనుకుంటే.. ప్రస్తుతం ఎటు చూసినా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం ఈ మోసాల బారిన పడి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. -
యువకుడి దుర్మరణం
పెనుకొండ: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణ లోని షాద్నగర్కు చెందిన సేవేనాయక్... ఐచర్ వాహన డ్రైవర్గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు రమేష్నాయక్ (25)తో కలసి ఐచర్ వాహనంలో సరుకు లోడు చేసుకుని బుధవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై యోగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే అప్పటికే రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఐచర్ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనుకొండ పీఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సేవేనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తా – బాలుడి మృతి పెనుకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని రాజేంద్రనగర్కు చెందిన ఓ కుటుంబం పెనుకొండ బాబయ్య దర్గా దర్శనానికి గురువారం ఆటోలో బయలుదేరింది. పెనుకొండ మండలం హరిపురం వైజంక్షన్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇర్షాద్ (11) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన షబ్రీన్, వదిహ, మహబూబీను స్థానికులు వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న షబ్రీన్ను హిందూపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వరుస దొంగతనాలు పావగడ: తాలూకాలోని తిరుమణి గ్రామంలో పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో పట్టపగలే వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. కిలారి వెంకటేశ్ తన కుమారుడి వివాహానికి సంబంధించి పెళ్లి పత్రికలు పంచేందుకు గురువారం కళ్యాణదుర్గం వెళ్లారు. ఇంటికి తాళం వేసి భార్య నారాయణమ్మ వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఉదయం 9 గంటల సమయంలో తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ .2.70 లక్షల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. అలాగే కిలార్లహళ్లి గ్రామంలో బ్యాడనూరు చంద్రశేఖర్ ఆచారీకిచెందిన రీవైండింగ్ దుకాణంలో దుండగులు చొరబడి రూ.3 లక్షల విలువైన 2 కొత్త మోటార్లు, 3 రీవైండింగ్ మోటార్లు, 5 బాక్సుల కేబుల్ను అపహరించారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే ఉద్యోగి బలవన్మరణం పెనుకొండ: తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం రాలేదంటూ ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్తాన్కు చెందిన లోకేష్ మీనా (29) 2022లో రైల్వే గేట్మెన్గా ఎంపికై పెనుకొండలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఉన్నత చదువులు అభ్యసించిన తాను పలు ప్రయత్నాలు చేసిన అందుకు తగిన ఉద్యోగం రాలేదనే మానసిక వేదనలో ఉండేవాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు క్రితం భార్య రాజస్తాన్కు వెళ్లింది. దీంతో రైల్వే క్వార్టర్స్లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న లోకేష్ మీనా బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి విధులకు హాజరు కాకపోవడంతో తోటి ఉద్యోగితో పాటు ఉన్నతాధికారులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. గురువారం ఉదయం సైతం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ఉద్యోగులు ఇంటి వద్దకు చేరుకుని కిటికిలో నుంచి చూడడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యులు రాజస్తాన్లో ఉండడంతో ప్రతి అంశాన్ని పోలీసులు వీడియో తీశారు. కుటుంబసభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. కారు దగ్ధం పెనుకొండ రూరల్: స్థానిక 44వ జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కియా పోలీసులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం పెనుబోలుకు చెందిన చంటి వ్యక్తిగత పనిపై బుధవారం రాత్రి కారులో బెంగళూరు వైపు బయలుదేరాడు. గుట్టూరు సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చంటి అప్రమత్తమై కారులో నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న కియా పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే లోపు కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు కియా పోలీసులు తెలిపారు. -
తీరని యూరియా కష్టాలు
రొద్దం: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. కూటమి సర్కార్కు సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయమే మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నా కావాల్సినంత యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. గురువారం రొద్దం పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ ఉంటుందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజాము 5 గంటలకే అక్కడికి చేరుకుని క్యూ కట్టారు. అయితే 560 బస్తాల యూరియా మాత్రమే సరఫరా కావడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 180 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారంతా మధ్యాహ్నం తర్వాత ఉసూరుమంటూ వెనుదిరిగారు. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. చివరకు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలపైనా పోలీసులను ప్రయోగిస్తున్నారు. హైదరాబాద్లోని ‘సాక్షి’ కార్యాలయంలో నెల్లూరు పోలీసులు మితిమీరి ప్రవర్తించారు. జర్నలిస్టులను భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవాలనే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా ఈ చర్యలను ఖండించాలి. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
టీచర్ల కొరత నివారించండి : ఎస్టీయూ
పుట్టపర్తి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న నూతన ఉపాధ్యాయులను పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నియమించారని, ఫలితంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాదరెడ్డి అన్నారు. వెంటనే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత నివారణకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని డీఈఓ కృష్ణప్పను కోరారు. ఈ మేరకు బుధవారం డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. కొత్త టీచర్ల నియామకం తర్వాత కూడా ఈ సమస్య అలాగే కొనసాగడం విచారకరమన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్, లాంగ్యేజ్ పండిట్ల కొరత ఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ల కొరత ఉందన్నారు. గత సంవత్సరం 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు నూరు రోజుల కార్యక్రమంలో భాగంగా సెలవు దినాల్లోనూ పనిచేయాల్సి వచ్చిందన్నారు. వారికి లీప్ యాప్లో సీసీఎల్ ఇన్సర్ట్ చేసి వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి మూల్యాంకనం విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు టీఏ, డీఏ జమ చేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు, కొత్తచెరువు మండల శాఖ అధ్యక్షుడు శివయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో వ్యక్తి మృతదేహం
కనగానపల్లి: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం కనగానపల్లి మండలం బాలేపాళ్యం సమీపంలో కాలువలో బయటపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన నాగభూషణ (65) రెండు రోజుల క్రితం పంపనూరు వద్ద హంద్రీనీవా కాలువలో ఈ కొడుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కాలువ వెంబడి పరిశీలిస్తూ ముందుకు సాగారు. బాలేపాళ్యం సమీపంలో హంద్రీనీవా కాలువలో బుధవారం కనిపించిన మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
కలంపై కూటమి కక్ష
● హైదరాబాద్లోని ‘సాక్షి’ కార్యాలయంలో సోదాలు ● నోటీసులిచ్చే పేరుతో గంటల తరబడి హంగామా ● కూటమి సర్కార్ తీరుపై మేధావుల మండిపాటు సాక్షి, పుట్టపర్తి నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది. పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. బుధవారం హైదరాబాద్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన నెల్లూరు పోలీసులు సోదాల పేరుతో వెళ్లి.. గంటల తరబడి తిష్టవేసి జర్నలిస్టులను భయపెట్టాలని చూశారు. ఈ చర్యలను మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. రాజ్యాంగానికి నాల్గో స్తంభంగా నిలిచిన పత్రికలకు సంకెళ్లు వేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేసినా.. బెదిరించే విధంగా మెసేజీలు పంపినా.. ఇళ్లలో చొరబడి సోదాలు చేసినా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పాత్రికేయులకు స్వేచ్ఛ లేకుంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. -
తమ్ముడా మజాకా
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన తాడాల నాగభూషణం నాలుగు చక్రాల వాహనాల మెకానిక్గా పని చేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని మానసిక వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందాడు. అప్పట్లో వైద్యులపై ఒత్తిడి చేయించి ఈ సర్టిఫికెట్ పొందాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నాడు. తొలుత నెలకు రూ.1,500 వచ్చేది. ఆ తర్వాత రూ.3 వేలు, ఇప్పుడు రూ.6 వేలు వస్తోంది. మానసిక రోగి...ఇంత యాక్టివ్ ఎలా? ఈయన మానసిక రోగిగా ఉంటూ ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నాడనేది ప్రశ్న. అంతేకాదు రాప్తాడు ఆటోనగర్ ప్రెసిడెంట్గానూ పని చేశాడు. ప్రస్తుతం గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్న టీఎన్టీయూసీ పార్లమెంటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. నాగభూషణం అక్రమంగా పొందుతున్న పింఛన్పై గతంలోనూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వందశాతం వైకల్యం కల్గిన అసలైన బాధితుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు.. తాడాల నాగభూషణం వంటి వారి విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మానసిక వికలాంగుల కేటగిరీలో పింఛన్ టీఎన్టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం నిర్వాకం ఇదిగో ఈ ఫొటో బాగా పరిశీలించండి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవల రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ‘ఆటోడ్రైవర్ సేవలో’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తి (సర్కిల్లో) టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం. ఈయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడట! దివ్యాంగ కోటాలో (పింఛన్ ఐడీ 112723626) ప్రతినెలా రూ.6 వేల పింఛను తీసుకుంటున్నాడు. ఇటీవల జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో 9,601 మందికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వారందరూ మరోమారు వైద్యుల వద్ద వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. వీరిలో చాలామంది తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ జాబితాలో టీఎన్టీయూసీ నేత తాడాల నాగభూషణం పేరు మాత్రం లేదు. -
ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుటి నుంచి పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. తమ అవినీతిని, అరాచకాలను, దౌర్జన్యాలను వెలుగులోకి తెస్తున్నారని కూటమి నేతలు ‘సాక్షి’పై కక్షగట్టారు. నోటీసులు పేరుతో వేధిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్కు నోటీసులు అందించే పేరుతో నెల్లూరు పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉంది. ప్రభుత్వాల తీరు మారాలి. – శంకర నారాయణ, మెంబర్, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ -
ఉచితం మోయలేక మొరాయింపు
ధర్మవరం రూరల్: సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రతి బస్సూ కిటకిటలాడుతోంది. ఒక బస్సులో 49 మందికి పరిమితి ఉంటే 100 నుంచి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. తాజాగా బుధవారం అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా అధిక సంఖ్యలో ప్రయాణికులతో పుట్టపర్తికి బయలుదేరిన బస్సు ధర్మవరం రైల్వే స్టేషన్కు చేరుకోగానే ముందుకు కదలలేనంటూ మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఆటోలలో గమ్య స్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. బొలెరోపై దూసుకెళ్లిన కంటైనర్ తనకల్లు: బొలెరో వాహనంపై కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... తనకల్లు మండలం దండువారిపల్లికి చెందిన రెడ్డిశేఖర్రెడ్డి, మహదేవ్ బుధవారం టమాట పంటను బొలెరో వాహనంలో లోడు చేసుకుని అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు బయలుదేరారు. సీజీ ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే టైర్లలో గాలి కొట్టించేందుకు రోడ్డు పక్కన ఉన్న పంక్చర్ షాపు వద్ద ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్... బొలెరో మీదుగా దూసుకెళ్లింది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. రెడ్డిశేఖర్రెడ్డి, మహదేవ్ తీవ్ర గాయాలతో క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు అశోక్, శ్రీనాథ్, తండేల్, నవీన్, మణి, స్థానికులు అక్కడకు చేరుకుని క్రేన్, జేసీబీ సాయంతో క్షతగాత్రులను వెలికి తీశారు. అనంతరం తమ ఉచిత అంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి వందేమాతరం టీం సభ్యులు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కదిరికి తీసుకెళ్లారు. బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి రొళ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం గోవిందాపురంగొల్లహట్టి గ్రామానికి చెందిన సిద్ధప్ప (48) దేవరాజు బుధవారం ఉదయం రొళ్లకు వచ్చారు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కొడగార్లగుట్ట క్రాస్ వద్దకు చేరుకోగానే జీడీ పాళ్యం గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం నుంచి ద్విచక్ర వాహనంపై రొళ్లగొల్లహట్టి చెందిన వెంకటేష్ జాతీయ రహదారి పైకి చేరుకున్నాడు. అప్పటికే అతి సమీపంలోకి చేరుకోవడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో వెంకటేష్ బైక్ను ఢీకొని ముగ్గురూ కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో సిద్ధప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజు, వెంకటేష్ను హైవే అంబులెన్స్ వాహనంలో మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
● మరో రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన పుట్టపర్తి అర్బన్: ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. 9 మండలాల పరిధిలో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. బుక్కపట్నం మండలంలో 16.4 మి.మీ, కొత్తచెరువు మండలంలో 11.6 మి.మీ, అమడగూరు 5.4, పుట్టపర్తి 4.6, సోమందేపల్లి 3.4, ఓడీచెరువు 2.4, నల్లచెరువు 2.2, తనకల్లు 2, పెనుకొండ మండలంలో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో మరో రెండు రోజులూ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రశాంతి నిలయం: జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏపీఐఐసీ రూపొందించిన ‘ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ డ్రైవ్’ పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పారిశ్రామిక వాడల్లో నెల రోజుల పాటు డ్రైవ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక వాడల్లో పారిశుధ్యం, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే కొత్త పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై పారిశ్రామిక వేత్తలతో సదస్సులు నిర్వహించడం... ప్రస్తుతమున్న పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల అధునికీకరణపై శ్రద్ధ తీసుకోవాలని ఏపీఐఐసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రేపు మడకశిరకు రాకమడకశిర: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న శుక్రవారం మడకశిరలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1 గంటకు మడకశిర వద్ద రాయదుర్గం–తుమకూరు రైల్వేలైన్ పనుల పురోగతిని పరిశీలించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అలాగే పావగడ నియోజకవర్గంలోనూ రైల్వే లైన్ పనుల పురోగతిని పరిశీలించనున్నట్లు సమాచారం. -
నిజాలు రాస్తే కక్ష గడతారా?
నిజాలు ప్రజల ముందుంచే పత్రికలపై కేసులు పెట్టి వేధించడం ఆక్షేపనీయం. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. ఎడిటర్కు నోటీసులిస్తామని హైదరాబాదులోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన నెల్లూరు పోలీసులు హల్చల్ చేశారు. గంటల తరబడి కార్యాలయంలో తిష్టవేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇలాంటివి ఉపేక్షించబోం. పత్రికలపైనా, విలేకరులపైనా పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోం. ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. – రామాంజనేయులు, అధ్యక్షుడు, హిందూపురం ప్రెస్క్లబ్ -
బస్సులన్నీ కర్నూలు వైపే!
ధర్మవరం: ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అధికారులు ఇష్టారాజ్యంగా తరలించారు. జన సమీకరణలో భాగంగా బుధవారమే ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండులన్నీ బస్సులు లేక బోసిపోయాయి. బస్సులు వస్తాయని ప్రయాణికులు గంటల కొద్ది వేచి చూశారు. చివరకు విషయం తెలుసుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి 250కు పైగా బస్సులను అధికారులు తరలించగా, ఇందులో ఒక్క ధర్మవరం డిపోకు చెందిన 51 బస్సులు ఉండడం గమనార్హం. ● కొత్తచెరువు: పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్, మంగళకర విద్యా సంస్థలో చదువుకుంటున్న కొత్తచెరువు మండలానికి చెందిన విద్యార్థినులు దాదాపు వంద మంది బుధవారం బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ నెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బస్సులను ముందు రోజే తరలించడంతో ఈ సమస్య నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ప్రకృతి వ్యవసాయం భేష్
పుట్టపర్తి అర్బన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా ఉందని జర్మనీ ప్రతినిధుల బృందం కితాబునిచ్చింది. బుధవారం చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలిసి జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అక్రెమన్, హైదరాబాద్ కౌన్సిల్ జనరల్ అమిత దేశాయ్, సీనియర్ సెక్టార్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్, ప్రకృతి వ్యవసాయం సీనియర్ అడ్వైజర్లు మురళీధర్, వరప్రసాద్, వైఎస్సార్ కడప, పులివెందులకు చెందిన అధికారులు పుట్టపర్తి మండలం పెడపల్లి, పెద్దతండాల్లో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో ముచ్చటించారు. పెడపల్లి పెద్ద తండాకు చెందిన రైతు ఆంజనేయులు నాయక్ పొలంలో జీవామృతం, ఘనామృతం తయారీ విధానాన్ని జర్మనీ బృందం సభ్యులు అడిగా తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతు విజయలక్ష్మి బాయి సాగు చేసిన వేరుశనగ, జొన్న, సజ్జ, చిక్కుడు, ఆముదం, మొక్కజొన్న, ఆకు కూరలు, పెసర, అలసంద పంటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాజహాన్ పండిస్తున్న వరి మడిని పరిశీలించారు. ముఖ్యంగా చిరుధాన్యాల సాగుతో లాభాలు బాగున్నాయని తండా వాసులు వివరించారు. అనంతరం జర్మనీ బృందం సభ్యులు, అధికారులతో కలిసి చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనాన్ని ఆరగించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, నవధాన్యాల సాగు, జీవామృతం, ఘనామృతం, సీడ్ ట్రీట్మెంట్, భూమికి వేసే ఎరువులు, రోగాలు వచ్చే ముందు, వచ్చిన తర్వాత వినియోగించే మందుల పిచికారీ విధానాలను ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్ జర్మనీ బృందం సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్, జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, పశుసంవర్ధకశాఖ అధికారి శుభదాస్, తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి, ఏడీఏలు కృష్ణమీనన్, స్వయంప్రభ, ఏఓలు, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ● జర్మనీ ప్రతినిధుల బృందం కితాబు -
నాగమణిపై తదుపరి చర్యలొద్దు
చిలమత్తూరు: టీడీపీ నేతలు అక్రమ కేసులతో మానసిక వేధింపులకు గురైన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణికి హైకోర్టు ఊరట కల్పించింది. ఆమైపె ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండించినందుకు కేసు.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి ఖండించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో స్థాయికి తగ్గట్టు నడుచుకోవాలని హితవు పలికారు. దీనిపై కొందరు టీడీపీ మహిళా నాయకురాళ్లు నాగమణిపై హిందూపురం వన్టౌన్ పోలీసు స్టేషన్లో సెప్టెంబర్ 27వ తేదీన ఫిర్యాదు చేయగా... పోలీసులు కనీసం విచారించకుండానే కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ గౌరవాధ్యక్షుడు, న్యాయవాది జల్లా సుదర్శన్రెడ్డి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం నాగమణిపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం హిందూపురంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు వెళ్లిన న్యాయవాదులు ఇందాద్, వేణుగోపాల్, అతిక్లు హైకోర్టు ఉత్తర్వుల కాపీని సీఐ రాజగోపాల్ నాయుడుకు అందించారు. దీంతో సీఐ మహిళా నేత నాగమణికి బీఎన్ఎ–35 కింద నోటీసులు అందించారు. అనంతరం నాగమణి మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసు నమోదు కాగా, వైఎస్సార్ సీపీ పెద్దలు అండగా నిలిచి ధైర్యం చెప్పారన్నారు. కోర్టు కూడా ఈ అక్రమ కేసుపై తగిన విధంగా స్పందించిందన్నారు. త్వరలోనే కేసు కూడా వీగిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. పోలీసులకు హైకోర్టు ఆదేశం -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
అనంతపురం అర్బన్: చట్టాల అమలు, హక్కుల సాధనకు ఉద్యమించాలని మహిళలకు ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ఐద్వా 16వ రాష్ట్ర మహాసభలకు రెండవ రోజు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మనువాదం అమలుకు ప్రయత్నిస్తూ మహిళల హక్కులను హరించేందుకు సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమూ బీజేపీతో కలిసి పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమై ప్రజలను ఐక్యపరిచే విధంగా ఐద్వా కృషి చేయాలన్నారు. మహిళలు పనిచేసే చోట సరైన భద్రత లేదన్నారు. కనీస వేతనం అమలు కావడవం లేదన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర క్రియాశీలకమన్నారు. ప్రధానంగా పాడిరంగంపై ఆధారపడిన మహిళలు అధికంగా ఉన్నారన్నారు. పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు సరిగ్గా లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దళితులు, మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకురాళ్లు రమాదేవి, హేమలత, రాణి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, ఆవాజ్ రాష్ట్ర కార్యద్శి చిస్తి మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్, జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతమ్మ, కోశాధికారి సావిత్రి పాల్గొన్నారు. ఐద్వా మహాసభల్లో జాతీయ కార్యదర్శి ధావలే -
మళ్లీ దగాపడిన మహిళలు
పెనుకొండ: చంద్రబాబు పాలనలో ప్రతిసారీ దగాపడుతూ వచ్చిన మహిళలు... తాజాగా మరోసారి మోసపోయారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంచుతామని, ఇందు కోసం ప్రభుత్వం తరఫున కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టుమిషన్లు అందజేస్తామంటూ గొప్పలకు పోయిన ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కుట్టు శిక్షణ కేంద్రాలు మూడు నెలలు తిరక్కనే మూతపడ్డాయి. శిక్షణ పొందిన వారికి కుట్టుమిషన్లు అందజేయకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా... కుట్టు శిక్షణ ఇచ్చి హామీ నెరవేర్చకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముచ్చటగా మూడు నెలలే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల అనంతరం మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కుటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి అజిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న మొత్తం 85 కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేశారు. 18 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 9,500 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం బీసీ కార్పొరేషన్ అందించే రుణాలతో తమ బతుకుల్లో వెలుగులు నిండుతాయని అందరూ భావించారు. ఎంతో ఆశతో 3 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్లుమిషన్లు, రుణాలు అందజేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకుని 4 నెలలు దాటినా ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ కుట్టు మిషన్ అందలేదు. నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం కానీ, మంత్రులు కాని పెదవి విప్పక పోవడం గమనార్హం. అతివల ఆర్థిక స్వావలంబనకు తూట్లు ప్రచారార్భటంతోనే సరిపెట్టిన కూటమి సర్కార్ ఉమ్మడి జిల్లాలో 85 కేంద్రాల్లో 9,500 మంది మహిళలకు కుట్టు శిక్షణ మూతపడిన కేంద్రాలు.. కనిపించని కుట్టుమిషన్ల జాడ ముగ్గురు మంత్రులు ఉన్నా మహిళలకు అన్యాయమేసిబ్బందికీ అందని వేతనాలు ఒక్కో శిక్షణా కేంద్రానికి ఒక శిక్షకుడితో పాటు, కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. పెనుకొండ నియోజకవర్గంలోని 28 సెంటర్లకు మాత్రం ఇద్దరు టీచర్లను నియమించారు. వీరికి శిక్షణ అందించే టీచర్కు నెలకు రూ. 15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్కు రూ. 12 వేలు వేతనం ఇవ్వాలి. 3 నెలల్లో సిబ్బందికి అరకొర వేతనాలు ఇచ్చి మిగిలిన వేతనాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమ, చేనేత జౌళీశాఖ మంత్రి సవిత, వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ ఉన్నా.. మహిళలకు మాత్రం న్యాయం జరక్కపోవడం విశేషం. ఇది నిరవధిక ప్రక్రియ అని మంత్రులు ప్రారంభ సమయంలో పేర్కొన్నారు. అయితే మొదటి విడతకే నిధులు విడుదల కాక దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక రెండో విడత ఎలా మొదలు పెడతారో మంత్రులే చెప్పాలి. -
యానిమేటర్ చేతివాటంపై విచారణ
రొళ్ల: మండలంలోని జీబీహళ్లి గ్రామంలో యానిమేటర్ తిమ్మరాజు చేతివాటంపై మంగళవారం మధ్యాహ్నం డీపీఎ అరుణకుమారి విచారణ చేపట్టారు. తనకు నగదు అవసరముందని, పొదుపు సంఘాల సభ్యుల పేరుమీద బ్యాంకుల ద్వారా మంజూరైన రుణం తీసుకుని తానే చెల్లిస్తానంటూ నమ్మబలికి రెండేళ్లుగా చెల్లించకుండా తిమ్మరాజు చేసిన మోసంపై పలువురు సభ్యులు రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీపీఎం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తిమ్మరాజుతో పాటు బాధిత జేకే మారుతి, ధనలక్ష్మి పొదుపు సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. తమ పేరుపై రెండేళ్ల క్రితం మంజూరైన రూ.4 లక్షల రుణాన్ని తిమ్మరాజు తీసుకున్నాడని సభ్యులు ఆధారాలతో సహా చూపించారు. రెండేళ్లుగా అసలు, వడ్డీ చెల్లించకుండా ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న మొత్తానికి ఇప్పటి వరకూ అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.6.5 లక్షలకు పైగా అవుతుందని యానిమేటర్పై చర్యలు తీసుకుని రుణం మొత్తాన్ని చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అయితే తాను రూ.2.5 లక్షలు మాత్రమే చెల్లిస్తానంటూ తిమ్మరాజు తెలపడంతో, అలా కుదరదని మొత్తం చెల్లించాల్సిందేనంటూ సభ్యులు మండిపడ్డారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించిన అనంతరం మొత్తం డబ్బు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని డీపీఎం హామీనిచ్చారు. వారం రోజుల్లోపు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని యానిమేటర్ తిమ్మరాజును హెచ్చరించారు. కార్యక్రమంలో వెలుగు అధికారులు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఉద్యాన అభివృద్ధికి కేంద్రం సహకారం
అనంతపురం అగ్రికల్చర్: క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్హెచ్బీ) సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కన్సల్టెంట్ విద్యాశంకర్ తెలిపారు. మంగళవారం అనంతపురంలోని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్తో కలిసి అధికారులు, రైతులు, ఎంటర్ప్రెనూర్స్కు వర్క్షాపు నిర్వహించారు. విద్యాశంకర్ మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటికే అరటి పంటను క్లస్టర్ కింద ఎంపిక చేసి ఎస్కే సంస్థ, ప్రెష్కార్టు సంస్థలకు సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చామన్నారు. జిల్లా పరిధిలో కనీసం రూ.100 కోట్లు విలువ చేసే పంటను ఎంపిక చేసుకుని ముందుకు వచ్చే సంస్థలు, ఎఫ్పీఓలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 20 శాతం వాటా భరిస్తే... 20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, చీనీ, అరటి, టమాట, మిరప, కర్భూజా, కళింగర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. దీని వల్ల ఎఫ్పీఓలు, సంస్థలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు ఉంటాయన్నారు. నాణ్యమైన పంట పండించడంతో పాటు బ్రాండింగ్ ద్వారా మార్కెటింగ్ పరిస్థితి మెరుగై ఎగుమతుల ద్వారా ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. వర్క్షాపులో రాష్ట్ర ఉద్యానశాఖ కన్సల్టెంట్ విద్యాశంకర్ -
ఊరుబావిని శుభ్రం చేయించండి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్ పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంకటగారిపల్లిలో ఉన్న ఊరుబావిని శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం వెంకటగారిపల్లి గ్రామంలో చేపట్టిన ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. డీపీఓ సమత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుభ్రత, పర్యావరణ సంరక్షణ, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని ఊరుబావి వర్షపు నీళ్లతో నిండుగా ఉందని, వెంటనే శుభ్రం చేయిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. బావిలోకి చెత్తాచెదారం వేయకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను ఆరోగ్యంగా తీర్చి దిద్దడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శుభదాస్, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు చిన్నారులను రక్షించిన పోలీసులు పాకాల: తప్పిపోయి రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరు చిన్నారులను చిత్తూరు జిల్లా పాకాల పోలీసులు కాపాడారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన మోహన్రాజ్ కుమారుడు కుమ్మర వరుణ్, సురేంద్ర కుమారుడు సి.తరుణ్ ఈ నెల 11న తప్పిపోయినట్టు తల్లిదండ్రులు సీకేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాకాల రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన చిన్నారులను గమనించిన రైల్వే పోలీసుల సమాచారంతో పాకాల పోలీసులు అక్కడకు చేరుకుని వారిని ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ అనంతరం సీకేపల్లి మండలానికి చెందిన వారుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో సీకేపల్లి పోలీసులు మంగళవారం పాకాలకు చేరుకుని చిన్నారులను ఆధీనంలోకి తీసుకున్నారు. -
ఆ గ్రామంలో పాఠశాల మధ్యాహ్నం వరకే!
బత్తలపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాలి. అయితే బత్తలపల్లి మండలం సంగాల గ్రామంలో మధ్యాహ్నం వరకే నిర్వహిస్తుండడం గమనార్హం. పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం తర్వాత విద్యార్థులను ఇంటి దారి పట్టించి తన దారిన తాను వెళ్లిపోతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై విద్యాధికారులు పర్యవేక్షణ లోపించడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. విషయంపై ఎంఈఓ–2 సుధాకర్నాయక్ను వివరణ కోరగా.. సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. సమస్య ఏమిటో తెలుసుకుని ఉపాధ్యాయుడితో ఆరా తీస్తామన్నారు. -
కుట్టుమిషన్లు అందించాలి
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వెంటనే కుట్టుమిషన్లు అందజేయాలి. 4 నెలలు గడుస్తున్నా వారికి ఎలాంటి మిషన్లు అందించకపోవడం, ఆర్థిక సహకారం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. – బాబావలి, సీఐటీయూ మండల కార్యదర్శి, పెనుకొండ నిధులు మంజూరు కాలేదు కుట్టు శిక్షణ పూర్తయి 3 నెలలు కావస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. నిధులు మంజూరైన వెంటనే శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తాం. అనంతరం రెండవ విడత శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తాం. సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా● -
ఆశపెట్టి.. మోసగించి!
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త విధానాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేయవచ్చునంటూ వల విసిరి రూ.లక్షలు దోచేశారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా పార్ట్టైమ్ జాబ్లంటూ మోసాలకు తెగబడ్డారు. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు లబోదిబోమంటూ మిన్నకుండిపోతున్నారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి.ధర్మవరం అర్బన్: ఆన్లైన్ పార్ట్టైమ్ జాబ్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో సత్యసాయి జిల్లా యువత చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆన్లైన్ జాబ్ సైట్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్, పత్రికల్లో నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోతోంది. వీరిలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నారు. ఇంట్లో ఉన్నవారే లక్ష్యం వర్క్ ఫ్రమ్ హోం పై మక్కువ పెంచుకున్న యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు వేలాది రూపాయలు సంపాదించే జాబ్లు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించి ఆకర్షిస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో డబ్బు కట్టించుకుని ఆ తర్వాత బోర్డు తిరగేయడం షరా మాములైంది. తమనే నష్టపరిచారంటూ బ్లాక్ మెయిల్ జిల్లాలో రకరకాల డేటా ఎంట్రీ స్కామ్స్ వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ స్కిల్స్ అవసరం లేదని, సింపుల్గా డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బు సంపాదించవచ్చని నమ్మబలుకుతారు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు రూపంలో పేమెంట్ చేయించుకుంటారు. డేటా ఎంట్రీ అనంతరం అందులో తప్పులున్నాయని, దాని వల్ల తమ సంస్థ నష్టపోయిందని, పరిహారం చెల్లించకపోతే లీగల్ ప్రొసీడింగ్స్కు వెళతామని బెదిరింపులకు దిగుతూ పెద్ద మొత్తంలో నగదు లూటీ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. » నెలకు రూ.60 వరకు జీతం అందిపుచ్చుకుంటున్న ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి... తీరిక వేళల్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఆన్లైన్ టాస్్కలో పాల్గొన్నాడు. మొదట దాదాపు రూ.15వేల వరకు నగదు అతని ఖాతాకు బదిలీ అయింది. దీంతో పూర్తిగా నమ్మి అవతలి వ్యక్తుల డిమాండ్ మేరకు నగదు బదిలీ చేస్తూ రూ.2.75లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోతున్నట్లుగా నిర్ధారించుకుని మిన్నకుండిపోయాడు. » ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆరునెలలుగా ఇంటి వద్దనే ఖాళీగా ఉన్నాడు. ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతూ ఓ వెబ్సైట్లో లింక్ను ఓపెన్ చేశాడు. కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే అంతకు రెట్టింపు వస్తుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో తొలుత రూ.5వేలు వారి ఖాతాకు పంపాడు. అనంతరం విడతల వారీగా రూ.1.35 లక్షల వరకు నగదు బదిలీ చేసినా తనకు రిటర్న్స్ లేకపోవడంతో అవతలి వ్యక్తులను నిలదీశాడు. వారి సమాధానంతో తృప్తి చెందక ఇకపై తాను డబ్బు వేయనని తేల్చి చెప్పడంతో వెంటనే వారి నంబర్లు, వాట్సాప్ గ్రూపు బ్లాక్ చేసేశారు. » ధర్మవరంలో నివాసముంటున్న ఓ వివాహిత డిగ్రీ వరకు చదువుకుంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక పార్ట్టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే రోజు రెండు గంటల పాటు పనిచేస్తే రూ.250 చొప్పున నెల రోజుల తర్వాత జీతం రూపంలో బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అవుతుందనే ఓ సైట్ కనిపించడంతో సంప్రదించింది. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి తొలుత రూ.5వేలు చెల్లించింది. ఆ తర్వాత రోజు రూ.250 నుంచి రూ.500ల వరకు సంపాదిస్తున్నట్లు వారం రోజుల పాటు ఆన్లైన్ వాలెట్లో కనిపిస్తూ వచ్చింది. వారు విధించిన గడువు లోపు మ్యాటర్ టైప్ చేసి ఇవ్వకపోతే ఎదురు డబ్బు చెల్లించాలనే నిబంధన ఉండడంతో పలుమార్లు తన ఖాతా నుంచి దాదాపు రూ.55వేల వరకు ఆమె బదిలీ చేస్తూ వచ్చింది. అయితే రెండు నెలలు గడిచినా ఆమె బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమకాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే భర్తకు వివరించింది. » ధర్మవరంలోని యాదవవీధిలో నివాసముంటున్న బీటెక్ పూర్తి చేసిన యువకుడు పార్ట్టైం జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ఇంట్లో గంటసేపు కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ వెబ్సైట్లో సమాచారాన్ని నమ్మి తన సరి్టఫికెట్లు, ఆధార్కార్డు అప్లోడ్ చేశాడు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు పేరుతో అడ్వాన్స్గా రూ.15వేలు సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. అనంతరం తాము ఇచ్చిన మ్యాటర్ను అలాగే టైప్ చేసి పంపాలని, గంటలోపు ఎన్ని పదాలు టైపు చేస్తే అంత డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందని నమ్మబలికారు. దీంతో యువకుడు టైపు చేస్తుండగా, తప్పులు ఉన్నాయని, దీంతో కంపెనీ పరువు పోయిందని, పరిహారం రూ. 2 లక్షలు చెల్లించకపోతే కోర్టుకు లాగుతామని బెదిరించారు. పక్కనే ఉన్న తమ న్యాయవాదితో మాట్లాడమంటూ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. విషయాన్ని వెంటనే సదరు యువకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్ నేరగాళ్లు వారి నంబర్ను బ్లాక్ చేశారు. అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజి్రస్టేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు. జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్లిమిటెడ్ ఎరి్నంగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్స్టేషన్కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం -
పీఏబీఆర్లో ఆగిన జల విద్యుత్ ఉత్పత్తి
● దెబ్బతిన్న గేట్ లింక్ కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) వద్ద ఏర్పాటైన ఏపీ జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. డ్యాం నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ప్రాంతంలోని గేట్ లింక్ దెబ్బతింది. దీంతో నీటిని విడుదల చేయడానికి గేట్ పైకి లేవడం లేదు. గేట్ను పైకి ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 5న జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 3 లక్షల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు ఏపీ జెన్ కో జేఈ కిరణ్ తెలిపారు. బుధ, గురువారాల్లో గేట్ లింక్కు మరమ్మతులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్, జెన్కో సివిల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే యథావిధిగా జల విద్యుత్ను ఒక టర్బైన్లో గంటకు 3 వేల చొప్పున రోజుకు సుమారు 72,500 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని జేఈ కిరణ్ తెలిపారు. 29న రొళ్ల ఎంపీపీపై అవిశ్వాసం రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానానికి ఈనెల 29న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తునట్లు ఎంపీడీఓ నాగేశ్వరావుశాస్త్రి తెలిపారు. ఇందులో భాగంగానే మండలంలోని 11 మంది ఎంపీటీసీలకు అధికారులు మంగళవారం నోటీసులను అందించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలను పదవి నుంచి తప్పించేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పరిషత్ సీఈఓ, స్థానిక ఎంపీడీఓకు మండలంలోని 8 మంది ఎంపీటీసీలు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్డీఓ ఆనంద్కుమార్ ఉత్తర్వులు మేరకు ఎంపీడీఓ నాగేశ్వరావుశాస్త్రి ఆధ్వర్యంలో మండలంలోని 11 మంది ఎంపీటీసీలకు ఏఓ ప్రసాద్, ఈఓఆర్డీ శ్రీనాథ్ నోటీసులిచ్చారు. -
ప్రతిపాదనలు పంపాం
ప్రత్యామ్నాయ విత్తనాలతో పాటు రబీ సీజన్లో సాగు చేయడానికి సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద విత్తనాలు అవసరం ఉందని ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రైతులకు తెలియజేస్తాము. ఈశాన్య రుతుపవనాల్లో, తుపాను కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వర్షాలు కురుస్తాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – రామునాయక్, జిల్లా వ్యవసాయాధికారి పెట్టుబడి కూడా దక్కలేదు ఖరీఫ్లో నేను 3.5 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. భూమి సాగుకు, విత్తనాలకు, ఎరువులు, రోగాలు వచ్చినప్పుడు మందులు పిచికారీ, పంట తొలగించడానికి కూలీలకు సుమారు రూ.1.5 లక్షలు ఖర్చు చేశాను. చివరకు 22 బస్తాల వేరుశనగ కాయల దిగుబడి వచ్చింది. 45 కిలోల బస్తా రూ. 3 వేలతో అమ్మగా నాకు కేవలం రూ. 66 వేలు వచ్చింది. ఒక ట్రాక్టరు వేరుశనగ గడ్డి వచ్చింది.పెట్టుబడిలో సగం కూడా రాలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – దాసిరెడ్డి, రైతు, బీడుపల్లి -
అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు
ప్రశాంతి నిలయం: దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు తీసుకోకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్.. ఎస్పీ ఎస్.సతీష్కుమార్తో కలసి దీపావళి సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ అధికారులు నిబంధనల మేరకు టపాసుల విక్రయ లైసెన్స్లు మంజూరు చేయాలన్నారు. టపాసులు విక్రయించే చోట ప్రమాదాలకు తావులేకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. టపాసుల విక్రయదారులు అనుమతుల మేరకే నిల్వ ఉంచుకోవాలని, గోడౌన్ల దగ్గర అన్ని సురక్షిత పద్ధతులు పాటించాలన్నారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో, ప్రజల నివాసం ఉన్న చోట టపాసులు విక్రయించకూడదని స్పష్టం చేశారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా టపాసులు విక్రయించినా, నిల్వ ఉంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా టపాసుల విక్రాయాలపై ప్రజలు 112కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ -
అన్నదాతకు ‘నై’రుతి దెబ్బ !
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతు పవనాలు ఈసారి పెద్దగా ప్రభావం చూపలేదు. అనుకున్నంతగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు పంటల సాగుకు మొగ్గు చూపలేదు. ఆగస్టు నెల తప్ప మిగతా నాలుగు నెలలు లోటు వర్షపాతం నమోదు కావడంతో కర్షకులకు ఎదురుదెబ్బ తగిలింది. వేరుశనగ రైతులకు నష్టాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది లోటు వర్షపాతాన్నే మిగిల్చింది. జూన్ జులై మాసాల్లో ఎన్నడూ లేనంతగా అతి తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు కొనుగోలు చేసిన వేరుశనగ విత్తనాలు సైతం మార్కెట్లో అమ్ముకున్నారు. వర్షాలు కురుస్తాయన్నధైర్యంతో సాగు చేసిన పంటలు ఇప్పుడిప్పుడే చేతి కొస్తున్నాయి. ముందుగా వేరుశనగ సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చూశారు. వేరుశనగ పంటకు ఎకరాకు సుమారు రూ. 50 వేలు ఖర్చు చేయగా రూ.20 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుతో పాటు ఎరువులు, కూలీలు, మందుల పిచికారీకి విపరీతంగా ఖర్చు చేయగా.. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక పోవడంతో లబోదిబోమంటున్నారు. పరిహారమైనా ఇవ్వక పోతారా అని ఆశపడిన రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపింది. వర్షాలు పడక ఖరీఫ్లో ఎక్కువ మంది రైతులు నష్టపోవడంతో రబీలో పంటలు సాగు చేయాలా వద్దా అని అన్నదాతలు సంశయంలో ఉన్నారు. ఖరీఫ్లో 75 వేల హెక్టార్లలో సాగు జిల్లాలో సాధారణంగా ఖరీఫ్లో 2,69,022 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇందులో అత్యధికంగా వేరుశనగ 1,51,824 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 37 వేల హెక్టార్లలో సాగు చేశారు. కంది 28,925 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 12,586 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న సుమారు 11 వేల హెక్టార్లు, వరి 2500 హెక్టార్లు, పత్తి 3390 హెక్టార్లు, ఆముదము 2300 హెక్టార్లు సాగు చేశారు. వీటితో పాటు రాగి, సజ్జ, జొన్న, ఉలవ, పొద్దు తిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. రబీ సీజన్లో సుమారు 63 వేల హెక్టార్లు పంట సాగులోకి రావాల్సి ఉంది. నేటికీ సరైన వర్షాలు లేకపోవడంతో కనీసం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడం కూడా కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, జొన్న, పెసర, అలసంద పంటలను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. ప్రతి ఏటా 64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తారు. అయితే ఈసారి ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో ఆ భూములన్నీ బీడుగా మారే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ విత్తనాలు అందిస్తే కనీసం జీవాల మేతకు వాడతారు. ఈసారి విత్తనాలు ఇవ్వక పోవడంతో జీవాలకు మేత కూడా కరువవుతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. గతమెంతో ఘనం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఖరీఫ్లో విత్తనాలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, రబీలో శనగ, వేరుశనగ విత్తనకాయలతో పాటు ఎరువులు కూడా పంపిణీ చేసేవారు. సాగు చేసే సమయానికి రైతు భరోసా, పంట నష్టపోతే అదే సీజన్ ముగిసే సమయానికి పంట నష్టపరిహారంతో పాటు పంటలకు గిట్టు బాటు ధరలు దక్కేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నైరుతి రుతు పవనాల కాలం ముగియనుండగా ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. కనీసం ఈ సమయంలోనైనా వర్షాలు కురిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది లేదంటే మళ్లీ వలసలు తప్పేలాలేవని అంటున్నారు. ఆగస్టు తప్ప నాలుగు నెలలూ లోటు వర్షపాతమే తుపానులు రాకుంటే రబీకీ గడ్డు కాలమే ఖరీఫ్లో సాగైంది కేవలం 75 వేల హెక్టార్లు ప్రత్యామ్నాయం లేక అన్నదాత ఆందోళన -
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
కదిరి టౌన్: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కదిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రమేష్రెడ్డి హాజరై మాట్లాడారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కదిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు పంచాయతీలకు ఒక పరిశీలకుడు ఉంటారని, పరిశీలకుల సమక్షంలోనే గ్రామ కమిటీలను ఎంపిక చేయాలన్నారు. అలాగే ప్రతి మండలానికి ఒకరు పరిశీలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. జంబ్లింగ్ పద్ధతిలో పరిశీలకులను నియమించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మండల పరిశీలకులను ఎంపిక చేశారు. కదిరి రూరల్కు శ్రీనివాసులు నాయుడు, తనకల్లుకు కేవీ ప్రణీత్రెడ్డి, నల్లచెరువుకు మాలే శ్రీకాంత్రెడ్డి, గాండ్లపెంటకు లింగాల లోకేశ్వర్రెడ్డి, ఎన్పీ కుంటకు డాక్టర్ బత్తల హరిప్రసాద్, తలుపులకు అత్తార్ చాంద్బాషాను నియమించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి -
సత్యసాయి శత జయంతి వేడుకలకు రండి
● ఉప రాష్ట్రపతిని ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులుప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనాలంటూ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్టన్ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఢిల్లీలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్రాజు ఉప రాష్ట్రపతిని కలసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మానవాళికి అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆర్జే రత్నాకర్రాజు వివరించారు. సత్యసాయి బోధనలు, ఆధ్యాత్మిక తత్వాన్ని తరతారాలకు అందించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేస్తున్న కృషిని తెలియజేశారు. స్పందించిన ఉప రాష్ట్రపతి సత్యసాయి ట్రస్తు చేస్తున్న సేవలను కొనియాడారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రత్నాకర్రాజు తెలిపారు. ‘సురక్ష’ యాప్ ద్వారానే మద్యం విక్రయాలు అనంతపురం సెంట్రల్: నకిలీ మద్యం నిర్మూలనకు కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారానే మద్యం అమ్మకాలు చేపట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. సులువుగా మద్యం నాణ్యతను కనుక్కునే విధంగా ఈ యాప్ను రూపొందించినట్లు వివరించారు. ప్రతి మద్యం షాపు, బార్ లైసెన్స్దారుడు ఎకై ్సజ్ సురక్షయాప్ ద్వారానే మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించారు. వినియోగదారులు కూడా ఎలాంటి అనుమానాలున్నా యాప్ ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. అధ్యాపకులూ నిత్య విద్యార్థులే.. అనంతపురం: అధ్యాపకులూ నిత్య విద్యార్థులేనని జేఎన్టీయూ అనంతపురం వీసీ హెచ్.సుదర్శనరావు అన్నారు. అడ్వెంట్ గ్లోబల్ ఫౌండేషన్ క్యూ క్లైర్ ఓయాన్స్ , జేఎన్టీయూ అనంతపురం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు అధ్యాపకులకు భావి నైపుణ్య శిక్షణ తరగతులు (అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్) నిర్వహిస్తున్నారు. మంగళవారం వీసీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వాంటం టెక్నాలజీలో ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులకు పరిపూర్ణమైన అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. తొలి రోజు క్వాంటం టెక్నాలజీ అంశాలపై సీ–డాక్ ప్రాజెక్ట్ ఇంజినీర్ డాక్టర్ దివ్యాన్ష్ శ్రీనాలి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్, ఇంకుబేషన్ సెంటర్ డైరెక్టర్ సి. శోభాబిందు పాల్గొన్నారు. -
వేంకటరమణుడికి సూర్యాభిషేకం
హిందూపురం: పట్టణంలోని పేట వేంకటరమణ స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. ఉదయం అభిషేకం అనంతరం వేంకటరమణ స్వామి మూలవిరాట్ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఇలా దిగువ నుంచి మూలవిరాట్ పై వరకూ ప్రసరిస్తూ అభిషేకం చేస్తున్నట్లు కనిపించాయి. ఈ అపూర్వఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అర్చకులు మూలవిరాట్కు పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నరసింహమూర్తి, దేవస్థానం చైర్మన్ భగిరథ నవీన్ పాల్గొన్నారు. -
స్పందించండి.. కాపాడండి
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్న కుటుంబాలతో గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉందని పలువురు వాపోయారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలో పోలీసు గ్రీవెన్స్లో అధికారులను కలిసి విన్నవించారు. సుమారు వందమంది గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. బోయ బాలు, బోయ జయరాం, బోయ ఈశ్వర, బోయ శివ, బోయ బాలచంద్ర, ముష్టూరు బోయ అంజితో పాటు వారి బంధువులతో గ్రామంలో ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పొలిమేర దగ్గర ముష్టూరు గ్రామానికి చెందిన దివంగత బోయ కాటమయ్య 100 సంవత్సరాల క్రితం 5 ఎకరాల డీ పట్టా భూమి ఇతరులతో కొనుగోలు చేశాడన్నారు. ఆయన కుమారులు, మనవళ్లు ఇప్పుడు దౌర్జన్యంగా దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నారు. ఎవరైనా నిలదీస్తే దాడులు చేస్తారన్నారు. తోటల్లో స్టార్టర్ పెట్టెలు, మోటార్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లను ధ్వంసం చేస్తారన్నారు. వీరి దెబ్బకు భయపడి తోటల వద్ద మహిళలు ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ఇటుకలపల్లి, వజ్రకరూరు, బత్తలపల్లి, కూడేరు, ఉరవకొండ, అనంతపురం వన్టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల గ్రామంలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైతే పెళ్లి చేసుకునే యువకుడికి ఫోన్ చేసి ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా చెప్పడంతో ఆ పెళ్లికాస్తా పెటాకులైందన్నారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలందరూ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారంతా ఇంటి మీదకు వచ్చి గొడవ చేయాలని చూశారన్నారు. గతంలో పోలీసులు కందుకూరు గ్రామంలో ఇలానే నిర్లక్ష్యం చేయడంతో ఒక హత్య జరిగిందని, మన్నీల గ్రామ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తే అంతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్నగిరి ఆదిశేషు, అల్లు షెక్షావలి నాయుడు, అల్లు రామాంజనేయులు, వర్గ ప్రసాద్, రామాంజనేయులు, అన్నగిరి శంకరయ్య, నాగమణి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన్నీలలో అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
సమస్యలు తీర్చండి సారూ
దారి మూసేశారు పూర్వపు రాశింపల్లిలో మేము నివాసం ఉంటున్నాం. అయితే ,గ్రామంలోని కొందరు మేము గ్రామంలోకి రాకుండా, మా వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు వీలులేకుండా దారి మూసేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుని మా పొలాలకు దారి చూపండి సార్. లేకపోతే మా జీవనాధారమైన వ్యవసాయం చేసుకోలేం. – కలెక్టర్ ఎదుట వాపోయిన రాశింపల్లి గామస్తులుప్రశాంతి నిలయం: ‘‘సారూ..నెలల తరబడి తిరుగుతున్నాం...అర్జీలు ఇస్తూనే ఉన్నాం..అయినా సమస్యలు తీరడం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చండి’’ అంటూ జనం వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. తమ సమస్యలపై అర్జీలిచ్చారు. ఈ సందర్భంలోనే పలువురు తమ సమస్యపై పదులసార్లు అర్జీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వివిధ సమస్యలపై మొత్తంగా 237 అర్జీలు అందగా.. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ వాటిని స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో పారదర్శకత పాటిస్తూ సత్వర న్యాయం జరిగేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. కార్యక్రమం అనంతరం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. రీ ఓపెనింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అనంతరం ‘ఉత్తమ క్లాప్ మిత్ర’గా అవార్డు సీఎంతో ఈనెల 6న అవార్డు అందుకున్న కదిరి మండలం బురుగపల్లి గ్రామ పంచాయతీ ‘క్లాప్ మిత్ర’ సింగల దొడ్డెప్పను కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సన్మానించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, గ్రామ సర్పంచ్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పద్మశ్రీతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘పరిష్కార వేదిక’కు వెల్లువెత్తిన అర్జీలు నెలలుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని జనం ఆవేదన -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి హత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. తల్లి పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వలేదన్న అక్కసుతో కుమారుడు మద్యం మత్తులో చెలరేగిపోయాడు. కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది. హిందూపురం మండలంలో కల్లు అంగడి వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని నిజాంవలీ కాలనీలో నివాసముంటున్న షేక్ ఖాసీంబీ (65) హత్యకు గురైంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కుమారుడే కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖాసీంబీ కుమారుడు బాబా ఫకృద్దీన్ అలియాస్ బాషా కొన్నేళ్ల క్రితమే ఇల్లు వదిలి శ్రీశైలం చేరుకుని అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. తనకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసిచ్చానని, రెండో కుమార్తె పెళ్లికి డబ్బు అవసరమైందని తల్లితో చెప్పుకున్నాడు. తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వాలంటూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో గొడవ పడిన అనంతరం బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే నిద్రిస్తున్న తల్లిపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. చుట్టుపక్కల వారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. హిందూపురం: మండలంలోని సంతేబిదనూర్ సమీపంలో కర్ణాటక వాసి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గౌరీబిదనూరు పట్టణానికి చెందిన పవన్కుమార్ (26) రెండు రోజుల క్రితం హిందూపురం మండలం రాచేపల్లిలో బంధువుల ఇంట శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చాడు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై కల్లు సేవించేందుకు సంతేబిదనూర్ సమీపంలో చెరువు వద్ద ఉన్న కల్లు అంగడికి చేరుకున్నాడు. అక్కడ ఘర్షణ చోటు చేసుకోవడంతో దుండగులు హతమార్చి గుర్తు పట్టేందుకు వీలులేకుండా పెట్రోలు పోసి నిప్పంటించారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో హిందూపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆస్తి రాసివ్వలేదని కదిరిలో కన్నతల్లినే కత్తితో పొడిచి హతమార్చిన తనయుడు కల్లు సేవించే సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో కర్ణాటక వాసి హతం -
అప్రమత్తంగా ఉండాలి
ఆన్లైన్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు. జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్లిమిటెడ్ ఎర్నింగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్స్టేషన్కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం ● -
పరిష్కార వేదికకు 75 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 75 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఇలానే చేస్తారా మీ సొంత బిడ్డలకు అన్యాయం జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా అంటూ సోమందేపల్లి పోలీసులను ఎస్పీ సతీష్కుమార్ నిలదీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వివరాలు.. సోమందేపల్లికి చెందిన లక్ష్మికి ధర్మవరం మండలం కుణతూరుకు చెందిన నరేంద్రరెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనంతపురంలో కొద్ది రోజులు కాపురం ఉన్నారు. అనంతరం చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఇద్దరూ ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం నరేంద్రరెడ్డి తన మేనత్త కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న లక్ష్మి తనకు న్యాయం చేయాలంటూ సోమందేపల్లి పీఎస్ ఎస్ఐ రమేష్కు ఫిర్యాదు చేసింది. అయితే అతనిపై కేసు నమోదు చేయడానికి సెక్షన్లు లేవంటూ పోలీసులు నిర్ధయగా వెనక్కు పంపారు. దీంతో గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీని కలసి బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే బాధితురాలి సమస్యకు పరిష్కారం చూపాలని సోమందేపల్లి పీఎస్ సిబ్బందిని ఆదేశించారు. అయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సోమవారం మరోసారి ఎస్పీని కలిసింది. దీనిపై ఎస్పీ స్పందించారు. సోమందేపల్లి పీఎస్కు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మందలించారు. ఏ ఒక్క ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదని, వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాఫీ చూపాలని ఆదేశించారు. -
పూజారి ముసుగులో గంజాయి విక్రయం
గుంతకల్లు: ఆలయ పూజారి ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు మరొకరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎకై ్సజ్ సీఐ శివసాగర్ వెల్లడించారు. సోమవారం గుంతకల్లులోని హనుమన్ సర్కిల్లో తనిఖీలు చేపట్టిన సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే అడ్డుకుని పరిశీలించారు. వారి వద్ద 4 కిలోల ఎండు గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏలూరు జిల్లా వెంకటాపురంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న పూజారి సురేష్బాబు కుమారుడు తిరునగరి మోహన్సుందర్ జల్సాలకు అటువాటు పడి పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామ రామాలయంలో అర్చకుడిగా చేరాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి అబ్బేదొడ్డికి చెందిన సాయిరామ్ అలియాస్ గంజాయి సాయి ద్వారా గుత్తి, గుంతకల్లు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇద్దరి అరెస్ట్.. 4 కిలోల గంజాయి స్వాధీనం -
హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి గల్లంతు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందని నాగభూషణం, ఓబులేసు సోమవారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో ఉన్న బంధువు కర్మకాండలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. హంద్రీ నీవా కాలువ వద్దకు చేరుకోగానే స్నానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓబులేసుకు ఈత రాకపోవడంతో మెట్ల వెంట దిగి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని వచ్చాడు. అనంతరం నాగభూషణం కాలువలో దిగి ఈత కొడుతూ ప్రవాహ వేగానికి కొట్టుకు పోయాడు. ఆ సమయంలో ఓబులేసు కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే లోపు నాగభూషణం (62)కనిపించకుండా పోయాడు. సమాచారుం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. -
సహకార బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్లపై చర్యలు
చిలమత్తూరు: మండలంలోని కోడూరు పీఏసీఎస్ పరిధిలో రైతులు చెల్లించిన రూ.20 లక్షల రుణం సొమ్ము స్వాహా చేసిన సీఈఓ నరేంద్ర కుమార్పై ‘రైతులను ముంచిన సొసైటీ సీఈఓ’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’లో వెలువడిన కథనం విదితమే. దీనిపై స్పందించిన సహకార బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం గోరంట్లలోని పీఏసీఎస్ బ్యాంక్ నోడల్ అధికారి మనోహర్ విచారణ చేపట్టారు. రైతుల నుంచి సేకరించిన రూ.20 లక్షల రుణం సొమ్ము వెంటనే బ్యాంక్కు చెల్లించాలని సీఈఓ నరేంద్రకుమార్ను ఆదేశించారు. కాగా, ఈ విషయంలో సదరు సీఈఓపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొంత కాలంగా బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లపై బదిలీ వేటు వేశారు. మద్యం మత్తులో ప్రేమ జంట హల్చల్ కదిరి టౌన్: స్థాయి తాయి గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ ప్రేమ జంట మద్యం మత్తులో హల్చల్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా, వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. వెంటనే సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకొని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం చక్రాయపేటకు చెందిన లోకేష్, అన్నమయ్య జిల్లా బి.కోత్తకోటకు చెందిన షేక్భానుగా గుర్తించారు. కదిరిలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో లోకేష్ పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తన ప్రియురాలిని రప్పించుకుని ఇద్దరూ కలసి మద్యం సేవించిన అనంతరం లాడ్జిలో గది కోసం వెళ్లారు. వీరి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో గది ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించారు. దీంతో లాడ్జి వద్ద గొడవకు తెరతీసినట్లు తెలిసింది. ఐటీఐలో 5వ విడత అడ్మిషన్లు హిందూపురం టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)ల్లో మిగులు సీట్ల భర్తీకి 5వ విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, హిందూపురం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ మురళీధర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అదే రోజు సాయంత్రం 4 గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలి. 17న కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. -
బాలయ్య ఇంటి ఎదుట బలవన్మరణ యత్నం
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు(Farmer Balachari).. బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటోందని వాపోతూ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోయాడు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బాలాచారిని మీడియా కంట పడకుండా హిందూపురం వన్టౌన్ పీఎస్కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ పర్యటనలో బాలయ్యకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆదివారం చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో ఆయన పర్యటించగా.. మహిళలు చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు. ఈ పరిణామంతో తనదైన శైలిలో ఏదో మాట్లాడుతూ.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనతో చర్చించి స్పష్టమైన హామీ ఇప్పిస్తామని చెబుతూ నిష్క్రమించారు.ఇదీ చదవండి: వినూత వీడియోలిస్తే.. బొజ్జల బాగోతం బయటికి?? -
బలిగొన్న ఈత సరదా
బొమ్మనహాళ్: ఈత సరదా ఓ బాలుడిని బలిగొంది. బొమ్మనహాళ్ ఎస్హెచ్ఓ కమల్బాషా తెలిపిన మేరకు.. బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన రుద్రన్న, బసమ్మ దంపతుల కుమారుడు శివకుమార్ (16).. గోవిందవాడ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్నాడు. రెండవ శనివారం సెలవు కావడంతో తన స్నేహితులు ఆరుగురితో కలసి గ్రామ సమీపంలోని హగరి నదిలో ఉన్న కుంటలో ఈత కోసం వెళ్లాడు. అయితే శివకుమార్కు ఈత రాదు.. రెండు సార్లు మునిగిపోతుంగా స్నేహితులు వెలికి తీశారు. అయినా వినకుండా మూడో సారి కూడా నీటిలో దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం వరకూ స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం పెద్దలకు తెలిస్తే తమను దండిస్తారనే భయంతో ఇంటికి చేరుకుని మిన్నకుండిపోయారు. రాత్రి అయిన శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత స్నేహితులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలో దించి శివకుమార్ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆదివారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో దోపిడీ
రాప్తాడు రూరల్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రూ.వేల కోట్ల దోపిడీకి సీఎం చంద్రబాబు తెరలేపారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలంలో చేపట్టారు. ఈ సందర్భంగా నగర శివారులోని బీజీఆర్ ఫంక్షన్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రకాష్రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొస్తే... నేడు వాటిని తన బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను ఆధునీకరించారని, విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారని, ప్రతి ఇంటికీ ఫ్యామిలీ వైద్యుడిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేదల ఆరోగ్యం విషయంలో జగనన్న ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ క్రమంలోనే పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు, వారి పిల్లలు ఉచితంగా వైద్యవిద్య అభ్యసించేలా దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చారన్నారు. ఇందులో జగనన్న హయాంలోనే 5 కశాశాలలను నిర్మించి అడ్మిషన్లు మొదలు పెట్టి తరగతులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన 12 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు వద్దంటూ కేంద్రానికి లేఖ చంద్రబాబు రాశారని, నిర్మాణాలు కూడా ఆపేయాలంటూ జీఓ ఇచ్చారన్నారు. తాజాగా వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం ముమ్మరం చేశారని మండిపడ్డారు. కొత్తగా వచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పూర్తయితే కనీసం లక్షమందికి ఉపాధి లభించేదన్నారు. పైసా ఖర్చు లేకుండా ఏటా 5 వేలమంది వైద్యులయ్యే అవకాశాన్ని చిదిమేశారన్నారు. పాపంపేట బాధితులకు అండగా ఉంటా పాపంపేట బాధితులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా అండగా నిలిచానని ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన 20 ఇళ్లను కూల్చి వేసేందుకు పరిటాల సునీత చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. అడుగడుగునా ఆ ప్రయత్నాలను అడ్డుకున్నానన్నారు. అధికారం చేపట్టిన తర్వాత కలెక్టర్తో తనకు అనుకూలంగా సునీత లేఖ రాయించి రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చివేశారన్నారు. మళ్లీ తానే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చానని, ఇప్పుడు మళ్లీ రాచూరి బంధువులతో పరిటాల సునీత బంధువులు జీపీఏ చేయించుకుని పాపంపేట పొలంలో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే ఆక్కడ వాలిపోతున్నారన్నారు. పాపంపేట బాధితులకు అండగా నిలబడతానన్నారు. కబ్జాదారులు పాపంపేట వీధుల్లో కనిపించకుండా తరిమికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాప్తాడు ఎంపీపీ వరలక్ష్మి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు బండి పవన్, దుగుమర్రి గోవిందరెడ్డి, నాయకులు భోగే గోపాల్రెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, లోకనాథరెడ్డి, ఈశ్వరయ్య, అక్కంపల్లి మాధవరెడ్డి, ఆకుల మునిశంకరయ్య, వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పైసా ఖర్చు లేకుండా ఏటా 5 వేల మంది వైద్యులయ్యే అవకాశాన్ని చిదిమేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
కారును ఢీకొన్న టాటా ఏస్
చింతామణి: కారును టాటా ఏస్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకు గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా చిన్నసంద్ర వద్ద ఆదివారం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి తాలూకా వడ్డుమరవపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి తన కుమారుడు భానుప్రకాష్తో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. కారులో స్వగ్రామానికి వెళ్తుండగా చిన్నసంద్ర వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్ డ్రైవర్ ఓవర్టేక్ చేయబోతూ కారును ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుకు అవతల దూసుకెళ్లాయి. టాటా ఏస్ బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జనుజ్జయింది. అందులోని తండ్రీకొడుకు గాయపడ్డారు. స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర స్థాయి గోల్ షూట్ విజేత అనంత కదిరి అర్బన్: ఈ నెల 11, 12వ తేదీల్లో చిత్తూరు జిల్లా నేరేబైలు గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి గోల్ షూట్ పోటీల బాలికల విభాగంలో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. అబ్బాయిల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా గోల్షూట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆదివారం వెల్లడించారు. -
● గుర్తుకొస్తున్నాయి..
బత్తలపల్లి: చిన్ననాటి మిత్రులను కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేవు.. అందరి కళ్లలో చెప్పలేని ఆనందం.. కుటుంబ సమస్యలు, ఇతర ఇబ్బందులు, తారతమ్యాలు అన్నీ మరచిపోయారు. ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆత్మీయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ చిన్ననాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ఇందుకు బత్తలపల్లిలోని ప్రాథమిక పాఠశాల వేదికై ంది. ఆ పాఠశాలలో 2005 నుంచి 2009 వరకు 1 నుంచి 5వ తగరతి వరకూ కలిసి చదువుకున్న వారు 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో సందడి నెలకొంది. ఒకరి కష్టాలను పాలుపంచుకునేలా ప్రణాళికను రూపొందించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, స్వరాజ్యలక్ష్మి, బిల్లే నారాయణస్వామి, వీఎల్ఎన్ రవి, నాగభూషణ, పుల్లయ్య, సరళ, చంద్రమోహన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శివశంకర్, గువ్వల రమేష్, నరేంద్ర, శ్యామ్, సతీష్, నారాయణస్వామి, ప్రసన్న, గణేష్, ఉస్మాన్బాబా, బాబావలి, సతీష్, ఉస్మాన్, షెక్షావలి, పవన్, గౌతమి, కళ్యాణి, గంగాదేవి, ఆశాబీ, రహమత్ తదితరులు పాల్గొన్నారు. తనకల్లు: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998–99 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమరికలు లేకుండా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాము చదివిన తరగతి గదులను కలియతిరుగుతూ నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుధ్దులు నేర్పిన నాటి గురువులు రమణారెడ్డి, నరసింహులు, వేమనారాయణ, కరీముల్లా, జెడ్.రవిను ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఎం ఖాదర్వలికి పూర్వ విద్యార్థి రమేష్నాయక్ ల్యాప్టాప్, ప్రింటర్ అందజేశారు. అలాగే భవిష్యత్లోనూ పాఠశాల అభివృద్ధికి తమవంతు సాయం చేస్తామని పూర్వ విద్యార్థులు సందీప్కుమార్, కడపల శ్రీకాంతరెడ్డి, అమాన్, ఎద్దుల మహీంద్రారెడ్డి, వెంకి, శివ, రమేష్నాయక్, రాజేష్, ఫయాజ్, షనవాజ్, కృష్ణవేణి, అనురాధ, సుకన్య, సహజ, నిరుపమ, సుజన, లావణ్య, శ్రీకాంత్ పేర్కొన్నారు. -
ఆశావర్కర్లకు రూ.24 వేల వేతనమివ్వాలి
కదిరి టౌన్: ఆశా వర్కర్లకు కనీసం వేతనం రూ.24 వేలు ఇవ్వాలని కూటమి సర్కార్ను ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం కదిరిలోని కోనేరు సర్కిల్లో ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగిన ఆశా వర్కర్ల రెండవ జిల్లా మహాసభకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్తో కలసి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలన్నారు. ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. రికార్డులు సొంత డబ్బుతోనే కొనగోలు చేయాలనడం, సంబంధం లేని ఆన్లైన్ పనులన్నీ సొంత ఫోన్ ద్వారానే చేయాలని వేదించడం సరైంది కాదన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర మహాసభలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం 30 మందితో కూడిన జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షరాలిగా రాధమ్మ, ప్రధాన కార్యదర్శిగా సౌబాగ్య, కోశాధికారిగా రమాదేవి, సహాయ కార్యదర్శులుగా మమత, ముంతాజ్, చెన్నకృష్ణమ్మ, చంద్రకళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు త్రివేణి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సాంబశివ, సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి -
భర్త ఇంటి ఎదుట వివాహిత ఆందోళన
సోమందేపల్లి: తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత తన భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు.. సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకు చెందిన హరీష్, మౌనిక ఏడాదిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన శారీరక తీర్చుకుని ఆమెను గర్భవతిని చేసిన అనంతరం హరీష్ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, ఐదు నెలల క్రితం స్థానిక సాయిబాబా ఆలయంలో పెళ్లి జరిపించారు. అనంతరం భర్త, అత్త, మామ తనను దూరంగా ఉంచుతూ తరచూ పుట్టింటికి పంపేవారు. దీంతో మరోసారి తనను మోసం చేసేందుకు భర్త, అత్తింటి వారు ప్రయత్నిస్తుండడంతో ఆదివారం మౌనిక తన భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం 9వ నెల గర్భంతో ఉన్న తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. అండగా ఉంటాం మౌనికను వదిలించుకోవాలని చూస్తున్న భర్త హరీష్, అత్త, మామపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం మౌనికను ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలిసి మద్దతు పలికారు. చేస్తున్న ప్రయత్నం మంచిది కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న హితవు పలికారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటేష్, హనుమక్క, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
అనంతపురం అర్బన్: మహిళా రక్షణ చట్టాల అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి మండిపడ్డారు. ఫలితంగా దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ కరువైందన్నారు. బేటీ బచావో... బేటీ పడావో అని మాటల్లో చెబుతున్నా.. ఆచరణలో చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, కోశాఽధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి చంద్రిక, నాయకురాలు నాగమణితో కలిసి విలేకరులతో పుణ్యవతి మాట్లాడారు. మహిళల సమస్యలపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు అనంతపురం నగరంలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెల రూ.1,500, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు వరకు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హమీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాట వాటిని అమలు చేయలేదన్నారు. వీటిపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి -
బాలకృష్ణకు బిగ్ షాక్.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు
సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్.. -
పుట్టపర్తిలో పటిష్ట భద్రత
పుట్టపర్తి టౌన్: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో పటిష్ట భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సహకారంతో రూ.1.39 కోట్ల వ్యయంతో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదివారం గణేశ్ కూడలిలో భూమిపూజ చేశారు. మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఆర్డీఓ సువర్ణ హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ నవంబర్ 23న జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వీఐపీలు, వీవీఐపీలు పది లక్షల వరకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఏపీఆర్) కెమెరాలు 10, స్టాటిక్ కెమెరాలు 169, ఇతర కెమెరాలు 47 ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నామని, నవంబర్ 2లోపు వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వీటితోపాటు డ్రోన్ కెమెరాలు కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. పట్టణానికి పది కిలోమీటర్లలోపు వీటిని ఏర్పాటు చేయనున్నట్ల తెలిపారు. వీటిని కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తామన్నారు. అత్యాధునిక కెమెరాల సాయంతో వేడుకల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా 24 గంటలూ పనిచేసే విధంగా పర్యవేక్షిస్తామన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహాయం అందించిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, సీఐలు శివాంజనేయులు, గోపీనాథ్రెడ్డితోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ ట్రస్ట్ సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు -
అన్యాయంపై ఎక్కడికక్కడ నిలదీద్దాం
పుట్టపర్తి అర్బన్: బంజారాలకు అన్యాయం జరిగితే ఎక్కడికక్కడ నిలదీయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం (ఏబీబీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు బాబురావ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలపై అత్యాచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహీ శ్రీనివాస కళ్యాణ మంటపంలో బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది బంజారాలు విచ్చేశారు. తొలుత సేవాలాల్ మహరాజ్, అంబేడ్కర్, బిర్సా ముండా చిత్రపటాలతో పాటు ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’లో వీర మరణం పొందిన మురళీనాయక్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులుల అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన బాబురావ్ చౌహాన్, కర్ణాటక సామాజికవేత్త మహారాజ్, హైదరాబాద్ సునీత శంకర్లాల్ నాయక్, యర్రా భాస్కర్, ఏబీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు నాయక్, పధాన కార్యదర్శి డుంగావత్ రమేష్ నాయక్ మాట్లాడారు. బంజారాలకు అఖిల భారత బంజారా సేవా సంఘం అండగా ఉంటుందన్నారు. ఇటీవల నల్లమాడలో నాలుగు గ్రామాల గిరిజనుల వెయ్యి ఎకరాల భూముల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి వారికి తిరిగి ఇచ్చే విధంగా సంఘం తరఫున పోరాడి సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. బంజారాలకు ఎవరైనా అన్యాయం చేస్తే వదిలిపెట్టేదిలేదన్నారు. బంజారాల్లో చాలామంది మద్యం, జూదానికి బానిసలయ్యారని, వాటిని వదలకపోతే జాతి క్షమించదని అన్నారు. విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. బంజారాలు ఐక్యంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గుత్తి సేవాఘడ్లో వచ్చే కార్తీక దీపోత్సవంలో లక్షదీపార్చన వైభవంగా చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని చోట్లా అంబేడ్కర్, సేవాలాల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కులాలను ఎస్టీల్లో చేరిస్తే ఒప్పుకోం ఎస్టీల్లోకి ఇతర కులాలను కలపడానికి వీలులేదన్నారు. ఇటీవల బీసీలను ఎస్టీల్లోకి కలిపేస్తామని మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రకటించారని, అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో 25 వేలమంది ఎస్టీలు ఏకతాటిపైకొచ్చి వారిని తిరగనీయకుండా అడ్డుకుంటారని బంజారా నేతలు స్పష్టం చేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, సేవాఘడ్కు ఏటా రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయాలని, బంజారా భాష, సంస్కృతిని కాపాడాలని, అన్ని బంజారా సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాలని, సంత్ సేవాలాల్ మహరాజ్ ట్రస్ట్ను ప్రక్షాళన చేయాలని, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను వెంటనే పునరుద్ధరించాలని సభలో తీర్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, ఎస్సీ, ఎస్టీ మెంబర్ శ్రీనివాసనాయక్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయక్, శివకుమార్ నాయక్, కేవీపీఎస్ అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, కుల్లాయినాయక్, ఎకై ్సజ్ సీఐ మల్లికా, సేవ్యానాయక్, తిరుపాల్ నాయక్, వ్యాఖ్యాత శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. అణగారిన వర్గాలపై దాడులను పట్టించుకోని కూటమి సర్కార్ బంజారాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగాలి అఖిల భారత బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాబురావ్ చౌహాన్ -
పడకేసిన పట్టణాభివృద్ధి
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం వచ్చాక ‘పుడా’ ఉనికి కోల్పోయింది. ఏడాది దాటినా చైర్మన్ నియామకం చేయలేదు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. 1992లో ఆరు గ్రామాలతో ఏర్పడిన పుడాను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరు మండలాలకు విస్తరించారు. ఆ తర్వాత మరో ఐదు రెవెన్యూ గ్రామాలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పుడా పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తం 82 రెవెన్యూ గ్రామాలు పుడా పరిధిలో ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పుడా పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అక్రమాలకు తావు లేకుండా.. ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుతం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైర్మన్ను కూడా నియమించలేదు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే.. అవినీతి పెరిగిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు మొదలయ్యాయి. కూటమి నేతల కనుసన్నల్లోనే భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిసింది. చైర్మన్ పదవికి పోటాపోటీ.. పుడా చైర్మన్ పదవికి ఆశావహులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. అయితే ఎవరికీ ఇవ్వకుండా మాజీ మంత్రి అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. తనకు ప్రొటోకాల్ పోతుందనే భయంతో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎవరికి ఇచ్చినా.. తనకు పోటీ వస్తారనే భయం కూడా ఉండటంతో అధిష్టానం వద్ద మాజీ మంత్రి ఏదో కారణం సాకు చూపుతూ అడ్డగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏడాదిన్నర కాలంగా పుడా చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. ఎంతో మంది ఆశావహులు.. తమకే వస్తుందనే ధీమాలో ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పుడా పరిధిలోనుంచి పుట్టపర్తి మున్సిపాలిటీని మినహాయించారు. దీంతో మున్సిపాలిటీలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతులు కొంత.. అక్రమం ఇంకొంత అన్న చందంగా మారింది. పుట్టపర్తి నుంచి పుడా కార్యాలయానికి వెళ్లే దారిలో సాయి సూపర్ బజారు పక్కన ఏడంతస్తుల భవనం ఉంది. కోకోనట్ గార్డెన్ దగ్గర యజమాని ఎవరో తెలియకుండానే.. కబ్జా చేసిన భూమిలో ఓ పెద్ద భవనం వెలుస్తోంది. మున్సిపల్ అధికారులు పలుమార్లు వెళ్లి నోటీసులు ఇచ్చినా.. ఫలితం లేదు. ఏడాదిన్నరగా ‘పుడా’ పాలన అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వంలో చైర్మన్ను నియమించని వైనం చైర్మన్ పదవికి ఆశావహులు ఎక్కువ కావడంతోనే జాప్యం ‘పుడా’ నిర్వీర్యంతో పుట్టపర్తి వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు ప్రస్థానం ఇలా.. 1992 ఫిబ్రవరి 18న పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పడింది. పుట్టపర్తి, కప్పలబండ, బ్రాహ్మణపల్లి, లోచర్ల, బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ఉండేవి. మొత్తం 86.54 చదరపు కిలోమీటర్లు. 1996 సెప్టెంబరు 3న పుడా పేరును సుడా (శ్రీసత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)గా మార్పు చేశారు. 2007 ఫిబ్రవరి 28న సుడా పేరు తొలగించి ‘పుడా’గా మార్చారు. 2022 మే 13న ఆరు మండలాలకు పుడా పరిధిని విస్తరించారు. పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం (అమడగూరులోని ఐదు రెవెన్యూ గ్రామాలు మినహా) పుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 1,407.87 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. 2022 నవంబరు 7న అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లి, దండెవారిపల్లి, కరిమిరెడ్డిపల్లి, రామానంతపురం, ఎస్.కురువపల్లె రెవెన్యూ గ్రామాలను చేర్చారు. మరో 9.258 చదరపు కిలోమీటర్లు చేరడంతో పుడా మొత్తం పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. -
పురుగు మందు పీల్చి ఉక్కిరిబిక్కిరి
గుంతకల్లుటౌన్: మొక్కజొన్న పంటలో మొవ్వ తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుసుడుల్లో క్రిమిసంహారక మందులను వేస్తున్న తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగు మందు వాసన పీల్చడంతో దాని గాఢతకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులతో చేనులోనే కళ్లు తిరిగిపడిపోయారు. ఈ ఘటన ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ గుంతకల్లు సమీపంలోని ఐదు మోరీల వద్ద బాపట్ల జిల్లా ద్రోణాదులకు చెందిన కౌలురైతు సుబ్బరాయుడు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రైతు పిలవడంతో మొక్కజొన్నలో పట్టిన పురుగు నివారణకు మందు చల్లడానికి ఒక్కొక్కరికీ రూ.280 చొప్పున కూలి మాట్లాడుకుని స్థానిక మహబూబ్నగర్ కాలనీకి చెందిన 19 మంది వ్యవసాయ కూలీలు ఒకే ఆటోలో కలిసి వెళ్లారు. కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ అనే పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపి ఆకుసుడుల్లో వేస్తుండగా.. మందు వాసన పీల్చడంతో వహీదాబేగం, మహాలక్ష్మి, వరలక్ష్మి, సుశీల, చంద్రకళ, శారదమ్మ, అశ్విని, రామాంజినమ్మ, నాగేశ్వరమ్మలకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులయ్యాయి. కళ్లు తిరిగి అక్కడే పడిపోయారు. కౌలురైతు, తోటికూలీలు వెంటనే వారిని ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణ సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పురుగు మందు గాఢత నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్రెడ్డి తెలిపారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని, తరువాత పరీక్షలు నిర్వహించి వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆయన తెలిపారు. కాగా..మిగిలిన పది మంది కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో వారు ఇళ్లకు వెళ్లిపోయారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం మొక్కజొన్నలో కత్తెర పురుగులను నియంత్రించడానికి వినియోగించే కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ పురుగు మందు చాలా ప్రమాదకరమైనది. పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాలి. గాలి ఎదురుగా వచ్చినప్పుడు పురుగు మందు ముఖంపై పడుతుంది. అప్పుడు దానిని పీల్చడం వల్లనే అస్వస్థతకు గురవుతారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు కూడా మందు పిచికారీ చేయొద్దు, చల్లొద్దని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా చాలా మంది వినడం లేదు. – లీనా వసుంధర, మండల వ్యవసాయాధికారిణి, గుంతకల్లు 9 మంది మహిళా వ్యవసాయ కూలీలకు అస్వస్థత -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగే కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని సూచించారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించినా.. పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్కు రాకుండా ‘‘me-ek-o-r-a-m.a p.g-o-v.i n’’లో కూడా సమర్పించవచ్చన్నారు. పోలీస్ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ‘పెళ్లి పెటాకులు’ కేసులో నిందితుడికి రిమాండ్ రాప్తాడురూరల్: పెళ్లి పెటాకులు చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలు పెట్టుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు బాలచంద్ర అంతకు ముందురోజు వరుడుకి ఫోన్ చేసి వధువుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని, అందుకు సంబంధించిన ఫొటో కూడా పంపుతానని ఇద్దరు ఉన్న ఓ ఫొటోను మొబైల్కు పంపాడు. అలాంటి యువతిని పెళ్లి చేసుకుంటాన్నంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. బాలచంద్ర ఫోన్కాల్తోనే పెళ్లి చెడిపోయిందని, తనకు ఆయనకు ఏమాత్రం పరిచయం లేదని, కేవలం కక్ష కట్టి తన పెళ్లి చెడగొట్టాడంటూ బాధితురాలు ఇటుకలపల్లి పీఎస్లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల గాలింపు అనంతరం ఆదివారం బాలచంద్రను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పుస్తకాభిలాషను పెంచడమే లక్ష్యం అనంతపురం కల్చరల్: విద్యార్థులలో పుస్తకాభిలాషను పెంచి.. విజ్ఞాన సముపార్జన దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రంథాలయ అధికారులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘వియ్ లవ్ రీడింగ్’ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీరాములు, విశ్రాంత డీఎస్పీ హరి, డాక్టర్ అంకె రామలింగమయ్య తదితరులు జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా అనే అంశంపై పలు సూచనలు, సలహాలు అందించారు. పిల్లల చేతనే కథలు చెప్పించడం, చదివించి, విశ్లేషణ చేయించడం గ్రంథాలయంలో కొనసాగిస్తామని గ్రంథాలయాధికారులు కమ్మన్న, గోవిందు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర గ్రంథాలయ సిబ్బంది ముత్యాలమ్మ, శివమ్మ పాల్గొన్నారు. బార్ను మరిపిస్తున్న బెల్టుషాపు లేపాక్షి: కోడిపల్లి పంచాయతీ పరిధిలోని నాగేపల్లి–కొత్తపల్లి రోడ్డులో బెల్టుషాపు.. బార్ను మరిపిస్తోంది. ఇక్కడ అన్ని రకాల బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంది. అనధికారికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లో కోరుకున్న ఫుడ్ సరఫరా చేసేస్తున్నారు. దీంతో ఈ బెల్టుషాపు మందుబాబులతో కళకళలాడుతోంది. మెయిన్ రోడ్డులోనే బెల్టు షాపు నిర్వహిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
పాఠశాలలో విధ్వంసం
పుట్టపర్తి అర్బన్: కంబాలపర్తి ప్రాథమిక పాఠశాలలోకి ఇద్దరు పిల్లలు చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు తెలిపిన సమాచారం మేరకు... ఆదివారం మధ్యాహ్నం కంబాలపర్తికి చెందిన ఇద్దరు పిల్లలు పాఠశాలలోకి ప్రవేశించారు. నేరుగా హెచ్ఎం గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్లు విసిరికొట్టారు. రికార్డులు చెల్లాచెదురు చేసి పడేశారు. చిక్కీలు, బియ్యం, ఆయిల్ పారబోశారు. గదిలోంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఏం జరుగుతోందోనని పాఠశాలలోకి వచ్చారు. తెరిచి ఉన్న తలుపులను వేసి గడియపెట్టారు. అనంతరం ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా లోపల ఇద్దరు పిల్లలు కనిపించారు. ఎవరని ఆరా తీస్తే ఒకరు మంగళకర పాఠశాల విద్యార్థి, మరొకరు చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి అని తేలింది. గతంలో పాఠశాలలో అసభ్యకరంగా గోడలపై రాయడంతో.. హెచ్ఎం గమనించి తీవ్రస్థాయిలో మందలించారు. దీన్ని మనసులో పెట్టుకుని పాఠశాలలోకి ప్రవేశించి బీభత్సం చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అనంతరం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మందలించి.. నష్ట పరిహారం కట్టేలా ఎస్ఐ లింగన్న పంచాయితీ చేసి పంపించారు. హెచ్ఎంపై కోపంతో ఇద్దరు చిన్నారుల దుశ్చర్య -
నో‘ట మాట’ లేక
టమాట రేట్లు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ధరలు ఆకాశాన్నంటి రైతులకు లాభాలు తెచ్చి పెట్టే ఈ పంట.. మరో సారి అథఃపాతాళానికి పడిపోయి కన్నీరు పెట్టిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ పారబోసేలా చేస్తోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పడి పోయాయి. ఒక్కో బాక్సు రూ.70 నుంచి రూ. 100 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటలను మార్కెట్కు తీసుకువెళ్లే వాహనం ఖర్చులు కూడా మిగలకపోవడంతో దిక్కుతోచక రోడ్ల పక్కన పారబోస్తున్నారు. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పిల్లలపల్లి వద్ద ప్రధాన రహదారిపై కుప్పలు కుప్పలుగా టమాటలను పారబోసిన దృశ్యమిది. – బ్రహ్మసముద్రం:


