breaking news
Sri Sathya Sai
-
సీట్లు ఫుల్.. అడ్మిషన్లు డల్
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 13 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తొలి విడత ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్లో 9 వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా నాలుగు వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఫీజులతో బాదుడే బాదుడు.. తొలి విడతలో సీట్లు దక్కిన విద్యార్థులు తక్షణమే కళాశాలలో చేరాలి. లేదంటే సీటు రద్దవుతుందంటూ యాజమా న్యాలు బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి కూడా యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. బిల్డింగ్, వర్సిటీ, ల్యాబ్ అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు లాగుతున్నాయి. సాధారణంగా తొలి విడత కౌన్సెలింగ్లో నచ్చిన కళాశాలలో లేదా మెచ్చిన కోర్సులో సీటు రాని విద్యార్థులు రెండో దఫా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తారు. అయితే, తొలి విడత సీటు వచ్చిన కళాశాలలో ఆయా ఫీజులు చెల్లిస్తే, వేరే కళాశాలకు వెళ్లేటప్పుడు ఆ మొత్తం తిరిగి ఇవ్వబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై అనుమానం.. కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఒకటి.. అర కాదు ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కన పెట్టడంతో విద్యార్థులు విసుగెత్తి చదువులు మానేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు బీటెక్ను రాష్ట్రంలో చదివే బదులు కర్ణాటక, తెలంగాణలో మంచి ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం మేలని భావించి.. అక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా ఇక్కడ ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమా అని ఉన్నత విద్య భ్రష్టు పట్టిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చేరాలా.. వద్దా..? ఇటీవల ఏపీఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్కు సంబంధించి విద్యార్థులు పలు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చారు. ఈ నెల మూడో తేదీనే కళాశాలలు కేటాయించాల్సి ఉంది. అయితే, తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు వెలువరించేంత వరకు రెండో దఫా కౌన్సెలింగ్ జరగదు. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల్లో సీటు వచ్చిన విద్యార్థులు తమకు సమీపంలో ఉండే కళాశాలలో సీటు కోసం ఎదురుచూడాలా.. లేక ఇప్పటికే సీటు దక్కిన కళాశాలలోనే బీటెక్ చదవాలా.. అనే సంశయంలో పడ్డారు. 2024 వరకు ఇబ్బంది లేదు.. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్యా వ్యవస్థ ఉండేది. తెలంగాణలో చదివినా, ఏపీలో చదివినా లోకల్గా పరిగణించేవారు. 2024 నుంచి ఈ నియమం తొలగించారు. దీంతో తెలంగాణలో చదివిన ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఏర్పడింది. అవగాహన లేక తమ పిల్లలను తెలంగాణలో ఇంటర్ చదివించిన తల్లిదండ్రుల బాధ నేడు వర్ణనాతీతంగా మారింది. రాప్తాడుకు చెందిన ఫణి కుమార్ కుమార్తె భావనకు ఏపీఈఏపీసెట్లో 17 వేల ర్యాంకు వచ్చింది. అయితే, భావన ఇంటర్ తెలంగాణలో చదవడంతో రాష్ట్ర అధికారులు ‘స్థానికేతరుల’ జాబితాలో చేర్చారు. దీంతో ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు దక్కినప్పటికీ రాష్ట్రంలో భావన కోరుకున్న కళాశాలలో సీటు దక్కలేదు. దీనికితోడు నాన్ లోకల్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని తెలియడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది. ఈ అమ్మాయి ఒక్కరే కాదు.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో బీటెక్ అడ్మిషన్లు పొందడం గమనార్హం. జిల్లాలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థుల అనాసక్తి ‘స్థానికతపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో దుస్థితి పొరుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరడానికే మొగ్గు -
కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు
రొద్దం: ప్రజాబలం లేకున్నా అధికారం అండతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సాగించిన దౌర్జన్యం, దుర్మార్గాన్ని ప్రజలంతా చూశారని, తప్పకుండా వారికి బుద్ధి చెప్పి తీరుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామ పంచాయతీలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు హామీలు...అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ ‘క్యూఆర్ కోడ్’తో రూపొందించిన పోస్టర్లను నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు అనేక తప్పుడు హామీలు ఇచ్చి గద్దెక్కిన తర్వాత ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అంటేనే మోసం, దగ్గా, కుట్ర అన్నారు. వారు చేస్తున్న దౌర్జాన్యాలకు రాబోవు రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్లు చేసి, టీడీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున బూతుల్లోకి వదిలి దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. డీఐజీ, డీజీపీ, ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, కమిషనర్లు, ఎస్ఐలు, హోం మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు... ఇంతమంది మకాం వేసి జెడ్పీటీసీ గెలిపించడానికి ఎన్ని దారుణాలు చేశారో ప్రజలంతా చూశారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు చేసినా నైతికంగా వైఎస్సార్ సీపీనే గెలిచిందన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజాబలంతో కాకుండా ఈవీఎంల వల్ల ఎన్నికై న వారేనన్నారు. కలిసి కట్టుగా పనిచేదాం.. వైఎస్సార్ సీపీలో నాయకుడు, కార్యకర్త అనే బేధం లేదని... అందరం ఓ కుటుంబంగా కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, వార్డు సభ్యులు నాగరాజు, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, అక్కులప్ప, సి.నారాయణరెడ్డి, జట్టి శ్రీనివాస్రెడ్డి, వినయ్రెడ్డి, ఆవుల లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీధర్రెడ్డి, కౌన్సిలర్ సుధాకర్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, మహేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, వీరేష్, శంకర్రెడ్డి, సత్యనారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజం -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
పెనుకొండ: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. దుద్దేబండ క్రాస్ వద్ద సీఐ రాఘవన్ పర్యవేక్షణలో కియా ఎస్ఐ రాజేష్, సిబ్బంది బుధవారం వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన పెనుకొండ మండలం మునిమడుగుకు చెందిన ఓబన్న గారి వినోద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో వాహనాల అపహరణ విషయం బయటపడిందన్నారు. దీంతో నిందితుడు తెలిపిన మేరకు హరిపురం వద్ద ఓ రేషం గ్రైనేజ్ సెంటర్లోని పాడుబడిన రూంలో భద్రపరిచిన 31 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ రూ. 18.60 లక్షలు ఉంటుందన్నారు. కాగా, సెల్ఫోనప్లు, డ్రిప్వైర్లు అపహరించిన కేసుల్లో ధర్మవరం, అనంతపురం రైల్వే పీఎస్, కొత్తచెరువు పీఎస్ పరిధిలో వినోద్పై కేసులు ఉన్నాయన్నారు. జల్సాలకు అలవాటు పడి అనంతపురంలో 8, కదిరిలో 6, కర్ణాటకలోని పావగడలో 5, కర్నూలు జిల్లా డోన్లో 3, తిరుపతిలో 3, ధర్మవరంలో 2, కళ్యాణదుర్గం, పాకాల, రొద్దం, ముదిగుబ్బలో ఒకటి చొప్పున మొత్తం 31 మోటార్ సైకిళ్లు అపహరించినట్లుగా వినోద్ అంగీకరించాడన్నారు. అపహరించిన వాహనాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ హీరో హోండా కంపెనీకి చెందినవే కావడం గమనార్హం అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడి అరెస్ట్లో చొరవ చూపిన కియా పీఎస్ ఎస్ఐ రాజేష్, క్రైమ్ సిబ్బంది నాగరాజు, మారుతి, తదితరులను ఎస్పీ రత్న అభినందించారు. -
రైతులకు రాజకీయ రంగు పులమొద్దు
అనంతపురం సిటీ: రైతులకు రాజకీయ రంగు పులిమి సంక్షేమాన్ని అందకుండా చేయడం దారుణమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ అన్నదాత–సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం నిర్వహించిన స్థాయీ సంఘం–1, 2, 3, 4 5, 6, 7 సమావేశాలకు గిరిజమ్మ అధ్యక్షత వహించారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభం కాగానే యూరియా కొరతపై అధికారులను గిరిజమ్మ నిలదీశారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ ప్రశ్నించారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, భాస్కర్, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి సైతం వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే.. అదే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత–సుఖీభవ పథకం కింద ఇవ్వాల్సిన రూ.5 వేలను కొందరికి మాత్రమే జమ చేసి మిగిలిన వారికి మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ముద్రవేసి రైతులకు అన్యాయం చేయడం భావ్యం కాదన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్కు ముందు రైతులకు ఉచితంగా ఇచ్చే శాంపిల్స్ వేరుశగన కిట్లు వ్యవసాయ శాఖ అధికారులే బయట అమ్ముకున్నారంటూ డి.హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభాను ఆరోపించారు. తల్లికి వందనం అమలులో వంచన చేస్తారా? విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని జెడ్పీటీసీలు వేదాంతం నాగరత్నమ్మ, భాస్కర్, చంద్రకుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం అమలు వివరాలు ఇవ్వాలని అడగ్గా విద్యా శాఖ అధికారులు చేతులెత్తేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం చాలా దారుణంగా ఉంటోందని, పిల్లలకు పురుగులు పడిన, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశానికి ఆర్ఐఓ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను ఆయా శాఖాధిపతులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సభ్యులు కోరారు. చిలమత్తూరు జెడ్పీ హైస్కూల్లో తాగునీటి కొరతతో విద్యార్థులు అల్లాడిపోతున్నారని సభ దృష్టికి జెడ్పీటీసీ సభ్యురాలు అనూష తెచ్చారు. సమావేశంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
ప్రమాదంలో పాస్టర్ మృతి
ఓడీచెరువు (అమడగూరు): వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ చర్చి ఫాదర్ మృతి చెందారు. వివరాలు.. ఓడీచెరువులోని చర్చి ఫాదర్ దేవదాస్ (37) బుధవారం ఓడీచెరువు మండలంలోని డబూరువారిపల్లి, ఎం.కొత్తపల్లి, ఓడీచెరువుకు చెందిన కూలీలతో కలసి బొలెరో వాహనంలో అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని ఓ రైతు పొలానికి బయలుదేరారు. అమడగూరు మండలం మహమ్మదాబాద్ సమీపంలోకి చేరుకోగానే వాహనం బోల్తాపడింది. పాస్టర్ దేవదాస్, డబూరువారిపల్లికి చెందిన ఆంజనేయులు, ఎం.కొత్తపల్లికి చెందిన ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పాస్టర్ దేవదాస్ మృతి చెందారు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యుదాఘాతంతో మహిళ.. ఓడీచెరువు: మండలంలోని గాజుకుంటపల్లికి చెందిన హజీరా (53) విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో గృహోపకరణానికి ఫ్లగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ ప్రసరించి షాక్కు గురై గట్టిగా కేక వేస్తూ కుప్పకూలింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓడీ చెరువులోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్లో కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తి బలవన్మరణం పెనుకొండ రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన సంజీవప్ప (40)కు భార్య ముత్యాలమ్మ, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. బుధవారం ఉదయం నొప్పి తీవ్రత తాళలేక గ్రామ సమీపంలోని మల్బరీ షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
వీడని బాధ్యతారాహిత్యం
అనంతపురం మెడికల్: ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న జిల్లా వైద్య రంగంలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు శాపంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, బోధనాస్పత్రిలో కీలక అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన పలువురు ప్రజారోగ్యం జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు పట్టడం లేదని విమర్శలు చేస్తున్నారు. నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జిల్లా కేంద్రంలో గతంలో సీజ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రిని అనధికారికంగా తెరిచి రోగులకు చికిత్సలు అందజేస్తున్నా.. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోతే తప్ప డీఎంహెచ్ఓ మేల్కోనకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్.. లావణ్య పేరుపై తన ఆస్పత్రిలో ఓ మహిళకు చేసిన శస్త్రచికిత్స విఫలం కావడంతో ఏడాది క్రితమే కలెక్టర్ ఆదేశాలతో ఆ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. తన భార్య డెంటల్ వైద్యురాలని, ఆ ఆస్పత్రిని తెరుచుకుంటానని తరచూ ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ డాక్టర్ రమణ నాయక్ అప్పట్లో తిరిగారు. ఆ తర్వాత మూతపడిన లావణ్య ఆస్పత్రిని తెరిచి శ్రీకృప పేరుతో నడిపారు. ఇటీవల బీకేఎస్ మండలం చెదళ్లకు చెందిన గర్భిణి రాధమ్మ(29) ప్రాణం పోయాక మూత పడిన ఆస్పత్రిని తెరిచిన వైనం వెలుగు చూసింది. పర్యవేక్షణ మరచిన డీఎంహెచ్ఓ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం తీరూ ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలున్నాయి. గత నెలలో తాను నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసుకున్న ఉరవకొండ ప్రాంతానికి చెందిన రాజేష్ అనే 22 ఏళ్ల యువకుడిని తర్వాత జీజీహెచ్లో చేర్పించి చికిత్స అందజేయించారు. అయితే ఆ యువకుడి మృతితో కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జీజీహెచ్లో స్ట్రెచర్ అందుబాటులో లేక బెళగుప్ప తండాకు చెందిన మధునాయక్(23) మృతి చెందిన విషయం కలకలం రేపింది. తన సొంత ఆర్థో విభాగానికి సంబంధించిన వైద్యులు పట్టపగలే విధులకు డుమ్మా కొడుతున్నా డాక్టర్ ఆత్మారాం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బర్న్స్ వార్డును అనస్తీషియా విభాగానికి కేటాయించి విమర్శలకు తావిచ్చారు. ప్రధానంగా ఆస్పత్రిలో ఓ వైద్య విద్యార్థిని దోషిగా చేస్తూ ఆస్పత్రి గ్రూపులో ఏకంగా సదరు విద్యార్థి పేరును పోస్ట్ చేయడం కలకలం రేపింది. విద్యార్థి భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా పేరును ప్రస్తావించి పరువు తీయడం ఎంత వరకు సమంజసమని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రిన్సిపాల్ తీరూ అంతంతే ఇటీవల అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ షారోన్ సోనియా పనితీరు కూడా అంతంత మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి వైద్యులు కనీసం సమయపాలన పాటించేలా కూడా ఆమె చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిన వైద్యులు.. అలా వచ్చి తమ వాహనాలు కూడా దిగకుండా వైద్య కళాశాల ఎదుటనే తమ మొబైల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నారు. అనంతరం వారికి తీరికై నప్పుడు విధులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు.. జిల్లా వైద్య రంగాన్ని బాగుపరిచేవారెవ్వరూ లేరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య శాఖ, బోధనాస్పత్రిలో అధికారుల ఇష్టారాజ్యం సీజ్ చేసిన ఆస్పత్రిని తెరిచినా నిద్ర వీడని డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్లు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకోని ఏఎంసీ ప్రిన్సిపాల్ మంత్రి సత్యకుమార్కు పట్టని ప్రజారోగ్యం -
టీచర్లకు మోత... నేతలకు మేత
టీచర్లకు భారమే మూల్యాంకన పుస్తకాలు పిల్లలకే కాదు..టీచర్లకు కూడా భారమే. అన్ని పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లడం కుదరదు..అలాగని తరగతి గదిలో కూర్చొని వాటిని దిద్దడం కుదరదు. ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే. – బడా హరిప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ 1938 కదిరి: సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఇప్పటికే బోధనేతర పనులతో టీచర్లు సతమతమవుతుంటే తాజాగా ప్రభుత్వం సరఫరా చేసిన పరీక్షల అసెస్మెంట్ పుస్తకాలు గురువులకు కోపం తెప్పిస్తున్నాయి. సంస్కరణల మాట దేవుడెరుగు..కొందరు కూటమి నేతల జేబులు నింపడానికే ఈ పుస్తకాలను సరఫరా చేసినట్లు కనబడుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటి ద్వారా టీచర్లపై మూల్యాంకన భారం పడటంతో పాటు విద్యార్థులకు సైతం తీరని నష్టం జరుగుతుందని వారంటున్నారు. పరీక్ష కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక పుస్తకం.. జూన్, జూలై మాసాల సిలబస్పై విద్యార్థుల అభ్యసన మదింపు కోసం ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ–1) పరీక్షలు బుధవారం నాటికి 1–7 తరగతుల విద్యార్థులకు ముగిశాయి. 8, 9, 10 తరగతులకు గురువారం ఉదయం జరిగే బయాలజీ పరీక్షతో ముగుస్తాయి. గతంలో పిల్లలు తెల్లకాగితాల్లో పరీక్షలు రాస్తే... వాటిని టీచర్లు ఇంటికెళ్లి మూల్యాంకనం చేసేవారు. ఈ క్రమంలో బడిలో పిల్లల బోధనకు ఆటంకం కలిగేది కాదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున... ఎన్ని సబ్జెక్టులంటే అన్ని మూల్యాంకన పుస్తకాలను పంపిణీ చేసింది. ఇప్పటి నుంచి ఈ పుస్తకాల్లోనే ఏడాది మొత్తం అన్ని పరీక్షలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,696 ఉండగా.. ఆయా పాఠశాలల్లో 1,42,327 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతమంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకటి చొప్పున పుస్తకాలను ఇవ్వాలంటే రూ.కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదో పెద్ద స్కాం..అని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వీటి వల్ల పిల్లలకు నష్టమే గానీ ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ఇంటికి మోసుకెళ్లడం సాధ్యమా..? గతంలో సమాధాన పత్రాలను ఆయా సబ్జెక్టు టీచర్లు ఇంటికి తీసుకెళ్లి మూల్యంకనం చేసి మార్కులు వేసి తిరిగి పాఠశాలకు తీసుకు వచ్చేవారు. కొందరు టీచర్లు వెసులుబాటును బట్టి బడిలోనే దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలన్నింటినీ ఉపాధ్యాయులు ఇంటికి మోసుకెళ్లి వాటిని దిద్ది మళ్లీ పాఠశాలకు మోసుకురావడం సాధ్యమా..? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. తరగతి గదిలోనే వాటిని దిద్దాలంటే బోధనకు సమయం ఎక్కడ సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. కాపీ కొట్టేందుకు అవకాశం.. ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2 పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు కొన్ని క్వార్టర్టీ, హాఫ్ ఇయర్లీలో నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో కూడా పునరావృతమవుతాయి. అప్పుడు విద్యార్థులు ఈ మూల్యాంకన పుస్తకాల్లో గతంలో రాసిన సమాధానాలను చూసి కాపీ కొట్టేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా విద్యార్థులకు నష్టమే తప్ప లాభం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులపైనే కాకుండా టీచర్లపై కూడా ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా రుద్దడం సరి కాదని ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. సంస్కరణల పేరిట మాల్యాంకన పుస్తకాల పంపిణీ బడిలోనే పేపర్లు దిద్దాల్సి రావడంతో బోధనపై ప్రభావం కూటమి సర్కార్ అనాలోచిత నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం బోధన సమయం వృథా మూల్యాంకనం పుస్తకాలు బడిలోనే దిద్దాలంటే బోధన సమయం వృథా అవుతుంది. సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలి గానీ ఇలా కీడు చేస్తే విద్యావ్యవస్థ నాశనమే. – కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ -
ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా
రామగిరి: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఏర్పాట్లు చేశారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అయితే 10 మంది ఎంపీటీసీలకు గాను కేవలం ముగ్గురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వారు కూడా పురుషులు కావడం...ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో ఎన్నికల అధికారి సంజీవయ్య రామగిరి ఎంపీపీ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. ఒక్కసీటుతో పీఠం కోసం టీడీపీ పాకులాట.. రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మను ఆ పార్టీ అధిష్టానం ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టింది. అయితే గత డిసెంబరులో మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. నాలుగోసారి వాయిదా.. రాష్ట్ర ఎన్నికల సంఘం రామగిరి ఎంపీపీ ఎన్నికకు మార్చి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. మే 18న రెండోసారి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా, మహిళా సభ్యులు హాజరుకాకపోవడంతో రెండోసారి వాయిదా పడింది. జూలై 16న మూడోసారి ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగానికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికను బహిష్కరించడంతో మరోసారి వాయిదా పడింది. తాజాగా బుధవారం ఎన్నిక సజావుగా జరుగుతుందనే నమ్మకం లేనందున వైఎస్సార్ సీపీ సభ్యులు రాలేకపోయినట్లు సమాచారం. దీంతో నాల్గోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికకు ముగ్గురు ఎంపీటీసీలే హాజరు టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల గైర్హాజరు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారి -
మద్యంలో మునిగితేలుతున్నారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఊరూరా వెలసిన బెల్టుషాపులు మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే స్థాయికి చేరాయి. నగరంలో వైన్షాపులు సమయం ప్రకారమే నడుచుకోవాలి. కానీ బెల్టుషాపులకు సమయమూ సందర్భమూ ఏమీ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తారు. పల్లెల్లో ప్రస్తుతం ఏదైనా బాగా అందుబాటులో ఉందీ అంటే అది మద్యమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయల షాపుల కంటే ఎక్కువ సాధారణంగా ఊరికి రెండు, మూడు కూరగాయల షాపులు.. మండల కేంద్రాల్లో అయితే పదిహేను, ఇరవై వరకూ అందుబాటులో ఉంటాయి. కానీ రాప్తాడు నియోజకవర్గంలోని 1,500 జనాభా ఉండే బండమీదపల్లెలో 15 నుంచి 20 వరకూ బెల్టుషాపులున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాల వ్యాన్లు ఎలా అయితే షాపులకు పాలు వేస్తూ వెళతాయో అదే తరహాలో బెల్టుషాపులకు మందు సరఫరా చేయడానికి వ్యాన్లు ఏర్పాటు చేశారు. కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఏ ఊరికెళ్లినా పట్టపగలే రోడ్డుమీద మద్యం పెట్టి అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తాయి. రూ.1,550 కోట్ల వినియోగం.. 2024 సెప్టెంబర్ 15న కొత్త మద్యం పాలసీ వచ్చింది. అప్పటినుంచి ఈరోజు వరకూ అంటే 11 నెలల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,550 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందంటే ఎలా తాగుతున్నారో అంచనా వేయొచ్చు. ఈ 11 నెలల్లో 1.97 కోట్ల లీటర్ల మద్యం సేవించారు. బీర్ల సేవనం దీనికి అదనం. పట్టణాల్లో అయితే పర్మిట్ రూముల్లో మందుబాబులు మద్యంలో మునిగి తేలుతున్నారు. మామూళ్లు మద్దయ్యకు తెలిసే.. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందుకు నెలనెలా ఎకై ్సజ్ అధికారులకు మామూళ్లు వెళుతున్న విషయం తెలిసిందే. ఇదంతా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్(డీసీ) నాగమద్దయ్యకు తెలిసే జరుగుతోందని ఒక ఎక్సైజ్ అధికారి చెప్పారు. ‘మామూళ్ల సంగతి కిందిస్థాయి కానిస్టేబుల్కే తెలిసినప్పుడు డీసీకి తెలియకుండా ఉంటుందా?’ అనే చర్చ జరుగుతోంది. దీనిపై డీసీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. నెలనెలా పెరుగుతూనే ఉన్న వినియోగం పల్లె పల్లెనా విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటు 11 మాసాల్లో రూ.1,550 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు 1.98 కోట్ల లీటర్ల మద్యం సేవనం -
బాబు మోసాలను ఊరూరా వివరిద్దాం
గోరంట్ల: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిన తీరును ఊరూరా వివరిద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రతి ఇంటికి వెళ్లి వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని బూదిలి, మల్లాపల్లి, గౌనివారిపల్లి, మలసముద్రం, కొండాపురం, గోరంట్లలో ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నెరవేర్చలేదన్నారు. పైగా హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏడాది మూడు సిలిండర్లు ఇస్తామన్న కూటమి నేతలు...ఒక్క సిలిండర్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ‘తల్లికి వందనం’ అమలులోనూ నిబంధనల పేరుతో అర్హులకు పథకం అందకుండా చేశారన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా... 14 నెలలల తర్వాత అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారన్నారు. ఇక నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే బీసీలకు పింఛన్, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీలేవీ అమలు చేయకుండా అందరినీ మోసం చేశారన్నారు. కానీ 14 నెలల పాలనలో రూ.140 వేల కోట్లు అప్పు చేసి కూటమి నేతలు జేబులు నింపుకున్నారని ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. ‘హామీల అమలు ఎప్పుడు బాబూ’ అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ గొంతునొక్కుతున్నారన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అధికారం అండతో అరాచకాలకు పాల్పడ్డారన్నారు. కూటమి నేతలు బరితెగించి స్థానికేతరులతో ఓట్లు వేయిస్తున్నా... వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేస్తున్నా పోలీసులు కూడా చూస్తూ ఊరుకోవడం దుర్మార్గమన్నారు. గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఇలాగే వ్యవహరించిందని, ఆ తర్వాత కొన్ని నెలలకే అబాసుపాలైన సంగతి ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, పట్టణ కన్వీనర్ మేదర శంకర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గంపల వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపు -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కదిరి టౌన్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ, కార్మిక రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం కదిరిలో జరిగిన సీపీఎం 14వ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులతో కలసి సీపీఎం జిల్లా కార్యదర్శిగా రామకృష్ణతో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
21 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా 106.04 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 10.2 మి.మీ, పుట్టపర్తి మండలంలో 10 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అలాగే తాడిమర్రి మండలంలో 9.2 మి.మీ, ఎన్పీకుంట 9.0, హిందూపురం 8.4, తలుపుల 6.8, ముదిగుబ్బ 6.4, రొళ్ల 6.4, కనగానపల్లి 4.6, రామగిరిలో 4.2, అగళి 4, లేపాక్షి 4, కదిరి 3.8, చెన్నేకొత్తపల్లి 3.2, గుడిబండ 3 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్ల అధికారులు వెల్లడించారు. కొత్తచెరువు, ధర్మవరం, గాండ్లపెంట, మడకశిర, తనకల్లు, బుక్కపట్నం మండలాల్లో తుంపర వర్షం కురిసిందని తెలిపారు. తాజా వర్షాలతో పుట్టపర్తి మండలంలోని గాజులపల్లి చెరువు నిండి మరువ పారుతోంది. ఇక సాహెబ్ చెరువు, చెర్లోపల్లి చెరువుల్లోకి నీళ్లు చేరాయి. మడకశిరలో ఎలుగుబంట్ల సంచారం ● భయాందోళనలో ప్రజలు మడకశిర: పట్టణ శివారులో ఎలుగుబంట్ల సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మంగళవారం ఉదయం చౌటిపల్లి సమీపంలో ఓ గ్యాస్ గోదాము వద్ద రెండు ఎలుగుబంట్లు కనిపించడంతో కలకలం రేగింది. దీంతో స్థానికులు అటువైపు వెళ్లేందుకే భయపడిపోయారు. పట్టణానికి సమీపంలోని కొండ పైనుంచి ఎలుగుబంట్లు శివారులోని కాలనీల్లోకి వస్తున్నాయి. ఇటీవలే ఓ ఎలుగుబంటి రాత్రి వేళ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో కనిపించిన విషయం తెలిసిందే. ఎలుగుబంట్లు జనావాసాల్లో సంచరిస్తూ భయపెడుతున్నా స్థానిక అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా ఎలుగుబంట్ల బెడదను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీఆర్కు ఎస్ఐ రాజశేఖర్ ● ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రత్న ● విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్పై వేటు పడింది. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబంఽధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్ను వీఆర్కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న జయరాంనాయక్ను నియమించారు. -
త్రివర్ణ పతాకంతో ర్యాలీ
లేపాక్షి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలోని ఓరియంటల్ ఉన్నత పాఠశాల, ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులు 600 అడుగుల తివర్ణ పతాకాన్ని మంగళవారం ఉదయం ర్యాలీగా ప్రదర్శించారు. నంది విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి నెలకొల్పాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామపెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక
సాక్షి, పుట్టపర్తి: ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక బుధవారం రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పారని పాచిక ఎంపీపీ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థి లేకున్నా.. సొంత మండలంలో పీఠం దక్కించుకోవాలని పరిటాల సునీత పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. పరిటాల సునీత పాచిక పారలేదు. దీంతో ఎంపీపీ పీఠం కోసం మరోసారి ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. బుధవారం నాల్గోసారి రామగిరి ఎంపీపీ పదవి కోసం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. టీడీపీ నేతలు చేస్తోన్న అరాచకాలతో ఈసారి కూడా ఎంపీపీ ఎన్నికకు సభ్యులు హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఫలితంగా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. బలం లేకున్నా.. పీఠంపై గురి రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 9 చోట్ల వైఎస్సార్సీపీ జయకేతనం ఎగుర వేసింది. టీడీపీ ఒక స్థానంలో సరిపెట్టుకుంది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో రామగిరి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ఆమె హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ బలం ఆరుగా ఉంది. టీడీపీ సభ్యుడి జతకు పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు చేరారు. ఫలితంగా టీడీపీ సంఖ్య మూడుకు చేరింది. ఇంకో స్థానం ఖాళీగా ఉంది. పార్టీ ఫిరాయించిన వారిలోనూ ఒకరు జనసేనలోకి వెళ్లారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉన్న వారిలో ఒక్కరు కూడా మహిళ లేకపోవడంతో పోటీ చేసేందుకు అభ్యర్థి లేక.. పరిటాల సునీత దిక్కులు చూస్తున్నారు. అయితే బలవంతంగా ఎవరో ఒకరికి కండువా వేసి ఎంపీపీ పదవి కట్టబెట్టి జెండా ఎగరవేయాలని ప్లాన్లో ఉన్నట్లు తెలిసింది. రచ్చ చేసి.. వాయిదా వేసి.. ఎంపీపీ ఎన్నిక ఇప్పటి వరకు మూడుసార్లు వాయిదా పడింది. దీంతో నాల్గోసారి నోటిఫికేషన్ వదిలారు. ప్రతిసారీ టీడీపీ నేతలు రచ్చ చేస్తుండటంతో వాయిదా పడుతూ వస్తోంది. సామరస్యంగా.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికను రచ్చ చేసి.. తమ వైపు తిప్పుకోవాలని చూస్తుండటంతో వాయిదా పడుతూ వస్తోంది. -
మద్యం.. జీవితాలు ఛిద్రం
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీధివీధికీ బెల్టు షాపులు, పల్లెపల్లెకూ మద్యం దుకాణాలు వెలిశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం దొరుకుతోంది. దీంతో పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువత కూడా పట్టపగలే పూటుగా తాగి హల్చల్ చేస్తున్నారు. కొందరు మద్యం దుకాణాల పక్కనే కునుకు తీస్తున్నారు. మరికొందరు మత్తులో వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పైగా ఎదుటివారిపైనే గొడవకు దిగుతున్నారు. విషయం పోలీసుల వరకూ చేరుతుండగా..చివరకు జైలుపాలవుతున్నారు. జనావాసాల్లోనే మద్యం దుకాణాలు కదిరి, కొత్తచెరువు, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, మడకశిర ఇలా.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యే మద్యం దుకాణాలు వెలిశాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా పక్కనే రూములు, బండలు వేసి మందుబాబులకు వసతి కల్పిస్తున్నారు. ఫలితంగా జనావాసాల మధ్యనే ఉన్న మద్యం దుకాణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఉన్న కూటమి పార్టీల నాయకులు ఒత్తిడి చేస్తుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులపైనే దాడి మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరంలో 21 ఏళ్ల యువకుడు మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు మందలించారు. మత్తులో ఆ యువకుడు కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. దీంతో వారు బయటికి పరుగులు తీశారు. పగటి పూట కావడంతో ఇరుకుపొరుగు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మడకశిరలోనూ వెల్డింగ్ షాపులో పని చేసే 17 ఏళ్ల బాలుడు పూటుగా మద్యం సేవించి రాత్రి 11 గంటల సమయంలో ఇతరుల ఇంట్లో చొరబడ్డాడు. బీరు సీసాలతో రెచ్చిపోయాడు. ఇంట్లో ఉన్నోళ్లు భయపడి తలుపులు వేసుకున్నారు. ఉదయాన్నే పోలీసులను ఆశ్రయించారు. మందుబాబుకు పోలీసులు దేహశుద్ధి చేసి వదిలేశారు. ఇక మద్యం మత్తులో కొందరు యువకులు వర్గాలుగా ఏర్పడి దాడులకు దిగుతున్నారు. ఇది ఒక్కోసారి పెద్ద గొడవగా మారి ముష్టి యుద్ధాలను తలపిస్తున్నాయి. విచ్చల విడిగా మద్యం విక్రయాలు పట్టపగలే తాగి తూలుతున్న యువకులు మత్తులో వాహనాలతో హల్చల్ అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనే దాడులురోడ్ల పక్కనే కునుకు సమయపాలన లేకుండా.. ఎలాంటి షరతులు వర్తించకుండా.. ఎక్కడపడితే అక్కడ ఏ సమయంలో అయినా సరే మద్యం లభిస్తోంది. దీంతో మందుబాబులు తప్పతాగి ఇంటికి వెళ్లలేని స్థితిలో రోడ్ల పక్కనే కునుకు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తచెరువు, కదిరి, పుట్టపర్తిలో వెలుగు చూశాయి. మందుబాబులు పట్టపగలే రోడ్లపై కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోనూ మద్యం దుకాణాల పక్కనే వసతి కల్పించడంతో మందుబాబులు అక్కడే తాగి చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్పై వేటు పడింది. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్ను వీఆర్కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న జయరాంనాయక్ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్.. -
నృత్యం ధార్మిక చింతనకు దోహదం
బొమ్మనహళ్లి : ధార్మిక చింతనకు నృత్యం కూడా దోహదం చేస్తుందని నాట్య కళాకారిణి, దంత వైద్యురాలు డాక్టర్ రాఘశ్రీ అన్నారు. బెంగళూరు నగరంలోని అక్నూరులో ఉన్న రాఘవేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొని నాట్య ప్రదర్శన ఇచ్చి మాట్లాడారు. నాట్యం భక్తులను ఆకట్టుకునే భగవంతుని సేవ అని అన్నారు. ఇందుదకు బేలూరులో చెన్నకేశవస్వామి ఆలయంలోని శాంతలా దేవి శిల్పాలే నిదర్శనమన్నారు. కౌశల్యాలను పెంపొందించుకోవాలి చిక్కబళ్లాపురం : విద్యార్థులు కౌశల్యాలను వృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర కౌశల్య అభివృద్ధి మండలి అధ్యక్షురాలు శివకాంతమ్మ నాయక్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలనా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ నుంచి 12వ తరగతి వరకు కౌశల్య అభివృద్ధికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ పీఎన్ రవీంద్ర, జిల్లా పంచాయత్ ఉప కార్యదర్శి అతిక్ పాషా, పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగప్ప పాల్గొన్నారు. -
కన్నడనాట గజరాజుల ఖుషీ
ప్రేమ పెళ్లి.. రెండేళ్లకే బాలిక ఆత్మహత్యహోసూరు: తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకొన్న బాలిక ఆత్మహత్య చేసుకొన్న ఘటన వెలుగు చూసింది. వివరాల మేరకు.. బిహార్కు చెందిన ఉదయ్సాధ(19), జ్యోతికుమారి(16) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ దంపతులు హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని దాసరపల్లిలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 9వ తేదీ జ్యోతికుమారి తన తల్లిదండ్రులతో సెల్ఫోన్లో మాట్లాడగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆవేశం చెందిన బాలిక సెల్ఫోన్ను కింద పడేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం భర్త గాలిస్తుండగా అదే ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ఘటనపై బాగలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్లైన రెండేళ్లకే బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై హోసూరు సబ్కలెక్టర్ విచారణ చేపట్టారు. డివైడర్కు కారు ఢీ.. దంపతుల మృతి క్రిష్ణగిరి : బెంగళూరు నుంచి పుదుచ్చేరికి వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో దంపతులు మృతి చెందిన ఘటన మత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన దురైరాజ్(64) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. ఆయన తన భార్య హిందుల(55)తో కలిసి రెండు రోజుల క్రితం కారులో బెంగళూరుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి తిరిగి వెళుతుండగా క్రిష్ణగిరి సమీపంలోని కణ్ణండహళ్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు మధ్యన ఉన్న డివైడర్ను ఢీకొంది. దురైరాజ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, హిందులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బనశంకరి: గజరాజుల సంతతిలో కన్నడనాడు దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఏనుగులు జీవించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాటు వాటి రక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్య వల్ల గజ సంపద పెరుగుతోంది. గజరాజుల పరిరక్షణకు ప్రజలను జాగృతం చేసే దృష్టితో అంతర్జాతీయ ఎలిపెంట్ ఫౌండేషన్ వన్యజీవి సంస్థ 2012 నుంచి ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు. 2016 నుంచి భారత్లో ఏనుగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1879లో ఏనుగుల సంరక్షణకు ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక అనుమతి మినహా ఏనుగులను వధించడం, గాయపరచడం, బంచడం లాంటి వాటిని నిషేధించారు. 2010లో భారతప్రభుత్వం ఏనుగులను పరంపారిక జంతువుగా ప్రకటించింది. దక్షిణ భారతదేశంలోనే ఏనుగులు అధికం దేశంలో 27,312కు పైగా ఏనుగుల సంతతి ఉండగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం గజరాజులు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 12,210 ఏనుగులు ఉన్నాయి. కర్ణాటకలో 6,395 ఏనుగులు, కేరళలో 3,054, తమిళనాడులో 2,761 ఏనుగులు ఉన్నాయి. కర్ణాటక బండీపురలో 1,116 ఏనుగులతో రాష్ట్రంలోనే అత్యధిక ఏనుగులు నిలయంగా ఉంది. నాగరహొళే పులి సంరక్షణప్రదేశంలో 831, మలెమహదేశ్వర వన్యధామకేంద్రంలో 706, బిళిగిరిరంగనబెట్ట ప్రదేశంలో 619, కావేరి వైల్డ్లైఫ్లో 236, మడికేరి విభాగంలో 214, మడికేరి వైల్డ్లైఫ్లో 113, మైసూరు విభాగంలో 59, విరాజపేటే విభాగంలో 58 ఏనుగులు ఉన్నాయి. యల్లాపుర విభాగంలో కేవలం 2 ఏనుగులు ఉన్నాయి. మనావులు, గజరాజుల మధ్య సంఘర్షణ రాష్ట్రంలోని ఏనుగుల కారిడార్లు చిధ్రం కావడం, అడవుల్లో వెదురు ఎండిపోవడంతో మేత, నీరుకోసం గజరాజులు అరణ్యం వీడి జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో గజరాజులు, మానవుడి మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. ఫలితంగా ఏనుగుల మృత్యవాత కొనసాగుతుండగా గత ఐదేళ్ల నుంచి వివిధ కారణాలతో 372 ఏనుగులు మృత్యవాతపడ్డాయి. ఇందులో 67 ఏనుగులు మృతి అసహజమరణం కాగా కొన్ని ఏనుగులు తుపాకి గుండ్లకు, మరికొన్ని విద్యుత్షాక్ తగిలి మృతిచెందాయి. కొన్ని రైలు ప్రమాదంతో మృత్యవాతపడ్డాయి. హాసన, కొడగు, మైసూరు, చామరాజనగర, మండ్య, బెంగళూరు గ్రామాంతర, కనకపుర ప్రదేశాల్లో ఏనుగులు–మానవుడి సంఘర్షణ హెచ్చుమీరింది. ముఖ్యంగా హాసన జిల్లా సకలేశపుర, ఆలూరు తాలూకాల్లో నిరంతరంగా సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో 2020–21లో 74, (16 అసహజమృతి), 2021–22లో 89(16 అసహజమృతి), 2022–23లో 74,(16 అసహజమృతి), 2023–24లో 101(14 అసహజమృతి),2024–25లో 34(5 అసహజంగా ఏనుగులు మృతిచెందాయి. విద్యుత్షాక్తో మృతిచెందిన అశ్వత్దామ రెండుసార్లు మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొని భవిష్యత్ అంబారీ అని ఖ్యాతి ఘడించిన 38 ఏళ్ల అశ్వత్థామ అనే ఏనుగు నాగరహోళే పులి సంరక్షణ ప్రదేశశిబిరంలో విద్యుత్షాక్ తో మృతిచెందింది. ఏనుగు కారిడార్ చాలా ముఖ్యం ఏనుగు కారిడార్ చిన్నదారి కాగా అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరించడానికి అనువు కల్పించాలి. నేడు చాలావరకు ఏనుగు కారిడార్లు ఆక్రమణకు గురికావడంతో ఏనుగులు సంచారానికి ఇబ్బందికరంగా మారింది. ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారం లభ్యత చూసుకుని ఏనుగులు సంచరిస్తాయి. వర్షాలు తగ్గినప్పుడు ఊటీ కొండలు పైకి వెళతాయి. వర్షాకాలంలో కొండలు దిగి బండీపుర, నాగరహోళే వైపు వెళతాయి. దీంతో ఏనుగు విషయంలో ఒక భాగానికి మాత్రమే పరిష్కారం చేయడం కుదరదు. తమిళనాడు ఊటీ ,వైనాడు, పాత మైసూరు భాగంతో పాటు మొత్తం పరిష్కారచర్యలు తీసుకోవాలి. ఒడిస్సా, చత్తీస్ఘడ్, జార్కండ్, మహారాష్ట్రలో అదికమైన అడవులు ఉన్నప్పటికీ ఏనుగులు లేవు. ఇక్కడ ఉన్న ఏనుగులను అక్కడికి తరలించవచ్చా అనేది శాసీ్త్రయంగా చూడాలని వన్యజీవి నిపుణుడు కేఎస్.సుదీర్ తెలిపారు. గజ సంపదలో రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంలో 6,395 ఏనుగులు నాగరహొళే పులి సంరక్షణప్రదేశంలో అత్యధికంగా 831 గజరాజులు -
అధికారమిస్తే రైతులకు నిరంతర విద్యుత్
హోసూరు, కెలమంగలం: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత యడపాడి పళణీస్వామి రెండు రోజుల పాటు జిల్లాలోని వేపనపల్లి, తళి, హోసూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. సోమవారం సాయంత్రం రాయకోట సమీపంలోని కాడుశెట్టిపల్లి వద్ద ఆయనకు అన్నాడీఎంకే నాయకులు భారీ ఎత్తున స్వాగతం లభించింది. కెలమంగలంలో మంజునాథ్, మునిరెడ్డి, సంగీత వెంకటరామన్, కే.వీ.వెంకటేష్ తదితరులు మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాయకోట బస్టాండు, కెలమంగలం, డెంకణీకోట, హోసూరు ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. డెంకణీకోట, హోసూరులో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలపై వివరించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ప్రారంభం హోసూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం మాజీ సీఎం పళణీస్వామి ప్రారంభించారు. తేరుపేటలో వెలసిన శ్రీమరకతాంబ సమేత చంద్రచూడేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. మధ్యాహ్నం పారిశ్రామికవాడ మూకొండపల్లిలోని ప్రైవేట్ హోటల్లో రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. కార్యక్రమానికి క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా కార్యదర్శి మాజీ మంత్రి పి.బాలక్రిష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యుడు తంబిదురై, వేపనపల్లి ఎమ్మెల్యే కే.పీ.మునిస్వామి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రిష్ణగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి పళణీస్వామి వెల్లడి -
ఏనుగు దాడిలో రైతు మృతి
కెలమంగలం: పేడను చెత్తకుప్పలో పడవేసేందుకు వెళ్లిన రైతుపై ఏనుగు దాడి చేసి చంపిన ఘటన మంగళవారం తళి సమీపంలో చోటు చేసుకొంది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని చూడసంద్రం గ్రామానికి చెందిన రైతు కుళ్లప్ప(60) ఉదయం పశువుల పేడను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేవేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో క్షత్రందొడ్డి అటవీ ప్రాంతం నుంచి బయటకొచ్చిన ఓ ఏనుగు రైతుపై దాడి చేసింది. ఈ ఘటనలో కుళ్లప్ప ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా డెంకణీకోట, తళి, అంచెట్టి, సూళగిరి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఏనుగుల దాడుల్లో పంటలు ధ్వంసం, రైతులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నా అటవీ శాఖాధికార్లు చర్యలు చేపట్టలేదంటూ రైతు రక్షణ సంఘం ద్వారా ఆందోళన నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు గణేష్రెడ్డి తెలిపారు. -
అప్పులు తీర్చడానికి యజమాని ఇంటికి కన్నం
బనశంకరి: స్నేహితుల వద్ద చేసిన అప్పు తీర్చడానికి యజమాని ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన మేనేజర్ను జయనగర పోలీసులు అరెస్ట్చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.89.09 లక్షల విలువచేసే కిలో 40 గ్రాముల నగలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. జయనగర 4 వబ్లాక్ సంగం సర్కిల్లో అశోక్పరస్రామ్పూరియా అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన వద్ద కార్తీక్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా మేనేజర్గా ఉంటున్నాడు. ఇంటిలోని బంగారుఆభరణాలు, నగదు గల్లంతు కావడంతో యజమాని తన మేనేజర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.జయనగర పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టి కార్తీక్ను అరెస్ట్చేయగా పలువురు వద్ద చేసిన అప్పులు తీర్చడానికి ఈ చోరీకి పాల్పడినట్లు నోరు విప్పాడు. నకిలీ తాళం తీసుకుని యజమాని కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అప్పుడప్పుడు బంగారు ఆభరణాలు, నగదును చోరీకి పాల్పడి ఫైనాన్స్ సంస్థల్లో కుదువపెట్టినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆయా సంస్థలనుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో దక్షిణ విభాగ డిప్యూటీ పోలీస్కమిషనర్ లోకేశ్భరమప్ప, జయనగర ఉపవిభాగ అసిస్టెంట్ పోలీస్కమిషనర్ నారాయణస్వామి, జయనగర సీఐ దీపక్ తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ అరెస్ట్ రూ.89.09 లక్షల విలువైన బంగారు, వెండి స్వాధీనం -
మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులకు శ్రీకారం
బనశంకరి: ఎల్లో మెట్రో మార్గానికి అనుసంధానంగా బీఎంటీసీ ఏర్పాటు చేసిన మెట్రో ఫీడర్బస్సు సర్వీస్ సేవలను ఎలక్ట్రానిక్ సిటీ వద్ద రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్ప మంగళవారం ప్రారంభించారు. బెంగళూరునగర, శివారు వలయ ప్రయాణికులకు ఉత్తమ, సులభ రవాణా సేవలను అందించేందుకు రోజూ 6217 బస్సులతో 65, 206 ట్రిప్పులతో 12.85 లక్షల కిలోమీటర్ల మేర సంచరిస్తూ 44 లక్షల మందిని గమ్యాలకు చేర్చుతున్నట్లు మంత్రి తెలిపారు. 20 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రో ఫీడర్సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్సిటీ చుట్టుపక్కల ప్రదేశాల్లో హొసూరు మెయిన్రోడ్డులో 100 మార్గాల్లో 619 నెంబరుతో 3 వేల ట్రిప్పులు మెట్రో ఫీడర్ బస్సులు సేవలు అందించనుంది. -
వీల్ చైర్ టెన్నిస్ టోర్నీలో విజయకేతనం
బొమ్మనహళ్లి : చైన్నెలో జరిగిన జాతీయ స్థాయి వీల్చైర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర జట్టు విజయకేతం ఎగరవేసి ఆరు పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్, డబుల్స్లో శేఖర్ చాంపియిన్గా నిలిచారు. మహిళల సింగిల్స్, డబుల్స్లో ప్రతిమారావు రన్నరప్గా నిలిచారు. క్రీడాకారుల సాధనను వీల్చైర్టెన్నిస్ సంస్థ అధ్యక్షుడు చంద్రకాంత్ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. ఘనంగా వీరాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన చిక్కబళ్లాపురం: జిల్లా కేంద్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ జీర్ణోద్ధారణలో భాగంగా వీరాంజనేయస్వామి రాతి విగ్రహహ ప్రతిష్టాపన, విమానగోపురం, రాజగోపురం మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాగణపతి హోమం, స్పర్శాహుతి, 108 ద్రవ్యాహుతి కార్యక్రమాలను నెరవేర్చారు. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇదే సందర్భంలో సామూహిక వివాహలు నిర్వహించారు. శ్రీ సిద్దేశ్వరస్వామీజీ వధూవరులను ఆశీర్వదించారు. దేవరాజు అరసు మెడికల్ కళాశాల అధ్యక్షడు జీహెచ్ నాగరాజు కుమారుడు వినయ్శామ్, కుటుంబసభ్యులు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు -
బిడ్డ మృతిని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం
మైసూరు : కుమార్తె మృతిని జీర్ణించుకోలేని తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఈఘటన మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకా కొళ్లెగౌడనహళ్లిలో జరిగింది. చైత్ర, రసిక దంపతుల కుమార్తె శ్వేత(3) ఇంటి వెనుక ఆడుకుంటూ కాలుజారి పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే రక్తం ఎక్కువగా కారడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో తీవ్ర ఆవేదనకు లోనైన తల్లి చైత్ర పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. హెచ్డీకోటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు ● పోలీసు అధికారికి మహిళ ఫిర్యాదు యశవంతపుర: ప్రాణం తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అత్యాచారానికి గురై శిశువుకు జన్న ఇచ్చిన బాధిత మహిళ దక్షిణకన్నడ జిల్లా మంగళూరు పశ్చిమ విభాగం డీఐజీ అమిత్సింగ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం బాధిత మహిళ తన శిశువును తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేశారు. పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుడు జగన్నీవాసరావ్ కుమారుడు శ్రీకృష్ణరావ్, తనది ఒకే ఊరని, ఇద్దరం కలిసి 9వ తరగతి నుంచి ప్రేమించుకున్నట్లు పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి శారీరకంగా కలవడంతో శిశువుకు జన్మ ఇచ్చినట్లు పేర్కొంది. తన ఫిర్యాదుతో అతను జైలుకు వెళ్లాడని, ప్రస్తుతం అతని కుటుంబం తనను హత్య చేస్తామంటూ బెదిరిస్తోందని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. శ్మశాన స్థలం కబ్జాయశవంతపుర: వాణిజ్య కట్టడాలు, ఇళ్లు, భూములను కబ్జాలను చేయటం చూశాం. కానీ దక్షిణకన్నడ జిల్లా బంట్వాళ తాలూకా అమ్మాడి గ్రామంలో కొందరూ శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. అమ్మాడి దేవినగరలోని హిందూ రుద్రభూమిని కబ్జా చేయగా శ్మశాన వాటికలోని రూ. 4 లక్ష విలువ గల అనేక వస్తువులు చోరీకి గురైనట్లు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావటీలకు రాఖీ కట్టిన మహిళలు మైసూరు : మైసురు దసరా ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన జంబూ సవారీలో పాల్గొనే గజరాజులను తీసుకొని వచ్చిన మావటిలకు, కాపలదారులకు శ్రీదుర్గా ఫౌండేషన్కు చెందిన మహిళలు రాఖీలు కట్టి రక్షాబంధన్ను ఘనంగా నిర్వహించారు. ప్యాలెస్ మైదానంలో ఉన్న మావటిలకు, కాపలదారుకు రాఖీలు కట్టి హారతి ఇవ్వడంతొపాటు స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం డీసీఎఫ్ ప్రభుకు సైతం మహిళలు రాఖీ కట్టారు. ఫౌండేషన అధ్యక్షురాలు రేఖా శ్రీనివాస్, రుషివిను, కావ్య, రాఘవేంద్ర, రాజేష్లు పాల్గొన్నారు. -
అశ్లీల సందేశాలు ఫార్వర్డ్ చేసినందుకు కటకటాలు
● నటి రమ్య కేసులో మరో వ్యక్తి అరెస్ట్ యశవంతపుర: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. విజయపురకు చెందిన సంతోష్ అనే నిందితుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సిమెంట్ పనిచేసేవాడని, దర్శన్ విషయంపై రమ్య వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అశ్లీల సందేశాలను చదివి అనేక మందికి ఫార్వర్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అశ్లీల సందేశాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో సంతోష్ తన సెల్ఫోన్ ఆఫ్ చేశాడు. అయితే ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. కూలిన చెట్ల తొలగింపుగౌరిబిదనూరు: పట్టణంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చెట్లు నేలకూలాయి. 21 వార్డు మునేశ్వర కాలనీ, అరవింద నగరలో రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాలు, పాదచారుల సంచారానికి ఇబ్బందిగా మారింది. మాజీ మున్సిపల్ సభ్యుడు అనంతరాజు స్పందించి అటవీశాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పౌరకార్మికుల సహకారంతో కూలిన చెట్లను తొలగింపజేశారు. అటవీశాఖ అధికారి యల్లప్ప, వాజీరావ్, నాగేశ్, నరసింహమూర్తి ,శ్రీనివాస్ తిమ్మరాజు పాల్గొన్నారు. గూడ్స్ ఆటో బ్యాటరీలు చోరీ మైసూరు : మైసూరులో దొంగలు చెలరేగారు. మహానగర పాలికెకు చెందిన ఎనిమిది గూడ్స్ ఆటోలకు చెందిన బ్యాటరీలను చోరీ చేశారు. కుంబారకొప్పలులో చెత్త సేకరణ కోసం గూడ్సు ఆటోలు ఏర్పాటు చేశారు. సోమవారం చెత్త సేకరణ ముగిసిన అనంతరం వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా ఆటోల బ్యాటరీలు కనిపించలేదు. సమాచారం అందుకున్న వాహనాల విభాగం ఇంజినీర్ మైత్రి మెటెగళ్లి వచ్చి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. బాలుడికి బైక్.. తల్లిదండ్రులకు జరిమానా మైసూరు : మైనర్కు బైక్ ఇచ్చిన తల్లిదండ్రులకు కోర్టు జరిమానా విధించింది. ఈఘటన మైసూరు జిల్లా పిరియాపట్టణలో చోటు చేసుకుంది. ఐదు నెలల క్రితం 17 సంవత్సరాల బాలుడు బైక్ నడుపుతుండగా బైలుకుప్పె పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఈకేసు కోర్టులో విచారణకు వచ్చింది. బాలుడికి బైక్ ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.25వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కృష్ణాష్టమి వేడుకలపై సమీక్ష గౌరిబిదనూరు: కృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రభుత్వపరంగా ఘనంగా ఆచరించాలని మంచేనహళ్లి శ్రీ రాధాకృష్ణ యాదవ క్షేమాభివృద్ధి ట్రస్ట్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణపై తహసీల్దార్ పూర్ణిమ అధ్యక్షతన సోమవారం తాలూకా కార్యాలయంలో జరిగిన సమావేశం జరిగింది. కృష్ణ జన్మాష్టమి ప్రభుత్వ పరంగా జరపడానికి నిధులు రాలేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. కృష్ణ దేవాలయం, సముదాయ భవనం నిర్మాణానికి స్థలం గుర్తించి జిల్లా కలెక్టర్కు పంపుతామన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యాధ్యక్షుడు హరీశ్కుమార్, కార్యదర్శి రవిశంకర్, ముత్తేగౌడ, లగుమప్ప, చంద్రప్ప, లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు. ఘనంగా శ్రీగురురాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవంబొమ్మనహళ్లి : దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళలోని వగ్గ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కాడబెట్టు గ్రామంలో పిలింగాలు గాయత్రీదేవి దేవాలయంలో గురురాఘవేంద్ర స్వామి ఆరాధనన మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి మూల బృందావనానికి మంగళవారం ఉదయం పంచామృత అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మండలి ధర్మకర్త కే.ఎస్.పండిత్, ఉత్సవ సమితి మాజీ అధ్యక్షుడు యశోధర శెట్టి, దండె ధర్మస్థల గ్రామీణాభివృద్ధి పథకం, సేవా ప్రతినిధి రేఖా పిలింగాలు, పిలాతబెట్టు గ్రామపంచాయతీ ఉపాధ్యక్షుడు ఎం.బాబా సాఫల్య పాల్గొన్నారు. -
చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!
ధర్మవరం అర్బన్: వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని శారదానగర్ నివాసముంటున్న సాకే చందన, గణేష్ దంపతులు ఏడాదిన్నర క్రితం బత్తలపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. వ్యాపార లావాదేవీలన్నీ చందన చూసుకునేది. గణేష్ కియా కంపెనీలో పనిచేస్తూ రోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న బోయ గోపాల్ తరచూ అంగడికి వస్తూ చందనతో మాటలు కలిపి ఆమె ఫోన్ నంబర్ సేకరించుకున్నాడు. అనంతరం పలుమార్లు చందనతో ఫోన్లో మాట్లాడాడు.ఆ సమయంలో ఆమె మాటలను రికార్డు చేసి, వాటిని చందనకు వినిపించి, తనకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే తన కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ విషయాన్ని తన భర్తకు చందన చెప్పడంతో బత్తలపల్లి నుంచి ధర్మవరానికి మకాం మార్చారు. అయినా చందనను గోపాల్ ఇబ్బంది పెట్టడం మానలేదు. ఈ నెల 7న గణేష్ డ్యూటీకి వెళ్లిన సమయంలో 8వ తేదీ తెల్లవారుజామున చందన ఇంటికి గోపాల్ వెళ్లి తలుపులు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తలుపులు తీయగానే తనతో వస్తావా? రావా అంటూ బలవంతం చేస్తూ తన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో చందన గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుంటుండగా గోపాల్ పారిపోయాడు. ఘటనపై బాధితురాలు సోమవారం ఉదయం టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం బోయ గోపాల్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. -
దత్తత అంశంలో నిబంధనలు తప్పనిసరి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: పిల్లల దత్తత అంశంలో నిబంధనలు అనుసరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. పిల్లల దత్తత అంశానికి సంబంధించి మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫోస్టర్ అడాప్షన్ కేర్ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. తల్లిదండ్రులు లేని ఆరేళ్లు పైబడి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను రెండేళ్ల పాటు పెంచి ప్రేమానురాగాలు పంచిన అనంతరం శాశ్వత దత్తత కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, సీడీపీఓ మహేష్, మిషన్ కోఆర్డినేటర్ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన పేరుతో టోకరా గార్లదిన్నె: ఆర్మీ, రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన సుధాకర్, రవిరాజా ఇద్దరూ అన్నదమ్ములు. 10 ఏళ్ల క్రితం గ్రామ సమీపంలోనే 44వ జాతీయ రహదారి పక్కన ఆర్మీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కోచింగ్కు వచ్చిన నిరుద్యోగులకు ఆర్మీతో పాటు రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో ఏడేళ్ల క్రితం గార్లదిన్నెకు చెందిన రవితేజ రూ.3 లక్షలు చెల్లించాడు. 2024లో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కట్టకిందపల్లికి చెందిన రామాంజనేయులు కూడా రైల్వేలో టెక్నిషియన్ ఉద్యోగం కోసం రూ.4లక్షలు ఫోన్పే ద్వారా చెల్లించి, మిగిలిన రూ.6లక్షలను నగదు రూపంలో చెల్లించాడు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ కార్యాచరణను అమలు చేసిన తర్వాత ఆర్మీ కోచింగ్ సెంటర్ను మూసివేశారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించిన ఇద్దరు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని సుధాకర్, రవిరాజాకు తరచూ అడుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన వారు తాము కట్టిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరారు. భూమి విక్రయానికి పెట్టామని, దానిని అమ్మిన తర్వాత డబ్బు ఇస్తామని వారు సర్దిచెప్పడంతో నమ్మారు. రోజులు గడుస్తున్నా వారు స్పందించకపోవడంతో తాము మోసపోయినట్లు నిర్ధారించుకుని సోమవారం గార్లదిన్నె పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు. తాగుడుకు డబ్బివ్వలేదని ఆత్మహత్య పరిగి: మద్యం తాగేందుకు డబ్బులివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ఎన్ ముద్దిరెడ్డిపల్లికి చెందిన సీకే గంగాధరప్ప(44)కు భార్య రాధక్క, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో గంగాధరప్ప మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజులుగా మద్యం తాగేందుకు కుటుంబసభ్యులను డబ్బులు అడుగుతూ వచ్చాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు సర్దిచెబుతూ వచ్చారు. దీంతో క్షణికావేశానికి లోనైన గంగాధరప్ప.. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు పంచెతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకునన పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రాధక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఐ కేర్ సెంటర్పై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్ అనంతపురం: ఈ నెల 9న అనంతపురంలోని అస్రా ఐ కేర్ సెంటర్పై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన శ్రీశైలం శివశంకర్, పాపిరెడ్డిపల్లికి చెందిన మురికి పృథ్వీ, రామగిరికి చెందిన ఆది ఆంధ్ర మారుతి, చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం నివాసి గండ్లూరి వెంకటరమణ, అనంతపురంలోని బుడ్డప్ప నగర్కు చెందిన బండారు అనిల్ కుమార్ ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. -
పరిష్కార వేదికకు 55 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 55 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు దళారీ మోసంపై ఫిర్యాదు మామిడి ఫలసాయాన్ని కొనుగోలు చేసిన ఓ దళారీ రూ.14.25 లక్షలు చెల్లించకుండా మోసం చేశాడంటూ నల్లమాడ మండలం పెనుములకుంటపల్లికి చెందిన రైతు కేశవ వాపోయాడు. సోమవారం డీఎస్పీ ఆదినారాయణకు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. మూడు నెలల క్రితం నల్లమాడ మండలం బడన్నపల్లి గ్రామానికి చెందిన నాగభూషణరెడ్డి తన మామిడి తోటలోని ఫలసాయాన్ని రూ.14 లక్షలకు కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తూ అనంతరం రూ.14.25 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని వివరించారు. ఫలసాయం మొత్తం మార్కెట్కు తరలించినా నేటికీ డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడని వాపోయాడు. ఈ విషయంపై నల్లమాడ పీఎస్లో ఫిర్యాదు చేస్తే వ్యాపారిని పిలిపించి పోలీసులు మాట్లాడారన్నారు. వారం రోజులు సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదని, ఇదేమని అడిగితే పోలీసులు సైతం సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ప్రజాసమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
7 లారీల రేషన్ బియ్యం స్వాధీనం
యాడికి: అక్రమంగా రైస్ మిల్లులో నిల్వ చేసిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు యాడికి తహసీల్దార్ ప్రతాపరెడ్డి, సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం వారు వెల్లడించారు. యాడికిలోని పెద్దపేటకు పోతున్న మార్గంలో ఉన్న బలరాముడు రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విషయాన్ని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి దృష్టికి తీసుకెళ్లి భద్రత కల్పించాలని కోరారు. దీంతో ఆయన ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. 50 కిలోల చొప్పున ఒక్కో బస్తాలో నింపి ఒక్కో లారీలో 30 నుంచి 32 టన్నుల వరకు హమాలీల ద్వారా లోడ్ చేయించారు. మొత్తం ఏడు లారీల్లో 215 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంతకల్లులోని స్టాక్ పాయింట్కు తరలించినా... ఇంకా మిగులు ఉంది. ఈ బియ్యాన్ని కూడా స్టాక్ పాయింట్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసే వరకూ ఆ రైస్ మిల్లు పరిసరాల్లోకొ కొత్త వ్యక్తులను రానివ్వకూడదని, మిల్లు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ ఈరన్నను ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎం.రమణయ్య, డీటీ శ్రీనివాసులు, సీఎస్డీటీ మల్లేసు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం : ఈయూ
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపడతామని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 137ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకులు నబీరసూల్, నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై, ప్రసంగించారు. విజయవాడలోని గవర్నర్పేట పాత బస్టాండ్కు సంబంధించిన 4.15 ఎకరాల భూమి రూ. 400 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ స్థలాన్ని లూలూ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం 137 జీఓను విడుదల చేసిందన్నారు. ఈ జీఓను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగులు, కార్మికులను కలుపుకుని ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 2014లోనూ ఇలా కట్టబెడితే ధర్నాలు చేసి సంస్థ ఆస్తులను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా... దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు సాగిస్తుండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఈయూ జిల్లా అధ్యక్షుడు వైపీ రావు, కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి రమణప్ప, నాయకులు శంకరప్ప, ఆదినారాయణ, రుక్మిణి, ఆదెన్న, ఆనంద్, హనుమాన్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
గైనిక్ సర్జరీ ఎందుకు చేశారు?
డాక్టర్ సస్పెన్షన్ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్ను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. లావణ్య, శ్రీకృప పేరుతో ఆస్పత్రులను నడుపుతూ ఇతర విభాగాలకు సంబంధించి సర్జరీలు చేయడం, తదితర ఆరోపణలపై డాక్టర్ బి.రమణ నాయక్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి అధికారుల అనుమతి లేకుండా జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అనంతపురం మెడికల్: గైనికాలజిస్టులు చేయాల్సిన సర్జరీని మెడికల్ టర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) అనుమతులు లేకుండా ఎందుకు చేశావంటూ సర్వజనాస్పత్రి సర్జరీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్ను విచారణ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు డాక్టర్ రమణ నాయక్ నుంచి మౌనమే సమాధానమైంది. బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన రాధమ్మ(29) మృతికి సంబంధించి డాక్టర్ రమణ నాయక్ ఎట్టకేలకు సోమవారం విచారణకు హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులు ప్రొఫెసర్లు డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ షంషాద్బేగం, సర్జరీ డాక్టర్ మనోహర్రెడ్డి విచారణ చేపట్టి గంటలోపు పూర్తి చేసి నివేదికను జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాంకు అందజేశారు. సర్జరీ జరిగే సమయంలో అధిక రక్తస్రావమైందని, ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని కమిటీ సభ్యులకు డాక్టర్ రమణ నాయక్ నివేదించినట్లు సమాచారం. లోపించిన పారదర్శకత కాగా, రాధమ్మ మృతిపై చేపట్టిన విచారణలో పారదర్శకత లోపించిందేనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్జరీలో డాక్టర్ రమణ నాయక్, అనస్తీషియా వైద్యురాలు డాక్టర్ లావణ్యతో పాటు శ్రీకృప ఆస్పత్రికి చెందిన మరికొందరు పాల్గొన్నారు. వాస్తవానికి పీసీపీఎన్డీటీ యాక్ట్కు సంబంధించి సర్జరీలో పాల్గొన్న అందరినీ విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం డాక్టర్ రమణనాయక్, డాక్టర్ లావణ్యతో పాటు సర్జరీలో పాల్గొనని ఓ పీహెచ్సీకి చెందిన సిబ్బందిని బాధ్యులను చేస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబదేవి విచారణకు ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఓ ఆస్పత్రిలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంటే యాక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసి, బాధ్యులను జైలుకు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా జీజీహెచ్లోని పలువురు గుర్తు చేసుకున్నారు. అయితే సర్జరీలో పాల్గొన్న శ్రీకృప ఆస్పత్రి స్టాఫ్నర్సులు, ఓటీ టెక్నీషియన్లు, తదితరులను తప్పించడం అనుమానాలకు తావిస్తోంది. పారదర్శకత లోపించిన ఈ అంశంపై కలెక్టర్ లోతుగా విచారణ చేపడితే అసలు దోషులు ఎవరైంది వెలుగుచూసే అవకాశముందని ఆరోగ్యశాఖ వర్గాలంటున్నాయి. విచారణ కమిటీ సభ్యుల ప్రశ్నతో తడబడిన డాక్టర్ రమణ నాయక్ -
యువకుడి దుర్మరణం
చిలమత్తూరు: ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా నగరగెరె పట్టణానికి చెందిన శేఖర్ (26) మరో వ్యక్తితో కలసి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై కొడికొండ చెక్పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపుగా రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు నుంచి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఖాద్రీశుడి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శీనివాసరరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులను పూరించి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయంలో అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు. డ్రైనేజీలో పడి చేనేత కార్మికుడి మృతి ధర్మవరం: పట్టణంలోని శ్రీదేవి థియేటర్ వద్దనున్న డ్రైనేజీలో పడి ఓ చేనేత కార్మికుడు మృతిచెందాడు. వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని పేట బసవన్నకట్టవీధికి చెందిన సపారు నాగరాజు(60) పట్టుచీరలను మడతలు వేసేందుకు వెళుతుంటాడు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి నాగరాజు మద్యానికి అలవాటుపడ్డాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి శ్రీదేవి థియేటర్ సమీపంలో గ్రంథాలయం ఎదురుగా మురుగు కాలువలో పడిపోయాడు. రాత్రి వర్షం ఎక్కువగా రావడంతో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైంది. నాగరాజు నీటిలో మునిగి మృతిచెందాడు. సోమవారం ఉదయం పారిశుధ్య కార్మికులు కాలువను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. స్థానికులు గుర్తించి మృతుని కుమారుడు మనోహర్కు సమాచారం అందించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో పనులను మానుకుని మరీ కలెక్టరేట్ వరకూ వచ్చి అర్జీలిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై మొత్తం 226 అర్జీలు అందగా... కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలు పరిష్కరించే సమయంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీఓపెనింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. అధికారులను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 226 అర్జీలు -
మా రూటే సప‘రేటు’!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ పోలీసులే కాదు సివిల్ పోలీసుల దందా మరీ ఎక్కువైంది. మద్యం షాపుల వారు మామూళ్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎకై ్సజ్ పోలీసులూ, తాము ఒకటి కాదని, వాళ్లకిస్తే తమకిచ్చినట్టు కాదంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సివిల్ పోలీస్ స్టేషన్కూ మామూళ్లు వెళ్లకపోతే వైన్షాపు నడుపుకోలేరని హెచ్చరిస్తున్నారు. లేకుంటే పర్మిట్ రూములు, బెల్టుషాపులకు అనుమతి లేదంటున్నారు. అడిగినంత ఇస్తే దర్జాగా.. మామూళ్లు ఇస్తే దర్జాగా వ్యాపారం చేసుకోవచ్చు. ఉదాహరణకు అనంతపురంలోని రామ్నగర్ బ్రిడ్జి కింద ఓపెన్ బార్లా వైన్షాపు నడుస్తోంది. మహిళలు ఈ మార్గంలో నడుచుకు వెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్కు ప్రతి నెలా రూ.25 వేలు వెళ్తోంది. ఇలా శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో దర్జాగా పర్మిట్ రూములు, బెల్టుషాపులు నడుపుకోవాలంటే ఎకై ్సజ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులనూ సంతృప్తి పరచాల్సిందేనని తెలి సింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు రాయాల్సింది ఎకై ్సజ్ అధికారులే. కానీ తాము లేకుండా వ్యాపారాన్ని చేసుకోలేరని సివిల్ పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. అర్బన్లో ఎక్కువగా.. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 230 వరకూ వైన్ షాపులు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లలో ఇచ్చినంత తీసుకుని చూసీ చూడనట్టు వెళుతున్నారు. కానీ అనంతపురం అర్బన్లో మాత్రం కచ్చితంగా ఫిక్స్ చేసినంత ఇవ్వాల్సిందే. ఉదాహరణకు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 షాపులున్నాయి. ఆయా వైన్ షాపుల నిర్వాహకు లంతా కలిసి నెలకు తప్పనిసరిగా రూ.1.80 లక్షలు ఇవ్వాల్సిందే. బార్లూ ఫిక్స్ చేసినంత ఇవ్వాలి. వన్టౌన్ పీఎస్కు కూడా అంతేనని తెలిసింది. ధాబాలు.. హోటళ్లు ఉంటే బోనస్ వైన్షాపులతో పాటు ధాబాలు, హోటళ్లు ఉంటే సివిల్ పోలీసులకు బోనస్ కింద లెక్క. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి ధాబా, హోటల్లోనూ లిక్కర్ సిట్టింగ్ ఉంది. ఇక్కడ తనిఖీలకు వెళ్లాల్సింది కూడా సివిల్ పోలీసులే. దీంతో ధాబాలు, హోటళ్లు శక్తిని బట్టి నెలనెలా ఇవ్వాల్సిందే. ఇక బార్లు కూడా స్టేషన్కు మామూళ్లు పంపించాల్సిందే. పోలీసులేమో డ్రోన్లతో నిఘా అంటూ చెప్పి బహిరంగ మద్యపానం చేస్తున్నారంటూ రిక్షా కార్మికుడినో, తాపీ మేస్త్రీనో తెచ్చి స్టేషన్లో పెడుతున్నారు. బాస్కు తెలిసే.. మామూళ్ల దందా ‘పోలీస్ బాస్’కు తెలిసే జరుగుతోందని, ఇంత విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెలియకుండా ఎలా ఉంటుందని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. విచిత్రమేమంటే కొన్ని పోలీసుస్టేషన్లలో వచ్చిన సొమ్ము మొత్తం సీఐ తీసుకుంటున్నారని, తమకు పైసా ఇవ్వడం లేదని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఎకై ్సజ్ వారిలా తమకూ మామూళ్లివ్వాలంటున్న సివిల్ పోలీసులు వైన్ షాపుల నిర్వాహకులకు హుకుం స్టేషన్ పరిధిలో ఒక్కో వైన్షాపు నుంచి రూ.20 వేలు డిమాండ్ -
విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: వరుణుడు తొమ్మిది రోజులుగా తెరిపినివ్వడం లేదు. జిల్లా అంతటా విస్తారంగా వర్షిస్తూ చెరువులకు జలకళ తెచ్చాడు. ఆదివారం రాత్రి నుండి సోమవారం వరకూ జిల్లాలోని 32 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒక్కరోజే 24.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ధర్మవరం మండలంలో 67.4 మి.మీ, అమరాపురం మండలంలో 56.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తనకల్లు మండలంలో 48.2 మి.మీ, కొత్తచెరువు 47, బుక్కపట్నం 44, కదిరి 42.4, చిలమత్తూరు 33.4, పెనుకొండ 31.4, కనగానపల్లి 30.8, అమడగూరు 30.4, పుట్టపర్తి 28.4, సీకేపల్లి 25.4, ముదిగుబ్బ 24.8, తాడిమర్రి 24.2, రొద్దం 23.6, నల్లమాడ 23.2, నల్లచెరువు 22.2, హిందూపురం 21.2, లేపాక్షి 20.8, రొళ్ల 19.2, గాండ్లపెంట 18.6, గుడిబండ 18.2 , సోమందేపల్లి 17.6, పరిగి 16.2, బత్తలపల్లి 14.2, అగళి 10.6, ఓడీచెరువు 8.2, మడకశిర 7.6, రామగిరి 6.2, తలుపుల 2.8, గోరంట్ల 2.2, ఎన్పీకుంట మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కోలుకున్న పంటలు.. పెరిగిన చీడపీడలు తాజా వర్షాలతో ఖరీఫ్లో సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నా.. తెగుళ్లు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. వేరుశనగ, కంది పంటలకు చీడ పీడలు అధికమయ్యాయంటున్నారు. కూరగాయల పంటలకూ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక కొన్నిరోజులుగా కురుస్తున్న జడివానతో అక్కడక్కడా ఇళ్లు కూలుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా అంతటా జడివాన సోమవారం 24.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు -
ఎకరాకు రూ.3 వేలు అదనపు భారం
ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి ఎరువుల ధరలు పెంచుతోంది. కొన్నిచోట్ల ఎమ్మార్పీ మించి ధర వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.3 వేలు చొప్పున అదనపు భారం పడుతోంది. పంటకు గిట్టుబాటు ధరలు కూడా అంతంత మాత్రమే. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. –వై.శ్రీధర్రెడ్డి, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం సేంరద్రియ ఎరువుల వాడకం పెంచాలి రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. అలా చేస్తే దిగుబడులు పెరగడంతో పాటు పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. జిల్లాలోఎక్కడైనా అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తాం. కృత్రిమ డిమాండ్ సృష్టించినా చర్యలు తప్పవు. –సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి -
అంధకారంలో 15 గ్రామాలు
● విద్యుత్ అధికారుల తీరుపై గ్రామీణుల నిరసన ముదిగుబ్బ: మూడు రోజులుగా 15 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. చినుకు పడితే చాలు.. కరెంటు సరఫరా నిలిచిపోతుండటంతో గ్రామీణులు కునుకు కరువై అల్లాడిపోతున్నారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం గ్రామీణులంతా ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... మూడు రోజుల క్రితం పడిన వర్షానికి మండల పరిధిలోని మల్లేపల్లి చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో బోర్లు కూడా పనిచేయక తాగునీటి సమస్య ఉత్పన్నం కావడం.. రాత్రి వేళల్లో విష పురుగులు బెడద ఉండటంతో సోమవారం పలు గ్రామాల వారు మరోసారి విద్యుత్ అధికారులను సంప్రదించారు. అయినా సరైన సమాధానం చెప్పకపోవడంతో స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 22న ఖాద్రీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 22వ తేదీ (శుక్రవారం) ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈనెల 18వ తేదీలోపు దేవస్థానంలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఈఓ సూచించారు. ఇందుకోసం స్వయంగా ఈఓ కార్యాలయానికి వచ్చి అప్లికేషన్ పూర్తి చేయడంతో పాటు ఆధార్కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ జోనల్ స్థాయి క్రీడా పోటీలకు జిల్లా జట్టు హిందూపురం టౌన్: ఇంటర్ జోనల్ స్థాయి ఫుట్బాల్ పోటీలకు జిల్లా సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. కడపలో ఆదివారం జరిగిన పెన్నా జోన్ జోనల్ క్వాలిఫయర్ మ్యాచ్లో కడప జట్టు తలపడిన జిల్లా జట్టు పెనాల్టీ కిక్స్ రెండు గోల్స్ తేడాతో గెలుపొందింది. దీంతో ఈ నెల 16, 17వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఇంటర్ జోనల్ స్థాయి చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించింది. ఈ జట్టుకు కోచ్గా బీకే మహమ్మద్ సలీమ్, మేనేజర్గా ఇర్షాద్ అలీ వ్యవహరించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా ఫుట్బాల్ గౌరవ అధ్యక్షుడు అనిల్కుమార్ అభినందించారు. -
బాలిక హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవం
హిందూపురం/పుట్టపర్తి టౌన్: బాలికను కర్కశంగా చంపి శవాన్ని పూడ్చిపెట్టిన కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు సోమవారం తీర్పు చెప్పారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. కేసు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా నామగుండ్ల గ్రామానికి చెందిన మంజులకు ఇద్దరు కుమార్తెలు. గ్రామంలో తనకు ఎవరూ లేకపోవడంతో హిందూపురం మండలం తూమకుంట గ్రామంలోని తన అక్క రత్నమ్మ వద్దకు వచ్చి ఉండేవారు. రత్నమ్మ భర్త గంగాధర్ ‘పొలం వద్దకు వెళ్దాంరా.. నీకేమైనా కొనిస్తాను’ అంటూ మంజుల ఎనిమిదేళ్ల కుమార్తె (మూడో తరగతి విద్యార్థిని)ను రోజూ పిలిచేవాడు. గంగాధర్ అంతకు మునుపే రెండు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అతని ప్రవర్తన చూసి భయపడుతూ చిన్నారిని పంపేందుకు తల్లి మంజుల నిరాకరించేది. అయితే గత ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన చిన్నారిని మచ్చిక చేసుకున్న గంగాధర్ పొలం వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ క్రూరంగా చంపి.. అత్యాచారానికి ప్రయత్నించాడు. మృతదేహాన్ని సమీపంలోని పెన్నానదిలో పూడ్చిపెట్టాడు. సాయంత్రం ఒక్కడే ఇంటికి తిరిగొచ్చిన గంగాధర్ను తన కూతురు ఎక్కడని మంజుల అడిగింది. ఆమెతో పాటు బంధువులు కూడా నిలదీయడంతో చంపేసి నది వద్ద పూడ్చేశానని చెప్పాడు. దీంతో తల్లి హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 17 మంది సాక్షులను విచారించిన అనంతరం గంగాధర్పై అభియోగాలు రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..
సాక్షి టాస్క్ఫోర్స్: న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఓ గిరిజన మహిళను ఆ స్టేషన్ ఎస్ఐ లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే.. కేసులో న్యాయం చేస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించాడు. రాత్రి వేళల్లో పదే పదే వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పగా.. ఆయన కూడా ఎస్ఐని బతిమాలినా ఆ ఎస్ఐ వెనక్కు తగ్గలేదు. ఆమె కదలికలపై నిఘా పెట్టి ఆమెను వెంబడించి వేధించేవాడు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ వేధింపులతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. వెంబడించి మరీ వేధింపులు గరుగుతండాకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసులో భాగంగా ఆ భార్యకు రావాల్సిన భరణం గురించి మాట్లాడేందుకు ఇటీవల పట్నం పోలీస్స్టేషన్కు ఆమె బంధువులు వెళ్లారు. ఆ మహిళకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి వెళ్లిన పాపానికి ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఎస్ఐ తనకు నగ్నంగా చేసిన వీడియో కాల్స్ను రికార్డ్ చేసినట్టుగా ఆమె చెప్పింది. ఇటీవల తాను వ్యక్తిగత పని మీద అనంతపురం వెళ్తే.. ఎస్ఐ రాజశేఖర్ తనను వెంబడించి తన వద్దకు వచ్చి వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతపెట్టాడని కన్నీటిపర్యంతమైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే తమను ఇలా వేధిస్తుంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత మహిళతో పాటు, ఆమె బంధువులు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. కాగా, ఎస్ఐ రాజశేఖర్ ప్రవర్తనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
నులిపురుగులను నులిమేద్దాం
●నులిపురుగుల నుంచి రక్షించుకోండి నులిపురుగుల నివారణకు అందించే ఆల్బెండజోల్ మాత్రలు రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్ (ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. వీటిని కచ్చితంగా తీసుకొని నులిపురుగుల నుంచి కాపాడుకోవాలి. మల విసర్జన తర్వాత, భోజనం తర్వాత చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బందికి మాత్రలు అందజేశాం. – డాక్టర్ సునీల్, ఆర్బీఎస్కే జిల్లాఅధికారిపుట్టపర్తి అర్బన్: పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నులి పురుగులు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిని ఒక్క ఆల్బెండజోల్ మాత్రతో నివారించవచ్చు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఓసారి ఏడాది నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఈ నెల 12న జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ అందజేయనుంది. నులి పురుగులు చిన్నారుల్లో రక్త హీనతకు దారి తీస్తాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపు లోపల చేరి నొప్పి, మంట, వికారం కలగజేస్తాయి. దీనితో ఆహారం సహించదు, ఆకలి ఉండదు, త్వరగా నీరసపడిపోతారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. నులి పురుగుల సమస్య ఇలా... వ్యక్తిగత పరిశుభ్రత పాటించని పిల్లలకు నులిపురుగుల సమస్య అధికంగా ఉంటుంది. పిల్లల చేతి గోళ్లలో పేరుకున్న మట్టి ద్వారా నులి పురుగులు కడుపులోకి వెళ్తాయి. కలు షిత ఆహరం, నీరు, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనతో సైతం నులిపురుగులు కడుపులోకి చేరుతాయి. ప్రతిసారీ భోజనం ముందు చేతులు కడుక్కోకపోవడం, కూరగాయలు కడగకపోవడం, మూతలు లేని ఆహార పదార్థాలను భుజించినా నులిపురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ ఇలా... నులిపురుగుల నివారణ కోసం ఏడాది నుంచి రెండేళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ 200 ఎంజీ మాత్ర, 2 – 19 ఏళ్లలోపు పిల్లలకు 400 ఎంజీ మాత్రను ఇచ్చి చప్పిరించేలా చూడాలి. ఇవన్నీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగిస్తారు. మొదటి రోజు అందుబాటులో లేని వారికి తర్వాత రోజు అందిస్తారు. ఇప్పటికే మాత్రలు, పోస్టర్లను ఆయా సంస్థలకు అందజేశారు. జిల్లాలో 5,420 విద్యా సంస్థ(అంగన్వాడీ, పాఠశాలలు, కళాశాల)ల్లో 3,66,225 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఆల్బెండజోల్ మాత్ర కడుపులో ఉన్న నులిపురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులను నివారిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా వీటిని తీసుకోవాలి. ఈ నులిపురుగులు మాత్ర వేసుకున్న ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి. దీర్ఘ కాలిక రోగులు, ఇతర మందులు వాడుతున్నా వీటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్బెండజోల్ మాత్రతో చెక్ పెట్టొచ్చు జిల్లాలో 3,66,225 మంది చిన్నారుల లక్ష్యం రేపు జాతీయ నులి పురుగుల దినోత్సవం3.66 లక్షల మందికి అందిస్తాం జిల్లాలోని 5,420 విద్యాసంస్థల్లో 1 – 19 ఏళ్లలోపు 3.66 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేస్తాం. ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తుంది. ఈ నెల 12న (మంగళవారం) మాత్రలు అందిస్తారు. అందుబాటులో లేని వారికి స్పెషల్ డ్రైవ్ కింద ఈ నెల 20న పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి తీసుకోవాలి. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్ఓ -
మెదడు మొరాయిస్తోంది!
● ధర్మవరానికి చెందిన 35 ఏళ్ల చేనేత కార్మికుడు చేయి ఉన్నట్టుండి పనిచేయలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు నిర్ధారించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి వచ్చి ఉంటే పెను ప్రమాదం తప్పేదని తెలిపారు. కానీ నిత్యం మందులు వాడాలని సూచించారు. అనంతరం చిత్తూరు జిల్లాలో నాటువైద్యం చేయించుకున్నా.. ఫలితం లేకపోయింది. కాళ్లు, చేతులు నియంత్రణలోకి వచ్చినా.. మెదడులో సమస్యతో మాటలు సరిగా రావడం లేదు. దీంతో బెంగళూరులోని నిమ్హాన్స్లో చికిత్స చేయిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.● అనంతపురానికి చెందిన 46 ఏళ్ల మహిళ వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల పుట్టపర్తికి వచ్చారు. ఉన్నఫలంగా కింద పడిపోగా ఎవరూ గుర్తించలేదు. రాత్రంతా వైద్యం అందక గదిలోనే ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత శ్రీసత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు తేల్చారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిందని.. నిత్యం మందులు వాడాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం ఆమె డిశ్చార్జ్ అయి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజులు చేరారు. ఇప్పటికీ కాళ్లు, చేతులు నియంత్రణలో లేనట్లు కుటుంబసభ్యులు తెలిపారు....ఇలా జిల్లాలో రోజూ ఎక్కడోచోట పక్షవాతం కేసులు బయటపడుతున్నాయి. ఒత్తిడితో కూడిన జీవనం...మద్యపానం, ధూమపానం, నిద్రలేమి తదితర సమస్యలతో మొదడు మొద్దుబారిపోతున్నట్లు తెలుస్తోంది.సాక్షి, పుట్టపర్తి: ఉన్నట్టుండి శరీరం బిగుసుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం.. ఇలా శరీరంలో ప్రతి అవయవంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను ఆకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలోకి నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతూ బతుకు బండి లాగుతున్నారు. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ఆహారపు అలవాట్లలో మార్పుతోనే..మారిన ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం, వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం పొందకపోవడంతో ఎక్కువ శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో ఎక్కువగా వృద్ధులు పక్షవాతానికి గురయ్యేవారని, ఇప్పుడు బాధితుల్లో పాతికేళ్ల లోపు వారూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.ముందస్తు సంకేతాలు ఇవే..పక్షవాతాన్ని ఆంగ్లంలో పెరాలసిస్, వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి మెదడుకు రక్త సరఫరా తగ్గడంతో శరీరంలో తిమ్మిర్లు, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువైనట్లు అనిపిస్తుంది. పూర్తిగా లేదా సరిగా మాట్లాడలేకపోతారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేరు. చూపు మసకబారుతుంది. నడవలేరు. తీవ్ర తలనొప్పితో బాధపడతారు. ఈ లక్షణాలు కనిపించిన మూడు గంటల్లోపు ఆస్పత్రికి తీసుకెళ్తే రక్త ప్రసరణను పునరుద్ధరించి మెదడు ఎక్కువగా దెబ్బ తినకుండా వైద్యులు కాపాడుతారు.‘ఫ్యామిలీ డాక్టర్’ దూరమై.. సమస్య తీవ్రమైవైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ విధానంతో చాలా మందికి మేలు జరిగింది. ఇళ్ల ముంగిళ్లలోనే వైద్య సేవలు అందేవి. అలాగే డాక్టరే ఇంటి వద్దకు వచ్చి పరీక్షించి ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే పరీక్షలు చేయించేవారు. ఫలితంగా జబ్బులను తొలిదశలోనే గుర్తించేవారు. వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం లభించేది. కానీ కూటమి ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి మంగళం పాడింది. దీంతో రక్తపోటు, మధుమేహం గురించి ప్రాణంమీదకు వచ్చాకే తెలుస్తోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మెదడుకు చేటు చేసే బీపీ, షుగర్ పరీక్షలు ‘ఫ్యామిలీ డాక్టర్’తో నిత్యం జరిగేవి. అందువల్లే అప్పుడు పక్షవాతం కేసులు కూడా బాగా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.అవగాహన లోపంతోనే..దేశంలో సగటున 10 శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాల ద్వారా తేలింది. అయితే అవగాహన లోపంతోనే చాలా మంది పక్షవాతం బారిన పడుతున్నారని తెలిసింది. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారిలో 30 శాతం మంది శాశ్వత వైకల్యం పొందుతున్నారు. బాధితుల్లో 25 శాతం మంది 30 ఏళ్ల లోపు వారు ఉండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అలాగే 45 ఏళ్లు దాటిన వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో 55 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ ప్రమాదంలో పడుతారు.జాగ్రత్తవివేతరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.ఎక్కువ నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరాలి.గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.వెంటనే వైద్యులను సంప్రదించాలిమద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అవగాహన కలిగి ఉండి వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదిస్తే పక్షవాతం బారిన పడకుండా ఉండవచ్చు. ఇటీవల మధుమేహం, రక్తపోటు కారణంగా చాలా మంది యుక్త వయసులోనే పక్షవాతం బారిన పడుతున్నారు. ఆహార అలవాట్లూ చేటు తెస్తున్నాయి. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
నేడు ‘పరిష్కార వేదిక’
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీల ద్వారా విన్నవించవచ్చని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పరిష్కారం కాకపోతే 1100 నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.నేడు పోలీస్ కార్యాలయంలో..పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో గుబులుచిలమత్తూరు: మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై ఆదివారం ‘సాక్షి’లో ‘దారుణాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామాల్లో రుణాలు పొందిన వారి వివరాలను ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీంతో సదరు మైక్రో ఫైనాన్స్ సంస్థల యజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. మండలంలోని పలగలపల్లిలో రుణాలు తీసుకున్న వారికి మైక్రో ఫైనాన్స్ సంస్థల రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చినట్టుగా తెలిసింది. ‘మీరేనా పత్రికకు సమాచారం ఇచ్చింది’ అని పలువురిని బెదిరింపు ధోరణిలో ప్రశ్నించినట్టు తెలిసింది. రుణాలు పొందిన వారి నుంచి పోలీసులు, అధికార యంత్రాంగం వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులను బెదిరించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలు కోరుతున్నారు.కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలుచెన్నేకొత్తపల్లి : గంగినేపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలోని వంతెన శనివారం రాత్రి కూలిపోయింది. దీంతో గంగినేపల్లి, ఎర్రోనిపల్లి, తండాలు, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో వంతెన కూలిందని గ్రామస్తులు తెలిపారు. ఆధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే వంతెన నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నరు.అప్రమత్తంగా ఉండాలిప్రశాంతి నిలయం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చేతన్ సూచించారు. ఇప్పటికే జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశానని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి టామ్ టామ్, మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విపత్తు నిర్వహణ తదితర శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.కలెక్టరేట్లో కంట్రోల్ రూంభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఆదుకోవడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 08555 289039 నంబర్కు ఫోన్ చేసి సహాయం పోందవచ్చన్నారు.అలరించిన సంగీత కచేరీప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి భక్తులు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. -
రోగుల ప్రాణాలంటే లెక్కేలేదు
● వైద్య సేవల్లో నాణ్యత కరువు ● ప్రమాదకర కేసులను తేలిగ్గా తీసుకుంటున్న డాక్టర్లు అనంతపురం మెడికల్: పర్యవేక్షకుల బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులను నిర్లక్ష్యం ఆవహించింది. ఇటీవల ఆస్పత్రిలో జరిగిన దారుణ సంఽఘటనలు దుస్థితికి అద్దం పడుతున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలసి పోతున్నా కూటమి ప్రజాప్రతినిధులు పట్టనట్లే ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఇష్టారాజ్యం.. సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో 5 యూనిట్లు ఉన్నాయి. అందులో ప్రొఫెసర్, 5 మంది అసోసియేట్లు, 11 మంది అసిస్టెంట్లు, ఐదుగురు సీనియర్ రెసిడెంట్లు, పదుల సంఖ్యలో పీజీ విద్యార్థులు ఉన్నారు. ఐదు యూనిట్లలో కలిపి ప్రమాదకర కేసులు కేవలం 20 నుంచి 30 వరకే ఉంటాయి. ఆయా కేసులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలి. వాస్తవంగా మెడిసిన్లో కొందరు వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉంటున్నారు. వీరే ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), ఐసీసీయూ, ఎంఎం, ఎఫ్ఎం యూనిట్లు చూసుకోవాలి. ఈ క్రమంలో రోగులకు సేవలు సరిగా అందడం లేదు. పదుల సంఖ్యలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్న నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా రోజూ ప్రతి యూనిట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండేలా చూడాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘మెడిసిన్’లో వైద్యుల నడుమ కోల్డ్ వార్ నడుస్తుండడంతో ఇష్టారాజ్యంగా విధులు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పరువు పోతోంది... కొందరు వైద్యుల పనితీరుతో మెడిసిన్ విభాగం పరువు పోతోంది. పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓపీకి ఆలస్యంగా రావడం.. మధ్యాహ్నం 12 గంటలైతే గుట్టుచప్పుడు కాకుండా పాతూరు ఐరన్ బ్రిడ్జ్, సాయినగర్ జీరో క్రాస్లో ఉన్న క్లినిక్లకు పరుగులు తీయడం చేస్తున్నారు. ఈ విషయాలపై కలెక్టర్ కాస్త దృష్టి సారిస్తే మెడిసిన్ విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలవుతుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు మేలుకుని ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తారో లేదో చూడాలి. -
‘రెడ్బుక్’తో అరాచక పాలన
సోమందేపల్లి: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం మాటున అరాచక పాలన సాగిస్తోందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. సోమందేపల్లి మండలం వెలిదడకల గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేబినెట్ మంత్రులంతా అక్కడే తిష్టవేసి అరాచకాలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబం పులివెందులలో అరాచకాలకు పాల్పడుతోందని మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను ఉషశ్రీచరణ్ తప్పుపట్టారు. ముందు పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో టీడీపీ గూండాలు చేసిన దాడి గురించి మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులకు వత్తాసు పలుకుతు ఏకపక్షంగా అమాయకులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్కడక్కడా టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదన్నారు. జనసేనను ఆయన టీడీపీకి తాకట్టు పెట్టేశారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ చెరిపేయలేరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచ్లు అంజీనాయక్, కిష్టప్ప, సోము, డీలర్ రామాంజి, కోఆప్షన్ సభ్యుడు రఫిక్, నాయకులు వేణు, నాయకులు కంబాలప్ప, ఆదినారాయణరెడ్డి, హనుమంతరెడ్డి, నరసింహమూర్తి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కియాలో టీడీపీ గూండాల దాడిపై మంత్రి సవిత స్పందించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
● జిల్లా అంతటా వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది. కొత్తచెరువు మండలంలో 76.4 మి.మీ, నల్లమాడలో 65.2, బుక్కపట్నం 59, పుట్టపర్తి 58.6, గాండ్లపెంట 54.4, ఓడీచెరువు 54.2, రొద్దం 51.6, తాడిమర్రి 47.2, సోమందే పల్లి 47, పెనుకొండ 44.6, తనకల్లు 44.6, నల్ల చెరువు 44.2, సీకేపల్లి 42.6, గుడిబండ 41.2, గోరంట్ల 38.2, బత్తలపల్లి 36.2, మడకశిర 35.6, ధర్మవరం 34.6, ముదిగుబ్బ 32.2, పరిగి 30.4, కదిరి 26.8, హిందూపురం 21.8, లేపాక్షి 18.2, రొళ్ల 15.4, తలుపుల 12.2, చిలమత్తూరు 12, అగళి 11.8, కనగానపల్లి 10.2, అమరాపురం 9.8, అమడగూరు 8.2, ఎన్పీ కుంట 3, రామగిరిలో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. తుపాను ప్రభావంతో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ‘చిత్రావతి’ ధర్మవరం రూరల్: పోతులనాగేపల్లి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పైతట్టు ప్రాంతంలో కురిసిన వర్షాలకు చిత్రావతి నదిలోకి భారీగా నీరు చేరుతోంది. నది ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అంటున్నారు. -
ఇన్చార్జ్ల ఏలుబడి.. పట్టాలెక్కని ప్రగతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 మండలాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర ఎంపీడీఓలదే. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉంటేనే న్యాయం చేకూరుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా తొమ్మిది మండలాలకు ఇన్చార్జ్లతో కాలం నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఆయా మండలాల్లో అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ల ఏలుబడిలోని మండలాలు ఇవే.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు లేరు. అందులో అనంతపురం జిల్లా కుందుర్పి, బ్రహ్మసముద్రం, గుంతకల్లు మండలాలు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో అగళి, చిలమత్తూరు, ముదిగుబ్బ, కనగానపల్లి, రొద్దం, తనకల్లు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల బాధ్యతలను పరిపాలనాధికారులు(ఏఓ), డిప్యూటీ ఎంపీడీఓలకు అప్పగించారు. ఈ మండలాల్లో ఏళ్ల తరబడి ఇన్చార్జ్లే కొనసాగుతుండడం గమనార్హం. కొత్త వారిని నియమించినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్కడికి ఎవరూ వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆ ప్రాంత నియోజకవర్గ ప్రజాప్రతినిధులను కాదని కొత్తవారిని నియమిస్తే వారు సజావుగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విపరీతమైన రాజకీయ జోక్యం ఎంపీడీఓల నియామకంలో రాజకీయ జోక్యం విపరీతంగా ఉందనేది బహిరంగ రహస్యం. గతంలో పదోన్నతిపై 15 మంది ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వీరికి మండలాలు కేటాయించగా కర్ణాటక సరిహద్దులో ఉన్న రెండు మండలాలకు ఎంపీడీఓలు నియమితులయ్యారు. అయితే అప్పటికే అక్కడ పాతుకుపోయిన ఇన్చార్జ్ ఎంపీడీఓలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లా పరిషత్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లి అడ్డుకున్నట్లుగా సమాచారం. కనీసం వారు జాయిన్ కూడా కానివ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్లు వెనక్కి తిప్పిపంపడం విశేషం. ఈ వ్యవహారం చాలా రోజులు నడిచింది. చివరకు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి జెడ్పీ అధికారులపై చిందులు తొక్కి.. సీఈఓనే టార్గెట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కూటమి పాలనలో కనిపించని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తొమ్మిది మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు కరువు నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫారసు ఉంటేనే బాధ్యతల నిర్వర్తింపు లేకపోతే చుక్కలు చూపిస్తున్న పాలకులుత్వరలో నియమిస్తాం సీనియారిటీ జాబితా ఇప్పటికే ప్రభుత్వానికి పంపాం. త్వరలో రెగ్యులర్ ఎంపీడీఓలుగా చాలా మందికి పదోన్నతి కల్పించనున్నాం. వారం, పది రోజుల్లో ఖాళీ మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలను నియమిస్తాం. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. – శివశంకర్, జెడ్పీ సీఈఓకూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదికి పైగా అవుతోంది. అయినా పల్లె పాలన గాడిలో పడలేదు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)ను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ప్రగతి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు లేక.. ఇన్చార్జ్లతో నెట్టుకువస్తున్నారు. ఆయా మండలాల్లో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అవకతవకలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ
హిందూపురం టౌన్/హిందూపురం: కొట్నూరులోని లోటస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరులో జరిగిన 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలను జపాన్ కరాటే ఫోటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో లోటస్ పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థులు బాలుర విభాగంలో యుగేష్, లిఖిత్, అనూష్, సుశాంత్, బాలికల విభాగంలో జీవిత, మేఘన, తన్విత రెడ్డి, లీలాశ్రీలు బంగారు పతకం, కాంస్య పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, పాఠశాల యాజమాన్యం అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలను అందజేశారు. అలాగే హిందూపురం మండలంలోని కిరికెర ఎల్ఆర్జీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించారని ఆ స్కూల్ కరాటే మాస్టర్లు రఫిక్ అహ్మద్, ప్రవీణ్కుమార్ తెలిపారు. షఫీవుద్దీన్ బంగారు పతకం, చైత్ర, కృష్మితరాయి, జనవి రజత పతకాలు, జోత్స్న, శ్రీదేవి, వనిత, రుచిత, హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించారన్నారు. -
ఇరు గ్రామాల రైతుల పరస్పర దాడి
తాడిపత్రి టౌన్: పొలాలకు వెళ్లే రస్తా విషయంగా ఇరు గ్రామాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరస్పర దాడులకు దారి తీసింది. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన కొందరు రైతుల పొలాలు జోగినాయునిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లేందుకు బ్రాహ్మణపల్లి రైతులకు కేవలం కాలి నడక మాత్రమే దారి ఉంది. ట్రాక్టర్ వంటి వాహనాలను ఆ దారిలో వెళ్లకుండా జోగినాయునిపల్లి రైతులు కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవి, పద్మావతి అభ్యంతరం చెబుతూ వచ్చేవారు. ఈ విషయంగా పలుమార్లు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి, సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాలు రాజీ కాలేదు. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న బ్రాహ్మణపల్లికి చెందిన దాదాపు 30 మంది రైతులు శనివారం పక్కా ప్రణాళికతో రస్తా బాగు చేస్తున్నామనే నెపంతో మూడు ట్రాక్టర్లలో నాపరాళ్ల వ్యర్థాలతో చేరుకుని అక్కడే ఉన్న కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవిపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవి తలలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తాడిపత్రిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో కొండారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఇరువర్గాల వారు టీడీపీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీ నేతలు వారి మధ్య మరోసారి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రస్తా విషయంగా గొడవ ఒకరి పరిస్థితి విషమం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
యువకుడి దుర్మరణం
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గోరంట్ల: ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలు కాగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం బూదిలివాండ్లపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర (26), శ్రీనివాసులు, కార్తీక్ ఆదివారం వ్యక్తిగత పనిపై గోరంట్లకు వచ్చారు. పని ముగించుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు రెడ్డిచెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా ప్రధాన రహదారిపై వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్నారు. ఘటనలో మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసులు, కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ గోరంట్ల: స్థానిక బస్టాండ్కు వెళ్లే మార్గంలో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు గాండ్ల వెంకటచలపతి ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు.. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెంకట చలపతి వెళ్లారు. పసిగట్టిన దొంగలు శనివారం రాత్రి తాళాలను బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆదివారం ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంకటచలపతి కుటుంబసభ్యులు గోరంట్లకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని రూ.10 లక్షల నగదు, 16 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సర్పంచ్ ఇంట్లో... కొత్తచెరువు: మండలంలోని బండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గీతాబాయి ఇంట్లో చోరీ జరిగింది. అప్పాలవాండ్లపల్లి నివాసముంటున్న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బయటకు వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండుగులు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇంటి వద్దకు చేరుకుని తాళం ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని రూ.90 వేల నగదు అపహరించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. సర్పంచ్ భర్త రూప్లానాయక్ ఫిర్యాదు మేరకు కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యువకుడి బలవన్మరణం పరిగి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం మోదా గ్రామానికి చెందిన సనావుల్లా కుమారుడు సయ్యద్ ముబారక్ (18) మెకానిక్ పని నేర్చుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఆదివారం నొప్పి తీవ్రత తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి జీఆర్పీ పరిధిలోని ఓబులాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ కానిస్టేబుల్ వాసు ఆదివారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం మూడు ముక్కలైంది. దీంతో గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద తొలుత కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణలో మృతుడిని గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (32)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరో ఘటనలో పెద్ద వడుగూరుకు చెందిన సురేష్ (28) 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సురేష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు ఘటనలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు పామిడి: రెండు రోజులుగా పామిడి వేదికగా సాగుతున్న ఏపీ విద్యాభారతి జోనల్ స్థాయి క్రీడాపోటీలు ఆదివారం ముగిశాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి 350 మంది బాలురు, 250 మంది బాలికలు హాజరయ్యారు. అండర్–13, 15 విభాగాలల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ రేస్, లాంగ్జంప్, హైజంప్, యోగా, చదరంగం వంటి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కాగా, పోటీల ఓవరాల్ చాంపియన్షిప్ను ఉమ్మడి అనంతపురం జిల్లా క్రీడాకారులు దక్కించుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పారిశ్రామికవేత్త రాంప్రసాద్, ప్రముఖులు రాఘవయ్య, సునీల్కుమార్, చౌడయ్య, హెచ్ఎంలు శ్రీనివాసన్, మయూరి, ఆచార్య బృందం పాల్గొన్నారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు జెడ్పీహెచ్ఎస్లో 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారందరూ 20 ఏళ్ల తర్వాత అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. నాడు దాదాపు 180 మంది కలిసి చదువుకోగా, ఇందులో 120 మంది హాజరయ్యారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసి పోయారు. విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువును ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ అపూర్వ కలయికకు నేతృత్వం వహించిన పూర్వ విద్యార్థి మంజునాథ్ (కానిస్టేబుల్)ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ... రూ.5 లక్షల వ్యయంతో పాఠశాలలో సభావేదికను నిర్మించిన పూర్వవిద్యార్థులను అభినందించారు. -
నిండా ముంచిన ఖరీఫ్
అనంతపురం అగ్రికల్చర్: గత రెండు నెలలు (జూన్, జూలై) వర్షాభావం.. ఈ నెల అధిక వర్షాలు వెరసి ఖరీఫ్ కకావికలమైంది. విత్తుకునేందుకు కీలకమైన జూలైలో సాధారణం కన్నా 46 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో ఏరువాకకు అంతరాయం ఏర్పడింది. దీంతో కంది పంట మినహా మిగిలిన పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానపంటలైన వేరుశనగ, పత్తి, ఆముదం సగానికి సగం కూడా సాగులోకి రాలేదు. వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం చూస్తే... ఖరీఫ్లో 3,42,232 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం అంచనా వేయగా... ప్రస్తుతానికి 50 శాతంతో 1.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇంకా 50 శాతం విస్తీర్ణంలో విత్తు లేక పొలాలు బీళ్లుగా ఉన్నట్లు చూపించారు. ఖరీఫ్లో ప్రదాన పంటలు విత్తుకునేందుకు గడువు ముగిసేనాటికి అంటే ఈ నెల 5వ తేదీ నాటికి 131.1 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 82.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే గత నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడు సాధారణ కన్నా 28 శాతం అధికంగా వర్షం కురవడం విశేషం. పెరిగిన కంది విస్తీర్ణం.. ఊహించినట్లుగానే ఈ సారి కూడా కంది పంటపై రైతులు మక్కువ చూపారు. ఈ ఏడాది 55,296 హెక్టార్లు అంచనా వేయగా... ప్రస్తుతానికి 120 శాతంతో 67 వేల హెక్టార్లలో కంది వేశారు. అలాగే సజ్జ కూడా 2,054 హెక్టార్లు అంచనా వేయగా... 125 శాతంతో 2,600 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 14,653 హెక్టార్లకు గానూ 85 శాతంతో 12,400 హెక్టార్లలో వేశారు. ఈ మూడు పంటల విస్తీర్ణం పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. అయితే ప్రధానపంటగా భావిస్తున్న వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా 32 శాతంతో 58,300 హెక్టార్లకు పరిమితమైంది. అలాగే పత్తి కూడా 44 వేల హెక్టార్లు అంచనా వేయగా 33 శాతంతో 14,600 హెక్టార్ల వద్ద ఆగిపోయింది. మరో ప్రదాన పంట ఆముదం కూడా 16,293 హెక్టార్లకు గానూ 47 శాతంతో 7,700 హెక్టార్ల వద్ద నిలబడిపోయింది. జొన్న, రాగి, కొర్ర, ఆలసంద, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. పంటల విస్తీర్ణంపై మరింత స్పష్టత రావాలంటే ఈ–క్రాప్ తుది నివేదికలు అందాలని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూపని సర్కారు.. ప్రధాన పంటల సాగుకు గడువు ముగియడంతో ఇంకా మిగిలి ఉన్న 50 శాతం విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ దిశగా కూటమి సర్కారు ఇంకా దృష్టి సారించ లేదు. వ్యవసాయశాఖ కూడా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇంకా పంపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం లక్ష హెక్టార్లకు అయినా ఉలవ, అలసంద, పెసర, మినుము లాంటి విత్తనాలు ఉచితంగా లేదా 80 శాతం రాయితీతో ఇచ్చి ప్రత్యామ్నాయం చూపాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విత్తన ప్రణాళిక తయారు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల నుంచి పంటల విస్తీర్ణం వివరాలు అందుబాటులోకి వచ్చినా ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై నోరుమెదకపోవడంపై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయం ఉంటుందా? లేదా అనేది కూడా అటు కూటమి సర్కారు ఇటు వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వడం లేదు. కంది మినహా బాగా తగ్గిన వేరుశనగ, పత్తి, ఆముదం పంటల విస్తీర్ణం 3.42 లక్షల హెక్టార్లకు గానూ 1.70 లక్షల హెక్టార్లలో పంటలు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని కూటమి సర్కారు -
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం
పుట్టపర్తి టౌన్: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం దక్కుతుందని జిల్లా చిన్న పత్రికల ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు బీరే ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని ఓ హోటల్లో చిన్న పత్రికల ఎడిటర్ల జిల్లా స్థాయి సమావేశంలో ఆదివారం జరిగింది. సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీ నారాయణ ముఖ్యఅతిథిలుగా హారయ్యారు. ఈ సందర్భంగా చిన్న పత్రికల ఎడిటర్ల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కోట్లపల్లి బాబా (హిందూపురం), సలహాదారుగా గోవిందప్ప (మడకశిర), జిల్లా అధ్యక్షుడిగా బీరే ఈశ్వరయ్య (గోరంట్ల), ప్రధాన కార్యదర్శిగా రాజు (పుట్టపర్తి), జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రతాపరెడ్డి (ధర్మవరం), వెంకటేష్ (కదిరి), ట్రెజరర్గా నారాయణ (హిందూపురం), సహాయ కార్యదర్శులుగా గంగాధర్ (కదిరి), గురుప్రసాద్ (ధర్మవరం), కార్యవర్గ సభ్యులుగా ఇమ్రాన్, అశోక్, శ్రీనివాసులు, మహేంద్ర, రామచంద్ర ఎన్నికయ్యారు. అనంతరం బిరే ఈశ్వరయ్య మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లాలోని చిన్న పత్రికల ఎడిటర్లు పాల్గొన్నారు. -
ఘనంగా అగ్నివీర్ మురళీనాయక్ జయంతి
పుట్టపర్తి అర్బన్: ఇటీవల ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అశువులు బాసిన వీర జవాన్ అగ్నివీర్ మురళీనాయక్ జయంతిని ఆదివారం గోరంట్ల మండలం కల్లితండా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మురళీనాయక్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అన్నదానం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై చిన్నాన్న దాడి ధర్మవరం అర్బన్: స్థానిక గుట్టకిందపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రఘునాథరెడ్డిపై అతని చిన్నాన్న పుల్లారెడ్డి పారతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదివారం రఘునాథరెడ్డి ఇంటి వద్ద ఉన్న పశువుల కొట్టంలోని నిల్వ ఉన్న వర్షపు నీరు ఆ పక్కనే ఉన్న చిన్నాన్న పశువుల కొట్టంలోకి వెళుతున్నాయి. ఈ విషయంగా రఘునాథ్రెడ్డి తల్లి పద్మావతితో పుల్లారెడ్డి వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రఘునాథరెడ్డి.. చిన్న విషయాలకు గొడవలు ఎందుకని తల్లి పద్మావతిని ఇంట్లోకి పిలుచుకెళుతుండగా పుల్లారెడ్డి దుర్భాషలాడుతూ పాతో రఘునాథరెడ్డిపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయమైన రఘునాథరెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాప్తాడు: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి అక్రమంగా ఆవులను శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష తెలిపారు. ఆదివారం ఉదయం రాప్తాడు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 407 వాహనంలో అక్రమంగా ఆవులను తరిలిస్తున్నట్లుగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, భజరంగ్ దళ్ సభ్యుడు లోకేపల్లి విశ్వనాథరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు రాప్తాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన 407 వాహనంలో ఏడు ఆవులను గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆవులను తరలిస్తున్న షేక్ బాబ్జాన్, దేశ్ముఖ్ బాబ్జాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఆధీనంలోని గోవులను కూడేరులోని గోశాలకు తరలించారు. -
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
ఆదివాసీలు సమాజానికే ఆదర్శం
● జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ గోరంట్ల: సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవనం సాగించే ఆదివాసీలు సమాజానికి ఆదర్శమని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అన్నారు. ఆదివాసీల అరుదైన సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం గోరంట్ల ప్రభుత్వ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ... ఆదివాసీలు ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తారన్నారు. ఆదివాసీల భాష, సంప్రదాయ నృత్యం, వ్యవసాయ పద్ధతులు వంటి వాటిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి వీరులు గిరిజనులేనని జేసీ గుర్తు చేశారు. అందువల్లే మిగతా వర్గాలతో సమానంగా గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాలోని గిరిజన హాస్టళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు సీఎస్సార్ ఫండ్స్ కూడా కేటాయించి ఆయా వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు సోమ్లా నాయక్, అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కాలే నాయక్, జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసులు నాయక్, డివిజన్ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ ఉమాశంకర్, గిరిజన సంక్షేమ మండలి సభ్యుడు హరిలాల్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. సాయి కీర్తి.. సాంస్కృతిక దీప్తి ● ప్రశాంతి నిలయంలో తెలంగాణ భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశాంతి నిలయం: సత్యసాయి కీర్తిని వివరిస్తూ తెలంగాణ భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తకోటిని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి భక్తులు శనివారం సత్యసాయి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి సూక్తులు, బోధనలను వివరిస్తూ ‘పద్య సూక్తులు’ పేరుతో నృత్యరూపకం నిర్వహించారు. చక్కటి నృత్య భంగిమలతో భక్తులను ఆకట్టుకున్నారు. సాయంత్రం ‘దివ్య ప్రణాళిక’ పేరుతో ఆధ్యాత్మిక భక్తిరస నాటిక నిర్వహించారు. సత్యసాయి జీవిత చరిత్ర, బోధనలు, సేవా కార్యక్రమాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ నిర్వహించిన నాటిక భక్తుల మదిని మురిపించింది. నెట్టికంటుడి సేవలో ఉప లోకాయుక్త గుంతకల్లు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్త పి.రజని శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉప లోకాయుక్త రజనికి స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. -
బాలికలు.. క్రీడల్లో మెరికలు
అమరాపురం: హలుకూరు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో చదువుకుంటున్న పలువురు బాలికలు క్రీడల్లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా జూలై 28న అనంతపురం జిల్లా కేంద్రంలోని పీటీసీ క్రీడా మైదానంలో అండర్– 16, అండర్–18 బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో అంత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు తొమ్మిది మంది విద్యార్థులు షాట్పుట్, జావెలింగ్ త్రో, పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యారు. మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన బాలికలు గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రిన్సిపాల్ అపర్ణ, పీడీ రోజా, పీఈటీ భాగ్యమ్మ, ఉపాధ్యాయుల సహకారంతో క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. వీరి సాధన రోజూ వేకువజామునే ధ్యానంతో ప్రారంభమవుతుంది. 5.30 నుంచి 7 గంటల వరకు పీడీ, పీఈటీలు సంయుక్తంగా వివిధ ఆటల పోటీలు సాధన చేయిస్తున్నారు. అథ్లెటిక్స్ పోటీలైన పరుగు పందెం, 200 మీటర్లు, 400, 3000 మీటర్ల పరుగు పందెం, జావెలిన్ త్రో, షాట్పుట్, ఖోఖో, కబాడ్డీ, వాలీబాల్, తదితర పోటీలకు ఎంపిక చేసుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించే జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రుల నుంచి కూడా సహకారం, ప్రోత్సాహం ఉంటోంది.ప్రతిభను గుర్తించి.. శిక్షణ ఇస్తున్నాం మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభను గుర్తించి ఇష్టమైన క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నాం. పీఈటీ, ప్రిన్సిపాల్ సహకారం బాగుంది. తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. మా పాఠశాల విద్యార్థినులు జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణిస్తున్నారు. –పీఈటీ భాగ్యమ్మ, పీడీ రోజా, గురుకుల పాఠశాల, అమరాపురంఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నా నేను ఇంటర్ జూనియర్ బైపీసీ చదువుతున్నా. నాకు క్రీడలు, అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నా. పరుగుపందెం పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నా. – రష్మీబాయి, విద్యార్థి, గురుకులపాఠశాలసాధనతోనే సాధ్యం నిరంతరం సాధన చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మాది పేద కుటుంబం శెట్టూరు మండలం బోయబోరనపల్లి. నేను ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీ చదువుతున్నా. 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంతో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా. పీడీ, పీఈటీల ప్రోత్సాహం బాగుంది. – వరలక్ష్మి, విద్యార్థి, గురుకుల పాఠశాల, అమరాపురం సత్తా చాటుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పీడీ, పీఈటీలుడీఎస్పీ అవుతా మాది పేద కుటుంబం. నేను అథ్లెటిక్స్ బాగా ఆడుతా. స్పోర్ట్స్ కోటా కింద డీఎస్పీ కావాలనుకుంటున్నా. తప్పకుండా సాధిస్తా. ప్రస్తుతం షాట్పుట్లో సాధన చేస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా. –కోవెల, పదో తరగతి, గురుకుల పాఠశాల -
దిగజారి.. మసకబారి
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసుల ప్రతిష్ట మసకబారింది. ఇప్పటికే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో పాటు మట్కా, గంజాయి, జూదం విచ్చలవిడి అయ్యాయి. టీడీపీకి, ఆ పార్టీకి చెందిన కొంతమందికి పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో జనంలో పూర్తిగా పలుచన అయ్యారు. చాలాచోట్ల పోలీసులకే ఎదురు తిరుగుతున్న దుస్థితి నెలకొంది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు పోలీసుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారి పనితీరే వారికి శాపంగా మారింది. లెక్కే లేదు.. జిల్లాలో పర్మిట్ రూములు, బెల్టుషాపులు ఇష్టారాజ్యంగా ఏర్పాటయ్యాయి. అన్ని హోటళ్లు, ధాబాల్లో మద్యం దొరుకుతోంది. చిన్న కాకా హోటల్కు వెళ్లినా మద్యం తాగుతున్న వారు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో డ్రంకన్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడుతున్న మద్యం రాయుళ్లు ఖాకీలపైనే తిరగబడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యపానానికి అనుమతులిచ్చి మళ్లీ తమను పట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు మద్యం తాగి డ్రంకన్ డ్రైవ్లో దొరికినా వెంటనే టీడీపీ నాయకులు ఫోన్ చేసి ‘మావాణ్ని వదిలెయ్’ అంటూ ఆదేశించగానే వదిలేస్తుండడంతో పోలీసులంటే లెక్కలేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా వెళ్తారంతే.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రోజుకో కబ్జా, పూటకో ఆక్రమణ చందాన పరిస్థితి తయారైంది. స్వయానా పోలీసుస్టేషన్లలోనే కబ్జాదారులకు కుర్చీలేసి మరీ సెటిల్చేసి పంపిస్తున్నారు. బాధితులేమో విలపిస్తూ ఇంటికెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో కబ్జా చేశారని ఎవరైనా బాధితులు ఫోన్ చేస్తే పోలీసులు చుట్టపుచూపుగా వెళ్లాల్సిందే కానీ కబ్జాదారులను శిక్షిస్తారని కాదని అరవిందనగర్కు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు. రెండు జిల్లాల్లో పోలీసులున్నారని ఎవరూ అనుకోవడం లేదని, ఈ విషయం జనంలో బలంగా నాటుకుపోయిందని అంటున్నారు. హిందూపురంలో మరింత ఘోరం.. హిందూపురం నియోజకవర్గంలో పోలీసుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని కిందిస్థాయి పోలీసు సిబ్బంది అంటున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు ఏది చెబితే అదే చట్టం, న్యాయం అన్నట్టుందని వాపోతున్నారు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాళ్లకు ‘బాసు’ ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ పీఏలే! తమకు నచ్చకపోతే అడిషనల్ ఎస్పీలనే శంకరగిరి మాన్యాలను పట్టించిన ఘనత వీరిది. కాబట్టి ఇక్కడ పోలీసులు ఉన్నా లేనట్టేనని తెలిసింది. పోలీసుల హ్యాండ్సప్! అస్సలు భయపడని భూ కబ్జారాయుళ్లు మద్యం తాగి ఖాకీలకే ఎదురు తిరుగుతున్న కొందరు.. ఒక పార్టీకి, కొందరు నేతలకు వత్తాసు పలకడంతోనే దుస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు నాకేమీ కనపడడం లేదు సార్ అనంతపురం నగరం సిండికేట్నగర్లోని ఓ ఖాళీ స్థలంలోకి ఇటీవల కొంతమంది అక్రమంగా చొరబడ్డారు. హద్దు రాళ్లు పాతడం ప్రారంభించారు. స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చిన వారు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారు తప్ప కబ్జారాయుళ్లను అదుపు చేయలేకపోయారు. దీంతో బాధితుడి ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద 20 రోజుల క్రితం అడ్డదిడ్డంగా వెళ్తున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కారు దిగిన డ్రైవర్.. పోలీసులపైనే చిందులు తొక్కాడు. దీనిపై టూటౌన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత నిందితుడిని విడుదల చేశారు. అనంతపురంలో నిన్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలో పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తి ఖాకీలనే కొట్ట బోయాడు. పోలీసులు సదరు మందు బాబును స్టేషన్కు తీసుకెళ్లబోతుండగా టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేసి విడిపించుకెళ్లారు. పోలీసులు ఎంతలా నిస్సహాయులుగా మారిపోయారో చెప్పే ఇలాంటి ఘటనలు నిత్యం ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. -
కరెంటు కోసం రోడ్డెక్కిన రైతన్న
ఓడీచెరువు (అమడగూరు): ఖరీఫ్ పంటలు ఎండముఖం పట్టాయి. బోర్ల కింద ఉన్న పంటలైనా చేతికందుతాయనుకుంటే నిత్యం విద్యుత్తో సమస్య. దీంతో బోర్లు సరిగా పనిచేయక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. శనివారం అమడగూరు మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మిగతా పార్టీల నేతలూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ.. ప్రకృతికి ఎదురొడ్డి రైతులు పంటలు పండిస్తుంటే...విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న లైన్మెన్ ఎప్పుడూ అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇక కొత్తగా బోర్లు వేసిన రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసి డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా.. మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కదిరి ట్రాన్స్కో ఏడీ ఓబులేసు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యకు సత్వర పరిష్కారం చూపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన -
పేదల రక్తాన్ని జలగల్లా తాగేస్తున్నారు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలు రైతులను, అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి రుణాలు ఇచ్చి రూ.20 వడ్డీతో వసూళ్లు చేస్తున్నారు. ధర్మవరం ఘటన కూడా ఒక ఉదాహరణ. ఏడాదిగా మైక్రోఫైనాన్స్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. నిబంధనలేవీ పాటించకుండా రైతుల నెత్తిన అప్పుల కుప్ప పెడుతూ వేధిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మైక్రో ఫైనాన్స్ సంస్థలపై దృష్టి సారించి వేధింపులకు గురిచేసే సంస్థలపై చర్యలు తీసుకోవాలి. – ఫిరంగి ప్రవీణ్కుమార్, జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మికసంఘం -
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
● ఒక్కరోజే 746.4 మి.మీ వర్షపాతం నమోదు పుట్టపర్తి అర్బన్: వారం రోజులుగా మోస్తరు వర్షాలతో పలకరించిన వరుణుడు శుక్రవారం రాత్రి నుంచి విరుచుకుపడ్డాడు. శనివారం ఉదయం వరకూ జిల్లా అంతటినీ విడతల వారీగా తడిపేశాడు. దీంతో జిల్లా పరిధిలో ఒక్కరోజే 746.4 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అమరాపురం మండలంలో 68.8 మి.మీ, తాడిమర్రి మండలంలో 59.4 మి.మీ, కొత్తచెరువు 56 మి.మీ మేర వర్షం కురిసిందన్నారు. అలాగే ధర్మవరం మండలంలో 52.6 మి.మీ, హిందూపురం 47.8, కనగానపల్లి 47.6, రొద్దం 46.2, చెన్నేకొత్తపల్లి 45.8, బత్తలపల్లి 43.4, పరిగి 35.6, ముదిగుబ్బ 22.6, గోరంట్ల 21.4, లేపాక్షి 20, అగళి 19.6, రొళ్ల 16.4, సోమందేపల్లి 16.2, కదిరి 15.0, గుడిబండ 14.2, తలుపుల 13.2, పుట్టపర్తి 12.8, బుక్కపట్నం 10.8, మడకశిర 10, అమడగూరు 8.4, ఎన్పీకుంట 8.2, చిలమత్తూరు 7.2, రామగిరి 6.8, నల్లమాడ 6.2, పెనుకొండ 5.6, గాండ్లపెంట 2.8, ఓడీచెరువు 2.2, తనకల్లు 2, నల్లచెరువు మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంకలు పారుతున్నాయి. అక్కడక్కడా ఉద్యాన పంటలతో పాటు బంతి, చామంతి, ఉల్లి, మిరప పంటలకు కొంత మేర నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్పమడకశిరరూరల్: పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప కోరారు. శనివారం కోతులగుట్టలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, నాయకులతో కలిసి సమన్వయకర్త మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గుండాలు ఓటమి భయంతో రాళ్లు, కట్టెలతో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన టీడీపీ గుండాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులివెందుల ప్రజలు జగనన్న గుండెల్లో ఉన్నారని, వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ బూత్లు మార్పు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గెలవాలని ప్రభుత్వం కుట్ర చేయడం అంటే ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేన్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి అధికార పార్టీ కోసం ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, మండల కన్వీనర్ రామిరెడ్డి, ఎంపీపీ కవిత, నాయకులు పాల్గొన్నారు.అప్పు విషయమై దంపతులపై దాడి ధర్మవరం అర్బన్: అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి తనకు చెల్లించలేదని పట్టణంలోని వైఎస్సార్కాలనీకి చెందిన దాదా ఖలందర్, అర్ఫియాభాను దంపతులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దాదాఖలందర్ కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన ఇనయతుల్లాతో మార్చిలో రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి అదే నెలలో ఇనయతుల్లా తల్లి అబీదాకు ఇచ్చేశారు. కానీ అబీదా తన కుమారుడు ఇఇనయతుల్లాకు ఆ విషయం చెప్పలేదు. దీంతో శనివారం వైఎస్సార్కాలనీకి వచ్చిన ఇనయతుల్లా డబ్బులు ఇవ్వాలని దాదా ఖలందర్ దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు వెంటనే వారిని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం టూ టౌన్ పోలీసుస్టేషన్కు వచ్చి దాదాఖలందర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎడారి పంట అయిన ఖర్జూరం కరువు నేల ‘అనంత’లో సిరులు కురిపిస్తోంది. జిల్లాలో పలువురు రైతులు సంప్రదాయ పంటల సాగుతో పాటు ఆధునిక, ప్రత్యామ్నాయ పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఆరోగ్యం తెచ్చిపెట్టే ఖర్జూర పంటతో మంచి లాభాలు వస్తుండటంతో రైతులు దీని
గార్లదిన్నె: జిల్లాలోని పలువురు రైతులు ఎప్పటికప్పుడు కొత్త తరహా పంటలు సాగు చేసి మంచి దిగుబడులతో దూసుకెళ్తున్నారు. అనంతపురం మండలం సిండికేట్నగర్కు చెందిన రైతు రమణారెడ్డి కూడా వినూత్న పంటల సాగుతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల్లోని తమ వ్యవసాయ భూముల్లో ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్ పంట పెట్టి సక్సెస్ అయిన ఈయన ఖర్జూర పంటను పెట్టారు. ఈయన 2019లో కన్యాకుమారి యాత్రకు వెళ్తూ తమిళనాడులో జాతీయ రహదారిపై ఖర్జూర పండ్లు అమ్మడం చూశారు. అక్కడ ఉన్న ఖర్జూర పండ్ల తోటలను గమనించి, ఈ ఎడారి పంట సాగు విధానం చూసి ఎలాగైనా మన నేలలో సాగు చేయాలని భావించారు. అలా అనుకున్నదే తడవు తమకు మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో ఉన్న ఆరు ఎకరాల విస్తీర్ణంలో టిష్యూ కల్చర్ విధానంలో ఖర్జూర పంట కూడా సాగు చేస్తున్నారు. అబూదాబి నుంచి బర్హీ ఎల్లో రకం మొక్క రూ.4500 చొప్పున 500 ఆడ, 50 మగ మొక్కలు కొనుగోలు చేశారు. ప్రతి 100 ఆడ మొక్కల్లో 10 మగ మొక్కలు ఉండేలా నాటారు. ఒక్కసారి మొక్క నాటితే 40 ఏళ్లపాటు పంట దిగుబడి వస్తుంది. సాధారణంగా ఫిబ్రవరిలో పూత దశ ఉంటుంది. పూత సమయంలో ఆడ, మగ మొక్కలు సంపర్కం చేస్తేనే ఖర్జూర పంట వస్తుంది. సంపర్కం జరగకపోతే ఈత కాయల తరహాలో మారిపోతాయి. సంపర్కం చేసే రోజు వర్షం వస్తే పంట దిగుబడి రాదు. అలాగే తోటలో మగ మొక్కలు పూత తక్కువ వస్తే, సంపర్కం కోసం మగ పూత కిలో రూ.12,500 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జూలై చివరిలో పంట కోత దశకు వస్తుంది. ఏకరాకు రూ.7లక్షల దాకా పెట్టుబడి.. పంట సాగులో మొదటి నుంచి సేంద్రియ ఎరువులు, ఆవుపేడ, గంజు, కోడి, గొర్రెల పెంట వంటి హిట్ ఎరువులు, జీవామమృతం అధికంగా వాడాలి. ఎకరాకు రూ.7 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది. నీరు కూడా చాలా ఎక్కువ అవసరం. ఎకరాకు 100 మొక్కలు సాగు చేయవచ్చు. మూడు నుంచి నాలుగేళ్లకే దిగుబడి వస్తుంది. ఐదు సంవత్సరాల్లో ఒక చెట్టు వంద కేజీల ఖర్జూర కాయలు కాస్తుంది. ఒక ఎకరంలో 5 టన్నుల దిగుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులతో తెగుళ్లకు చెక్.. ఖర్జూర పంటలో రైనోబీటిల్, రెడ్విల్ వంటి తెగుళ్లు వస్తాయి. ఈ తెగుళ్లు సోకిన మొక్క కిందకు వాలిపోతుంది. సేంద్రియ ఎరువులు అధికంగా వాడి తెగుళ్లను నివారించవచ్చు. పంట సాగుకు చౌడు, నల్లరేగడి, ఇసుక లోమి నేలలు అనుకూలం. డిమాండ్ ఎక్కువే.. ఖర్జూరకాయలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. విశాఖపట్నం, గుంటూరు, తణుకు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు తోట వద్దకే వచ్చి పసుపు పచ్చని ఖర్జూర కాయలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హోల్సేల్ కిలో రూ.120తో, టన్ను రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు రమణారెడ్డి 25 టన్నుల ఖర్జూర కాయలు విక్రయించారు. ఇంకా 10 టన్నులదాకా కాయలు చెట్ల మీద ఉన్నాయి. జిల్లాలో విస్తరిస్తున్న సాగు ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు దిగుబడులు ఖర్జూరాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఆదర్శంగా నిలుస్తున్న రైతు రమణారెడ్డి -
నాలుగోసారి
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులతో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 13న ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది. దీంతో రామగిరి పీఠంపై మరోసారి చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎలాగైనా సొంత మండలం రామగిరి పీఠాన్ని దక్కించుకోవాలని పరిటాల కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ హవా రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించింది. పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. తొలిసారి పీఠం వైఎస్సార్ సీపీ కై వసం రామగిరి మండలం కొన్నేళ్లుగా పరిటాల కనుసన్నల్లో ఉండేది. అయితే రాష్ట్రంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ఫ్యాన్గాలి వీయగా.. రామగిరిని కూడా వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు ఎగిరాయి. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించడంతో రామగిరి ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందగా ...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. దాడులు..దౌర్జన్యాలతో మూడుసార్లు వాయిదా రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దాడులు... దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అధికారం అండతో టీడీపీ నేతలు తమదే పైచేయి కావాలని పంతం పట్టారు. ఈక్రమంలోనే మహిళకు రిజర్వ్ అయిన రామగిరి ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఎలాగైనా కై వసం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ తమ పార్టీ నుంచి ఒకే ఒక పురుషుడు ఎంపీటీసీగా గెలిపొందిన నేపథ్యంలో దౌర్జన్యాలకు తెర తీశారు. ● ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో మార్చి 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పరిటాల కుటుంబం ఎలాగైనా తన సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని కుట్ర చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ నేతలు తమ పచ్చ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపును తప్పుపడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎన్నికను బహిష్కరించగా...తొలిసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ● మే 18న రెండోసారి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా.. పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతమ్మను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకోగా, ఎన్నిక సమయానికి ఎంపీటీసీ సభ్యులు రామగిరి చేరుకోలేకపోయారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికకు ఒకరోజు ముందు మే 17వ తేదీన అనెక్జర్ లెటర్ ఇవ్వడానికి రామగిరికి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు పేరూరు కురుబ నాగిరెడ్డి, హరినాథ్రెడ్డి, బోయ రామాంజినేయులపై దాడులు చేశారు. అంతేకాకుండా వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ● మూడోసారి జూలై 16న రామగిరి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని భావించినా...ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీ సభ్యులు ప్రకటించారు. దీంతో నాల్గోసారి ఈనెల 13న రామగిరి ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రామగిరి ఎంపీపీ ఎన్నికకు మళ్లీ నోటిఫికేషన్ 13న నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టుకోసం పరిటాల కుటుంబం పాకులాట ఒక్క ఎంపీటీసీతో ఎంపీపీ స్థానం కై వసానికి పడరాని పాట్లు బెదిరింపులు...కిడ్నాప్లతో మూడుమార్లు ఎన్నిక వాయిదాఒక్క అభ్యర్థితో పీఠం కోసం టీడీపీ పాకులాట రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ అయ్యింది. టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎంపీటీసీ...పైగా మహిళ కాదు. అయినప్పటికీ పరిటాల కుటుంబం రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించి ఇప్పటికి మూడుసార్లు భంగపడింది. తాజాగా ఈనెల 13న జరిగే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు కుట్రలు చేస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నిలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ పురుషులే కాగా, మహిళా స్థానం ఎలా దక్కించుకుంటారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
అమితమైన ప్రేమ అమ్మ. అంతులేని అనురాగం అమ్మ. అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపు ఇచ్చి వ్యక్తిగతంగా వృద్ధిలోకి తెచ్చే వ్యక్తి నాన్న. ఈ ఇద్దరికీ దూరమై ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారిపోతున్నారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన వారు దిక్కుమొక్కులేకుం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనాథ పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది గర్భం దాల్చడం, ప్రసవం కాగానే ముళ్లపొదల్లోనో, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ పసికందులను వదిలి వెళుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. పేగు బంధాన్ని కాదనుకుని సమాజానికి భయపడి చేస్తున్న ఈ ఘటనలు కలచి వేస్తుంటాయి. కానీ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకునేందుకు దత్తతకు ముందుకు రావాలనేది అందరి అభిప్రాయం. దత్తత చట్టప్రకారమే జరగాలి.. దత్తత అనేది పుట్టగానే ఎవరి బిడ్డనో ఆ తల్లిదండ్రుల సమ్మతితో తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. చట్ట ప్రకారమే జరగాలి. దత్తత కావాలనుకునే తల్లిదండ్రులు తమ పాన్కార్డు ద్వారా www.cara. nic. in (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం దంపతులు పాన్కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలతో పాటు దంపతుల ఫొటో వెబ్సైట్కు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఏజెన్సీకి రూ.6 వేలు డీడీ సమర్పించాలి. ఇవన్నీ పూర్తయ్యాక 48 గంటల లోగా దంపతుల మొబైల్కు సమాచారం వస్తుంది. అనంతరం ఏజెన్సీకి వెళ్లి బిడ్డను రిజర్వు చేసుకోవచ్చు. బిడ్డ నచ్చిన తర్వాత.. బిడ్డ నచ్చిన తర్వాత రిజర్వు చేసుకొని, రూ.40 వేలు ఏజెన్సీకి చెల్లించాలి. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత బిడ్డను అప్పగిస్తారు. బిడ్డను పొందిన వారం రోజుల్లోగా దత్తతకు వచ్చిన డాక్యుమెంట్లన్నీ స్థానిక ఫ్యామిలీ కోర్టు లేదా జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో సమర్పించి దత్తతకు అధికారిక ఉత్తర్వులు పొందే అవకాశం ఉంటుంది. శిశు గృహతో పాటు సీసీఐ (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్)లో ఉన్న వారినీ దత్తత చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శిశుగృహలు, బాలల సంరక్షణ సంస్థ(సీసీఐ)ల్లో ఉంటున్న దాదాపు వంద మంది చిన్నారులు దత్తత కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల పాటు బిడ్డ పరిశీలన.. దత్తత తీసుకున్న దంపతులు బిడ్డను తీసుకెళ్లాక.. దత్తత ఏజెన్సీకి చెందిన ప్రతినిధి రెండేళ్ల పాటు బిడ్డను ప్రతి ఆరు మాసాలకోసారి పరిశీలిస్తారు. బిడ్డకేమైనా ఇబ్బందులున్నాయా, తల్లిదండ్రులు సరిగా చూసుకుంటున్నారా లేదా ఇవన్నీ పరిశీలించి జాతీయ దత్తత ఏజెన్సీ ‘కారా’కు సమర్పిస్తారు. దత్తత కోసం అనాథ చిన్నారుల ఎదురుచూపులు చట్టప్రకారం జరిగితేనే దత్తత హక్కులు వర్తిస్తాయి బిడ్డను దత్తత ఇవ్వాలంటే తల్లిదండ్రుల సమ్మతి ఒక్కటే సరిపోదు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా ఇచ్చినా దత్తత హక్కులు వర్తించవు -
విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా మోస్తరు వర్షం కూడా లేక ఎండుముఖం పట్టిన ఖరీఫ్ పంటలు కాస్త తేరుకుంటున్నాయి. 6 రోజుల్లో 68.7 మి.మీ సగటు వర్షపాతం అల్పపీడనం ప్రభావంతో ఈనెల 3వ తేదీ ఆదివారం జిల్లాలోని 2 మండలాల పరిధిలో 1.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అలాగే 4వ తేదీ సోమవారం 18 మండలాల్లో 6.9 మి.మీ, 5వ తేదీ మంగళవారం 31 మండలాల్లో 29.6 మి.మీ, 6వ తేదీ బుధవారం 29 మండలాల్లో 16.6 మి.మీ, 7వ తేదీ గురువారం 2 మండలాల్లో 0.7 మి.మీ, 8వ తేదీ శుక్రవారం 18 మండలాల పరిధిలో 13.1 మి.మీ సగటు చొప్పున 6 రోజుల్లోనే 68.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఖరీఫ్లో సాగుచేసిన ఉద్యాన పంటలు, పూలతోటలు, మెట్ట భూముల్లో సాగుచేసిన వేరుశనగ, కంది, జొన్న తదితర పంటలు కోలుకుంటున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 63,226 హెక్టార్లకు చేరిన సాగు విస్తీర్ణం ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2,19,022 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ 63,226 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో అత్యధికంగా వేరుశనగ 35,097 హెక్టార్లు, కంది 11,586 హెక్టార్లు, రాగి 690 హెక్టార్లు, మొక్కజొన్న 8,910 హెక్టార్లు, వరి 720 హెక్టార్లు, జొన్న 230 హెక్టార్లు, పత్తి 3391 హెక్టార్లు, ఆముదం 2,379 హెక్టార్లలో సాగులోకి వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. ఖరీఫ్లో వర్షాలు ఆలస్య కావడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అందుకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ సారి ఉలవలు, పెసర, అలసంద, జొన్న తదితర విత్తనాలు సబ్సిడీతో అందజేస్తామన్నారు. 18 మండలాల్లో వర్షం గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 50 మి.మీ, లేపాక్షి మండలంలో 47.2 మి.మీ, ఓడీ చెరువు మండలంలో 45.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అలాగే తాడిమర్రి 39.2 మి.మీ, నల్లచెరువు 34.2, కదిరి 31.2, గోరంట్ల 22.4, బుక్కపట్నం 22, ముదిగుబ్బ 20.4, గాండ్లపెంట 20, తనకల్లు 18.8, ధర్మవరం 18.2, తలుపుల 15.4, ఎన్పీకుంట 14.2, చిలమత్తూరు 9.4, అమడగూరు 5.4, పుట్టపర్తి 3.2, కొత్తచెరువు మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. తుపాను ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కోలుకుంటున్న ఖరీఫ్ పంటలు -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల: మండలంలోని గుమ్మయ్యగారిపల్లి సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ వెనుక ఉన్న పొలంలో చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 45 ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు. కుడిచేతిపై ‘అమ్మ’ అని పచ్చబొట్టు ఉంది. నీలం రంగు గీతల షర్ట్ ధరించాడు. టవాల్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు గోరంట్ల పోలీసులను సంప్రదించాలని సీఐ శేఖర్ కోరారు. బొలికొండ రంగనాథుడి కల్యాణోత్సవం నేడు గుత్తి రూరల్: మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలిసిన బొలికొండ రంగనాథస్వామి కల్యాణోత్సవం శనివారం నిర్వహించనున్నార. ఈ మేరకు ఆలయ ఈఓ ఽశోభ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఏటా కల్యాణోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ శనివారం ఉదయం 11 నుంచి 12.05 గంటల్లోపు వేడుక నిర్వహణకు అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. -
వరి నాట్లు వేసి నిరసన
ఓడీచెరువు: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో మడులను తలపిస్తున్నాయంటూ వరి నాట్లు వేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై వైఎస్సార్ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకూ రహదారి మొత్తం గుంతలమయమై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచింది. పాదచారులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్సీపీ పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా, రైతు సంఘం నాయకులు రామచంద్ర, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
14 గ్రామాలకు రాకపోకలు బంద్
ముదిగుబ్బ: ఇటీవల కురిసిన వర్షాలతో ఈదుల వంకలో నీరు పారుతోంది. ముదిగుబ్బ–మల్లేపల్లి మధ్య నిర్మించిన ఈదులవంక బ్రిడ్జి తెగిపోవడంతో శుక్రవారం 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన వారు.. మరో మార్గంలో 10 కిలోమీటర్ల్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం వర్షాలకు ఈ బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారులు బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. దీంతో బ్రిడ్జి తెగిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని యువకుడి హత్య ● చెరువులో పడేసిన దుండగులు ● మారాల గ్రామంలో ఘటన పుట్టపర్తి అర్బన్: ఓ యువకుడిని హత్య చేసి తలకు ప్లాస్టిక్ సంచి చుట్టి.. చేతులు కట్టేసి చెరువులో పడేశారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బుక్కపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మారాల గ్రామ చెరువు నుంచి శుక్రవారం దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పరిశీలించారు. వారికి ఓ మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బుక్కపట్నం ఎస్ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సంచిలో చుట్టి తీసుకువచ్చి మారాల చెరువులో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఒంటిపై మొలతాడు, చేతికి రాగి కడియం మాత్రం ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే సమాచారం ఇవ్వాలని బుక్కపట్నం ఎస్ఐ కృష్ణమూర్తి కోరారు. -
పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. పట్టు రైతుల సమస్యలను గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం పట్టు రైతులకు అందించిన ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచార సమయంలో పట్టు రైతులను ఆదుకుంటామని కూటమి పెద్దలు స్పష్టమైన హామీనిచ్చారు. అధికారం చేపట్టిన తర
హిందూపురం మార్కెట్లో విక్రయానికి తీసుకువచ్చిన బైవోల్టిన్ పట్టుగూళ్లు (ఫైల్)మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పట్టు రైతులకు ప్రోత్సాహక ధనం అందడం లేదు. ప్రభుత్వ పట్టు మార్కెట్లలో అమ్మిన బైవోల్టిన్ పట్టుగూళ్లు ప్రతి కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహక ధనం అందాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పట్టు రైతులకు పైసా కూడా ప్రోత్సాహక ధనం అందలేదు. పట్టు రైతులను ఆదుకోవాలని, ప్రోత్సాహక ధనం అందించాలంటూ పట్టు రైతులు పలుమార్లు విజయవాడకు వెళ్లి ధర్నాలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. రూ.కోట్లల్లో ప్రోత్సాహక ధనం బకాయిలు పేరుకుపోవడంతో పట్టు రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరుణించిన ‘మార్కెట్’ పట్టు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తూ వచ్చినా... అత్యవసర సమయంలో మార్కెట్ కరుణించింది. దీంతో పంట సాగుకు చేసిన అప్పుల భారం నుంచి బయటపడతామనే ధైర్యం పట్టు రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు పెరిగాయి. హిందూపురంలోని ప్రభుత్వ పట్టు గూళ్ల మార్కెట్లో ఈ నెల 6 నుంచి బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర కిలో రూ.700 పైగా పలుకుతోంది. దీంతో జిల్లాలోని పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత మూడు నెలల్లో ఎన్నడూ రూ.700 మార్క్ను దాటలేదు. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక మార్కెట్లోనూ ఆశాజనక ధరలు కర్ణాటక మార్కెట్లోనూ పట్టుగూళ్ల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతంలో రామనగర, శిడ్లగట్ట, చింతామణిలోని పట్టు గూళ్ల మార్కెట్లు ప్రధానమైనవి. జిల్లాలో గిట్టుబాటు ధరలేని సమయంలో సరిహద్దున ఉన్న మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలోని పలువురు రైతులు తమ పట్టు గూళ్లను కర్ణాటకలోని మార్కెట్లకు తరలించేవారు. ప్రస్తుతం కర్ణాటక మార్కెట్లోనూ కిలో పట్టుగూళ్ల ధర రూ.700 మార్క్ దాటింది. ముఖ్యంగా రామనగర మార్కెట్లో ఈ నెల 6న కిలో పట్టు గూళ్లు రూ.811 ధర పలకడం విశేషం. పెరిగిన పట్టుగూళ్ల ఉత్పత్తి కొన్ని రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా జిల్లాలో పట్టుగూళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హిందూపురం మార్కెట్కు ఈ నెల 6న 2,431 కిలోలు, 7న 2,112 కిలోలు, 8న 3,641 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లను విక్రయానికి రైతులు తీసుకెళ్లారు. అలాగే కర్ణాటకలోని రామనగర మార్కెట్కూ భారీగా బైవోల్టిన్ పట్టుగూళ్లు చేరుతున్నాయి. అమ్మకానికి ఈ నెల 6న 22,173 కిలోలు, 7న 29,913 కిలోలు, 8న 24,590 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లు అమ్మకానికి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పట్టు రైతులకు అందని ప్రోత్సాహకం అత్యవసర సమయంలో ఆదుకున్న మార్కెట్ రూ.700 దాటిన కిలో బైవోల్టిన్ పట్టు గూళ్ల ధర మూడు రోజులుగా ధరల నిలకడ -
అధిక వర్షాలతో టమాటకు చేటు
అనంతపురం అగ్రికల్చర్: లాభాల దిశగా సాగుతున్న టమాట ధరలకు ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టమాట నాణ్యత తగ్గితే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గిపోవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో టమాట సాగులో ఉంది. జూలై మొదటి వారం నుంచి అనంతపురం మండలం కక్కలపల్లి మండీలో మార్కెటింగ్ మొదలైంది. కిలో రూ.25 ప్రకారం మొదలైన ధరలు ఈ నెల ఆరో తేదీ నాటికి గరిష్ట ధర రూ.47కు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో రూ.50 మార్క్కు చేరుకుంటుందని భావించగా.. వర్షాల ఎఫెక్ట్తో శుక్రవారం కిలో రూ.37కు తగ్గిపోయింది. జూలై నెలంతా 15 కిలోల బాక్సు కనిష్టం రూ.300 నుంచి గరిష్టంగా రూ.700 వరకు పలకడంతో రైతులు కొంతవరకు లాభాల బాట పట్టారు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో రైతులు సంబరపడ్డారు. అయితే నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. తెరపినివ్వకుండా వర్షాలు పడితే ఎగుమతులు తగ్గే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాయ తడిచి, మచ్చ వస్తే మార్కెట్లో ‘నో సేల్’ కింద ట్రేడర్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అలాంటి సమస్యలు రాకుండా జిల్లా యంత్రాంగం, ఉద్యానశాఖ, మార్కెటింగ్శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం -
ఓట్ల గల్లంతు వెనుక ఎన్డీఏ హస్తం
ధర్మవరం: బిహార్లో ఓట్ల గల్లంతు వెనుక కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ఓట్ల గల్లంతు విషయంగా ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిహార్లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దాదాపు 80 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, ఇందులో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు, వలస వెళ్లిన ప్రజలు ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు నమోదవుతాయనే అనుమానంతోనే అర్హులైన ఓటర్లను సైతం జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. తొలగించిన ఓటర్లకు సంబంధించిన వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల కమిషన్ స్పందించకుండా సమయం సరిపోదని తెలపడం వెనుక పూర్తిగా అధికార పార్టీ హస్తముందనేది స్పష్టమవుతోందన్నారు. ఇలాంటి విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. నిరసనలో సీపీఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, వెంకటేష్, శ్రీనివాసులు, దిల్షాద్, లక్ష్మీనారాయణ, మారుతి, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, ఎల్.ఆదినారాయణ, వెంకటస్వామి, మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
కలిసి రాని ఖరీఫ్
కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే పలకరించినా.. వర్షాలు మాత్రం ఆలస్యంగానే కురిశాయి. రైతులందరినీ సేద్యంలోకి దింపుతూ వరుణుడు మొహం చాటేయడంతో ఖరీఫ్ పంట కాలం కాస్త అన్నదాతలకు కలిసి రాకుండా పోయింది. విత్తు వేసేందుకు వెనుకాడడంతో ఈ ఖరీఫ్లో కీలకమైన వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పుట్టపర్తి అర్బన్: ఈ ఏడాది రైతులకు ఏదీ కలిసి రాలేదు. ఖరీఫ్ సీజన్లో విస్తారంగా సాగయ్యే వేరుశనగ, కంది, వరి తదితర పంటలు తీవ్ర వర్షాభావం కారణంగా విత్తు వేసేందుకు రైతులు భయపడ్డారు. చెరువుల్లోకి నీళ్లు వస్తాయో రావో కూడా తెలియని అయోమయ స్థితిలో ఆయకట్టు భూముల్లో వరి సాగు చేపట్టలేకపోయారు. కేవలం బోరు బావుల కింద మాత్రమే అక్కడక్కడ వరి సాగులోకి వచ్చింది. వరి పంటకు మంచి అదును అయిన జూన్, జూలై మాసాలు వెళ్లి పోయాయి. ఆగస్టులో పంట వేస్తే దిగుబడి అంతంత మాత్రమే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వర్షాభావం కారణంగా బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గనుండడంతో తక్కువ నీటితో సాగయ్యే వేరుశనగ, మొక్కజొన్న, రాగి తదితర పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. సాధారణంగా నాలుగు నుండి ఆరు నెలల పంట కాలమైన వరి సాగుకు చాలా మంది రైతులు వెనుకంజ వేశారు. ఫలితంగా రాబోవు రోజుల్లో బియ్యానికి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ప్రజలను కలవరపరుస్తోంది. గణనీయంగా తగ్గిన వరి సాగు జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా వరి సాగు చేస్తారు. 6,396 హెక్టార్లలో వరి సాధారణ సాగు కాగా, ఈ ఖరీఫ్లో ఇప్పటి వరకూ 720 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. వరి సాగుకు ఈ ఏడాది ఖర్చులు కూడా భారీ పెరిగాయని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్ బాడుగలు, కూలీలు, ఎరువులు, మందుల పిచికారీకి ఎకరాకు సుమారు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ ఖర్చు అవుతోందన్నారు. ఇక ఆగస్టులో సాగు చేసిన వరి పంటకు అధికంగా చీడ పీడలు ఆశిస్తాయని వ్యవసాయాఽధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు పంట ఆలస్యమయ్యే కొద్దీ మంచు కురిసే సమయం వస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా కురిసిన వర్షాలు తగ్గిన వరి సాగు 6వేల హెక్టార్లకు గాను 700 హెక్టార్లకే పరిమితం రానున్న రోజుల్లో బియ్యానికి కటకటే -
చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం
ధర్మవరం: రాష్ట్రంలో చేనేత రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరంలోని కదిరిగేటు వద్ద గురువారం చేనేత విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి, మాట్లాడారు. సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనంగా ఉన్న చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా రూ.25వేలు చెల్లిస్తామన్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రా మెటీరియల్ సరఫరా పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.164కోట్లు చెల్లించగా, ఇందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించినట్లు వెల్లడించారు. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ధర్మవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందు కోసం మార్కెట్ యార్డులో 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నామన్నారు. ధర్మవరం పట్టణంలో నెలకొన్న అధిక లోడ్ సమస్యపై విద్యుత్శాఖతో సంప్రదించి ప్రత్యేకంగా రూ.110 కోట్లతో వ్యయంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి పొందే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇది పూర్తయితే ధర్మవరంలో మగ్గాలకు ఎలాంటి విద్యుత్ లోపం ఉండదన్నారు. అనంతరం ఉత్తమ చేనేత కార్మికులుగా ఎంపికై న కాంతమ్మ, ఆంజనేయులు, ఈశ్వరయ్య, రామకృష్ణను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ చేతన్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్రెడ్డి, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ -
భూసేకరణ వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: సోలార్ పవర్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకై భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్టెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ అధికారులు, నెడ్క్యాప్ అధికారులు, వివిధ సోలార్ పవర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసు నమోదు కొత్తచెరువు: మండలంలోని లోచర్ల గ్రామానికి చెందిన హరిజన దామోదర, హరిజన లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన కిత్తర నారాయణ, మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు సీఐ మారుతీశంకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కిత్తర నారాయణ, మరో ముగ్గురు మద్యం సేవించి దామోదర, లక్ష్మయ్యను ఊరి నడిబొడ్డున కులం పేరుతో దూసిస్తూ చెప్పులతో, కాళ్ళతో కొట్టారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. 11న జిల్లా జైలులో వేరుశనగ చెక్క వేలంబుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జిల్లా జైలులో ఈ నెల 11న 25 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ అనిల్బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనే వారు రూ. 20వేల ధరావత్తు చెల్లించాలి. ప్రక్రియ ముగిసిన తర్వాత ధరావత్తును వెనక్కు చెల్లిస్తారు. -
ఉప ఎన్నికను హింసాత్మకంగా మార్చారు
● మాజీ మంత్రి శంకరనారాయణ సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో ఉప ఎన్నికలను టీడీపీ నేతలు హింసాత్మకంగా మార్చారంటూ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనాయణ ధ్వజమెత్తారు. ఏకంగా ప్రజాప్రతినిధులపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, మరో నేతపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ది మూరెడు అరాచకం బారెడుగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అభివృద్ధిని పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులే లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలవలేరనే దాడులు ● ఎమ్మెల్సీ మంగమ్మ పుట్టపర్తి టౌన్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేరని స్పష్టం కావడంతో అక్కసు తాళలేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, మరో నేతపై టీడీపీ గుండాలు దాడికి తెగబడ్డాయని ఎమ్మెల్సీ మంగమ్మ మండిపడ్డారు. దాడిని ఆమె ఖండించారు. దాదాపు వంద మంది కట్టెలు, రాళ్లతో దాడులకు తెగబడి భయానక వాతావరణం సృష్టించారన్నారు. సుపరిపాలన చేయడం చేతకాక రెడ్బుక్ రాజ్యాంగంతో దౌర్జన్యాలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. గోరంట్లలో చైన్ స్నాచింగ్ గోరంట్ల: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని బంగార్ గొలుసును దుండగులు లాక్కెళ్లారు. గురువారం సాయంత్రం గోరంట్ల పట్టణానికి చెందిన నాగిరెడ్డి భార్య శ్రీలత, మరో మహిళ శింగిరెడ్డిపల్లి వైపు వాకింగ్కు వెళ్తూండగా గోరంట్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు శ్రీలత మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. భాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య రొద్దం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నల్లూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన రెడ్డిపల్లి గంగన్న కొడుకు శ్రీనివాసులు(40)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీనివాసులు తరచూ తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో గొడవ పడి డబ్బులు ఇవ్వకపోవడంతో ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు మంటలు ఆర్పి కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆయన మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. డాక్టర్ రమణ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు ● క్రిమినల్ కేసు నమోదుకు అనంత ఇన్చార్జ్ కలెక్టర్ సిఫారసు అనంతపురం మెడికల్: గర్భిణి మృతి అంశానికి సంబంధించి ప్రభుత్వ సర్వజనాస్పత్రి సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్కు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ నెల 3న చెదళ్ల గ్రామానికి చెందిన గర్భిణికి రాధమ్మ(29)కు శ్రీనివాస్నగర్లోని శ్రీకృప ఆస్పత్రిలో డాక్టర్ రమణనాయక్ సర్జరీ చేస్తుండగా ఆపరేషన్ టేబుల్పైనే మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో సీజ్ చేసిన ఆస్పత్రిని గుట్టుచప్పుడుగా తెరిచి శస్త్రచికిత్సలు చేయడంతో పాటు పీసీ పీఎన్డీటీ యాక్ట్ అతిక్రమణ, తదితర తప్పిదాలు చేసినట్లు డాక్టర్ రమణ నాయక్పై అభియోగాలు మోపుతూ అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శివ్నారాయణ్ శర్మకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్... డాక్టర్ రమణనాయక్పై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేశారు. కాగా, కేసు నమోదుకు మూడో పట్టణ పీఎస్ సీఐ శాంతిలాల్ నిరాకరించడంతో ఈ నెల 6న ఎస్పీని కలిసేందుకు ఆరోగ్యశాఖ డెమో సిబ్బంది, లీగల్ అడ్వైజర్ వెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ లేకపోవడంతో ఇన్చార్జ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ రమణ నాయక్ సెలవులో వెళ్లినట్లు తెల్సింది. అలాగే గర్భిణి మృతికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అనంతపురం: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రతన్ టాటా ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. గురువారం జేఎన్టీయూ అనంతపురంలోని రతన్టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ కేంద్రంలో బోర్డు సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక బాధ్యత కింద పారిశ్రామిక సంస్థల ద్వారా నిధులను సమకూర్చడం జరుగుతుందన్నారు. సామాజిక వ్యాపారం, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలలో ఎక్కువగా యువత ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు. -
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వీఆర్ఓ అరెస్ట్
గుంతకల్లు టౌన్: ఏడు నెలల గర్భిణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వీఆర్ఓను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు గుంతకల్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన షేక్ షమీమ్ భానూ తన కుమారుడి పేరును రేషన్ కార్డులో నమోదు చేయించుకునేందుకు సచివాలయానికి వెళ్లిన సమయంలో వీఆర్ఓ మహమ్మద్ వలి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. షమీమ్కు సంబంధించిన బంగారాన్ని ఆమె పేరిట బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2 లక్షల రుణం తీసుకున్న వలి ఆ డబ్బును తన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. అనంతరం ఆమె బాగోగులు పట్టించుకోలేదు. భర్త చేసిన మోసంపై గత నెల 14న గుంతకల్లు వన్టౌన్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై కేసు నమోదు చేయించినందుకు కక్ష కట్టి ఆమెను వేధింపులకు గురిచేస్తూ ‘ఎక్కడైనా పడి చావు.. నువ్వు చచ్చిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది’ అని నిర్ధయగా మాట్లాడాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన షమీమ్ బుధవారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి షేక్ పీర్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వీఆర్ఓ వలిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు అనంతపురం: అనారోగ్యంతో మృతి చెందిన కంబదూరు హెడ్కానిస్టేబుల్ రమేష్ మృతదేహానికి అనంతపురంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అనంతపురంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఆరో రోడ్డులోని శ్మశాన వాటికలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠ, ఎస్ఐ లోకేష్, కంబదూరు ఏఎస్ఐ ఓబుళపతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కమిటీ సభ్యులు, మృతుడి కుటుంబ సభ్యులు , బంధువులు పాల్గొన్నారు. కాగా, రమేష్ మృతిపై ఎస్పీ జగదీష్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద రూ.లక్షను రమేష్ భార్య రామలక్ష్మికి అందజేశారు. -
కర్ణాటక వాసి దుర్మరణం
నల్లచెరువు: మండల కేంద్రానికి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటక వాసి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా దిబూరహళ్లికి చెందిన వరుణ్ కుమార్ (32) బొలెరో వాహన డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం నల్లచెరువు సంత తోపు వద్ద బొలెరొ వాహనంలో ఖాళీ క్రేట్లను లోడ్ చేసుకుని జాతీయ రహదారి మీదుగా కదిరి వైపుగా బయలుదేరాడు. నల్లచెరువు శివారులోకి చేరుకోగానే ఎదురుగా కదిరి వైపు నుంచి ఎల్పీజీ సిలిండర్లతో మదనపల్లి వైపుగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. వరుణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పాము కాటుతో యువకుడి మృతి
పరిగి: పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు... పరిగి మండలం కాలువపల్లికి చెందిన నాగేఽశ్వరరావు అలియాస్ కన్నప్ప కుమారుడు అనిల్కుమార్ (22) ఇంటి పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. బుధవారం రాత్రి తనకున్న ఇటుకల బట్టీ వద్ద ఉన్న గదిలో నిద్రించేందుకు మిత్రుడు శివయ్యతో కలిసి వెళ్లాడు. గురువారం వేకువజామున 3 గంటల సమయంలో అనిల్కుమార్కు ఏదో కుట్టినట్లయింది. గమనించి చీమ కుట్టి ఉంటుందని భావించి అలాగే పడుకున్నాడు. కాసేపటి తరువాత వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన శివయ్య వెంటనే తండ్రి కన్నప్పకు ఫోన్ సి, హుటాహుటిన హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎడమ చెవి వద్ద రెండు గాట్లను గమనించిన వైద్యులు పాము కాటుకు గురైనట్లు నిర్దారించారు. చికిత్సకు స్పందించక ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు. కన్నప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తీరనున్న టీచర్ల వేతన వెతలు
కదిరి: ఎట్టకేలకు బదిలీ అయిన టీచర్ల వేతన వెతలు తీరనున్నాయి. ‘బదిలీ టీచర్లకు వేతన వెతలు’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనానికి ఏపీ విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు స్పందించారు. గురువారం ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సెలవుల్లో బదిలీ అయిన టీచర్లకు ఇంత వరకూ జీతాలు ఇవ్వలేదని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన వాస్తవ విషయాన్ని ఒప్పుకున్నారు. దీనిపై రోజంతా కసరత్తు చేసైనా సరే..ఆయా టీచర్లందరికీ తక్షణం పొజిషన్ ఐడీలు క్రియేట్ అయ్యేలా తానే దగ్గరుండి సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తానన్నారు. పొజిషన్ ఐడీలు క్రియేట్ అయిన వెంటనే డీడీఓలు స్థానిక ఎస్టీఓ కార్యాలయాలకు వెళ్లి యుద్ధ ప్రాతిపదికన డీడీఓ లాగిన్ యాక్టివేషన్ చేసుకునేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా శుక్ర, శని, ఆది ఇలా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ‘చిత్రావతి’ సుందరీకరణ పనులు ప్రారంభం పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో చిత్రావతి నదీ తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తెలిపారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న చిత్రావతి నదీ తీర ప్రాంతంలో చేపట్టనున్న పనులను సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్, ఎమ్మెల్యే సిఽంధూరారెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిత్రావతి పరిసరాల సుందరీకరణకు జోయాలుకాస్ ఫౌండేషన్ రూ.1.20 కోట్లు వితరణ చేసిందన్నారు. చిత్రావతి నది తీరప్రాంతంలో పార్కు, జిమ్ము తదితర పనులు చేస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఇరిగేషన్ ఏఈ సుధాకర్రాజు, ఏఈఈ జానకీబాయ్ పాల్గొన్నారు. పలు రైళ్లకు అదనపు బోగీలు గుంతకల్లు: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా గుంతకల్లు డివిజన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం–ధర్మవరం (17215/16) ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 10,11వ తేదీల్లో 2టైర్ ఏసీ బోగీ, తిరుపతి–హబ్లీ (57401/02), తిరుపతి–గుంతకల్లు (57403/04) ప్యాసింజర్ రైళ్లకు 13,14 తేదీల్లో రెండు స్లీపర్ బోగీలను అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధగంగా తిరుపతి–కదిరిదేవరపల్లి (57405/06) ప్యాసింజర్ రైళ్లకు ఈ నెల 15,16వ తేదీల్లో రెండు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
తూకాల్లో నొక్కుడు !
సాక్షి, పుట్టపర్తి: రేషన్ పంపిణీ అవినీతికి కేరాఫ్గా మారింది. డీలర్ల చేతివాటంతో లబ్ధిదారులు నిలువుగా మోసపోతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నేతల దందా మూడు పువ్వలు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారుల పేరు చెబుతూ మాట దాటేస్తున్నారు. తూకాల్లో దగా చేస్తూ ప్రతి నెలా రూ.లక్షలు దండుకుంటున్నారు. రూ.5.62 లక్షల కిలోలు బ్లాక్ మార్కెట్కు.. ఇవ్వాల్సిన సరుకుల కంటే ఐదు కిలోల వరకూ ప్రతి నెలా కోత విధిస్తూ రేషన్ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ, ధర్మవరంలో వెలుగు చూసిన ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మొత్తం 5.62 లక్షల కార్డులకుగానూ కార్డుకు కిలో చొప్పున మోసం చేసినా.. 5.62 లక్షల కిలోలు బ్లాక్ మార్కెట్కు దర్జాగా తరలించేస్తున్నారు. కిలో రూ.10 ప్రకారం అమ్మినా.. రూ.50 లక్షలు పైగా ఆర్జిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కార్డుకు ఐదు కిలోల వరకు.. చౌకధాన్యపు దుకాణంలో ఉన్న కార్డుదారుల్లో ప్రతి ఒక్క కార్డుపై ఐదు కిలోల వరకు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా (ఐదుగురు ఉంటే) 25 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ తూకం వేసినప్పుడు సరిగ్గానే ఉంటోంది. అయితే ఇంటికెళ్లాక పరిశీలిస్తే అందులో 20 కిలోలు మాత్రమే ఉంటుండటంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. ఒకరిద్దరు తర్వాత వచ్చి అడిగినా డీలర్లు దబాయిస్తున్నారు. నేరుగా బ్లాక్ మార్కెట్కు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్టోర్ డీలర్లందరినీ ఒక్కసారిగా మార్పు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకు డీలర్షిప్ ఇవ్వడంతో అవినీతి దందాకు తెరలేపారు. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే తూకాల్లో తేడా నిర్వాకం జరుగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. స్టోర్ డీలర్ల నుంచి మిగిలిన సరుకును నేరుగా బ్లాక్ మార్కెట్కు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన తూనికలు – కొలతల అధికారులు మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఆర్నెల్లకు ఓసారి కూడా తనిఖీలు చేయడం లేదు. మరోవైపు పౌరసరఫరాల శాఖాధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. బియ్యం పంపిణీలో రేషన్ డీలర్ల చేతివాటం కార్డుకు ఐదు కిలోల వరకూ కోత అధికారులే చెప్పారంటూ దబాయింపుచర్యలు తప్పవు రేషన్ షాపుల్లో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు. తూకాల్లో తేడా వచ్చినా.. వెంటనే నిలదీయండి. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే.. ఫలితం ఉండదు. తూకాల్లో మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయండి. ఆకస్మిక తనిఖీలు చేసి నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రొద్దం మండలం బొక్సంపల్లిలో త్రాసు మీద గోనె సంచి ఉంచి.. తూకం వేస్తున్నారు. ఫలితంగా ప్రతి కార్డుదారుడికీ సుమారు ఒకటిన్నర కిలో బియ్యం తేడా వస్తోంది. ప్రశ్నించిన వారిపై స్టోర్ డీలర్ పీఎన్ రాజు తిరగబడుతున్నాడు. ప్రభుత్వం నుంచి కమీషన్ తక్కువగా వస్తోందని, ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇవ్వాలంటే ఈమాత్రం నొక్కాల్సిందేనని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ ఘటన గత జూన్ 1వ తేదీన వెలుగు చూసింది. ధర్మవరం మండలం రావులచెరువు పంచాయతీ ఆర్.యర్రగుంటపల్లిలో ఒక్క కార్డుకు ఐదు కిలోల చొప్పున బియ్యం తేడా వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈనెల 1న ఓ లబ్ధిదారుడు డీలర్తో గొడవకు దిగారు. కావాలంటే సరుకు తీసుకెళ్లు.. లేదంటే అక్కడ పడేసి వెళ్లాలంటూ డీలర్ చెన్నారెడ్డి దబాయించాడు. దీంతో చేసేది లేక లబ్ధిదారుడు ఉన్న సరుకుతో ఇంటికెళ్లాడు. ప్రతి నెలా ఆ స్టోర్లో ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని కార్డుదారులు వాపోతున్నారు. -
రాష్ట్రం మరో బిహార్లా మారింది
పెనుకొండ రూరల్: బీసీ నేతలపై దాడులకు పాల్పడటం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వైఎస్సార్సీపీ నేత రామలింగారెడ్డిపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. జెడ్పీటిసీ ఉప ఎన్నిక వేళ టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటం సరికాదన్నారు. బీసీ నేతలను టార్గెట్గా చేసుకొని దాడులకు తెగపడడం రెడ్బుక్ రాజ్యంగానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేకనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా చేసుకొని దాడులు చేయడమేకాకుండా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం మరో బిహార్లా మారిందన్నారు. కూటమి పాలనలో దాడులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు పెనుకొండ రూరల్: ధనం, ధాన్యం, సంపద, విజయం అందించే మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే జిల్లా ప్రజలకు ఆమె వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇళ్లూ భోగ భాగ్యాలు సకల సంపదలతో విరాజిల్లాలని దేవుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. బీసీ నేతలపై దాడులు సరికాదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
వర్షపు నీటి నిల్వతోనే భూగర్భజలాలు పెంపు
మడకశిరరూరల్: వర్షపు నీటి నిల్వతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు డీపీఎం లక్ష్మానాయక్ అన్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు. ఉగ్రేపల్లిలో రైతు కృష్ణమూర్తి పొలంలో వర్షపు నీటి నిల్వ చేయడానికి 5 అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పుతో అర్ధ చంద్రాకారంలో చేపట్టిన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పొలంలో ఈ విధానంగా నిర్మాణాలు చేసుకొంటే వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూమిలోకి నీరు ఇంకిపోతాయన్నారు. దీనివల్ల భూగర్భజలమట్టం స్థాయి మరింతగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కమ్యూనికేషన్ టీమ్ సభ్యురాలు కీర్తన, ఎంఎంటీఎల్ రమేష్ , సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
కమీషన్ల వల.. విలవిల
బిల్లులతో సంబంధం లేదు. కష్టాలు పడుతున్నా పట్టడం లేదు. కమీషన్లు ముట్టజెప్పాకే మాటలు. లేదంటే కష్టాలే. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజా ప్రతినిధుల కమీషన్ల వలలో చిక్కుకుని కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రజాప్రతినిధుల దెబ్బకు చిన్న చిన్న సివిల్ కాంట్రాక్టర్లు, బిల్డర్లే కాదు అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు సైతం విలవిలలాడుతున్నారు. ‘కోడి ముందా..గుడ్డు ముందా’ అనే చిక్కు ప్రశ్నను మరపిస్తూ ‘గుడ్డు కాదు.. దుడ్డే ముందు’ అన్న విధంగా పరిస్థితి తయారైంది. ‘మీకు బిల్లులు ఎప్పుడైనా రానీ.. మాకు కమీషన్ మాత్రం ముందే ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబడుతుండడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అడిగినంత సమర్పించుకుంటున్న పరిస్థితి.రవాణా పనులు తమ్ముళ్లకే..గతంలో కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లే అంగన్వాడీలకు వాటిని రవాణా చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నియోజకవర్గాల్లో కోడిగుడ్ల రవాణా పనులను ఎమ్మెల్యే చెప్పిన వారికి ఇచ్చారు. రవాణాకు సంబంధించిన చెల్లింపులు కాంట్రాక్టరు చేస్తారు. కాంట్రాక్టర్కు సమయానికి బిల్లులు వచ్చినా రాకపోయినా ‘తమ్ముళ్ల’కు మాత్రం రవాణా ఛార్జీలు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుంది. ఒక్కోసారి రవాణా సమయంలో కోడిగుడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టరే ఆ భారం మోయాల్సి వస్తోంది.ఆరు మాసాలుగా బిల్లుల్లేవ్..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు మాసాలుగా కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో నెలకు 50 లక్షల నుంచి 60 లక్షల గుడ్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుత రేట్ల ప్రకారం ఒక్కో కోడిగుడ్డు రూ.6 పైనే పలుకు తోంది. ఈ లెక్కన నెలకు రూ.3.50 కోట్ల వరకూ బిల్లు అవుతుంది. అయితే, రెండు జిల్లాల్లో అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లకు పైసా బిల్లు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ కమీషన్లు ఏడాది ముందే లాగేసుకున్నారు. ఇప్పుడేమో కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.అంతా ఆయన ఇష్టం..కదిరి నియోజకవర్గంలో కోడిగుడ్ల సరఫరా కు సంబంధించి ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఇక్కడ గుడ్లు సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్కు స్థానిక ప్రజాప్రతినిధి చుక్కలు చూపుతున్నారు. తనకే కాంట్రాక్టు ఇవ్వాలని భయపెట్టడంతో కాంట్రాక్టర్ చేసేదిలేక వదిలేశారు. అంతకుముందు కాంట్రాక్టుకు సంబంధించిన డిపాజిట్ డబ్బు కాంట్రాక్టరే బ్యాంకులో చెల్లించినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. దీంతో గుడ్ల కొనుగోలు, రవాణా మొత్తం ప్రజాప్రతినిధి చేతుల్లో జరుగుతోంది.దీంతోఅక్కడ గుడ్లు చిన్నవా, పెద్దవా అని అడిగే సాహసం చేసేవారు లేరు.అనంతపురం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు ; 2,302 శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు; 2,824 నెలకు సగటున కోడిగుడ్ల బిల్లు; రూ. 3.50 కోట్లునెలకు అవసరమయ్యే కోడిగుడ్లు; 50-60 లక్షలుఆరునెలల బకాయిలు; రూ. 21కోట్లు -
‘పురం’లో భూమి.. చిలమత్తూరులో రిజిస్ట్రేషన్!
● రూ.కోటి విలువైన భూమిని టీడీపీ నేత మంగేష్కు రిజిస్ట్రేషన్ ● రాత్రి ఏడు గంటల సమయంలో తతంగం చిలమత్తూరు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పోలీసు బందోబస్తు నడుమ రాజ్ సుధీర్ అనే వ్యక్తి హిందూపురంలోని తన భూమిని టీడీపీ నేత మంగేష్కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిందూపురం రెవెన్యూ గ్రామానికి చెందిన భూమిని అక్కడ కాకుండా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య చేయడం అనుమానాలకు తావిచ్చింది. కాగా.. అత్యంత భద్రంగా ఉండాల్సిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ డాక్యుమెంట్ గదిలో ప్రైవేటు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే.. రాజ్ సుధీర్ అనే వ్యక్తికి హిందూపురం రూరల్ అప్గ్రేడ్ స్టేషన్ పక్కన భూమి ఉండేది. ఈ భూమిని 2004లో ప్లాట్లుగా వేసిన రాజ్ సుధీర్ పలువురికి విక్రయించాడు. అయితే వారెవరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా మంగేష్కు అదే భూమిలోని కొంత భాగాన్ని కోటి రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే హిందూపురంలో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే గతంలో భూములు కొన్నవారు వచ్చి అడ్డుకుంటారని భావించి చిలమత్తూరులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజ్ సుధీర్ బాధితులు... చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుని తమను మోసం చేసిన రాజ్ సుధీర్ను పట్టుకున్నారు. టీడీపీ నేత మంగేష్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా...వారంతా ఎదురు తిరిగారు. దీంతో మంగేష్ అక్కడి నుండి జారుకున్నారు. అనంతరం బాధితులు రాజ్ సుధీర్ను స్థానిక పీఎస్లో అప్పజెప్పారు. ఎస్ఐ నరేంద్ర ఓవరాక్షన్.. లేపాక్షి ఎస్ఐ నరేంద్ర చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓవర్ యాక్షన్ చేశారు. గొడవ గురించి ఆరా తీసేందుకు స్టేషన్లోకి వెళ్లగా... లోపలికి ఎవరు రమ్మన్నారంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చకూడదని చట్టం చెబుతుండగా... ఎస్ఐ నరేంద్ర మాత్రం.. ఇరువర్గాలను ఒప్పించి సెటిల్మెంట్ చేయాలని చూస్తున్నానని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా ఎస్ఐ నరేంద్ర నింది తుల పక్షాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం సిటీ: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తూ అకాల మరణం పొందిన ఉద్యోగులకు సంబంధించిన వారసులు 13 మందికి జూనియర్ అసిసెంట్లుగా నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో బుధవారం ఆమె అందజేసి, మాట్లాడారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ అలవర్చుకోవాలని కోరారు. కేటాయించిన విధులకు సంబంధించి సీనియర్ల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శ్రీకాళహస్తిలోని కేంద్రంలో శిక్షణ అనంతరం విధుల్లో చేరాల్సి ఉంటుందని జెడ్పీ సీఈఓ శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ‘ఎ’ సెక్షన్ ఏఓ షబ్బీర్ నియాజ్, సీనియర్ అసిస్టెంట్లు అరుణకుమారి, మాధవి, జూనియర్ అసిస్టెంట్ జోషి ప్రణీత్, టైపిస్ట్ సుభాష్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి క్రీడలకు నవోదయ విద్యార్థులు లేపాక్షి: నవోదయ విద్యాలయ క్లస్టర్ స్థాయి క్రీడా పోటీల్లో లేపాక్షి నవోదయ విద్యార్థులు 20 మంది ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. క్రీడలు ముగించుకుని బుధవారం ఉదయం విద్యాలయానికి చేరుకున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగరాజు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. జూలై 29 నుంచి 31వ తేదీ వరకు జరిగాయి నవోదయ విద్యాలయాల క్లస్టర్ స్థాయి పోటీలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగాయన్నారు. కేరళలోని మల్లాపురం నవోదయలో జరిగిన జూడో అండర్–14 పోటీల్లో సింధూ, హర్షిక, లాస్య, అండర్–17లో యశస్విని, అండర్–19లో శ్రీవాణి ప్రతిభ చాటారన్నారు. వీరు భోపాల్లోని నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే ఏలూరులో జరిగిన క్రికెట్ పోటీలలో అండర్–14 విభాగంలో దర్శిత్సాయి, అండర్–17లో హేమలత, వినూత, భువనేశ్వరి, ఫణిప్రకాష్ ప్రతిభ కనబరిచి, హర్యానాలోని కురుక్షేత్రం నవోదయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో క్లస్టర్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కరీంనగర్ నవోదయలో జరిగిన ఖోఖో అండర్–19 పోటీలలో సింహాద్రి ప్రతిభ కనబరిచి ఒడిశాలోని కటక్ నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి నవోదయలో జరిగిన బాల్గేమ్స్ భవ్యశ్రీ విజేతగా నిలిచి, గుజరాత్లోని రాజ్కోట్ నవోదయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. గుంటూరు నవోదయలో జరిగిన యోగా పోటీల్లో చరణ్సాయి, నిధిక్ ప్రతిభ కనబరిచారని, వీరు గుంటూరు నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. విజయనగరం నవోదయలో జరిగిన బాల్గేమ్స్ క్రీడల్లో జయదీపికా ప్రతిభ కనబరిచి బిహార్లోని పాట్నా నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కేరళలోని కాసర్ఘడ్ నవోదయలో జరిగిన బాస్కెట్బాల్ క్రీడల్లో జుతేష్ ప్రతిభ కనబరిచి మధ్యప్రదేశ్లోని గుణ నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే క్లస్టర్ జట్టు తరఫున పాల్గొననున్నాడని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను క్రీడా ఉపాధ్యాయులు వివేకానంద, వేదవతి, షేక్ ఆసీఫ్అలీ, సిబ్బంది అభినందించారు. -
అయ్యవార్ల యాప్సోపాలు
విద్యార్థులకు చదువు చెప్పడం కన్నా, పాలనాపరమైన బాధ్యతలు, బోధనేతర విధుల భారంతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. యాప్స్, బోధనేతర కార్యక్రమాల పేరుతో టీచర్లను కట్టుబానిసల్లా ప్రభుత్వం మార్చేసిందని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ యాప్ల భారం నుంచి ఉపాధ్యాయులను మినహాయించి వారిని విద్యాబోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుట్టపర్తి: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించబోమని, వారిని బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూ ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. యాప్ల పేరుతో బోధనేతర పనులను కేటాయించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో అసహనం రేకెత్తుతోంది. పైకి ఒక్కటే.. తెరిస్తే 36! కూటమి ప్రభుత్వం ఏర్పడితే తమకు ఏదో మేలు జరుగుతుదనే ధోరణి గతంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో వ్యక్తమైంది. అయితే ఇందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా యాప్ల భారం, శిక్షణా తరగతులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ యాప్లతో ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. మొత్తం 36 రకాల అంశాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉదయం పాఠశాలకు రాగానే విద్యార్ధుల, ఉపాధ్యాయుల హాజరు నుంచి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల కిట్లు, హాజరు, చిక్కీలు, కోడిగుడ్లు ఎన్ని వచ్చాయి అనే సమాచారం అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు మధ్యాహ్న భోజనం విషయం తీసుకుంటే ప్రతిరోజూ ఎంత సరుకు వచ్చింది?. ఎంత వినియోగించారు?. అందుకు ఎంత బిల్లు అవుతుంది?. గుడ్లు ఎన్ని అందాయి అనే అంశాలను రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ప్రతి తరగతిలో ఎంతమంది పిల్లలు హాజరయ్యారు అనే వివరాలను స్టూడెంట్స్ అటెండన్స్ యాప్లో నమోదు చేయాలి. ఇవి కాకుండా దీక్ష యాప్లో పిల్లలకు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, వారికి పరీక్షల్లో వచ్చిన మార్కుల వంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. వీటిని భర్తీ చేసి అప్లోడ్ చేయడానికి చాలా సమయం పడుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ తీరుతో బడులు మూత పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పీ–4 విధానంతో మరింత అసహనం.. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 కార్యక్రమానికి ఉన్నత వర్గాల నుంచి విముఖత వ్యక్తం కావడంతో ఆ భారాన్ని ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ విధానంలో ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు మరింత అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. కొత్తగా పేద కుటుంబాలను దత్తతకు తీసుకోవాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు పోరుబాటకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తిగతంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వ తీరుతో బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు యాప్ భారంతో కొండెక్కిన విద్యార్థుల చదువు పీ–4 దత్తత తీసుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి చదువులకు దూరమవుతున్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లో వివరాలను భర్తీ చేసి అప్లోడ్ చేయడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నాం. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలి. ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. – శ్రీచందన, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం మినహాయింపునివ్వాలి యాప్ల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలి. ఆర్పీలను, ఇతర సిబ్బందికి ఈ విధులు అప్పగించాలి. రోజులో అధిక సమయం యాప్లో వివరాలు నమోదు చేయడానికే సరిపోతోంది. దీంతో బోధన కరువై విద్యార్థులు చదువులకు దూరమవుతారు. ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – బడా హరిప్రసాదరెడ్డి, ఏపీటీఎఫ్(1938) జిల్లా అధ్యక్షుడు -
ప్రీ పీహెచ్డీ పరీక్షకు హాజరైన మాజీ మంత్రి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పీహెచ్డీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ప్రొఫెసర్ కె.రాంగోపాల్ పర్యవేక్షణలో ఫిజిక్స్లో ఆమె పీహెచ్డీ చేస్తున్న విషయం తెలిసిందే. నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీలేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్టు లేపాక్షిలోని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యాసంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 23వ తేదీలోపు www. navodaya. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026, ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకూ గడువు పొడిగించారు. అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు పీఎస్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ (45) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా సెలవు పెట్టి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పరిస్థితి విషమించడంతో మడకశిరలోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియగానే కంబదూరు పీఎస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బంగారు గొలుసు అపహరణ
పుట్టపర్తి టౌన్: మాయమాటలతో దుకాణదారును ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెలివిగా అపహరించుకెళ్లిన ఘటన పుట్టపర్తిలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు తెలిపిన మేరకు...పుట్టపర్తిలోని ఎస్బీఐ రోడ్డులో నివాసముంటున్న కుసుమాంబ స్థానికంగా ఓ ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు యువకులు ఫ్యాన్సీ స్టోర్కు వచ్చారు. ఒకరు బయట స్కూటీ మీద కూర్చొని ఉండగా, మరొకరు స్టోర్లోకి వెళ్లి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుగోలు చేశాడు. అదే సమయంలో కుసుమాంబతో మాటలు కలిపి వ్యాపారం ఎలా జరుగుతోందంటూ ఆరా తీశాడు. క్యాష్ బ్యాక్స్లో బంగారాన్ని పెడితే రెట్టింపు అవుతుందని, వ్యాపారం కూడా బాగా జరుగుతుందని నమ్మబలికాడు. అతని మాయ మాటల్లో చిక్కిన ఆమె తన మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తీసి క్యాష్ బ్యాక్స్లో వేయబోతుండగా అలా కాదని తన వద్ద ఉన్న ఓ పేపర్ తీసి అందులో పెట్టమని అడిగాడు. ఆమె అలాగే పేపర్లో బంగారు గొలుసు పెట్టిన తర్వాత దానిని మడిచి ఆమె దృష్టి ఏమారుస్తూ క్యాష్ బ్యాక్స్లో వేసి, తన సహచరుడితో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఆ పేపర్ తీసి చూడగా అందులో బంగారు గొలుసు కనిపించలేదు. తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న ఆమె కన్నీటిపర్యతమవుతూ స్థానికులకు వివరించింది. సమచారం అందుకున్న పుట్టపర్తి అర్బన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై బాధితురాలితో ఆరా తీశారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
బంతికి డిమాండ్
పెళ్లిళ్ల సీజన్తో పాటు విశిష్ట పండుగలు కలసి వచ్చిన ఈ శ్రావణ మాసంలో బంతి పూలకు భారీగా డిమాండ్ నెలకొంది. గతంలో కిలో బంతి పూలు కేవలం రూ.30 నుంచి రూ.40 వరకూ అమ్ముడు పోగా తాజాగా రూ.వందకు చేరుకుంది. త్వరలో వినాయక చవితి, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాసం రానుండడంతో పూల ధరలు నిలకడగా ఉంటాయని రైతులు శిస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 719 హెక్టార్లలో పూల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 185 హెక్టార్లలో చామంతి, 30 హెక్టార్లలో రోజా, 35 హెక్టార్లలో జాస్మిన్, 200 హెక్టార్లలో బంతి, 153 హెక్టార్లలో కనకాంబరాలు, మరో 117 హెక్టార్లలో ఇతర రకాల పూల తోటల సాగును రైతులు చేపట్టారు. కదిరి, హిందూపురం, అనంతపురం, ధర్మవరం మార్కెట్లతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపూర్, బెంగళూరు మార్కెట్లకు పూల దిగుబడిని రైతులు తరలిస్తున్నారు. – పుట్టపర్తి అర్బన్: -
జిల్లా క్రీడా జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో వివిధ క్రీడా జట్ల ఎంపిక చేశారు. పోటీలను మున్సిపల్ డీఈ రమేష్కుమార్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో 22 ఏళ్ల లోపు పురుషులు, మహిళల క్రీడా జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది పురుషులు, 150 మంది మహిళలు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకూ తిరుపతిలో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ ప్రతిభ చాటిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్డీఓ ఉదయ భాస్కర్, ఎంజీఎం ఉన్నత పాఠశాల హెచ్ఎం పాండురంగనాయకులు, ఎస్జీఎఫ్ సెక్రటరీ మొరార్జీ యాదవ్, పీడీ, పీఈటీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్, పీడీ లోక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. -
29 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వరుసగా మూడో రోజూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 29 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా తాడిమర్రి మండలంలో 56.2 మి.మీ, తలుపుల మండలంలో 54.6 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక ముదిగుబ్బ మండలంలో 48.6 మి.మీ, గాండ్లపెంట 48.2, చిలమత్తూరు 39.6, పరిగి 35.4, కదిరి 31.2, ఎన్పీ కుంట 26.2, తనకల్లు 18.6, నల్లచెరువు 17, గోరంట్ల 15.2, పెనుకొండ 14.4, హిందూపురం 14.2, సోమందేపల్లి 13, అమడగూరు 11.8, మిగతా మండలాల్లో 10 నుంచి 3.2 మి.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలపారు.సికింద్రాబాద్– మైసూరు మార్గంలో ప్రత్యేక రైళ్లుగుంతకల్లు: సికింద్రాబాద్–మైసూర్ మార్గంలో ఈ నెల 8 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జంక్షన్ (07033) నుంచి సోమ, శుక్రవారాల్లో రాత్రి 10.10 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటలకు మైసూర్ జంక్షన్కు చేరుకుంటుందన్నారు. మైసూర్ జంక్షన్ (07034) నుంచి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుతుందన్నారు. బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగుళూరు కంటోన్మెంట్, బెంగుళూరు జంక్షన్, కెనిగేరి, మండ్య మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 2టైర్, 3టైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయన్నారు. జీతాలు చెల్లించండి మహాప్రభో పుట్టపర్తి టౌన్: నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కొత్తచెరువులోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలోని వెయ్యి గ్రామాల్లోని 10 లక్షల మంది ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 540 మంది కార్మికులు నీటిని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో పైప్లైన్ దెబ్బతిన్న ప్రతిసారీ సొంత డబ్బు వెచ్చించి మరమ్మతులు చేశామన్నారు. అయినా తమకు వేతనాలు అందజేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించాడంటూ వాపోయారు. ఫలితంగా కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 14 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే నిధులు విఽడుదల చేసి 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, పథకం నిర్వహణకు పూర్తి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. -
మార్కెట్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను నియంత్రించడంతో పాటు చౌకధాన్యపు దుకాణాల ద్వారా నిరుపేదలకు రేషన్ సరుకులు అందించాల్సి ఉంది. కానీ కూటమి సర్కార్కు ప్రచారం తప్ప... పేదల ఆకలి కేకలు పట్టడం లేదు. రేషన్ సరుకుల్లో ఇవ్వాల్సి
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక పౌరసరఫరాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఏడాదిగా నిత్యావసర సరుకులు సరిగా పంపిణీ చేయకుండా నిరుపేదలను వేధిస్తోంది. గతంలో ఇచ్చే కందిపప్పుకు పూర్తిగా మంగళం పాడింది. ఇప్పుడు కేవలం బియ్యం, అరకొరగా చక్కెర అందించి చేతులు దులుపుకుంటోంది. 5.76 లక్షల కుటుంబాలకు కందిపప్పు కట్.. జిల్లాలో 5,76,632 రేషన్ కార్డులుండగా, 1,367 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 8,600 మెట్రిక్ టన్నుల బియ్యం, 430 మెట్రిక్ టన్నుల చక్కెర, 576 మెట్రిక్ టన్నుల కందిపప్పు కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం మాత్రమే అందిస్తోంది. చక్కెర అరకొరగా ఇస్తూ, కందిపప్పును పూర్తిగా బంద్ చేసింది. మార్కెట్లో కొనలేక.. కిలో కందిపప్పు మార్కెట్లో రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా రూ.67లకే కిలో కందిపప్పును ప్రభుత్వం అందించేది. కానీ కూటమి సర్కార్ కందిపప్పు ఇవ్వకపోవడంతో నిరుపేదలు మార్కెట్లో అంత ధర వెచ్చించి కందిపప్పు కొనలేకపోతున్నారు. ఈ నెలలో వినాయక చవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మి వ్రతం తదితర పండుగలుండగా... కనీసం ఈ నెల అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు అందిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ నెల కోటాలో కూడా బియ్యం, అరకొర చక్కెరతో సరిపెట్టింది. దీంతో నిరుపేదలు పప్పుకోసం అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందించే వారు. క్రమం తప్పకుండా బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేసేవారు. ఇళ్ల ముంగిట్లోనే రేషన్ సరుకులు అందుతుండటంతో పేదలు ఎంతో సంతోషించే వారు. కానీ కూటమి ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీని అస్తవ్యస్తం చేసింది. తొలుత ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలను తొలగించింది. అంతేకాకుండా రేషన్ సరుకుల్లోనూ కోతలు విధించింది. కందిపప్పు, రాగులు, గోధుమపిండికి పూర్తిగా మంగళం పాడింది. ప్రస్తుతం ప్రతి నెలా బియ్యం మాత్రం అవసరమైన మేరకు పంపిణీ చేస్తోంది. పంచదార కూడా అరకొర మాత్రమే అందిస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క నెల కూడా పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు పంపిణీ చేయకపోవడంతో కూటమి సర్కార్పై నిరుపేదలు శాపనార్థాలు పెడుతున్నారు. పేదింట ఉడకని పప్పు రేషన్ సరుకుల్లో ఇవ్వని కూటమి సర్కార్ బియ్యం, పంచదారకే పరిమితం మార్కెట్లో పెరిగిన కంది పప్పు ధర పప్పుచారుకూ నోచుకోలేని స్థితిలో నిరుపేదలు ప్రభుత్వం ఇస్తే పంపిణీ చేస్తాం ప్రభుత్వం ఆగస్ట్ నెలకు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసింది. కందిపప్పు ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం సరఫరా చేస్తే రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకుకందిపప్పు అందిస్తాం. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
ఆర్టీఏలో ఏసీబీ గుబులు
అనంతపురం సెంట్రల్: ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న రవాణా శాఖ అధికారుల్లో గుబులు రేగుతోంది. ఇటీవల అనంతపురం రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారిని ఉద్యోగం (రిమూవ్ ఫ్రం సర్వీస్) నుంచి తొలగించడం అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోనూ పలువురిపై వేటు తప్పదని ఊహాగానాలు రేగడంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోననే ఆందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు పట్టుబడిన పలువురు ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరంతా ఇప్పుడు ఏసీబీ దెబ్బకు భయపడిపోతున్నారు. చర్యలకు ఉపక్రమణ.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడిన, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో రవాణా శాఖ కమిషనర్ సీరియస్గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఏఎంవీఐని ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. గతంలో ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి ఇటీవల కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రాగా పవర్స్ ఇవ్వకుండా ఉంచారు. ఆరు నెలలు దాటినా తిరిగి అధికారాలు పునరుద్ధరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. గతంలో జిల్లా కేంద్రంలో ఇద్దరు ఎంవీఐలు, ఓ ఏఎంవీఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో కూడా ఇద్దరు ఎంవీఐలు, ఓ చిన్న స్థాయి సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్లు సమాచారం. హోంగార్డుల్లో కంగారు.. రవాణా శాఖలో డిప్యుటేషన్పై పనిచేసే పోలీసు శాఖకు చెందిన హోంగార్డులు కూడా అనేక సందర్భాల్లో ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఒకరిద్దిని ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగిస్తూ (రిమూవ్ ఫ్రం సర్వీస్) నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కోర్టును ఆశ్రయించారు. పై అధికారులు చెబితేనే తాము చేశాం.. చిరుద్యోగులం.. తమపై ఏసీబీ కేసులు తొలగించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ అంశంపై కూడా త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశముందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. వీఆర్ఎస్కు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఉన్నతాధికారుల చర్యల నుంచి బయటపడేందుకు కొంతమంది స్వచ్ఛంద పదవీ విరమణ (వలంటరీ రిటైర్మెంట్) చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పదవీ విరమణ అయినప్పటికీ ఏసీబీ కేసుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రావని తెలియడంతో మిన్నకుండిపోతున్నారు. ఏదీ ఏమైనా రవాణాశాఖ అధికారులకు ఏసీబీ భయం కంటి మీద కునుకులేకుండా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓ ఏఎంవీఐ సర్వీస్ నుంచి తొలగింపు ఉమ్మడి జిల్లాలోనూ పలువురిపై వేటు తప్పదని ఊహాగానాలు వణికిపోతున్న ఏసీబీ కేసులున్న అధికారులు -
బదిలీ టీచర్లకు వేతన వెతలు
కదిరి: ఉపాధ్యాయులు రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. పదోన్నతులు పొంది బదిలీపై కొత్త పాఠశాలకు వెళ్లిన ఎంతోమంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు. పదోన్నతి పొందామని ఆనందపడాలో..జీతం రాలేదని బాధపడాలోనని అయోమయంలో ఉన్నారు. ఇంటి అద్దెలు, ఇంటి ఖర్చులతో పాటు పిల్లల ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సమస్య ఏంటి? ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వేసవి సెలవుల్లో మే 21న ప్రారంభమైన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జూన్15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,152 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వీరిలో గ్రేడ్–2 హెచ్ఎంలు 133 మంది, పీఎస్ హెచ్ఎంలు 193 మంది, స్కూల్ అసిస్టెంట్లు 3,478 మంది, ఎస్జీ టీచర్లు 3,208 మంది, పండిట్లు 111 మంది, పీఈటీలు 29 మంది ఉన్నారు. పదోన్నతితో పాటు బదిలీ అయిన టీచర్లకు విద్యాశాఖ అధికారులు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంటుంది. వారు ఆ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయనందున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,200 మంది టీచర్లకు జూన్, జూలై మాసాలకు సంబంధించిన వేతనాలు ఖాతాల్లో జమ కాలేదు. కూటమి సర్కారు తెచ్చిన తంటా.. కూటమి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి పలు రకాల పాఠశాలల పేరుతో మార్పులు చేసింది. అప్గ్రేడ్ అయిన ప్రైమరీ స్కూళ్లు, కొత్తగా ఏర్పాటైన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు బదిలీ అయిన టీచర్లు, పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలు... ఇలా సుమారు 2,200 మంది వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కొత్తగా పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ఇంత వరకూ కూటమి సర్కారు ఆ పని పూర్తి చేయలేదు. సాధారణంగా వేతనాల బిల్లు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్ఎంఎస్ ద్వారా అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ప్రభుత్వం వీరికి సకాలంలో పొజిషన్ ఐడీ కేటాయించనందున సంబంధిత అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేక పోయారు. ఈ కారణంతో వీరికి రెండు నెలలుగా వేతన వెతలు తప్పడం లేదు. కూటమి సర్కారు విఫలం ఉపాధ్యాయ సమస్యలను ఇప్పటికే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎలాంటి స్పందన లేదు. బదిలీ అయిన టీచర్లు ఎంతో మంది రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ వారికి పొజిషన్ ఐడీ కేటాయించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. – పీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్టీఏ వేతన కష్టాలు తీర్చాలి ప్రభుత్వానికి టీచర్ల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే గంటల వ్యవధిలోనే ఇవ్వాలని చెబుతారు. కానీ టీచర్ల వేతనాల విషయంలో మాత్రం ప్రభుత్వం జూన్ నుంచి ఇప్పటి దాకా చిన్న సమస్యను పరిష్కరించలేక పోతోంది. ప్రభుత్వం వెంటనే వేతన కష్టాలు తీర్చాలి. – కట్టుబడి గౌస్లాజం, జిల్లా అధ్యక్షుడు, డీటీఎఫ్ ప్రభుత్వ వైఫల్యమే వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా బదిలీ అయిన కొందరు టీచర్లకు ఇంత వరకూ జీతాలు అందలేదంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. నెల జీతం రాగానే ఇంటి అద్దె, సరుకులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, డిష్ బిల్లు, సెల్ఫోన్ల రీచార్జ్లు, బ్యాంకు ఈఎంఐలు, పిల్లల ఫీజులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. – కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రెండు నెలలుగా జీతాలు అందక అవస్థలు పొజిషన్ ఐడీ కేటాయించని విద్యాశాఖ అధికారులు -
బూతులు తిట్టి..స్టేషన్లో కూర్చోబెట్టి!
బ్రహ్మసముద్రం: న్యాయం చేయమని వచ్చిన తమను ఎస్ఐ నానా బూతులు తిట్టడమే కాకుండా పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బొబ్బర్లపల్లికి చెందిన మారెన్న కుమార్తె పొలంలోని వేరుశనగ పంటను ఆదివారం కొందరు గొర్రెలతో మేపారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు బ్రహ్మ సముద్రం పోలీసుస్టేషన్కు వెళ్లగా.. ఎస్ఐ నరేంద్రకుమార్ న్యాయం చేస్తామని చెప్పి ఆమెను వెనక్కి పంపారు. సోమవారం ఆమె మళ్లీ తన భర్తతో పాటు తండ్రి మారెన్నతో కలిసి పోలీసుస్టేషన్కు వెళ్లింది. ఈ క్రమంలోనే వారిపై ఎస్ఐ నరేంద్ర కుమార్ రెచ్చిపోయారు. తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా బూతులు తిట్టారు. న్యాయం చేయాలని కోరితే ఇలా మాట్లాడడం తగదని మారెన్న అనగా.. ఎస్ఐ మరింత రెచ్చిపోయారు. నువ్వెవరు తప్పుడు నా కొ.. అంటూ దాష్టీకం ప్రదర్శించారు. మారెన్నతో పాటు ఆయన కుమార్తె, ఆమె భర్తను స్టేషన్లో కూర్చోబెట్టారు. పెద్ద మనిషిగా వచ్చిన తనను ఎందుకు కూర్చోమంటున్నారని మారెన్న అంటే.. అన్నీ నీకు చెప్పాలా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రమైనా ఎస్ఐ తిరిగి రాకపోవడంతో బాధిత దళిత కుటుంబం పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. దళితులమైన తమ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మారెన్న కోరుతున్నారు. -
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అఽధికారులను ఆదేశించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న స్థానిక పోలీస్ పేరేడ్ మైదానంలో చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ చేతన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ పేరేడ్ గ్రౌండ్ను అందంగా ముస్తాబు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను అవార్డులకు ఎంపిక చేసి జాబితాను పంపించాలన్నారు. సమావేశంలో జేససీ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వేలాంకణికి ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తమిళనాడులోని నాగపట్నంలో వెలసిన వెలాంకణి ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మినల్ – వెలాంకణి ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9–40 గంటలకు బాంద్రా టెర్మినల్ బయలుదేరి రెండో రోజు ఉదయం 7–40 గంటలకు వెలాంకణికి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు (09094) వెలాంకణిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12–30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా టెర్మినల్కు చేరుకుంటుందన్నారు. రాయలసీమ జిల్లాలోని మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణుగుంటల మీదుగా ప్రయాణిస్తుందన్నారు. 14, 15 తేదీల్లో బీదర్ స్పెషల్ రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 14, 15వ తేదీల్లో బెంగళూరు–బీదర్– బెంగుళూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 14వ తేదీ బెంగళూరు జంక్షన్ (06519) నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు బీదర్ జంక్షన్కు చేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ నుంచి బయలుదేరిన రైలు (06520) మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యద్గారి, షాహబాద్, కలబురిగి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. కోయంబత్తూర్–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు కోయంబత్తూర్–జైపూర్–కోయంబత్తూర్ మధ్య ఈ నెల 7 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ ప్రతి గురు, ఆదివారాల్లో దాదాపు 10 సర్వీసులను నడపనున్నారు. కోయంబత్తూర్ జంక్షన్ నుంచి ఈనెల 7న రాత్రి 2.30 గంటలకు బయలుదేరిన రైలు (06181) మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు జైపూర్ జంక్షన్కు చేరుతుంది. తిరిగి ఈ నెల 10న రాత్రి 10.05 గంటలకు జైపూర్ జంక్షన్ బయలుదేరిన రైలు (06182) మూడో రోజు ఉదయం 8.30 గంటలకు కోయంబత్తూర్ జంక్షన్కు చేరుతుంది. తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలర్పెట్టి, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. -
మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్ దందా
2025లో ఇప్పటి వరకు కేసులు – 23● జూలై 23న చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి బస్టాప్ వద్ద ఆటోల్లో తెచ్చిన రేషన్ బియ్యాన్ని లారీల్లోకి మార్చే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వాటాల్లో తేడా రావడంతో ముఠాలోని సభ్యులే వీడియోను పోలీసులతో పాటు పలువురికి వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లే సరికి వాహనాలు లేవు. కానీ నంబర్ల ఆధారంగా ఇప్పటికీ ఆ వాహనాలను గుర్తించలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడి కనుసన్నల్లో జరిగే దందా కావడంతో పట్టించుకోలేదని సమాచారం. ● మే 8వ తేదీన ధర్మవరం నుంచి బెంగళూరు తరలిస్తున్న 4 టన్నుల రేషన్ బియ్యాన్ని సోమందేపల్లి జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి బియ్యం స్వాధీనం చేసుకుని పౌర సరఫరా శాఖ అధికారులకు అప్పజెప్పారు. ● జూన్ 9వ తేదీన బత్తలపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 750 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పలువురి నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేసిన ఓ వ్యక్తి నిల్వ చేయగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్నది – 2.41 టన్నులుసాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేషన్ బియ్యం దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. కొందరు నాయకులు మాఫియాగా ఏర్పడి.. రేషన్ బియ్యం దందా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తక్కువ ధరకు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రం కర్ణాటక తరలిస్తూ.. అక్కడ ఎక్కువ ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మంత్రులు సవిత, సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం దందా మరింత ఎక్కువగా సాగుతోంది. సిండికేట్గా మారి.. రేషన్ బియ్యం రూ.కోట్లు కురిపిస్తుండటంతో కూటమి ముఖ్య నేతల అనుచరులు ఇద్దరు సిండికేట్గా మారారు. రేషన్ దందాలోకి ఎవరూ రాకుండా చక్రం తిప్పుతున్నారు. సోమందేపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ధర్మవరం చుట్టుపక్కల కొనుగోలు చేసి రాత్రి వేళల్లో ఎన్ఎస్ గేటు, పెనుకొండ, కొడికొండ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మంత్రి అండదండలు ఉండటంతో పోలీసులు కూడా వాహనాలను పట్టుకోలేని పరిస్థితి. మరో వ్యక్తి కూడా ధర్మవరం సమీప ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. మరికొందరు రేషన్ దందాలో తలదూర్చినా..సదరు ముఠా సభ్యులకు కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కమీషన్లు ఇవ్వకుంటే.. మార్గంలో సరుకును పోలీసులకు అప్పజెబుతామని బెదిరింపులకు కూడా దిగుతున్నారని సమాచారం. వారిద్దరి ఆధ్వర్యంలోనే రోజూ లారీ రేషన్ బియ్యం హద్దు దాటిపోతున్నట్లు తెలిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని ఒక చోట నిల్వ ఉంచి.. పెనుకొండ, సోమందేపల్లి, రామగిరి మీదుగా కర్ణాటక తరలిస్తున్నారు. జిల్లాలోని 16 మండలాలకు కర్ణాటక సరిహద్దు ఉండటంతో రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటించడం సులువుగా మారింది. ఈ దందాలో ప్రతి నెలా రూ.3 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా వారికి వెళ్లినా.. ఒక్కో వ్యక్తికి సగటున రూ.5 లక్షల వరకు మిగులుతున్నట్లు తెలిసింది. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే దాడులు ధర్మవరం, నల్లమాడ, కొత్తచెరువు ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యం పెనుకొండ, సోమందేపల్లి మీదుగా కర్ణాటక వెళ్తున్నట్లు సమాచారం. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రం పోలీసులు అడపాదడపా అక్కడక్కడా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ‘మామూలు’గా వ్యవహారం సాగుతోంది. రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు.. రేషన్ బియ్యం ముఠాకు కొందరు రేషన్ షాపు డీలర్లే లోపాయికారీగా సహకరిస్తున్నట్లు సమాచారం. అనంతరం రేషన్ బియ్యం కర్ణాటకలోని మిల్లుల్లో సన్నబియ్యంగా మారి మన మార్కెట్లోకి వస్తున్నాయి. రేషన్ దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతలే అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తి.. బియ్యం దందాను నడిపిస్తున్నారు. పేదలకు వచ్చే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ.. కర్ణాటకలో అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రేషన్ షాపుల నుంచి నేరుగా నల్లబజారుకు చౌక బియ్యం తరలిపోతున్నట్లు తెలిసింది. పెనుకొండ, ధర్మవరం కేంద్రాలుగా రేషన్బియ్యం అక్రమ రవాణా రాత్రివేళ ఆటోలు, ఐచర్ వాహనాల్లో తరలింపు రేషన్ బియ్యం మాఫియా వెనుక కూటమి నేతలు! పేదల బియ్యం సరిహద్దు దాటిపోతున్నా పట్టించుకోని పోలీసులుప్రతి నెలా అక్రమంగా సరిహద్దు దాటుతున్న బియ్యం– 3 వేల టన్నుల వరకుప్రజల నుంచి కొంటున్న ధర కిలోకు – రూ.17 నుంచి రూ.20 వరకు గీత దాటితే వేటు తప్పదు రేషన్ బియ్యం దందా ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు. రేషన్ డీలర్లు గీత దాటితే వేటు తప్పదు. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడైనా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నా.. నిల్వ చేసినా.. సమాచారం చెబితే.. దాడులు చేసి కేసులు నమోదు చేస్తాం. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు
● 31 మండలాల్లో 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ తలుపుల తప్ప మిగతా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 31 మండలాల పరిధిలో 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గాండ్లపెంట మండలంలో 71.2 మి.మీ, సోమందేపల్లి మండలంలో 56.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 55.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక అగళి మండలంలో 48.6 మి.మీ, పెనుకొండ 48.2, గోరంట్ల 45.2, కదిరి 38.8, మడకశిర 38.8, నల్లచెరువు 38.2, రామగిరి 36.6, బుక్కపట్నం 36.2, సీకేపల్లి 33.6, పరిగి 30.6, లేపాక్షి 30.4, అమరాపురం 29.4, రొళ్ల 29.4, నల్లమాడ 29, తాడిమర్రి 26, హిందూపురం 25.8, రొద్దం 21.6, తనకల్లు 20.8, ధర్మవరం 19.4, చిలమత్తూరు 16.8, గుడిబండ 11.2, కనగానపల్లి 8.2, అమడగూరు 6.6, ఓడీచెరువు 4.2, బత్తలపల్లి 3.4, ఎన్పీకుంట మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తాజా వర్షాలతో అక్కడక్కడా జలకళ సంతరించుకుంది. పెడపల్లి వద్ద కాలువకు వర్షపు నీరు చేరాయి. మరో ఐదు రోజులు వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 25 మి.మీ, 7న 15.4, 8న 20, 9న 25, 10న 11.5 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31.2 – 35 డిగ్రీల మధ్య నమోదవుతాయన్నారు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి మడకశిర రూరల్: పిడుగుపాటుకు ఓ మహిళా గొర్రెల కాపరి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఉప్పార్లపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ(45)తో పాటు ముగ్గురు గొర్రెల కాపరులు జీవాలను మేపుకునేందుకు క్యాంపురం గ్రామ సమీపంలోకి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వెంటనే పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పొలంలో గొర్రెలకు మేత వేస్తున్న రత్నమ్మ సమీపంలోనే ఓ పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జీవాలపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్న రత్నమ్మ మృతితో ఆ కుటుంబం అండను కోల్పోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
కొత్తచీర కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ ిసీఐ రెడ్డప్ప, విద్యార్థిని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సరుకులే కాదు.. కార్లు, ఫ్రిజ్లు, కూలర్లూ..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మిలిటరీ క్యాంటీన్ అంటే చాలామంది కేవలం నిత్యావసర సరుకులు, లిక్కర్ లభించే ప్రదేశమే అనుకుంటారు. అయితే, క్యాంటీన్ ద్వారా ఎన్నో సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలియక చాలామంది మాజీ సైనికోద్యోగులు వినియోగించుకోవడం లేదు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2,200 మందికి పైగా మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది తక్కువ ధరకు లభించే ఖరీదైన వస్తువులను వినియోగించుకోలేక పోతున్నారు. సమాచార లోపం కారణంగా భారీగా రాయితీలు కోల్పోతున్నారు. కార్లు, టూవీలర్లు, ఫ్రిజ్లు, ఏసీలు కూడా మాజీ సైనికోద్యోగులు నెలకు ఐదువేల రూపాయలకు వచ్చే సరుకులనే చూస్తున్నారు కానీ మిగతావి చూడటం లేదు. వాస్తవానికి క్యాంటీన్తో అవసరం లేకుండా కార్లు, ఫ్రిజ్లు, ద్విచక్రవాహనాలు, ఏసీ, ఎల్ఈడీ టీవీలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని నేరుగా ఇంటికే కారు తెప్పించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మాజీ సైనికోద్యోగి ముందుగా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేయాలి. afd.csdindia.comలో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం ఉంటుంది. కొత్త కార్డు కోసం csdsmartcard.com వెబ్సైట్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. కారు లేదా టూవీలర్ కావాలంటే షోరూంకు వెళ్లి అవైలబిలిటీ సర్టిఫికెట్ తెచ్చి పోర్టల్లో అప్లోడ్ చేస్తే అనుమతి వస్తుంది. రమారమి 20 శాతం తక్కువ ధరకు వాహనాలు అందుతాయి. కొన్ని టూవీలర్ల ధరలు 25 శాతం కూడా తగ్గుతాయి. ● ఒకసారి కారు లేదా టూవీలర్ తీసుకుంటే మళ్లీ ఐదేళ్ల వరకూ తీసుకోకూడదు. ఆరో ఏట తీసుకోవచ్చు. రెండేళ్ల పాటు బండిని అమ్ముకోకూడదు. తనపేరు మీదే ఉంటుంది. మిగతా ఏ ఖరీదైన వస్తువైనా సరే మూడేళ్లకోసారి తీసుకోవచ్చు. మిక్సీలు, గ్రైండర్లు ఇలా రూ.70 వేల లోపు విలువైనవి ప్రతి నెలా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రాయితీలు త్రివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్ఫోర్స్, మిలిటరీ వారికి మాత్రమే వర్తిస్తాయి. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటివన్నీ పారామిలటరీ కిందకు వస్తాయి. వీరికి వేరే క్యాంటీన్లు ఉంటాయి. మాజీ సైనికోద్యోగులకు అనేక సౌలభ్యాలు అవగాహన లేక వినియోగించుకోని వైనం ఆన్లైన్లోనే అన్ని కార్యకలాపాలు -
మొన్న పెళ్లి.. నిన్న ఆత్మహత్య
సోమందేపల్లి : మండల కేంద్రంలోని మణికంఠ కాలనీకు చెందిన కృష్ణమూర్తి కుమార్తె హర్షిత (24) ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని దిబ్బూరపల్లి నివాసి నాగేంద్రతో గత సోమవారం ఉదయం ఆమెకు వివాహమైంది. ఆ రాత్రికే బంధుమిత్రులంతా కలసి సోమందేపల్లికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి హర్షిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే నవ వధువు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను చూసి వరుడు నాగేంద్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. మృతురాలి మొబైల్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని యువకుడి దుర్మరణం తాడిపత్రి టౌన్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ గుర్తు తెలియని యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న యువకుడి (34)ని వాహనం ఢీకొంది. ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తాడిపత్రి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు వలస కూలీ అయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్జెండర్ మృతికనగానపల్లి: మండలంలోని పర్వతదేవర సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని 50 సంవత్సరాల హిజ్రా (ట్రాన్స్జెండర్) మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న గూడ్స్ కంటైనర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి రోడ్డు పక్కన బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న ట్రాన్స్జెండర్తో పాటు డ్రైవర్ కన్నల్ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ట్రాన్స్ జెండర్ అక్కడికక్కడే మృతి చెందింది. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సోమందేపల్లి : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ ీసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళలతో వీడియో కాల్లో ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మంగళవారం సోమందేపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ప్రవర్తించిన తీరును సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం దుర్మార్గమన్నారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఓ మహిళ పట్ల గతంలో వ్యవహరించిన తీరు నిజంగా దారుణంగా ఉందన్నారు. ఇక హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించడం... రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలు రాష్ట్రంలో మహిళ రక్షణను ప్రశ్నార్థకం చేశాయన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నా.. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘దిశ’ యాప్ను తీసుకువస్తే... కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ మహిళల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎమ్మెల్యే నసీర్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సర్పంచ్లు రామాంజి, కిష్టప్ప, పరంధామ, వైస్ సర్పంచ్ వేణు, నాయకులు లక్ష్మీ నరసప్ప, మంజు, నాగమణి, ఆదినారాయణరెడ్డి, నరసింహ మూర్తి, ఈశ్వర్, నాగప్ప, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాజీనామా చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ -
రిజిస్ట్రేషన్ శాఖల్లోని లావాదేవీలపై కన్ను
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుతున్న ప్రస్తుత రోజుల్లో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెచ్చుమీరాయి. పోలీసులు ఇందుకు అడ్డుకట్ట వేస్తున్నా.. వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్తదారులను వెతుక్కుంటూ.. ఆధార్ వేలిముద్రలను కూడా విడిచిపెట్టడం లేదు. గోప్యంగా ఉన్న ఆధార్ సమాచారాన్ని అసలు ఎలా తస్కరిస్తున్నారని మిలయన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఈ తరహా నేరాలతో చాలా మంది నష్టపోతున్నారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో సైబర్ నేరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.● ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో సైబర్ వల ● గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకు ఖాతాల్లోని నగదు బదలాయింపులుధర్మవరం అర్బన్: వేలి ముద్రల ఆధారంగా బ్యాంక్ ఖాతాల నుంచి నగదు అపహరించే సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోని నగదును అపహరిస్తున్నారు. ఈ దోపిడీకి ఎలాంటి ఓటీపీ మెసేజ్లు, అనుమతులు అవసరం లేకపోవడం గమనార్హం. కేవలం ఆధార్ నంబర్ల ఆధారంగా వాటికి లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు. ఇందుకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్)ను ఉపయోగిస్తున్నారు. ఓటీపీ రాదు... ఖాతాదారుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ఖాతాదారుడి మొబైల్కు ఓటీపీ రావడం సహజం. ఈ ఓటీపీ నంబర్ ఎంటర్ చేస్తేనే నగదు బదలాయింపు జరుగుతుంది. అయితే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారా ఎలాంటి ఓటీపీలూ రావు. దీంతో ఖాతాదారుడికి తెలియకుండానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా ఖాతాదారుల వేలిముద్రలను సేకరిస్తారు. ఆధార్ ద్వారా బ్యాంకు ఖాతాలో డబ్బులు డ్రా చేయాలంటే రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేలు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది సైబర్ మోసగాళ్లకు కలసి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు ముందు ఒకసారి, 12గంటలు దాటిన తర్వాత మరోసారి బ్యాంకు ఖాతాలో డబ్బు కాజేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు మాత్రమే ఆధార్ వేలి ముద్రల ద్వారా డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటును సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.లాక్ సిస్టమ్తో చెక్ ఆధార్ వేలిముద్రల ద్వారా ఖాతాదారుడి బ్యాంకు ఖాతాల్లో నగదు అపహరించే ఘటనలు ఇటీవల ఎక్కువయ్యా యి. ప్రజలు కూడా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. గుగూల్ప్లే స్టోర్లో వెళ్లి ఎంఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నంబర్ను లాక్ చేసుకుంటే సైబర్ నేరాలకు ఆస్కారం ఉండదు. ఖాతాలోని నగదు మాయం కాగానే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అలాగే 1930 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. ఒకవేళ బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బు పోయిన చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ అయింది. – రెడ్డప్ప, టూ టౌన్ పీఎస్ సీఐ, ధర్మవరంఏఈపీఎస్ ద్వారా నగదు అపహరించేందుకు వేలిముద్రలు కీలకం కావడంతో సైబర్ నేరగాళ్లు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లలోకి అక్రమంగా చొరబడుతున్నారు. భూదస్త్రాల్లోని వేలిముద్రల పత్రాల్ని డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా నకిలీ వేలిముద్రలను సృష్టిస్తున్నారు. సాధారణంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్తోనే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే అవకాశముంది. కానీ కొన్ని శాఖల్లో గెస్ట్గా లాగిన్ అయ్యే అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకొని పత్రాల్ని కాజేస్తున్నారు. ఈ భూదస్త్రాల్లోని వేలిముద్రల ప్రింట్ను సేకరించేందుకు నేరస్థులు బటర్ పేపర్ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బటర్ పేపర్పైకి తీసుకున్న వేలిముద్రను గాజు గ్లాస్పై ముద్రించి రబ్బర్ పోయడం ద్వారా పాలీమర్ ప్రింట్ను తయారు చేస్తారు. ఇదే నకిలీ వేలిముద్రగా మారుతుంది. బయోమెట్రిక్ యంత్రంలో ఈ నకిలీ వేలిముద్ర పెట్టి సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. -
సెంట్రల్ యూనివర్సిటీలో ‘మిషన్ మాలవ్య’ కేంద్రం
అనంతపురం: అనంతపురం శివారులోని జంతలూరు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిషన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (ఎంఎంటీటీసీ) ఏర్పాటుకు అనుమతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు ఆధునిక, నాణ్యమైన శిక్షణ అందించి వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కేంద్రం దోహదపడనుంది. వినూత్న బోధనా పద్ధతులు, బోధనలో సాంకేతికత వినియోగం, పాఠ్యాంశాల రూపకల్పన, పరిశోధన, మూల్యాంకన పద్ధతులు, అంతర శాసీ్త్రయ బోధన విధానాలు ఈ కేంద్రం ప్రధాన లక్ష్యాలని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్ఏ కోరి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ షీలా రెడ్డి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు వర్సిటీకి, విద్యారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి
గుడిబండ: విద్యుత్ షాక్తో రెండు మేకలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన హిరేతుర్పి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. హిరేతుర్పి గ్రామానికి చెందిన తిమ్మన్న (70) జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం గ్రామ సమీపంలో పంట పొలాల్లో మేకలను మేపడానికి మహేష్ అనే రైతు మల్బరీ షెడ్ వద్దకు చేరుకున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మేకలు కూడా మృతి చెందాయి. తిమ్మన్నకు భార్య సాకమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. నాటుసారా నిర్మూలనకు చర్యలు చేపట్టండి ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: జిల్లాలో నాటుసారా నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నవోదయం 2.0 కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా ప్రభావిత 7 గ్రామాలు, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పరిధిలోని 19 మండలాల్లో 53 గ్రామాలకు విముక్తి లభించడం అభినందనీయమన్నారు. ఈ సంఖ్యతో మొత్తం 53 గ్రామాల్లో నాటుసారా నిర్మూలన జరిగినట్లయిందని అన్నారు. త్వరలో జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నవోదయం 2.0 పోస్టర్లను విడుదల చేశారు. ప్రొహిబేషన్ ఎకై ్సజ్ డీసీ నాగముద్దయ్య, ఏసీ చంద్రశేఖర్రెడ్డి, జిల్లా ఎకై ్సజ్ అధికారి గోవింద్నాయక్, ఏఎస్పీ ఆదినారాయణ, డీపీఓ సమత, డీఈఓ క్రిష్టప్ప, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. చెరువులు, వంకల ఆక్రమణలపై నివేదికలు సిద్ధం చేయండి : జేసీ జిల్లాలో చెరువులు, వంకలు, ప్రాజెక్ట్లు, వాగుల పరిధిలో అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటర్ బాడీస్ వాచ్డాగ్ అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. వాగులు, వంకలు, చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు, పెనుకొండ, ధర్మవరం డివిజన్ల ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. లే అవుట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) పరిధిలో వేసిన అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు ఉందని పుడా వైస్ చైర్మన్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 90006 83035లో సంప్రదించాలని సూచించారు. కారు బోల్తా – ఇద్దరికి గాయాలు తనకల్లు: మండలంలోని బీటీ క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. తలుపులకు చెందిన రాఘవ, బాబ్జాన్ మంగళవారం అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు కారులో బయలుదేరారు. బీటీ క్రాస్ మలుపు వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్లో క్షతగాత్రులను చికిత్స కోసం తొలుత తనకల్లు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఏడు గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
ధర్మవరం: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండడంతో ఏడు సిలిండర్లను విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజిలెన్స్ ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు. ధర్మవరంలోని రంగా థియేటర్ సమీపంలో ఉన్న చెన్నాదేవి ప్రభ షాపులో మంగళవారం డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ ఉంచి చట్ట విరుద్ధంగా వ్యాపారం చేయడాన్ని గుర్తించారు. 7 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. యజమాని చెన్నదేవి ప్రభపై కేసు నమోదు చేశారు. -
చెరువు కాలువకు అడ్డంగా మట్టి
పుట్టపర్తి అర్బన్:పుట్టపర్తి నుంచి కోడూరు వరకూ ఏర్పాటవుతున్న 342వ జాతీయ రహదారి నిర్మాణ పనులతో ఓ చెరువుకు వర్షపు నీరు చేరకుండా మట్టి కట్ట అడ్డుగా వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామ చెరువుకు గోరంట్ల మండలం నుంచి కాలువ ద్వారా వర్షపు నీరు చేరుతుంది. ఈ చెరువు కింద సుమారు 90 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కాలువకు నీళ్లు చేరాయి. ఈ క్రమంలో కాలువపై బత్తలపల్లి వద్ద నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏడాది క్రితం పూర్తి చేశారు. ఇటీవల మరమ్మతుల కోసమని కాలువకు అడ్డంగా మట్టి కట్ట వేయడంతో నీళ్లు అక్కడే నిలిచి పక్కనున్న పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. కాలువ కట్ట ఎక్కడైనా తెగితే ఇబ్బంది పడతామని రైతులు వాపోతున్నారు. వర్షాకాలం పూర్తయితే నీళ్లు రావని దీంతో ఏడాది పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి మట్టి కట్టను పూర్తిగా తొలగించాలని రైతులు కోరుతున్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు రొద్దం: స్థానిక పంచాయతీ పరిధిలో ఓ బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. వేతనాలు ఇవ్వకపోతే సమ్మెలోకి ● శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ధర్మవరం: శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని ఆ పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం కార్యాలయ ఏఓ ఖతిజున్కుఫ్రాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మికులు రాము, చింతకాయల నరేష్, సురేష్బాబు మాట్లాడారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వెయ్యి గ్రామాలకు, 10 లక్షల మంది ప్రజలకు 540 మంది కార్మికులు తాగునీటిని అందిస్తున్నారన్నారు. నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. వేతనాలు ఇవ్వకపోతే ఈ నెల 11 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. సాయి మార్గం.. సకల జనులకు క్షేమం ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన హర్యానా, చండీఘడ్ సత్యసాయి భక్తులు మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పంచముఖి హనుమాన్ ’పేరుతో నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సాయి మార్గం సకల జనులకు క్షేమం అంటూ సందేశాన్నిచ్చారు. -
బీమా రాలేదు
నేను మామిడి, చీనీ పంటలు సాగు చేశా. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా కింద చీనీ పంటకు క్రమం తప్పకుండా నాలుగేళ్లు ఎకరాకు రూ.20 వేల చొప్పున జమ చేసింది. ఈ సీజన్లో మామిడి పంటకు ఎకరాకు రూ.1,800 ప్రీమియం కట్టినా.. ఇప్పటి వరకు బీమా సొమ్ము జమకాలేదు. జమ అవుతోందో కాదో కూడా తెలియడం లేదు. –ఆవుటాల ఓబిరెడ్డి, బుచ్చయ్య గారిపల్లి, బుక్కపట్నం మండలం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ కొనసాగించాలి. ప్రీమియం చెల్లించాల్సి వచ్చినా ప్రభుత్వం కట్టాలి. రెండేళ్లుగా మామిడి, చీనీ పంటలు పండక, పండినా గిట్టు బాటు ధర లేక నాలాంటి సన్నకారు రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయారు. పెట్టుబడి కూడా చేతికందలేదు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు కనీసం రూ.40 వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – లోసారి వెంకట్రాముడు, కడపనాగేపల్లి, బుక్కపట్నం మండలం పెట్టుబడి దక్కలేదు ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. అరకొరగా పండిన పంటకూ గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున నష్ట పోయాం. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతులంతా అప్పుల పాలయ్యారు. కూటమి సర్కార్ మానవతా దృక్పథంతో మామిడి రైతులను ఆదుకోవాలి. జగన్ హయాంలో మాదిరి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. – గంగురులప్ప, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం● -
కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
జల్లెడ పడుతున్నా జాడ లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం పట్టణంలోని ఎస్బీఐలో జరిగిన భారీ దోపిడీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 11 కేజీలకు పైగా బంగారం (రూ.11 కోట్ల విలువ), రూ.30 లక్షల నగదు దోచుకుని వెళ్లి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ కనీసం చిన్న ఆధారాన్ని కూడా సేకరించలేక పోయారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పాటు అనంతపురం నుంచి మూడు బృందాల పోలీసులు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మూడు బృందాలు నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్నా ఎక్కడా జాడ కూడా తెలియలేదు. ఆనవాళ్లు దొరక్కుండా.. ఎంత తెలివైన దొంగలైనా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. ఫింగర్ ప్రింట్స్ లోనో, సెల్ఫోన్ లొకేషన్ వల్లో చిక్కేస్తుంటారు. కానీ హిందూపురం ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు అత్యంత జాగ్రత్త పడ్డారు. నేరస్తుడు ఎలక్ట్రికల్ పనిలో నిష్ణాతుడైనట్లు తెలుస్తోంది. ఫేజ్, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ కనెక్షన్ ఇలా అన్ని వైర్లనూ చాలా జాగ్రత్తగా కట్ చేశారు. సీసీ కెమెరా కనెక్షన్ మొదట్లోనే తొలగించారు. వెంట తెచ్చుకున్న మినీ గ్యాస్ సిలిండర్ నుంచి కట్టర్ను ఉపయోగించి కిటీకీ ఇనుప చువ్వలు కత్తిరించారు. ముఖానికి మాస్కు, కాళ్లకు సాక్సు, చేతులకు గ్లౌజులు వేసుకుని అత్యంత పకడ్బందీగా లాకర్లను కట్ చేసి 11 కేజీలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. ఎక్కడా వేలిముద్రలు, పాదముద్రలు పడకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. దోపిడీకి ఇద్దరు దొంగలు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు బ్యాంకు ఆవరణలో వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలలోగా దోపిడీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘోరంగా విఫలం.. బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు వారం రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నా ఎక్కడా ఆచూకీ లేదు. ప్రధానంగా సెల్ ఫోన్ వాడటం లేదని తెలిసింది. దొంగలు ఇతర రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరు, నెల్లూరు, హైదరాబాద్తో పాటు అనుమానం వచ్చిన చోటల్లా గాలిస్తున్నా జాడ దొరకలేదు. పుట్టపర్తి పోలీసులకు ఈ విషయం పెద్ద సవాలుగా మారింది. ఇదే కాదు చాలాచోట్ల దొంగతనాలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడంలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని, రికవరీలు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుతో సామాన్య ప్రజలకు మాత్రం ఆవేదనే మిగులుతోంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టినా దొంగిలిస్తుంటే ఏం చేయాలంటూ ఖాతాదారులు వాపోతున్నారు. హిందూపురం బ్యాంకు దోపిడీ కేసులో కనిపించని పురోగతి మూడు బృందాలు గాలిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకని వైనం చోరీల కట్టడిలో శ్రీసత్యసాయి పోలీసులు విఫలమయ్యారని విమర్శలు -
పరిష్కార వేదికకు 75 వినతులు
పుట్టపర్తి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 75 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. బాలుడి ఆచూకీ తెలపండి పద్దెనిమిదేళ్ల వయసున్న తమ కుమారుడు ఓంకారేశ్వర్ కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలపాలంటూ తాడిమర్రికి చెందిన లక్ష్మీదేవి, గంగాధర దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ ఆదినారాయణకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి కుమారుడు కనిపించడం లేదన్నారు. ఇప్పటికే మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి మాయ మాటలతో పిలుచుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. యువతిని, ఆమె తల్లిదండ్రులను విచారణ చేస్తే తమ కుమారుడి ఆచూకీ తెలుస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థించారు. -
అందని సాయం.. తప్పని కష్టం
కదిరి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో వివిధ కారణాలను చూపుతూ అర్హులైన రైతుల జాబితాలో భారీగా కోత విధించింది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 2,79,556 మంది అర్హులైన రైతులుండగా 2,65,040 మందికి మాత్రమే రూ.191.45 కోట్లు జమ చేసింది. అంటే 14,516 మంది రైతులకు రూ.10.16 కోట్ల లబ్ధికి ఎగనామం పెట్టింది. నాడు ఎగ్గొట్టి.. నేడు మెలిక పెట్టి కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ పథకం పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ లెక్కన తొలి ఏడాది జిల్లా వ్యాప్తంగా 2,79,556 మంది రైతులు రూ.559.11 కోట్లు నష్టపోయారు. 2023–24 సంవత్సరంలో అప్పటి జగన్ ప్రభుత్వం జిల్లాలో రైతు భరోసా ద్వారా 2,79,556 మందికి రూ.321.47 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గతంలో ఆర్థిక భరోసా ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ఇందులో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఇచ్చే రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ7,500 కలిపి మొత్తం 13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో గత ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది. వెబ్ల్యాండ్ ఆధారంంగా భూమి ఉందా? లేదా? అని మాత్రమే పరిశీలించి 2,79,556 మంది రైతులకు ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.1767.09 కోట్ల లబ్ధి చేకూరింది. మూడు విడతల్లో సకాలంలో జమ జగన్ ప్రభుత్వం ఖరీఫ్ పంట వేసే ముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ7,500 ఇచ్చేది. తర్వాత అక్టోబర్లో ఖరీఫ్ పంట కోతతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చింది. మళ్లీ జనవరిలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు ఇలా మూడు విడతల్లో రూ13,500 చొప్పున గత ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే వెఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక రకాలుగా అన్నదాతను ఆర్థికంగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో రైతు భరోసా ద్వారా 2,79,556 మంది రైతులకు లబ్ధి కూటమి ప్రభుత్వంలో 14,516 మంది అన్నదాతలకు అన్యాయం మొదటి విడతలోనే రూ.10.16 కోట్లు నష్టపోయిన జిల్లా రైతులువివిధ కారణాలున్నాయి అన్నదాత సుభీభవ పథకానికి సంబంధించి వివిధ కారణాలతో సుమారు 10 వేల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ–కేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడం, భూముల మ్యూటేషన్ ప్రక్రియ, ఆధార్ సీడింగ్ సరిగా లేకపోవడం తదితర కారణాలతో డబ్బు జమకాలేదు. అన్నీ సరిచేసుకుంటే సమస్య ఉండదు. – సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారిరైతులపై ఎందుకింత పగ? వ్యవసాయమన్నా.. రైతులన్నా చంద్రబాబుకు సరిపోదు. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20వేలు ఇస్తానని చెప్పి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఈసారి ఖరీఫ్ వేరుశనగ సాగు సమయం దాటి పోయాక కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇందులోనూ జిల్లాలో 15 వేల మంది అర్హులైన రైతులను ఆ జాబితా నుంచి తప్పించడం దారుణం. గత ఏడాది ఇవ్వాల్సిన రూ.20 వేలతో కలిపి మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిందే. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మూడు పదుల వయసు పైబడినా పెళ్లి కాలేదన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న పరమేశ్వరప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తల్లి, ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ములూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమారుడు వెంకటేశులకు వివాహమైంది. రెండో కుమారుడు జగదీష్ (33)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదేమోనంటూ జగదీష్ తరచూ బంధువులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు వదిన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ హిందూపురం టౌన్: స్థానిక ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎన్ఆర్సీ (నోడల్ రరీసోర్స్ సెంటర్) లెవెల్లో జరిగిన వివిధ ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో వ్యాసరచన, వక్తృత్వ, డిబేట్, క్విజ్ పోటీలు నిర్వహించగా.. రెండు పోటీలలో ప్రథమ స్థానం, మిగిలిన రెండు పోటీలలో ద్వితీయ స్థానం సాదించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన మదీహ, సౌజన్య, తనూష, నిహారిక, సాయి శ్రీనిధి, నందినిలను అభినందించారు. 7 నుంచి కడపలో జరిగే జోనల్ లెవెల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రైలు పట్టాల వద్ద వ్యక్తి మృతదేహం హిందూపురం: స్థానిక మున్సిపల్ ఎంజీఎం మైదానం పక్కన రైలు పట్టాల వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం రైల్వే కీమెన్ గుర్తించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆకుపచ్చ, ఎర్ర గీతల ఫుల్ షర్టు, కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని చనిపోయాడా? లేదా, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాము కాటుతో వృద్ధుడి మృతి రాయదుర్గం టౌన్: పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న ఎరికల కుమారస్వామి (66) ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని సీబీఎన్ కాలనీలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉండగా చేతికి పాము కాటు వేసింది. నాటు వైద్యంతో నయం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. కాగా, కుమారస్వామికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మాతృభాషపై మమకారం ఉండాలి
గోరంట్ల: పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఇంగ్లిష్ ప్రావీణ్యం అవసరమని, కానీ మాతృభాషపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం ఆయన పాలసముద్రం సమీపంలోని ‘నాసిన్’ సంస్థ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రియ విద్యాలయలో తరగతులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో 2025 –2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 5 వరకు తరగతులు జరుగుతాయన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలసముద్రం సమీపంలో కేంద్రియ విద్యాలయను ప్రారంభించిందన్నారు. విద్యార్థులు అన్ని భాషాల్లో చక్కటి ప్రావీణ్యం పెంపొందించుకునేలా అధ్యాపకులు కృషిచేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు గతంలో జాతీయ రహదారి ప్రక్కనే స్థలం కేటాయించామని, అయితే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాసిన్ వెనక వైపు భూమిని కేటాయించి నాసిన్ ప్రాంగణంలోనే పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ‘నాసిన్’ జాయింట్ డైరెక్టర్ సత్య దివ్యరమ్య, డిప్యూటీ డైరెక్టర్ శేషు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ కృష్ణారావు, గోరంట్ల తహసీల్దార్ మారుతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి కలెక్టర్ టీఎస్ చేతన్ కేంద్రియ విద్యాలయలో తరగతుల ప్రారంభం అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందే అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 269 అర్జీలు అందగా..వాటిని ఆయా శాఖలకు పంపారు. అత్యధికంగా పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ నుంచి 85 అర్జీలు అందగా, ఆ తర్వాత పెనుకొండ డివిజన్ నుంచి 79, ధర్మవరం డివిజన్ నుంచి 72, కదిరి డివిజన్ నుంచి 33 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీల పరిష్కారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయి వెళ్లి విచారణ జరిపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ిఅనంతరం పలువురు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ టీఎస్ చేతన్ ‘మన మిత్ర’ యాప్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మూడు నెలల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, కార్యదర్శి రామాంజనేయులు యాదవ్ తెలిపారు. సోమవారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని చేపట్టి, ఉద్యోగుల సమస్యలపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం సుమారు రూ.35 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కార్యక్రమాన్ని మూడు నెలల పాటు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర మహిళా కార్యవర్గంలోకి ఎంపికై న సాంబశివమ్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత భూదందా
సాక్షి, టాస్క్ఫోర్స్: చిలమత్తూరు పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత భూ దందాకు తెరతీశాడు. ప్రభుత్వం ఎక్కడైనా భూ సేకరణ జరుపుతున్నట్లు తెలిస్తే చాలు...అక్కడ వాలిపోతాడు. అధికారులను మచ్చిక చేసుకుని తనకు భూమి లేకపోయినా అసైన్మెంట్ ల్యాండ్కు పట్టా పొందుతాడు. ఆ తర్వాత భూమికి సంబంధించిన పరిహారం దర్జాగా తీసుకుంటాడు. ఇలా ఇప్పటికే చిలమత్తూరు పంచాయతీలోనూ తన భార్య పేరిట అసైన్మెంట్ పట్టా పొందాడు. ఇక లేపాక్షి నాలెడ్జి హబ్లోని కోడూరు పొలంలో తన భార్య పేరిటే పట్టా పొంది పరిహారం తీసుకున్నాడు. అలాగే టేకులోడు పొలంలోనూ తన భార్య పేరిటే అసైన్మెంట్ పట్టా పొంది పరిహారం దక్కించుకున్నాడు. తాజాగా ప్రభుత్వం టేకులోడు రెవెన్యూ గ్రామంలోనే పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ పనులు చేపట్టగా...బినామీల పేరుతో అసైన్డ్పట్టాలు పొందాడు. ఇప్పటికే పరిహారం కోసం వివరాలన్నీ సమర్పించాడు. నేడు, రేపో పరిహారం పొందనున్నాడు. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ నేత భూ దందాపై ఇటీవలే వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గతంలోనే పరిహారం పొంది కూడా మళ్లీ భార్య పేరిట మూడుచోట్ల పట్టాలు పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ నేటికీ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. కాంట్రాక్టర్గా మారి నాసిరకం పనులు ఈ తెలుగు తమ్ముడు అధికారం అండతో భూకబ్జాలే కాకుండా కాంట్రాక్టర్ అవతారమెత్తి నాసిరకంగా పనులు చేసి ప్రజా ధనాన్ని దండుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తూ, అధికారులను భయపెడుతూ హవా కొనసాగిస్తున్నాడు. సదరు నేత చేసిన కాంట్రాక్ట్ పనులు పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భూసేకరణ జరిగే ప్రాంతాల్లో తన భార్య పేరిట అసైన్మెంట్ పట్టాలు ఇప్పటికే రెండుచోట్ల పరిహారం కూడా పొందిన వైనం తాజాగా టేకులోడులోనూ బినామీల పేరుతో పట్టాలు మళ్లీ పరిహారం పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు -
18 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 18 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒకేరోజు 219.4 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా రొళ్ల మండలంలో 30.4 మి.మీ, బుక్కపట్నం మండలంలో 26.2 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక బత్తలపల్లి మండలంలో 24.6 మి.మీ, రొద్దం 19.4, సోమందేపల్లి 18.4, కొత్తచెరువు 15.6, గోరంట్ల 14.2, గుడిబండ 12.2, పెనుకొండ 10.6, పుట్టపర్తి 10.4, మడకశిర 8.8, అగళి 8.2, పరిగి 7.4, కనగానపల్లి 6.2, అమడగూరు 2.6, కదిరి 1.8, ధర్మవరం 1.4, నల్లమాడ మండలంలో 1.0 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాకు ‘ఎల్లో అలర్ట్’ ● నాలుగు రోజులూ వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన తెలియజేస్తూ వాతావరణవాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు విజయశంకరబాబు, జి. నారాయణ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఈనెల 5న మంగళవారం ‘పింక్ అలర్ట్’ కింద ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షసూచన కూడా ఉందన్నారు. 6, 7, 8 తేదీల్లో ఎల్లో అలర్ట్ కింద మోస్తరుగా వర్షసూచన ఉన్నట్లు తెలిపారు. ‘అధిక వడ్డీ’ కేసులో మరో నిందితుడి అరెస్ట్ ధర్మవరం అర్బన్: అధిక వడ్డీల కోసం శాంతినగర్లో రమణ అనే వ్యక్తిపై ఇంట్లో దూరి దాడిచేసిన కేసులో ఏ–7 నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. స్థానిక టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతినగర్లో రమణ అనే వ్యక్తిపై దాడిచేసిన ఏడుగురిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం ఏ–7 నిందితుడు గుజ్జల విజయ్కుమార్ను రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. ఎవరైనా అధిక వడ్డీలు పేరుతో దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామని సీఐ హెచ్చరించారు. ఇద్దరు వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు రొళ్ల: పట్టపగలే మద్యం తాగి ఆ మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు వీఆర్ఓలను కలెక్టర్ టీఎస్ చేతన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏం జరిగిందంటే.. జూలై 31న సాయంత్రం రత్నగిరి వీఆర్ఓ నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్ఓ రంగనాథ్ రొళ్లకొండ గ్రామ సమీపాన 544ఈ జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద పూటుగా మద్యం తాగారు. సమీపంలోని ఓ టీ బంక్ వద్దకు వచ్చి.. అక్కడే ఉన్న రత్నగిరి చెందిన మాజీ ఎంపీపీ క్రిష్ణప్ప, మరో ఐదారుగురిని అసభ్యపదజాలంతో దూషించారు. ఈ తతంగాన్ని స్థానికులు కొందరు సెల్ఫోన్లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు దిగజారి ప్రవర్తించిన తీరుపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో రొళ్ల తహసీల్దార్ షేక్షావలి వీఆర్ఓలను పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ టీఎస్ చేతన్ వీఆర్ఓలిద్దరిపై సస్పెషన్ వేటు వేశారు. విధి నిర్వహణలో ఎవరైనా మద్యం తాగినట్లు తేలితే కఠినంగా చర్యలు తప్పవని కలెక్టర్ మరోమారు స్పష్టం చేశారు. -
వివాహిత ఆత్మహత్య
అగళి: మండలంలోని దొక్కలపల్లి గ్రామానికి చెందిన చిత్తప్ప భార్య పుట్టక్క (52) ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న పుట్టక్క కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో సోమవారం పత్తి పంటకు వినియోగించే పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకలోని తుమకూరులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఆస్పత్రిలో మృతిచెందారు. కుమారుడు శివలింగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి సోమవారం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు సంతోష్ స్వామి, మంజునాథ్ స్వామి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. హోమాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.‘బిల్లులు చెల్లించకపోతే ఎలా బతకాలి?’ లేపాక్షి: ఉపాధి పనులు చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోతే తామెలా బతకాలంటూ ఎంపీడీఓ నరసింహమూర్తిని లేపాక్షి మండలం మానేపల్లి పంచాయతీ గౌరిగానిపల్లికి చెందిన ఉపాధి కూలీలు నిలదీశారు. సోమవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాధి కింద సోప్ పిట్ పనులు పూర్తి చేసి సుమారు ఆరు నెలలు గడుస్తోందన్నారు. ఒక్కో సోప్ పిట్ నిర్మానానికి రూ.5వేలు మంజూరు చేశారని, ఇప్పటి వరకూ ఆ బిల్లులు మంజూరు చేయలేదంటూ మండిపడ్డారు. ఇంట్లోని బంగారు నగలు కుదువ పెట్టి కేటాయించిన పని పూర్తి చేశామన్నారు. ఇప్పటికై నా తమకు బిల్లులు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఎంపీడీఓ మాట్లాడుతూ.. బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు అందజేశామని, రాగానే కూలీల ఖ్యాతాల్లోకి జమ చేస్తామని భరోసానిచ్చారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు కదిరి టౌన్: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఈ విషయంగా నిర్లక్ష్యం వీడాలంటూ వైద్య, ఆరోగ్య సిబ్బందిని కదిరిలోని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. కాగా, ఆదివారం రాత్రి పాము కాటుకు గురైన నల్లచెరువు మండలానికి చెందిన రాజశేఖర్ నాయుడుని ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారిపై ఎంఎల్ రామచంద్ర దురుసుగా వ్యవహరించడంతో బాధితులు దాడి చేశారు. దీంతో రామచంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పార. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్ హిందూపురం: మాయ మాటలతో మైనర్ బాలికను తీసుకెళ్లిన కేసులో ముగ్గురు యువకులను పోక్సో కేసు కింద సోమవారం అరెస్ట్ చేసినట్లు హిందూపురం రూరల్ పోలీసులు తెలిపారు. గత నెల 26న కొటిపి ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలికను నమ్మించి అదే ప్రాంతానికి చెందిన సతీష్, నాగరాజు, శ్రీరంగరాజుపల్లి ఫణిసింహ పిలుచుకెళ్లారన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ముగ్గురిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, సోమవారం కిరికెర గేట్ వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. క్రీడలు ఆడుతుండగా విరిగిన విద్యార్థిని చెయ్యి చిలమత్తూరు(లేపాక్షి): లేపాక్షి మండలంలో కొండూరులోని జెడ్పీహెచ్ఎస్లో సోమవారం క్రీడలు ఆడుతుండగా ఆరో తరగతి విద్యార్థిని లిఖిత చెయ్యి విరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. విద్యార్థిని ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చెయ్యి విరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పరాదంటూ పీఈటీ హెచ్చరించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. -
అలరించిన ‘కరిష్యే వచనం తవ’
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనలు ఆచరణీయమన్న సందేశాన్నిస్తూ ‘కరిష్యే వచనం తవ’ పేరుతో బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన నృత్యరూపకం నయనమనోహరంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా హర్యానా, చండీఘర్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు సోమవారం సత్యసాయి సన్నిధిలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ‘సాయి శ్రవణ్ సుర్ సరిత’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం బాలవికాస్ చిన్నారులు సత్యసాయి చాటిన సందేశాన్ని వినిపిస్తూ, ‘సత్యసాయి బోధనలు ఆచరిస్తాం’’ అంటూ తమ విధేయతను చాటుతూ నిర్వహించిన సంగీత నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
పెనుకొండ: ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ మహిళను పెనుకొండ పోలీసులు సకాలంలో కాపాడారు. వివరాలు.. రొద్దం మండలం బూదిపల్లికి చెందిన జయమ్మ కుటుంబ సమస్యలతో విసుగు చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సోమవారం పెనుకొండ రైల్వే స్టేషన్కు చేరుకుంది. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పీఎస్ ప్రొహిబేషనరీ ఎస్ఐ భువనేశ్వరి, ఏఎస్ఐ నాగరాజు, పీసీ రంగప్ప వెంటనే రైల్వేస్టేషన్ చేరుకుని పరిశీలించారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోడంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. స్టేషన్ సమీపంలో పట్టాల పక్కనే ఉన్న జయమ్మను గుర్తించి సర్దిచెప్పి పీఎస్కు పిలుచుకెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం జయమ్మను అప్పగించారు. -
పేదల బియ్యం.. ‘తమ్ముడి’ భోజ్యం
పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ను తలదన్నేలా రేషన్ అక్రమ బియ్యం దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. సోమందేపల్లికి చెందిన ఓ రేషన్ మాఫియా డాన్ ఏకంగా మూడు జిల్లాల్లో తన అక్రమ వ్యాపారాన్ని విస్తరించాడు. రాజకీయ నాయకులతో పాటు అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెబుతూ రూ.కోట్లు గడిస్తున్నాడు. అతని దందా విస్తృతి చూసి ‘రామ’ రామ..‘కృష్ణ’ కృష్ణ అంటూ అధికారులే నివ్వెరపోతున్నారు.● ‘పుష్ప’ సినిమాను తలపిస్తున్న రేషన్ బియ్యం దందా ● మూడు జిల్లాలను శాసిస్తున్న సోమందేపల్లి ‘డాన్’ ● రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్న వైనం ● అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యం.. కన్నెత్తి చూడని అధికార గణంసోమవారం ధర్మవరం మండలం సీతారాంపల్లి వద్ద రేషన్ బియ్యాన్ని పట్టుకున్న దృశ్యంధర్మవరం: మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యం మాఫియా డాన్గా అవతార మెత్తాడు. తొలుత పెనుకొండ నియోజకవర్గంతో మొదలు పెట్టి... ఆ తర్వాత మూడు జిల్లాలను శాసించేస్థాయికి ఎదిగాడు. ప్రతినెలా ఇతని అక్రమ సంపాదన రూ.కోటికి పైగానే ఉండటం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. రేషన్ బియ్యం దందా ఇలా.. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో సదరు మాఫియా డాన్ కొత్త పుంతలు తొక్కించాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచితే అందరికీ తెలిసిపోతుందని భావించి వినూత్నంగా ప్లాన్ చేశాడు. ఒక్కో జిల్లాలో 5 లేదా 6 వరకు స్టాక్ పాయింట్లు పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో రవాణా చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కో నియోజకవర్గంలోని మండలం, పట్టణాలను వేరుచేసి రిటైల్గా కొంత మందిని బియ్యం సేకరించేలా పురమాయించాడు. వారికి కిలో బియ్యంపై రూ.3 చొప్పున కమీషన్ ఇచ్చి సేకరిస్తాడు. వారు ఆటోలు, టాటా ఏస్ వాహనాల ద్వారా బియ్యాన్ని స్టాక్ పాయింట్ చేరుస్తారు. అక్కడి నుంచి రేషన్ మాఫియా డాన్ రాత్రి వేళ గంటల వ్యవధిలో సరిహద్దులు దాటిస్తాడు. పెద్ద పెద్ద ఐచర్ వాహనాలు, మినీ లారీలలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకు తరలిస్తున్నాడు. వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందిలా.. తొలుత పెనుకొండ నియోజకవర్గం నుంచి రేషన్ దందాను ప్రారంభించిన మాఫియా డాన్... ఆ తర్వాత తన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి ధర్మవరం నియోజకవర్గానికీ విస్తరించాడు. ధర్మవరానికి సమీపంలోని ఎన్ఎస్గేట్, సీకేపల్లి మండలం ప్యాదిండి, నామాల, మేడాపురం వద్ద స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశాడు. ధర్మవరం మండలంలో వివిధ రేషన్ షాపులు, ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆటోల్లో స్టాక్ పాయింట్లకు తరలిస్తాడు. అలాగే అనంతపురం నగరం, రూరల్ మండలాల్లో సేకరించిన బియ్యాన్ని ఽరాప్తాడు మండలం కందుకూరు కెనాల్కు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన స్టాక్పాయింట్లో నిల్వ చేస్తాడు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని ఐచర్ వాహనాల్లో లోడ్ చేసి కర్ణాటక బంగారు పేటలోని మిల్లులకు తరలించి విక్రయిస్తాడు. సదరు మిల్లులో లావు బియ్యాన్ని సన్న బియ్యంగా ప్రాసెస్ చేసి అధిక ధరలకు ప్రజలకు మళ్లీ విక్రయిస్తారు. మూడు జిల్లాల్లో జోరుగా వ్యాపారం శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కూడా బియ్యం డాన్ జోరుగా వ్యాపారం చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల పులివెందులలో పట్టుబడ్డ రేషన్ బియ్యం కూడా సదరు డాన్వే అయినప్పటికీ బినామీల పేర్లు చేర్పించినట్లుగా సమాచారం. అనతికాలంలోనే భారీగా అక్రమార్జన కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రేషన్బియ్యం అక్రమ వ్యాపారంలో భారీగా అక్రమార్జన చేసినట్లు సమాచారం. ఆంధ్రాలో పేదల బియ్యాన్ని రిటైలర్ల దగ్గర రూ.18 చొప్పున కొని కర్ణాటకలో రూ.27 లెక్కన అమ్ముకుంటున్నారు. వందలాది వాహనాలలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ప్రతినెలా రూ.కోటికిపైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లు నిజాయితీ గల పోలీసు ఎవరైనా రేషన్ బియ్యం వాహనాలను పట్టుకుంటే... వెంటనే జిల్లాలోని ఓ పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధితో పాటు బీజేపీకి చెందిన జిల్లా నాయకుడు రంగ ప్రవేశం చేస్తారు. కేసులు కట్టకూడదని ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ధర్మవరం మండలం సీతారాం పల్లి వద్ద సదరు రేషన్ మాఫియా డాన్కు చెందిన ఐచర్ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్న విషయం తెలుసుకుని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు కట్టకూడదని పోలీసులపై సదరు నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వాహనంలోనివి రేషన్ బియ్యం కాదని మీడియాకు చెప్పాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీంతో సాయంత్రమైనా పోలీస్, రెవెన్యూ అధికారులు వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం.అధికారులకు మామూళ్లు బియ్యం డాన్ రేషన్ బియ్యాన్ని వాహనాల్లో రాత్రి సమయంలోనే జిల్లా దాటిస్తుంటాడు. మూడు జిల్లాల రేషన్ బియ్యం వాహనాలు ధర్మవరం, సీకేపల్లి, సోమందేపల్లి, కియా పోలీస్స్టేషన్, కొడికొండ చెక్పోస్టు మీదుగా వెళ్తుంటాయి. ఈ మార్గంలోని పోలీస్స్టేషన్లకు రేషన్ మాఫియా డాన్ ప్రతి స్టేషన్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మామూళ్లు ముట్టజెబుతున్నాడు. ఒకవేళ సదరు స్టేషన్లలో పోలీస్ ఉన్నతాఽధికారులు లంచం తీసుకునేందుకు నిరాకరిస్తే కిందిస్థాయి సిబ్బందితోనే పని జరిపిస్తున్నాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాకు రూ.1.80 లక్షల చొప్పున విజిలెన్స్ అఽధికారులు కొంతమందికి మామూళ్లు అందుతుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పేకాట రాయుళ్ల అరెస్ట్
పుట్టపర్తి అర్బన్: స్థానిక పోలీస్ సబ్డివిజన్ పరిధిలో సోమవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 26 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారని డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. పుట్టపర్తి మండలం పైపల్లి శివారున పేకాట ఆడుతూ బత్తలపల్లి ప్రసాద్, అమగొండపాళ్యం సంతోషకుమార్, చంద్ర, పుట్టపర్తికి చెందిన వెంకటేష్, సాయినగర్కు చెందిన అంజినప్ప, కొత్తచెరువు మండలం కమ్మపాలెం నివాసి సాకే చిన్న తిప్పన్న, కర్ణాటక నాగేపల్లికి చెందిన సాకే శ్రీరాములు, అంజి, రవిసాయి, సాయినాథ్, సుబ్బరాయుడు, వెంగళమ్మచెరువు నివాసి నాగేంద్ర, బీడుపల్లి కుళ్లాయప్ప, పుట్టపర్తికి చెందిన బోయ సాయికృష్ణ తదితర 15 మంది పట్టుబడినట్లు వివరించారు. వీరి నుంచి రూ.2.03 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. తనిఖీల్లో కొత్తచెరువు అప్గ్రేడ్ పీఎస్ సీఐ మారుతీశంకర్, ఎస్ఐ లింగన్న, సిబ్బంది పాల్గొన్నారన్నారు. అలాగే బుక్కపట్నం మండలం మదిరేబైలు, రెడ్డిపల్లి గ్రామాల శివారున పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి, రూ.2.03 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ కడప జిల్లా పోట్లదుర్తికి చెందిన శివరామిరెడ్డి, పులివెందులలోని అహోబల్లాపురానికి చెందిన పాలకొండ్రాయుడు, ఎర్రగుంట్ల మండలం హనుమన గుత్తికి చెందిన సంతోష్రెడ్డి, సున్నపురాళ్లపల్లికి చెందిన ఆకుమల్ల రాజేస్, జమ్మలమడుగు మండలం గూడెం చెరువు నివాసి జమాల్ బాషా, ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ నివాసి శ్రీనివాస్, కడపకు చెందిన షేక్ ఇలియాజ్, వేముల మండలం భూమయ్యగారిపల్లి నివాసి రామాంజనేయరెడ్డి, కమలాపురం మండలం దేవరాజుపల్లికి చెందిన నరసింహారెడ్డి, పోరుమామిళ్ల మండలం ఉద్దీకట్ల గ్రామానికి చెందిన మహబూబ్బాషా, కడపలోని శంకరాపురం నివాసి శ్రీనాథ్ ఉన్నారు. -
‘కూటమి’ మాట.. మోయలేని మూట
ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కార్ నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులకు తిప్పలు తప్పడం లేదు. జూలై నుంచి వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయి అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. నడుము వంగి నడవలేని స్థితిలో ఉన్న పుట్టపర్తి మండలం పెడపల్లి చిన్న తండాకు చెందిన వృద్ధురాలు మంగ్లీబాయికి ఒంటరి మహిళ కింద 5 కిలోల బియ్యాన్ని పెడపల్లి పెద్ద తండాలోని చౌకధాన్యపు డిపోలో అందజేశారు. ఈ ఐదు కిలోల బియ్యం మూటను ఆమె ప్రతి అడుగుకు ఓసారి కింద పెడుతూ అతి కష్టంపై ఇంటికి చేర్చింది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వ మాటలు వింటే కష్టాలు తప్పవని నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. – పుట్టపర్తి అర్బన్: -
యువత పెడదోవ
బెల్టుషాపుల్లో మద్యం విక్రయాల జోరు కదిరి టౌన్: బెల్టుషాపుల ద్వారా మద్యం అనధికార విక్రయాలు ఊపందుకున్నాయి. ఏ సమయంలో అయినా తాగినోళ్లకు తాగినంత అందుబాటులో ఉంటోంది. అయితే ఇక్కడ ప్రతి బాటిల్పైనా ఎమ్మార్పీకి మించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. మందుకు అలవాటుపడిన వారు వైన్ షాపులకు వెళ్లలేక చెంతనే ఉన్న బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. ఒక్క కదిరి పట్టణంలోనే 60 దాకా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. బెల్టుషాపుల మాటున అక్రమార్జనే ధ్యేయంగా అధికార తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పోటీపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషాపుల్లో క్వార్టర్ మద్యం బాటిల్పై రూ.30, హాఫ్పై రూ.60, ఫుల్బాటిల్పై రూ.120, బీరుపై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్షాపులో ఉండే ప్రతి బ్రాండ్ మద్యమూ బెల్టు షాపుల్లోనూ లభిస్తుండటం గమనార్హం. మద్యం అక్రమ అమ్మకాలు, అదనపు వసూలు గురించి తెలిసినా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కదిరి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధివీధినా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో మద్యానికి బానిసైన యువత పెడదోవ పడుతోంది. ఇక నిర్వాహకులు సిండికేట్ కావడంతో మద్యం బాటిల్పై రూ.20 నుంచి రూ.30 దాకా అదనంగా దండుకుంటున్నారు. కూలి పనిచేసుకొని జీవనం సాగించేవారు తమ సంపాదనలో 60 శాతం మేర మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. – జీఎల్.నరసింహులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు -
మాటలు జాగ్రత్త సునీతమ్మా
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులతో 2 లక్షల ఎకరాలకు పైగా భూములు బీడుగా మారబోతున్నాయిు. 40–50 వేల రైతు కుటుంబాలను నేల కూల్చుతున్నావు. శత్రువులతో నీ భర్త ఫ్యాక్షన్ చేసి ఉండొచ్చుకాని నువ్వు మాత్రం తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. నీ కంటే నీ భర్త పదిరెట్లు మేలని మీ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాప్తాడు నియోజక వర్గంలో వేలాదిమంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యలు, దాడులు, అక్రమ కేసుల బాధిత కుటుంబాలవారు తరలి వచ్చారన్నారు. ఏరోజైనా రాత్రిపూట నీ భర్త నిద్రపోయాడా? ‘నీభర్త పేరు చెబితేనే భయపడతామని చెబుతున్నావు... 1998–99లో నీ భర్త ఏరోజైనా రాత్రిపూట నిద్రపోయాడా?’ అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరిని కలవరించుకుంటూ భయపడేవాడో ఆమెకే తెలియాలన్నారు. ‘అరవిందనగర్లో మా ఇంటికి వంద అడుగుల దూరంలోనే నీ భర్త ఇల్లు కట్టాడు. నీ భర్తపై యుద్ధం చేసి 30 నెలలు నేను జైలు జీవితం గడిపా. నా తండ్రి అదే ఇంట్లోనే కాపురం ఉన్నాడు. నీ మొగుడు చనిపోయిన తర్వాత ఆ ఇంటినుంచి పక్కకు పోయాం. నువ్వేమో నీ భర్త గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆయన తమ్ముడిని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాల్రెడ్డి వద్దకు వెళ్లి...‘పెద్దాయనా నేను గొర్లు కాసుకునేవాడిని. నాకు ఏ రాజకీయం వద్దు. నన్ను వదిలిపెట్టమని మద్దెలచెరువు నారాయణరెడ్డికి చెప్పు’ అని బతిమాలలేదా? ఇదీ మీ ఆయన చరిత్ర’ అన్నారు. ఆర్ఓసీతో ఊచకోత కోయించారు.. పరిటాట రవి మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఓసీ అనే ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకుని ఊచకోత కోయించారని ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. ‘నీ మొగుడిని చంపిన మద్దెలచెరువు సూరి కాళ్లు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2009 తర్వాత నీ రాజకీయ జీవితం మద్దెలచెరువు సూరి పెట్టిన భిక్ష. సూరి వద్దకు మీ బంధువులను పంప లేదా? మీ ఆయన హత్య కేసు ముద్దాయిలతో నువ్వు సయోధ్య కుదుర్చుకోలేదా? మద్దెలచెరువు సూరి శిష్యుడు శివలింగకు నీ తమ్ముడు బాలాజీ రూ. 5 లక్షలు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించలేదా?మరో శిష్యుడు భానును ఉపయోగించుకోలేదా?ఇదీ మీ అసలు చరిత్ర. పవర్లో ఉంటే జుట్టు పట్టుకుంటావు. లేకపోతే మరోలా వ్యవహరిస్తావు. మీ వద్ద ఎంపీపీగా పని చేసిన దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలిగితే నీ కుమారుడికి ధర్మవరం టికెట్ తెప్పించుకోలేకపోయావు. ఇదీ మీ చరిత్ర. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నావు... ప్రకాష్రెడ్డిని జైలుకు పంపాలంటే నీకు రూలింగ్ కావాలేమో. ప్రకాష్రెడ్డి జైలుకు వెళ్లేందుకు ఏ రూలింగ్ అవసరం లేదు. 20 ఏళ్లు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం’ అన్నారు. వేల కుటుంబాలు వీధులపాలు.. రాష్ట్రంలో రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఆపేసి వేల కుటుంబాలను వీధులపాలు చేశారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ‘ఆలమూరు, కొడిమి జగనన్నకాలనీల్లో 10 వేల మందికి ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారు. పాపంపేట వద్ద ఇళ్లు కూల్చేయించావు. అప్పటి నుంచి 110 ఎకరాల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారందరూ భయపడుతున్నారు. అందుకే నీ భర్త కంటే కూడా నువ్వంటేనే భయపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రామనే తెలుసు కాబట్టే అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరూ మీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి పవన్, గోవిందరెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, అమర్నాథరెడ్డి, జూటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నీ రాజకీయ జీవితం మద్దెలచెరువు సూరి పెట్టిన భిక్ష మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
నమ్మించి మోసగించడం బాబుకు అలవాటే
సోమందేపల్లి: ఎన్నికల సమయంలో హామీలతో నమ్మించడం.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. ఆదివారం సోమందేపల్లి మండలంలోని చాలకూరు, కేతిగాని చెరువు గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలతోనే కొనసాగిందని, ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజలు నీరాజనం పలుకుతుండటాన్ని కూటమి ప్రభుత్వం ఓర్వలేక ఆటంకాలు సృష్టించాలని చూస్తోందన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన హోం మంత్రి అనిత.. రామగిరి మండలంలో అత్యాచారానికి గురైన బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పెనుకొండలో కియా పరిశ్రమ వద్ద పారిశ్రామిక వేత్తలను మంత్రి సవిత అనుచరులు భయభ్రాంతులకు గురి చేసి, దాడులకు దిగినా హోం మంత్రి ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడాది అన్నదాత సుఖీభవ నగదు జమచేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం వివిధ కారణాలతో 20 వేలమంది రైతులకు లబ్ధి చేకూరకుండా చేశారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున వైఎస్సార్సీపీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, మాజీ కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సర్పంచ్లు లలితమ్మ, జిలాన్ఖాన్, పరంధామ, కోఆప్షన్ సభ్యుడు రఫిక్, మాజీ సర్పంచ్లు లక్ష్మీకాంతమ్మ, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
యువకుడి బలవన్మరణం
నార్పల: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా నివాసముంటున్న ఆదినారాయణ, బాలవీరమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుమారుడు హర్ష (27)కు వివాహం నిశ్చయమమైంది. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా మనోవేదనకు లోనైన హర్ష.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంత సేపటకీ హర్ష తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. బంగారు గొలుసు అపహరణ గుంతకల్లు టౌన్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కాలనీలోని మసీదు పక్కన వన్నూర్రెడ్డి, రమాదేవి దంపతులు కిరాణా కొట్టు (రెడ్డి షాపు) ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కొట్టులో రమాదేవి కూర్చొని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొట్టు దగ్గరికెళ్లి సిగరెట్లు కావాలని అడిగాడు. ఆ సమయంలో సిగరెట్ ప్యాకెట్ తీసుకునేందుకు రమాదేవి అటు తిరగగానే వెనుక నుంచి ఆమె మెడలోని 3 తులాల బరువున్న బంగారు గొలుసును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్ పై ఎక్కి ఉడాయించాడు. రమాదేవి గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ మనోహర్, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నాన్నా అంటూ పరుగెత్తుకెళ్లి.. ● వాహనం కిందపడి చిన్నారి మృతి యాడికి: మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో ఆదివారం మద్యాహ్నం వాహనం కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. లక్షుంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం తాను సాగుచేసిన టమాట పంటను తొలగించి వాహనంలో వేసుకుని మధ్యాహ్నం ఇంటి వద్దకు చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం పంటను మార్కెట్కు తరలించేందుకు బయలుదేరుతుండగా తన తండ్రి వెళుతున్నట్లు గుర్తించిన రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తె పరుగున ఇంటి బయటకు చేరుకుంది. అప్పటికే ముందుకు కదిలిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. విషయం తెలియగానే ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ● యోగా పోటీల ప్రారంభోత్సవంలో గవిమఠం ఉత్తరాధికారి ఉరవకొండ: సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పరిపూర్ణ జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యమని గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర క్రీడలు, యువజన విభాగ శాఖ సౌజన్యంతో ఏపీ యోగాసాన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 5వ జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలమూలల నుంచి 240 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. పోటీలను మఠం ఉత్తరాధికారి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించి, మాట్లాడారు. పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందన్నారు. అనంతరం 10 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వారికి ఏడు ఈవెంట్లతో పోటీలు నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్ తాటికొండ, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్, అబ్జర్వర్ బద్రీనాథ్, నాగభూషణ్, దివాకర్, ఆయూర్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్కేకు చేరిన యూరియా
పుట్టపర్తి అర్బన్: ఎట్టకేలకు రైతు సేవ కేంద్రాని(ఆర్ఎస్కే)కి యూరియా చేరింది. గత నెల 30న ‘యూరియా...లేదయా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు స్పందించారు. పెడపల్లి రైతు సేవ కేంద్రానికి 260 యూరియా బస్తాలు, 60 డీఏపీ, 60 కాంప్లెక్స్ బస్తాలను అందుబాటులో ఉంచారు. యూరియా 280, కాంప్లెక్స్ 1310, డిఏపీ 1360 ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇవి స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉంచారు. ఈ మూడు రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు తీసుకెల్లవచ్చని సహకార సంఘం అద్యక్షులు విజయ్కుమార్, సీఈఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. 13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలుఅనంతపురం సిటీ: ఉభయ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మకు పంపగా.. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన హాలులో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నారు. సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు పంపారు. జిల్లా స్థాయి అధికారులు కచ్చితంగా సమగ్ర సమాచారంతో హాజరుకావాలని పేర్కొన్నారు. నేడు ‘పరిష్కార వేదిక’ ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. -
మహిళ దారుణ హత్య
పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన అంజప్పకు మడకశిర మండలం చందకచెర్లు గ్రామానికి చెందిన సన్నక్క (50)తో వివాహమైంది. అయితే ఇటీవల దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సన్నక్క భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఏమైందో తెలియదు కానీ శనివారం రాత్రి పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వెనుక మైదానంలో హత్యకు గురైంది. ఎవరో ఆమె తలపై బలంగా కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త అంజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సన్నక్క మృతికి వివాహేతర సంబంధం కారణమా.. లేక ఇంకేమైనా ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అప్పు తీర్చలేదని పొడిచి చంపేశారు లేపాక్షి: అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన లేపాక్షి మండలం తిలక్నగర్ కాలనీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురంలోని త్యాగరాజ్నగర్కు చెందిన దాదాపీర్ (33) అదే పట్టణానికి చెందిన మరో వ్యక్తి నుంచి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో పలుమార్లు వారు గొడవపడ్డారు. ఆదివారం కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో దాదాపీర్ను తిలక్నగర్ వద్దకు తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి దారణంగా చంపారు. ఈ విషయంపై హతుని కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఎస్ఐ నరేంద్ర తెలిపారు. కాగా.. దాదాపీర్పై హిందూపురం పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. -
యువకుడి అనుమానాస్పద మృతి
నల్లమాడ: అమడగూరు మండలం మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఓ యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన గుణిశెట్టి రాజేష్(36)కు ఏడేళ్ల క్రితం అమడగూరు మండలం మహమ్మదాబాద్ పంచాయతీ బావిచెరువుపల్లికి చెందిన కేశవయ్య కుమార్తె సుమిత్రతో వివాహమైంది. తాగుడుకు బానిసైన రాజేష్ తనను తరచూ వేధిస్తున్నాడంటూ కొన్నేళ్ల క్రితం భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు సుమిత్ర చేరుకుంది. ఆదివారం బావిచెరువుపల్లిలోని అత్తారింటికి వెళ్లిన రాజేష్... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అనంతరం ఏమి జరిగిందో ఏమో.. మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో చెట్టుకు వేసిన ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు పేర్కొంటుండగా... కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వీధివీధినా పశువులే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని ప్రతి వీధిలోనూ వీధి పశువుల బెడద తీవ్రమైంది. ఇప్పటికే కుక్కల గోలతో సతమతమవుతున్న ప్రజలు.. ఈ పశువుల బెడద ఎన్నడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నారు. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో వీధి పశువుల బెడద నానాటికీ జఠిలమవుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, తదితర మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పశువులు రోడ్డుపైనే ఉంటున్నాయి. వీటి పెంపకం దారులు మేత కోసం వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రధానంగా ఉభయ జిల్లా కేంద్రాల్లో ప్రధాన రోడ్లతో పాటు ప్రతి వార్డుల్లోనూ ఆవుల సంచారం పెరిగిపోయింది. రోడ్డుకు అడ్డంగా వస్తుండడంతో పలుమార్లు వాహనదారులు వాటిని ఢీకొని కిందపడి గాయపడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక ప్రధాన మార్గాల్లో రోడ్డుకు అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో కిందపడిన వాహనదారులు అకాలమృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. ప్లాస్టిక్, వ్యర్థాలతో ఆరోగ్యంపై ప్రభావం.. పట్టణ పరిసరాల్లో నివాసముంటున్న పశుపోషకులు వాటి సంరక్షణను గాలికి వదిలేశారు. ప్రభుత్వం సైతం గో సంరక్షణ పథకాన్ని అటకెక్కించడంతో పశుగ్రాసం అందక పలువురు రోడ్డుపైనే పశువులను వదిలేస్తున్నారు. దీంతో ఆకలితో అలమటిస్తున్న ఆవులు .. చెత్త దిబ్బల్లో, కంపోస్టు యార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక వీటి పాలను ఆహారంగా తీసుకున్న ప్రజలు సైతం అనారోగ్యం బారిన పడుతున్నారు. గోశాల ఉన్నా.. వీధి పశువుల సంరక్షణకు అనంతపురంలోని కలెక్టరేట్ ఎదురుగా గోశాలను ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ గోశాలకు ఆవులను తరలించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో పశుపోషకులకు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ, తదుపరి చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తామేమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నట్లుగా అధికారులు వాపోతున్నారు. అన్ని చోట్ల సంచారం గుంతకల్లు టౌన్: పట్టణంలోని రహదారులు, ప్రధాన చౌరస్తాలతో పాటు కూరగాయల మార్కెట్లో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు, లేగదూడలు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 18న సంతమార్కెట్లో రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ కూరగాయలు కొనుగోలు చేస్తున్న మహిళ మీదకు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ అంశాన్ని అదే నెల 26న జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు లేవనెత్తడంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లోపు చర్యలు తీసుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రతి పశువునూ గోశాలకు తరలిస్తామంటూ భరోసానిచ్చారు. అయితే నేటికీ ఇది కార్యాచరణలోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో పశువులు రోడ్లపైనే.. నిద్రమత్తులో అధికారులు పట్టించుకోని పాలకవర్గం తరచూ ప్రమాదాలే చిలమత్తూరు: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై వీధి ఆవుల సంచారంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడుతుండగా.. మరికొన్ని సందర్భాల్లో మూగజీవాలు గాయాల పాలవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం చిలమత్తూరు మండలం కోడూరు థామస్ మన్రో తోపు వద్ద 44వ జాతీయ రహదారిని దాటుకుంటున్న ఆవును కారు ఢీకొంది. ఘటనలో ఆవు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. -
జేఎన్టీయూ(ఏ) కాన్స్టిట్యూట్ కళాశాలగా ‘స్కిట్’
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ‘కాన్స్టిట్యూట్’ జాబితాలోకి మరో కళాశాల చేరింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్)ని జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చారు. ఇప్పటికే ఏపీఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్ జాబితాలో స్కిట్ కళాశాలను ఆప్షన్ ఇచ్చుకోవడానికి వీలుగా వెబ్సైట్లో చేర్చారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రాథమికంగా సమాచారం అందగా... ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రానున్నాయి. 1997లో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘స్కిట్’ కార్యకలాపాలు తొలుత సమర్థవంతంగా నడిచినా... కొన్నేళ్లకే అడ్మిషన్లు పడిపోయాయి. నిర్వహణ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ‘స్కిట్’ను జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చాలంటూ 10 సంవత్సరాల నుంచి పాలకమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది.ఇందుకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా కార్యరూపం దాల్చింది. ఐదో కళాశాల.. జేఎన్టీయూ (ఏ) పరిధిలో ఇప్పటివరకూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్ఐ, పులివెందుల, కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలు కాన్స్టిట్యూట్గా ఉన్నాయి. తాజాగా స్కిట్ చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. కాన్స్టిట్యూట్ కళాశాలగా రూపాంతరంతో ‘స్కిట్’కు సంబంధించిన స్థిర, చరాస్తులు అన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. కళాశాల నిర్వహణ మొత్తం జేఎన్టీయూ (ఏ) పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే జేఎన్టీయూ ఉన్నతాధికారులు ‘స్కిట్’కు సంబంధించి ప్రిన్సిపాల్ నియామకం, ఫ్యాకల్టీ కేటాయింపు తదితర అంశాలపై దృష్టి సారించారు. ‘స్కిట్’లో తొలుత ఐదు బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి పొందారు. సీఎస్డీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్), సీఎస్ఈ (కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్), సీఎస్ఎం (సీఎస్ఈ–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో బ్రాంచ్కు 66 చొప్పున 330 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. -
5న సర్పంచుల ‘చలో విజయవాడ’
గుంతకల్లు రూరల్: ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్రెడ్డి డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు చెల్లించకుండా కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంతకల్లు మండలంలోని తన సొంత పంచాయతీ ఓబుళాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల క్రితం గ్రామ పంచాయతీలకు గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1121 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టడంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గడిచిన వేసవిలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడితే, ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కార్మికుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్ సర్కార్ గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు మాట్లాడటం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు చేస్తుందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, ఉపాధి పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో పనులు నిర్వహించాలని, ఎన్నికల హామీల్లో భాగంగా ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి పంచాయతీలకు నిధులను కేటాయించాలని, పంచాయతీలకు అందాల్సిన సర్ చార్జీలను నిరంతరం విడుదల చేయాలనే డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి సర్పంచులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్రెడ్డి -
కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి
కడప ఎడ్యుకేషన్: కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను చదువులో దిట్టలుగా మార్చాలని కేజీబీవీ సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపు నిచ్చారు. కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. కేజీబీవీలలో విద్యనభ్యసించే వారంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారిని చదువుల్లో దిట్టలుగా చేయడం అదృష్టంగా భావించాలన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానంద రాజులు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్న మరిన్ని కొత్త విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించడం ద్వారా వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు -
‘సమగ్ర’ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లకు (పీటీఐ) ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ పీటీఐల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిరంలో పీటీఐల ఉమ్మడి జిల్లా అసోసియేషన్ మహాసభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమారి మాట్లాడుతూజజ 13 ఏళ్లుగా రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న పీటీఐలు ఇప్పటి వరకూ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్, ప్రధానకార్యదర్శి పీఎస్ ఖాన్, మహిళా విభాగం చైర్పర్సన్ సురేఖరావు, పీటీఐల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీదేవి, ప్రభాకర్, విజయకుమారి, సౌజన్య, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ‘వీఆర్వోల వీరంగం’పై అధికారుల సీరియస్ రొళ్ల: పట్టపగలే మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వీఆర్వోలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరినీ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రొళ్లకొండ గ్రామ సమీపంలో 544ఈ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన టోల్గేట్ సమీపంలో గత నెల 31న టీబంక్ వద్ద మాజీ ఎంపీపీ క్రిష్ణప్పతో పాటు మరికొందరిపై మద్యం మత్తులో రత్నగిరి వీఆర్వో నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్వో రంగనాథ్ దౌర్జన్యం సాగించారు. ఈ అంశంపై ‘వీఆర్వోల వీరంగం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న వెంటనే విషయంపై స్థానిక తహసీల్దార్ షెక్షావలి, ఎస్ఐ వీరాంజనేయులుతో వేర్వేరుగా ఆరా తీశారు. అనంతరం ఎస్ఐ నేరుగా టోల్గేట్ వద్దకు చేరుకుని వీఆర్వోల వీరంగంపై స్థానికులతో విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరినీ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వోల పనితీరుపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ను రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ -
ఆ ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
పుట్టపర్తి టౌన్: పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)జిల్లా కార్యదర్శి మహేంద్ర, ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మంజూరు నరేంద్ర ఖండించారు. విద్యార్థులు హక్కులను హరించేలా ఉన్న ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతులను ఆదివారం పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో దగ్దం చేశారు. రాష్ట వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వ నాయకులకు చెందినవే అన్నారు. ఆ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలను అధిక ధరకు విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉందన్నారు. ఆమోదయోగ్యం కాని ఈ ఉత్తర్వులను ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమై వ్యతిరేకించాలన్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు హర్షవర్దన్, సాయిప్రతాప్, శివభరత్, దినేష్, కార్తీక్, భాస్కర్, మునీంద్ర, హరి, సురే్ష తదితరలు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల గొంతు నులిమే కుట్ర ధర్మవరం అర్బన్: పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆమోదయోగ్యంగా లేదని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించి పాఠశాలలను జైళ్లుగా మార్చేలా ఉన్నాయన్నారు. విద్యార్థి సంఘాలను నియంత్రించడం, వాటి గొంతును అణచివేయడం లక్ష్యంగా ఇలాంటి కుట్రలకు కూటమి సర్కార్ తెరలేపిందని మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర -
జల్సాల కోసం దొంగతనాలు
రాప్తాడురూరల్: జల్సాలకు అలవాటుపడిన యువకులు అప్పులపాలై.. వాటిని తీర్చుకునేందుకు దొంగలుగా మారి.. చివరకు కటకటాలపాలయ్యారు. ఇటీవల అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాల డెయిరీలో రూ.10 లక్షల విలువైన జనరేటర్, 70 అల్యూమినియం పాల క్యాన్లను చోరీ చేసిన కేసులో నిందితులను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రూరల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అనంతపురంలోని రంగస్వామినగర్కు చెందిన చిక్కులూరు షెక్షావలి, అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన గోవిందు సింహాద్రి, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం డీఆర్ కాలనీకి చెందిన సి.మనోహర్ ఉన్నారు. చిక్కులూరు షెక్షావలి తపోవనంలో డీజే, లైటింగ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తక్కిన ఇద్దరికీ రాచానపల్లి, కొర్రపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాల్లో సూపర్వైజర్లుగా పని చేశారు. ప్రస్తుతం ఆ రెండు పాలకేంద్రాలు మూతపడడంతో పనిలేక అప్పులు చేసుకున్నారు. షెక్షావలికి జనరేటర్ అవసరం ఉందని తెలుసుకుని రాచానపల్లిలో మూతపడిన పాలకేంద్రంలోని జనరేటర్, అల్యూమినియం పాలక్యాన్లను ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 14న రాత్రి రెండు వాహనాల్లో వెళ్లి పాలడెయిరీ భవనం తాళాలు పగులగొట్టి జనరేటర్, పాలక్యాన్లను ఎత్తుకెళ్లారు. అరెస్ట్ ఇలా... రాచానపల్లి ప్రభుత్వ పాలడెయిరీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్కు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కె.రాంబాబు, సిబ్బందితో తపోవనం సమీపంలోని పెట్రోలుబంకు వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకుని కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ జనరేటర్, పాలక్యాన్లు స్వాధీనం -
సత్యసాయి శతజయంతి ఉత్సవానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రశాంతి నిలయం: నవంబర్ 23న నిర్వహించనున్న సత్యసాయి శత జయంత్యుత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రామాలయంలో చోరీ గోరంట్ల: కరావులపల్లిలోని రామాలయంలో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. ఆలయం గేటు, తలుపుల తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు హుండీని సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి పగులగొట్టి.. అందులోని నగదు ఎత్తుకుపోయారు. రెండు సంవత్సరాల కిందట కూడా ఇదే తరహాలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. వైద్య సేవలపై ఆరా గాండ్లపెంట: మండల కేంద్రం గాండ్లపెంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం శనివారం తనిఖీ చేశారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు, మాతాశిశు మరణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కటారుపల్లి క్రాస్లోని కేజీబీవీని పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కదిరి డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖాదికారి నాగేంద్రనాయక్, డాక్టర్లు మహేశ్వర, మారుతి, బాబా ఫక్రుద్దీన్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. క్లర్క్ ఆత్మహత్యాయత్నం చిలమత్తూరు: టేకులోడు క్రాస్లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో క్లర్క్గా పనిచేస్తున్న సిద్దలింగప్ప ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. శనివారం సాయంత్రం పురుగులమందు తాగడంతో పాఠశాల సిబ్బంది గమనించి ఆయన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్కు సిబ్బందికి మధ్య సఖ్యత లేకపోవడంతో నిరంతర వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్లర్క్ మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. -
శ్రావణ శనివారం.. అద్వితీయం
పావగడ: శ్రావణ మాస రెండో శనివారం పావగడ శనీశ్వరస్వామి స్వర్ణ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధాన అర్చకులు అనంతరాం భట్, కృష్ణ శాస్త్రి నేతృత్వంలో ఉదయం 4 గంటలకే శనీశ్వర స్వామికి పంచామృతాభిషేక, తైలాభిషేక, నవగ్రహ పూజలు జరిగాయి. భక్తులు తైలాభిషేక పూజల్లో లీనమైపోయారు. శనీశ్వరునికి ఇష్టమైన నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు సమర్పించారు. ఆలయం వెలుపల టెంకాయలు కొట్టారు. దీక్షా మంటపంలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులాభారంలో తమకు తోచిన నిలువెత్తు కానుకలు సమర్పించుకున్నారు. ఎలాంటి శని దోషాలు లేకుండా తమను కాపాడాలని వేడుకున్నారు. ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ తదితర పదాధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దైవ దర్శనం సులభంగా జరిగేలా చర్యలు చేపట్టారు. శనీశ్వరు డిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు ఆనవాయితీగా సమీపంలోని కోటె ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. -
అప్పులబాధతో మహిళ ఆత్మహత్య
అమరాపురం: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆలదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి తనయుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలదపల్లికి చెందిన వీరభద్రప్ప 20 ఏళ్ల క్రితం ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు ఆ ఇంటిని పడగొట్టి.. కొత్తగా కట్టించారు. ఇందు కోసం మహిళా సంఘం, బ్యాంకు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.4 లక్షల దాకా అప్పులు చేశారు. కొన్నాళ్ల తర్వాత అప్పులు తీర్చడానికి పని కోసం వీరభద్రప్ప కుమారుడు ఈరన్న బెంగళూరుకు వలస వెళ్లాడు. అయినా ఆ సంపాదన కుటుంబ పోషణకే సరిపోయింది. దీంతో అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు పెరగడంతో వీరభద్రప్ప భార్య కెంచమ్మ (59) బాధపడుతుండేది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన కెంచమ్మ శనివారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఉన్న పొలం వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుమారుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదును చూసి నగదు కాజేసి.. కదిరి టౌన్: ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచిన నగదును ఇద్దరు దుండగులు అదును చూసి అపహరించుకుపోయారు. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటాగుళ్లకు చెందిన చింతపండు వ్యాపారి ఇమామ్ఖాన్ తన కుమారుడు సమీర్ఖాన్తో కలిసి శనివారం ఐశ్వర్య హోటల్ ఎదుట నున్న కరూర్ వైశ్య బ్యాంక్కు వెళ్లి రూ.70వేలు డ్రా చేశారు. అనంతరం నగదును ద్విచక్రవాహనం డిక్కీలో భద్రపరచి బయల్దేరారు. మదనపల్లి రోడ్డులో మోర్ పక్కన మెకానిక్ షాప్ వద్ద బండి ఆపారు. షాపు వద్దకు వెళ్లి పని చూసుకుని తిరిగి వచ్చారు. డిక్కీ తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. ఎవరో చోరీ చేశారని గ్రహించిన ఇమామ్ఖాన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ వి.నారాయణరెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించగా.. టోపీలు ధరించి, నంబరు ప్లేటు లేని బైక్పై ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అనుసరిస్తూ వచ్చారు. మెకానిక్ షాపు వద్ద ద్విచక్రవాహనదారులు వెళ్లగా.. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు డిక్కీలోని నగదును ఎత్తుకుని వెళ్లిపోయినట్లు గుర్తించారు. సదరు వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని సీఐ సూచించారు. మద్యం కేసులో ముద్దాయికి జైలు పుట్టపర్తి టౌన్: కర్ణాటక మద్యం తరలించిన కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.4,391 జరిమానా విధిస్తూ పుట్టపర్తి సివిల్ జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ తీర్పు చెప్పారు. పుట్టపర్తి ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఎనుములపల్లికి చెందిన భూపతి చక్రవర్తి 2021 ఆగస్టులో కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో పుట్టపర్తి ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎస్ఐ గోపాల్, హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం, కానిస్టేబుల్ మహబూబ్బాషా కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు. ఈ కేసు శనివారం విచారణకు రాగా, ముద్దాయికి ఆరు నెలల సాధారణ జైలు, రూ.4,391 జరిమానా విధిస్తూ పుట్టపర్తి సివిల్ కోర్టు జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ తీర్పు చెప్పారు. ముద్దాయి జరిమానా చెల్లించకపోతే మరో రెండు నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
వీఆర్వోల వీరంగం
రొళ్ల: మద్యం మత్తులో ఇద్దరు వీఆర్వోలు వీరంగం సృష్టించారు. మాజీ ప్రజాప్రతినిధితో పాటు స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రొళ్లకొండ గ్రామ సమీపాన 544ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్ద గురువారం సాయంత్రం రత్నగిరి వీఆర్వో నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్వో రంగనాథ్ ఇద్దరు పూటుగా మద్యం తాగారు. టోల్గేట్ వద్ద ఉన్న ఓ టీ బంక్ వద్దకు వచ్చి.. అక్కడే ఉన్న రత్నగిరి చెందిన మాజీ ఎంపీపీ క్రిష్ణప్ప, మరో ఐదారుగురిని అసభ్య పదజాలంతో దూషించారు. గ్రామస్థాయి అధికారులై అయి ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదని స్థానికులు హెచ్చరిస్తున్నా వారు వినలేని పరిస్థితి. నిలబడలేని స్థితిలో తూగుతూ, కళ్లు పెద్దవిగా చేస్తూ రెచ్చిపోయారు. ఈ తతంగాన్ని స్థానికులు కొందరు సెల్ఫోన్లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న రొళ్ల తహసీల్దార్ షేక్షావలి సదరు వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరినీ పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ (అప్పగించారు) చేశారు. మాజీ ఎంపీపీతోపాటు మరికొంతమందిపై దురుసు ప్రవర్తన -
సాయి మార్గం.. ఆచరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి చాటిన విలువలు నవసమాజ నిర్మాణానికి సోపానాలని, అందరూ వాటిని ఆచరించాలన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తకోటిని అనందపరవశులను చేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్ –6 దేశాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు శనివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి చాటిన ఆధ్యాత్మిక, మానవతా విలువలు, సత్యసాయి విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారులు ప్రదర్శించిన నాటిక భక్తులను ఆకట్టుకుంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై.. టీడీపీ వర్గీయుల దాడి
తాడిమర్రి: పొలం వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మాల్యవంతం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు సద్దల శివయ్య, అతని కుమారుడు సద్దల చిన్న కేశవయ్య శనివారం సాయంత్రం జొన్నచొప్పకు నీరు పెడుతున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సద్దల కేశవయ్య, సద్దల శీనప్ప మరికొందరు వ్యక్తులు శివయ్య జొన్నచొప్పలో వెళుతున్నారు. దీంతో శివయ్య కుమారుడు చిన్న కేశవయ్య పొలంలో వెళ్లరాదని అభ్యంతరం తెలిపారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు... చిన్న కేశవయ్యపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన శివయ్యపైనా దాడి చేశారు. గాయపడిన శివయ్య, చిన్న కేశవయ్యలను బంధువులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు రెఫర్ చేశారు. ఈ విషయంపై ఎస్ఐ కృష్ణవేణిని వివరణ కోరగా ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ బత్తలపల్లి మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లి బాధితులు శివయ్య, చిన్న కేశవయ్యలను పరామర్శించారు. -
రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయ తరగతులు
గోరంట్ల: పాలసముద్రం సమీపంలోని నాసన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం (సెంట్రల్ స్కూల్)లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనిఫాంతో ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు చేరుకోవాలన్నారు. పాఠశాల ప్రారంభోత్సవానికి నాసిన్ డీజీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరవుతారన్నారు. ఇప్పటికే ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రులతో ఓరియంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేసినట్టు తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో చదివే విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ, విద్య అందిస్తామని తెలిపారు. -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
ముదిగుబ్బ/ కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలోని నాయీబ్రాహ్మణ వీధికి చెందిన శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ (23), అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వలస మూర్తి కుమారుడు రోహిత్ (23) తమిళనాడు రాష్ట్రం మధురైలోని కలసలింగం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ బైక్పై యూనివర్సిటీ సమీపంలో వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తీక్, రోహిత్ మృతి చెందారు. రోహిత్ జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు. విషయం తెలుసుకున్న క్రీడాకారులు రోహిత్ మృతికి సంతాపం ప్రకటించారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారిణుల ఎంపిక
ధర్మవరం: జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ తెలిపారు. జూన్లో భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఆ పోటీల్లో ప్రతిభ కనబరిచి సింధు, పవిత్ర హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి కాకినాడలో జరుగుతున్న 15వ జాతీయస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలలో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి హాకీ పోటీల్లోనూ ప్రతిభ చూపాలని హాకీ జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, చందు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్, అమునుద్దిన్, కిరణ్ ఆకాంక్షించారు.