Sri Sathya Sai
-
వైభవంగా మల్లెపూల ఉత్సవం
కదిరి టౌన్: వైశాఖ శుద్ద పౌర్ణమిని పురస్కరించుకుని కదిరిలోని మద్దిలేరు ఒడ్డున ఉన్న మల్లెపూల మంటపం వద్ద సోమవారం సాయంత్రం శ్రీవారి మల్లెపూల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు మల్లెపూల మంటపం వద్దకు స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో చేర్చారు. అనంతరంశ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుడి ఉత్సవమూర్తులను మల్లెపూలతో ప్రత్యేక అలంకరించారు. ఉభయదారులుగా కదిరికి చెందిన మల్లెపూల నరసయ్య కుమారులు వ్యవహరించారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
‘సర్పంచ్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
పెనుకొండ రూరల్: సోమందేలపల్లి మండలం నాగినాయనిచెరువు సర్పంచ్ అంజినాయక్పై ఆదివారం నల్గొండ్రాయునిపల్లి, సోమందేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ సోమవారం బాధితుడు అంజినాయక్తో కలసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నర్శింగప్పకు విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు ● వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వెఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, శింగనమల వైఎస్సార్సీపీ నాయకులు కాటమయ్య, ప్రసాద్, శివశంకరనాయక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్కు జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం తాడిమర్రి: మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నీరుగట్టు వెంకటేష్కు మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం దక్కింది. గత 30 ఏళ్లుగా వివిధ దిన పత్రికల్లో విలేకరిగా ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) యూనియన్ స్థాపించి ఐదు వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ స్పీకర్ షరీఫ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గోరంట్లలో అగ్ని ప్రమాదం గోరంట్ల: స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కాటన్ బజార్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోరంట్ల పట్టణానికి చెందిన ఇద్దరి భాగస్వామ్యంతో తమిళనాడుకు చెందిన గోకుల్ అనే వ్యక్తి శ్రీనివాస కాటన్ బిగ్ బజార్ ఏర్పాటు చేశారు. సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.50 లక్షల పైచిలుకు దుస్తులు, ఓ ద్విచక్ర వాహనం, ఆరు సీసీ కెమెరాలు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ అనంతపురం: ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు. -
●వాస్తు దోషమని మూతేశారు!
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్ మొదటి గేటు కొంత కాలంగా మూత పడింది. మార్కెట్యార్డ్కు రెండు ప్రధాన గేట్లు ఉండగా ఇందులో పట్టణం వైపు నుంచి ప్రవేశించే మొదటి గేటును వాస్తు దోషం ఉందంటూ అధికారులు మూతేశారు. దీంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ రేషన్ గోదాం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ గోదాంలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం సుదూరాన ఉన్న రెండవ గేటు ద్వారానే మార్కెట్ యార్డులోకి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలతో అధికారులు గేటు మూసేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రశాంతి నిలయంలో ఘనంగా బుద్ధపౌర్ణమి
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో బుద్ధపౌర్ణమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్కు చెందిన జోన్–4 మయన్మార్, నేపాల్, శ్రీలంక, జోన్–5 బ్రూనై, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, సింగపూర్, తైవాన్ దేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించారు. వేడుకలనుద్దేశించి బౌద్ధ ప్రముఖుడు వాస్దేవ్ కిలానీ, బౌద్ధ సన్యాసి కెంపోపెమా వోసెర్ మాట్లాడారు. -
తల్లికి వందనం.. బాబు ద్రోహం
కదిరి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడికెళ్లినా పిల్లలను చూడగానే ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం ద్వారా నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తాం’ అని గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పథకం అమలుకు నోచుకోలేదు. 2024–25 విద్యా సంవత్సరం కూడా ముగిసింది. కానీ నయాపైసా కూడా ఇవ్వలేదు. వచ్చే నెలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇలాంటి తరుణంలో ‘ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాకుండా విడతల వారీగా ఇవ్వాలనుకుంటున్నాం’.. అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఇది కూడా గతంలో రుణమాఫీ అంశంలో తమను మోసగించినట్లుగానే ఉందని విద్యార్థుల తల్లులు అంటున్నారు. జగన్ హయాంలో రూ.కోట్లలో లబ్ధి.. జగన్ ప్రభుత్వంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,66,398 మంది విద్యార్థులకు రూ.946.41 కోట్ల లబ్ధి చేకూరింది. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. కదిరి నియోజకర్గంలో 27,869 మందికి రూ.156.22 కోట్లు, ధర్మవరంలో 28,656 మందికి రూ.164.60 కోట్లు, పుట్టపర్తిలో 23,483 మందికి రూ.133.32 కోట్లు, హిందూపురంలో 27,954 మందికి రూ.160.04 కోట్లు, మడకశిరలో 23,365 మందికి రూ.133.83 కోట్లు, పెనుకొండలో 25,987 మందికి రూ.147.23 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 9,084 మందికి రూ.51.25 కోట్లు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది చేకూరింది. అంతేకాక జిల్లాలో ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా 1,62,699 మందికి రూ.62.21 కోట్లు, ‘జగనన్న వసతి దీవెన’ కింద 43,301 మందికి రూ. 162.38 కోట్లు, ‘జగనన్న విద్యా దీవెన’ కింద 44.082 మందికి రూ.314.91 కోట్ల లబ్ది చేకూరింది. నిధుల కేటాయింపులోనే కలవరం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చడం తప్ప చేకూర్చిన లబ్ధి అంటూ ఏదీ లేదు. 2025–26కు సంబందించి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని చూడగానే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరిచారు. గత జగన్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి చేకూరిస్తే ఏడాదికి జిల్లాలోని విద్యార్థులకు రూ.250 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కన తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకం లబ్ధి చేకూర్చాలంటే చంద్రబాబు సర్కార్ కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవని తేల్చేశారు. అలా కాకుండా ఇంట్లో ఒక్కరికే పథకం లబ్ధి చేకూర్చినా ఈ నిధులు సరిపోవని అంటున్నారు. పథకం అమలుపై కమ్ముకున్న నీలి నీడలు విడతల వారీగా ఇస్తామంటున్న సీఎం చంద్రబాబు బాబు మాటలు నమ్మబోమంటున్న తల్లులు పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే అమ్మ ఒడి పథకాన్ని కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగానూ ప్రకటించారు. అయితే పథకం అమలులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ.. తాజాగా విడతల వారీగా ఇస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు విధిస్తే ఒప్పుకోం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండానే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సిందే. నిబంధనల పేరుతో కోతలు విధించాలని చూస్తే ఊరుకోం. – రాజేంద్రప్రసాద్ యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బకాయి కలిపి చెల్లించాలి ‘తల్లికి వందనం’ పథకం కింద గత విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన బకాయితో కలిపి ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు మొత్తం నగదు మంజూరు చేయాలి. అది కూడా విడతల వారీగా కాకుండా అంతా ఒకేసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. షరతులు వర్తిస్తాయని సాకులు చెబితే ఒప్పుకోం. – బాబ్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ
ప్రశాంతి నిలయం: భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, రీ సర్వే అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో సంబంధిత ఆర్డీఓలు పరిశీలించాలన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు బృందాలుగా ఏర్పడి రీసర్వే పూర్తి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఐకాన్ యూత్’ సదస్సుకు మదీహహిందూపురం టౌన్: ‘భవిష్యత్ భారతావని యువత ముందున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళూరులోని యెన్ఫోయా విశ్వవిద్యాలయంలో వేదికగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే అంతర్జాతీయ సదస్సు ‘ఐకాన్ యూత్ 2025’కు హిందూపురంలోని ఎస్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎ.మదీహ ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి సోమవారం తెలిపారు. రాష్ట్రం తరఫున నలుగురు పాల్గొంటుండగా...అందులో తమ కళాశాల విద్యార్థి కూడా ఉండటం గర్వకారణమన్నారు. ‘ఆధునిక యుగంలో ప్రజారోగ్య ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడంలో యువత పాత్ర’ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ రూపంలో మదీహ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సెమినార్కు ఎంపికై న విద్యార్థినిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సహచర విద్యార్థులు అభినందించారు. ‘పోలీసు స్పందన’కు 70 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి అర్బన్ డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా... నేటికీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పాఠశాలల పునర్వవ్యవస్థీకరణను పారదర్శకంగా చేపట్టాలన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో అశాసీ్త్రయ విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలలో 5 తరగతులను బోధించటానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్ హెచ్ఎం పోస్టు అదనంగా కేటాయించాలన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 120 దాటితే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించాలని, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయించాలని, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంను కొనసాగించాలన్నారు. బదిలీ జీఓ వెంటనే విడుదల చేసి వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం శిబిరం వద్దకు వచ్చిన డీఈఓ కృష్ణప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవాధ్యక్షుడు భూతన్న, బాబు, శ్రీనివాసులు, నారాయణ, శివశంకర్, అనిల్కుమార్, మారుతి, తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో యూటీఎఫ్ నేతల డిమాండ్ -
ప్రతి సమస్యకూ సంతృప్తికర పరిష్కారం చూపండి
ప్రశాంతి నిలయం: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసే వినతులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 172 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులకు వర్చువల్ విధానంలో రాష్ట్ర స్థాయి కేపీఐల శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అలాగే మండల స్థాయి అధికారులందరూ వారివారి మండల స్థాయిలో జరిగే శిక్షణకు హాజరు కావాలన్నారు. అన్ని శాఖల ప్రధాన హెచ్ఓడీలు నెలవారీ కార్యాచరణ ప్రణాళిక నివేదికలు, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జూన్ 5న జిల్లా అంతటా అన్ని ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరమవుతాయో ముందస్తుగానే నివేదికలు సిద్ధం చేసి డీఎఫ్ఓకు మంగళవారం లోపు అందజేయాలన్నారు. జిల్లాలో అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐసీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఈఓ కృష్ణప్ప, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీసహానీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
ఔను ఇది సచివాలయమే...
రామగిరి: మండలంలోని పెద్ద కొండాపురం గ్రామంలో ఉన్న సచివాలయానికి రెండు రోజుల క్రితం స్థానిక టీడీపీ నేతలు పసుపు రంగు వేసి, కార్యాలయం ఎదుట జెండా స్తంభానికి పార్టీ జెండాను ఎగురవేశారు. దీంతో వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారు ఆశ్చర్యపోతూ ప్రభుత్వ కార్యాలయాన్ని మరో చోటుకు మార్చి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు కాబోలని వెనుదిరుగుతున్నారు. రంగు వేసిన కొత్తలో అధికారులు సైతం ఇలాగే పొరబడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయానికి వేసిన రంగును మార్చాలని పలువురు కోరుతున్నారు. -
నిబంధనలు సవరించాలి
రూ. 5,11,65,000సాక్షి, పుట్టపర్తి గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందించగలిగితే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులకొచ్చే రోగుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా ఆయా వైద్య కేంద్రాలు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. అందువల్లే గడచిన ఐదేళ్లలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి తెచ్చి సిబ్బందిని నియమించి ఇళ్ల ముంగిళ్లలోనే సేవలందించారు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందిని కొత్తకొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. పైగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎంపీహెచ్ఏ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్)లలో చాలామందిని ఉద్యోగం నుంచి తప్పించింది. మరోవైపు ముఖ్యమంత్రి ఐ కేర్ సేవలకు మంగళం పాడింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లపై కత్తి పెట్టింది. 9 నెలలుగా అందని ఇన్సెంటివ్.. ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో భాగంగా 2019లో ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ కింద బీఎస్సీ నర్సింగ్ అర్హతతో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్)ల నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత వారి పోస్టును సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు)గా మార్చారు. ఇలా జిల్లాలో 379 మంది పనిచేస్తున్నారు. వీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి నెలకు రూ.25 వేల వేతనం, ఇన్సెంటివ్ రూపంలో మరో రూ.15 వేలు ఇస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం జీతం మాత్రమే చెల్లిస్తూ అదనంగా అందాల్సిన ఇన్సెంటివ్ రూ.15 వేలు ఇవ్వడంలేదు. దీంతో గత ఏప్రిల్ 28వ తేదీ నుంచి విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. అయినా పాలకులు ఇప్పటి వరకు స్పందించలేదు. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేశ్కు కూడా సీహెచ్ఓలు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు. సరికొత్త నిబంధనతో మెలిక.. సీహెచ్ఓలకు ఇవ్వాల్సిన రూ.15 వేలు ఇన్సెంటివ్ అనేది సర్వీసుకు సంబంధించిన అంశం. అయితే కూటమి ప్రభుత్వం ఉదయం 8 గంటలకు.. రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ (అటెండెన్స్) వేయాలనే కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అలా చేయకపోతే ఇన్సెంటివ్లో రూ.5 వేలు కట్ చేస్తామని సర్కారు బెదిరింపులకు దిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉండాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఉన్న 379 మంది సీహెచ్ఓల్లో 351 మంది మహిళలు ఉన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న కేంద్రాల్లో పనిచేసే వారు ఎక్కువే ఉన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ వేసి మండల కేంద్రాల్లోని ఇళ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడి తప్పిన వైద్యసేవలు.. పల్లెల్లో వైద్య సేవలందించే సీహెచ్ఓలు గ్రామీణులకు ఎలాంటి ఆనారోగ్య సమస్య తలెత్తినా పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం వారంతా సమ్మె బాట పట్టగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు రోగులకు మాత్రలిచ్చిపంపుతున్నారు. దీంతో గ్రామీణులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.సీహెచ్ఓలకు ప్రభుత్వం బకాయిగా ఉన్న ఇన్సెంటివ్ మొత్తం113379గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)ను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనివేళలు నిర్ణయించడంతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్ రూపంలో అందించాల్సిన రూ.15 వేలు ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో వారంతా 15 రోజులుగా సమ్మెబాట పట్టగా పల్లెల్లో వైద్యం పడకేసింది. బకాయిలపై స్పష్టత ఇవ్వాలిపెండింగులో ఉన్న ఇన్సెంటివ్పై ఇటీవల పాలకులు స్పందించి ఆర్నెల్ల ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు.. కానీ ఎప్పటి లోపు జమ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిలతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్ సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నాం. – కార్తీక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, సీహెచ్ఓల సంఘం రాత్రి 8 తర్వాత ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే కర్ణాటక సరిహద్దున ఉండే కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కొత్త నిబంధనలపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఎఫ్ఆర్ఎస్ లేకపోతే రూ.5 వేల కోత విధించడం సబబు కాదు. – సుమ, సీహెచ్ఓ, అమరాపురం డిమాండ్లు ఇవే.. సర్వీసు ఆరేళ్లు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలి. ప్రతి నెలా రూ.15 ఇన్సెంటివ్ ఇవ్వాలి. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. స్థానికంగా ఉండాలనే నిబంధన అమలు చేస్తే అదనంగా మరో రూ.5 వేలు ఇవ్వాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు పరిగణించాలి. 9 నెలలుగా పెండింగులో ఉన్న ఇన్సెంటివ్పై స్పష్టత ఇవ్వాలి.‘‘మీ అర్హతకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 వేలు కూడా రాదు. కానీ ప్రభుత్వం రూ.25 వేలు ఇస్తోంది. మీరు ధర్నాలు చేసినా.. ఏఎన్ఎంలతో డ్యూటీ చేయిస్తాం. ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు మిగులుతాయి.’’ – సీహెచ్ఓలను తొలగిస్తామంటూ ఈనెల 4వ తేదీన మంత్రి సత్యకుమార్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు -
పారని టీడీపీ పాచిక
చిలమత్తూరు: పురం వైస్ చైర్మన్ అవిశ్వాసంలో టీడీపీ పాచిక పారలేదు. తగిన బలం లేకపోయినా చైర్మన్ పీఠం లాగే, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుందామనుకున్న టీడీపీ నేతలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాకపోవడంతో ఆర్డీఓ సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఒక్కరూ రాలేదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. సరైన బలం లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకునేందుకు అవిశ్వాస తీర్మాణం పెడుతోంది. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోబాలకు గురిచేసి, అధికారంతో భయపెట్టి తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే హిందూపురం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. తాజాగా వైస్ చైర్మన్గా ఉన్న జబీవుల్లాను తప్పించి ఆ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేయించింది. వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి 27 మంది మద్దతు తెలపాల్సి ఉండగా..ఉదయం 11 గంటలకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ ఆనంద్ కుమార్ సమావేశాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. ఆ సమయానికి కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కాకపోవడంతో మినిట్స్ నమోదు చేసిన ఆర్డీఓ విషయాన్ని కలెక్టర్కు సమాచారం అందించి వెళ్లిపోయారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైఎస్సార్ సీపీ.. వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ పార్టీ సభ్యులు సమావేశానికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో చతికిలపడ్డ చైర్మన్ రమేష్, టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయానికే పరిమితమయ్యారు. టీడీపీ కుటిల బుద్ధితో అక్రమ మార్గాలలో వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూడటంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు. కాగా సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘పురం’ వైస్ చైర్మన్ పీఠం కోసం దిగజారుడు రాజకీయం బలం లేకపోయినా అవిశ్వాసం నోటీసు ఇచ్చిన టీడీపీ నేతలు అవిశ్వాస తీర్మానానికి సభ్యులంతా గైర్హాజరు కలెక్టర్కు సమాచారం ఇచ్చి వెనుదిరిగిన ఆర్డీఓ -
హంసవాహనంపై దేవదేవుడు
ధర్మవరం అర్బన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి సోమవారం హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు చక్రస్నానం చేయించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులకు పసుపు, కుంకుమతో పాటు వివిధ రకాల రంగులతో వసంతోత్సవం జరిపించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై చెన్నకేశవస్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన నిర్వహించనున్నామని ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. -
నేడు కల్లితండాకు వైఎస్ జగన్
● వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పరామర్శ ● బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో రానున్న వైఎస్సార్ సీపీ అధినేత సాక్షి, పుట్టపర్తి: మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు. రండి.. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిద్దాం ● కార్యకర్తలకు ఉషశ్రీచరణ్ పిలుపు సోమందేపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేస్తున్నారని, పార్టీ శ్రేణులు తరలిరావాలని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె జెడ్పీటీసీ సభ్యుడు అశోక్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఉదయం 11.30 గంటలకు వీర జవాన్ మరళీ నాయక్ నివాసానికి చేరుకుంటారని తెలిపారు. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజక వర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యర్తలు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్లు అంజినాయక్, జిలాన్ఖాన్, ఎంపీటీసీ నాగప్ప, నాయకులు ఆదినారాయణరెడ్డి, జితేంద్ర రెడ్డి, రమేష్, కళ్యాణ్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువుల హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించానన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన పోలీసుల వైఫల్యమే సంబంధం లేని నాపై కేసు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
మాజీ ఎంపీ దరూర్ పుల్లయ్య కన్నుమూత
వజ్రకరూరు/ ఉరవకొండ: వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు దరూర్ పుల్లయ్య (93) కన్నుమూశారు. సోమవారం బళ్లారి సమీపంలోని కంప్లి వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంటి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలు విడిచారు. దరూర్ పుల్లయ్య 1932 జూన్ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు దరూర్ రమేష్, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. మద్రాసులోని లా కళాశాలలో దరూర్ పుల్లయ్య బీఏ, బీఎల్ పూర్తి చేశారు. ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1969 నుంచి 1974 వరకు ఛాయపురం సర్పంచ్గా సేవలందించారు. ఆ తర్వాత ఉరవకొండ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1977, 1980 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్ ఎండీగా, కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గానూ పనిచేశారు. నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన దరూర్ పుల్లయ్య జిల్లాలో తాగు, సాగునీటి కల్పన కోసం కృషి చేశారు. పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి
చిలమత్తూరు: ‘‘ఏదైనా పదవి కావాలంటే ప్రజాభిమానంతో దక్కించుకోవాలి. కానీ ఇలా దిగజారి ప్రవర్తించకూడదు. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి..ఇలా ఒక పార్టీపై గెలిచిన వారిని లాక్కుని వారి ద్వారా పదవులు పొందడం ఏమిటి’’ అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. సోమవారం ఆమె హిందూపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలకు పదవులపై ఇంత పిచ్చి ప్రేమ దేనికని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం మాని... ప్రజాస్వామ్యబద్ధంగా పొందిన పదవులను నిస్సిగ్గుగా దక్కించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పట్టణంలో అభివృద్ధి చూడకుండా నీచమైన పనులకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పీఠం దక్కించుకున్నామని... ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి కూడా దక్కించుకోవాలని చూస్తే తమ ప్రణాళికలు తమకు ఉంటాయన్నారు. తమ పార్టీ కౌన్సిలర్లు కొందరు ప్రలోభాలకు లొంగిపోయారని, కానీ అందరూ అలా ఉండరన్న విషయం ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్తించాలన్నారు. తమ పార్టీలో నిజాయితీ పరులు ఉన్నారన్నారు. ప్రజల అండ, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండ ఉంది కాబట్టే ఈరోజు టీడీపీ కుట్రలనుతిప్పి కొట్టామని వైస్ చైర్మన్ జబీవుల్లా భావోద్వేగంగా మాట్లాడారు. పదవులు తమకు లెక్కకాదని, కానీ టీడీపీ నేతలు తీసుకున్నట్లుగా దొడ్డిదారిలో వచ్చే పదవులు తనకొద్దన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జబీవుల్లా, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వెంకట నాగేంద్రబాబు, షాజియా, గుడ్డం దాదు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కవితారెడ్డి, అబ్దుల్సలాం, శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్పై అవిశ్వాసం ఎలా పెడతారు ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతల తీరుపై టీఎన్ దీపిక మండిపాటు -
వీరుడా.. సెలవిక
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన ముదావత్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తండోపతండాలుగా జనం శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు తరలివచ్చి వీర జవాన్కు అశ్రు నివాళులర్మించారు. జోహార్ మురళీ నాయక్.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు.సాక్షి, పుట్టపర్తి: కశ్మీర్లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మరణించిన అగ్నివీర్ ముదావత్ మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో మురళి నాయక్ భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. శనివారం రాత్రి భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోగా.. అప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తండోపతండాలుగా జనం తరలివచ్చి వీర జవాన్కు అశ్రు నివాళులర్పించారు.జోహార్ మురళి నాయక్.. మురళి నాయక్ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. జై హింద్.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు. తమ ఊరి యువకుడు దేశం కోసం ప్రాణాలర్పించడం ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ.. మరో వైపు తీవ్ర బాధతో ఉన్నామని గ్రామస్తులందరూ భావోద్వేగానికి గురయ్యారు. మురళి నాయక్ కుటుంబ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యవేక్షణలో కల్లి తండాలో ఏర్పాట్లు జరిగాయి. కాగా, అగ్నివీర్ మురళి నాయక్ భౌతిక కాయం వద్ద ఘనంగా సైనిక వందనంతో నివాళులర్మించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈర లక్కప్ప, దీపిక, మక్బుల్ తదితరులు మురళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ వి.రత్న నేతృత్వంలో కల్లి తండాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆస్తి ఇచ్చినా.. ఆనందం లేకపాయెవీరజవాన్ మురళినాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల్లో ఇంటి నిర్మాణం, తండ్రి శ్రీరామ్ నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తన వంతు సాయంగా మరో రూ.25 లక్షలు ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ‘ఆస్తులు ఇచ్చినా.. ఇల్లు కట్టించినా.. అనుభవించేందుకు, ఆనందించేందుకు మా బిడ్డ లేకపాయె కద సారూ.. నా బిడ్డ దేశం కోసం ప్రాణాలొదిలాడని గర్వంగా అందరూ చెబుతున్నా.. కన్నపేగు బాధ ఎవరికి తెలుసయ్యా’ అంటూ మురళినాయక్ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపించారు. తామిక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!
రాయదుర్గం: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి నెల రోజుల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ.. సిబ్బందిని ఆయా పాఠశాలల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని, లేకపోతే ఇతర జీవనోపాధులు చూసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో తమ ఉద్యోగ భద్రత కోసం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 3,243, ప్రాథమికోన్నత 502, ఉన్నత పాఠశాలలు 1,539 ఉన్నాయి. వీటిలో 1,270కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, ఉన్నాయి. వీటన్నింటిలో 2024–25 విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3,57,363 మంది, 9 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 87,897 మంది ఉన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి సెలవుల్లోనే తరగతుల వారీగా అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. ఇందు కోసం తమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించి అడ్మిషన్లు చేయించగలిగితేనే ఉద్యోగాలు ఉంటాయని, లేకపోతే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో రాయదుర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగాలు మానుకున్నారు. భారీగా ఫీజులు.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్ఈ, ఐఐటీ కోచింగ్, అబాకస్, స్ఫోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అదనంగా యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్సులు, టై లాంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరకు విక్రయాలు చేపట్టారు. చాలీచాలని వేతనాలు.. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యాబోధకులకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ జీఓ ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులో 59 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు కేటాయించాలి. కానీ, ఈ విధానం ఎక్కడేగాని అమలు కావడం లేదు. ఎన్నికల ప్రచారంలా ఊరూర క్యాంపెయినింగ్ టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్ఈ పేరుతో విద్యార్థులకు వల చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు తడిసిమోపడవుతున్న ఫీజులుఅడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసాద్బాబు, డీఈఓ, అనంతపురంచర్యలు తీసుకోవాలి అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి, రాయదుర్గం -
సెమీ ఫైనల్కు అనంత, కదిరి జట్లు
అనంతపురం: సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు, దివంగత చంద్రమోహన్ స్మారకార్థం నిర్వహిస్తున్న టోర్నీలో సెమీఫైనల్కు అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు చేరుకున్నాయి. తాడిపత్రి దినేష్ గ్రానైట్స్, అనంతపురం రైజింగ్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దినేష్ గ్రానైట్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంత రైజింగ్ స్టార్ జట్టు 17 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులతో విజయాన్ని కై వసం చేసుకుంది. ● కదిరి, తాడిపత్రి ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో కదిరి జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 62 పరుగులు చేసింది. జట్టులో పి. గిరినాథరెడ్డి 45 పరుగులు , వి.భాను ప్రకాష్ 30 పరుగులు, కె.ప్రశాంత్ 39 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తాడిపత్రి ఎలెవన్ జట్టు 131 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు సెమీఫైనల్కు చేరాయి. మాజీ రంజీ ఆటగాడు షాబుద్దీన్, ఏడీసీఏ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్రెడ్డి, సెక్రెటరీ వి. భీమలింగా రెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకర్ ఉన్నారు. -
పీఆర్సీని ప్రకటించాలి
ధర్మవరం అర్బన్: తక్షణమే 12వ పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, కె.మనోహర్ డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు 30శాతం మద్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004కు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు లక్ష్మయ్య, అమర్నారాయణరెడ్డి, బిల్లే రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు కదిరి టౌన్: ఓం నమో నరసింహ...అంటూ గోవింద నామస్మరణతో ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి జన్మదినం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. ముందుగానే ‘నైరుతి’ అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్రన్ మాన్సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు. -
మురళీనాయక్ ప్రాణత్యాగం వృథా కాదు
గోరంట్ల: పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ ప్రాణత్యాగం వృఽథా కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్తో కలసి ఆదివారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేసిన ఆయన... మురళీనాయక్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరజవాన్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం మురళీనాయక్ చేసిన పోరాటం లక్షలాదిమంది యువతకు స్ఫూర్తినిచ్చిందన్నారు. వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
రేపు కల్లితండాకు వైఎస్ జగన్
● మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.లేపాక్షి అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు లేపాక్షి: పర్యాటక ప్రాంతం లేపాక్షిని రూ.3కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అధికారి పద్మరాణి, ప్రైవేటు కన్సల్టెంట్ అధికారి నిష్టాగోయల్ తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం వారు లేపాక్షిని సందర్శించారు. పర్యాటక అభివృద్ధి కోసం నంది విగ్రహం, థీమ్ పార్కు, జఠాయువు పక్షి, జఠాయువు ఘాట్, బింగిపల్లి వద్ద వున్న చింత తోపు, అక్కడున్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న లేపాక్షి ఎంపోరియం భవనాన్ని కూడా పరిశీలించారు. అనంతరం పాతూరులో పట్టు పురుగుల పెంపకం షెడ్డు, చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రూ. 3 కోట్ల నిధులతో లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో జీవనోపాధులు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బింగిపల్లి వద్దనున్న ప్రభుత్వ భూమిలో అందమైన పార్కులు అభివృద్ధి, పట్టు పురుగు పెంపకం ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు, నిరుపయోగంగా ఉన్న ఎంపోరియం భవనంలో చేతి వృత్తులు నిర్వహించే వారికి స్టాళ్లు ఏర్పాటు చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. అనంతరం వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ ఆదినారాయణతో పాటు డీఆర్డీఏ పీడీ, టూరిజం శాఖ ఇన్చార్జ్ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్, విజయ్, మారుతి, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ వారి వెంట ఉన్నారు. -
సింహ, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి వైభవం
ఉరవకొండ రూరల్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి వారు సింహ, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సింహ, చంద్రప్రభ వాహనాలపై ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించగా.. భక్తులు శ్రీవారిని దర్శించుకుని పరవశించారు. అంతకుముందు లక్ష్మీనృసింహుని జయంతి సందర్భంగా పుష్పాలతో మూలవిరాట్ను అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. నేడు పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. -
ప్రముఖుల నివాళి..
గోరంట్ల: పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని మిలటరీ, ప్రభుత్వ అధికారులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో మిలటరీ వాహనంలో కల్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మురళీనాయక్ భౌతికకాయాన్ని ప్రజల సందర్భనార్థం ఉంచారు. వేలాదిమంది ప్రజలు, బంధుమిత్రులు, గ్రామస్తులతో పాటు అధికారులు, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాయదుర్గం ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, ఎంఎస్ రాజు, కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తదితరులు మురళీనాయక్ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పార్టీ మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్తో పాటు అత్తార్ చాంద్బాషా, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వీరజవాన్కు నివాళులర్పించారు. జవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ను పరామర్శించారు.కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మిస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశ్మీర్కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. వీరజవాన్ మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు భౌతికకాయం సందర్శించేందుకు తరలివచ్చిన ప్రజలు మార్మోగిన జయహో భారత్.. జైహింద్.. మురళి అమర్రహే నినాదాలు ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్నాయక్ ‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి ‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్తో చివరిరోజున మురళీనాయక్ మాటలు ‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ -
టీడీపీ నేతల దౌర్జన్యకాండ
హిందూపురం టౌన్: లేపాక్షి మండలం కోడిపల్లిలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండతో చెలరేగిపోతున్నారని, తరచూ దాడులు చేయడమే కాక అక్రమంగా కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రజియాభాను, బాబాఫకృద్దీన్ దంపతులు ఆరోపించారు. ఆదివారం హిందూపురంలోని ప్రెస్క్లబ్లో కుమారుడు జబీవుల్లాతో కలిసి దంపతులు విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమ కుటుంబంపై ఎంపీటీసీ గంగాధర్, టీడీపీ నాయకులు నాగరాజు, ఆనంద్రెడ్డి, గోపీ తదితరులు కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారన్నారు. నెల క్రితం నాగేపల్లివద్ద ఉన్న అనధికారిక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తమ గ్రామానికి చెందిన సుభాష్, శ్రీకాంత్ అనే వ్యక్తులు ఘర్షణపడ్డారన్నారు. దీన్ని గమనించి తమ రెండవ కుమారుడు దాదా ఖలందర్ ఇద్దరికీ నచ్చచెప్పి గొడవ నివారించాడన్నారు. ఇది టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారని, సుభాష్తో తన కుమారుడు దాదాఖలందర్పై పోలీసులకు ఫిర్యాదు చేయించారన్నారు. పోలీసులు విచారణ చేపట్టకుండా ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న తన కుమారుడిని అరెస్టు చేసి, తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేశారని ఫొటోలతో సహా చూపించి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబ సభ్యులు కానీ, కుమారుడు దాదాఖలందర్ కానీ తప్పు చేసి ఉంటే ఏ శిక్షకై నా సిద్ధమని చెప్పారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. అక్రమ కేసుతో కుమారుడిని జైలుకు పంపారు తమకు రక్షణ కల్పించాలని కోడిపల్లికి చెందిన కుటుంబం వేడుకోలు -
తాగుడులో తగ్గేదేలా..
మందుబాబులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరాయంగా మందు దొరుకుతోంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కోరుకున్న బ్రాండ్ చేతికి చేరుతోంది. ప్రశాంతంగా తాగడానికి.. దోస్తులతో కలిసి విందు చేసుకోవడానికి వైన్షాపుల వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మందు తాగుతూ ముక్క తింటూ ‘స్వర్గం’లో తేలియాడుతున్నారు. కూటమి పాలనలో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు దూసుకుపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ‘మద్యం పురం’గా మారిందన్న విమర్శలున్నాయి. విచ్చలవిడి మద్యం కారణంగా గ్రామాల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మద్యం వినియోగం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మద్యపానం, బెల్టుషాపులు, పర్మిట్ రూములపై ఉక్కుపాదం మోపడంతో మద్యం నియంత్రణలో ఉండేది. కూటమి సర్కారు రాగానే ఎమ్మెల్యేల చేతుల్లోనే మద్యం షాపులు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. ‘సంపద సృష్టిస్తా.. అది పేదలకే పంచుతా’ అని పదే పదే చెప్పే చంద్రబాబు..ఇక్కడ మద్యం ద్వారా పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊపందుకున్న మద్యం విక్రయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయనేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. రెండు జిల్లాల్లో గడిచిన 7 నెలల 25 రోజుల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మారు. ఊరూరా బెల్టుషాపులు, అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములతో మూడు పువ్వులు ఆరుకాయలుగా మద్యం వ్యాపారం జరుగుతోంది. అర్బన్లోనే ఎక్కువ.. తాజా గణాంకాలను చూస్తే పట్టణాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువైంది. కొత్తగా మద్యం వినియోగదారులు పెరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో రూ.646 కోట్ల విలువైన మద్యం వినియోగం కాగా.. అనంతపురం నగరంలోనే రూ.215 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. తాడిపత్రిలో రూ.84 కోట్లు, గుత్తిలో రూ.63 కోట్లు, గుంతకల్లులో రూ. 61 కోట్ల మద్యం వినియోగమైంది. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో రూ.86 కోట్లు, హిందూపురంలో రూ.57 కోట్లు, పెనుకొండలో రూ.61 కోట్లు, కదిరిలో రూ.54 కోట్ల విలువైన మద్యం వినియోగమైంది. ఊరూరా బెల్టుషాపుల కారణంగా మద్యం విచ్చలవిడిగా తాగుతున్నట్టు వెల్లడైంది. మద్యం వినియోగం (లీటర్లలో) బీరు వినియోగం (లీటర్లలో)మద్యం, బీరు వినియోగం విలువరోజుకు మద్యం కోసం చేస్తున్న వ్యయంఅనంతపురం జిల్లాలో మద్యం వ్యయంశ్రీసత్యసాయి జిల్లాలో మద్యం వ్యయం 8 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యయం ఇదీ ఉమ్మడి జిల్లాలో మద్యం వినియోగం రూ.215 కోట్లతో అనంతపురం అగ్రస్థానం రూ.84 కోట్లతో రెండో స్థానంలో తాడిపత్రి -
నేడు ఖాద్రీశుని జయంత్యుత్సవం
కదిరి టౌన్: స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి (స్వాతి నక్షత్రం) ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడి ఒక ప్రకటనలో తెలిపారు. మూలవిరాట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై స్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బత్తలపల్లి: ఆటో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం ఇందుకూరుకు చెందిన బిల్లే సూర్యనారాయణ (52) కుటుంబంతో పాటు ఆదే గ్రామానికి చెందిన తిరుపాల్ ఆటోలో ఇరు కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఉదయం ధర్మవరం చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. అక్కడ తేరు ముగించుకుని గిద్దలూరు అక్కమ్మ జాతరకు వెళ్లాలని ఆటోలో బయల్దేరారు. బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డు శివాలయం వద్దకు రాగానే మలుపులో వేగం అదుపుకాక ఆటో బోల్తాపడింది. కింద పడిన సూర్యనారాయణపై ఆటో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి కాసేపటి తర్వాత మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చాగల్లు రిజర్వాయర్లో వ్యక్తి గల్లంతు
శింగనమల: ఉల్లికల్లు సమీపంలోని చాగలు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లోకి దిగిన ఉల్లికల్లు శ్రీరాములు(48) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఉల్లికల్లుకు చెందిన శ్రీరామలుకు భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు శనివారం మద్యం తాగి చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ టీంను పిలిపించి సాయంత్రం వరకు నీటిలో వెతికించినా శ్రీరాములు జాడ కనిపించలేదు. -
దేశ రక్షణకు ముస్లింలంతా సిద్ధం
హిందూపురం టౌన్: ‘ఆపరేషన్ సిందూర్’కు బాసటగా భారతదేశ రక్షణకు ముస్లింలంతా ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం ఐక్య వేదిక నాయకులు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన ‘ఆపరేషన్ సిందూర్’కు సంఘీభావంగా గోరంట్ల మండలం కళ్లీతండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో సంతాప సభ నిర్వహించారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తానీ తీవ్రవాదుల అమానుష మారణ కాండను ప్రపంచం అసహ్యించుకుంటోందన్నారు. మహమ్మద్ ప్రవక్త యుద్ధ నీతులలో బాటసారులు, వృద్ధులు, పసిపిల్లలు, మహిళలు, చెట్లు, నీటి ఊటలపై దాడి చేయకూడదని సందేశాన్నిస్తే.. పాకిస్తానీ దుర్మార్గులు నిరాయుధులైన టూరిస్టులపై దాడి చేసి మానవత్వాన్ని మంటగలపారన్నారు. మౌలానా అబ్దుల్ మాలిక్, మౌలానా ఉస్మాన్ ఘని తదితరులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత, దేశ అభివృద్ధి కోసం దేశంలోని ముస్లిం సమాజం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశం వైపే ఉంటుందని, ఎలాంటి త్యాగాలకు నైనా ముస్లిం సామాజిక వర్గం సిద్ధమని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సద్భావన సర్కిల్లో జవాన్ మురళీనాయక్ చిత్ర పటానికి అశ్రునివాళి అర్పించారు. కార్యక్రమంలో జామియా మసీదు సభ్యులు బాబా, హ్యూమనిజం అజంతుల్లా ఖాన్, 313 ముజీబ్, హజ్ కమిటీ సభ్యుడు డైమండ్ బాబా, మౌలానా సాజిద్, ఎస్డీపీఐ జిల్లా నాయకులు అంజాద్, ముజ్జు, మైనారిటీ నాయకులు అమానుల్లా పాల్గొన్నారు. -
వీరుడా... విజయోస్తు!
● దేశం కోసం యుద్ధ భూమికి.. కనగానపల్లి: దేశం కోసం ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని యుద్ధభూమికి సాగనంపారు. కుర్లపల్లి తండాకు చెందిన రేఖేనాయక్ బిహార్ సమీపంలోని దేశ సరిహద్దులో ఎస్ఎస్బీ జవాన్గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం 15 రోజులు సెలవులు పెట్టి ఈ మధ్యనే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే భారత్– పాకిస్తాన్ యుద్ధం రావటంతో సెలవులు రద్దు చేసుకొని విధుల్లో చేరాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం ఆ యువకుడు తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరాడు. తల్లిదండ్రులు భీమ్లా నాయక్, నాగలక్ష్మి మాట్లాడుతూ దేశం కోసం కన్నప్రేమను కూడా కాదనుకొని తమ బిడ్డను యుద్ధానికి పంపుతున్నామన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం మా బిడ్డ యుద్ధ భూమికి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇసుకతిన్నెలు పడి రైతు మృతి ఓడీచెరువు : ఇసుకతిన్నెలు పడి రైతు మృతి చెందాడు. దిగువపల్లికి చెందిన జెరిపిటి లక్ష్మీనారాయణ (65) అనే రైతు ఇసుక కోసం శనివారం గ్రామ శివారులోని ఏటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇసుక తవ్వుతుండగా ఉన్నపళంగా తిన్నెలు విరిగిపడటంతో లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయన్ని ద్విచక్రవాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
ఊరూరా ఉద్విఘ్నం
దేశరక్షణలో నేలకొరిగి భరతమాత నుదుటి తిలకమై నిలిచిన వీర జవాన్ మురళీనాయక్కు అనంత ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి కల్లితండా వరకూ వెంటసాగి జోహార్ అగ్నివీరుడా అంటూ నినదించింది. ●వీరసైనికుడు మురళీ నాయక్కు ఘన నివాళి ●స్వగ్రామం చేరుకున్న వీర జవాన్ భౌతికకాయం ●బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు తరలింపు ●దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన నివాళులు ●ఊరూరా వందేమాతరం ఆలపించిన ప్రజలు ●రోడ్డుకు ఇరువైపులా నిలబడి సైనికుడికి సెల్యూట్ చేసిన వైనం ●నేడు కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ●తరలిరానున్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు గోరంట్ల: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్మూకశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వందేమాతరం పాడుతూ మురళీనాయక్కు ఘన నివాళులర్పించారు. ఘొల్లుమన్న కల్లితండా సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా ఇటు విద్యార్థుల ఉన్నతికి, అటు దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమ విద్యను అందస్తూ వస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటివన్నీ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తామన్నారు. విద్యా సంస్థలో ప్లస్–1 (ఇంటర్మీడియెట్)తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్రెడ్డి, బి.సందీప్రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి -
వీర జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్: యుద్ధ భూమిలో శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతూ మురళీ నాయక్ మృత్యుఒడికి చేరడం బాధాకరమన్నారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి
తాడిపత్రి: మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన తాడిపత్రి రూరల్ పరిధిలోని జగనన్న కాలనీలో జరిగింది. సీఐ శివ గంగాధర రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన జయ చంద్రారెడ్డి (45) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం జగనన్న కాలనీలోని ఓ ఇంటి ముందు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయచంద్రారెడ్డిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వైఎస్సార్ కృషితోనే హంద్రీ–నీవా పూర్తి
ఉరవకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే హంద్రీ–నీవా మొదటి దశ పనులు 90 శాతం పూర్తి చేసి జీడిపల్లి వరకు నీటిని తీసుకురాగలిగారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని స్వగృహంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఛాయాపురం వద్ద సీఎం చంద్రబాబు ప్రజావేదిక సాక్షిగా హంద్రీ–నీవాకు సంబంధించి అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ నీటి సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయించారన్నారు. దీనికి సంబందించి టెండర్లు కుడా పూర్తి చేశారని, పనులు ప్రారంభించే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. హంద్రీ–నీవాకు 60 నుంచి 70 టీఎంసీలు రావాలంటే కాలువను క్రమం తప్పకుండా వెడల్పు చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెడల్పు చేస్తాం, రెండో దశ పనుల్లో కాలువకు లైనింగ్ చేస్తామంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమకు సమృద్ధిగా కృష్ణాజలాలు అందాలంటే మొదటి ఫేజ్లో 10వేల క్యూసెక్కులతో కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో లైనింగ్ పనులు చేపట్టే బదులు ఆ నిధులతో కాలువ వెడల్పు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాపై అపారమైన ప్రేమే ఉంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఎయిమ్స్ను మంగళగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీంతో పాటు కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సాంకేతికతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చే మీరు మరీ అమరావతి రాజధాని కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఛాయాపురంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గ్రామంలో భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు రూ.60 వేలు ఇస్తారని చెబుతున్నారని, ఆ గ్రామస్థులతో మాట్లాడి అక్కడి భూములన్నీ కౌలుకు ఇప్పిస్తా ఎకరాకు రూ.60వేలు కచ్చితంగా ఇప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ములేక అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ము లేదు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం -
అంగరంగ వైభవం.. లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. 11రోజులపాటు సాగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది బ్రహ్మ రథోత్సవం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ తేరుబజారుకు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి కొలువుదీరారు. ఉదయం 7 గంటలకు మడుగుతేరు(రథోత్సవం)కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనంతరం రథానికి పూజలు చేసి మడుగుతేరు లాగారు. ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేలాది మంది భక్తులు రథం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం మొదలైంది. తేరుబజార్ నుంచి అంజుమన్ సర్కిల్ వరకు అశేష భక్తజన సందోహం నడుమ రథం ముందుకు కదిలింది. భక్తులు గోవింద నామస్మరణతో పురవీధులు ప్రతిధ్వనించాయి. సాయంత్రం 6గంటలకు ధూళోత్సవం నిర్వహించారు. గోవింద నామస్మరణతో పులకించిన ధర్మవరం అశేష భక్తజన సందోహం నడుమ కదిలిన బ్రహ్మరథంపటిష్ట పోలీసు బందోబస్తు రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో డీఎస్పీ హేమంత్కుమార్, వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, శివరాముడు, శ్యామరావు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జేబుదొంగలున్నారు అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అల్లరి మూకలను చెదరగొడుతూ ఉత్సవం ప్రశాంతంగా సాగేలా చూశారు. -
ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం
● కూటమి సర్కారు తీరుతో అభద్రతలో ఉద్యోగులు ● ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలు అటుంచి ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పీఆర్సీ కమిషన్ నియమించలేదన్నారు. దీంతో ఉద్యోగులకే నష్టమని, పీఆర్సీ బకాయిలు పెండింగ్లో పెడతారన్నారు. 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల దాటితో మరో డీఓ వచ్చి కలుస్తుందని, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారన్నారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు క్రమంలో అప్పటి తహసీల్దారు తాతారావుపై కోర్టు చర్యలు తీసుకుందని, డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పనిచేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఒక నిర్ణయంపై అధికారులు లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామన్నారు. తహసీల్దారు కార్యాలయాల నిర్వహణకు, ప్రోటోకాల్కు రూ. లక్షలు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కోర్టు కేసులకు లీగల్ చార్జీలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో తెల్లకాగితాలు కూడా సొంత డబ్బుతో కొనాల్సి వస్తోందన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు తమ నిర్ణయాలను కిందిస్థాయి అధికారులపై రుద్దుతున్నారన్నారు. రెవెన్యూలోని అన్ని కేడర్లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్రావు, కార్యదర్శి సోమశేఖర్, మహిళ విభాగం చైర్పర్సన్ సురేఖరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప పాల్గొన్నారు. -
దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు
బత్తలపల్లి/కళ్యాణదుర్గం రూరల్: కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల రామ్మోహన్ తన కుటుంబంతో పాటు స్నేహితుడు రాజశేఖర్రెడ్డి (45) కుటుంబ సభ్యులు, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డి (25) మొత్తం పదిమంది కళ్యాణదుర్గం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయల్దేరారు. బత్తలపల్లి సమీపంలోని వై జంక్షన్ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న రామ్మోహన్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు బోల్తా పడింది. రామ్మోహన్, అతని భార్య మాధవి, కుమార్తెలు సాన్విక, జత్విక, కౌటిల్ కుమార్, రాజశేఖర్రెడ్డి, అతని భార్య దీపిక, కుమారుడు యస్విత్రెడ్డి (7), కుమార్తె వీరాధ్యతో పాటు స్నేహితుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్రెడ్డి, యస్విత్రెడ్డి మృతి చెందారు. ప్రశాంత్ కుమార్రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. -
తపన సాహిత్య వేదిక పురస్కార విజేతల ప్రకటన
హిందూపురం: తపన సాహిత్య వేదిక సేవా పురస్కార విజేతలను ప్రకటించారు. శనివారం హిందూపురంలో తపన సాహిత్య వేదిక సమావేశం జరిగింది. వేదిక నిర్వాహకుడు ప్రముఖ రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి మాట్లాడుతూ కథా పురస్కారం కోసం 2024వ ఏడాదిలో అచ్చయిన కథా సంపుటాలను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల తెలుగు రచయితలు 50కి పైగా కథా సంపుటాలను పంపించారన్నారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’ పుస్తకం రూ.10వేల నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా స్వర్ణకిలారి రాసిన నల్లబంగారం అనే కథల సంపుటికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పార్వతీ పురం గండేట గౌరునాయుడు, హైదరాబాద్ డాక్టర్ దేవేంద్రలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎయిడ్స్పై విస్తృత పరిశోధనలు చేసి ప్రజావైద్యుడుగా పేరుపొందిన కాకినాడ డాక్టర్ యనమదల మురళీకృష్ణకు సేవా పురస్కరాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రచయితలు సిద్దగిరి శ్రీనివాస్, ఆంధ్రరత్న గంగాధర్, డాక్టర్ అశ్వత్థ నారాయణ, యువకవి గంగాధర్, విశ్రాంత ప్రిన్సిపాల్ గంగిరెడ్ది, ఎన్.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నాం: డీఐఓ మౌల పుట్టపర్తి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి (డీఐఓ) సయ్యద్మౌల తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. 19వ తేదీ వరకూ రోజూ ఉదయం 9 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రెండు ఫ్లయింగ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ మెంబర్లుగా రామరాజు, చెన్నకేశవప్రసాద్, శ్రీనివాసులను నియమించామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. 9 రకాల పాఠశాల విధానానికి వ్యతిరేకం పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల పాఠశాల విధానానికి ఏపీటీఎఫ్ వ్యతిరేకమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శనివారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 9 రకాల పాఠశాల విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ 1 నుంచి 5 వ తరగతి వరకు కొనసాగించాలన్నారు. జీఓ 117ను రద్దు చేస్తామని చెప్పి ఇంత వరకూ రద్దు చేయకుండా రకరకాల సమీక్షలు చేస్తూ విద్యాశాఖతో ఆడుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నత పాఠశాలను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇంత వరకూ పీఆర్సీ కమిటీని నియమించలేదన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మాధవ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలు, సబ్ కమిటీ మెంబర్లు నారాయణ, నాగరాజు, సుధాకరరెడ్డి, రఫీ, మండల ప్రధాన కార్యదర్శులు సాయిశివ, వెంకటనాయుడు, హరిప్రసాద్, వెంకటరమణనాయక్, ఈశ్వరప్ప, సేవేనాయక్, చంద్రమౌళి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. బాలుడిని మింగిన స్విమ్మింగ్పూల్ ధర్మవరం అర్బన్: ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్పూల్లోకి దిగిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పోతరాయి గ్రామానికి చెందిన సంజీవనాయుడు, శారద దంపతుల కుమారుడు నందీశ్వర్నాయుడు (9) ధర్మవరంలో తేరు ఉందని గీతానగర్లో ఉంటున్న బాబాయి కృష్ణ ఇంటికి రెండురోజుల క్రితం వచ్చాడు. తేరు చూసిన తర్వాత శనివారం మధ్యాహ్నం జీవానంద పాఠశాల సమీపంలోని రేగాటిపల్లి రోడ్డులోనున్న స్విమ్మింగ్ పూల్కు ఈత కోసం బాబాయితోపాటు నందీశ్వర్నాయుడు వెళ్లాడు. నీటిలో ఆడుకుంటున్న నందీశ్వర్నాయుడు ఉన్నట్టుండి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలోకి దిగి నీట మునిగాడు. స్థానికులు గమనించి వెంటనే బాలుడిని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నందీశ్వర్నాయుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
శ్రీసత్యసాయి జిల్లా: జమ్మూకశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు నిర్వహించారు.కాగా, జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వం దేమాతరం పాడుతూ మురళీనాయక్కు ఘన నివాళులర్పించారు.సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది.‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇవాళ(ఆదివారం) అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించారు. -
రూటు మార్చిన కేటుగాళ్లు
ఈనెల 8న సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాక్షి, పుట్టపర్తి : ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సత్యసాయి జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. పెరిగిన సైబర్ నేరాలు హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. అధికారులపైనే ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు.అప్రమత్తత అవసరంసైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ద్వారా వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే షేర్ చేయరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించాల్సిన అవసరం లేదు. అధికారులపై ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రజల సహకారంతోనే సైబర్ నేరాల కట్టడి సాధ్యం. – వి.రత్న, జిల్లా ఎస్పీ -
వీర సైనికా.. మా గుండెల్లోనే ఉంటావిక
గోరంట్ల: జమ్మూ కాశ్మీర్లో పాక్తో పోరాటంలో మరణించిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయం శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరుకుంది. నాయక్ భౌతికకాయం శనివారం కాశ్మీరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్పోర్టులో సైనిక అధికారులు, సిబ్బంది ఘన నివాళులరి్పంచారు. రాష్ట్ర మంత్రి సవిత ప్రభుత్వం తరఫున నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఆర్మీ కాన్వాయ్లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి తీసుకొచ్చారు.దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమర వీరుడికి జోహార్లు అరి్పంచారు. దీంతో 44వ నంబరు జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బాగేపల్లి టోల్ప్లాజా తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు వేలాదిగా జాతీయ రహదారిపైకి చేరుకుని వీరజవాన్కు ఘన నివాళులరి్పంచారు. వందేమాతరం, జై జవాన్ నినాదాలు మిన్నంటాయి. భారీ జనం రావడంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి చాలా సమయం పట్టింది. కర్ణాటక సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించగానే.. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు వద్ద జవాన్ భౌతికకాయం ఉన్న వాహనంపైకి పూలవర్షం కురిపించారు. మురళి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జనం కంటతడి పెట్టారు. కోడూరు థామస్ మన్రో తోపు, గుమ్మయ్యగారిపల్లి క్రాస్ మీదుగా స్వగ్రామం కల్లి తండాకు భౌతిక కాయం చేరుకుంది. స్వగ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం మురళీ నాయక్ భౌతిక కాయం చేరుకోవడంతో స్వగ్రామం కల్లితండాలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రజలు జవాన్ భౌతికకాయానికి కన్నీటితో స్వాగతం పలికారు. వీరజవాన్కు నివాళులరి్పంచడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అధికారులు, నాయకులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మురళి అమర్ రహే అంటూ నినదించారు. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. నేడు అంత్యక్రియలు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
యంత్రం తగిలి వృద్ధుడి మృతి
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామంలో అజాక్స్ యంత్రం తగిలి వి.వేమన్న గౌడ్ (75) మృతిచెందాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. వివరాలు.. జీనులకుంటలోని ప్రాథమిక పాఠశాల వద్ద సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజాక్స్ యంత్రంలో కంకర, సిమెంట్ వేసి కలుపుతుండగా వెనుక వైపున ఉన్న వేమన్న ఎడమకాలుకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అందేలోపు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చేపల వేటకు వెళ్లి.. లింగాల: కదిరి మండలం చెలంకూరుపల్లికి చెందిన బెల్లం హైదర్వలి (58) వైఎస్సార్ జిల్లా లింగాల మండలం కామసముద్రం గ్రామంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయన శుక్రవారం కామసముద్రం గ్రామ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువు గట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు నీటిలోకి పడిన హైదర్వలికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. బైక్పై నుంచి జారి పడి.. అగళి: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం మధూడి గ్రామానికి చెందిన సిద్ధగంగమ్మ (48)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భర్త తిప్పేస్వామితో పాటు కుమారుడు మంజునాథ్ మృతి చెందారు. కుమార్తె కాంచనకు పెళ్లి చేయడంతో ఆమె బెంగళూరులో స్థిరపడి ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తోంది. గ్రామంలోనే సిద్ధగంగమ్మ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం నరసంబూధి గ్రామంలో తోటలో పూలు విడిపించేందుకు వెళ్లిన ఆమె పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో పిల్లి అడ్డుగా రావడంతో వాహనం అదుపు తిప్ప కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను కర్ణాటకలోని శిరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై అగళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నరసింహమూర్తి హిందూపురం టౌన్: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హిందూపురానికి చెందిన నరసింహమూర్తి ఎన్నికయ్యారు. శుక్రవారం పుట్టపర్తిలో జరిగిన సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు సాగిస్తామని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర కదిరి అర్బన్: ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర ఎన్నికయ్యారు.తన నియామకానికి సహకరించిన ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళల ధర్నా గుడిబండ: మండల పరిధిలోని రాళ్లపల్లి హరిజన కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలంటూ గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. లో ఓల్జేజ్ సమస్య కారణంగా రోజూ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.సమస్య పరిష్కారానికి అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. డీఎస్సీకి ఆన్లైన్ శిక్షణ లేపాక్షి: త్వరలో జరిగే డీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాఽధికారిత అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన జిల్లా వాసులు మాత్రమే అర్హులు. టెట్ మార్కుల పత్రం, నెటివిటీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, రెండు ఫొటోలు జతపరిచిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 93921 41545లో సంప్రదించవచ్చు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
● ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు చిలమత్తూరు: ప్రజాస్వామ్యంలో పత్రికలది కీలక భూమికని, ఎన్నో కష్టాలకోర్చి ప్రజా సమస్యలపై పోరాడే పాత్రికేయరంగంపై కక్ష సాధింపు చర్యలు ఒక విధంగా ప్రజాస్వామ్యానికి పెనుముప్పగా భావించాల్సి వస్తుందని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు అన్నారు. పాత్రికేయులు, ఎడిటర్లపై దాడులు, కేసులు అప్రజాస్వామికమన్నారు. ఇది దేశ భవిష్యత్కు ప్రమాదకరమన్నారు. ఎలాంటి వారెంట్ లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసుల తీరును ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో ఇలాంటి చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు ● వాహనాల స్పెషల్ డ్రైవ్లో ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ రత్న హెచ్చరించారు. గురువారం రాత్రి 10గంటల సమయంలో ఎస్పీ స్వయంగా ధర్మవరం – కోడూరు ప్రధాన రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి. ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణ, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పెండింగ్ చలానాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సురేష్, ఎస్ఐ లింగన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధన సహాయకుల జీవితాలతో ఆడుకోవద్దు
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు నియమితులైన ఇంధన సహాయకుల జీవితాలు కూటమి ప్రభుత్వ తీరుతో ఆగమ్యగోచరంగా మారాయని ఆంఽధ్రప్రదేశ్ వార్డు, గ్రామ సచివాలయాల ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లగమ్మి రాజు మండిపడ్డారు. శుక్రవారం ఆ సంఘం జిల్లా నాయకులతో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయాల్లోని అన్ని శాఖలకు సంబంఽధించి మార్పులు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు నిర్ధిష్టమైన చానల్ కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. విధి నిర్వహణలో భాగంగా గడిచిన 5 ఏళ్లలో 140 మంది ఇంధన సహాయకులు మృత్యువాత పడ్డారన్నారు. 250 మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలూ ఉన్నాయన్నారు. ఇంధన సహాయకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ఇంధన సహాయకులకు న్యాయం చేకూరకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, సుధీర్, పవన్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, డీఏ ప్రకటించకపోవడం, డీఏ, పీఆర్సీ ఆరియర్లపై స్పష్టత లేకపోవడం, మధ్యంతర భృతి ఊసేత్తకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఫలితం మరో విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష, జిల్లా చైర్మన్ దివాకర్రావు, ప్రధాన కార్యదర్శి పీఎస్ఖాన్, మహిళ విభాగం జిల్లా చైర్మన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణజ్యోతి, జిల్లా నాయకులు, శ్రీసత్యసాయి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు -
స్కీమ్లో స్కాం లేకపోతే ఉలుకెందుకు?
పెనుకొండ రూరల్: కుటు శిక్షణ స్కీమ్లో స్కామ్ లేకపోతే ఉలుకెందుకని మంత్రి సవితను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి సవితకు లేదన్నారు. శుక్రవారం ఉధయం నాగళూరులో కాఫీ విత్ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుట్టు శిక్షణ మొత్తం ప్రక్రియ ఓ పెద్ద స్కామ్ అన్నారు. ఇందులో స్కాం జరగకపోతే మహిళలకు కుట్టు మిషన్ కిట్టు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. రోజూ ఎనిమిది గంటల శిక్షణ అంటూ నాలుగు గంటలకే ఎందుకు కుదించారన్నారు. శిక్షణా కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. మంత్రి సవిత సవాల్ను తాము స్వీకరిస్తున్నామని, దమ్ముంటే బీసీ సంక్షేమ శాఖ మాజీ మంత్రి మాలగుండ్ల శంకరన్న సమక్షంలోనే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేధిక, టైం నిర్ధారణ మంత్రి సవితనే చెప్పాలన్నారు. బీసీ సాధికారిత ప్రభుత్వంగా చెప్పుకునే మంత్రి ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా బీసీలకు ఇచ్చిన 50 ఏళ్లకే పింఛన్ ఏమైందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం ఊసే లేదన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీ మహిళకు రూ.18వేల అందించి, జీవనోపాధులు మెరుగు పరిచిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే సొంతమన్నారు. అక్రమంగా మైనింగ్, క్రషర్లు నడుపుతూ వ్యాపారులను పెనుకొండలోకి రాకుండా అడ్డుకున్న నీచ చరిత్ర మంత్రి సవితదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, నరసింహులు, మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంతరెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, వైశాలి జయశంకరరెడ్డి, కొండలరాయుడు, గోపాలరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. సవాల్ను స్వీకరిస్తున్నాం దమ్ముంటే బహిరంగ చర్చకు రండి వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి సవితకు లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ -
బస్సు బోల్తా –15 మందికి గాయాలు
గోరంట్ల: మండలంలోని మిషన్తండా సమీపంలో జాతీయ రహాదారిపై శుక్రవారం రాత్రి కియా అనుబంధ పరిశ్రమ హూయంగ్కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులందరూ ఓడిసీ మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పుట్టపర్తి టౌన్: స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టపర్తికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎమ్ఎస్రాజు, కందికుంట ప్రసాద్, సత్యసాయి ట్రస్టు ప్రతినిధి చలం, కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక హెలీక్యాఫ్టర్లో ఉరవకొండకు బయలుదేరి వెళ్లారు. దళిత రైతుల పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం అనంతపురం: జిల్లాలోని దళిత రైతుల పురోగతికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నిర్వహణను జేఎన్టీయూ(ఏ) దక్కించుకుంది. డిపార్ట్మెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీకి చెందిన సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్) విభాగం ద్వారా అమలవుతున్న ఎస్సీ (షెడ్యూల్ కాస్ట్) హబ్ కింద రూ.47,62,047 నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్ను జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్రెడ్డి, కెమికల్ విభాగం ప్రొఫెసర్ బి.దిలీప్కుమార్, ఎలక్ట్రికల్ విభాగం డాక్టర్ జి. మమత నిర్వహించనున్నారు. మూడేళ్ల గడువున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేరుశనగ ద్వారా నూనె, స్నాక్స్, టమాట ద్వారా సాస్, డ్రై టమాట వంటి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రైతులకు మార్కెట్ లింకేజీలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తుల బ్రాండింగ్ వంటి అంశాలపై మద్దతునివ్వనున్నారు. ప్రత్యేకంగా దళిత రైతులకు నైపుణ్య శిక్షణా శిబిరాలు, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, మార్కెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా పరిశోధక బృందాన్ని శుక్రవారం జేఎన్టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు అభినందించారు. -
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు
ఉరవకొండ/ వజ్రకరూరు: ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూసిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాశపరిచింది. శుక్రవారం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంపదను సృష్టించి జిల్లాను అభివృద్ధి చేస్తానని, ఇంట్లో ఎక్కువమంది పిల్లలను కని జనాభా పెంచేలా చూడాలని చెప్పడం తప్ప హామీల అమలుపై సీఎం తన ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. తల్లికి వందనం పథకం త్వరలోనే అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం వాటా ఇచ్చిన రోజే రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారని కొందరు మహిళలు అడిగితే.. సీఎం సమాధానం ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన సూపర్ సిక్స్, తదితర పథకాల గురించి మాట్లాడకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రజావేదికలోకి పోలీసులు ఉదయం 9 గంటలకే ప్రజలను అనుమతించడంతో ఎండ తీవ్రతకు కూర్చోలేక అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన వారికి సరిపడు తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తాం జీడిపల్లి భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని, 34, 36 ప్యాకేజీ పనులు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు. మెగా డ్రిప్ ఇరిగేషన్ కింద 40వేల ఎకరాలకు జీడిపల్లి ద్వారా నీరు అందించి పథకాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఉరవకొండకు టెక్స్టైల్ పార్కు, రామసాగరం వంతెన మంజూరు చేస్తామన్నారు. జీడిపల్లి, బీటీపీ పనులకు కూడా ప్రాధ్యానత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ఛాయాపురంలో కూడా సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ్శర్మ, ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జీఓ 77ను రద్దు చేయకుండా జిల్లాలోకి అడుగుపెట్టనీయబోమని ఏబీవీపీ నాయకులు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో వజ్రకరూరు సమీపంలో సీఎం డౌన్ డౌన్, జీఓ 77ను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తు సీఎం సభ వద్దకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చిన్నహోతురు వద్ద అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 77ను రద్దు చేసి ప్రతి విద్యార్థికీ స్కాలర్షిప్ అందిస్తామని హమీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ రద్దు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతి విద్యార్థికీ ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుధీర్, నిఖిల్, తేజ, భూతరాజు తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అమలుపై స్పష్టత ఇవ్వని సీఎం చంద్రబాబు -
మురళీనాయక్ పోరాటం చిరస్మరణీయం
● కలెక్టరేట్లో ఘన నివాళులర్పించిన జిల్లా యంత్రాంగం ప్రశాంతి నిలయం: భారత్– పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ టీఎస్ చేతన్ కీర్తించారు. శుక్రవారం కలెక్టరేట్లో వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొన్న మురళీనాయక్ శత్రువులను తుదముట్టించి వీరమరణం పొందారన్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు యూవత్ దేశం గర్విస్తోందన్నారు. అనంతరం మురళీనాయక్ ఆత్మకు శాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీరుడికి మరణం లేదు: ఎస్పీపుట్టపర్తి టౌన్/గోరంట్ల: వీరుడికి మరణం లేదని, దేశ రక్షణలో అసువులు బాసిన మురళీనాయక్ కూడా అమరుడని ఎస్పీ రత్న కీర్తించారు. దేశ కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ యావత్ దేశానికి గర్వకారణమన్నారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని కల్లితండాకు చేరుకొని మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జోతిబాయిలను పరామర్శించారు. సిబ్బందితో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. -
13న కల్లితండాకు వైఎస్ జగన్
● వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం రొద్దం: దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న కల్లితండాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని కంబాలపల్లిలో పర్యటించారు. అంతకుముందు కల్లితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన కల్లితండా వాసి మురళీ నాయక్ కుటుంబీకులను ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారన్నారు. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వయంగా వస్తున్నట్లు వెల్లడించారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ అనంతపురం కార్పొరేషన్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మాతృభూమి కోసం మురళీనాయక్ ప్రాణత్యాగం చేశారన్నారు. చిన్న వయసులోనే మృతి చెందడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రధానంగా మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ●దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ ●కన్నీటిసంద్రమైన స్వగ్రామం కల్లితండా ●అతని జ్ఞాపకాలు తలచుకుని రోదిస్తున్న స్నేహితులు ●ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన.. ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబొట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. దేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండా నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండా సలాం సైనిక సోమందేపల్లిలో విద్యాభ్యాసం -
రూటు మార్చిన కేటుగాళ్లు
● ఈనెల 8న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.● రెండు నెలల క్రితం పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద పేరుతో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తోన్న డాక్టర్కు ఫోన్ కాల్ వచ్చింది. పన్ను బకాయిలు చాలా ఉందని, ఈ రోజు లోపు ఎంతోకొంత అందజేస్తే.. మాఫీ అయ్యే అవకాశం ఉందని నమ్మబలికి ఫోన్ పే నంబరు కూడా చెప్పారు. అయితే డాక్టర్ తెలివిగా వ్యవహరించి.. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఆ ఫోన్ నంబరు స్విచాఫ్ వచ్చింది.● ఆరు నెలల క్రితం నల్లమాడ మెయిన్ రోడ్డులోని ఓ బేకరీలోకి వెళ్లిన అగంతకుడు.. తాను ఫుడ్ సేఫ్టీ అధికారినంటూ హడావుడి చేశాడు. బేకరీపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ దబాయించాడు. రూ.10 వేలు ఇస్తే తనిఖీలు చేయకుండా వెళ్తామని చెప్పాడు. వ్యాపారి బతిమాలడంతో రూ.5 వేలు తీసుకుని ఉడాయించాడు. ఆ తర్వాత అతడు నకిలీ అధికారి అని తేలడంతో బేకరీ నిర్వాహకులు లబోదిబోమన్నారు.సాక్షి, పుట్టపర్తి ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. తాము మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. పెరిగిన సైబర్ నేరాలు జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వారందరూ నకిలీ అధికారులని తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అధికారులపైనే ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల్లో ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అధికారుల పేరుతో డబ్బు వసూలు జిల్లాలో నకిలీ అధికారుల హల్చల్ పన్నుల పేరిట ఆన్లైన్లో దందా ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో చిల్లర రాబడుతున్న వైనం -
ముగిసిన గ్రూప్–1 మెయిన్స్
● రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ● 594 మంది అభ్యర్థులకు 381 మంది హాజరు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 3న ప్రారంభమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల హాజరు 64.28 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పీవీకేకే కళాశాలలో 234 మంది, శ్రీ బాలాజీ కళాశాలలో 360 మంది..మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 381 మంది హాజరయ్యారు. పరీక్షల తీరును కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పరిశీలించారు. పరీక్షలకు లైజన్ అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు వ్యవహరించారు. ‘పరివాహన్’లోనే ట్రాలీల రిజిస్ట్రేషన్ అనంతపురం సెంట్రల్: ట్రాక్టర్ ట్రాలీల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ‘పరివాహన్’ వైబ్సైట్లోనే జరుగుతాయని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) ఎం.వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ–ప్రగతి సైట్లో రిజిస్ట్రేషన్లు జరిగేవని, కొద్దిరోజులుగా ఇందులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణాశాఖలో ప్రతి సేవా ఆన్లైన్లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని ట్రాలీల తయారీ డీలర్లు గమనించి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరుడైన ఆర్మీ జవాన్ మురళీనాయక్ను తలచుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా బోరున విలపిస్తోంది. అతని స్వగ్రామం కల్లితండా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. జమ్మూకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ మురళీనాయక్ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలియగానే ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు మురళీనాయక్తో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కల్లితండాకు వెళ్లి మురళీనాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కల్లితండా.. కన్నీటి సంద్రం అమరుడైన బిడ్డను తలచుకుని కన్నీరుమున్నీరైన తండావాసులు గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. సలాం సైనికసైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబోట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం సోమందేపల్లిలో విద్యాభ్యాసం సోమందేపల్లి: వీర మరణం పొందిన మురళీ నాయక్ పదో తరగతి వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లగా.. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. 2016–17 టెన్త్ బ్యాచ్కు చెందిన మురళీ నాయక్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. మురళీ నాయక్ మృతి విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునతో పాటు అతని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ మురళీనాయక్ రాణించేవాడన్నారు. తమ తండా యువకుడు దేశం కోసం ప్రాణాలరి్పంచడం గర్వంగా ఉందని నాగినాయనిచెరువు తండా సర్పంచ్ అంజినాయక్, గ్రామస్తులు చెబుతున్నారు. నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండాదేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండాసైన్యంలో ఒక్కరోజున్నా చాలు నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా. బోర్డర్లో పనిచేయడం నా కల. ఒక్కరోజు పనిచేసినా చాలు. దేశం కోసం చావనైనా చస్తా. నా శవంపై భారత జెండా కప్పాలి. – స్నేహితులు, సన్నిహితులతో మురళీనాయక్ చెప్పిన మాటలివీ..దేశభక్తి ఎక్కువగా ఉండేది మురళి నాయక్ నాకు మంచి మిత్రుడు. చాలా దేశభక్తి ఉండేది. పోలీసు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని తపన ఉండేది. వీర మరణం పొందడం గర్వకారణంగా ఉంది. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధ కల్గిస్తోంది. – చిరంజీవి, సోమందేపల్లిక్రమశిక్షణతో చదివేవాడు మురళీ నాయక్ పదో తరగతి వరకూ మా పాఠశాలలో చదివాడు. చాలా క్రమశిక్షణతో చదువుకునే వాడు. ఎటువంటి వివాదాలు లేని విద్యారి్ధ, దేశ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. మా పాఠశాలలో చదివి దేశం కోసం ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉంది. – మల్లికార్జున, కరస్పాండెంట్ , విజ్ఞాన్ స్కూల్, సోమందేపల్లి -
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
ఈ నెల 13న కళ్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామ్నగర్కు చెందిన అన్నం వెంకటనారాయణ (80) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు నేత్రదానానికి అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్, విజయ్భాస్కర్రెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు మృతుని నేత్రాలను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారులు అన్నం లోకేష్, సోమశేఖర్, మనవడు అనంతసాగర్లకు సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షుడు గాజుల సురేష్, వైస్ ప్రెసిడెంట్ టి.చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీజీ హట్టిలో మళ్లీ అతిసారం కేసులు ● 9 మందికి చికిత్స అందిస్తున్న వైద్యులు రొళ్ల: మండల పరిధిలోని జీజీ హట్టి గ్రామంలో అతిసారం అదుపులోకి రావడం లేదు. ఐదు రోజులుగా దాదాపు 35 మంది అస్వస్థతకు గురవగా.. అమూల్య (11) మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. గురువారం కూడా చిన్నారులు దర్శన్, వందన, దొడ్డపూజారప్ప గారి మారన్న, కాడమ్మతో పాటు ఈరమ్మ, అశ్విని, భాగ్యమ్మ, లోకేష్, చిక్కీరప్ప అతిసారం బారిన పడ్డారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్న కూడా అతిసార మాత్రం తగ్గుముఖం పట్టలేదు. చిక్కీరప్ప హిందూపురం, ఈరమ్మను మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్శన్, వందన, దొడ్డపూజారప్ప గారి మారన్న, కాడమ్మతో పాటు అశ్విని, లోకేష్ రొళ్ల సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాణి, డీఐఓ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్లు హర్షమిత్ర, సౌందర్య, ఎఫడామాలజిస్ట్ బాలాజీ తదితరులు గ్రామంలో పర్యటించి పలు సూచనలు చేశారు. నీటి సంపులు, డ్రమ్ములో నిల్వ ఉంచిన నీటిని శుభ్రం చేసుకోవాలన్నారు. అతిసార వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలియజేశారు. -
బీసీ మహిళల స్కీంలో మంత్రి సవిత స్కాం
చిలమత్తూరు: బీసీ సంక్షేమశాఖామంత్రి సవిత మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని బీసీ మహిళలను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డితో పాటు నాయకులతో కలిసి హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీపిక మాట్లాడుతూ కుట్టు మిషన్ల పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి సవిత ఉమ్మడిగా మహిళలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు. స్కీం బడ్జెట్ అమాంతం పెంచి సుమారు రూ. 150 కోట్లు నొక్కేసేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించగా 65 కంపెనీలు బిడ్ వేశాయని అయితే ఇందులో 56 సంస్థలను ముందుగానే తిరస్కరించి రాజకీయానికి తెరతీశారన్నారు. మిగిలిన 9 సంస్థల్లో టెండర్లు తెరవకముందే ఆరింటిని తొలగించి చివరకు మూడు కంపెనీలు మిగిలేలా చేశారన్నారు. వాటిలో హైదరాబాద్కు చెందిన శ్రీటెక్నాలజీస్ వారు రూ. 21,798 తక్కువ కోట్ చేసి ఎల్1 గా నిలవగా, ఎల్ 2, ఎల్3 గా హైదరాబాద్కు చెందిన మరో రెండు సంస్థలు నిలిచాయన్నారు. అయితే ఎల్1కి కేవలం 5 శాతం పని మాత్రమే అప్పజెప్పి మిగిలిన రెండు సిండికేట్ కంపెనీలకు 95 శాతం పనులు అప్పగించారన్నారు. మార్చి 8న పథకాన్ని ప్రకటించగా 90 రోజులు శిక్షణ కాలంలో ఇప్పటికే 50 రోజులు పూర్తి కావొచ్చినా నామమాత్రంగా శిక్షణ ఇచ్చి మొత్తానికే ఎసరు పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మహే ష్గౌడ్, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, నిస్సార్ అహ్మద్, శివశంకర్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రూ.76 కోట్లతో ముగిసే స్కీంను రూ.257 కోట్లకు పెంచి అవినీతి మంత్రి సవితపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆగ్రహం -
ఎయిడ్స్ నియంత్రణకు కళాజాత బృందాలు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కళాజాత బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పేర్కొన్నారు. గురువారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కళాజాత బృందాల కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. డీఎల్ఏటీఓ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో గురువారం నుంచి 29 వరకూ సుమారు 20 రోజుల పాటు వీధి నాటకాలు ఏర్పాటు చేసి ఎయిడ్స్, హెచ్ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువు నెహ్రూ కూడలిలో కళాజాత బృందం నాటకాన్ని ప్రదర్శించింది. ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు గుడిబండ: మండల పరిధిలోని కొంకల్లు గ్రామంలో కారేళప్ప అనే వ్యక్తి ఎలుగు బంటి దాడిలో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే .. గురువారం ఉదయం కారేళప్ప బహిర్భూమి కోసం బయటకు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో నుంచి ఆహారం వెతుక్కుంటూ ఓ ఎలుగుబంటి ఊరి వైపు వచ్చింది. ఈ సమయంలోనే కారేళప్పపై ఎలుగుబంటి దాడి చేసింది. వెంటనే కారేళప్ప కేకలు వేయడంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. గాయపడిన కారేళప్పను కుటుంబ సభ్యులు గుడిబండ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. రూ.5 లక్షలు ఇవ్వు .. లేదా ఊరు విడిచి వెళ్లిపో ● కిరాణా వ్యాపారిని బెదిరించిన బీజేపీ నాయకులు ధర్మవరం అర్బన్: ‘‘మాకు రూ.5 లక్షలు ఇవ్వాలి. లేకపోతే ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలి’’ అంటూ ఓ కిరాణా వ్యాపారిని బెదిరించిన బీజేపీ నేతలు... చివరకు కిరాణా షాపులోకి చొరబడి రూ.3 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని సాయినగర్కు చెందిన కిరాణా వ్యాపారి వెంకటరమణ దుకాణం వద్దకు గురువారం బీజేపీ నాయకుడు సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి అనుచరులు భాస్కర్రెడ్డి, లచ్చి వచ్చారు. తమకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదే సమయంలో సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి కూడా ఫోన్ చేసి వ్యాపారిని బెదిరించారు. అయినా వ్యాపారి లెక్కచేయకపోవడంతో భాస్కర్రెడ్డి, లచ్చి... కిరాణ దుకాణంలో చొరబడి రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వెంకటరమణ ధర్మవరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బీజీపీ నాయకుడు సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి, అతని అనుచరులు భాస్కర్రెడ్డి, లచ్చిలపై కేసు నమోదు చేశామని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. పనులు సత్వరమే పూర్తి చేయండి ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్ హెచ్ 342, ఎన్హెచ్ 716జీ జాతీయ రహదారులు, భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నాటికి జాతీయ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రమయంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజర్ (ఏఎస్ఎల్) ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న అధికారులకు ఆదేశించారు. గురువారం స్థానిక విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించేందుకు సీఎం వస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 10.50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. విమానాశ్రయం నుంచి 10.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉరవకొండకు బయలుదేరి వెళ్తారని తెలిపారు. పర్యటన ముగించుకొని తిరిగి సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారన్నారు. భద్రత విషయంలో లోటుపాట్లు లేకుండా అధికారులందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. డీఎస్పీలు విజయకుమార్, నరశింగప్ప, శివన్నారాయణస్వామి, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్కుమార్, ఆర్ఐలు మహేష్, వలితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు.. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కదిరి, ముదిగుబ్బ నుంచి వచ్చే వాహనాలు కర్ణాటక నాగేపల్లి, గణేష్ సర్కిల్ నుంచి బ్రాహ్మణపల్లి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీదుగా ,అలాగే కమ్మవారిపల్లి నుంచి వచ్చే వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తచెరువు,గోరంట్ల మీదుగా వచ్చే వాహనాలు మామిళ్లకుంట క్రాస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీడుపల్లి, క్రాస్, బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి చిత్రా వతి బైపాస్ మీదుగా వాహనాలు మళ్లించనున్నారు. -
వైభవంగా పల్లకీ ఉత్సవం
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పల్లకీలో కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో చెన్నకేశవునికి అడుగడుగునా భక్తులు హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నకేశవులు జ్ఞాపకార్థం కుమారుడు ప్రసాద్, సోలిగాళ్ల బాలకృష్ణ జ్ఞాపకార్థం సోలిగాళ్ల వెంకటేషు ఉభయదాతలుగా వ్యవహరించారు. -
ప్రజల గొంతుకను నొక్కుతారా?
సోదాలు హేయం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం సరికాదు. పత్రికల్లో వచ్చిన వార్తలపై పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పాత్రికేయుల నైతిక బలాన్ని హరించడమే. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు చేయడం హేయం. ప్రజాస్వామ్య వాదులందరూ కూటమి ప్రభుత్వ చర్యలు ఖండించాలి. – ఆదినారాయణ, జాప్ జిల్లా అధ్యక్షుడు మీడియా స్వేచ్ఛను హరిస్తారా? నిబంధనలు పాటించకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి భయబ్రాంతులకు గురి చేయడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇది మీడియాకు గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్యవాదులు మీడియా స్వేచ్ఛను కోరుకునే వారు సోదాలను ఖండించాలి. – పుల్లయ్య, ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు సాక్షిబృందం: కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు కనిపిస్తే చాలు తట్టుకోలేకపోతున్నారు. కక్షసాధింపులకు దిగుతూ జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నోటీసులు లేకపోయినా సోదాల పేరుతో పోలీసులు గురువారం ఉదయం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించేలా వ్యవహరించిన ప్రభుత్వ తీరును జర్నలిస్టు సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. -
‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేపట్టొద్దు’ అని యావత్తు ఉమ్మడి జిల్లా రైతాంగం ముక్త కంఠంతో నినదిస్తున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రోడ్లెక్కి ఆందోళనలు చ
ఆత్మకూరు సమీపంలో జరుగుతున్న హంద్రీ–నీవా లైనింగ్ పనులు అనంతపురం సెంట్రల్: ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నీటి అవసరాలు బాగా పెరిగాయి. 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. భవిష్యత్లో పారిశ్రామికంగా కూడా మరింతగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ సమయంలో ఏ ప్రభుత్వమైనా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకొచ్చే పనులకు శ్రీకారం చుడుతుంది. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ పూతలు పూసే పనులకు తెరలేపింది. స్వలాభం కోసమే.. హంద్రీనీవా ఫేజ్–2 కింద 7 ప్యాకేజీల్లో లైనింగ్ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ. 936 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనులకు టెండర్లు ఈ ఏడాది మార్చిలో ఖరారయ్యాయి. ఏప్రిల్ నుంచి పనులు చేపడుతున్నారు. జూన్ 10 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో వేగంగా పూర్తి చేయాలనే నెపంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనుల నాణ్యతను ఇంజినీర్లు ఎవరూ పరిశీలించే సాహసం చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసమే హంద్రీ–నీవా లైనింగ్ పనులకు తెర తీశారని, టీడీపీ ముఖ్య నేతలకు భారీగా ముడుపులు అందాయని, దీంతోనే ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకే... ‘లైనింగ్ పనులు వద్దు మొర్రో’ అని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. కేవలం నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో లైనింగ్ పనులు చేపడుతూ, తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ కుటుంబంతోనే హంద్రీనీవాకు జీవం.. 2004కు ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను చూసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత పరిస్థితులను చూసి చలించిపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తలచి.. అప్పటివరకూ తాగునీటి పథకంగా శిలాఫలకానికే పరిమితమైన ‘హంద్రీ–నీవా’ను తాగు,సాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2009 నాటికే మొదటి దశ పనులను పూర్తి చేశారు. రెండో దశ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయి. ఆయన చలువతో 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతున్నాయి. ఇక.. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవాను మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలుతున్నామని, దీన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రూ. 6,182 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే, ఆ క్రమంలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైపోయింది. జగన్ హయాంలో నిర్ణయం మేరకు పెరగాల్సిన సామర్థ్యం6,300 క్యూసెక్కులు చంద్రబాబు ప్రభుత్వం పరిమితం చేసింది3,850 క్యూసెక్కులు లైనింగ్.. దోపిడీకి టెండరింగ్ హంద్రీ–నీవా లైనింగ్ పనుల్లో కాంట్రాక్టర్లకు డబ్బే డబ్బు కాంట్రాక్టు సంస్థల నుంచి నేతలకు భారీగా ముడుపులు! నాసిరకంగా పనులు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు జూన్ 10 నాటికి పనులు పూర్తి హంద్రీ–నీవా లైనింగ్ పనులు జూన్ 10 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పనులు పరిశీలించేందుకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురానికి నేడు సీఎం వస్తున్నారు. అక్కడ గ్రామ సభ నిర్వహిస్తారు. అనంతరం లైనింగ్ పనులపై హంద్రీ–నీవా అధికారులతో సమీక్షిస్తారు. జిల్లాలో పనులు అన్నిచోట్లా ప్రారంభమయ్యాయి. – నాగరాజ, సీఈ, జలవనరులశాఖ -
వ్యవసాయాన్ని లాభసాటి చేయండి
బుక్కరాయసముద్రం: నూతన ఆవిష్కరణలతో వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ సూచించారు. బీకేఎస్ మండలం రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు కొత్త పంటల సాగుపై రైతులను చైతన్య పరచాలన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల పాత్ర కీలకమన్నారు. నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. జింకలు, అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునే అంశాలపై చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జాన్సన్, ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివనారాయణ, రేకులకుంట పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్బాబు, పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ రత్నకుమార్, నాబార్డ్ జిల్లా అధికారి అనూరాధ, ఉద్యాన పరిశోధనా అధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యనారాయణ -
బాబుపై గురువుల గుర్రు
కదిరి: ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే చందంగా సీఎం చంద్రబాబు వ్యవహరశైలి ఉందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తమను ఆశల పల్లకీలో విహరింపజేశారని, అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. గొంతెమ్మ కోర్కెలేవీ కోరలేదు.. తమకు న్యాయబద్ధంగా అందాల్సిన ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలను మాత్రమే అడుగుతున్నామని, అంతకు మించి ఎలాంటి గొంతెమ్మ కోర్కెలు, బోనస్లూ అడగడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వడం మినహా ఇంకెలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదని మండిపడ్డారు. విడుదల చేసిన నిధుల్లో రూ2,300 కోట్లు సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్కే సరిపోయిందని తెలిపారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, పీఎల్ఎస్లు విడుదల చేయడం తప్ప ఐఆర్, పీఆర్సీల ఊసెత్తడం లేదని, ఉద్యోగ విరమణ చేసిన వారికి న్యాయంగా అందాల్సిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఉద్యోగులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. దీనిపై బాబు సర్కారు నేటికీ నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరుబాట.. అలవిగాని హామీలతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిన కూటమి సర్కార్ మెడలు వంచేందుకు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 9న (నేడు) ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే ఈ నెల 12న జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు ఉపాధ్యాయుల డిమాండ్లు కొన్ని.. ● కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్లు 117 జీఓను తక్షణం రద్దు చేయాలి. ● ఫౌండేషన్ స్కూళ్ల ఆలోచన మానుకోవాలి. ● ప్రస్తుతమున్న 1 నుంచి 5వ తరగతి వరకూ ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8వ తరగతి వరకూ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 1 నుంచి 5 వరకు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, 6 నుంచి 10 వరకు ఉన్న ఉన్నత పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి. ● ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు, 12వ పీఆర్సీ, 3 డీఏలు తక్షణం విడుదల చేయాలి. ● సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ● పాఠశాలల పునఃవ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. ఎన్నికల వేళ అయ్యవార్లకు వరాల జల్లు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు గాలికి ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏల ఊసెత్తని కూటమి సర్కారు నేడు కలెక్టరేట్ ఎదుట నిరసనకు ఏపీటీఎఫ్ పిలుపు 12న డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్నా ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహం చవిచూడక తప్పదు. – డా.పి.వి.రమణారెడ్డి, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు పోరుబాటకు సిద్ధంకండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత బకాయిలు వెంటనే చెల్లించాల్సి ఉంది. దాదాపు ఏడాది కావస్తున్నా దీనిపై ఎలాంటి స్పందన లేదు. మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధంకండి. – జి.హరిప్రసాద్రెడ్డి, ఎస్టీయూ జిల్లా అథ్యక్షుడు -
రైతు ప్రాణం బలిగొన్న రెవెన్యూ నిర్లక్ష్యం
తనకల్లు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణాలు బలిగొందంటూ రైతు శంకర్ నాయక్ కుమారుడు రమేష్ నాయక్ ఆరోపించాడు. తన తండ్రి మృతదేహంతో గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టాడు. తనకల్లు మండలం రామ్లానాయక్తండాకు చెందిన శంకర్నాయక్ ఐదు రోజుల క్రితం విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకుని నేరుగా తనకల్లులోని తహసీల్దార్ కార్యాలయానికి బాధిత కుటుంబసభ్యులు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి కుమారుడు రమేష్నాయక్ మాట్లాడుతూ.. తమకు తండాలో ఐదు ఎకరాల డీకేటీ భూమి ఉందని, అందులో రెండు ఎకరాలను తండ్రి శంకర్నాయక్ తన చెల్లెలికి ఇచ్చాడని గుర్తు చేశాడు. ఆ తర్వాత తన నాన్నకు కూడా తెలియకుండా మొత్తం ఐదు ఎకరాలకు మేనత్త, ఆమె భర్త కలిసి పట్టా చేయించుకున్నారని తెలిపాడు. అప్పటి నుంచి తమ భూమి తకు ఇప్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో 21 సార్లు తన నాన్న వినతిపత్రాలను అందజేశారని వివరించాడు. అయినా న్యాయం చేకూరకపోవడంతో ఇక తమకు భూమి దక్కదనే మనస్తాపంతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయాడు. ఆందోళన కారులతో తహసీల్దార్ శోభాసువర్ణమ్మ మాట్లాడారు. జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అవార్డు
పుట్టపర్తి అర్బన్: రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ముదిగుబ్బ, బత్తలపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. గురువారం న్యూఢిల్లీలోని నాఫెడ్ కార్యాలయంలో ఆయా సంఘాల చైర్మన్లకు అవార్డులు అందజేశారు. నాఫెడ్ ఎండీ దీపక్ అగర్వాల్ చేతుల మీదుగా ముదిగుబ్బ ఎఫ్పీఓ చైర్మన్ , సీఈఓ చంద్రమోహన్, సతీష్ బత్తలపల్లి ఎఫ్పీఓ చైర్మన్, సీఈఓ కరుణాకర్రెడ్డి, పవన్కుమార్లకు అవార్డులను అందజేశారు. సంఘాల నిర్వహణ, నాయకత్వం, వ్యాపార టర్నోవర్, ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం వంటి వాటిలో ప్రగతి సాధించినందుకు ఈఅవార్డులను అందజేశారు. దేశ వ్యాప్తంగా 1280 సంఘాలు ఉండగా అందులో 12 సంఘాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వివాహిత అనుమానాస్పద మృతి రొద్దం: మండలంలోని శ్యాపురం గ్రామ సమీపంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని హుసేన్పురం గ్రామానికి చెందిన చెన్నకేశవులు భార్య గాయత్రి (29)రెండు రోజుల క్రితం కుటంబ సభ్యులతో గొడువ పడి ఇంటిి నుంచి బయటకు వచ్చేసింది. గురువారం శ్యాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో గమనించిన పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఆత్మహత్య చేసుకున్నది గాయత్రినేనని నిర్ధారించారు. దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో ఆమె మృతిపై తల్లి మంజులమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి భర్త చెన్నకేశవులు, ఆయన కుటుంబసభ్యులే కారణమంటూ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బైక్పై నుంచి కిందపడి వృద్ధురాలు..బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సాకే పెద్దక్క (76) బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని స్టోర్ వద్దకెళ్లి బియ్యం తీసుకుంది. అనంతరం వరుసకు మనువడైన సాకే హరీష్తో కలసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. హరీష్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో వెనకాల కూర్చొన్న పెద్దక్క.. గ్రామ సమీపంలోకి చేరుకుంటుండగా కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయింది. గమనించిన అదే కాలనీకి చెందిన వారు ఆమెను వెంటనే అంబులెన్స్లో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ద్విచక్ర వాహనాల ఢీ.. ఇద్దరి దుర్మరణం ● మృతులు బిహార్ వలస కార్మికులు రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో బిహార్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. బిహార్కు చెందిన రాహుల్ (20), మహమ్మద్ సుబహాన్ (40) బతుకు తెరువు కోసం వలస వచ్చి రొద్దంలో స్థిరపడ్డారు. వీరిలో స్థానికంగానే ఓ వెల్డింగ్ షాప్లో రాహుల్, ఎస్టేట్లో మహమ్మద్ సుబహాన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం లక్సానిపల్లిలో వెల్డింగ్ పనులు ముగించుకుని రొద్దం వైపు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా... కల్లుకుంట క్రాస్ వద్ద నల్లూరు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. ఘటనలో బిహారీలు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహమ్మద్ సుబహాన్ కుమారుడితో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రొద్దం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు ఢీ – వ్యక్తి మృతి కదిరి అర్బన్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు... కదిరి మండలం కాళసముద్రం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, తన కుమారుడు ఆదినారాయణ (35)తో కలసి గురువారం ఉదయం కదిరికి బేల్దారి పనుల కోసం వచ్చారు. పని ముగించుకుని రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కాళసముద్రం సమీపంలోని గురుకుల పాఠశాల వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి, ఆదినారాయణను స్థానికులు కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆదినారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న నాగలక్ష్మికి ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి
పుట్టపర్తి అర్బన్: ఆయుస్మాన్ భారత్ నిబంధనల మేరకు 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్ చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని సీహెచ్ఓలు డిమాండ్ చేశారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలు, ఎంఎల్హెచ్పీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన సమస్య పరిష్కారం కోరుతూ ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ను కలిస్తే... ‘మిమ్మల్ని తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్లు మిగులుతుంది’ అని చెప్పడం అన్యాయమన్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. -
●కళ తప్పిన కనకాంబరాలు
అనంతపురం రూరల్ మండలం పూలకుంట, పసలూరు, చియ్యేడు తదితర గ్రామాల్లో రైతులు కనకాంబరం పూలు సాగు చేశారు. కాపు బాగానే ఉన్నా మార్కెట్లో సరైన ధరల్లేవు. ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 మాత్రమే పలుకుతుండటంతో గిట్టుబాటు కూడా కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిలో కనకాంబరాలు రూ.500 నుంచి రూ.800 పలికాయని, ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు చవి చూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రూ.లక్ష నగదు అపహరణ
గుత్తి రూరల్: బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచిన రూ.లక్ష నగదును ఓ దుండగుడు అపహరించారు. ఈ దృశ్యం సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. వివరాలు... గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున పంటల సాగు కోసమని గుత్తిలోని కెనరా బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. లక్ష రుణం తీసుకున్నాడు. ఈ నగదును బ్యాంక్ వద్ద నిలిపిన తన బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచి ఎదురుగా ఉన్న దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగుడు బైక్ బ్యాగులోని నగదు ఉంచిన సంచిని తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. సిగరెట్ కాల్చి తిరిగి వచ్చిన మల్లికార్జున బ్యాగ్లో నగదు కనిపించకపోవడంతో వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బ్యాంకు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే బ్యాగులోని నగదును తీసుకెళుతున్న వ్యక్తి ఆ వెనుకనే వచ్చిన మరో బైక్పై ఎక్కి వెళ్లిపోయే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మస్థైర్యం పెరిగింది
స్వతహాగా నేను చాలా భయస్తురాలిని. అమ్మ, నాన్న ప్రోత్సాహంతో కరాటే అభ్యసించడం మొదలు పెట్టిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు ఏ విషయంౖపైనెనా నేను నిర్భయంగా మాట్లాడుగలుగుతున్నా. అన్ని స్కూళ్లలోనూ కరాటే మాస్టర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తే ఈవ్ టీజింగ్ లాంటివి అరికట్టవచ్చు. కరాటే సాధన ద్వారా నాలో ఏకాగ్రత పెరిగింది. ఫలితంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 964 మార్కులు సాధించగలిగాను. కరాటేలోనే రాణించి క్రీడా కోటా కింద సివిల్స్కు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. – నిఖితాబాయి, కదిరి -
కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
కదిరి టౌన్: సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తమ పిల్లలను చదువుల కోసం బయటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే బాలికలకు చదువు ఒక్కటే సరిపోదు... అపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు అసవరమైన యుద్ద కళనూ అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే కదిరి ప్రాంతానికి చెందిన పలువురు బాలికలు కరాటే అభ్యసించి, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో మెరిశారు. ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతూ.. కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు ప్రత్యేకంగా కరాటే శిక్షణను మాస్టర్ షెక్షావలి అందిస్తున్నారు. ఈ శిక్షణలో పలువురు విద్యార్థినులు రాణిస్తున్నారు. 2024లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో కదిరికి చెందిన నిఖిత, సిరి పాల్గొన్నారు. వెల్స్ అసోసియేషన్ తరఫున ఒంగోలు, పార్వతీపురంలో జరిగిన ఎస్జీఎఫ్ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. తెలంగాణలో నిర్వహించిన సీఎం–కేసీఆర్ కప్, విశాఖపట్నంలో జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్ షిప్ల్లో పాల్గొని బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. అలాగే ఫెన్సింగ్లోనూ రాష్ట్ర స్థాయి పోటీలో నిఖిత, సిరి పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లోనూ పంజాబ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ విశేష ప్రతిభను కనబరిచారు. యుద్ధ క్రీడల్లో రాణిస్తున్న కదిరి విద్యార్థినులు -
రేషన్ బియ్యం స్వాధీనం
చెన్నేకొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం సీకేపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ధర్మవరం వైపు నుంచి బొలెరో వాహనంలో కర్ణాటకకు 47 కిలోల బరువున్న 57 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. కులగణన సక్రమంగా జరిగితే ప్రజలకు సమ న్యాయం ● కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరా మడకశిర రూరల్: కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సమ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మడకశిర మండలం నీలకంఠాపురంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కులగణనపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. దాని ఫార్మెట్ తయారీపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు లోకసభ, రాజ్యసభల్లో చర్చించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కులగణన సర్వే ఆరు నెలల్లోనే పూర్తి చేసి వివరాలు ప్రకటించాలన్నారు. కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఒత్తిడి తేవడంతోనే కులగణనకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కులగణన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేసేలా చూడాలన్నారు. కులగణన పూర్తయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెరిగి న్యాయం జరుగుతుందన్నారు. అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని సత్యసాయినగర్కు చెందిన విజయలక్ష్మిని అదనపు కట్నం కోసం భర్త రవికుమార్, అత్త లక్ష్మీదేవి, మామ పెద్దన్న, ఆడపడుచు పద్మావతి, మరిది పెద్దన్న వేధిస్తున్నారని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వేధింపులపై కేసు నమోదు.. స్థానిక తారకరామాపురానికి చెందిన షేక్ మహమ్మద్ వలి, తల్లి జుబేదా, తండ్రి ఫకృద్దీన్, తమ్ముళ్లు మసూద్వలి, జిలాన్పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. తనను తరచూ వారు వేధిస్తున్నారంటూ మహమ్మద్ వలి భార్య షేక్ నఫ్రాసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా జైలులో 9న మామిడి ఫలసాయం వేలం బుక్కరాయసముద్రం: మండలంలోని జిల్లా ఓపెన్ ఎయిర్ జైల్లో ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు మామిడి తోటల ఫలసాయాన్ని బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ కాంతారాజ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3,544 మామిడి చెట్లకు కాసిన కాయలకు కడప రేంజ్ ప్రాంతీయ జైళ్ల ఉపశాఖ అధికారి సమక్షంలో వేలం నిర్వహిస్తామరు. వేలంలో పాల్గొనేవారు రూ.లక్ష డిపాజిట్ చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న రైతులు, వ్యాపారులు వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు. 9కి వేలం వాయిదా.. బుక్కరాయసముద్రం మండలంలోని అనంతపురం జిల్లా జైల్లో ఈ నెల 8న జరగాల్సిన వేలం 9వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు సూపరింటెండెంట్ రహ్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25వేల కిలోల వేరు శెనగ చెక్కకు వేలం నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.20 వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా గుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఉన్న పద్మావతి ఆయుర్వేదిక్ కళాశాల వద్ద బళ్లారి వైపు వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఘటనలో 33 కేవీ విద్యుత్ లైన్కు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో పాటు దానికి సపోర్ట్గా నిలిపిన మరో స్తంభమూ కూలింది. విద్యుత్ వైర్లు కిందకు వేలాడాయి. స్థానికులు అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ అంజాద్బాషాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అదిరిందయ్యా హనుమంతు!
సోమందేపల్లిలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో అక్కడి వాచ్మెన్ హనుమంతు సరికొత్త అవతారం ఎత్తాడు. అర్చకుడు దాస్ సహకారంతో ఎలుగుబంటి డ్రెస్ కుట్టించుకుని దానిని ధరించి తిరుగుతుండడంతో కోతులు భయపడి ఆలయ పరిసరాలవైపు తొంగి చూడడం లేదు. ఇది గమనించిన గ్రామస్తులు ‘ఐడియా అదిరిందయ్యా హనుమంతు’ అంటూ అభినందిస్తున్నారు. – సోమందేపల్లి: ఎలుగుబంటి వేషంలో హనుమంతు -
భక్తిశ్రద్ధలతో ఈశ్వరమ్మ వర్ధంతి
ప్రశాంతి నిలయం: సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతిని మంగళవారం వేలాది భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏటా మే 6న ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఈశ్వరమ్మ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ఉన్న సత్యసాయి తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద వెంకమరాజుల ఘాట్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఈశ్వరమ్మ విగ్రహానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు దంపతులు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి పూలమాలలు వేసి, పూజలు చేశారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు ఈశ్వరమ్మను కొనియాడుతూ భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం అన్న దానం చేశారు. అలాగే సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత రెండు వందల మంది పేద భక్తుల జీవనోపాదుల కోసం ఆర్.జె.రత్నాకర్రాజు దంపతులు కుట్టుమిషన్లు, గ్రైండర్లు, వీల్చైర్లు, స్ప్రేయర్లు, ఎలక్ట్రీషియన్ కిట్లు పంపిణీ చేశారు. సాయంత్రం ఏపీ బాలవికాస్ విద్యార్థులు సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జీవిత ఘట్టాలను వివరిస్తూ ‘విశ్వ జననీ ఈశ్వరమ్మ’ పేరుతో నాటికను ప్రదర్శించారు. -
అనంతపురం, శ్రీ సత్యసాయి ఎస్పీలపై సర్వత్రా విమర్శలు
● పోస్టుల కోసం శాంతిభద్రతల్ని గాలికొదిలేశారనే ఆరోపణలు ● రామగిరి హెలీప్యాడ్ ఘటనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు 71 మందిపై కేసులు ● హైకోర్టు ఆదేశాలిచ్చినా పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వని దుస్థితి ● ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా పోలీసు బాస్ల తీరు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అనంతపురం ఎస్పీ జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెడ్బుక్ రాజ్యాంగానికి కంకణ బద్ధులై పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓవైపు మట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. మట్కా మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగిపోతోంది. ఇవన్నీ పక్కనపెడితే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్న పోలీసు బాస్లు.. ‘పచ్చ’ నేతలు చెప్పిందే వేదంగా నడుచుకుంటూ అభాసుపాలవుతున్నారనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ఇందుకేనా.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో పాపిరెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇది ఖాకీల మొదటి వైఫల్యం కాగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే హెలీప్యాడ్ దగ్గర జనాన్ని నియత్రించలేక చేతులెత్తేయడం మరో వైఫల్యం. అక్కడ డీఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా ‘హెలీప్యాడ్’ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర పోలీసు చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. అయితే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రివర్స్ కేసులకు తెరలేపడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘటనలో 71 మందిపై కేసులు పెట్టడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. జగన్ రాక సందర్భంగా వచ్చిన జనాన్ని నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిపైనా కేసుల మీద కేసులు పెట్టి వేధింపులకు తెరతీయడం గమనార్హం. హైకోర్టు చెప్పినా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి తండ్రి ప్రభాకర్రెడ్డి పట్టణంలోకి రానివ్వకుండా కుయుక్తులు పన్నుతున్నారు. దాడులకు తెర తీస్తున్నారు. ఇటీవల స్వయానా హైకోర్టే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించి, తాడిపత్రికి పంపించాలని ఆదేశించినా పోలీసులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఏకంగా ఐపీఎస్ అధికారిని తాడిపత్రికి ఏఎస్పీగా వేసినా ఏమీ చేయలేని దుస్థితి. దీన్నిబట్టి తాడిపత్రిలో రౌడీరాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని దుస్థితిలో జిల్లా పోలీసులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఎస్పీ జగదీష్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమ పోస్టులు కాపాడుకుంటే చాలు ఏది ఏమైనా కానీ అన్న రీతిలో రెండు జిల్లాల ఎస్పీలు ముందుకు సాగుతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విచ్చలవిడిగా మట్కా, జూదం జరుగుతుండటం, మద్యం ఏరులై పారుతుండటం, దొంగతనాలు భారీగా పెరిగి రెండు జిల్లాల్లోనూ అధ్వాన పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోని పోలీసు బాస్లు.. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
రెడ్డెప్పశెట్టికి ఉద్యాన ఉచ్చు
చిలమత్తూరు: ప్రభుత్వ భూములు, ప్రకృతి వనరులను దోచుకుంటూ రూ.కోట్లు ఆర్జించిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండగా...ఉద్యాన శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా పాలీహౌస్లు, కమ్యూనిటీ ఫారంపాండ్లు నిర్మాణాలతో పాటు ఏకంగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన అంశంపై ‘అక్రమాలు కోకొల్లలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఉద్యానశాఖ అధికారులు స్పందించి విచారణ వేగవంతం చేశారు. రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూములు, ఈడీ అటాచ్మెంట్ భూముల్లోనే పాలీహౌస్లు, కమ్యూనిటీ ఫారంపాండ్లు నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. రైతులకు లీజు హక్కు ఇవ్వడం ద్వారా సబ్సిడీలు పొందవచ్చన్న నిబంధనను అడ్డం పెట్టుకుని తన బినామీలకు లీజు హక్కు ఇచ్చి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలను పొందినట్టు అధికారులు గుర్తించారు. ఉద్యానశాఖ మంజూరు చేసిన కమ్యూనిటీ ఫారంపాండ్ను సైతం రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించి సొంతానికి వాడుకుంటున్నారు. కమ్యూనిటీ ఫారంపాండ్ ఉద్దేశాన్ని పక్కనపెట్టి లబ్ధి పొందినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమను మోసం చేసి ప్రజాధనం లూటీ చేసిన రెడ్డెప్పశెట్టికి ఉచ్చు బిగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో కేసు నమోదైనా... ఎల్లయ్య, పుల్లయ్య అంటూ స్థానికంగా లేని రైతుల పేర్లతో రెడ్డెప్పశెట్టి రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్టుగా గతంలోనే అధికారులు గుర్తించారు. రైతులను మోసం చేసి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్లోనూ సబ్సిడీలు పొందిన ఆయనపై కేసు నమోదు చేశారు. అయినా ఉద్యాన శాఖ అధికారులు రూ.కోట్ల సబ్సిడీలు ఎలా ఇచ్చారన్న విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని మోసం చేసి సబ్సిడీ పేరుతో పొందిన కోట్లాది రూపాయలను రికవరీ చేయడంతో పాటు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్డెప్పశెట్టి అవినీతి అక్రమాల్లో ఆయన ఎస్టేట్ సమీపంలోని ఓ గ్రామంలోని ఇద్దరి రియల్టర్ల పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా కూడా అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. బినామీలు, బంధువుల పేరిట ఉద్యానశాఖ నుంచి సబ్సిడీలు ఒక సర్వే నంబరుతో దరఖాస్తు.. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు సబ్సిడీ డ్రిప్ మంజూరు అవకతవకల్లో గతంలోనే రెడ్డెప్పశెట్టిపై కేసు -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
● అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 2019 నుంచి 2024 వరకు మంజూరైన ఇళ్లు.. నిర్మాణాల పురోగతిపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అప్షన్ –3 కింద పనుల పురోగతిని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈక్రమంలో జిల్లాలో జూన్ 12 నాటికి 10,368 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై డివిజన్ స్థాయిలో ఆర్డీఓల ఆధ్వర్యంలో సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈఈలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. కదిరి అర్బన్, ధర్మవరం అర్బన్, లేపాక్షి, రామగిరి, సోమందేపల్లి, హిందూపురం, కొత్తచెరువు తదితర మండలాల్లో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డీఈఈలు శంకర్లాల్ నాయక్, శ్రీనివాస్, శివకుమార్ నాయక్, వెంకటరమణారెడ్డి, మండల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు ప్రశాంతి నిలయం: ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ విజయసారథి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నీచర్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం డీఐఈఓ మౌల మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఉదయం 36 సెంటర్లు, మధ్యాహ్నం 22 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ మెంబర్లుగా శ్రీరామరాజు, చెన్నకేశవ ప్రసాద్, శ్రీనివాసులును నియమించామన్నారు. కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్, కార్మికశాఖ అధికారి సూర్యనారాయణ, విద్యాశాఖ అధికారి లింగన్న, పోస్టల్ శాఖ అధికారి విజయ్, రవాణా శాఖ అధికారి ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీటీని కాపాడుకుంటాం
● కదం తొక్కిన ప్రజా సంఘాలు బత్తలపల్లి: ‘ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేసేదాకా పోరాడతాం...పేదల సంస్థ ఆర్డీటీని కాపాడు కుంటాం...సేవ్ ఆర్డీటీ’ అంటూ ప్రజా సంఘాలు కదం తొక్కాయి. బత్తలపల్లి మండల కేంద్రంలో మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వారు ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ ఘాట్లో పూజలు చేశారు. అనంతరం ఆర్డీటీ ఆఫీసు నుంచి ప్రధాన కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు ప్రధాన కూడలిలో మానవ హారం ఏర్పాటు చేసి ‘సేవ్ ఆర్డీటీ’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పాలిట కల్పతరువుగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆర్డీటీ సంస్థకు నిధులు రాకుండా కట్టడి చేయడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ స్వర్ణలతకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షుడు దాసగానిపల్లి కుళ్లాయప్ప, ఎమ్మార్పీఎస్ ధర్మవరం డివిజన్ నాయకులు సాకే దండోరా లక్ష్మన్న, ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, ఎస్సీ జన సంఘం రాష్ట్ర ఇన్చార్జి రాంప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజక వర్గ ఇన్చార్జి సాకే వినయ్కుమార్, సీపీఐ మండల కార్యదర్శి బండల వెంకటేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఎరుకల సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, కుమ్మర శాలివాహన సంఘం నాయకులు వెంకట రమణ, నిడిగల్లు ధను, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల ఆర్డీటీ ఉపాధ్యాయులు సుదర్శనం, రామకృష్ణ, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు. -
● చెన్నకేశవా..గోవింద
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మవరం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం లక్ష్మీచెన్నకేశవస్వామి ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం స్వామివారి మూలవిరాట్ను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. సాయంత్రం సింహ వాహనంపై కనిపించిన లక్ష్మీచెన్నకేశవ స్వామిని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. కాగా, బుధవారం లక్ష్మీచెన్నకేశవస్వామి కల్పవృక్ష, హనుమద్ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
జీజీ హట్టిలో ప్రబలిన అతిసారం
రొళ్ల: మండలంలోని జీజీ హట్టిలో అతిసారం ప్రబలింది. 980 మందికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో రెండురోజులుగా అతిసారం ప్రబలింది. దీంతో గ్రామస్తులంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే మంగళవారం ఉదయం భాగ్యమ్మ, చిక్కిరప్ప కుమార్తె అమూల్య (11) తీవ్ర అస్వస్థతో మృతి చెందింది. మరో 24 మంది అతిసారంతో బాధపడుతున్నారు. హుటాహుటిన ఆస్పత్రులకు తరలింపు.. అమూల్య మృతితో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే అతిసారంతో బాధపడుతున్న మిగతా వారిని కర్ణాటక ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు. పెద్దపూజారప్ప కుమారుడు చిత్తయ్య, చిక్కన్న, చిక్కమ్మ తదితరులు కర్ణాటక రాష్ట్రం మధుగిరి, తుమకూరులో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా జయమ్మ, దివ్య, వినయ్కుమార్, లక్ష్మమ్మ, అమృతవల్లి, కవిత, కుమార్, చిక్కిరప్ప, కరియన్న, మోనిక, మధుశ్రీ, రొడ్డ చిక్కన్న, మారన్న తదితరులతో పాటు మరికొందరు అతిసారంతో అస్వస్థతకు గురై మధుగిరి, తుమకూరు, హిందూపురం ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రాథమిక పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. 55 మందికి పైగా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత రెవెన్యూ, పంచాయతీ రాజ్శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉంచిన నీటిని పారబోయించారు. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కలుషిత నీరే కారణమా.. తాగునీరు కలుషితం కావడం వల్లే జీజీ హట్టిలో అతిసారం ప్రబలినట్లు తెలుస్తోంది. గ్రామానికి రక్షిత మంచినీటి సౌకర్యం లేక సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న నీటిని రోజుల తరబడి నిల్వ ఉంచుకుని తాగడం వల్లే అతిసారం ప్రబలినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల గ్రామంలో జరిగిన ఓ శుభ కార్యంలో తిన్న ఆహారం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యక్తిగత శుభ్రతం పాటించాలి.. ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పెనుకొండ ఆర్డీఓ ఆనంద్కుమార్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం తదితరులు పేర్కొన్నారు. మంగళవారం వారు జీజీ హట్టి గ్రామంలో పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జున, డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాణి, డీఐఓ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మనునాయక్, తహసీల్దార్ షేక్షావలి, ఎంపీడీఓ రామారావు తదితరులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకోవాలని సూచించారు. 11 ఏళ్ల చిన్నారి మృతి.. 24 మందికిపైగా తీవ్ర అస్వస్థత బాధితులను కర్ణాటక రాష్ట్రం మధుగిరి, తుమకూరు ఆస్పత్రులకు తరలింపు జీజీ హట్టిలో వైద్య శిబిరం ఏర్పాటు చికిత్స అందిస్తున్న అధికారులు -
పకడ్బందీగా ‘గ్రూప్–1 మెయిన్స్’
● జేసీ శివ్ నారాయణ్ శర్మ అనంతపురం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. అనంతపురంలో పరీక్ష కేంద్రాలను జేసీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. 9వ తేదీతో ముగుస్తాయన్నారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షకు 594 మంది హాజరుకావాల్సి ఉండగా నాల్గో రోజు 381 మంది హాజరయ్యారని, 213 మంది గైర్హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారులు, ఎస్డీసీలు మల్లికార్జునుడు, తిప్పేనాయక్ ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ అనంతపురం అర్బన్: పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉతర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న హనుమంతరావు ఆనంద్ పీఏబీఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. అహుడా కార్యదర్శిగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ జి.గౌరి శంకర్ రావు తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్గా బదిలీ అయ్యారు. ‘హెలికాప్టర్’ ఘటనలో మరో 9 మంది విచారణరామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనకు సంబంధించి మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్లో రామగిరి మండల వైఎస్సార్ సీపీ నాయకులను విచారించారు. జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జున, నరసింహారెడ్డి, ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, జయచంద్రారెడ్డి, ముత్యాలన్న, శ్రీరాముల నాయక్, నారపరెడ్డి, దేవభూషన్రెడ్డి తదితరులను సీఐ శ్రీధర్ స్టేషన్కు పిలిపించి విచారించారు. ఆ రోజు ఏం జరిగింది...మీరు ఎక్కడున్నారు.. అంటూ ఆరా తీశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు 71 మందిని ముద్దాయిలుగా చేర్చగా, ఇప్పటికే 10 మందిని విచారణ చేసి బెయిల్పై విడుదల చేశారు. తాజాగా మంగళవారం రామగిరి మండలానికి చెందిన 9 మంది నాయకులను విచారించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.బాలసదన్లోని ఇద్దరు బాలికలు అదృశ్యం ధర్మవరం అర్బన్: పట్టణంలోని బాలసదన్లో ఉంటున్న ఇద్దరు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు... పెనుకొండ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు తల్లిదండ్రుల సంరక్షణలో లేని ఇద్దరి బాలికలను పట్టణంలోని ఎల్పీ సర్కిల్లో ఉన్న బాలసదన్లో ఉంచి ఆశ్రయం కల్పించారు. మంగళవారం ఉదయం బాలసదన్లోని వంట మనిషి, హౌస్ కీపర్ ఇద్దరు కలిసి కూరగాయలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా... బాలికలిద్దరూ బాలసదన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం బాలసదన్ నిర్వాహకులు వారి కోసం సమీప ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం బాలసదన్ అకౌంటెంట్ హరిత వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలికల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. శాసనాలను పరిరక్షించాలి పెనుకొండ: చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పెనుకొండ కోటలోని శాసనాలను పరిరక్షించాలని చరిత్రకారుడు మైనాస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం పెనుకొండలోని పలు శాసనాలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. పెనుకొండ కోట నిర్మాణ విశేషాలను తెలుపుతూ ఉత్తర ప్రవేశ కోట ద్వారం లోపల వైపున ఒకటో బుక్కరాయ 1354లో లిఖించిన శాసనం గోడ కదిలిందన్నారు. శాసనం లిఖించిన రాయిలో చీలికలు ఏర్పడ్డాయన్నారు. పెనుకొండ కోట చరిత్రను తెలిపే అత్యంత ముఖ్యమైన శాసనం చెత్త కుప్పలో కలసిపోతోందని, నగర పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గోరంట్ల ఊరువాకిలి కోట గోడ సైతం లారీ ఢీకొనడంతో దెబ్బతిందన్నారు. శాసనాల పరిరక్షణకు భారత పురావస్తు శాఖ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. -
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీలను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది.అయితే, హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్కు అందజేసేందుకు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఏఎస్పీతో మాట్లాడి.. అనంతరం ఎస్పీ జగదీష్తో కూడా ఫోన్లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డి. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. ఆ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ జగదీష్ హామీ ఇచ్చినట్లు వారు మీడియాకు వివరించారు. -
ఇంటి పట్టాలు ఇవ్వకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం
ప్రశాంతి నిలయం: జిల్లాలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రాబోవు రోజుల్లో కలెక్టరేట్ను ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో రాంభూపాల్ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేష్, నాయకులు నరసింహులు, లక్ష్మీనారాయణ, దిల్షాద్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, రామకృష్ణ, శ్రీనివాసులు, హరి, పెద్దన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
పలువురికి పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీ
హిందూపురం టౌన్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో 237 మందికి ఇంటి పట్టాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్లను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కలెక్టర్ టీఎస్ చేతన్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని, వచ్చే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఆర్డీఓ ఆనంద్కుమార్, మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎ
పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎవరు వెళ్లినా.. భయబ్రాంతులకు గురి చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి విచ్చేశారు. అదే రోజున హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పైలట్, కోపైలట్కు నోటీసులు పంపించారు. మరో పది మందిని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రిమాండ్కు పంపించాలనే ఉద్దేశంతో ధర్మవరంలో జడ్జి ఇంటికి అరెస్టు చేసిన వారిని తీసుకెళ్లగా ఆయన బెయిల్ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉండగా సోమవారం హెలిప్యాడ్ ఘటన నేపథ్యంలో మరో 71 మంది వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకపాలనకు శ్రీకారం చుట్టింది. ఏదో ఒక రకంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఏ ఒక్కరినీ వదలడం లేదు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజు నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి స్థానికంగా ఉండేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను రోజూ ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పరామర్శకు వచ్చినా తిప్పలే.. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చినా చట్ట ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ పోలీసులపై ఒత్తిళ్లు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు సైతం తమ విధులను మరచి అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు. పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్యను ఖండిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వారందరిపై కూటమి నేతలు దృష్టి సారించారు. రోజుకో కేసులో ఇరికిస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద దాడితో .. ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మార్చి 26వ తేదీన రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో అనెక్సర్ 1, 2 ఇచ్చేందుకు వెళ్లిన ముగ్గురిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా వారు వచ్చిన వాహనాల్లో మారణాయుధాలు ఉంచి అక్రమ కేసులు బనాయించేందుకు పన్నాగం పన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నేతలు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లారు. తాము చెప్పినట్లు ఎన్నికలు జరగాలని.. ఎవరో వచ్చి గెలుస్తామంటే ఎలా అంగీకరిస్తామని దబాయించారు. హత్యతో భయం.. భయం.. ఉగాది పండుగ రోజున రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు రాజన్న మనవడు ఆదర్శ్.. అదే గ్రామానికి చెందిన కురుబ లింగమయ్యపై దాడి చేశాడు. లింగమయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని అడ్డుకునేయత్నం చేశాడనే కక్షతో హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గొడవకు.. హత్యకు నాలుగైదు రోజులు గడువు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే హత్య చేసే సమయంలో సుమారు 20 మంది వరకూ ఉన్నట్లు తెలిసింది. కానీ కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. రంగంలోకి ప్రత్యేక బలగాలు.. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన కేసులో ఇప్పటికే పది మందిని అరెస్టు చేసి బెయిల్పై వదిలారు. అయితే మరింత మందిని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్, బెంగళూరుకు పోలీసు ప్రత్యేక బలగాలు వెళ్లినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో ముందుగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందన్న విమర్శలున్నాయి. పరామర్శించిన వారిపైనే కేసులు.. రామగిరిలో భయం .. భయం పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతల అరాచకం ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నల్లోనే ఖాకీల విధులు వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు పరామర్శకు వెళ్లినా టార్గెట్ చేస్తున్న వైనం -
బీసీల పేరుతో బహిరంగ దోపిడీ
పెనుకొండ రూరల్: బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం బహిరంగ దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర విమర్శించారు. పెనుకొండలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు 50 రోజుల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. శిక్షణకు హాజరయై ప్రతి మహిళకూ రూ. 3 వేల స్టయిఫండ్తో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ను ఉచితంగా అందజేసేలా కార్యాచరణను రూపొందించారన్నారు. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.23 వేలు వెచ్చిస్తున్నట్లుగా ప్రకటిచిందన్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... శిక్షణ కాలంలో చెల్లించే రూ.3 వేల స్టయిఫండ్, ఉచితంగా అందజేసే కుట్టు మిషన్ ధర రూ.4,300 పోను... రూ.23 వేలలో మిగిలిన రూ.15, 700 ఏమవుతున్నదో అంతు చిక్కడం లేదన్నారు. శిక్షణ సమయంలో దారం, టేపు, కత్తెర, స్కేల్ వంటి పరికరాలను లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారన్నారు. కొన్ని శిక్షణ కేంద్రాలలో తాగేందుకు మంచినీరు, బాత్రూమ్లకు కూడా లేవన్నారు. రోజులో ఉదయం 4గంటలు, మధ్యాహ్నం 4 గంటల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు, మూడు గంటల్లోనే ముగించేస్తున్నారన్నారు. మొత్తం ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు కాగా, మిగిలిన రూ.167 కోట్లను దిగమింగేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థలను పక్కన పెట్టి, సొంత సంస్థలకు శిక్షణ కాంట్రాక్ట్లను కట్టబెట్టి కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. బీసీల పేరుతో కుట్టు శిక్షణ వ్యవహారమంతా చూస్తున్న సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొనేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వాల్మీకి సాధికారిత కమిటీ సభ్యులు చెన్నేకొత్తపల్లి బొగ్గు కృష్ణా, ఆనంద్, గుట్టూరు పిట్టా బాబు, బి.ఆనంద్, మజ్జిగ నాగరాజు, పరంధామ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర ధ్వజం -
ఆర్డీఓపై చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: ‘ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల నుంచి ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ధర్మవరం ఆర్డీఓ అక్రమార్కులతో కుమ్మక్కు అయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపి ఆర్డీఓతో పాటు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్తో కలసి వైఎస్సార్సీపీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు ప్రతి నెలా ఇసుక మాఫియా నుంచి రూ.10 లక్షల మామూళ్లు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. లోకాయుక్త, చీఫ్ సెక్రెటరీ, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తదితరులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ సాకే శివ, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు అమీర్బాషా, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎం.చౌడప్ప, గోపాల్ తదితరలు పాల్గొన్నారు. -
నాణ్యమైన పరిష్కారం చూపాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని నిర్దేశించిన వ్యవధిలోగా చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్తో పాటు అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 236 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన వినతుల స్థితిగతులను ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కార్యక్రమలలో డీఆర్డీఎ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్ధకశాఖ జేడీ శుభదాస్, పట్టుపరిశ్రమల శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఉద్యానశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ ఫిరోజ్ బేగం, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఆర్అండ్బీ ఎస్ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
కదిరి అర్బన్: త్వరలో జరిగే జాతీయ స్థాయి మహిళల హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన నక్షత్ర, సభాఖానం, షబ్రీన్, సరిత, ఝాన్సీరాణి ఎంపికయ్యారు. ఈ నెల 3, 4వ తేదీల్లో ఒంగోలు జిల్లా మార్కాపురంలో జరిగిన 54వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. జట్టులో ప్రతిభ చూపిన నక్షత్ర, సభాఖానం, షబ్రీన్, సరిత, ఝాన్సీరాణిని జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేసినట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ‘పోలీసు గ్రీవెన్స్’కు 70 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● ఇద్దరికి తీవ్ర గాయాలు బత్తలపల్లి: మండలంలోని యర్రాయపల్లి బస్సు స్టేజ్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం పూలకుంట, చియ్యేడు గ్రామాలకు చెందిన కృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి ద్విచక్ర వాహనంపై బత్తలపల్లి వైపు నుంచి స్వగ్రామాలకు వెళుతుండగా యర్రాయపల్లి మలుపు వద్ద అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన చిన్నారి దింపానకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసు నమోదు ధర్మవరం రూరల్: మండలంలోని గుట్టకిందపల్లికి చెందిన నరసింహులుపై పోక్సో యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల వయసున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలు తీశాడంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సోమవారం తెలిపారు. -
వైఎస్సార్ స్మారక స్థూపం పునఃప్రతిష్ట
చిలమత్తూరు: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలకు గుర్తుగా హిందూపురం పట్టణంలోని రహమత్పురం సర్కిల్లో ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పునఃప్రతిష్టించారు. మున్సిపల్ అధికారులు శనివారం రాత్రి స్మారక స్థూపాన్ని తొలగించడం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. మున్సిపల్ అధికారులు తిరిగి స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నూతన స్థూపాన్ని పునఃప్రతిష్టించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి మాట్లాడుతూ స్మారక స్థూపాన్ని కూటమి నాయకుల సూచనలతో అధికారులు తొలగించారన్నారు. వైఎస్సార్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరితరమూ కాదన్నారు. ఎంతటి వారైనా తమ అభిమాన నేత స్మారకంగా ఉన్న వాటి జోలికొస్తే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఏ శివ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా, వాణిజ్య విభాగం జిల్లా అద్యక్షుడు మహేష్గౌడ్, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, నిస్సార్ అహ్మద్, రాము, టౌన్ కన్వీనర్ మన్సూర్, ఎంపీటీసీ ధనుంజయరెడ్డి, శివశంకర్రెడ్డి, నాగరాజు, రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు దాదాపీర్, డా.బాషా, జయప్ప, మల్లికార్జున, చంద్ర, రామచంద్ర, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, మింటు, ఫారుఖ్, షబ్బీర్, మాజీ మండల కన్వీనర్ నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, తిప్పేరుద్రయ్య, శ్రీరాములు, శబరీష్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సానె రంగారెడ్డి, న్యాతరెడ్డి, నవీన్, ప్రణయ్రెడ్డి, నరసింహులు, చాంద్బాషా, అయూబ్ బేగ్, కవితారెడ్డి, సహేరాభాను, రామాంజనేయులు, సూర్యమోహన్, సలాం తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్కు చావా ఎంపిక
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం 14వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ కోసం డాక్టర్ సత్యనారాయణ చావాను ఎంపిక చేశారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్న డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ అందించాలని చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ ఎమిరటర్స్ ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్ ను ఎంపిక చేశారు. మే 17న స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. చావా విజయ ప్రస్థానం.. లారస్ ల్యాబ్స్ కంపెనీ ఏర్పాటైన 18 ఏళ్లలో ఇప్పటి వరకు 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన 8 సంవత్సరాలకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. లారస్ ల్యాబ్ స్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి పితామహులు, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి 2021 సంవత్సరంలో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. -
‘రాప్తాడు’ను ఎడారిగా మార్చకండి
● రైతు సంఘం నాయకుల డిమాండ్ ● హంద్రీ–నీవా లైనింగ్ పనులు ఆపాలంటూ ఆందోళన కనగానపల్లి: జిల్లాకు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చరాదంటూ కూటమి ప్రభుత్వాన్ని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా కనగానపల్లి మండలం బద్దలాపురం వద్ద హంద్రీ–నీవా కాలువలో చేపట్టిన లైనింగ్ పనులను సోమవారం రైతు సంఘం, సీపీఐ నాయకులు పరిశీలించి, అక్కడే రైతులతో కలసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హంద్రీ–నీవా కాలువ ద్వారా అందుతున్న నీటితోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంతమేర భూగర్భ జలాలు పెంపొందాయన్నారు. ప్రస్తుతం ఈ నీటి ద్వారానే రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో కుప్పం ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలన్న ఉద్ధేశంతో కాలువకు సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ పనులు చేపట్టడం కుట్రపూరితమని మండిపడ్డారు. ఫలితంగా రాప్తాడు నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల ఉన్న సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుభూములన్నీ బీళ్లుగా మారి రాప్తాడు నియోజవర్గం ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. సీఎం చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు. హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు వెంటనే ఆపకపోతే ప్రజా సంఘాలు, రైతులతో కలసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందు, నాయకులు రామాంజినేయులు, మాదన్న, ఆదినారాయణ, సీపీఐ నాయకులు బాలరాజు, మల్లికార్జున, నాగరాజు, ప్రసాద్, వెంకటలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు. జీఓ 117 రద్దు చేయాలి : ఏపీటీఎఫ్ పెనుకొండ రూరల్: జీఓ నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రయోగాలు వీడాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొడూరు శ్రీనివాసులు, జోనల్ అధ్యక్షుడు మల్లికార్జున, రవిచంద్ర, గోపాల్, వెంకటరమణ, ఆంజనేయులు, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు. నీటి సంపులో పడి వ్యక్తి మృతి పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలో నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత నంజప్పకు చెందిన మామిడి తోటలో మడకశిర మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన గంగాధరప్ప(35)తో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. రోజూ స్వగ్రామం నుంచి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లేవారు. ఈ క్రమంలో సోమవారం పనికి వచ్చిన గంగాధరప్ప నీటిని వదిలేందుకు సంప్ వద్దకు వెళ్లాడు. సాయంత్రమైనా ఆయన తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మిగిలిన ఇద్దరు కూలీలు అక్కడకు వెళ్లి పరిశీంచారు. అప్పటికే నీటిలో మృతదేహం తేలియాడుతుండడం గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. కాగా, గంగాధరప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం. -
కాలువ ఇలా.. నీరు వెళ్లేదెలా?
రొళ్ల: సప్లయ్ చానల్ను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వందల ఎకరాలు నిరుపయోగంగా మారాయి. రొళ్ల మండల పరిధిలోని కొడగార్లగుట్ట గ్రామం వద్ద ఉన్న సప్లయ్ చానల్ మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో వర్షపు నీరు చానల్ గుండా వెళ్లడం లేదు. నీళ్లన్నీ కర్ణాటక రాష్ట్రం వైపు వృథాగా వెళ్తున్నాయి. రొళ్ల మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అక్కడ కురిసిన వర్షపు నీరు వృథా కాకూడదనే కొడగార్లగుట్ట సమీపంలో 1996లో రూ.5 లక్షల వ్యయంలో రెండు కిలో మీటర్ల మేర సప్లయ్ చానల్తో పాటు కొడగార్లగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. వర్షపు నీరు సప్లయ్ చానల్ గుండా రొళ్ల కొండ వద్ద ఉన్న వంక తర్వాత చెరువుకు చేరేవి. అయితే ఏళ్లుగా మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో సప్లయ్ చానల్ అధ్వానంగా తయారైంది. దీంతో రొళ్ల మండలంతో పాటు అగళి మండలంలోని వందలాది ఎకరాల భూములు నిరుపయోగంగా మారాయి. కర్ణాటక వైపు నీళ్లు వెళ్లకుండా సప్లయ్ చానల్ సమీపంలో చెక్డ్యాంను కూడా నిర్మించారు. అయితే చెక్డ్యాం ఎత్తు పెంచకపోవడంతో వర్షపు నీళ్లు చానల్ గుండా వెళ్లకుండా దిగువ ప్రాంతమైన కర్ణాటక వైపు వెళ్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో రూ.7 లక్షలతో మరమ్మతు పనులు చేసినా చానల్ మళ్లీ మూసుకుపోవడంతో నీళ్లు పారడం లేదు. నీరు పారక వందల ఎకరాల ఆయకట్టు నిరుపయోగం మరమ్మతు పనులు చేపట్టాలి రొళ్ల చెరువు ఆయకట్టు కింద నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో ప్రస్తుతం వర్షాధారం కింద ఎకరాలో రాగి, ఎకరాలో వేరుశనగ పంటతో పాటు మరో ఎకరాలో ఉలవలు, జొన్నలు సాగు చేశాను. సప్లయ్ చానల్ ద్వారా నీళ్లు మళ్లిస్తే నాలాంటి ఆయకట్టు రైతులందరూ బాగు పడతారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – బసవరాజు, రొళ్ల నీరంతా వృథా అవుతోంది హొట్టేబెట్ట పంచాయతీ అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీరు వృథా అవుతున్నాయి. కొడగార్లగుట్ట వద్ద ఉన్న సప్లయ్ చానల్ నిరుపయోగంగా మారడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సప్లయ్ చానల్ గుండా వర్షపు నీటిని మళ్లించడంతో చెరువు నిండి పంటలు బాగా పండేవి. సప్లయ్ చానల్ను బాగు చేసి నీరు పారే విధంగా చర్యలు చేపట్టాలి. – దేవరాజు, అగళి -
ప్రశాంతంగా ‘నీట్’
అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు (అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాయ్స్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎన్టీయూ–ఏ ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్ఎన్ ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల– గుత్తి) ఏర్పాటు చేశారు. 2,613 మందికి గాను, 2,534 మంది (96.97 శాతం) హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. తల్లిదండ్రులకు తప్పని ఇక్కట్లు.. నీట్ రాయడానికి అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు ఇక్కట్లు తప్పలేదు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం ఎస్కేయూ ప్రధాన ద్వారానికి చాలా దూరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అందరినీ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్దే ఆపివేయడంతో తల్లిదండ్రులు మండుటెండల్లో రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్కేయూ ఉద్యోగుల క్వార్టర్స్లో ఉండే ప్రొఫెసర్లు వారికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చారు. అతి పెద్ద క్యాంపస్ అయిన ఎస్కేయూ లోపలికి తల్లిదండ్రులను కూడా అనుమతించి ఉంటే క్యాంటీన్ వద్దో.. ఇతరత్రా భవనాల వద్ద కూర్చుని ఉండేవారు. ఉదయం 11 గంటలకు లోపలికి వెళ్లిన అభ్యర్థులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బయటే మండుటెండలో వేచి ఉన్నారు. -
పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి
ధర్మవరం అర్బన్: పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా చట్ట ప్రకారం పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హితవు పలికారు. వైఎస్సార్సీపీకి చెందిన పది మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించినా వారికి కోర్టులో బెయిల్ రావడంతో న్యాయం, ధర్మం గెలిచాయని హర్షం వ్యక్తం చేశారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ధర్మవరం కోర్టును ఆశ్రయించగా ఆదివారం రాత్రి పది మందికి జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా విడుదలైన వారితో కలసి ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం అండతో వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే బెదిరేదిలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమాభివృద్ధి సాధ్యమని ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తే బెదిరేదిలేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
నేడు కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎస్పీ కార్యాలయంలోనూ.. పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఎస్పీ వి. రత్న ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలన్నారు. 16న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అధికారులు గైర్హాజరు కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని సూచించారు. అక్రమాలు నిజమే ● రెడ్డెప్పశెట్టికి నోటీస్ జారీ చేసిన ఏపీఐఐసీ చిలమత్తూరు: మండల పరిధిలోని కోడూరులో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్లో రియల్టర్ రెడ్డ్డప్పశెట్టి అక్రమంగా పాలీహౌస్, ఫారం పాండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఏపీఐఐసీ అధికారులు ధ్రువీకరించారు. ‘‘అక్రమాలు కోకొల్లలు’’ శీర్షికన ఏప్రిల్ 28న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏపీఐఐసీ జెడ్ఎం సోనీ ఈ నెల 1న రెడ్డప్పశెట్టి ఎస్టేట్ను తనిఖీ చేశారు. ఈడీ అటాచ్మెంట్ భూముల్లో ఫారంపాండ్, ఒక గది, పాలీహౌస్, విద్యుత్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కోడూరు పొలం సర్వే నంబర్ 679లో ఈడీ అటాచ్మెంట్ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని జెడ్ఎం సోనీ తెలిపారు. హబ్ భూములకు రెడ్డప్పశెట్టి సబ్సిడీలు ఎలా పొందారో హార్టికల్చర్ వాళ్లే సమాధానం చెప్పాలన్నారు. లేపాక్షి హబ్ భూమిలో ఉన్న ఫారం పాండ్లోని మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏడు రోజుల్లోగా ఆక్రమణలు తొలగించాలని నోటీసులు జారీ చేశామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్కు నివేదించినట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్ స్మారక స్థూపం తొలగింపు
చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, పట్టణంలోని రెహమత్పురం సర్కిల్లో ఉన్న ప్రజానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక స్థూపాన్ని శనివారం రాత్రి తొలగించారు. సెంట్రల్ లైటింగ్ పేరుతో ఈ చర్యకు ఒడిగట్టారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ప్రజానేత స్మారక స్థూపాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. స్మారక స్థూపం తొలగింపు విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం ఉదయం పార్టీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ఆధ్వర్యంలో రెహమత్పురం సర్కిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పార్టీ నేతలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి స్మారక స్థూపాన్ని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే బాలకృష్ణకు, మున్సిపల్ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నేతలంతా ప్రతిఘటించారు. దీనితో చేసేదిలేక మునిసిపల్ అధికారులను పిలిపించి మాట్లాడించారు. చివరకు స్థూపాన్ని యథాస్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. దీనితో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. కార్యక్రమంలో పార్టీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ, మున్సిపల్ ఫ్లోర్లీడర్ అసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీఉల్లా తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వేణురెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు. దివంగత నేత హిందూపురానికి శ్రీరామరెడ్డి పథకం ద్వారా తాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్న స్థూపాన్ని ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. హిందూపురంలో అధికారుల అత్యుత్సాహం వైఎస్సార్సీపీ శ్రేణుల తీవ్ర నిరసన -
చెట్టును ఢీకొన్న లారీ
రొద్దం: మండలంలోని తురకలాపట్నం వద్ద ప్రధాన రహదారిపై చింత చెట్టును లారీ ఢీకొంది. వివరాలు.. ఆదివారం ఉదయం పావగడ వైపు నుంచి పెనుకొండకు వెళుతున్న లారీ తురకలాపట్నం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో గోవిందరెడ్డి ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుని బలంగా ఢీకొంది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న హోంగార్డు బాలరాజుతో పాటు డ్రైవర్ పనసంద్రం నరసింహమూర్తి ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి డ్రైవర్, హోంగార్డును వెలికి తీశారు. హోంగార్డుకు చెయ్యి విరిగింది. క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్కు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పెనుకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ద్విచక్ర వాహనాలు ఢీ –వ్యక్తి మృతిహిందూపురం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన భాస్కర్ (35) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతుండగా హిందూపురం మండలం మణేసముద్రం వద్ద ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు తీవ్రం గాయపడ్డారు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతిబుక్కరాయసముద్రం: మండలంలోని అమ్మవారిపేట గ్రామంలో కుక్కల దాడిలో 85 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు సిద్దప్ప, రామలింగ ఆదివారం అదే గ్రామ శివారులో కంచె ఏర్పాటు చేసి గొర్రె పిల్లలను అందులో ఉంచి పెద్ద గొర్రెలను మేపునకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కుక్కలు చొరబడి 85 గొర్రె పిల్లలను కొరికి చంపేశాయి. దీంతో రూ.6 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. -
పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదాం
అనంతపురం కార్పొరేషన్: అవాస్తవాలను ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్న పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదామంటూ ప్రవాసాంధ్రులకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకాంక్షలతో కూడిన చర్చ జరిగింది. ప్రవాసాంధ్రులు భావోద్వేగతంతో వైఎస్సార్సీపీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సాగించిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలు, వారి అవసరాలను తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అన్నింటినీ నెరవేర్చారని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఓ కాగితంగా కాకుండా ప్రజా ఒప్పందంగా నిరూపించారన్నారు. రూ.4.47 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను, 90కి పైగా మౌలిక ప్రాజెక్ట్లను తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లోకి వ్యతిరేకత మొదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడేందుకు అందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న చేసిన మేలును గణాంకాలతోనే తెలియజేస్తూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, క్వీన్స్ల్యాండ్ కన్వీనర్ బ్రహ్మారెడ్డి, పాల్గొన్నారు. బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు -
ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ధర్మవరం అర్బన్: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు పట్టణంలోని శమీనారాయణస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ధ్వజారోహణను అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్, చక్రధర్లు వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఉభయ దాతలుగా గజనాణ్యం పట్టుసాలే సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. అనంతరం లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను పూల పల్లకీపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు సూర్య, చంద్రప్రభ వాహన సేవ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాల్లో స్వామి వారిని ఊరేగించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. -
ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్ఏ) కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. స్థానిక ట్రెజరీ హోమ్లో నిర్వహించిన ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారులుగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు పి.కిరణ్కుమార్ (నెల్లూరు), డి.రవికుమార్(కర్నూలు), ఎన్నికల పరిశీలకులుగా ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు ఎ.రవికుమార్ వ్యవహరించారు. కార్యవర్గంలోని అన్ని స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రటించారు. ఎన్నికై న సభ్యులకు ప్రోసీడింగ్స్ అందజేశారు. నూతన కార్యవర్గ సభ్యులు వీరే.. ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.శంకరనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ఫారూక్ మహమ్మద్, కార్యదర్శిగా జి.మహేశ్వరెడ్డి, కోశాధికారిగా బి.అనంతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పి.సుమనలత, జి.జగదీష్, ఎం.శ్రీనివాసరావు, కె.వాసుమూర్తియాదవ్, సంయుక్త కార్యదర్శులుగా పి.సిద్ధిక్ఖానుమ్, డి.శ్రీనివాసులు, ఎం.కె.రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సి.తిరుమలరెడ్డి, సి.కిషోర్కుమార్చౌదరి, జి.ఉమేష్ ఎన్నికయ్యారు. 11,12న ‘వజ్రగిరి’ బ్రహ్మోత్సవాలు పెద్దపప్పూరు: మండలంలోని తిమ్మన చెరువు గ్రామ సమీపంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11,12న నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 11న స్వాముల వారి ఉత్సవమూర్తులను తిమ్మనచెరువు గ్రామం నుంచి కొండపైకి మేళతాళాలతో ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు.అదే రోజు రాత్రి హైదరాబాద్ పట్టణానికి చెందిన సంగీత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.12 తెల్లవారుజామున తిరుపతికి చెందిన వేదమురళి క్రిష్ణమాచారి (సామవేద పండితుడు) వారి శిష్యబృందంచే హోమం, శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. తిమ్మనచెరువు, జూటూర గ్రామస్తులు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
కమ్ముకుంటున్న చీకట్లు!
చిన్నప్పటి నుంచి అందరితో పాటు ఎంతో ఉల్లాసంగా ఆటపాటలతో గడిపింది. 8వ తరగతి చదువుతుండగా ఒక్కసారిగా కంటి చూపు మందగించింది. ఏమి జరిగిందో ఏమో తెలుసుకునేలోపు ఓ కన్ను పూర్తిగా కనపడకుండా పోయింది. మరో కన్ను సైతం మసకబారింది. శస్త్ర చికిత్స చేస్తే కంటి చూపు వస్తుందని, లేకపోతే శాశ్వతంగా కంటి చూపు దూరమవుతుందని వైద్యులు నిర్ధారించారు. విషయం విన్న వెంటనే నిరుపేద తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. కుమార్తెకు కంటి చూపు ప్రసాదించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నల్లచెరువు: మండలంలోని ఉప్పార్లపల్లి గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి, అమరావతి దంపతులకు కుమార్తె రేష్విత, కుమారుడు పునీత్రెడ్డి ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చలాకీగా ఉండే రేష్విత స్థానిక ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంది పదో తరగతి వరకు చదువుకుంది. బోర్డుపై అక్షరాలు కనిపించక.. ఎనిమిదో తరగతిలోకి వచ్చేసరికి కంటి చూపు సక్రమంగా లేదని రేష్విత గుర్తించింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపితే వారు స్థానికంగా ఉన్న డాక్టర్ల వద్ద చికిత్స చేయించారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. ఈ క్రమంలో కొన్ని నెలల వ్యవధిలోనే బోర్డుపై అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతూ వచ్చింది. మరి కొన్నిరోజుల్లోనే ఓ కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది. మసకబారుతున్న మరో కంటితోనే అతి కష్టం మీద చదవడం.. దినచర్యను కొనసాగిస్తూ వచ్చింది. ఏడాది క్రితం నడుచుకుంటూ వెళ్లే సమయంలో రహదారి సక్రమంగా కనిపించక అదుపు తప్పి కిందపడడంతో తొడ భాగంలోని ఎముక విరిగి పొట్టలో గుచ్చుకుంది. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అప్పటికప్పుడు తెలిసిన వారి వద్ద అప్పు చేసి రూ.2 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయించారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో నడవలేకపోతోంది. తాను కంటి చూపు కోల్పోతున్నానని తెలుసుకున్న రేష్వితలో పట్టుదల పెరిగింది. కేవలం చదువు ఒక్కటే తన జీవన గమనాన్ని మారుస్తుందని భావించిన ఆమె అరకొరగా కనిపిస్తున్న కంటికి పది సెంటీమీటర్ల దూరంలో పుస్తకరాన్ని ఉంచుకుని అక్షరమక్షరం చదివి ఆకళింపు చేసుకుంది. ఈ నేపథ్యంలో కంటిపై ఒత్తిడి పెరుగుతున్నా.. శస్త్రచికిత్స చేసిన కాలి నొప్పి బాధిస్తున్నా పంటి బిగువనే ఓర్చుకుంది. పట్టుదలతో చదువుకుని మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో తెలుగు–92, హిందీ–64, ఇంగ్లిష్–81, సైన్స్–70, సోషల్–63 మార్కులు వచ్చాయి. అయితే కంటి చూపు సహకరించకపోవడంతో గణితం పరీక్ష సక్రమంగా రాయలేకపోయానని, దీంతో లెక్కల పరీక్ష ఫెయిల్ కావడం తననెంతో బాధించిందంటూ రేష్విత కన్నీటి పర్యంతమవుతోంది. కళ్ల మార్పిడితోనే ఫలితం క్రమంగా కంటి చూపు కోల్పోతున్న రేష్వితను పిలుచుకుని తల్లిదండ్రులు కదిరి, అనంతపురం, బెంగళూరు, తిరుపతి, మదనపల్లి, హైదరాబాద్లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అప్పులు చేసి రూ.2 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. డాక్టర్లు ఇచ్చిన మందులు, ఐ డ్రాప్స్ సంవత్సరాలుగా వాడినా ఫలితం దక్కలేదు. రోజురోజుకూ కంటి చూపు తగ్గడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక అప్పులు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో దిక్కుతోచని తల్లిదండ్రులు తమ కంటి ముందే తారట్లాడుతూ నడుస్తున్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోతున్నారు. అయితే కళ్ల (కార్నియా) మార్పిడితోనే రేష్వితకు కంటి చూపువస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, రేష్వితకు కళ్ల మార్పిడి చేయాలంటే రూ.2 లక్షలు ఖర్చు వస్తుందని, ఈ మొత్తాన్ని తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో నిరుపేద తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో వ్యవసాయానికి ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డకు కంటి చూపు ప్రసాదించాలని వేడుకుంటున్నారు. పట్టుమని 15 ఏళ్లకే కంటి చూపు దూరం ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందన్న వైద్యులు శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు అవసరం చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడుతున్న నిరుపేద కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకోలు -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
పుట్టపర్తి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. తొలిసారి పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక ఓ హోటల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు రజనీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, దామోదరరెడ్డి, సుధామణి, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, అపాస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్సీ మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్చించినట్లు తెలిపారు. పాత బకాయిలతో పాటు మెరుగైన ఐఆర్, పీఆర్సీ అందించాలని కోరామన్నారు. వేసవిలో క్లాసులు బోధించే టీచర్లకు ఈఎల్ మంజూరు చేయాలన్నారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రశ్న పత్రాలు జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రం మొత్తం ఒక్కటే ఉండేలా చూడాలని సూచించారు. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉండేలాచూడాలని, ప్రాథమికోన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని కోరామన్నారు. విడతల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం భరోసానిచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు తలమర్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు -
రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్
అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఇటీవల దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ రాక సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.చెన్నేకొత్తపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మవరం మెజిస్ట్రేట్.. పది మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పరామర్శించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత
సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్ పూర్ సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
పరిటాల సునీత డైరెక్షన్.. తోపుదుర్తిపై కేసు
సాక్షి, సత్యసాయి: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత డైరెక్షన్లో పోలీసులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా నడుచుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద హెలీకాప్టర్ను ప్రజలు చుట్టుముట్టారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసుల హైడ్రామాకు దిగారు. ఇందుకు కారణంగా.. హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం, 25 మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను విచారణ పేరుతో రామగిరి పోలీసులు తీసుకెళ్లారు. -
అకాల వర్షం.. అపార నష్టం
● జిల్లోలోని 27 మండలాల్లో వర్షం ● ఈదురుగాలులతో నేలరాలిన మామిడి కాయలుపుట్టపర్తి/పుట్టపర్తి అర్బన్: అకాల వర్షంతో జిల్లా రైతులకు అపార నష్టం జరిగింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలీవాన బీభత్సంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా మామిడితోటల్లోని కాయలన్నీ నేలరాలాయి. బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి, జానకంపల్లి, కడపనాగేపల్లి తదితర గ్రామాల్లోని మామిడితోటల్లోని కాయలు రాలి కింద పడ్డాయి. దీంతో రైతులకు రూ.లక్షల నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో బీమాతో సంబంధం లేకుండా పంటనష్టం జరిగిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు నపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గాలీవానకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. సోమందేపల్లి మండలంలో అత్యధికం సోమందేపల్లి మండలంలో అత్యధికంగా 37.2 మి.మీ వర్షం కురిసింది. ఇక పెనుకొండ 35.8, బత్తలపల్లి 35.6, గుడిబండ 32.4, బుక్కపట్నం 25.6, అమరాపురం 25.2, తాడిమర్రి 19.2, రొళ్ల 18.4, ధర్మవరం 15.6, కొత్తచెరువు 15.2, కనగానపల్లి 10.2, పుట్టపర్తి 10.2, అగళి 9, చిలమత్తూరు 8.8, తలుపుల 8.4, సీకేపల్లి 8.4, ఓడీచెరువు 7.4, హిందూపురం 6.8, మడకశిర 6.2, గోరంట్ల 6.2, రామగిరి 5.2, నల్లమాడ 4.6, రొద్దం 3.6, కదిరి 3.2, ముదిగుబ్బ, అమడగూరు, లేపాక్షి మండలాల్లో 2.2 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కూలిన ఇల్లు.. దంపతులకు గాయాలు పుట్టపర్తి టౌన్: అకాల వర్షానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బడేనాయక్ తండాలోని ఓ ఇంటి పైకప్పు రేకులు ఎరిగిపోయాయి. గోడలు కూలిపోగా ఇంట్లో నిద్రస్తున్న డుంగావత్ ప్రసాద్నాయక్, నిర్మలాభాయికి గాయాలయ్యాయి. గాలి ధాటికి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరిపోయి సమీపంలోని పొలంలో ఉన్న ఆవులకు తగలడంతో అవి గాయపడ్డాయి. -
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ నాటికి పరీక్షలు ముగుస్తాయి. తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ బాలజీ పీజీ కళాశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 594 మంది అభ్యర్థులకు గాను 389 మంది హాజరయ్యారు. 205 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి.వినోద్కుమార్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక సదుపాయల కల్పనపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏపీఎస్సీ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, లైజన్ అధికారి ఎస్డీసీ తిప్పేనాయక్, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు.ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లుడిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్కు గాయాలుకనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషాతో కలిసి శనివారం ఉదయం అనంతపురం నుంచి పెనుగొండ వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న మరో కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని ఇటువైపు వెళ్తున్న వీరి కారును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీటీ ఇంతియాజ్తో పాటు సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుపుట్టపర్తి అర్బన్: జిల్లాలోని కురుబ కులానికి చెందిన పది, ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు కురుబ ఉపాధ్యాయ ఉద్యోగులు సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల విద్యార్థులు ఈనెల 8వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో 500 మార్కులు ఆపైన వచ్చిన విద్యార్థులు, ఇంటర్లో 900 మార్కులు ఆపైన వచ్చిన విద్యార్థులు అర్హులన్నారు. 8985997169, 9505551006, 6281140300, 9705684227 నంబర్లకు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.మార్మోగిన నారసింహ నామస్మరణకదిరి టౌన్: పట్టణంలోని ఖాద్రీ ఆలయం శనివారం నారసింహ నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ మహిళలు ఆలయం ముందు దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. -
ధర్మవరానికి చెడ్డపేరు తెచ్చారు
ధర్మవరం: ‘‘ధర్మవరం పేరు చెబితే సుపరిపాలన గుర్తుకు వచ్చేది. అభివృద్ధి కళ్లముందు కనిపించేది. కానీ కూటమి సర్కార్ కొలువుదీరిన 11 నెలల కాలంలోనే ధర్మవరానికి చెడ్డపేరు తీసుకువచ్చారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మార్చారు. సహజ వనరులు కొల్లగొడుతూ సొంత జేబులు నింపుకుంటన్నారు. పరిపాలన లేదు...ఒక్క సంక్షేమ పథకం లేదు. పైపెచ్చు పేదలను హింసిస్తున్నారు..ఇదేనా మీ పాలన’’ అంటూ బీజేపీ నేతలపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, గజ్జల శివ తదితరులు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని చిత్రావతి నది నుంచి అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారన్నారు. అలానే ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో కూటమి పార్టీల నాయకులు మట్టి మాఫియాగా ఏర్పడి కొండలను, గుట్టలను తవ్వి అక్రమార్జన చేస్తున్నారన్నారు. వీరి దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఇందుకోసం ఆర్డీఓ కార్యాలయానికి ప్రతినెలా రూ.10 లక్షలు లంచాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి లంచాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఇక్కడి ప్రజలు మునుపెన్నడూ చూడలేదన్నారు. కేతిరెడ్డిపై ఆరోపణలు తగవు ఇటీవల కాలంలో కొంతమంది బీజేపీ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు కేతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేతిరెడ్డిని విమర్శించే వారు తమస్థాయి తెలుసుకోవాలన్నారు. నిజంగా అభివృద్ధి ఎవరు చేశారో ధర్మవరం ప్రజల్ని అడిగితే తెలుస్తుందన్నారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని తెచ్చి నీటిఎద్దడిని నివారించిన ఏకై క నాయకుడు కేతిరెడ్డి అన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయన కట్టించిన ఆసుపత్రిలోనే మీరు డయాలసిస్ సెంటర్ను పెట్టిన విషయాన్ని గ్రహించాలన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా కేతిరెడ్డి 24 వేల ఇంటిపట్టాలను మంజూరు చేయించారన్నారు. ఆర్ఓబీలు, అండర్ బ్రిడ్జిలు, రహదారులు, శివారు ప్రాంత కాలనీలకు సమానంగా సీసీరోడ్లు, డ్రైన్లు నిర్మించారన్నారు. అలాంటిది తామెందుకు అభివృద్ధికి అడ్డుపడతామని ప్రశ్నించారు. ఇప్పటికై నా చిల్లర వేషాలు మానుకుని ప్రజల కోసం పనిచేయకపోతే గుణపాఠం చెప్పి తీరుతామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు రమాదేవి, నాగరాజు, చింతా యల్లయ్య, అత్తార్ జిలాన్, వార్డు ఇన్చార్జ్లు ఎస్పీ బాషా, కేశగాళ్ల కృష్ణ, కత్తెపెద్దన్న, మట్టెద్దుల కేశవరెడ్డి, గడ్డంరంగ, బాలం గోపాల్ పాల్గొన్నారు. 11 నెలల కూటమి పాలనలో అవినీతి, దందాలకు కేరాఫ్గా మార్చారు సహజ వనరులు కొల్లగొట్టారు.. మున్సిపాలిటీని అవినీతి కూపంలోకి నెట్టారు బీజేపీ నాయకులపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం -
ఎన్ఎస్పీఆర్లో రేపు ఉద్యోగ మేళా
హిందూపురం టౌన్: స్థానిక ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 5న మహిళా అభ్యర్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రగతి శనివారం తెలిపారు. హోసూరుకు చెందిన టాటా ఎలక్ట్రాన్సిక్స్ లిమిటెడ్ తయారీ విభాగం, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా మేళా నిర్వహిస్తున్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అర్హులన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి నెలకు రూ.18 వేల జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయం కల్పిస్తారన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతోపాటు ఆధార్కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలన్నారు. వివరాలకు నియామక అధికారి డాక్టర్ రవినాయక్ 9493757277 నంబరులో సంప్రదించాలన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు కదిరి అర్బన్: పౌర్ణమి పురస్కరించుకుని ఈనెల 12న అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కదిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మైనుద్దీన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు బస్సు డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. టికెట్టు ధర రూ.1,140 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382860486 సెల్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. -
రాజకీయాల కోసం జీవితాలతో ఆడుకోవద్దు
చిలమత్తూరు: ‘‘వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యం చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెలరేగి పోతున్నారు. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటోగానీ బాధిత కుటుంబాలు పడే కష్టాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటున్నాయి. రాజకీయాల కోసం జీవితాలతో ఆడుకోవద్దు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ టీడీపీ నేతలకు హితవు పలికారు. క్రికెట్ బంతి కోసం పాఠశాల భవనంపైకి ఎక్కగా అక్కడే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసుతో వాల్మీకి లోకేష్ హిందూపురం సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. దీంతో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి వాల్మీకి లోకేష్కు కండీషన్ బెయిల్ తెచ్చారు. ఈ సందర్భంగా సబ్జైలు వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికతో కలిసి ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. తండ్రి జైలులో కాకుండా ఇంట్లోనే ఉండి ఉంటే ఆ బాలుడు అశ్విన్ అటువైపు వెళ్లి మరణించేవాడు కాదేమోనన్నారు. బిడ్డ మరణవార్త విని అస్వస్థతకు గురైన లోకేష్ ఒకవైపు ప్రభుత్వాసుపత్రిలో చేరడం, అదే ఆస్పత్రిలో తన బిడ్డ విగతజీవిగా ఉండటం బాధాకరమైన విషయమన్నారు. కోర్టు ఆదేశాలతో కండీషన్ బెయిల్ రావడంతో లోకేష్కు తనబిడ్డ ఆఖరి చూపు చూసుకునే అవకాశం దక్కిందన్నారు. లోకేష్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. విద్యుత్శాఖ నిర్లక్ష్యంతోనే బాలుడు అశ్విన్ మరణించాడని, దీనికి విద్యుత్శాఖ అధికారులు బాద్యత వహించాలన్నారు. అక్రమ కేసులు అన్యాయం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ...వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతల అక్రమ కేసులు అన్యాయమన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే పోలీసులు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా కేసులు నమోదుచేసి జైలుకు పంపుతున్నారన్నారు. మోహన్ అనే వ్యక్తి వల్ల లోకేష్ జైలు పాలయ్యారన్నారు. దీనివల్ల అతను సాధించినది మాత్రం ఓ కుటుంబానికి నష్టం చేకూర్చడమేనన్నారు. అయినా చేయని తప్పుకు లోకేష్పై అక్రమంగా కేసు బనాయించారన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లోకేష్తో పాటు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ కేసులలో ఇరికించి జైలుకు పంపారన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అక్రమ కేసులు బనాయించిన పోలీసులను కోర్టుముందు నిలబెడతామన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోండి టీడీపీ నేతలకు ఉషశ్రీ చరణ్ హితవు వాల్మీకి లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడిఅశ్విన్ ఆరాధ్యకు కన్నీటి నివాళి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపీక, నాయకుడు వేణురెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి తదితరులు సబ్జైలు నుంచి వాల్మీకి లోకేష్ను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం కన్నీటి నివాళుల మధ్య వాల్మీకి లోకేష్ తనయుడు అశ్విన్ ఆరాధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లోకేష్కు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, వైఎస్సార్ సీపీ కురబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, ఆ పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మహేష్గౌడ్, నాగరాజు, చిలమత్తూరు మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, ధనుంజయరెడ్డి, శివశంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఐటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు గిరీష్రెడ్డి, సురేష్కుమార్రెడ్డి, వెంకటరెడ్డి, కవిత, శ్రీనివాసరెడ్డి పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిజానిజాల్ని ప్రజలకు వివరిద్దాం
అనంతపురం మెడికల్: ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే సామాజిక మాధ్యమాల ద్వారా నిజం గళం వివరించి ప్రజలను చైతన్యవంతునలు చేద్దామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నివర్గాల ప్రజలకు పథకాలు అందించడం ద్వారా సంక్షేమ విప్లవాన్ని సృష్టించారన్నారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేశారని, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చడమే కాకుండా అన్ని వర్గాల వారికి ఖరీదైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలనలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాయాలను తీసుకువచ్చి ఒకేసారి 1,25,000 మందికి ఉద్యోగాలు, 2.6 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. ఇంటి వద్దకే పాలననందించారన్నారు. అబద్దాలకు గళం ఇస్తే మనం వాస్తవాలకు శబ్దం ఇవ్వాలని, డేటా, గణాంకాలు, గ్రాపులు ఇవేన ఆయుధాలని, జగనన్నను సీఎం చేసుకోవడానికి ప్రవాసాంధ్రులు పోరాట పటిమను చాటాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్ సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, మెల్బోర్న్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మెలబోర్న్లో ప్రవాసాంధ్రులతో సమావేశం -
విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఆస్తినష్టం
హిందూపురం: మోతుకపల్లిలో విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పూల నాగరాజు శనివారం విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జిలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంటిలోని వస్తువులు, బీరువా, అందులోని మూడున్నర తులాల బంగారు నగలు కాలిపోయాయి. ఘటనలో దాదాపు రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. పూలు అమ్ముకుని జీవించే తాము అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. నలుగురిపై కట్నం వేధింపుల కేసు నమోదు బత్తలపల్లి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. గుమ్మల్లకుంట గ్రామానికి చెందిన శ్రావణిని 2019లో గద్వాల్ జిల్లా కోయిలదిన్నె గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్రెడ్డికు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అప్పట్లో కట్నం కింద 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షలు నగదు ఇచ్చారు. అదనపు కట్నం కోసం నాలుగేళ్ల నుంచి శ్రావణిని భర్త, అతని తల్లిదండ్రులు నిర్మలమ్మ, కేశవరెడ్డి, బావ విజయ్కుమార్రెడ్డి మూకుమ్మడిగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. దీంతో హైదరాబాద్లోని గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కౌన్సిలర్ ద్వారా పిల్లల భవిష్యత్ కోసం కలిసి జీవించాలని సర్ది చెప్పారు. అయినా భర్త, అత్త, మామ, బావ ప్రవర్తన మార్చుకోకుండా వేధింపులు కొనసాగించారు. దీంతో మరోసారి రూ.2 లక్షలు తీసుకెళ్లి భర్తకు ఇచ్చింది. అయితే శ్రావణి తల్లి పేరు మీద ఉన్న భూమిని ప్రవీణ్కుమార్రెడ్డికి ఇవ్వాలని ఏడాది నుంచి వేధింపులు కొనసాగిస్తున్నారు. పిల్లలను పట్టించుకోకుండా కట్నం కోసం వేధిస్తుండటంతో శుక్రవారం బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నల్ల్లలమ్మ ఆలయంలో చోరీ రాప్తాడు: బుక్కచెర్ల ఎస్సీ కాలనీలోని నల్ల్లలమ్మ ఆలయంలో అమ్మవారి సోత్తులు చోరీకి గురయ్యాయి. ఆలయ నిర్వాహకులు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలు.. ఆలయ పూజారి నల్లప్ప అమ్మవారికి ప్రతి మంగళ, శుక్ర, ఆదివారం పూజలు చేస్తుండేవారు. శుక్రవారం పూజలు చేసి ఆలయానికి తలుపులు వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి 80 గ్రాముల అమ్మవారి ముఖావళి, 20 గ్రాముల 3 వెండి గొడుగులు, ఒక తులం బంగారు తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. రూ.2 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి అనంతపురం: మద్యం మత్తులో స్నేహితుడిపై దాడిపై దాడి చేసిన ఘటన శారదనగర్లో చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన వివరాలు..ఫెర్రర్ నగర్కు చెందిన మునాఫ్, శారదానగర్కు చెందిన మురళి మిత్రులు. మద్యం సేవించిన అనంతరం మాటామాట పెరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు. దూషించాడనే అవమానంతో దూషించిన మురళి నాటు కొడవలి, దుస్తులు శుభ్రం చేసే సోడా రసాయన ద్రావణం, తీసుకుని తిరిగి మద్యం షాపు వద్దకు వచ్చాడు. శారదనగర్లో మద్యం షాపు వద్ద మద్యం సేవిస్తున్న మునాఫ్పై ద్రావణం చల్లాడు. రాయి, కొడవలితో దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ మునాఫ్ను ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. బాధితుడి కళ్లు, ముఖం, శరీర భాగాలు దెబ్బన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు. రెచ్చిపోయిన జేసీ ● సీపీఎం నేత రాంభూపాల్పై అనుచిత వ్యాఖ్యలు తాడిపత్రిటౌన్ : తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. సీపీఎం రాష్ట్ర నేత రాంభూపాల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పడమే నేరమన్నట్లుగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉన్నా జేసీ ప్రభాకర్రెడ్డి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. ఈ అంశంపై ‘సాక్షి’ టీవీ డిబేట్లో రాంభూపాల్ మాట్లాడడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ..తనదైన రీతిలో రెచ్చిపోయారు. ‘స్కూల్ గ్రౌండ్లో టిప్పర్లతో రాళ్లు వేశామని మాట్లాడుతున్నావ్.. మాజీ ఎమ్మెల్యేను ఎందుకు వెనుకేసుకొస్తున్నావ్? ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా? గత ఐదేళ్లు ఎక్కడికి పోయింటివి రాంభూపాల్.. ఆరోజు నన్ను పోలీసోళ్లు ముసలోడినని కూడా చూడకుండా ఎలా తోశారో చూడలేదా? నాకు నీ మీద మంచి అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో నీకు మర్యాద పోయింది. నీ గురించి కూడా తీస్తా. విత్ రికార్డ్తో వస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. -
రైతు ఉసురు తీసిన అప్పులు
వజ్రకరూరు: అప్పులు ఓ గిరిజిన రైతు ఉసురు తీశాయి. వెంకటాంపల్లి పెద్దతండా (రూప్లానాయక్ తండా)లో శనివారం సబావత్ సామునాయక్ (44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సబావత్ సాము నాయక్కు నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో ఏడుదాకా బోర్లు వేయించాడు. బోర్ల ద్వారా వచ్చే నీటి ఆధారంగా మూడేళ్లుగా మిరప సాగు చేస్తున్నాడు. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పెట్టాడు. అయితే పంటలు ఆశించిన స్థాయిలో చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు రూ.16లక్షలకు చేరుకున్నాయి. వీటిని ఎలా తీర్చాలో అర్థం కాక రోజూ మదనపడుతుండేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సబావత్ సామునాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులు ముగించుకుని వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తట్టగా ఎంతకూ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా సామునాయక్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేశారు. దేవుడా ఇక తమకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. రైతు సామునాయక్కు భార్య సామక్కబాయి, నలుగురు కుమారులు ఉన్నారు. ఎంపీపీ రమావత్ దేవి, సర్పంచ్ కొర్రా శివాజీ నాయక్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సువర్ణ వాసవీ మాత విగ్రహావిష్కరణ
హిందూపురం: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన 2.5 కేజీల సువర్ణ వాసవీ మాత విగ్రహాన్ని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వందలాది మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో లేపాక్షి ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాల్లో పరిశ్రమల హబ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సేకరణ చేపడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే రూ.8 లక్షల కోట్లపైగా పెట్టుబడితో పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు. పదో తరగతి పరీక్షల్లో అధికమార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్కుమార్, ఆర్యవైశ్యసంఘ అధ్యక్షులు జేపీకేరాము, కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు కోట సత్యం, రవికుమార్, వెంకటేష్, నరసింహులు, లక్ష్మీకాంత్,టీడీపీ నాయకులు అంజనప్ప, కౌన్సిలర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విషాదం.. కరెంట్ తీగలు తగిలి వైఎస్సార్సీపీ నేత కుమారుడు మృతి
సాక్షి, సత్యసాయి: హిందూపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి వైఎస్సార్సీపీ నేత కుమారుడు అశ్విన్ ఆరాధ్య(11) మృతిచెందాడు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కన్న కొడుకు చనిపోవడంతో తల్తి బోరున విలిపిస్తోంది.వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య. వేసవి సెలవులు కావడంతో అశ్విన్ తన స్నేహితులతో కలిసి ముద్దిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ తీసుకునేందుకు వెళ్లగా అక్కడే ఉన్న కరెంట్ తీగలు తగలి షాక్ కొట్టింది. దీంతో, అశ్విన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి విషయం తెలిసిన తల్లి బోరును విలపిస్తూ కన్నీరుపెట్టుకుంది.మరోవైపు.. కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల కారణంగా వాల్మీకి లోకేష్ ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం వాల్మీకి లోకేష్ జైలులో ఉండగా.. కొడుకు మరణ వార్త విని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కొడుకు అశ్విన్ ఆరాధ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాల్మీకి లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఎంఎల్హెచ్పీల డిమాండ్లు నెరవేర్చాలి
పుట్టపర్తి అర్బన్: ఎంఎల్హెచ్పీలు, సీహెచ్ఓల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత ఐదు రోజులుగా డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఎంఎల్హెచ్పీలు, సీహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారం ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఎంఎల్హెచ్పీలు, సీహెచ్ఓల సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళతామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ రవినాయక్, మాజీ కన్వీనర్ మాధవరెడ్డి, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు లింగా రామమోహన్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి డిమాండ్ -
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం
ధర్మవరం అర్బన్: కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ధర్మవరంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం అత్యంత పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. క్రీ.శ.950లో కీచక మహామునీశ్వరుడు ఉదయాద్రి మీద తపస్సు చేసి హంపి నుంచి చెన్నకేశవస్వామి మూలవిరాట్ను తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లుగా ఆధారాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం హరిహర బుక్కరాయల పాలనలో సామంతరాజులు క్రియాశక్తి వడియార్ ధర్మవరంలో చెరువును తవ్వించారు. అలాగే రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఓ రైతు పొలం దున్నుతుండగా భూనీల సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు లభ్యమయ్యాయి. అదే సమయంలో క్రియాశక్తి వడియార్కు స్వామి కళలో కనిపించి ధర్మాంబపురం (ప్రస్తుతం ధర్మవరం) ఆలయంలో ప్రతిష్టించమని అదృశ్యం కావడంతో వాటిని తీసుకువచ్చి తూర్పు దిశగా బ్రాహ్మణవీధిలో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతిష్టించారు. దేవాలయం ఏర్పడినప్పటి నుంచి అర్చకత్వం వంశపారంపర్యంగా రావడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా కోనేరాచార్యులు, అర్చకులుగా మకరందబాబు, భానుప్రకాష్ నిత్య పూజలు చేస్తున్నారు. 2013వ సంవత్సరంలో దాతలు, టీటీడీ సహకారంతో రూ.60లక్షల వ్యయంతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు. వివాహాలు చేసేందుకు వీలుగా కల్యాణ మంటపాన్ని నిర్మించారు. ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి నుంచి బహుళ విదియ వరకు ధర్మవరంలో అత్యంత వైభవంగా లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. 11రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మ రథంపై స్వామిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు, కడప తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రథోత్సవం అనంతరం మూడురోజుల పాటు గ్రామ దేవత దుర్గమ్మ పరుష వైభవంగా నిర్వహిస్తారు. స్వామి పాదాలను తాకే సూర్యకిరణాలు ఏటా మాఘమాసంలో మొదటిరోజు సూర్యకిరణాలు చెన్నకేశవస్వామి మూలవిరాట్ పాదాలను తాకుతాయి. రెండో రోజు స్వామి వక్షస్థలాన్ని, మూడోరోజు మూలవిరాట్ మొత్తం సూర్యకిరణాలు తాకుతాయి. మిగిలిన రోజుల్లో సూర్యకిరణాలు స్వామిని తాకవు. ధనుర్మాసంలో నెల రోజులపాటు స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశికి దక్షిణ, ఉత్తర ద్వారాల ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశికి వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. క్రీ.శ.950లో నిర్మించిన ఆలయం భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి ధర్మవరంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు.. 10న బ్రహ్మ రథోత్సవం ఉత్సవాలకు తరలిరండి ధర్మవరం పట్టణంలో నిర్వహించే లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే కోరిన కోర్కెలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో ఇక్కడి లక్ష్మీచెన్నకేశవస్వామి చాలా మహిమాన్వితుడిగా కొలుస్తుంటారు. వాహన సేవలకు సంబంధించి కొత్తవి తయారు చేయించారు. – వెంకటేశులు, ఆలయ ఈఓరేపటి నుంచి బ్రహ్మోత్సవాలు... ధర్మవరంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 4న ధ్వజారోహణం, 5న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనంలో స్వామి ఊరేగుతారు. 6న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనం, 7న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమద్వాహనం, 8న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం ఉంటాయి. 9న ఉదయం గరుడోత్సవం, సాయంత్రం శేష వాహనం, రాత్రి గజ వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. 10న ఉదయం 7 గంటలకు మడుగుతేరు (రథోత్సవం) లాగుతారు. అనంతరం సాయంత్రం వరకు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ధూళోత్సవం ఉంటుంది. 11న సాయంత్రం అశ్వవాహనం, 12న ఉదయం పుష్ప మంటపం, 10 గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు హంస వాహన సేవలు ఉంటాయి. 13న ఉదయం పుష్ప యాగం, సాయంత్రం దేవతా ఉద్వాసన, 14న సాయంత్రం శయనోత్సవం (ఏకాంత సేవ)తో ఉత్సవాలు ముగుస్తాయి. -
బాలల సంరక్షణ సదనాల సిఫార్సుల కమిటీ ఏర్పాటు
ప్రశాంతి నిలయం: జిల్లాలో బాలల సంరక్షణ సదనాల నిర్వహణకు జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సభ్యులను ఎంపిక చేశారు. కమిటీలో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీపీఓ ఖలీల్బాషా, డీసీపీఓ మహేష్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీడబ్లూసీ సభ్యులు ఓబులపతి, ఆదినారాయణమ్మ సభ్యులుగా ఉన్నారు. నూతన కమిటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్న సదనాల వివరాలు, వారి అర్హతలు పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది బాలల సంరక్షణ సదనాలు ఉన్నాయి. -
అతి వేగం...
రాప్తాడు: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని దేవనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ (44), ప్రతాప్, అమర్నాథ్, నగేష్... కేఏ50ఏ 9691 నంబర్ గల కారులో మంత్రాలయ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. అక్కడ పూజాదికాలు ముగించుకున్న అనంతరం శుక్రవారం దేవనహళ్లికి తిరుగు ప్రయాణమయ్యారు. రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఘటనలో కారు నడుపుతున్న మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్, అమర్నాథ, నగేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.జేఎన్టీయూ విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్అనంతపురం: జేఎన్టీయూ(ఏ) విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. ఇందు కోసం హైదరాబాద్లోని స్మార్ట్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒప్పందంలో భాగంగా ఎక్స్పీరిన్సియల్ లర్నింగ్, వర్చువల్ ఇంటర్న్షిప్ను విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూ (ఏ) విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా సాఫ్ట్స్కిల్స్ అభ్యసించేందుకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ టూ వీసీ ఆచార్య ఓ.దేవన్న, రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ సి.శోభాబిందు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి, స్మార్ట్ బ్రిడ్జి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీ దేవి సిరా పాల్గొన్నారు.శభాష్ వర్ణిక!తాడిపత్రిటౌన్: ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్... గట్టి మేలు తలపెట్టవోయ్’ అన్న గురజాడ అప్పారావు మాటలను 14 ఏళ్ల బాలిక వర్ణిక ఆచరణలో పెట్టి పోలీసులతో శభాష్ అనిపించుకుంది. వివరాలు... గత నెల 30న తాడిపత్రి మండలం అయ్యవారిపల్లికి చెందిన భాస్కర్ నాయక్ తాడిపత్రిలోని మెయిన్ బజార్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో రూ.9వేలు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాంక్ ఖాతా నుంచి నగదు డ్రా అయినా.. ఏటీఎం నుంచి రాలేదు. చాలా సేపటి వరకూ ఆయన అక్కడే వేచి చూశాడు. అయినా డబ్బు రాకపోవడంతో విసుగు చెంది వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అదే ఏటీఎం కేంద్రానికి డబ్బు డ్రా చేసుకునేందుకు యల్లనూరు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన బాలిక వర్ణిక వెళ్లింది. అయితే అప్పటికే ఏటీఎంలో నగదు కనిపించడంతో ఆశ్చర్యపోయిన బాలిక... చుట్టుపక్కల పరిశీలించింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ డబ్బు తీసుకెళ్లి నేరుగా సీఐ సాయిప్రసాద్కు అందజేసింది. లెక్కిస్తే రూ.9వేలు ఉన్నాయి. పోలీస్ విచారణలో ఆ డబ్బు అయ్యవారిపల్లికి చెందిన భాస్కర్ నాయక్దని గుర్తించిన పోలీసులు శుక్రవారం ఆయనను పీఎస్కు పిలిపించి వర్ణిక చేతుల మీదుగా అందజేయించారు. ఈ సందర్భంగా వర్ణికను పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.వ్యక్తి అనుమానాస్పద మృతిలేపాక్షి: మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణం ఎదుట శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని ధర్మవరానికి చెందిన లింగారెడ్డి(53)గా గుర్తించారు. లేపాక్షి మండలం బిసలమానేపల్లిలో కూలీ పనులకు వచ్చిన ఆయన పని అనంతరం మద్యం సేవించేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని మద్యం సేవించాడు. మరో బాటిల్ను నిక్కర్ జేబులో ఉంచుకుని వెళుతూ మద్యం దుకాణానికి కూత వేటూ దూరంలో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఉపశమన చర్యలు చేపట్టేలోపు మృతి చెందాడు. మృతుడి వద్ద మద్యం బాటిల్తో పాటు బీడీ కట్టలు, అగ్గిపెట్టె, హాన్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కాగా, కల్తీ మద్యం సేవించడం వల్లనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం కావడంతో మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గ్రానైట్ తవ్వకాలతో నష్టపోతున్నాం
● విజిలెన్స్, మైనింగ్ అధికారుల ఎదుట రైతుల ఆవేదన రొళ్ల: గ్రానైట్ తవ్వకాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని విజిలెన్స్, మైనింగ్ అధికారుల ఎదుట రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రొళ్ల మండలం గుడ్డగుర్కి పంచాయతీ పరిధిలోని గొట్టుగుర్కి గ్రామ సమీపాన సర్వే నంబర్లు 152, 157తో పాటు 93లోని బద్ధికొండ, మాలకొండల్లో చేపట్టిన గ్రానైట్ తవ్వకాల పనులను గనులశాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్, విజిలెన్స్ అధికారులు గ్రానైట్ తవ్వకానికి ఎంత వరకు అనుమతి ఉంది, ఎంత మేరకు తవ్వారు. రాయల్టీ ఎంత చెల్లించారు అనే విషయాలపై ఆరా తీశారు. కొందరు రైతులు మాట్లాడుతూ... బద్ధికొండ, మాలకొండల్లో చేపట్టిన గ్రానైట్ తవ్వకాల వల్ల తాము తీవ్రంగా నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బద్ధికొండను ఆనుకుని వందలాది ఎకరాల సాగు భూమితో పాటు చెక్డ్యాంలు, కుంటలు, కట్టలు, వ్యవసాయ బోరుబావులు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. అంతే కాక గ్రానైట్ తవ్వకం వల్ల జరిగిన నష్టానికి ఇప్పటి వరకూ పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని గ్రానైట్ తవ్వకాల పనులు నిలిపి వేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని గనులశాఖ (మైనింగ్) అధికారులు ఖాజాహుస్సేన్, పురుషోత్తం, సునీతతో పాటు విజిలెన్స్ అధికారులు నాగభూషణ్, జమాల్బాషా, వాసుప్రకాష్ తదితరులు హెచ్చరించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వీఆర్వో రంగనాథ్, మైనింగ్, విజిలెన్స్తో పాటు రెవెన్యూశాఖ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.గ్రంథాలయాలు... విజ్ఞాన కేంద్రాలు అనంతపురం: గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలని పర్సన్ ఇన్చార్జ్ హోదాలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి అంశంపై జిల్లాలోని 79 గ్రంథాలయాధికారులతో కలసి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. నిర్ణీత సమయానికి గ్రంథాలయాలు తెరచి ఉంచాలన్నారు. గ్రంథాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. గ్రంథాలయా పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ వారి నుంచి నిర్ణీత సమయంలో పన్నులు రాబట్టాలన్నారు. గ్రంథాలయాలను ఆదర్శంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాలపై పాఠకులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో స్వచ్ఛందంగా సేవ చేసే దృక్పథం ఉన్న వారిని రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేయాలన్నారు. వీరి నుంచి గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులకు డ్రాయింగ్, నృత్యం, పెయింటింగ్, సంగీత వాయిద్యాల శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ పి. రమ తదితరులు పాల్గొన్నారు. బీసీ గురుకులాల కన్వీనర్గా అష్రత్వలిఅనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల కన్వీనర్గా కొనకొండ్ల గురుకుల పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు జి.అష్రత్వలి నియమితులయ్యారు. ప్రస్తుతం కన్వీనర్గా పనిచేస్తున్న కేజే జోనాథన్ గత నెల 29న పదవీవిరమణ పొందారు. ఈ క్రమంలో అష్రత్వలికి జిల్లా కన్వీనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
పచ్చ నేత.. భూముల మేత
సాక్షి టాస్క్ఫోర్స్: హిందూపురానికి చెందిన టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ తీరు రోజు రోజుకూ వివాదాస్పదమౌతోంది. రోడ్డుకోసం వదిలిన స్థలంలో ప్రహరీ నిర్మించడంతో పాటు ప్రశ్నించిన అధికారులపై చిందులేశాడు. ప్రహరీ నిర్మాణం అక్రమమని తేల్చినా కోర్టు ఆదేశాలున్నాయంటూ అధికారులనే బెదిరిస్తున్నాడు. ఆఖరుకు ఇంటి సమీపంలోని రోడ్డు స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడు. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి... మోతుకపల్లిలో ప్రభుత్వం వేసిన లేఅవుట్లో పలువురు ఇల్లు నిర్మించుకున్నారు. అందులో టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ ఇల్లు కూడా ఉంది. అయితే లేఅవుట్లో రోడ్డు కోసం వదిలిన స్థలంపై చంద్రమోహన్ కన్నేశాడు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే 10 అడుగుల ఎత్తు గోడ కట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో లేఅవుట్లోని వారు నేరుగా పీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయగా, అక్కడి నుంచి ఫిర్యాదు సీఎంఓకు చేరింది. దీంతో సీఎంఓ అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. మున్సిపల్ అధికారులు ఆక్రమణ నిజమని తేల్చి ప్రహరీ తీసేయాలని, లేని పక్షంలో తామే తొలగిస్తామని చంద్రమోహన్కు నోటీసులు అందించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నెలరోజులు గడిచినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే విషయంపై గత నెలలో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో అధికారులు ఆక్రమణను తొలగించడానికి సిద్ధం కాగా, చంద్రమోహన్ వారిపై వాగ్వాదానికి దిగి హంగామా చేశాడు. విషయం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల వరకూ వెళ్లడంతో చంద్రమోహన్ కాస్త వెనక్కు తగ్గాడు. అయితే ఆ స్థలం దారి కోసం కాకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా పావులు కదిపాడు. ఇదే విషయాన్ని బాలకృష్ణ పీఏ సురేంద్ర ద్వారా మున్సిపల్ కమిషనర్కు చెప్పించారు. అయితే ప్లాంట్ ఏర్పాటు చేసినా మిగిలిన స్థలం చంద్రమోహన్ తన ఆధీనంలోనే ఉంచుకునేందుకు ప్లాన్ వేసుకోవడంతో వివాదం మరింత ముదింది. హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు టీడీపీ నేత చంద్రమోహన్ గతంలోనే ప్రభుత్వ స్థలంలో కారు పార్కింగ్ కోసం రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. దీంతో గోవిందప్ప అనే వ్యక్తి ఇంటికి ఇబ్బంది కలుగుతుండటంతో బాధితుడు హైకోర్టులో కేసు వేశాడు. దీంతో హైకోర్టు రెండు వారాల గడువులో ఆక్రమణలు తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని 2023లో మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలిచ్చింది. ఆక్రమణలు నిజమని గుర్తించిన మున్సిపల్ అధికారులు రేకుల షెడ్ తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే టీడీపీ నేత చంద్రమోహన్ కోర్టు ఆదేశాలనూ పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులను బెదిరించి పంపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మోతుకపల్లి లేఅవుట్లోని రోడ్డు స్థలం కబ్జా అధికారులు నోటీసులివ్వడంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే ప్రభుత్వ స్థలంలో కారు పార్కింగ్ కోసం రేకుల షెడ్డు తొలగించాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ తీరుపై సర్వత్రా విమర్శలు -
చిన్నారిని మింగిన కరెంటు
హిందూపురం: పాఠశాల భవనంపై పడిన క్రికెట్ బాల్ను తీసుకునేందుకు వెళ్లిన ఓ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం హిందూపురం ముదిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...ముదిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య (11) శుక్రవారం సాయంత్రం మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో బాల్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైన పడింది. బాల్ను తీసుకువచ్చేందుకు అశ్విన్ ఆరాధ్య భవనంపైకి వెళ్లాడు. గతరాత్రి కురిసిన వర్షంతో భవనం మొత్తం తడిగా ఉండటం...బాల్ తీసుకునే క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలు తగలడంతో అశ్విన్ ఆరాధ్య గట్టిగా కేక వేసి అక్కడే పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు పరుగున వెళ్లి బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై హిందూపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.జైలులో అస్వస్థతకు గురైన తండ్రిటీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న అశ్విన్ ఆరాధ్య తండ్రి వాల్మీకి లోకేష్ కుమారుడి మరణవార్త విని కన్నీరుమున్నీరయ్యాడు. కుమారుడిని తలచుకుని జైలులో కుప్పకూలిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను జైలు అధికారులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
● వాసవీమాతకు లక్ష గాజులతో పూజలు
హిందూపురం: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి మూలవిరాట్ను స్వర్ణతోరణ కవచధారణ చేసి విశేష పూజలు చేశారు. అలాగే వాసవీమాత జయంత్యుత్సవాల్లో భాగంగా వాసవీమాత విగ్రహానికి వందలాది మంది మహిళలు గాజులతో పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో కలశస్థాపన, గోపూజ, సువర్ణ్ణ వాసవీమాత విగ్రహ ప్రాణప్రతిష్ట, నవగ్రహ పూజ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. వాసవీ భజన బృందం సభ్యులు అమ్మవారికి లక్ష గాజులతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాము, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రవీంద్రుడు, పలువురు కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
పుట్టపర్తి: ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... బుక్కపట్నం గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై పుట్టపర్తికి వెళుతూ జానకంపల్లికి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న పోతన్న (84), పెద్దన్నను ఢీకిన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పోతన్న అక్కడికక్కడే మృతి చెందాడు. కాలు విరిగి బాధపడుతున్న పెద్దన్నను స్థానికులు పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. పోతన్న కుమారుడు ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో వ్యక్తి మృతి కనగానపల్లి: లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు...కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన నరసింహులు (62)కు మతిస్థిమితం సరిగా లేదు. దీంతో తరచూ రోడ్లపై తిరుగుతుండేవాడు. గురువారం పర్వతదేవరపల్లి వద్ద రహదారిపై వెళుతున్న ఆయనను బెంగుళూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక నరసింహులు మృతి చెందాడు. కాగా, నరసింహులకు భార్య నాగలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కనగానపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్పందించే వరకూ సమ్మె కొనసాగిస్తాం
పుట్టపర్తి అర్బన్: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె ఆపేది లేదని ఏపీ మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/సీహెచ్ఓ అసోసియేషన్ నాయకులు తేల్చి చెప్పారు. సమ్మెలో భాగంగా నాల్గో రోజు గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో కళ్లకు చేతులు అడ్డుపెట్టుకొని నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ఘోరాలను చూడలేమంటూ నినదించారు. ఆందోళన కార్యక్రమాలకు మద్దతు తెలిపిన నాయకులు, ఏపీ ఎన్జీఓ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మెను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓలు, ఎంపీహెచ్ఓలు పాల్గొన్నారు. ఎంఎల్హెచ్పీలు -
డాడీ.. ఫంక్షన్కు వెళ్లొస్తా!
అంత్యక్రియలు పూర్తి.. గురువారం ఉదయం శిల్పాలేపాక్షి నగర్లోని ఇంటికి అంబులెన్స్లో అభిషేక్ మృతదేహం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చుట్టుపక్కల కుటుంబాల వారు తరలివచ్చారు. అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా... వైద్య విద్యార్థులందరూ స్నేహితుడి ఇంట్లో శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు మెడికల్ కళాశాలలో తరగతికి వెళ్లాల్సి ఉంది. 25 నిముషాలు మాత్రమే సమయం ఉండడంతో అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారన్న విషయం తెలియగానే అందరి హృదయాలు బరువెక్కిపోయాయి. అనంతపురం ఎడ్యుకేషన్: ‘డాడీ... ఫ్రెండ్ సిస్టర్ ఫిక్షేషన్ ఫంక్షన్ ఉంది. నేనూ వెళ్లొస్తా’నంటూ కుమారుడు చేసిన కాల్ చివరిదవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఉదయం ఫోన్ చేసిన కుమారుడు.. మధ్యాహ్నం ప్రమాదంలో మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న వారి రోదనకు అంతులేకుండా పోయింది. తమ ఇంటి ఆశల సౌధం కుప్పకూలిందనే చేదు నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది అనంతపురం రూరల్ మండలం పంగల్రోడ్డు సమీపంలోని శిల్ప లేపాక్షి నగర్కు చెందిన ఉపాధ్యాయులు రవినాయక్, ప్రమీలాబాయి దంపతుల కన్నీటి వ్యథ. వైద్యుడిగా వస్తాడనుకుంటే.. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి జెడ్పీహెచ్ఎస్లో బయలాజికల్ సైన్స్ టీచరుగా రవినాయక్, అదే జిల్లా ముదిగుబ్బ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు టీచరుగా ప్రమీలాబాయి పని చేస్తున్నారు. వీరికి కుమార్తె నిహారిక, కుమారుడు అభిషేక్రాజ్ ఉన్నారు. నిహారిక ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసి సివిల్స్కు సన్నద్ధం అవుతోంది. అభిషేక్రాజు నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వైద్యుడి మారి వస్తాడని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారని ఎంతో ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అభిషేక్ రాజు... తన స్నేహితుడి సోదరి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి వెళుతున్నట్లు తెలిపాడు. కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం స్నేహితులంతా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అభిషేక్రాజ్తో పాటు మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. ఈ విషయం తెలియగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇదే భావి వైద్యుడి చివరి ఫోన్కాల్ నెల్లూరులో బుధవారం చోటు చేసుకున్న ప్రమాదంలో దుర్మరణం జిల్లాకు చేరిన అభిషేక్రాజ్ మృతదేహం... అంత్యక్రియలు పూర్తి కుమారుడి మృతిని తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు -
వైఎస్సార్సీపీ నేతపై దాడి
కదిరి టౌన్: స్థానిక 31 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అమ్మజాన్ కుమారుడు, వైఎస్సార్సీపీ నేత షేక్ ఖాదర్వలిపై టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీ, అతని అన్న కుమారులు ముగ్గురు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అహమ్మద్ అలీ, అతని అన్న కుమారులు గురువారం వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేస్తుండగా వార్డు కౌన్సిలర్ లేకుండా ఎలా పంపిణీ చేస్తున్నారంటూ ఖాదర్వలి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. పింఛన్ల విషయంలో తలదూరిస్తే అంతు చూస్తానని బెదిరించారు. క్షతగాత్రుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం చేసిన ఫిర్యాదు మేరకు సీఐ వి.నారాయణరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక ఇందిరమ్మ కాలనీ నివాసి ఆంజనేయులు (36) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆంజనేయులు, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా నారాయణమ్మ భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు గురువారం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. -
బడి బస్సుకు పరీక్షలు
హిందూపురం అర్బన్: అసలే కాలం చెల్లిన బస్సులు.. డ్రైవింగ్ లైసన్స్ లేని డ్రైవర్లు.. రాష్ డ్రైవింగ్.., బస్సులకు అరిగిన టైర్లు.. సక్రమంగా పని చేయని క్లచ్లు.. తరచూ ఫైయిలయ్యే బ్రేకులు ఇదీ చాలా వరకూ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల పరిస్థితి. ఏటా బస్సుల ఫిట్నెస్ పరీక్షలు జూన్ 15 కల్లా పూర్తి కావాలి. జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ పరీక్షలు గత నెల 25 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సుల ఫిట్నెస్కు సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 509 విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఉండగా, ఇప్పటి వరకూ 40కి పైగా బస్సులు రవాణాశాఖ ద్వారా ఫిట్నెస్ పొందాయి. ఈ నెల 15వ తేదీ వరకూ పర్మిట్ ఉండడంతో రోజూ 5 నుంచి పది బస్సులు ఫిట్నెస్ పరీక్షకు వస్తున్నాయి. నిబంధనలు ఇలా.. విద్యా సంస్థల బస్సులు నడపాలంటే డ్రైవర్కు 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. పదేళ్ల అనుభవంతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా కలిగి ఉండాలి. డ్రైవర్, సహాయకుడు తప్పని సరిగా యూనిఫాం ధరించాలి. వేగంగా.. నిర్లక్ష్యంగా బస్సు నడపరాదు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్త వహిస్తూ.. విద్యార్థుల కదలికలపైనే దృష్టి పెట్టాలి. ప్రథమ చికిత్స బాక్స్, బస్సు స్పీడ్ కంట్రోల్ చేసే స్పీడ్ గౌవర్నర్ కలిగి ఉండాలి. బస్సుపై పాఠశాల పేరు, చిరునామా, ఫోన్ నంబర్ ఉండాలి. అయితే నిబంధనలు పాటించడంలో జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖ అధికారుల నిబంధనలు అతిక్రమించి కండీషన్ లేని బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నారు. అంతేకాక డ్రైవింగ్ అరకొరగా వచ్చిన యువకులను ఏర్పాటు చేసుకుని కాలం నెట్టుకొస్తున్నారు. ఫిట్నెస్లేని బస్సులను అతి వేగంగా నడపడంతో వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. ఫిట్నెస్ జారీ ఇలా.. ఫిట్నెస్ పరీక్షకు వచ్చిన బస్సును ముందుకుగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ నడిపి చూస్తారు. ఆ సమయంలోనే బ్రేకులు, క్లచ్, స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్ పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, ఇంజిన్ కండిషన్ను పరిశీలించి, ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని మరమ్మతు చేసుకోవాలని సూచిస్తారు. అంతేకాక అత్యవసర ద్వారం, కిటికీలు, టైర్లు కంండీషన్గా లేకున్నా ఫిట్నెస్ జారీ చేయకుండా నిలిపివేస్తారు. ప్రైవేట్కు అనుమతులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఫిట్నెస్ (సామర్థ్య) పరీక్షలు రవాణా ఇన్స్పెక్టర్లు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిట్నెస్ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు బుక్కపట్నంలోని ఓ ప్రైవేట్ సంస్థకు ఇచ్చారు. ప్రస్తుతం వారు అక్కడ సొంతంగా డిజిటల్ ట్రాకింగ్, ఫిట్నెస్కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ ఫిట్నెస్ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తయితే ఇకపై జిల్లా వ్యాప్తంగా ఏ వాహనమైనా ఫిట్నెస్ పొందాలంటే అక్కడికి క్యూ కట్టాల్సిందే. జిల్లాలో మొదలైన ప్రైవేట్ స్కూల్ బస్సుల సామర్థ్య పరీక్షలు కండీషన్లో ఉంటేనే అనుమతులు విద్యా సంస్థల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు మొదలు పెట్టాం. వచ్చిన వాహనాల కండీషన్ బట్టి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాం. జూన్ 15వ తేదీలోపు అన్ని బస్సులు ఫిట్నెస్ పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతం హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ఎక్కడికక్కడ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పరీక్షలు నిర్వహించి అన్ని సక్రమంగా ఉన్న వాటికే అనుమతులు జారీ చేస్తున్నారు. బస్సులు ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగనివ్వం. – కరుణసాగరరెడ్డి, జిల్లా రవాణాధికారి, హిందూపురం -
చీనీ తోటల్లో డ్రోన్ సర్వేతో అధ్యయనం
గార్లదిన్నె: చీనీ తోటల్లో పురుగులు, తెగుళ్లు, యాజమాన్య పద్ధతలపై సాంకేతికంగా డ్రోన్ సర్వేతో అధ్యయనం చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి ఫిరోజ్ఖాన్ అన్నారు. గురువారం గార్లదిన్నె మండబలం ముకుందాపురంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ని రైతులకు చేరువ చేయాలని ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్గా ముకుందాపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 17 బృందాలు ముకుందాపురంలోని చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తాయన్నారు. అలాగే కంపెనీ సాంకేతిక సహకారంతో డ్రోన్లో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషల్ ఐదు కెమెరాల ద్వారా చీడపీడలపై చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. మూడు రోజులుగా డ్రోన్ల ద్వారా 500 హెక్టార్ల విస్తీర్ణంలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి రత్నకుమార్, విస్తరణాధికారి రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు. -
కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ
● బిల్లులోనే క్యూఆర్ కోడ్ ● స్కాన్ చేసి పేమెంట్ చేసే అవకాశం ● ఉమ్మడి ‘అనంత’లో ఈ నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు అనంతపురం టౌన్: విద్యుత్ బిల్లులు చెల్లింపుల్లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏపీ ఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకుంది. గతంలో ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లతో విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అయితే కొత్తగా విద్యుత్ బిల్లులు మొత్తం నేరుగా డిస్కంలకు వెళ్లే విధంగా బిల్డెస్కు విధానాన్ని సంస్థ ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో బిల్లులు చెల్లించలేక గంటల తరబడి క్యూలో వేచి ఉండి బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ సంస్థ మే నెలలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్ బిల్లులోనే చెల్లించాల్సిన మొత్తానికి క్యూఆర్ కోడ్ను జత చేసింది. దీంతో వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి విద్యుత్ బిల్లులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చు. ఈనెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ విద్యుత్ బిల్లులను ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందిస్తున్నారు. గిరిజన బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గోరంట్ల: స్థానిక గిరిజన బాలికల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ తెలిపారు. మూడో తరగతిలో 40 సీట్లు, నాల్గో తరగతిలో 32, 5వ తరగతిలో 31, 6వ తరగతిలో 21, 7వ తరగతిలో 1, 8వ తరగతిలో 2, 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన గిరిజన బాలికలు ఈనెల 2వ తేదీ నుంచి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 8897820565 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. చౌళూరు మధుమతిరెడ్డికి కీలక పదవి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ సీపీ నాయకురాలు చౌళూరు మధుమతిరెడ్డికి కీలక పదవి దక్కింది. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి పార్టీలో సముచితస్థానం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక పరిగి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని హర్షవల్లి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఇందులో పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన హర్షవల్లితో పాటూ, 7, 8, 9వ తరగతి చదువుతున్న గంగమ్మ, వర్షిత, ప్రవల్లిక, భవ్య, రమ్య, సౌమ్య ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన హర్షవల్లి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కృపా సత్యరాజు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని శ్రీరంగపట్నంలో జరగనున్న 39వ సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున హర్ణవల్లి ప్రాతినిథ్యం వహిస్తుందని వెల్లడించారు. -
క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు
పరిగి: క్షయ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని హిందూపురం జిల్లా ఆస్పత్రి టీబీ వైద్యాధికారి గౌస్పీరా, సీహెచ్ఓ వన్నప్ప సూచించారు. గురువారం మండలంలోని కాలువపల్లిలో యాక్టివ్ కేస్ ఫైండింగ్ యాక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి క్షయ వ్యాధి నిర్ధారణకు వైద్య పరీక్షలు చేశారు. 18 మందికి టీబీ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు గౌస్ పీరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, గళ్లలో రక్తం పడటం, ఛాతీలో నొప్పిగా ఉండటం క్షయ వ్యాధి లక్షణాలు అన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే అలాంటి వారికి తగిన మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పౌష్టికాహారం నిమిత్తం వ్యాధిగ్రస్తుడి వ్యక్తిగత ఖాతాలోకి ప్రతి నెలా రూ.1,000 జమ చేయబడుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది గిరిజమ్మ, ఏఎన్ఎంలు అంబిక, ప్రమీలమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు. -
కూటమి నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటన
పెనుకొండ రూరల్: సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దుద్దేబండ గ్రామంలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అక్షయ తృతీయ రోజున లక్షలాది మంది భక్తులు స్వామి వారి నిజరూప దర్శనం కోసం వస్తారన్నారు. ముందస్తు ప్రణాళికలు, భద్రత చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. నాసిరకంగా గోడ నిర్మాణ పనులు చేపట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించక పోవడం శోచనీయమని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన ఓ ఘటనలో మృతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందజేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురి మృతి, శ్రీకాకుళంలో తాబేళ్ల మృతి, తిరుపతిలో గోవుల మృతి ఘటనలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు.. హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలపై మాట్లాడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. కార్యక్రమంలో పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహులు, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ గౌతమి, మాజీ మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి, బాబు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సల్లా సూర్యప్రకాశ్ రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, కొండల రాయుడు, చెన్నకేశవులు, పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
ఐఐటీ విద్యార్థికి ఆర్థిక కష్టం
నా ప్రతిభ ఉపయోగ పడాలి నా ప్రతిభ నాకు, నా కుటుంబానికి మాత్రమే కాదు... నా ఊరు..నా రాష్ట్రం..నా దేశానికి ఉపయోగ పడాలి. ఎంతోమంది భారతీయులు విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు డబ్బు పంపాలంటే రూ.లక్షకు 30 శాతం వరకూ కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. వారిపై ఈ భారం తగ్గించాలనేది నా కోరిక. దీనిమీదే పరిశోధనలు చేస్తున్నా. కేవలం 4, 5 శాతం ఖర్చుతోనే విదేశాల్లో ఉన్న మనవాళ్లకు డబ్బు పంపే విధానంపై దృష్టి సారించా. నా ఐఐటీ పూర్తయ్యేలోపే కచ్చితంగా నా కల నెరవేరుతుంది. ఆ దేవుడు కూడా నాకు దాతల రూపంలో సాయం అందేలా చేస్తున్నారు. – మేఘనాథ్రెడ్డి, ఐఐటీ విద్యార్థితండ్రి తాగుడుకు బానిసై కుటుంబాన్ని వదిలేసి ఎటోవెళ్లిపోయాడు. తల్లిరెక్కల కష్టంతో చదువుతున్న యువకుడు ఢిల్లీ ఐఐటీలో గత ఏడాది సీటు సాధించాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు చదువుకు ఆటంకం కల్గిస్తున్నాయి. కనీసం ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేక ఆందోళన చెందుతున్నాడు. దాతలు స్పందిస్తే బాగా చదువుకుని సమాజానికి తనవంతు సాయం చేస్తానంటున్నాడు. కదిరి: పట్టణంలోని మారుతి నగర్లో కాపురం ఉంటున్న వి.జయలక్ష్మి అమడగూరులో ఎఫ్ఎన్ఓ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ)గా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తోంది. ఆమె భర్త రాజేష్ బాబురెడ్డి మద్యానికి బానిసై ఎటో వెళ్లిపోయాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలనేది జయలక్ష్మి ఆశయం. తల్లి ఆశయాలకు తగ్గట్టుగానే పెద్ద కొడుకు మేఘనాథ్రెడ్డి గత ఏడాది ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నబ్బాయి జయకిషోర్రెడ్డి సైతం కదిరి మున్సిపల్ హైస్కూల్లో చదివి 10వ తరగతి ఫలితాల్లో 485 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. గత ఏడాది మేఘనాథరెడ్డి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించగా తల్లి జయలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన కుమారుడి ఐఐటీ చదువు కలగానే మిగిలిపోతుందని వేదన చెందింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి గొప్ప మనసు మేఘనాథరెడ్డి ఢిల్లీ ఐఐటీలో చదవాలంటే ఏడాదికి రూ.7 లక్షలు దాకా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక జయలక్ష్మి కుమిలిపోయింది. వీరి పరిస్థితి ఇరుగుపొరుగు ద్వారా ‘రెడ్డి వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుల దృష్టికి వెళ్లింది. వారి ద్వారా ఈ కుర్రాడి ఆర్థిక ఇబ్బందులు విన్న తలుపుల మండలం ఉబ్బర వాండ్లపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎం.సుధాకర్రెడ్డి మొదటి సంవత్సరం ఫీజు మొత్తం ఒకేసారి రూ.7 లక్షలు ఆ కుటుంబానికి అందజేశాడు. దీంతో గత ఏడాది మేఘనాథరెడ్డి చదువుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇప్పుడు మళ్లీ దాతల సాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. చదువుల్లో ముందంజ మేఘనాథరెడ్డి చిన్నప్పటి నుండే చదువుల్లో ముందంజలో ఉండేవాడు. 10వ తరగతిలో 98 శాతం, ఇంటర్లో 96 శాతం మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్లో 15 వేలు, అడ్వాన్స్లో 18 వేల ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న మేఘనాథ్రెడ్డి విదేశాలకు డబ్బు పంపితే చెల్లించాల్సిన కమిషన్ శాతం తగ్గించడంపై పరిశోధన చేస్తున్నాడు. తప్పకుండా తన పరిశోధన ఫలిస్తుందంటున్నాడు. ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించిన మేఘనాథరెడ్డి గత ఏడాది ఫీజు రూ.7 లక్షలు అందించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇప్పుడు రెండో సంవత్సరం ఫీజు కోసం అష్ట కష్టాలు దాతలు స్పందిస్తే చదువుకునే అవకాశందాతలు సంప్రదించాల్సిన వివరాలు బాలుడి తల్లి పేరు: వి.జయలక్ష్మి బ్యాంకు అకౌంట్ నంబర్: 110118882266 బ్యాంకు పేరు: కెనరా బ్యాంకు, కదిరి ఐఎఫ్ఎస్సీ కోడ్: సీఎన్ఆర్వీ0006118 ఫోన్ పే నంబర్: 95420 02810 -
జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ
కదిరి అర్బన్: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను బుధవారం డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) సయ్యద్ మౌల తనిఖీ చేశారు. కళాశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు నిర్వహిస్తున్నారా... అని ప్రిన్సిపాల్ దామోదర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐఈఓను అధ్యాపకులు సన్మానించారు. ఆరు కంటెయినర్లు సీజ్ ● ‘కియా’ కార్ల ఇంజిన్ల చోరీ కేసులో పోలీసుల పురోగతి పెనుకొండ రూరల్: ‘కియా’ కార్ల ఇంజిన్ల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇంజిన్లను తరలించేందుకు ఉపయోగించిన ఆరు కంటెయినర్లను సీజ్ చేశారు. ‘కియా’లో 940 కారు ఇంజిన్లు చోరీకాగా, పోలీసులు మార్చి 19న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈనెల 16న తమిళనాడుకు చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో ఆరుగురిని కస్టడీకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో ధిల్లీ, చైన్నె ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇంజిన్లను చైన్నైకి తరలించేందుకు ఉపయోగించిన కంటైనర్లును గుర్తించి సీజ్ చేసి స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. కస్టడీ ముగియడంతో ఆరుగురిని బుధవారం జైలుకు తరలించారు. -
పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని, అందువల్ల జిల్లాలో పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ చేతన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. తొలుత జిల్లా పరిశ్రమల శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిశ్రమల స్థాపన కోసం అందే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇప్పటికే అందిన దరఖాస్తుల్లో ఏవైనా పెండింగ్లో ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే పీఎం విశ్వకర్మ పథకం గురించి పట్టణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహానీ, డీపీఓ సమత, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, జిల్లా ఫైర్ ఆఫీసర్ హేమంత్రెడ్డి, డిక్కీ ప్రతినిధి వెంకటరమణ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కలెక్టర్ టీఎస్ చేతన్ బసవేశ్వరుడి జీవితం ఆదర్శప్రాయం మూఢనమ్మకాలను రూపుమాపుతూ సమాజోద్ధరణకు కృషిచేసిన మహానుభావుడు బసవేశ్వరుడు అని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి 894వ జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్ చేతన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారన్నారు. హైందవ మతాన్ని సంస్కరించడంలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. భక్తి కన్నా మంచి ప్రవర్తనే ముఖ్యమని ప్రవచించారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఏఓ వెంకటనారాయణ, టూరిజం అధికారి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికో ఆశలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం
ధర్మవరం: సెంట్రింగ్ పనులు చేసే అతను..తన పిల్లలు తనలా కూలి పనులు చేయకూడదని భావించాడు. రెక్కలకష్టంతోనే కుమారుడు, ఇద్దరు కూతుళ్ల భవితకు బాటలు వేస్తున్నాడు. నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో కుమారుడిని ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు. తెల్లకోటు వేసుకుని మెడలో స్టెత్తో కనిపించాల్సిన కుమారుడిని తెల్లబట్టలో చుట్టి కళ్లముందు పెట్టడంతో ఆ తండ్రి బోరున విలపించాడు. కుమారుడిని డాక్టర్గా చూడాలని.. ధర్మవరం లోనికోటకు చెందిన నవదీయ కేశవనాయక్ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుమారుడు నరేష్నాయక్(23), ఇద్దరు కూతుళ్లు గాయత్రి, నందిని సంతానం. కుమారుడు నరేష్నాయక్ను ఉన్నత స్థానంలో ఉంచాలని భావించాడు. ఈక్రమంలోనే నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేర్పించాడు. కుమార్తె గాయత్రి బీటెక్, మరో కుమార్తె నందిని ఇంటర్ చదువుతోంది. ప్రస్తుతం నరేష్ నాయక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన కుమారుడు వైద్య పట్టా అందుకుంటే తమ కుటుంబం కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు సమాజానికి తనవంతుగా ఓ మంచి వైద్యుడిని అందించినవాడిని అవుతానని కేశవనాయక్ అనుకునేవాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులతో తరచూ చెప్పుకునేవాడు. కానీ అతని ఆశలపై విధి నీళ్లు పోసింది. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాళెం సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ప్రమాదంలో నరేష్నాయక్ మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలియగానే కేశవనాయక్ కాళ్ల కింద భూమి కంపించింది. వైద్యుడిగా తెల్లకోటుతో వస్తాడనుకున్న కుమారుడిని తెల్లబట్టలో చుట్టిపెట్టిన చిత్రాలను చూసి శోకసంద్రంలో మునిగిపోయాడు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నెల్లూరుకు వెళ్లాడు. దీంతో లోనికోటలో విషాద ఛాయలు అలముకున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రమాదం.. ధర్మవరం విద్యార్థి మృతి సెంట్రింగ్ పనులు చేస్తూ కుమారుడిని ఎంబీబీఎస్ చదివిస్తున్న తండ్రి కుమారుడి మృతివార్త విని తల్లడిల్లిన కుటుంబం -
తెలంగాణ సీఎం పీఎస్గా శ్రీనివాసరాజు
పరిగి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రిన్సిపల్ సెక్రెటరీగా కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్ పూర్వ విద్యార్థి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని ఈసలాపురం గ్రామానికి చెందిన కేఎస్ శ్రీనివాసరాజు 1976లో ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లిలో 8వ తరగతిలో ప్రవేశం పొంది 1978–79 విద్యాసంవత్సంలో పదో తరగతిని పూర్తి చేశారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన... గ్రూప్–1 ఆఫీసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఐఏఎస్ దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 2011 నుంచి దాదాపు 99 నెలల పాటు జేఈఓగా పనిచేసి రాష్ట్రంలోనే ఖ్యాతి గడించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన్ను కేంద్రం తెలంగాణకు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణపొందారు. ఆ తర్వాత ఆయన సేవలను మెచ్చిన తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై నుంచి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా అవకాశం కల్పించింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఏపీఆర్ఎస్ ఉపాధ్యాయ బృందం హర్షం ఏపీఆర్ఎస్లో చదివిన విద్యార్థుల్లో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదగడంతో పాటు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉండటం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ మురళీధర్బాబు అన్నారు. కాగా ఏపీఆర్ఎస్కు చెందిన మరో పూర్వ విద్యార్థి రామకృష్ణారావు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీనివాసరావు తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమితులుకావడంతో ప్రిన్సిపాల్తో పాటు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఆర్ఎస్ పూర్వ విద్యార్థికి దక్కిన గౌరవం -
రైతులకు పరిహారం వెంటనే అందజేయాలి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం ప్రశాంతి నిలయం: జిల్లాలో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అదనపు భూసేకరణ చేశామని, రైతుల వివరాలు సేకరించి వెంటనే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణపై ఆరా తీశారు. భూసేకరణ పనుల్లో అలసత్వం పనికిరాదని, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూమిని సబ్డివిజన్ చేసేటప్పుడు తహసీల్దార్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, ఆనంద్ కుమార్, మహేష్, తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి, బాలాంజనేయులు, వెంకటేష్, రెడ్డిశేఖర్, మురళికృష్ణ, మహబూబ్ బాషా, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి ● పౌర హక్కుల దినోత్సవ సభలో ఎస్పీ రత్న నల్లమాడ: సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వాటికి భంగం కలిగించకుండా వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ వీ. రత్న అన్నారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రత్న... గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఒకరి ఇంటి ప్రాంగణంలో చెత్త వేయడం, దేవాలయం, బార్బర్ షాపులోకి అనుమతించకపోవడం, రెండు గ్లాసుల పద్ధతి అమలు చేయడం, దళితులను కులం పేరుతో దూషించి దాడి చేయడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రిందకు వస్తాయన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారన్నారు. ఆడ పిల్లలకు యుక్త వయస్సు వచ్చాకే వివాహం చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం డీవీఎంసీ సభ్యులు, న్యాయవాది కే. వీరనారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్, సీఐ నరేంద్రరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సునీత, ఏపీఎం గోపాల్, సీపీఎం మండల కార్యదర్శి గోవిందు, పలువురు మహిళలు మాట్లాడారు. -
ధర పెరిగినా..తగ్గేదేలే!
ఈ రోజు కొంటే మంచిదని అక్షయ తృతీయ రోజున బంగారు కొంటే మంచిదని చిన్న బంగారు డాలర్ కొన్నా. బంగారు కొనడం వల్ల నష్టమేమీ ఉండదు. అయితే ప్రస్తుతం బంగారు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు సామాన్యులు కొనలేని పరిస్థితి. కానీ ఈ రోజు కొంటే మంచిదని కొన్నా. ఇంట్లో వారు కూడా సెంటిమెంట్ను కాదనలేక డబ్బులిచ్చారు. –రజని, పరిగి కలిసి వస్తుందని కొన్నా అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి కొంటే కలిసి వస్తుందని చెబుతుంటారు. అందుకే ముక్కెర కొన్నా. ఈ పండుగ రోజునే కొనాలని చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నా. ఇప్పుడున్న ధరలకు కొత్త నగలు కొనే పరిస్థితి లేదు. బంగారు, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి, సామాన్య ప్రజలు ముట్టుకోలేని పరిస్థితి ఉంది. – భూదేవి, చెర్లోపల్లిహిందూపురం: సెంటిమెంట్ ముందు...బంగారం ధర చిన్నబోయింది. తులం బంగారం రూ.లక్ష చేరువలో ఉన్నా...అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే శుభం కలుగుతుందని, సంపద పెరుగుతుందన్న ఆలోచనతో అరకాసైన కొందామని మహిళలు ఉత్సాహం చూపారు. ఫలితంగా ఇన్నాళ్లూ బోసిపోయిన బంగారు నగల దుకాణాలు బుధవారం కళకళలాడాయి. జోరందుకున్న కొనుగోళ్లు బుధవారం జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి తదితర ముఖ్య పట్టణాల్లో బంగారు, వెండి కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొన్నిదుకాణాల వారు ప్రత్యేక డిస్కౌంట్లు పెట్టడంతో కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బంగారు దుకాణాల్లో చాలా రోజుల తర్వాత రద్దీ కనిపించింది. కొత్త కోడళ్లు, కుమారైలకు బంగారు ఆభరణాలను కొనివ్వడానికి చాలామంది ఆసక్తి చూపించారు. ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది గ్రాము, అరగ్రాముతో సరిపెట్టుకున్నారు. ఈసారి హిందువులతో పాటు ముస్లిం మహిళలు కూడా భారీగా తరలివచ్చి బంగారు నగలు కొనుగోలు చేయడం విశేషం. బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ సందడి సెంటిమెంట్తో దుకాణాల బాట పట్టిన మహిళలు పెరిగిన ధరతో గ్రాము, అరగ్రాముతో సరిపెట్టుకున్న వైనం -
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపురం అర్బన్: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధికార ప్రతినిధి అక్కులప్ప అన్నారు. ఆర్డీటీని కాపాడుకోవాలంటూ బుధవారం కలెక్టరేట్ సమీపంలోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి ఎస్సీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ను ఆయన చాంబర్ వద్ద నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు ఆగిపోతే పేదల బతుకుల్లో వెలుగులు ఉండవన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న, ధనుంజయ, శ్రీనివాసులు, రవి, యల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. సేవ్ ఆర్డీటీ.. అనంతపురం అర్బన్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్ ఆర్డీటీ నినాదంతో బుధవారం కలెక్టరేట్ సమీపంలోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, గౌరవాధ్యక్షుడు భోగేశ్వరరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జగదీష్, ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డానియల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేపీ కుమార్, నాయకులు, జర్నలిస్టులు రామచంద్ర, చౌడప్ప, అక్కులప్ప, భూమిరెడ్డి, ప్రసాద్, ఆనందవర్ధన్, శేషాద్రి శేఖర్, బన్సీలాల్, రాజశేఖర్, వెంకటరెడ్డి, సాయి, భరత్, నబిరరూల్, తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో.. అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా కల్పతరువు అయిన ఆర్డీటీ సంస్థను రక్షించుకుందామని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్డీటీ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్డీటీ సేవలను కొనసాగించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోతే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఎం మహబూబ్ బాషా, జాకీర్ హుస్సేన్, టిప్పుసుల్తాన్, నజీర్, ప్రజాబలం గోగుల మూర్తి, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ, జేఏసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వాల్మీకి సంఘం రాయలసీమ ఇంచార్జి సాంబ, మసూద్, సమీముల్లా, నజీర్, వన్నూరు, బాష, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులపై కూటమి నిర్దయ
తాడిపత్రి రూరల్: అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం చివరకు చిన్నారులను సైతం ఉపేక్షించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్దయ కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయడం పరిపాటి. ఈ విషయంగా తెలంగాణ ప్రభుత్వం మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకూ అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు భిన్నంగా ఏపీలో మాత్రం వేసవి సెలవులు ప్రకటించకుండా చిన్నారులపై నిర్దయగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రకరకాల యాప్లతో అంగన్వాడీ టీచర్లను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తాజాగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి పెట్టుకోవాలని, టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల వరకూ అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం జీతాల పెంపుతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలపై అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం మాట లెక్కచేయకుండా చలో విజయవాడ పేరుతో వేలాది మందితో భారీ ధర్నాను చేపట్టారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం జీతాలు పెంచకపోవడమే కాకుండా వేసవి సెలవులు ఇవ్వకుండా అంగన్వాడీలపై కక్ష తీర్చుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్కపోత తాళలేక... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... అంగన్వాడీ కేంద్రాల విషయంగా నిర్దయగా వ్యవహరించడం విడ్డురంగా ఉంది. వేసవి సెలవులు ప్రకటించకపోవడంతో లబ్దిదారులు తప్పనిసరిగా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రయోజనాలు అందకుండా పోతాయి. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులయితే ఉక్కపోత తాళలేక ఏడుస్తుండడంతో వారిని సముదాయించలేక ఆయాలు నానా ఇబ్బంది పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవుల మంజూరుపై ప్రభుత్వం ఉదాసీనత కిషోర్ వికాసం పేరుతో వారంలో రెండు రోజుల సమావేశాలు ఉక్కపోత తాళలేక ఇబ్బంది పడుతున్న చిన్నారులు కిశోర వికాసం పేరుతో.. వేసవిలో అంగన్వాడీలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం... కిశోర వికాసం పేరుతో వారానికి రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం మంచిదే అయినా.. వేసవిలో అంగన్వాడీలకు సెలవులు లేకుండా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలు కన్వీనర్లుగా వారి సెంటర్ల పరిధిలోని కిశోర బాలికలను సర్వే చేసి, వారితో సచివాలయ పరిధిల్లోని ఎఎన్ఎంలు, ఎంఎస్కేలతో కలిసి ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో డ్రాపౌట్, బాల్య వివాహాలపై నష్టాలు, వారికి పుట్టే బిడ్డల అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అదేశించింది. ఎండలు తీవ్ర ప్రభావం చూపే మే మాసం మొత్తం సమావేశాలు నిర్వహించేలా జారీ అయిన ఉత్తర్వులపై ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 5,125 6 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య:1,63,700 మంది గర్భిణులు: 14,900 మంది బాలింతలు: 13,100 మంది -
ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీకి తరగని ఆదరణ
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీపై ఆస్ట్రేలియాలో ప్రవాసాంధ్రులు విశేష ఆదరణ కనబరిచారు. ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో ఆలూరు సాంబశివారెడ్డి పర్యటించి అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సిడ్నీకి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్టులో ఆస్ట్రేలియా వైఎస్సార్ సీపీ కన్వీనర్ చింతలచేరు సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలో లంకెల రాజశేఖరరెడ్డి, యేళ్ల అమర్నాథ్, గొళ్లపల్లి చంద్రమౌళీరెడ్డి, కేఎల్ ఉమేష్, మురారి చింతల పెద్దిరెడ్డి, ఉమ్మడి మనోహర్, గాయం శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, రాజేందర్, విజయ్, దేవశేఖర్, బొమ్మక శివారెడ్డి ఘనస్వాగతం పలికారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పాలనపై ప్రవాసాంధ్రులందరూ సంతృప్తితో ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు భరోసానిచ్చారు. -
భక్తుడిపై సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడి దురుసు ప్రవర్తన
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో తనపై సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించాడంటూ తాడిపత్రికి చెందిన ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డాక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడికి వివాహం నిశ్చయం కావడంతో తొలి ఆహ్వాన పత్రికను స్వామి వారి సన్నిధిలో ఉంచేందుకు భార్యతో కలసి కసాపురం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో టెంకాయలు కొనుగోలు చేసిన చోటనే చెప్పులు, సెల్ఫోన్లు పెట్టి ఆలయంలోకి ప్రవేశిస్తుండగా సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడు మొబైల్ పెట్టి వెళ్లాలంటూ దబాయించాడన్నారు. తన వద్ద సెల్ఫోన్ లేదని చెప్పినా వినకుండా దౌర్జన్యానికి దిగాడన్నారు. దీంతో తాను అసహనం వ్యక్తం చేయడంతో నేరుగా వచ్చి చొక్కా పట్టుకుని చెప్పుతో కొడతానంటూ దాడికి యత్నించాడన్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న భక్తులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగిందన్నారు. ఘటనపై ఆలయ ఈఓకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో లేరని, ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఈఓ సెల్ఫోన్ నంబర్కు కాల్ చేసినా అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈఓకు ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలిపారన్నారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆలయ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం, ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికై నా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఐకమత్యంతోనే దేశాన్ని కాపాడుకోగలం
అనంతపురం కల్చరల్: కులమతాలకతీతంగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఐక్యమత్యంతోనే దేశాన్ని కాపాడుకోగలమని మైసూరు దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. మూడు రోజులుగా అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న జ్ఞానసాగర దత్తాంజనేయ క్షేత్రంలో సాగుతున్న విగ్రహ పునఃప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాగిన మహాకుంభాభిషేక వేడుకలకు గణపతి సచ్చిదానంద స్వామీజీ విశిష్ట అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. పెహల్గాం ఉగ్రదాడిలో అశువులు బాసిన వారికి నివాళులర్పించి, వారి కుటుంబాలకు మనమందరం మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ముష్కరులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు వివక్ష, వైసమ్యాలు మరిచి అందరూ ఏకం కావాలన్నారు. అక్షయ తృతీయ పర్వదిన విశిష్టతను తెలియజేస్తూ దాచుకోవడం అంటే బంగారమో, మరో లోహమో కాకుండా పుణ్యాన్ని సంపాదించుకోవాలని ప్రబోధించారు.అంతకు ముందు స్వామీజీ దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థులతో కలిసి ఆలయంలో జ్ఞానమూర్తి దత్తాత్రేయుడితో పాటూ వివిధ దేవతామూర్తులను పునఃప్రతిష్టించారు. మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ -
లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
● 11 మందికి గాయాలు పెద్దవడుగూరు: లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరు నుంచి హైదరాబాద్కు మంగళవారం రాత్రి బయలుదేరిన ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ప్లాజా సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో గుత్తి పట్టణానికి చెందిన దశకంఠేశ్వరరెడ్డి, పావని, ప్రవళిక, కర్నూలుకు చెందిన సుహేల్, నఫీస్, ఆత్మకూరుకు చెందిన శరత్, వెంకటేష్, దన్విన్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అంనతరం అనంతపురం, కర్నూలులోని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
మూడో రోజూ కొనసాగిన నిరసన
పుట్టపర్తి అర్బన్: న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా నిరవధిక సమ్మె చేపట్టిన సీహెచ్ఓలు, ఎంఎల్హెచ్పీల మూడో రోజు బుధవారమూ తన ఆందోళనను కొనసాగించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆయుస్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని, 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహాకాలు అందించాలని, ఈపీఎఫ్ పునరుద్దరించాలని, క్లినిక్ అద్దెలు వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డు అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీని , ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్కే అసిస్టెంట్ల హేతుబద్ధీకరణ ప్రారంభం అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవాకేంద్రాల (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియ మొదలైంది. బుధవారం అనంతపురంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారుల ఆధ్వర్యంలో పంటల విస్తీర్ణం ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టారు. జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, ఉద్యానశాఖ డీడీలు ఫిరోజ్ఖాన్, చంద్రశేఖర్, పట్టుశాఖ జేడీలు పద్మమ్మ, ఆంజనేయులు, ఆయా శాఖల సూపరింటెండెంట్లు, టెక్నికల్ అఽధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 856 ఆర్ఎస్కేలకు సిబ్బంది సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 ఖరీఫ్, 2025 రబీ ఈ–క్రాప్ కింద నమోదైన వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల విస్తీర్ణం ఆధారంగా ప్రాధాన్యత వారీగా కొనసాగిస్తున్న ఈ పక్రియ గురువారం పూర్తి కావచ్చునన్నారు.