Sri Sathya Sai
-
కూటమిలో కుంపట్లు
కదిరి: కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆయా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కదిరి నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారి అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్థానిక సబ్ రిజస్ట్రార్ కార్యాలయం నుంచి ‘కె.ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని కూటమి నేతలు ఇటీవల కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ జయంతి నాడు కూడా కూటమి అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతో కలిసి రాకుండా వేర్వేరుగా వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం చర్చనీయాంశమైంది. కందికుంటకు దూరమవుతున్న నేతలు సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు సైతం ఎమ్మెల్యే కందికుంటకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. టీడీపీ నేత, కదిరికి చెందిన కొత్తచెరువు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమనాథరెడ్డి, కదిరి మండలం సున్నపుగుట్టతండాకు చెందిన గిరిజన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సోమ్లానాయక్, టీడీపీ న్యాయవాది నాగేంద్రప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు కందికుంటకు దూరమై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే వేదికలపై కందికుంట పక్కనే కూర్చునే జనసేన కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ సైతం కందికుంట వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. ఆయన కూడా విష్ణుతో చేతులు కలిపారు. గత రెండేళ్లలో బీజేపీని వీడి కందికుంట సమక్షంలో టీడీపీలో చేరిన ఎంతోమంది మళ్లీ ఇప్పుడు పచ్చ కండువాను పక్కన పడేసి విష్ణు సమక్షంలో కమల దళంలో కలిసిపోతున్నారు ఇంకా మరికొందరు నేతలు కందికుంటకు దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. నేతల మధ్య ఆదిపత్య పోరు తన అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిని ఎలాగైనా దెబ్బకొట్టాలని ఎమ్మెల్యే కందికుంట ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా ఆయనకు గన్మెన్లు కూడా లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నాడు విష్ణువర్ధన్రెడ్డిని తేరుపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకోవడం సంచలనం రేపింది. విష్ణు వర్గీయుడు చంటి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు కొబ్బరికాయలు విక్రయించుకునే టెండర్ దక్కించుకుంటే దాన్ని కూడా ఈఓ శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించారు. ఈ టెంకాయల పంచాయితీ హైకోర్టు దాకా వెళ్లింది. కోర్టులో తుది తీర్పు కూడా రాకనే ఎమ్మెల్యే ఎవరికై తే ఆ టెండర్ ఇప్పించాలనుకున్నాడో ఆయనే ప్రస్తుతం అక్కడ అనధికారికంగా టెంకాయలు అమ్ముతూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. కదిరిలో తారస్థాయికి చేరిన వర్గ విభేదాలు ఎమ్మెల్యే కందికుంట అవినీతిపై ప్రశ్నిస్తున్న నాయకులు బీజేపీ, జనసేన నేతల ఇమేజ్ డ్యామేజ్కు ఎమ్మెల్యే యత్నం ! ఎత్తుకు పైఎత్తుతో రంజుగా రాజకీయం రెండేళ్లుగా ఆలయ చైర్మన్ కుర్చీ ఖాళీ ఆదిపత్య పోరు కారణంగా నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కుర్చీ రెండేళ్లుగా ఖాళీగా ఉంది. జనసేన పార్టీ కదిరి ఇన్చార్జ్ భైరవప్రసాద్కు ఈ పదవి ఖరారైందని కూటమి నేతలే చెప్పారు. అయితే ఈ పదవిని తనకు ఎంతో నమ్మకంగా ఉన్న ఆయిల్ మిల్ సూరికి ఇప్పించాలని కందికుంట గట్టిగా పట్టుబడుతున్నారు. ఆలయానికి సంబంధించి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను సైతం సూరి చేతుల మీదుగానే ఆవిష్కరించారు. ఆలయంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో కూడా సూరి దర్శనమిస్తున్నారు. ఆ పదవి తనకు రాకుండా అడ్డుపడటంతో పాటు తనను డబ్బుతో మ్యానేజ్ చేశామని కందికుంట అనుచరులు బహిరంగంగా చెప్పుకోవడాన్ని భైరవ ప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. పోలీసు కేసులున్న సూరి ఆ పదవికి అర్హుడు కాదని ఆయన చెబుతున్నారు. ఇలా కదిరి కూటమి నేతల పంచాయితీ ఆయా పార్టీల అధిష్టానం వరకూ వెళ్లింది. భవిష్యత్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
● వైభవంగా శ్రీవారి రథోత్సవం
బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వెలసిన వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం 6 గంటలకు దీక్షా హోమం, బలిహరణ, 10 గంటలకు రథాంగహోమం, రథ బలి, మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం ముందు వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, భక్తులు కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. -
గంధం అలంకరణలో శ్రీవారు
హిందూపురం: స్థానిక పేట వేంకటరమణ స్వామి ఆలయంలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. తెల్లవారుజామున మూలవిరాట్ను పంచామృతాభిషేకాల అనంతరం అక్షయ సమానమైన సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత పేట వేంకటరమణస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణంలోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో సోమవారం విశేష అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం లలిత సహస్ర నామపారాయణంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
సీఎం సారూ... మా పాఠశాలను కాపాడండి
తనకల్లు: ‘సీఎం సారూ... ఆక్రమణకు గురైన మా పాఠశాలను కాపాడండి’ అంటూ మొగలిచెట్లతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు నినదించారు. సోమవారం ఉదయం పాఠశాల ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... మొగలిచెట్లతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన కొంత స్థలాన్ని స్థానికుడు శ్రీరాములు నాయక్, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించి ఇటీవల షెడ్డు నిర్మించారు. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంగా సోమవారం ఉదయం పాఠశాల వద్ద విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాన్ని తొలగించి, ప్రహరీ నిర్మించాలంటూ నినదించారు. అలాగే అక్రమ కట్టడాన్ని తక్షణమే తొలగించి, పాఠశాల స్థలాన్ని కాపాడలంటూ మొగలిచెట్లతండాకు చెందిన పలువురు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. శ్రీరాములునాయక్ ఆక్రమించుకున్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కొన్ని నెలలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూడు నెలల క్రితం కలెక్టర్, రెవెన్యూ, విద్యాశాఖ, మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలను నిర్ధారించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే అక్రమ కట్టడాన్ని తొలగించి, పాఠశాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేయాలంటూ నోటీసు జారీ చేసినా నేటికీ ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికై నా పాఠశాల ఆక్రమిత స్థలాన్ని కాపాడాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పాఠశాల ఎదుట ప్లకార్డులతో విద్యార్థుల నిరసన తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన -
ఆకట్టుకున్న చిన్నారుల స్నాతకోత్సవం
పుట్టపర్తి అర్బన్: అంగన్వాడీ విద్యను పూర్తి చేసి ప్రాథమిక పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల స్నాతకోత్సవం సోమవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొని చిన్నారులకు స్నాతకోత్సవ ధ్రువీకరణ పత్రాలు, స్కూల్ బ్యాగ్లు, చాక్లెట్లు అందజేశారు. నల్లని గౌన్లు, టోపీలు ధరించిన చిన్నారులు కలెక్టరేట్లో సందడి చేశారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే పునాది అని, ప్రతి చిన్నారిని తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ శ్రీకర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఈఓ కిష్టప్ప, సీడీపీఓ జయంతి, సూపర్వైజర్ రజిత తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు బలి ● మార్కెట్ యార్డులో రివర్స్లో వచ్చి పడుకున్న రైతు మీద దూసుకెళ్లిన కారు ● నిద్రలోనే కన్నుమూతరాప్తాడు రూరల్/కుందుర్పి: నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఓ రైతు నిండు ప్రాణం బలైంది. పండించిన పంటను అమ్ముకుని కుటుంబానికి ఆధారం కావాలనే ఆశతో వచ్చిన అన్నదాత అదే మార్కెట్ యార్డులో ప్రాణాలు కోల్పోవడం చూపరులను కలచివేసింది. వివరాలు..కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న (66) తన పొలంలో పండించిన మామిడి కాయలను బొలెరో వాహనంలో తీసుకుని కక్కలపల్లి గ్రామంలోని టమాట మండీకి వచ్చాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మార్కెట్లో సరుకు ఉంచి, మరుసటి రోజు ఉదయం వేలంలో పాల్గొనేందుకు అక్కడే వేచి ఉంటూ బహిరంగ ప్రదేశంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో టీఎస్ 07 ఈయూ 3699 నంబరు గల చావర్లెట్ క్రూజ్ కారును డ్రైవర్ రివర్స్ చేస్తూ నిద్రిస్తున్న చంద్రన్నను గుర్తించకుండా అతని మీదుగా దూసుకెళ్లాడు. ఘటనలో చంద్రన్న తొడలు, నడుం భాగం తీవ్రంగా నలిగిపోయాయి. క్షతగాత్రుడిని ఆగమేగాలపై స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పీఎస్ ఎస్ఐ రాంబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అనుమానంతోనే బాలుడి హత్య ● 48 గంటల్లోనే మిస్టరీ ఛేదింపు ● నిందితుడి అరెస్ట్ రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసులో మిస్టరీని 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. అనుమానం పెనుభూతమై ఓ బాలుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చాకలి రామ్మోహన్ సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను రూరల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎన్.శేఖర్ వెల్లడించారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పామురాయి సమీపంలోని సిమెంట్ పెల్లల ఫ్యాక్టరీ వద్ద స్థానిక రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు బాలుడు తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో కక్ష పెంచుకున్న రామ్మోహన్ పథకం ప్రకారం జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశానికి బాలుడిని తీసుకెళ్లి సిమెంట్ పెల్లలతో తలపై మోది హత్య చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐ ఎన్.శేఖర్ నేతృత్వంలోని పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారంరాప్తాడు మండలం కదిరి–అనంతపురం రోడ్డులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐతో పాటు ఎస్ఐ కె. రాంబాబు, మహిళా ఎస్ఐ కె. చైతన్య స్వరూపిణి, పీసీలు తిమ్మప్ప, జయరాం నాయక్, కె. రాజును అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అభినందించారు. -
పేరూరు.. రైతు కన్నీరు
రామగిరి: అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు నీరు తెస్తామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రజాప్రతినిధి రెండేళ్లుగా కనీసం డ్యాంవైపు కన్నెత్తి చూడలేదు. పైగా గేట్ల మరమ్మతు పేరుతో డ్యాంలో ఉన్న అర టీఎంసీ నీటిని సైతం దిగువకు వదిలేశారు. ప్రస్తుతం డ్యాంలో చుక్కనీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతోపాటు తాగేందుకు గుక్కెడు నీరులేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు సాగుచేసిన పంటలను సైతం పశువులకు వదిలేసిన పరిస్థితి నెలకొంది. బీళ్లుగా మారిన ఆయకట్టు పేరూరు డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1.81 టీఎంసీ కాగా, రాప్తాడు, అనంతపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో డ్యాం ఆయకట్టు ఉంది. ప్రత్యక్షంగా 12 వేల ఎకరాలతోపాటు పరోక్షంగా మరో 5 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను పండించుకునే వారు. అయితే ప్రస్తుతం డ్యాంలో నీరులేనందున రామగిరి మండలంలోని పేరూరు, పి.కొత్తపల్లి, దుబ్బార్లపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్దకొండాపురం, రెడ్డివారిపల్లి, తిమ్మాపురం, మంగాపురం, ఎంసీ పల్లి, గరిమేకలపల్లి, కనగానపల్లి మండలంకోనేటినాయినిపాళ్యం, శివపురం, మద్దెలచెరువు, వేపకుంట, భానుకోట, కొండపల్లి, పాతపాళ్యం, తగరకుంట, కంబదూరు మండలంలోని చెన్నంపల్లి, రాళ్లఅనంతపురం, నూతిమడుగు, అచ్చంపల్లితోపాటు రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. బయటకురాని గంగమ్మ పేరూరు డ్యాంపైనే ఆధారపడి పంటలు సాగుచేసే రైతులు ఈ సారి వేరుశనగ, మొక్కజొన్న, టమాట, కళింగర, బీర, కాకర, వరి తదితర పంటలు వేశారు. అయితే డ్యాంలో నీరు లేక సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. బోర్లన్నీ ఎండిపోయి సాగునీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుండగా...రైతులు అప్పులు చేసి వందలాది అడుగుల మేర బోర్లు తవ్విస్తున్నప్పటికీ గంగమ్మ బయటకు రావడం లేదు. ఇటు పంటలు లేక అటు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక చాలా మంది రైతులు కుటుంబపోషణకు ఇప్పటికే వలస బాట పట్టారు. మరికొందరు ఊళ్లు విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతమెంతో ఘనం.... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు కర్ణాటక సీఎంతో చర్చించి హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను పేరూరు డ్యాంకు మళ్లించారు. అదే సంవత్సరం వరుణుడు కరుణించడంతో ఎగువ భాగాన విస్తారంగా వర్షాలు కురవడంతో పేరూరు డ్యాం జలకళను సంతరించుకుంది. జలాశయం పొంగిపొర్లడంతో ఏకంగా మూడు నెలలపాటు డ్యాంకున్న 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో డ్యాంను చూసేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లావాసులతోపాటు కర్ణాటక నుంచి కూడా భారీగా తరలివచ్చారు. దీంతో డ్యాంవద్ద కొన్నిరోజుల పాటు పర్యాటకుల సందడి కనిపించింది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండటంతో చేపల వేటతో జాలర్లకు ఉపాధి దొరికింది. ఇక బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లిన రైతులు తిరిగివచ్చి తమ భూముల్లో పంటలను పండించుకుని కుటుంబ పోషణ సాగించారు. హామీలు... నీటిమీద రాతలు రైతులకు హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు సర్కార్ చుక్కనీరులేక ఒట్టిపోయిన పేరూరు జలాశయం భారీగా పడిపోయిన భూగర్భజలమట్టం 800 అడుగుల మేర బోర్లు వేసినా ఫలితం శూన్యం సాగునీరులేక బీళ్లుగా మారిన వేలాది ఎకరాలు బోర్ల కింద వేసిన పంటలనూ జీవాలకు వదిలేసిన వైనంప్రభుత్వం స్పందించకుంటే వలసలే... నాడునేడురాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తాగేందుకు గుక్కెడు నీరులేక, పంటలను సాగు చేసుకొనేందుకు వీలులేక ఈ ప్రాంత ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే పేరూరు డ్యాంకు నీరందించాలని గతవారం కలెక్టర్కు వైఎస్సార్ సీపీ నేతలు విన్నవించారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున రోజురోజుకు బోరుబావుల్లో నీరు అడుగంటున్నాయని, రాబోయే రోజుల్లో తాగునీటికీ ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని ఈప్రాంత వాసులు వాపోతున్నారు. -
రామగిరిలో రేపు రెవెన్యూ క్లినిక్
ప్రశాంతినిలయం: ఈ నెల 22న రామగిరిలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ అంశంపై జిల్లా అధికారులతో సోమవారం వీసీలో కలెక్టర్ సమీక్షించారు. గడువు దాటిన ఫిర్యాదులు ముదిగుబ్బ, కదిరి, కనగానపల్లి మండలాల్లో అధికంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల్లో పర్యటించి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం జేసీ ఆద్వర్యంలో పురోగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ రికార్డుల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 22ఏ జాబితా సవరణలోని 187 దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు. సెల్ప్ ఎన్యుమరేషన్ 4.82 శాతం మాత్రం అయిందని, ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, సర్వే ఏడీ విజయశాంతి తదితరులు ఉన్నారు ‘మన ఊరు–మన నీరు’ వెబ్సైట్ ప్రారంభం నీటి సంరక్షణకు సాంకేతిక తోడ్పాటునందించేలా రూపొందించిన ‘మన ఊరు– మన నీరు’ వెబ్సైట్ను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. భూగర్భ జలాల పునరుద్దరణ, నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణ లక్ష్యంగా వెబ్సైట్ ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 467 పంచాయతీల్లో నీటి సంరక్షణ పనులను సిటిజన్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. వర్షపాతం, భూగర్భ జల మట్టం, చెరువుల నిల్వ సామర్థ్యం, నదుల ప్రవాహానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. వాన నీటిని వృథాగా పోనీయకుండా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణ పనులను ట్రాక్ చేయడం జరుగుతుందన్నారు. చిత్రావతి, జయమంగళి వంటి 8 నదుల సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, నీటిపారుదల ఈఈ గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. . ‘మన రైతన్న–మన బలం’ ఛానల్ ప్రారంభం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ‘మన రైతన్న – మన బలం’ యూట్యూబ్ ఛానల్ను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పంటల సాగులో రైతులు సాధించిన విజయాలు, అనుసరిస్తున్న మెరుగైన పద్ధతులను ఈ ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఆధునిక పద్ధతులు, సాంకేతిక సలహాలు, సందేహాలను ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. -
బాలాజీ అక్రమాస్తులు రూ.3.60 కోట్లు
కదిరి: కదిరి డివిజన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాలాజీ అక్రమాస్తుల విలువ అక్షరాలా రూ.3.60 కోట్లు అని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పీఆర్ఓ) పేరుతో విజయవాడ నుంచి ఏసీబీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తనకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు స్థానిక బీసీ హాస్టల్ వార్డెన్ లక్ష్మినారాయణ నుంచి లంచం తీసుకుంటూ బాలాజీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన అవినీతి, అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా రూ.కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. దీంతో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2), సెక్షన్ 13(1బీ)కింద ఆయనపై మరో కేసు (క్రైం నెం.05/ఆర్సీఏ–ఏటీపీ) నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపారు. ఏకకాలంలో సోదాలు బాలాజీ అక్రమాస్తులపై సోమవారం కదిరితో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆస్తి పత్రాలతో పాటు నేరారోపణకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాలాజీకి 11 చోట్ల ఎంతో విలువైన ఇంటి స్థలాలు, రెండు భవనాలు, రూ.21.80 లక్షల నగదు, సుమారు రూ.26.50 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కియా కంపెనీకి చెందిన సెల్టోస్ కారు, మారుతి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.37.50 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.13 లక్షలు విలువ చేసే ప్రాంసరి నోట్లతో పాటు విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ రూ.3.60 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కదిరి వాణివీధిలో ఉంటున్న బీసీ హాస్టల్ వార్డెన్ జయరామిరెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అయితే జయరామిరెడ్డి ఇంట్లో ఎలాంటి ఆధారాలూ దొరకలేదని సీఐ జయమ్మ విలేకరులకు తెలిపారు. అయితే మిగతా ప్రాంతాల్లో దొరికిన ఆస్తులన్నింటినీ బాలాజీ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో పాటు ఆయన తండ్రి పేరు మీద పెట్టినట్లు వారు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే ఎక్కువ భాగం ఆస్తులు ఉన్నాయి. తదుపరి సోదాలు ముగిసిన అనంతరం నిందితుడిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా ప్రకటించిన ఏసీబీ అన్నింటినీ స్వాధీనం చేసుకున్న వైనం ఆయనపై మరో కేసు నమోదు -
బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం
● జయంతి వేడుకల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి తదితరులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 12వ శతాబ్దంలోనే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం బసవేశ్వరులు చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన బోధించిన ‘శ్రమే నీ ఆరాధన’ అనే సిద్దాంతం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, లింగాయత్ సమాజ ప్రతినిధులు రాజశేఖర్, వీరేష్బాబు, విజయ్కుమార్, జంగం గంగాధర స్వామి, మహదేవ, సదాశివప్ప, నటరాజ తదితరులు పాల్గొన్నారు. టీచర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ తాత్కాలిక జాబితా సిద్ధం చేసినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీలు, పాఠశాల సహాయకులు, హెచ్ఎంల సీనియార్టీ జాబితాలను (సబ్జెక్టు వారీగా, మీడియం వారీగా) సిద్ధం చేశామన్నారు. deoanantapur. blogspot. com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సీనియారిటీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23లోగా పనిదినాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో పేరు, హోదా, సీనియార్టీ జాబితాలో తప్పిదంపై ఆధారాలతో సహా అందజేయాలని సూచించారు. జత చేయాలని సూచించారు. జాబితాలో పేర్లు లేని ఉపాధ్యాయులు కచ్చితంగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ సీనియార్టీ జాబితాలను పరిశీలించి తమ పరిధిలో ఉన్న టీచర్లు సస్పెన్షన్లో ఉన్నా, సెలవుపై ఉన్నా, ఏ ఇతర కారణాల వల్ల తాత్కాలిక జాబితాలో లేకపోతే వెంటనే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. లేదంటే సంబంధిత ఎంఈఓలు, హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫారెన్ సర్వీస్లో పని చేస్తున్న టీచర్లు కూడా తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించుకోవాలన్నారు. గడువు తర్వాత వచ్యిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ శ్రీకర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 202 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీదారుల పేర్కొన్న సమస్యను పరిష్కరించే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పారదర్శకంగా విచారించి పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, రీ ఓపెనింగ్ అర్జీలు లేకుండా చూడాలన్నారు. ఫర్టిగేషన్, ఆటోమేషన్తో రైతులకు మేలు ఉద్యాన పంటల్లో ఫర్టిగేషన్, ఆటోమేషన్తో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ‘ఉద్యాన పంటల్లో కొత్త ఒరవడి– ఫర్టిగేషన్, ఆటోమేషన్’ అనే అంశంపై రూపొందించిన పోస్టర్లను జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథితో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బిందు సేద్యం ద్వారా నీటిని ఆటోమేషన్ పద్ధతిలో పంటకు అందించడంతో నీరు వృథా కాకుండా మొక్కల మొదళ్లకే చేరుతుందన్నారు. రసాయనిక ఎరువులను కూడా భూమిలో చల్లకుండా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా అందించే ఫెర్టిగేషన్ పద్ధతి పాటించాలన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ నీరు, పెట్టుబడితో లాభసాటి పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలపై ప్రభుత్వానికి వివక్ష
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ అనంతపురం: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, ఎలాంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం వివక్షకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ విమర్శించారు. ఈ నెల 26న అనంతపురంలో తలపెట్టిన ‘బీసీ గళం’ కార్యక్రమం విజయవంతం చేయడానికి గల కార్యాచరణపై సోమవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 26న జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారిత దిశగా గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని గుర్తు చేశారు. బీసీలను చంద్రబాబు బ్యాక్వర్డ్ క్లాస్గా భావిస్తే.. బ్యాక్ బోన్ క్లాస్గా వైఎస్ జగన్ మార్చారని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యా కానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్క చెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేసి అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న (న్యాయవాది), రాధాకృష్ణ, బీసీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, బీసీ సెల్ నగర కార్యదర్శి నరేష్, శ్రీనివాసులు, రిలాక్స్ నాగరాజు, శేఖర్ బాబు, రాజశేఖర్, నవీన్, లక్ష్మణ్, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రాజేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కై లాష్, చిన్న రాయుడు, ఎం. కిరణ్, దస్తా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 28 నుంచి పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ● మే 6న బ్రహ్మ రథోత్సవం ఉరవకొండ రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఆరో తేదీ బ్రహ్మ రథోత్సవం (తేరు) జరగనుంది. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఈఓ సాకే రమేష్బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 28న ఆమిద్యాల నుంచి ఉత్సవమూర్తులను పెన్నహోబిలం క్షేత్రానికి తీసుకురావటంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయన్నారు. 29న ప్రాకారోత్సవం, 30న ఉదయం సింహ వాహనోత్సవం, సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న ఉదయం గోవాహనోత్సవం, సాయంత్రం శేష వాహనోత్సవం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమద్ వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవం, 5న ఉదయం సూర్యప్రభ వాహనోత్సవం సాయంత్రం ఐరావత వాహనోత్సవం ఉంటుందన్నారు. 6న బ్రహ్మ రథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణ, 8న శయనోత్సవం, 9న ఉత్సవమూర్తులను తిరిగి ఆమిద్యాల గ్రామానికి చేర్చటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రౌడీ షీటర్లు, గంజాయి విక్రేతల అరెస్ట్ కదిరి టౌన్: పట్టణంలోని ముగ్గురు రౌడీషీటర్లతో పాటు గంజాయి మత్తులో పదేపదే గొడవలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పట్టణ పీఎస్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న గాలివీడు కళ్యాణ్, పవన్కుమార్, ప్రదీప్సింగ్తో పాటు గంజాయి మత్తులో గొడవలకు పాల్పడుతున్న నంద్యాల జస్వంత్, పఠాన్ ముబీన్ అహమ్మద్ ఖాన్, ఇడగొట్టు గణేష్ ఉన్నారు. వీరి నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
కుమార్తెతో వీడియో కాల్లో మాట్లాడి..
రాప్తాడు రూరల్: కారణాలు తెలీదుకాని జీవితంపై విరక్తితో ఓ పోస్టల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య 9 నెలల నిండు గర్భిణి. 18 నెలల వయసున్న కుమార్తె అంటే అమితమైన ప్రేమ. తాను చనిపోయే ముందు కుమార్తె గుర్తుకొచ్చింది కాబోలు చివరిసారిగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఏమనిపించిందో ఏమో కానీ, మళ్లీ వీడియోకాల్ చేసి మాట్లాడాడు. బాధనంతా దిగమింగుకుని యోగక్షేమాలు అడిగి ఫోన్ పెట్టేశాడు. ఆ కుటుంబానికి అదే చివరికాల్ అయింది. ఫోన్ పెట్టేసిన కాసేపటికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సోమవారం అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు మధురానగర్ మూడోక్రాస్లో సోమవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదులముష్టూరుకు చెందిన కుమ్మర గోపినాథ్ (38)కి అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన కుమ్మర శ్రావణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 18 నెలల కుమార్తె ఉంది. శ్రావణి ప్రస్తుతం 9 నెలల నిండు గర్బిణి. ఇంకో నాలుగైదు రోజుల్లో కాన్పు కానుంది. అనంతపురం రూరల్ మండలం మధురానగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరు పోస్టాఫీసులో పని చేస్తున్నాడు. భార్య డెలివరీ కోసమని పుట్టింటికి వెళ్లింది. గోపినాథ్ ఒక్కడే ఇంట్లో ఉంటూ డ్యూటీకి వెళ్లి వచ్చేవాడు. కొన్నేళ్ల పాటు ఊరి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తే తనకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని భార్య అభ్యర్థనకు గోపినాథ్ అంగీకరించాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం మధురానగర్లో ఉన్న ఇంట్లో నుంచి చాలా సామగ్రిని ఆలమూరుకు తరలించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండగా...రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయాలని భావించారు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో తెలీదు కాని గోపినాథ్ సోమవారం మధ్యాహ్నం భార్య, కుమార్తెతో ఫోన్లో మాట్లాడాడు. మరో మారు భార్య ఫోన్చేస్తే లిఫ్ట్ చేయలేదు. మామ సుబ్బరాయుడు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఇంటి యజమానికి శ్రావణి ఫోన్ చేయడంతో ఆమె మిద్దైపెకి వెళ్లి చూడగా అప్పటికే వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న గోపినాథ్ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని వెంటనే కిందకు దింపి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టల్ ఉద్యోగి బలవన్మరణం భార్య 9 నెలల నిండు గర్భిణి అనంతపురం రూరల్ మండలం మధురానగర్లో విషాదం -
135 సెల్ఫోన్ల స్వాధీనం
పుట్టపర్తి టౌన్: వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న 135 సెల్ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని సంబంధీకులకు ఎస్పీ అందజేసి, మాట్లాడారు. సెల్ఫోన్లను వీలైనంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ కేవలం వస్తువుగా మాత్రమే చూడకుండా వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, జ్ఞాపకాలతో కూడిన విలువైన పేటికగా గుర్తించాలన్నారు. అందులో మీకు సంబంఽధించిన ముఖ్యమైన డేటా ఉంటుందనే విషయాన్ని మరవకూడదన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రికవరీ సులభతరం అవుతుందన్నారు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తక్కువ ధరకు వస్తున్నాయని ఆశ పడి ఎలాంటి బిల్లులు లేని పాత ఫోన్లను కొనుగోలు చేయరాదని సూచించారు. బిల్లులు లేకుండా కొనగోలు చేసే ఫోన్లు దొంగలించనవి అయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి ఫోన్ల వాడకం వల్ల అనవపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సెల్ఫోన్ల రికవరీలో చొరవ చూపిన సిబ్బందిని అభినందించారు. ఊరు వెళ్తున్నారా జాగ్రత్త వేసవి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి ముందు, వెనుక భాగం దృఢమైన గేట్లు అమర్చుకోవాలన్నారు. సెలవుల్లో బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్ద మొత్తం నగదు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా సీసీఎస్, ఐటీకోర్, సైబర్ క్రైమ్ సీఐలు గోపీనాథరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సతీష్కుమార్, సిబ్బంది కృష్ణానాయక్, నరసింహమూర్తి, శ్రీనివాసులు, చంద్ర, షామీర్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 75 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 75 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ బొజ్జప్ప పాల్గొన్నారు. సంబంధీకులకు అందజేసిన ఎస్పీ సతీష్కుమార్ -
కలుషిత నీరు తాగి గొర్రెల మృతి
కదిరి అర్బన్: ప్రమాదవశాత్తు యూరియా కలిపిన నీరు తాగి 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కదిరి మండలం మీటేనాయక్ తండా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జేనాయక్ జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన జీవాలను మేపు కోసమని గ్రామ శివారులోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేసిన గొర్రెలను తిరుపాల్నాయక్ పొలంలో నీటిని తాపేందుకు వదిలాడు. అయితే అప్పటికే యూరియా కలిపిన నీరు పైపుల్లో ఉండడంతో ఆ నీరు తాగి 40 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి సునీత అక్కడకు చేరుకుని గొర్రెల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనతో రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. -
ఉద్యాన, ఉపాధి పథకాల్లో భారీ అవినీతి
ప్రశాంతి నిలయం: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో ఉద్యానశాఖ, ఉపాధి హామీ పథకాలలో రూ.కోట్ల అవినీతిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తేటతెల్లం చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో బోగస్ బిల్లులతో ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయాన్ని బట్టబయలు చేశారు. సోమవారం కలెక్టరేట్కు విచ్చేసిన ఆయన.. కలెక్టర్ శ్యాంప్రసాద్ను కలసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్వాకాన్ని వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడుతూ... ముదిగుబ్బ మండలంలో రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో టమాట మొక్కలకు సపోర్టుగా కట్టెలు, మామిడి కాయలు నాణ్యత వచ్చేందుకు ఫ్రూట్ కవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందిందన్నారు. అయితే ఉద్యానశాఖ అధికారులు కుమ్మకై ్క అర్హులకు కాకుండా అనర్హులకు కొండలు, గుట్టలు ఉన్న వారికి బోగస్ బిల్లులు మంజూరు చేశారన్నారు. ఒ్కచోట పంట సాగు చేస్తే మరోచోట బోగస్ వ్యక్తులకు జియోట్యాగ్ చేసి మరీ ఈ దందా కొనసాగించారన్నారు. ముఖ్యంగా జేకేపల్లి ఆర్బీకేలో పని చేసే ప్రియాంక, ముదిగుబ్బ మండల వ్యవసాయ శాఖలో ఏఈఓగా పని చేసే మనోహర్ నాయక్, ఎంపీఈఓ సరళ, హార్టికల్చర్ ఆఫీసర్ అమరేశ్వరి ఈ అవినీతిలో ప్రధాన భూమిక పోషించారన్నారు. మొత్తంగా మండలంలో రూ.1.38 కోట్లకుపైగా ప్రజాధనానికి బోగస్ వ్యక్తుల పేరిట బిల్లులు మంజూరు చేశారన్నారు. వారు అంతటితో ఆగకుండా తమ కుటుంబ సభ్యుల పేరిట కూడా నకిలీ బిల్లులు పెట్టుకున్నారన్నారు. దొరిగిల్లు గ్రామంలో 571 ఎకరాల్లో 252 మంది రైతులు టమాట సాగు చేసినట్లుగా చూపి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను తాము సమాచారం హక్కు చట్టం కింద సేకరించి ఆధారాలను బహిర్గతం చేశామన్నారు. అవినీతి సొమ్మును ఉద్యానశాఖ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వాటాలు వేసి పంచుకున్నారన్నారు. ఉపాధి హామీలోనూ అంతులేని అవినీతి ముదిగుబ్బ మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రూ.10 కోట్ల ఉపాధి హామీ పనులు జరిగాయని, సామాజిక తనిఖీ తూతూమంత్రంగా చేసిన అధికారులు అవినీతి, అక్రమాలను బయటకు పొక్కకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. సామాజిక తనిఖీ గురించి ప్రజలకు తెలపకుండా గోప్యంగా నిర్వహించారన్నారు. మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఆడిట్ జరిగిన ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులను మేట్లతో ఇష్టానుసారం పెట్టించారన్నారు. ముదిగుబ్బ మండలంలో 2017 నుంచి 2019 సంవత్సరం వరకు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి జరిగిన 13వ విడత సామాజిక తనిఖీలో రూ.3.68 కోట్ల అక్రమాలను తాము బయటపెట్టి 7 మంది అధికారులు, 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై కేసు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. అప్పట్లో హోల్డ్లో ఉన్న రూ.3.68 కోట్ల నిధులను తాజాగా విడుదల చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ డబ్బంతా అధికారులు, రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఈ అవినీతి కుంభకోణంతో సంబంధం లేకుంటే తక్షణం విచారణ జరిపించి సొమ్ము రికవరీ చేయాలన్నారు. కష్టపడి పని చేసిన ఉపాధి కూలీలకు 3 నెలలవుతున్నా ఇంత వరకు డబ్బు రాలేదని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలతో కలసి భోజనం చేయడం కాదని... వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేసి న్యాయం చేయాలని మంత్రి సత్యకుమార్కు కేతిరెడ్డి చురకలంటించారు. ముదిగుబ్బ రైతులకు న్యాయం చేయాలి పరిటాల రవి హత్యానంతరం జరిగిన గొడవల్లో ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను తగులబెట్టారని, దీంతో రైతులు ఫ్రీహోల్డ్ విషయంలో రికార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని గుర్తించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముదిగుబ్బ రైతులందరికీ ఫ్రీహోల్డ్ వర్తించేలా అప్పట్లో చర్యలు తీసుకున్నారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా రైతుల భూములు మళ్లీ ఫ్రీహోల్డ్లోనే ఉన్నాయని.. వారికి న్యాయం చేయాలని కలెక్టర్కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి వెంట ముదిగుబ్బ రైతులు, రైతు సంఘం నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ముదిగుబ్బ మండలంలో అవకతవకలు ఉద్యానశాఖ అధికారుల కనుసన్నల్లో రూ.1.38 కోట్ల ప్రజాధనం స్వాహా ‘ఉపాధి హామీ’ పనులు చేయకుండానే రూ.కోట్లు పక్కదారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సోషల్ ఆడిట్ మేనేజ్ హోల్డ్లో పెట్టిన రూ.3.68 కోట్లకు బోగస్ బిల్లుల మంజూరు అధికార పార్టీ నాయకుల అండతోనే యథేచ్ఛగా అవినీతి, అక్రమాలు కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ -
ఫ్యాప్టో మూడోదశ పోరాటానికి రంగం సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మూడోదశ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న జిల్లా ప్యాప్టో నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపత్రాలు విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తామని తీర్మానించారు. 25న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. సమావేశంలో ప్యాప్టో చైర్మన్ శ్రీనివాస నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, సభ్యులు రమణారెడ్డి, వెంకటరత్నం, కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శంకరమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు. -
వేంకన్న కొండను కొల్లగొట్టాలని..
చిలమత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజ వనరుల దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ ఇలా ప్రతిదీ దోపిడీకి గురవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సైతం అక్రమార్కులు క్రషర్లు పెట్టి మైనింగ్ చేస్తున్నారు. తాజాగా మండల పరిధిలోని మొరసపల్లి పంచాయతీ మాదిరెడ్డిపల్లి శివార్లలో సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన కొండపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. ఇక్కడ వెలసిన దేవదేవుడిని మాదిరెడ్డిపల్లితో పాటు సోమఘట్ట పంచాయతీ పరిధిలోని ఎస్. కొత్తపల్లి ప్రజలు చాలా ఏళ్లుగా కొలుస్తున్నారు. కొండపై పూర్వం కట్టించిన మంటపాలు సైతం ఉన్నాయి. ఇష్టారాజ్యంగా అనుమతులు.. అధికార టీడీపీ నేతలు మాదిరెడ్డిపల్లి కొండలో క్రషర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. భక్తుల మనోభావాల్ని పక్కన పెట్టి మరీ మైనింగ్ శాఖ వారు ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టేందుకు అనుమతులు ఇచ్చేస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు మాత్రం కొండలో మైనింగ్కు ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇష్టదైవం కోసం ఎందాకై నా పోరాటాలు చేస్తామని, అధికారులు తమ మనోభావాల్ని పట్టించుకోకుండా ఎలా ముందుకెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు బెదిరింపు... కొండపై సర్వే నిమిత్తం వచ్చిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులను ఇటీవల మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు ప్రశ్నించారు. దైవం ఉన్న చోటును తుడిపేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించగా.. సదరు వ్యక్తులు తిరగబడినట్లు తెలిసింది. ఎవరు అడ్డువచ్చినా మైనింగ్ చేసి తీరుతామంటూ బెదిరించినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో గుప్తనిధుల కోసం వేట.. మాదిరెడ్డిపల్లి కొండలో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నట్టు భక్తుల విశ్వాసం. అక్కడ పెద్ద గుహ ఉందని, అపార సంపదను అందులో దాచారన్న ప్రచారం ఉంది. అందుకు బలం చేకూర్చేలా గతేడాది కొందరు వ్యక్తులు గుహలో పేలుళ్లు జరిపారు. గ్రామస్తులు రావడంతో ఉడాయించారు. ఈ క్రమంలో మైనింగ్ మాటున కొండను స్వాధీనం చేసుకుని సంపదను దోచుకోవడానికే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళావిహీనంగా రాజుదేవరకొండ .. చిలమత్తూరు మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లి సమీపంలోని రాజుదేవరకొండ ఇప్పటికే మైనింగ్ మాఫియా చేతిలో చిక్కి కళా విహీనంగా తయారైంది. అనుమతి పొందిన సర్వే నంబరులో కాకుండా వేరే సర్వే నంబరులో ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని, గుప్తనిధుల వేటలో భాగంగానే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజుదేవరకొండపై శివాలయం ఉండగా, ఆలయాన్ని గతంలోనే గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేయడం గమనార్హం. మైనింగ్ శాఖ ఉన్నట్టా.. లేనట్టా..? అక్రమార్కులు ఏం చేసుకున్నా తాము స్పందించబోమంటూ మైనింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ఆ శాఖ అధికారులు కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లాలో మైనింగ్ శాఖ ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ సహజ వనరులు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు. మాదిరెడ్డిపల్లి కొండపై మైనింగ్ మాఫియా కన్ను భక్తుల మనోభావాల్ని పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
అబ్బో.. వడదెబ్బ!
ప్రశాంతినిలయం: వేసవి ఎండలు మండుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగుతీసి అడుగు వేయాలన్నా జంకుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకమని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం చెబుతున్నారు. వేసవి కాలంలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బ తగిలే సూచనలున్నాయి. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రాకూడదని, వెళ్లాల్సి వస్తే రక్షణగా గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లకుండా ఉండడమే మంచిది. సుమారు నెల రోజుల నుంచి రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా సన్స్ట్రోక్ (వడదెబ్బ) తగిలితే మనిషికి చెమట పట్టక పోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర/కలవరింతలు ఉండడం, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి లోకి వెళ్తారు. వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ.. ● నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ● లేత వర్ణం, తేలికై న, కాటన్ దుస్తులు ధరించాలి. ● ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. ● పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రంగా రెండు పూటలా స్నానం చేయాలి. ● భోజనం మితంగా తిని నీరు అధికంగా తాగాలి. ● ఎండ అధికంగా ఉన్న సమయంలో ఇంటి పట్టునే ఉండాలి. బయటకు వెల్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలి. ● ఇంట్లో ఉన్న సమయంలో కిటికీలు తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి. చేయకూడని పనులు: ● మండుటెండలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ● సూర్యకిరణాలు, వేడి గాలికి గురి కాకూడదు. ● ఎండ అనిపిస్తే రోడ్డు పక్కన ఉన్న చల్లని, రంగు పానీయాలు తాగరాదు. ● రోడ్ల మీద విక్రయించే కలుషిత ఆహారం తిపకూడదు. ● వేసవిలో మాంసాహారం తగ్గించాలి. మద్యం తాగరాదు. ● ఎండ వేళల్లో శరీరంపై భారం ఉండే విధంగా పనులు చేయరాదు. ● నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు. వడదెబ్బకు ప్రథమ చికిత్స: ● వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. ● చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా చేయాలి. ● ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలే విధంగా ఉంచాలి. ●ఉప్పు కలిపిన మజ్జిగ/ చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ /ఓరల్ డీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) తాగించొచ్చు. వడగాలులు ప్రాణాంతకం రోజుకు 15 గ్లాసుల నీరు తాగాలి వడదెబ్బ ప్రాణాంతకమైనది వడదెబ్బకు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతకమే.. ముఖ్యంగా ఉపాధి పనులకు వెళ్లే కూలీలు సాధ్యమైనంతగా మంచినీళ్లు తీసుకెళ్లి అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఉదయం పనులు ప్రారంభించి, 10 గంటల్లోపు పూర్తి చేసి, ఇంటికి చేరుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల లోపు శ్రమతో కూడిన పనులను చేయరాదు. ఇక గర్భిణులు పూర్తిగా బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి. వెళ్లాల్సి వస్తే ఆటోలు, జీపులు బస్సుల్లో వెళ్లి పనులు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేయాలి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానీయాలు పూర్తిగా మానేయాలి. అధిక ప్రోటీన్ ఉండే ఉప్పు, కారం, నూనె పదార్థాలు తీసుకోవద్దు. చిన్న పిల్లలను బయటకు పంపరాదు. స్కూళ్లు వదిలిన తర్వాత విద్యార్థుల సంరక్షణ చాలా ముఖ్యం. బయట ఆడే ఆటల కంటే ఇంట్లోనే ఆడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. – శ్యాం ప్రసాద్, కలెక్టర్, శ్రీసత్యసాయి జిల్లా: -
‘రెవెన్యూ’లో పదోన్నతులు ఎండమావే!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖది ప్రత్యేకస్థానం. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడి అధికారుల నుంచి సలహాలు, సూచనలు ముఖ్యంగా పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధానాలను తెలుసుకుంటారు. ఇలా ఇతర శాఖలకు మార్గదర్శకంగా ఉండే రెవెన్యూశాఖ.. ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో సరైన న్యాయం చేయలేకపోతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ (జేఏ)లకు సీనియర్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా పదోన్నతి కల్పన అర్హులైన ఉద్యోగులకు ఎండమావిలా మారింది. సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన ప్రతిసారీ లోపాలు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో అధికారుల నిర్వాకం కారణంగా ఏకంగా పదోన్నతుల కల్పన ఫైలు అనుమతి కోసం సీసీఎల్ఏకు చేరింది. ఇలాంటి పరిస్థితి రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ చూడలేదని పలువులు ఉద్యోగులు చెబుతుండడం గమనార్హం. 65 ఎస్ఏ పోస్టుల ఖాళీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను అనంతపురం నుంచే నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖలో దాదాపు 65 సీనియర్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) ఉమ్మడి జిల్లాలో 40 మంది వరకు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫైలు.. సీసీఎల్ఏ పరిధిలోకి జేఏలకు పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా లోపభూయిష్టంగా సిద్ధమవుతుండడంతో ప్రక్రియకు ప్రతిసారి ఆటంకం వస్తోంది. పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతి ఏడాది అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ 2020–21 వరకు అప్డేషన్ జరిగింది. ఆ తరువాత నుంచి జరగలేదు. అప్డేషన్ ఐదేళ్ల లోపు ఉంటే పదోన్నతులు కల్పించడం కలెక్టర్ పరిధిలో ఉంటుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే 2021–22, 2022–23, 2023–24, 2024–25, 2025–26 ఇలా ఐదేళ్లు అప్డేషన్ చేయలేదు. ప్రస్తుతం 2026–27 ఆర్థిక సంవత్సరం నడుస్తోంది. అప్డేషన్ జరగక ఐదేళ్లు దాటడంతో సీసీఎల్ఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేషన్ చేసుకుంటూ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. పదోన్నతులు పొందేందుకు ఇలా సీసీఎల్ఏ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థతి గతంలో ఎన్నడూ రాలేదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. నిరాశా నిస్పృహలో ఉద్యోగులు ఉద్యోగులు తమ సర్వీస్లో ఆశించేది పదోన్నతి. అయితే పదోన్నతి కల్పించడంతో జాప్యం జరిగితే ఆ ప్రభావం ఉద్యోగి పనితీరుపై పడుతుంది. అర్హత ఉండీ అధికారుల నిర్వాకం కారణంగా ఏళ్లుగా పదోన్నతి పొందలేకపోతున్న జూనియర్ అసిస్టెంట్లు తీవ్ర నిరాశా నిస్పృహతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల నుంచి నాణ్యమైన సేవలు అందవనే అభిప్రాయం సీనియర్ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 65 ఎస్ఏ పోస్టులు ఖాళీ అధికారుల నిర్వాకంతో సీసీఎల్ఏకు ఫైలు అర్హులైన 40 మంది జేఏల ఎదురుచూపు ఈ పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగులు -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. బంగారు గొలుసు అపహరణ బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్తూ బ్యాగులో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
బంగారు గొలుసు అపహరణ
బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్లి బ్యాగు చూసుకోగా, అందులో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో ఉన్న జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
అమడగూరులో మట్టి మాఫియా
పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు ‘మామూళ్ల’ మత్తులో తూలుతుండడంతో అమడగూరు మండలంలో రాజ్యమేలుతోంది. అక్రమార్కులు నిత్యం వందలాది టిప్పర్లతో మండల కేంద్రంలోని దేవరగుడి చెరువు నుంచి మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో చెరువు మట్టి తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టి రూ.4 వేల ప్రకారం ఇటుక బట్టీలు, పొలాలతో పాటు కొంత మంది కర్ణాటకకు తరలించి జేబులు నింపుకుంటు న్నారు. వంకలు, చెరువుల్లో దొరికే ఇసుకను కూడా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తరలించడంతో చెరువు కట్ట దెబ్బ తింటోందని, ఇప్పటికైనా దేవర గుడి చెరువును రక్షించాలని కోరుతున్నారు. -
అక్షయం.. అద్భుత యోగం
గోల్డ్షాపులో అమ్మకానికి ఉంచిన బంగారు నగలు కిటకిటలాడుతున్న బంగారు దుకాణంబంగారు షాపులో నగలు కొనుగోలులో బిజీగా ఉన్న మహిళ హిందూపురం: హిందూ సంప్రదాయాల్లో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది.. అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇదొకటి.వైశాఖ మాసం శుక్లపక్షం మూడో చంద్రరోజు తృతీయ నాడు వస్తుంది. అక్షయ అనే పదానికి శాశ్వతం.. ఎప్పటికీ తగ్గనిది అని అర్థం. ఇది అంతులేని శ్రేయస్సు, అదృష్టం, విజయాన్ని ఇస్తుందని ప్రజల నమ్మకం. అక్షయ తృతీయ.. విష్ణుమూర్తితోపాటు లక్ష్మీదేవిని ఆరాధించే ఈ పర్వదినాన ఏప్రిల్ 20 కొత్త వస్తువులు కొనుగోలుతోపాటు శుభకార్యాలా, కొత్త పనులకు శ్రీకారం చుడితే మంచిదని ఓ నమ్మకం. అక్షయ తృతీయ రోజున కలిగే యోగాలప్రభావం వల్ల చేసే పనులకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. అక్షయ తృతీయను ఆంధ్రప్రదేశ్ కన్నా ఉత్తరాది రాష్ట్రాలో విశేష పండుగగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి తదితర పట్టణాల్లో బంగారు, వెండి కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. హిందూపురంలోని గాంధీసర్కిల్, మెయిన్బజారు, కంసాలపేట, చిన్నమార్కెట్ ఏరియాలో పండుగ వాతావరణం నెలకొంది. బంగారు దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించి పలు రకాల డిస్కౌంట్ల రేట్లు ప్రదర్శనలో ఉంచారు. అక్షయ తృతీయ దినాన ఆవగింజంత బంగారమైనా కొనాలని ప్రచారంతో ప్రజలు ప్రత్యేకించి, మహిళలు బంగారు దుకాణాల్లో రద్దీగా కనిపిస్తున్నారు. కుమారైలు, కొత్త కొడళ్ల బంగారు ఆభరణాలను కొనిడానికి కుటుంబ సభ్యులు ఆసక్తి చూపసాగారు. ఈపండుగను హిందూవులు మాత్రమే కాకుండా ముస్లిం మహిళలు కూడా తరలివచ్చి బంగారు నగలు కొనుగోలు చేయడం విశేషం. కుబేరుడు ఈ తిథిలో ధనాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన రోజుగాను, శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయపాత్ర ప్రసాదించిన రోజుగాను ఇలా.. పలు రకాలుగా పురాణ కథలు చెప్తున్నాయి. అక్షయ అంటే క్షయం కానిది ఎన్నాడూ తరిగిపోనిందని అర్థం. లక్ష్మిదేవికి ప్రీతికరమైన బంగారు ఆభరణాలతో పూజిస్తే లక్ష్మిదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ప్రజల విశ్వాసం. బంగారు దుకాణాల్లో కొనుగోళ్ల సందడి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే స్వర్ణశోభితమే.. అంతా కలిసొస్తుందని నమ్మకం.. అక్షయ తృతీయరోజున బంగారు, వెండి కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని ప్రచారం. దీంతో చాలామంది మహిళలు నగలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆదివారం, సోమవారం రెండురోజులు ఇలాగే సందడిగా ఉంటుంది. నగలు కొనడమంటే మహిళలకు బాగా ఇష్టం. ఇంట్లో వారు కూడా సెంటిమెంట్ను కాదనలేరు. – నంబూరి శంకర్, జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు,హిందూపురంఉంగారం కొన్నాం.. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని అంటారు. అందుకు బంగారుం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నేను కూడా కమ్మలు, వెండి పట్టీలు కొన్నాం. బంగారం కొనడం వల్ల నష్టమేమీ ఉండదు అని అందూ కొంటున్నారు. – గంగమ్మ, హిందూపురం -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
రొద్దం:గౌరాజుపల్లి గ్రామ సమీపంలోని ఎం. కొత్తపల్లి – నారనాగేపల్లి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం బోల్తాపడి గాయపడిన ప్రకాష్ (15) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. వివరాలు.. నారనాగేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూపూరు గోవిందప్ప కొడుకు ప్రకాశ్.. పదోతరగతి పరీక్షలు రాశాడు. శనివారం రొద్దం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాష్ను పెనుకొండ ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ సర్పంచు నాగార్జున ఆవుల లక్ష్మీనారాయణరెడ్డి, కురుబ నాగరాజు, ఓబిరెడ్డి, గొల్ల సత్యనారాయణ, బాబు తదితరులు బాధిత కుటుంబానికి రూ.20వేలు ఆర్థికసాయం అందించారు. ఇంటర్ విద్యార్థి అదృశ్యం బత్తలపల్లి: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆదివారం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జలాలపురానికి చెందిన బి.శివయ్య, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నెల్లూరులో బీటెక్ చదువుతున్నాడు. రెండో కొడుకు జగదీష్ ధర్మవరంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈనెల 17న రాతిర భోజన సమయంలో తల్లిదండ్రులు కుమారుడితో మాట్లాడుతూ వచ్చే సంవత్సరమైనా బాగా చదివి మంచి ఫలితాలు తెచ్చుకోవాలని సూచించారు. మనస్థాపంతో మరుసటిరోజు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకోగా, ఇంటి వద్ద ఉన్న కుమారుడు కనిపించలేదు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి హిందూపురం: సోమందేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమీరా (50) ఆదివారం మృతిచెందింది. సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలిపిన మేరకు.. హిందూపురంలోని హస్నాబాద్కు చెందిన డ్రైవర్ ఇక్బాల్, కుటుంబ సభ్యులు కారులో గోరంట్లకు శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా మార్గంమధ్యలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును తగిలి, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది.ఈప్రమాదంలో కారు వెనుక భాగంలో కూర్చున్న అమీరాకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయన్నపేటలో యువకుడిపై దాడి బుక్కరాయసముద్రం:దయ్యాలకుంటపల్లి వద్దనున్న బయన్నపేటలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమార్తె వివాహం త్వరలో జరగబోతుండగా, ఇల్లు శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. రామాంజనేయులు కొడుకు గణేష్ స్థానికంగా ఉన్న కొళాయి వద్ద నీరు పట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, సూరి అక్కడ ఘర్షణ పడ్డారు. గణేష్పై శ్రీకాంత్, సూరి కర్రలతో భౌతికదాడికి దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య పుట్లూరు: రంగమనాయునిపల్లిలో శనివారం రాత్రి వీరేంద్ర (26) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వీరేంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. కూలి పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగుతున్న విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గ్రామంలోని తన మేనమామ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువులు వెంటనే తలిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు తండ్రి ఓబులేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా వికాసానికి కాంగ్రెస్ అడ్డు అనంతపురం టవర్క్లాక్: మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్తో సహా విపక్షాలు వ్యతిరేకించి మహిళా వికాసానికి అడ్డుపుల్ల వేశాయని.. అయినా చర్చలు జరిపి గెలిచే తీరుతామని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామన్నారు. -
‘పథకాల అమలులో వేగం పెంచండి’
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలులో ప్రభుత్వ పథకాలు, పరిపాలనా అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా తదితర వాటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన కోసం ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల శిక్షణను ఏప్రిల్ 25వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైందన్నారు. ఉపాధి హామీ కూలీల హాజరు జిల్లా సగటు 47.23 శాతం ఉందని, పథకం లక్ష్యాలను చేరుకునేందుకు కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. సోలార్ విద్యుత్ పథకం కింద రిజిస్ట్రేషన్లు పెంచాలన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి పాల్గొన్నారు. అనవసర సిజేరియన్లను తగ్గించాలి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు అనవసర సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సీ–సెక్షన్ ప్రసవాలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... 2022–23లో సీ–సెక్షన్ ప్రసవాలు 48.42 శాతంగా నమోదు కాగా, 2025–26 నాటికి అవి 52.67 శాతానికి పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరిగాయన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన రేటుకు 10–15 శాతం అధికమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సీ–సెక్షన్లు చేయరాదన్నారు. సీ– సెక్షన్ చేయాల్సి వస్తే సీనియర్ వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సాధారణ ప్రసవాలపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, జిల్లా సమన్వయకర్త శ్రీదేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ భాగ్యలక్ష్మి, డాక్టర్ నాగేంద్ర నాయక్, డాక్టర్ సునీల్, పద్మజ తదితరులు ఉన్నారు. వర్షపునీటిని ఒడిసి పడదాం ధర్మవరం రూరల్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టం పెంచుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం చెరువు వద్ద నిర్వహించిన జలధార–జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలమట్టం పెంచడమే ‘జలధార–జలహారతి’ ముఖ్య ఉద్దేశమన్నారు. ధర్మవరం చెరువును గ్రీన్ కవర్ ప్రోగ్రాం కింద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి నిపుణుల బృందంతో సర్వే చేయించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఇరిగేషన్ ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, తహసీల్దార్ సురేష్బాబు, సాగునీటి సంఘం అధ్యక్షుడు రేనాటి శ్రీనివాసులు, నాయకులు కమతం కాటమయ్య తదితరులు ఉన్నారు. -
చేనేతల నైపుణ్యంతో జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి
● కలెక్టర్ శ్యాంప్రసాద్ ● పట్టుచీర డిజైనర్ నాగరాజుకు అభినందన ధర్మవరం: జిల్లాలోని చేనేతలు తమ నైపుణ్యం ఉపయోగించి తయారు చేసే ధర్మవరం పట్టుచీరలతో జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోందని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. శనివారం ధర్మవరం వచ్చిన కలెక్టర్ జాతీయ అవార్డు గ్రహీత, పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజును సన్మానించారు. చైనా దేశంలోని బీజింగ్, గ్యాంగ్జూ నగరాల్లో జరిగిన ‘వసంత మేళా–2026’ పాల్గొన్న జుజారు నాగరాజు మన నాగరికతను ప్రదర్శించి అంతర్జాతీయంగా చేనేత విభాగంలో జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. మరుగున పడుతున్న చేనేత పరిశ్రమకు నాగరాజులాంటి కళాకారులెందరో ప్రాణం పోస్తున్నారన్నారు. అనంతరం కంప్యూటర్లో డిజైనింగ్ చేసే విధానం, డిజైన్ గ్రాఫ్, ప్రింటింగ్, పట్టుచీరలు, పట్టు శాలువా తయారీపై డిజైనర్ నాగరాజు కలెక్టర్ శ్యాంప్రసాద్కు వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, తహసీల్దార్ సురేష్బాబు, నాయకులు తదితరులు ఉన్నారు. చిరుత కూన అనుమానాస్పద మృతి ● నీరు దొరక్క చనిపోయి ఉండొచ్చన్న అధికారులు రొళ్ల: నాలుగైదు నెలలు వయసు గల ఓ చిరుత కూన అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం రొళ్ల మండలం హొట్టేబెట్ట పంచాయతీ కల్లురొప్పం గ్రామ సమీపాన మందలపల్లి బీట్ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. అటుగా వెళ్లిన పశువుల కాపరులు చిరుత కూన కళేబరాన్ని గుర్తించారు. వారి నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎఫ్ఓ చక్రపాణి, పశు సంవర్ధక శాఖ మడకశిర ఏడీ అమర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత చిరుత పిల్ల కళేబరాన్ని అక్కడే దహనం చేశారు. అటవీ ప్రాంతంలో నీళ్లు దొరక్క.. ఎండ తీవ్రతకు మృతి చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతున్నామని, నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు సత్తాధర్మవరం అర్బన్: 16వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టు సత్తా చాటింది. ఫైనల్స్లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ తెలిపారు. చిత్తూరులో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి హాకీ పోటీలు జరిగాయన్నారు. శనివారం అనంతపురం జిల్లా జట్టుతో జరిగిన ఫైనల్స్లో 2–1తో ఓటమి చెంది రెండో స్థానంతో నిలిచిందన్నారు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును జిల్లాకు చెందిన క్రీడాకారిణి వర్ష అందుకుందని తెలిపారు. సత్తా చాటిన క్రీడాకారులను జిల్లా హాకీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, ఉడుముల రామచంద్ర, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, అంజన్న, అరవింద్గౌడ్, చందు, హాకీ జిల్లా కోచ్ హుసేన్, డైరెక్టర్లు మారుతికుమార్, ఇర్షాద్, అమునుద్దీన్, కిరణ్ తదితరులు అభినందించారు. -
ఉపాధికి రాంరాం
సాక్షి, పుట్టపర్తి ఎండలు మండిపోతున్నాయి. వ్యవసాయ పనులు కూడా లేవు. అయినా సరే కూలీలు వీబీజీ రామ్జీ పథకంలో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండటంతో పనులు చేసినా ఫలితం లేదని భావిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఫేస్ యాప్ అటెండెన్స్ ఉండటంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. అందువల్లే రోజు వారి కూలీల లక్ష్యంలో నాల్గో వంతు కూడా హాజరు కావడం లేదు. దీంతో కూలీల సంఖ్య పెంచేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిళ్లు తెస్తున్నారు. లక్ష్యం చేరుకోకపోతే వేటు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి పనులకు కూలీలను తీసుకెళ్లేందుకు పల్లెల్లో బతిమాలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 25 మంది సస్పెండ్.. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జిల్లాలకు లక్ష్యం విధిస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్ శ్యాంప్రసాద్ వీబీజీ రామ్జీ పథకం సిబ్బందితో సమావేశాలు నిర్వహించి కూలీల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. ఎలాగైనా లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలని ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజురోజుకూ పనులకు వచ్చే కూలీలు తగ్గిపోవడంతో కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. కూలీల సంఖ్య పెంచని 25 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆరుగురు ఏపీడీలకు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో మిగతా వారందరూ అప్రమత్తమయ్యారు. అయితే ఉపాధి బిల్లులు ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా ఉండగా..పనులకు వెళ్తే.. కూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారోనని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చేసిన పనులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగింట ఒకవంతు హాజరు.. జిల్లాలో 3.50 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వారిలో రోజుకు 1.20 లక్షల మంది హాజరు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కూలీల సంఖ్య రోజుకు సగటున 40 వేలు కూడా దాటడం లేదు. రోజూ 30 వేల నుంచి 35 వేల మధ్యన కూలీల సంఖ్య ఉంటోంది. దీంతో ఉపాధి పనులపై దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడి పెంచారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతోనే కూలీలు పనులకు రావడం లేదనే కారణం చెబుతున్నారు. పనిచేసి నెలల తరబడి వేచి చూడాలా...అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. ‘‘బాబ్బాబు.. ఉపాధి పనులకు రండి.. రోజుకు రూ.300పైనే కూలి ఇస్తాం. పనిచేసే ప్రాంతంలో నీడ, నీరు కల్పిస్తాం. ఇప్పుడు వేసవి అలవెన్సులు కూడా ఇస్తున్నాం’’ అంటూ అధికారులు ఉపాధి కూలీలను బతిమాలుతున్నా...పనులకు రాలేమని కూలీలు తెగేసి చెబుతున్నారు. ముందు చేసిన పనులకు బిల్లులివ్వండి.. ఆ తర్వాత ఆలోచిస్తామంటున్నారు. కలెక్టర్ మాత్రం కూలీల సంఖ్య పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తుండగా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రూ.30 కోట్లపైనే వేతన బకాయిలు పనులు చేసేందుకు ఆసక్తి చూపని కూలీలు లక్ష్యం పూర్తి చేయాలని అధికారుల నుంచి ఒత్తిళ్లు కూలీలను తీసుకురాలేదని ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు 25 మంది ఎఫ్ఏలను సస్పెండ్ చేసిన కలెక్టర్ మరో ఆరుగురు ఏపీడీలకు నోటీసులు -
కూటమి నేతల ఆగడాలు ఎండగడదాం
● ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేద్దాం ● నాయకులు, కార్యకర్తలకు ఉష శ్రీ చరణ్ పిలుపు పెనుకొండ రూరల్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. ఊరారా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. కూటమి పార్టీల నేతలు సహజ వనరులను దోచుకుంటూ అదే పాలన అనుకుంటున్నారు. వారి ఆగడాలను ఎక్కడికక్కడ ఎండగడదాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం మండలాల్లోని పంచాయతీ కన్వీనర్లు, యువజన విభాగం, ఐటీ విభాగం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అందజేసిన గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... అనుబంధ విభాగాల సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అధికార పక్షం తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనుబంధ విభాగాలన్నీ పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పెనుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్రెడ్డి, గజేంద్ర, శ్రీనివాసులు, పగడాల వెంకటేష్, మేదర శంకర, తిమ్మయ్య, ఆయా మండలాల మాజీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. -
కవ్విస్తారు.. కాటేస్తారు!
రాప్తాడు రూరల్: అనంతపురం నగరం, రూరల్లో సమాజాన్ని కుదిపేస్తున్న సంచలన హనీ ట్రాప్ (వలపు వల) ముఠా దందా వెలుగులోకి వచ్చింది. బయటకు గౌరవంగా జీవిస్తున్న అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, వలపు వయ్యారాలతో వల వేసి రూ.లక్షల్లో దోచుకుంటున్న తీరు భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ముఠాకు ఒక మహిళే సూత్రధారి. కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తుంది. ఆ తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత మాటల మాయలో పడేసిన తర్వాత సదరు వ్యక్తిని ఒక ఇంటికి పిలుస్తారు. అక్కడ మహిళతో ఏకాంతంగా గడిపే వాతావరణం కల్పిస్తారు. ఆ తర్వాత ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని నగ్నంగా ఉండేలా చేస్తారు. ఆ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అనంతరం ‘భర్త’, ‘తమ్ముడు’, ‘అక్క’, ‘బావ’, ‘చెల్లెలు’, ‘పక్కింటి వాళ్లు’ పాత్రల్లో ముఠా సభ్యులు ఒక్కసారిగా దూసుకొచ్చి గొడవ సృష్టిస్తారు. ‘నా భార్యతో ఏం చేస్తున్నావ్?’ అంటూ భర్త పాత్రధారుడు దాడికి దిగుతాడు. ‘మా చెల్లెలు జీవితం నాశనం చేశావంటూ’ అన్నపాత్రధారుడు, ‘మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావంటూ’ పక్కింటిపాత్రధారులు నటిస్తారు. ఈ పరిణామంతో బాధితులు బెంబేలెత్తిపోతారు. తీవ్ర భయాందోళనకు గురవుతారు. పాత్రధారుల్లో అనంతపురం రూరల్, అర్బన్ వాసులతో పాటు రాప్తాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. బ్లాక్మెయిల్ దందా.. ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బాధితులను బెదిరిస్తారు. బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. కొందరితో బాండ్లు రాయించుకుని, గడువులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది బయటకు రాకుండా రూ.లక్షలు చెల్లించినట్లు సమాచారం. అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి వీరి వలలో చిక్కుకుని రూ.25 లక్షల దాకా చెల్లించాడు. చివరకు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోవారికి చెప్పుకోలేక ఆత్మహత్మకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మూడు తులాల బంగారు, రూ.8 లక్షల నగదు తీసుకున్నారు. ఓ వీఆర్ఓ వద్ద రూ.7 లక్షలు తీసుకుని రూ.లక్షకు బాండు రాయించుకున్నారు. పాపంపేట ప్రాంతానికి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు నుంచి రూ.10 లక్షలు, పాతూరులోని ఓ కిరాణా కొట్టు నిర్వాహకుడి వద్ద రూ.14 లక్షలు, జాతీయరహదారిలో ఉన్న పేరు మోసిన ఓ హోటల్ నిర్వాహకుడు రూ.25 లక్షలు, గార్లదిన్నెకు చెందిన ఓ వ్యక్తితోనూ రూ.లక్షలు వసూళ్లు చేశారు. ఇవన్నీ ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో పొందుపరిచారు. కాగా గార్లదిన్నె మండలానికి చెందిన ఓ బాధితుడు కూడా శనివారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ దందాకు కొందరు పోలీసులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపించడం... ఏ పోలీసు ఎప్పుడొచ్చాడు, ఎంత డబ్బు తీసుకెళ్లాడో ముఠా సభ్యులు మాట్లాడుకున్న రికార్డులు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇందులో పోలీసులతో చేసిన సంభాషణలు కూడా ఉండడం గమనార్హం. అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ పురోహితుడికి ఓ మహిళ ఫోన్ చేసి వాస్తుచూసి పరిహార పూజలు చేయాలని కోరింది. పది రోజుల తర్వాత పురోహితుడిని ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లగానే...‘ఉండండి స్వామి.. నా భర్త పూజ సామగ్రి తెస్తున్నాడ’ని చెప్పి అతన్ని సమ్మోహితున్ని చేసింది. ఇంతలో ఓ వ్యక్తి, మహిళ ఇంట్లోకి వచ్చీరాగానే తలుపు గడియపెట్టి పురోహితుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. బెడ్రూంలో ఉన్న మహిళను కూడా బయటకు పిలిపించి ఇద్దరి దుస్తులనూ తొలగించి, వీడియోలు, ఫొటోలు తీశారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో.. రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. పురోహితుడి ఇంట్లోని బంగారం బ్యాంకులో పెట్టించి రూ.5 లక్షలు తీసుకున్నారు. తక్కిన రూ.5 లక్షలను కొద్దిరోజులకు బ్యాంకులో పెట్టిన బంగారుపై అదనంగా ఇప్పించుకున్నారు. ఐదురోజుల కిందట ముఠా సభ్యులు ఇంటికి పిలిపించి మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయగా..బాధితుడు మూడు రోజుల కిందట ఎస్పీ జగదీష్ను కలిసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హనీ ట్రాప్ ముఠా వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. అనంతపురంలో నయా ‘హనీ ట్రాప్’ రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల దాకా వసూలు బాధితుల్లో పురోహితుడు, వీఆర్ఓ, ఫిజియోథెరపిస్టు, ఆర్ఎంపీ, రియల్టర్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు -
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
పుట్టపర్తి టౌన్: ‘‘నేరాలను పూర్తిగా నియంత్రించాలి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. ఇందుకోసం ప్రతి పోలీసు అధికారి నిబద్ధతతో పని చేయాలి. విధుల్లో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఉపేక్షించేది లేదు’’ అని ఎస్పీ సతీష్కుమార్ తేల్చి చెప్పారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో వివిధ సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీలు, గ్రేవ్, నాన్గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాల కేసులపై చర్చించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు. చోరీలు, చైన్ స్నాచింగ్లపై మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్న వివిధ కేసుల్లో త్వరితగతిన పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరిస్తూ ప్రాపర్టీ కేసుల్లో రికవరీ పెంచాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ల్లో చోరీల నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలపై అందరికీ అవగాహన కల్పించి దేవాలయాలు, ఇళ్లలో ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. నేర నియంత్రణకు గట్టిగా కృషిచేస్తే పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. డీఎస్పీలు ప్రతివారం సమీక్షలు నిర్వహించి కేసుల దర్యాప్తుపై సిబ్బందికి దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు మహేష్, నర్సింగప్ప, శివనారాయణస్వామి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీటీఆర్బీ సీఐ నరేంద్రరెడ్డి, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, సీఐ ఇస్మాయిల్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేర నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సమీక్షలో ఎస్పీ సతీష్కుమార్ -
మహిళ దారుణహత్య
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర్ రామకృష్ణ పురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం సింగారం కొత్తపల్లికి చెందిన రవిచంద్ర నాయుడు, రాధ దంపతులు బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం అనంతపురం నగరానికి వలస వచ్చారు. హోటల్, వివిధ రకాల పనులతో జీవనం సాగిస్తున్న వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఉద్యోగాల నిమిత్తం ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం రవిచంద్ర నాయుడు మృతి చెందాడు. అప్పటి నుంచి రాధ రామకృష్ణ పురంలోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. గురువారం రాత్రి ఆమె హత్యకు గురైన విషయాన్ని స్థానికులు శుక్రవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ సీఐ శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలపై లోతైన గాయం, తీవ్రస్థాయిలో రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. పోస్ట్మార్టం నిమిత్తం రాధ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం
పరిగి: అధికార పార్టీ నేతల ఆగడాలకు బలి కాకుండా ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం ఆమె... పరిగిలోని బీరలింగేశ్వర ఆలయ కల్యాణ మంటపంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులతో మాట్లాడి సలహాలు, సూచనలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామన్నారు. జగనన్న 2.0 నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని, అధికారంలోకి వచ్చాక... ప్రతి కార్యకర్తకూ న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ దుర్మార్గ పాలన సాగిస్తోందన్నారు. వారి ఆగడాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరడంతో ప్రజల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పైగా కూటమి నేతల అన్యాయాల గురించి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అయినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలెవరూ జంకడం లేదన్నారు. జగనన్న కోసం ఎన్ని కేసులైనా భరిస్తామంటున్న వారి ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఐడీ కార్డుతో గుర్తింపు.. ఐడీ కార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఉషశ్రీచరణ్ అన్నారు. ఇప్పటికే వివరాలన్నీ సమర్పించి ఐడీ కార్డు పొందిన వారిని ఆమె అభినందించారు. ఐడీ కార్డులో ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎడిట్ ఆప్షన్లో ఫోన్ నంబరు, అడ్రస్ తదితర వాటిని మార్చుకునేందుకు అవకాశముందన్నారు. దరఖాస్తులు సమర్పించి ఇప్పటి వరకూ ఐడీ కార్డులు పొందని వారికి ప్రత్యేక యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే వెసులుబాటు అధిష్టానం కల్పించినట్లు ఉషశ్రీచరణ్ వెల్లడించారు. ప్రజలతో మమేకం కావాలి.. కూటమి ప్రభుత్వం అవలంబిస్త్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో జనమంతా అష్టకష్టాలు పడుతున్నారని, ఒక్క సంక్షేమం పథకం కూడా అందక అల్లాడిపోతున్నారన్నారు. అందువల్లే ఇప్పుడు అందరూ వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారన్నారు. ఎప్పుడెప్పుడు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ఆకాంక్ష వారిలో కనిపిస్తోందన్నారు. అందువల్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి వైఫల్యాలను ఎండగడుతూనే ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం పోర్టల్లో నమోదు అంశంపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, సీనియర్ నాయకుడు ప్రభాకర్, గ్రామ పంచాయతీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న 2.0 నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
‘పాలిసెట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజనీరింగ్, ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ‘పాలిసెట్’కు పకడ్బందీ ఏర్పాటు చేయాలని డీఆర్ఓ విజయసారథి ఆదేశించారు. శుక్రవారం ఆయన పాలిసెట్ నిర్వహణపై కలెక్టరేట్లోని వీసీ హాలులో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ధర్మవరంలో 6 కేంద్రాల్లో 2,086 మంది విద్యార్థులు, హిందూపురం 6 కేంద్రాల్లో 1,885 మంది, కదిరిలోని 5 కేంద్రాల్లో 1,623 మంది పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశా వర్కర్ను అందుబాటులో ఉంచి అవసరమైతే ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఫర్నీచర్, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పాలిసెట కోఆర్డినేటర్గా ధర్మవరం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారన్నారు. డీఆర్ఓ విజయసారథి -
ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోండి
అనంతపురం సెంట్రల్: సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను దూషించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్సీపీ మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆమె కలిసి ఫిర్యాదును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి నాడు ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళుతున్న తనను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దూషించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. తమను రానీయకండంటూ సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన భర్త పెన్నోబులేసుతో ఉన్న రాజకీయ విభేదాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతంగా తనను అసభ్యకరంగా దూషించాడని తెలిపారు. తన భర్తను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనను, తన భర్తను బెదిరిస్తున్నారని, తమకు ఏమైనా జరిగితే దానికి ఎంఎస్ రాజునే కారణమవుతారని స్పష్టం చేశారు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం ఉంటే తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే వైఎస్సార్సీపీ మహిళలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, నాయకురాలు అంజలి, శోభ, పార్వతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మంజుల -
వివాహిత ఆత్మహత్యాయత్నం
కదిరి టౌన్: స్థానిక అడపాలవీధికి చెందిన వివాహిత గాయత్రీదేవి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... ఇందిరమ్మ కాలనీకి చెందిన శరత్కుమార్తో గాయత్రీ దేవికి పెళ్లి కాగా, కొంత కాలంగా మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదేమని ప్రశ్నించినందుకు గాయత్రీదేవిని వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా శరత్కుమార్లో మార్పు రాకపోవడంతో పోలీసులకు గాయత్రీదేవి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అత్త శ్యామలతో పాటు భర్త ప్రియురాలి వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో రెండు రోజుల క్రితం గాయత్రీదేవి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహన దొంగను పట్టుకున్న ప్రజలు ధర్మవరం అర్బన్: పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని అపహరించుకెళుతున్న యువకుడిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు... ధర్మవరంలోని సాయినగర్లో శుక్రవారం వేకువజాము 1.45 గంటలకు ఓ యువకుడు వీధిల్లో సంచరిస్తూ చిన్నారుల సైకిల్ అపహరించి, దానిపై చక్కర్లు కొడుతూ పీర్లచావిడి వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఇంటి ఎదుట నిలిపి ఉన్న టీవీఎస్ బైక్ను అపహరించాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో స్థానికులు అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని తీసుకెళుతున్న యువకుడిని అడ్డుకుని బంధించారు. అనంతరం సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించి, విచారణ చేపట్టారు. -
‘నవోదయ’కు హ్యుందాయ్ కంపెనీ చేయూత
● రూ.41.15 లక్షల విలువ చేసే పరికరాల వితరణ లేపాక్షి: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా హ్యుందాయ్ మోబీస్ కంపెనీ రూ.41.15 లక్షల విలువైన వస్తు సామగ్రిని శుక్రవారం ఉచితంగా అందజేసింది. 20 కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు, ఒక్కొక్కటి చొప్పన చపాతి మేకింగ్ మెషిన్, ఇడ్లీ మేకింగ్ యూనిట్, 20 సీసీ కెమెరాలు, 506 స్టడీ చైర్స్, ఐదు క్లాస్ రూమ్ ఇంటరాక్టివ్ ఫ్యానెల్ పరికరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగరాజు మాట్లాడుతూ.. ఈ భారీ సాయం అందడం వెనుక కృషి చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్, గత జిల్లా కలెక్టర్ చేతన్కు కృతజ్ఙతలు తెలిపారు. అలాగే కంపెనీ యాంగ్ యెంగ్ డ్యూక్ మేనేజింగ్ డైరెక్టర్ మిన్హోహు, హెచ్ఆర్ జీఏ కో–ఆర్డినేటర్ పీఎన్ శ్రీనివాస్, హెచ్ఆర్ డీఏ హోద్, సీఎస్ఆర్ ఇన్చార్జ్ జి.సింధూజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనగణనలో స్వీయగణన అనంతపురం అర్బన్: రెండు దశల్లో చేపట్టిన జనగణన–2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహగణన ఇప్పటికే జిల్లాలో మొదలైంది. హెచ్ఎల్ఓ (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్)లో భాగంగా ఇండ్ల జాబితా, గృహగణన చేపట్టారు. ఈ ప్రక్రియలో తొలిసారిగా స్వీయగణన నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు ఉంటుంది. ఆన్లైన్లో https:// se. census. gov. in వెబ్సైట్ కానీ, మెచ్ఎల్ఓ యాప్ ద్వారా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ కాగానే మొబైల్ నెంబర్తో (ఓటీపీ ద్వారా) కుటుంబసభ్యుల సంఖ్య, పేరు, లింగం (జెండర్), వయసు, విద్యార్హత, వృత్తి, నివాస వివరాలు, ఇతర సామాజిక, ఆర్థిక వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి. అయితే సరైన, వాస్తవ సమాచారం మాత్రమే ఇవ్వాలి, ఒక కుటుంబాన్ని ఒకసారి మాత్రమే నమోదు చేయాలి. వివరాలను గోప్యంగా ఉంచుతారు. జనగణన ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరుతాయి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయి. కచ్చితమైన జనాభా గణాంకాలు లభిస్తాయి. వ్యక్తి ఆత్మహత్య హిందూపురం: స్థానిక దేవరపల్లి రైల్వేస్టేషన్లో 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మాన్ ముబారక్ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై ఓ గుడ్డ తప్ప ఎలాంటి దుస్తులు లేవు. మతిస్థితిమితం లేక రైలు కిందపడి మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బోనులో చిక్కిన చిరుతఅమరాపురం: మండల సరిహద్దులోని అటవీ శివారు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టలేక అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శివారున ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత వారం రోజులుగా కడేహుడే, నడలూడం గ్రామాల్లో సంచరిస్తోంది. విషయాన్ని గుర్తించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సంబందిత కర్ణాటకలోని చెళ్లకెర అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కడేహుడే గ్రామ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చిరుతను ఆసక్తిగా గమనించారు. పట్టుబడిన చిరుతను అధికారులు చెళ్లకెరలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. టీసీసీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: గత ఫిబ్రవరిలో జరిగిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ–2026) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఠీఠీఠీ. ఛట్ఛ. ్చఞ. జౌఠి. జీుఽ వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని అనంతపురం జిల్లా ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్లలో పరీక్షలు రాసిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
బొమ్మనహాళ్: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఏలంజి గ్రామానికి చెందిన గాదిలింగమ్మ, గంగన్న దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (19) చేతి బోరు పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరికొందరితో కలిసి కొలగానహళ్లి గ్రామంలో రైతు చిరంజీవి పొలంలో చేతి బోరు వేసేందుకు శుక్రవారం వెళ్లాడు. బోరు వేస్తున్న సమయంలో ఇనుప పైపును పైకి ఎత్తుతున్న సమయంలో పైనున్న 11కేవీ విద్యుత్ లైన్ తగిలి షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వన్పూరుస్వామిని స్థానికులు బళ్లారిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వన్నూరు స్వామికి ఇటీవల వివాహ నిశ్చయమైంది. మరో మూడు నెలల్లో పెళ్లి ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఇలాంటి తరుణంలో కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. -
పేలుడు పాపం ఎవరిది..?
కదిరి: ఎవరో చేసిన పాపానికి నలుగురు అమాయకులు బలయ్యారు. సాయం చేద్దామని వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అలాగే మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కదిరి పట్టణానికి కూత వేటు దూరంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఈ నెల 15న చోటు చేసుకున్న పేలుళ్ల ఘటన ఈ ప్రాంతం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విశ్వనాథరెడ్డి(52), మూబున్నీసా(51), మధుసూదన్(35), అస్లాం(50) కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కుటుంబ యజమానులను కోల్పోయిన వారంతా భవిష్యత్ తలచుకుని శోకసంద్రంలో ఉండిపోయారు. పేలుళ్లంటే గుర్తొచ్చేది వెంకన్నే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కొత్తగూడెంకు చెందిన వెంకన్న కుటుంబం కొన్నేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో జయరాం నాయక్ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. ఈ ప్రాంతంలో క్వారీల్లోనే కాకుండా పొలాలు, రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా పెద్ద పెద్ద బండరాళ్లు పగలగొట్టాలంటే.. వెంటనే ఈ ప్రాంతవాసులకు గుర్తొచ్చేది వెంకన్న, ఆయన కుమారుడు సతీష్. వారికి ఫోన్ చేస్తే చాలు వెంటనే వచ్చి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సాయంతో పేలుళ్లు జరిపి బండరాళ్లు పగలగొడుతుంటారు. రాయి సైజును బట్టి డబ్బు తీసుకుంటారు. పేలుడు పదార్థాల గురించి పోలీసులకు తెలియదా? వెంకన్న ఉంటున్న ఇంట్లో ఎప్పుడూ జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు స్టాక్(నిల్వ) ఉంటాయనే విషయం ఈ ప్రాంత వాసులందరికీ తెలుసని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ విషయం పోలీసులకు తెలియదంటే నమ్మశక్యంగా లేదని వారంటున్నారు. తరచూ కార్డన్ అండ్ సెర్చ్ పేరుతో సోదాలు చేసే పోలీసులకు ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు కనిపించలేదా? అని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి పోలీసు సిబ్బంది కొందరు తరచు వెంకన్న ఇంటివద్దకే వచ్చి మామూళ్లు తీసుకొని వెళ్తుంటారని, రూరల్ పోలీస్ స్టేషన్లోని కొందరు పోలీసు అధికారులకు కూడా అందులో వాటా వెళ్తుందని ఆరోపిస్తున్నారు. ఇందులో ఎవరి పాపం ఎంతో..తెలియదు గానీ, దీనికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. వెంకన్న కుటుంబంపై కేసు నమోదు పేలుళ్లకు కారణమైన వెంకన్నతో పాటు ఆయన కుమారుడు సతీష్పై కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని సెక్షన్ 105 కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ గతంలో ఉన్న ఐపీసీ సెక్షన్ 304కు సమానం. చంపాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణహాని కలిగిస్తుందని తెలిసీ చేసే పనుల వల్ల మరణం సంభవిస్తే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నిందితుడు వెంకన్న పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కుమ్మరవాండ్లపల్లి ఘటనలో అన్నీ అనుమానాలే పేలుడు పదార్థాల నిల్వ గురించి పోలీసులకు తెలియదా? మరి కార్డెన్ సెర్చ్లు ఎందుకు చేశారంటున్న స్థానికులు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న ప్రతిపక్షాలు -
వడదెబ్బతో బేల్దారి మృతి
యాడికి: అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒక బేల్దారి వడదెబ్బకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి రహదారిలో నివసిస్తున్న కుమ్మర శ్రీనివాసులు(35) బేల్దారి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గరుడ వాహనంపై శ్రీవారు బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వేంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి వవేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీనివాసుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణ, కుంకుమార్చన, అభిషేకం, పంచామృతాభిషేకం , సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు, మహామంగహారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారిని గరుడ వాహనంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. స్వామివారికి అడుగడుగునా ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అనతరం గరుడ వాహనోత్సవానికి సహకరించిన దాతలను పూలమాల, శాలువాతో సన్మానించారు. -
సవిత ఇలాకాలో మట్టి దందా
పెనుకొండ: చంద్రబాబు ప్రభుత్వంలో సహజ వనరులను కొల్లగొట్టడమే జీవనాధారంగా మార్చుకున్న ‘పచ్చ నేతలు’ అక్రమార్జనకు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో నదులు, చెరువుల రూపురేఖలు మార్చేసిన అక్రమార్కులు చివరకు మట్టినీ మనీగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. చెరువుల్లోని మట్టిని తవ్వుకుని తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. దీంతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలన్నీ రుపురేఖలు కోల్పోయి లోయల్లా కనిపిస్తున్నాయి. ఇక కొండ గుట్టల పరిస్థితి సైతం దారుణంగా తయారైంది. ఊరూరా అక్రమ దందా.. ‘పచ్చ’ మట్టి మాఫియా నియోజకవర్గంలోని ఊరూరా రెచ్చిపోతోంది. కొండలను పిండేసి, చెరువులను చెర బట్టి భారీగా ఆర్జిస్తోంది. ఈ క్రమంలోనే పెనుకొండ మండలంలోని తిరంగరాయల చెరువు, గొందిపల్లి చెరువు, కురుబవాండ్లపల్లి చెరువు, తాజాగా మరువపల్లి చెరువు, సోమందేపల్లి మండలంలో సోమందేపల్లి చెరువు, దానికి ఆనుకుని ఉన్న కొండ గుట్టలు, నడింపల్లి తదితర ప్రాంతాల్లోని చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి దందా సాగుతోంది. ఫలితంగా చెరువులన్నీ లోయల్లా మారాయి. ఈ దందా అంతా మంత్రి కనుసన్నల్లోనే సాగుతుండటంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టపగలు పోలీసుస్టేషన్ల ముందునుంచే మట్టి వాహనాలు వెళ్తున్నా ఎవరూ వాటిని నిలిపే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితంగా చెరువులు ధ్వంసమయ్యాయి. కొండలన్నీ నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి పచ్చ మాఫియాను కట్టడి చేసి మట్టి దందాను అరికట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. కొండలు పిండి... చెరువులను చెరబట్టి పెనుకొండలో రెచ్చిపోతున్న ‘పచ్చ మాఫియా’ మట్టి తవ్వకాలతో అక్రమార్జన భారీ గుంతలతో లోయలను తలపిస్తున్న చెరువులు -
పాసు పుస్తకాల జారీ వేగవంతం చేయాలి
● రెవెన్యూ అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం ప్రశాంతి నిలయం: రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.... 2027 మార్చి నాటికి జిల్లాలో రీ సర్వే పూర్తి చేసి రైతులందరికీ కచ్చితమైన కొలతలు నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రానున్న మే నెలలో 17 గ్రామాల్లో, జూన్ నెలలో మరో 12 గ్రామాల్లో పాసుపుస్తకాల పంపిణీకి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పాసు పుస్తకాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదన్నారు. తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫేజ్–2, ఫేజ్–4, ఫేజ్–5 రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, సబ్ డివిజన్లను జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. తిరస్కరించిన కేసుల్లో స్పష్టమైన కారణాలను తెలియజేస్తూ నోటీసులు జారీ చేయాలన్నారు. 32 పైలెట్ గ్రామాలకు సంబంధించి వెబ్ల్యాండ్ 2.0 పోర్టింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో డీఆర్ఓ విజయసారథి, సర్వే శాఖ ఏడీ విజయశాంతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎలుగుబంటి దాడి.. రైతుకు గాయాలు రొద్దం: పొలం వద్ద గొర్రెలను మేపుతున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన శుక్రవారం రొద్దం మండల పరిధిలోని పెద్దకోడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన పోతన్న కుమారుడు బోయ నరసింహులు శుక్రవారం గొర్రెలను మేపడానికి గ్రామ పెద్దచెరువు సమీపంలో ఉన్న పొలం వద్ద వెళ్లాడు. సమీపంలోని మొక్కజొన్న చేనులో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరసింహులుపై దాడి చేసింది. ఆ సమయంలో అతని చేతిలో కర్ర ఉండడంతో ఎలుగుబంటిని బాదుతూ గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అయితే అప్పటికే గాయపడిన నరసింహులును కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. గుంతకల్లు డివిజనల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈఓగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె గతంలో డ్వామా ఏపీడీగా పనిచేస్తూ ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా పని చేశారు. -
మాకు సమాచారం లేదు
కుమ్మరవాండ్లపల్లిలోని ఆ ఇంట్లో పేలుడు పదార్థాలున్న విషయం మా దృష్టికి రాలేదు. స్థానికులు ఎవరైనా సమాచారం ఇచ్చి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. ఎక్కడైనా ఇలాంటి పేలుడు పదార్థాలు నిల్వలు ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా... సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. – శివనారాయస్వామి, డీఎస్పీ, కదిరి పోలీసులను ఉద్యోగం చేయనిస్తే కదా? చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉద్యోగం చేయనీయడం లేదు. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టాలని వారిపై ఒత్తిడి తెస్తోంది. అందుకే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. శాంతి భద్రతలు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. అసాంఘిక శక్తులు పేట్రేగి పోతున్నాయి. –పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
● సొగసు చూడ తరమా!
చిలమత్తూరు: సాధారణంగా ఎక్కడ డ్రెయినేజీ వేసినా రోడ్డు పక్కన తవ్వి లైనింగ్ తోటి పూర్తి చేయడం పరిపాటి. అయితే చిలమత్తూరు మండలం మాదిరెడ్డిపల్లిలో వేసిన డ్రెయినేజీని చూసిన వారు అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను టీడీపీ నేతలు చేజిక్కించుకుని ఇష్టానుసారంగా పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే మాదిరెడ్డిపల్లిలో ఇటీవల డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. అయితే రోడ్డు పక్కన తవ్వి కాకుండా ఏకంగా సీసీ రోడ్డపైనే రెండు వైపులా చిన్నపాటి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణం పూర్తి చేశారు. ఈ పనిని ఆక్షేపించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జీ హుజూర్ అంటూ తలొగ్గారు. పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు పొందే ఎత్తుగడకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘సీమ’లో సాగునీటి ప్రాజెక్టుల అంశంలో ‘అనంత’ అధికార, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన ‘సీమ ద్రోహి’ చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తుంటే, అసలు ఈ పథకంతో ‘అనంత’కు ప్రయోజనం శూన్యం అని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు నిర్వాకంతో ఆగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుసాక్షిప్రతినిధి అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో అత్యంత దారుణ కరువు పరిస్థితులు సంభవించింది 1995 నుంచి 2003 వరకే. రైతుల ఆత్మహత్యలు, వలసలతో పాటు గంజి కేంద్రాలు, పశువులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులు, పశువులు బతికితే చాలు అన్న దారుణ పరిస్థితులు ఉండేవి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. వీటికి పరిష్కారాలు ఒక్కరోజు కూడా అన్వేషించలేదు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక కరువును శాశ్వతంగా నివారించేందుకు హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ఆధునికీకరణ చేపట్టారు. వలసల నివారణకు ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంతో అమలు చేయించారు. ఇప్పుడు ‘అనంత’ తలరాత మారుతోందంటే వైఎస్ చేపట్టిన సంస్కరణలే కారణమని అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగునపెట్టి తామే ‘అనంత’ను ఉద్దరించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏంటి కేశవా? హంద్రీ–నీవా ప్రాజెక్టును ఎన్టీఆర్, చంద్రబాబు ఆ తర్వాత వైఎస్సార్ చేపట్టారని కేశవ్ ప్రస్తావించారు. 1996 మార్చి 11న ఉరవకొండలో, 1999 జూలై9న ఆత్మకూరులో హంద్రీ–నీవాకు చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేశారు. 1995–96 నుంచి 2003–04 వరకూ చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నకాలంలో హంద్రీ–నీవా కోసం బడ్జెట్లో రూ.190కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో రూ.24.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది కూడా శంకుస్థాపనలకు, ఆఫీసు నిర్వహణకు మాత్రమే! వైఎస్ సీఎం అయ్యాక రూ.6,850 కోట్లతో ప్రాజెక్టు పట్టాలెక్కించారు. 2004–05 నుంచి 2009–10వరకూ వైఎస్ హయాంలో బడ్జెట్లో రూ.3,399.74కోట్లు కేటాయించారు. కేటాయింపుల కంటే రూ. 940.62 కోట్లు ఎక్కువగా అంటే రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. ఆపై రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో రూ.2,143.44 కోట్ల విలువైన పనులు చేశారు. 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్కు చేరాయి. 2014లో చంద్రబాబు మూడోసారి సీఎం అయ్యే సమయానికి మిగిలింది రూ.366.56 కోట్ల పనులు మాత్రమే. అంటే చంద్రబాబు 2004లో సీఎంగా దిగిపోయే సమయానికి హంద్రీ–నీవా పనులు ప్రారంభమే కాలేదు. 2014లో మళ్లీ సీఎం అయ్యే సమయానికి అప్పటికే ఫేజ్–1 పనులు పూర్తయ్యి జీడిపల్లికి నీళ్లొచ్చాయి. మిగిలింది రూ.366.56 కోట్ల విలువైన పనులు మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే కేశవ్ మాత్రం చంద్రబాబు ‘అనంత’కు ఏదో చేశారనే సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్పై కూడా సత్యదూరమైన మాటలే రాయలసీమ లిఫ్ట్తో ‘అనంత’కు ఏం ఉపయోగం.. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని కేశవ్ మాట్లాడారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా వచ్చాయో కేశవ్ బదులిచ్చి ఉంటే బాగుండేది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణాడెల్లాకు ఇచ్చి, శ్రీశైలం నుంచి డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని దిగువకు పంపకుండా ‘సీమ’కు వాడతామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. దీనిపై జీఓ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అదీ చేయలేకపోయారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా హంద్రీ–నీవా ఫేజ్–2కు నీరిచ్చి, హంద్రీ–నీవా ద్వారా వచ్చే మొత్తం నీటిని ‘అనంత’కే ఉపయోగపడేలా చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే భవిష్యత్లో అవుకు రిజర్వాయర్ నుంచి తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల మీదుగా మిడ్పెన్నార్ డ్యాంకు నీటిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు జరిగితే ‘అనంత’ సస్యశ్యామలం అవుతుంది. పైగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా 14రోజుల్లోనే శ్రీశైలంలో నీటిని తోడేయొచ్చని మాట్లాడారు. ప్రాజెక్టులోకి వరద నీరు ప్రారంభమయ్యాక 881 అడుగుల వరకు వచ్చేదాకా ఆగకుండా 800 అడుగుల నుంచి లిఫ్ట్ చేసే వెసులుబాటు ఉంది. ఓవైపు తెలంగాణ 800 అడుగుల నుంచి తోడేస్తుంటే, 881 అడుగుల వరకు నీరు వచ్చేదాకా ‘సీమ’ ఎదురుచూడాలా? అనేది కేశవ్ ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి ‘అనంత’కు హెచ్చెల్సీ, హంద్రీ–నీవా మినహా మరో సాగునీటి వనరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనన్ని మార్గాల ద్వారా నీళ్లు తెప్పించుకునే అవకాశాలను ఏ రాజకీయపార్టీ తీసుకున్నా దానికి తక్కిన పార్టీలు మద్దతు ఇచ్చి సాధించాలి. అప్పుడే ‘అనంత’ జనజీవనం బాగుపడుతుంది. వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. రాయలసీమ లిఫ్ట్తో హంద్రీ–నీవా ఆయకట్టుకు పుష్కలంగా సాగు, తాగునీరు దొరకడంతో పాటు అవుకు నుంచి ఎంపీఆర్కు మరో కొత్త ప్రాజెక్టు నిర్మించి నీటిని తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇదీ.. ‘అనంత’కు చంద్రబాబు చేసిన ద్రోహం 2012లో జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వడమే తరువాయి. ఫేజ్–1లో 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అప్పట్లో అంతా భావించారు. 33, 34, 36 ప్యాకేజీలకు 2014కు ముందే టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యాయి. అయితే కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయి నీరు వెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని 2015 ఫిబ్రవరి 23న జీఓ 22ను చంద్రబాబు జారీ చేశారు. ఇదొక్క నిర్ణయం చాలు చంద్రబాబు ‘అనంత’ గొంతు కోశారని చెప్పేందుకు. ఇప్పటి వరకూ ఆ జీఓ తర్వాత డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు మరో జీఓ జారీ చేయలేదు. ఆ జీఓతో డిస్ట్రిబ్యూటరీలు ఆగిపోయాయి. 2012లోనే నీళ్లు వచ్చినపుడు 2014–19 వరకూ ఐదేళ్లలో ఎందుకు డిస్ట్రిబ్యూటరీలు చేయలేదో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ‘సీమ’ సాగునీటి ప్రాజెక్టుల అంశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మాటల యుద్ధం రాయలసీమ లిఫ్ట్తో హంద్రీ–నీవా మొత్తం నీరు ‘అనంత’ జిల్లా వాడుకునేలా వెసులుబాటు రాయలసీమ లిఫ్ట్ ఆపేసి చంద్రబాబు సీమకు ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ ఉద్యమబాట ఈ ప్రాజెక్టుతో ‘అనంత’కు ఉపయోగం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం -
మా డబ్బులిప్పించండి
ధర్మవరం అర్బన్: తమ వద్ద చీరలు తీసుకుని డబ్బులివ్వకుండా మోసం చేసిన శ్రీకలైవాణి శిల్క్స్ యజమానురాలిపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని పలువురు చేనేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారంతా స్థానిక వన్టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నమక్కల్ జిల్లా తిరుచెన్గోడ్ పట్టణానికి చెందిన కలైవాణి అక్కడే శ్రీకలైవాణి శిల్క్స్ పేరుతో పట్టుచీరల షోరూం నిర్వహిస్తున్నారు. 2023లో ధర్మవరంలోని వ్యాపారస్తుల వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను అప్పట్లో ఆమె చెక్కులు ఇచ్చారు. అయితే ఆమె ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులన్నీ చెల్లకుండా పోయాయి. దీంతో ధర్మవరం వ్యాపారస్తులు కోర్టును ఆశ్రయించారు. గురువారం వాయిదా ఉండడంతో కలైవాణి కోర్టుకు హాజరయ్యారు. గుర్తించిన పట్టుచీరల వ్యాపారస్తులు ఆమెను వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్కు అప్పగించారు. తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ ఎదుట నిరసన చేపట్టారు. ఆ సమయంలో వ్యాపారస్తులతో సీఐ నాగేంద్రప్రసాద్ మాట్లాడి, కలైవాణిపై కేసు నమోదు చేస్తామని తెలపడంతో వ్యాపారులు అంగీకరించి, ఆందోళనను విరమించారు. పోలీసు స్టేషన్ ఎదుట చేనేతల నిరసన -
జనగణన ప్రారంభం
● స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్ ప్రశాంతి నిలయం: జనగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ తన బంగ్లాలో జనగణన పోర్టల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు పాల్గొని కచ్చితమైన వివరాలను అందించాలన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు. బడిఈడు పిల్లలందరినీ స్కూళ్లలో చేర్చాలిప్రశాంతి నిలయం: అంగన్వాడీ కేంద్రాల్లోని బడిఈడు పిల్లలందరినీ గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ఏర్పాటు చేసిన ‘‘బడిలో చేరుదాం... బాగుపడదాం’’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఈఓ కిష్టప్ప గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. ప్రతి రికార్డునూ ఆన్లైన్ చేయాలి పుట్టపర్తి అర్బన్: రెవెన్యూ కార్యాలయాల్లోని ప్రతి ఫైల్నూ కంప్యూటరీకరణ ద్వారా ఆన్లైన్ చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల నమోదు, ప్రజాసమస్యల పరిష్కార ప్రక్రియ, కార్యాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భూ వివాదాలు, మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫైళ్లన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. పుట్టపర్తి కమిషనర్పై బదిలీ వేటు ● పుట్టపర్తి నూతన మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్ ● హిందూపురం అసిస్టెంట్ కమిషనర్గా క్రాంతికుమార్ పుట్టపర్తి టౌన్: అధికార పార్టీ నేతల అడ్డగోలు బిల్లులకు అడ్డం చెప్పిన పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్పై బదిలీ వేటు పడింది. ఆయన్ను పుట్టపర్తి నుంచి పంపించేయాలని టీడీపీ నేతలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఆరు నెలలుగా కమిషనర్పై ఒత్తిడి పెంచారు. తాము చెప్పిన మాటలు వినలేదని, తాము పెట్టుకున్న అక్రమ బిల్లులు పాస్ చేయడం లేదని కమిషనర్ను టార్గెట్ చేశారు. చెప్పినమాట వినకపోతే బదిలీపై వెళ్లిపోవాలంటూ ఇప్పటికే స్థానిక ముఖ్యనేత చేత హుకుం జారీ చేయించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే క్రాంతికుమార్పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా ఉన్న క్రాంతికుమార్ను హిందూపురం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. నూతన కమిషనర్గా శ్రీనివాస్ పుట్టపర్తి మున్సిపల్ నూతన కమిషనర్గా శ్రీనివాస్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కర్నూలు నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. -
పొగలొస్తున్నాయ్.. నీళ్లు తీసుకురండి
కదిరి అర్బన్: ‘‘ఆ ఇంట్లో పొగలొస్తున్నాయి...ఏందో అంటుకుంది..బిందెలతో నీళ్లు తీసుకురండి’’ అంటూ జనం ప్రమాదం జరిగిన ఇంటివైపు వెళ్తున్న వీడియో ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బుధవారం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ పేలి నలుగురు మృత్యువాత పడగా...28 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే పేలుడుకు ముందే ఆ ఇంట్లో ఉన్నవారంతా పరారీ కాగా, ఇరుగూపొరుగు వారు మాత్రం...ఇంట్లోంచి పొగలు రావడం చూసి సాయం చేసేందుకు పరుగున వచ్చారు. కొందరైతే బిందెలతో నీటిని తెచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించడం వీడియోలో కనిపించింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే పేలుడు సంభవించడంతో దృశ్యాలు మాయమై...కేవలం మహిళల ఆర్తనాదాలు వినిపించాయి. ఈ వీడియో చూసిన వారంతా అయ్యో...ఎంత పని జరిగింది... సాయం చేసేందుకు వెళ్లిన వారిని తీసుకెళ్లావా దేవుడా అంటూ కన్నీరుపెట్టుకున్నారు. పేలుడుకు కొన్ని క్షణాల ముందు వీడియో వైరల్ -
పేలుడు గురించి తెలిసీ ఎందుకు చెప్పలేదు.!
కదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే పేలుళ్లు జరిగిన ఇంట్లో నివాసం ఉన్న ఇద్దరిని బుధవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. పేలుడు పదార్థాలకు అనుమతులున్నాయా..? లైసెన్స్ ఎవరిచ్చారు..వాటిని ఇంట్లో ఎందుకు నిల్వ చేశారు, అసలు ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎంత మంది ఉన్నారు... ప్రమాదం గురించి తెలిసి ఇరుగూపొరుగుకు చెప్పకుండా ఎందుకు పరారయ్యారు..? తదితర విషయాలను ప్రస్తావిస్తూ విచారణ చేస్తున్నట్లు సమాచారం. కుమ్మరవాండ్లపల్లి ఘటనపై విచారణ ముమ్మరం నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు! -
గ్యాస్, రేషన్ పంపిణీ పక్కాగా జరగాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో గ్యాస్, రేషన్ పంపిణీ పారదర్శకతతో పక్కాగా జరగాలని జేసీ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలులో పౌరసరఫరాలశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలని, బుక్ చేసుకున్న వారందరికీ ప్రాధాన్యత క్రమంలో సిలిండర్లు అందించాలని, డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కమర్షియల్ సిలిండర్లను తొలుత పాఠశాలలు, ఆస్పత్రులకు ఆ తర్వాత వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు అందించాలన్నారు. రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్లు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సరుకుల్లో తేడా వస్తే ఫిర్యాదు చేయండి.. రేషన్ సరుకుల నాణ్యత లోపించినా, తూకం తక్కువగా ఉన్నా.. 08555–288566 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సదరు డీలర్పై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వెల్లడించారు. నాణ్యమైన సరుకులు పొందడం హక్కుగా కార్డుదారులంతా భావించాలన్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా అందించే కొత్త బియ్యం వండుకునే విధానం గురించి ప్రజలకు తెలియజేయాలని, ఇందుకోసం ప్రతి చౌక దుకాణం వద్ద పోస్టర్లు ప్రదర్శించాలని జేసీ ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ను పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. అధికారులకు జేసీ మౌర్యభరద్వాజ్ ఆదేశం -
పంచాయతీ ఓటర్లు 11,35,917
● డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల పుట్టపర్తి అర్బన్: జిల్లా పంచాయతీ ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 32 మండలాలు ఉండగా... 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లోని వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ ) సమత గురువారం విడుదల చేశారు. ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994 నిబంధనల మేరకు 2026 ఏప్రిల్ 15వ తేదీ నాటికి వరకూ ఆయా పంచాయతీలో ఉన్న ఓటర్లతో జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే 2,318 మంది ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. పంచాయతీ ఓటరు జాబితాను ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె వెల్లడించారు. -
కదిరి పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన వీడియో
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి పేలుడు ఘటనపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. వెంకన్న ఇంట్లో గ్యాస్ లీకై తొలుత అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలాయి. మంటలు ఆర్పే సమయంలో స్థానికుడు వీడియో తీస్తుండగా బ్లాస్టింగ్ జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన నలుగురు మృతిచెందగా. 18 మంది గాయపడ్డారు. సెల్ ఫోన్లో బ్లాస్టింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పేలుడు దృశ్యాలు వైరల్గా మారాయి.కాగా, బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్స్టిక్స్ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. -
ఖాళీ బిందెలతో నిరసన
మడకశిరరూరల్: మండలంలోని ఎగువ అచ్చంపల్లి గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారిందంటూ బుధవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తాగునీటి పథకం బోరుబావుల్లో అరకొరగా వస్తున్న తాగునీరు కాలనీ వాసుల అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కార్యదర్శి వేణుగోపాల్ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా బోరు వేయిస్తామని, అప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా తీసుకుంటామని భరోసానిచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. పొలిట్బ్యూరో సభ్యులుగా ఇద్దరికి స్థానంఅనంతపురం టౌన్: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరికి స్థానం కల్పిస్తూ ఆ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు మరోమారు అవకాశం కల్పించారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పొలిట్బ్యూరో సభ్యుడిగా నియమించారు. దీంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతనిధులుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, గుణపాటి దీపక్రెడ్డిను నియమించారు. వీరితోపాటు జిల్లా నుంచి పలువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి స్థానం కల్పించారు. పద్మపీఠంపై అభయ ఆంజనేయస్వామి విగ్రహంహిందూపురం: రాయలసీమలోనే అత్యంత ఎత్తైన అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం మైదానంలో ఏర్పాటు చేసిన పద్మపీఠంపై బుధవారం అధిష్టింపజేశారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందు కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా భారీ క్రేన్, జేసీబీలను తెప్పించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ వైసీ చంద్రశేఖర్, సభ్యులు పర్యవేక్షించారు. కాగా 45 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహం ఏర్పాటుకు హైదరాబాద్కు చెందిన బిల్డర్ అవనీష్రెడ్డి, అఖిలేష్రెడ్డి రూ.6 లక్షక్షను వైసీ చంద్రశేఖర్, వైసీ కార్తీక్కు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఎన్పీకుంట: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని, ఈ అంశంపై ‘సేవ్ ట్రీస్ – సేవ్ వాటర్’ నినాదంతో ప్రజలను చైతన్య పరుస్తూ భారత దేశమంతటా సైకిల్ యాత్ర చేపట్టినట్లు విశాఖపట్నానికి చెందిన కర్రీరాము ఆచార్య తెలిపాడు. 40 నెలలుగా సాగుతున్న తన సైకిల్ యాత్రలో అనుకూలమైన ప్రతి చోట మొక్కలను నాటిస్తూ, వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలపై స్థానికులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. బుధవారం సైకిల్ యాత్ర ఎన్పీకుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా అతనికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని ఓ టీ కేఫ్ వద్ద మొక్కను నాటి, మాట్లాడారు. రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్జీఓలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు సహకారం అందిస్తున్నారన్నారు. మద్యం దుకాణం సీజ్ శింగనమల: మండల కేంద్రంలోని మద్యం దుకాణాన్ని ఎకై ్సజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. బుక్కరాయసముద్రం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శింగనమలలోని దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. -
లాయర్లు v/s మున్సిపల్ అధికారులు
చిలమత్తూరు: హిందూపురంలోని ఆబాద్పేటలో నివాసముంటున్న న్యాయవాదులు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు ఉదయ్సింహారెడ్డి, యూసఫ్పై మున్సిపల్ అధికారులు మంగళవారం రాత్రి దురుసుగా వ్యవహరించిన వైనం వివాదాస్పదమైంది. ‘రేయ్’ అంటూ రెచ్చగొట్టి దుర్భాషలాడారు. ఆ సమయంలో న్యాయవాదులు ఆగ్రహానికి లోను కాగానే వెంటనే మున్సిపల్ కమిషనర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి, అక్రమంగా కేసులు బనాయించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పును కప్పిపుచ్చుకుంటూ.. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆబాద్పేట్లో డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన గుంతలు 15 రోజులైనా పూడ్చకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ కింద పైప్లైన్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ అంశాన్ని స్థానికులు వ్యతిరేకించారు. పైప్లైన్ దెబ్బతింటే డ్రైనేజీ నీరు అందులో కలిసి తాగునీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా వెన్నంటి ఉంటూ పనులు పూర్తి చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్రైనేజీ గుంతలను పరిశీలించేందుకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో న్యాయవాదులు ఉదయ్, యూసఫ్ స్థానికులు అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. 15 రోజులైనా పనులు పూర్తి చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీంతో తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ‘మీరెవరూ మమ్మల్ని ప్రశ్నించేందుకు’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అక్కడకు చేరుకుని న్యాయవాదులపై రెచ్చిపోయారు. పబ్లిక్ సర్వెంట్గా బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ప్రజలతో ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని న్యాయవాదులు హితవు పలకబోతుండగా కమిషనర్ ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు ఎమ్మెల్యే పీఏల అండ ఉందని, మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో న్యాయవాదులు ఆవేశానికి లోనుకాగా, వెంటనే సీఐ రాజగోపాలనాయుడుని రప్పించుకుని కుట్రకు తెరలేపారు. అక్రమంగా కేసు నమోదు సీఐ సూచన మేరకు తన విధులకు ఆటంకం కలిగించారంటూ న్యాయవాదులపై పోలీసులకు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కనీస విచారణ కూడా చేపట్టకుండా పోలీసులు సైతం ఆగమేఘాలపై కేసు నమోదు చేసేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. న్యాయవాదులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అక్రమంగా కేసులు బనాయిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పన్నులతో జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలపైనే కక్షపూరితంగా వ్యవహరించడం మున్సిపల్ అధికారులకు తగదంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపినందుకు లాయర్లపై దాడికి యత్నం సర్దిచెప్పాల్సిన తరుణంలో ఆజ్యం పోసిన పోలీసులు రెచ్చగొట్టి న్యాయవాదులపైనే ఫిర్యాదు, అక్రమ కేసు నమోదు మున్సిపల్ కమిషనర్ తీరుపై సర్వత్రా విమర్శలు హిందూపురంలో న్యాయవాదులపై మున్సిపల్ అధికారుల దురుసు ప్రవర్తన వివాదానికి దారితీసింది. సర్దిచెప్పాల్సిన తరుణంలో పోలీసులు సైతం వివాదానికి ఆజ్యం పోశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు చేయాలని సూచించి, ఆ మేరకు ఫిర్యాదు అందగానే ఆగమేఘాలపై కేసులు కట్టేశారు. -
ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలి
అనంతపురం: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏకంగా దళిత మహిళానేతను దుర్భాషలాడిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఓ దళిత మహిళను బూతులతో దూషించడం ఎంఎస్ రాజు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అవమానం తట్టుకోలేక వైఎస్సార్సీపీ దళిత మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల బహిరంగంగానే బిగ్గరగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మంజులను దుర్భాషలాడడమే కాక, తిరిగి ఆమైపెనే ఐ–టీడీపీ బ్యాచ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంఎస్ రాజు మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉన్నాయన్నారు. ఈ అంశాలన్నింటిపై సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ఆకృత్యాలు అధికమయ్యాయని మండిపడ్డారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తే.. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు నిదర్శనమన్నారు. జెడ్పీ వైస్చైర్మెన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. దళిత మహిళా నేత మంజులను దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోకపోతే.. మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశాయి భారతీరెడ్డి, నాయకులు శోభారాణి, భారతి, ఖమర్తాజ్, శోభాబాయి, ఉషారాణి, అంజలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి -
అలరించిన కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి సన్నిధిలో కేరళ నూతన సంవత్సర వేడుకలు మూడో రోజు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధి, సాయికుల్వంత్ సభా మందిరాన్ని కేరళ సంప్రదాయరీతిలో అలంకరించారు. వేడుకలనుద్దేశించి అశ్వతీ సురేష్ ప్రసంగించారు. అనంతరం హృదయ హారం పేరుతో కేరళకు చెందిన సత్యసాయి యూత్ సంగీత విభావరి నిర్వహించారు. సాయంత్రం సప్తవీణ పేరుతో సుశీల బృందం నిర్వహించిన వీణావాయిద్య కచేరీ అలరించింది. అనంతరం విషు వేడుకల ప్రాశస్థ్యాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జి .శంకర్ వివరించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త టమాట కట్టెలకు నిప్పు
చిలమత్తూరు: మండలంలోని ఆదేపల్లి తండాకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగేనాయక్కు చెందిన 3 వేల టమాట కట్టెలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ.60 వేలు వరకూ నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. టీడీపీకి చెందిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మడకశిర విద్యుత్ శాఖ డీఈఈ సస్పెన్షన్ మడకశిర: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మడకశిర విద్యుత్ శాఖ డీఈఈ ఎం.రఘును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ పరికరాల దుర్వినియోగం, పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు అధికారిక వాహనాన్ని వినియోగించుకోక పోవడం, రైతులతో దురుసు ప్రవర్తన, వ్యవసాయ సర్వీసు దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వివిధ ప్రదేశాల్లో విద్యుత్ లైన్ల అంచనాలు, అనుమతి లేకుండా మార్చడం తదితర అంశాలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. -
రసాభాసగా మార్కెట్ టెండర్ల నిర్వహణ
గుడిబండ: స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో వారపు పశువుల సంత, దినసరి బస్టాండ్, కూరగాయల మార్కెట్పై సుంకం వసూలుకు బుధవారం నిర్వహించిన వేలం ప్రక్రియ రసాభాసగా జరిగింది. ఇన్చార్జ్ ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఆవరణంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. 12 మంది పాల్గొన్నారు. వేలం ప్రక్రియ మొదలు పెట్టగానే కొందరు కూటమి నాయకులు తమకే టెండర్లు దక్కాలని అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో వేలం పాడేందుకు వచ్చిన 12 మంది కల్పించుకునే ప్రయత్నం చేయడంతో వారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీయడంతో సీఐ రాజ్కుమార్, ఎస్ఐ రమేష్బాబు కలుగుజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం నిర్వహించిన వేలం ప్రక్రియలో వారపు పశువుల సంత రూ.35.6 లక్షలు, కూరగాయల మార్కెట్ రూ.2లక్షలు, దినసరి బస్టాండ్ రూ.1.71 లక్షలకు కూటమి నాయకులే దక్కించుకున్నారు. టెండర్లు తమకే కావాలంటూ కూటమి నాయకుల దౌర్జన్యం -
అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి
హిందూపురం: మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు న్యాయవాదులపై అక్రమంగా నమోదు చేసిన కేసును బేషరత్తుగా ఎత్తి వేయాలంటూ హిందూపురం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. న్యాయవాదులు ఉదయ్ సింహారెడ్డి, యూసఫ్పై మంగళవారం రాత్రి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను బార్ అసోసియేషన్ ఖండించింది. బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ... మున్సిపల్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడమే తరువాయి అన్నట్లు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి విచారణ చేయకుండానే కేసు నమోదు చేయడం తగదన్నారు. నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. న్యాయవాదులతో పాటు అక్కడి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా న్యాయవాదులపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ అంశాలపై నిష్పక్షపాతంగా వ్యవహారించకపోతే న్యాయవాదులందరూ ఐక్యంగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా
కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటన బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ తెలిపారు. బుధవారం ఆయన కుమ్మరవాండ్లపల్లిలో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్షత్రగాత్రులకు ధైర్యం చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జైనుల్లా బాధితులను ఓదార్చారు. కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. బుధవారం కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో నలుగురు మృతిచెందగా... మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు పేర్కొన్నారు. ఇదే ఘటనలో మరో 17 మంది గాయపడ్డారన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం తరఫున పక్కాగృహం మంజూరు చేస్తామని చెప్పారు. -
నేటి నుంచి జనగణన
ప్రశాంతి నిలయం: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయ సారథితో కలిసి కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనగణన గురించి వివరించారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ( https:// se. census. gov. in) ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై ఈ నెల 16వ తేదీ నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులంతా సమష్టిగా పనిచేసి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనగణనను పక్కాగా చేయాలన్నారు. జిల్లాలో స్వీయగణన షెడ్యూల్ ఇలా.. ● తొలిరోజు 16వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ ప్రతినిధుల గణనతో స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ● 17వ తేదీన సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ● 18వ తేదీన పద్మ అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, కళాకారులు వంటి ప్రముఖ వ్యక్తుల స్వీయగణన. ● 19వ తేదీన స్వయం సహాయ సంఘాల సభ్యులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ● 20వ తేదీన ఉపాధి హామీ పథకం కూలీలకు మొదటి విడత అవగాహన కల్పిస్తారు. ● 21వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల స్వీయగణన ఉంటుంది. ● 22న విశ్వవిద్యాలయ, కళాశాల విద్యార్థులు స్వీయగణన ప్రక్రియలో పాల్గొంటారు. ● 23వ తేదీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంల వివరాల నమోదు ఉంటుంది. ● 24వ తేదీన గిరిజన ప్రాంతాలు, వారపు సంతల వద్ద స్వీయగణన ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. ● 25న పట్టణ ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వృద్ధాశ్రమాల్లో స్వీయగణన ఉంటుంది. ● 27న బ్యాంకులు, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, 28న డ్వాక్రా సంఘాల రెండో విడత, 29న పోలీస్ సిబ్బందికి, 30వ తేదీన ఉపాధి హామీ కూలీల రెండో విడతగా స్వీయ గణన ఉంటుందని కలెక్టర్ వివరించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. 15 రోజుల పాటు స్వీయ గణన కార్యక్రమం విలేకరుల సమావేశంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
సచివాలయాల సేవలు పెంచండి
● అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం ప్రశాంతి నిలయం: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు మరింత పెంచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. అలాగే జిల్లా అధికారులు రోజూ తప్పనిసరిగా సచివాలయాలను సందర్శించి క్షేత్రస్థాయి పాలనను పర్యవేక్షించాలన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో గ్రామ/వార్డు సచివాలయాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలకు మరింత సులువుగా అందించేందుకు పలు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ సిబ్బంది రోజూ మనమిత్ర ప్లాట్ ఫాం ద్వారా సేవలను అందించాలన్నారు. ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 5 నుంచి 20 వరకూ లావాదేవీలను, సేవలను మనమిత్ర యాప్ ద్వారా పూర్తి చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కారానికి ఐటీ మేనేజర్ను సంప్రదించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఏపీఎస్ సర్వే, మిస్సింగ్ డేటా అప్డేట్లో జాప్యం చేయరాదన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా కూడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. వీలైనన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో డీపీఓ సమత, నోడల్ ఆఫీసర్ జనార్దన్రావు, డీడీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
బాలికల హవా
పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. బుధవారం ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లా నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10,288 మంది పరీక్షలు రాయగా, 7,378 మంది (72 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. అలాగే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,395 మంది పరీక్ష రాయగా 6,969 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 425 పరీక్షలు రాయగా, 258 మంది (60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1350 మంది పరీక్ష రాయగా 626 మంది (46 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ వెల్లడించారు. మెరుగు..తరుగు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. గత ఏడాది ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మూడు ర్యాంకులు మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండ్ ఇయర్ ఫలితాల్లో గత ఏడాది 21వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది ఒక మెట్టు దిగజారి 22వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్ జిల్లా టాపర్ జయశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హిందూపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని జయశ్రీ (సీఈసీ) 500 మార్కులకు 494 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. అలాగే కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నహిద్ (బైపీసీ) 455 మార్కులకు 442 మార్కులు సాధించి రెండో స్థానంలోనూ, అమరాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని షన్ముఖి (హెచ్ఈసీ) 500 మార్కులకు 480 మార్కులు సాధించి మూడో స్థానంలో, నల్లమాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సాయి సుధ (ఎంపీసీ) 470 మార్కులకు గాను 433 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. మెరిసిన చాందిని సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని చాందిని(బైపీసీ) 1000 మార్కులకు 991 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచారు. ఇక ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని భవాని (ఎంపీసీ) 986 మార్కులు సాధించి రెండో స్థానంలోనూ, తలుపుల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని శ్రీసంగీత 953 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు. బాలికలదే హవా జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో బాలికలదే హవా కొనసాగింది. జనరల్లో మొదటి సంవత్సరంలో బాలికలు 4,076 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2,770 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో బాలికలు 4,209 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 3169 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ 67, సెకండ్ ఇయర్ 72 శాతం ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్లో రాష్ట్రంలోనే జిల్లాకు 20వ స్థానం, సెకండ్ ఇయర్లో 22వ స్థానం మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు -
ఇలా జరుగుతుందని అనుకోలేదు
పేలుడు జరిగిన ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఆ ఇంట్లో మంటలు వ్యాపిస్తుండడంతో ఆర్పేందుకు బిందెలతో నీళ్లు ఇచ్చాను. ఇంతలోనే భారీశబ్ధంతో పేలుడు సంభవించింది. నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. నాకు స్వల్ప గాయాలయ్యాయి. భయంకరమైన పేలుడుతో భీతిల్లిపోయాం. పేలుడు జరిగిన ఇంట్లో వారు నాలుగురోజులకోసారి వ్యానులో వచ్చి వెళ్తుండేవారు. ఏదో మైనింగ్ పని చేసుకుంటున్నారని అనుకున్నాం. ఇలా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తుంటారని ఊహించలేకపోయాం. – పార్వతమ్మ, కుమ్మరవాండ్లపల్లి -
నిర్లక్ష్యంతోనే పేలుళ్లు!
● భారీ పేలుడుతో భీతావహ వాతావరణం ● కుమ్మరవాండ్లపల్లి ఘటనపై సర్వత్రా విస్మయంకదిరి అర్బన్/కదిరి టౌన్: బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతం.. కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. శరీరాలన్నీ కాలిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. స్థానికుల హాహాకారాలు మిన్నంటాయి. భారీ పేలుడు శబ్దం చుట్టుపక్కల చాలా దూరం వరకు విన్పించింది. ఏమి జరిగిందో అర్థం కాక పట్టణవాసులు రకరకాలుగా చర్చించుకున్నారు. చివరకు జిలెటిన్స్టిక్స్ పేలుడు వల్ల దుర్ఘటన జరిగిందని తెలిసి ప్రజలు నిర్ఘాంతపోయారు. కదిరి చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇప్పుడు సంభవించిందంటూ విస్మయం వ్యక్తం చేశారు. పదేళ్లుగా.. యథేచ్ఛగా.. కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్స్టిక్స్ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. ఒకసారి పనులకు వెళితే తర్వాత రెండు, మూడు రోజులకు గానీ తిరిగొచ్చేవారు కాదు. దీంతో కష్టపడి పనులు చేసుకుంటున్నారని స్థానికులు అనుకునేవారు. ఓ భారీ ప్రమాదపుటంచున తాము జీవిస్తున్నామని వారు ఏ రోజూ భావించలేదు. కరువైన తనిఖీలు ఎక్కడైనా భారీ బ్లాస్టింగ్లు జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మైనింగ్ తదితర శాఖల అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకే పేలుళ్లు జరుపుతున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించినట్లు తేలితే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. చాలాకాలం నుంచి కదిరి చుట్టుపక్కల యథేచ్ఛగా బ్లాస్టింగ్లు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతకాలం క్రితం గట్లు వద్ద ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తుండగా.. సమీప కాలనీవాసులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రెండు రోజులు స్టేషన్లో ఉంచుకుని వదిలేశారు. కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. దీంతో షరామామూలే అన్నట్లు బ్లాస్టింగ్లు జరిగిపోతున్నాయి. పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల మధ్య నిల్వ చేసేందుకు వీలులేదు. ఊరికి దూరంగా, అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య మాత్రమే నిల్వ చేయాలి. బ్లాస్టింగ్ చేసే వారికి కూడా ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఉండాలి. కానీ ఇలాంటి భద్రతా ప్రమాణాలేవీ పాటించపోయినా అధికారులు పట్టించుకోకపోవడం కుమ్మరవాండ్లపల్లిలో భారీ విషాదానికి దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, పుట్టపర్తి : ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ చాలా మంది పేలుడు పదార్థాలను ఇంట్లోనే నిల్వ ఉంచుకుని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో మూడేళ్లలో మూడు పేలుళ్లు సంభవించాయి. కొత్తచెరువు మండలం వంగంపల్లిలో జరిగిన గ్యాస్ పేలుడులో ఓ మహిళ దుర్మరణం చెందగా.. గోరంట్లపల్లిలో ప్రజలు ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ రెండు ఘటనలు 2023 జూలై, ఆగస్టు నెలల్లో జరిగాయి. ఆ తర్వాత పేలుడు ఘటనలు లేవనే చెప్పవచ్చు. అయితే తాజాగా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. నలుగురు దుర్మరణం చెందగా.. 28 మంది గాయపడ్డారు. అవగాహన లోపంతో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంతోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ముందుగా అప్రమత్తమై పరారీ తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పదేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటోంది. రాతి పనులకు వెళ్లే క్రమంలో పేలుడు పదార్థాలు వినియోగించేవారు. పనుల్లో భాగంగా ఒకేసారి భారీ డంపు చేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం సమయంలో పేలుడు పదార్థాల నుంచి పొగ వస్తుండటం గమనించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. గ్యాస్తో ప్రమాదమే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సరిగా జరగడం లేదు. దీంతో చాలా మంది అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. జాగ్రత్తలు పాటించకుండా సిలిండర్లను ఎక్కడపడితే అక్కడ ఉంచితే పెనుప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే చర్యలే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకోవడం నేరం. ఎవరి ఇంట్లో అయినా అనుమతులు లేని పేలుడు పదార్థాలు ఉన్నట్లయితే వెంటనే బయట పడేయండి. పోలీసులకు పట్టుబడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే విషయం గ్రహించాలి. గ్యాస్సిలిండర్ల నిల్వలోనూ జాగ్రత్త అవసరం. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ -
సత్యసాయి జిల్లా: భారీపేలుడు నలుగురు మృతి
సత్యసాయి జిల్లా: కదిరిలోని కమ్మరవాండ్లపల్లిలో దారుణం జరిగింది. భారీ పేలుడు సంభవించి నలుగురు మృతిచెందగా, ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి.పేలుళ్ల దాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్తో పాటు సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులు వెంకన్న, మాబున్నిస, మధు, సంపత్ గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ
పుట్టపర్తి టౌన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే నష్ట తీవ్రత తగ్గుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా అగ్ని మాపక శాఖఅధికారి మాధవనాయుడు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను అగ్నిమాపక సిబ్బందితో కలసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్లో విఽధి నిర్వహణలో అశువులు బాసిన ఫైర్మెన్లకు నివాళులర్పించారు. ఫైర్ వాహనాలతో ర్యాలీ నిర్వహించి, అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఎస్ఓ నాగరాజునాయక్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. చైన్ స్నాచర్ అరెస్ట్హిందూపురం: బంగారు గొలుసు అపహరణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం యూజీ రూరల్ పీఎస్ సీఐ ఆంజనేయులు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. హిందూపురం మండలం కిరికెర సమీపంలోని సూర్యకోచ్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మారుతీ లేవుట్లో నివాసముంటున్న సుశీలమ్మ నడవలేని స్థితిలో సోమవారం తన ఇంటి ఎదుట కూర్చొని ఉన్న సమయంలో అప్పలకుంటకు చెందిన అనిల్ అక్కడకు చేరుకుని ఆమె మెడలోని ఆరు తులాల బంగారు తాళి బొట్టు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించి, మంగళవారం కొటిపి రైల్వే గేట్ వద్ద తచ్చాడుతున్న అనిల్ అలియాస్ వడ్డే అనిల్ను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. కేసును ఒక్కరోజులోనే ఛేదించిన సీఐ ఆంజినేయులు, ఎస్ఐ నంజప్ప, ఏఎస్ఐ శ్రీరాములు, సిబ్బందిని ఎస్పీ సతీష్కుమార్, డీఎస్పీ మహేష్ అభినందించారు. రేపటి నుంచి జనగణన ● ఈ నెల 16 నుంచి 30 వరకు స్వీయగణన అనంతపురం అర్బన్: జనగణన–2027 ప్రక్రియ ఈ నెల గురువారం ప్రారంభం కానుంది. రెండు దశల్లో గణన ఉంటుంది. మొదటి దశలో గృహగణన నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలిసారి స్వీయ గణన నిర్వహణ ఉంటుంది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ( https:// se. census. gov. in) ద్వారా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. దీనిపై ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వీయగణన ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరినీ దీని కోసం నిర్బంధించకూడదంటూ ఇప్పటికే జిల్లా సెన్సన్ అధికారులు స్పష్టం చేశారు. స్వీయగణన షెడ్యూల్ ఇలా.. ● తొలిరోజు 16వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ ప్రతినిధుల గణనతో ప్రారంభమవుతుంది. ● 17న సచివాలయ సిబ్బంది, కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ● 18న అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, కళాకారులు వంటి ప్రముఖ వ్యక్తుల స్వీయగణన. ● 19న స్వయం సహాయ సంఘాల సభ్యులకు, 20న ఉపాధి హామీ పథకం కూలీలకు మొదటి విడత అవగాహన కల్పిస్తారు. 21న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల స్వీయగణన. ● 22న విద్యార్థులు స్వీయగణన ప్రక్రియలో పాల్గొంటారు. 23న అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంల నమోదు. 25న గిరిజన ప్రాంతాలు, వారపు సంతల వద్ద స్వీయగణన ప్రక్రియ నిర్వహిస్తారు. ● 25న పట్టణ ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వృద్ధాశ్రమాల్లో స్వీయగణన. ● 26న ప్రజల్లో అవగాహన కోసం జిల్లా కేంద్రంలో సెన్సస్– 5కె రన్ నిర్వహిస్తారు. ● 27న డ్వాక్రా సంఘాలకు రెండవ విడత, 29న పోలీసు సిబ్బందికి స్వీయగణన. 30న ఉపాధి కూలీలకు రెండవ విడతగా స్వీయగణన ప్రక్రియ నిర్వహిస్తారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనుంది. జిల్లాలో వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ BIEAP Results Portal ద్వారా హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 95523 00009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపితే ఫలితాలు అందుతాయి. ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్పై భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచించారు. ఆర్ఎంపీ క్లినిక్ల సీజ్ అమరాపురం: మండల కేంద్రంలోని రెండు ఆర్ఎంపీ క్లినిక్లను తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భార్గవ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. స్టెరాయిడ్, ఇంజక్షన్లు, ఓవర్ డోస్లు వేయకూడదని సూచించారు. ఇవన్నీ ఆయా క్లినిక్లలో నిర్వహిస్తుండటంతో సీజ్ చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుదాఘాతంతో రైతు మృతి తలుపుల: మండలంలోని ఉడమలకుర్తి పంచాయతీ చిన్నపల్లి గ్రామానికి చెందిన రైతు పి.వెంకటరమణ (57) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య రమణమ్మ, కుమారుడు మల్లికార్జున ఉన్నారు. తన పొలంలో సాగు చేసిన వేరుశనగ పంటకు నీరు పెట్టేందుకు సోమవారం రాత్రి వెళ్లిన వెంకటరమణ... అక్కడ మోటార్ స్టార్టర్ పెట్టె వద్ద కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు నేరుగా పొలం వద్ద కెళ్లి పరిశీలించాడు. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని గమనించి రోదిస్తూ సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశాడు. ఘటనపై మల్లికార్జున ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వైభవంగా పెద్దమ్మతల్లి జాతర అనంతపురం కల్చరల్: నగరంలోని ఐదో రోడ్డులోని పెద్దమ్మ తల్లి జాతర మంగళవారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనానికి అన్నప్రసాద వితరణ జరిగింది. నిర్వాహకులు రంగా, సాయి, ఆంజనేయులు, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
మురళీ త్యాగం వెలకట్టలేనిది
గోరంట్ల: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళీనాయక్ త్యాగం మరువలేనిదని కలెక్టర్ శ్యాంప్రసాద్ కొనియాడారు. గత ఏడాది భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీనాయక్ అమరులయ్యారు. మండల పరిధిలోని కల్లితండా గ్రామంలో మంగళవారం మురళీనాయక్ ప్రథమ వర్ధంతి జరిగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొని మురళీనాయక్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురళీనాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ స్ఫూర్తిని యువత కొనసాగించాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించార. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మధునాయక్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం.. అమర జవాన్ మురళీనాయక్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం మండల పరిధిలోని కల్లి తండా గ్రామంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. నేత్రదానంతో ఇద్దరికి చూపు ధర్మవరం అర్బన్: మరణానంతరం తన నేత్ర దానంతో మరో ఇద్దరికి కంటి చూపునుప్రసాదించారు ధర్మవరంలోని సంజయ్నగర్కు చెందిన బెళ్లాల కమలమ్మ(86). వయో భారంతో మంగళవారం ఆమె కన్నుమూశారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి, సభ్యులు అక్కడకు చేరుకుని నేత్రదానంపై మృతురాలి కుటుంబసభ్యులను చైతన్య పరిచారు. అనంతరం వారి ఆమోదంతో కమలమ్మ కంటి కార్నియాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్రలు సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతురాలి కుమార్తెలు గోవిందమ్మ, లలితమ్మ, ఇంద్ర, అనురాధ, అల్లుళ్లు గంగాధర్, శ్రీనివాసులు, నాగేంద్రకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏమారితే రోగాలు మెండు
మామిడి పండు.. ● మామిడి పండ్ల నిగనిగల వెనుక పొంచి ఉన్న అనారోగ్యం ● పక్వానికి రాకమునుపే రసాయనాల ద్వారా మాగబెడుతున్న పరిస్థితి ● ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నిపుణులు ● ఉమ్మడి జిల్లాలో 84వేల ఎకరాల్లో మామిడి సాగు అనంతపురం అగ్రికల్చర్/తాడిపత్రి రూరల్/హిందూపురం: వేసవి ఫలరాజు ‘మామిడి’ మార్కెట్లోకి వచ్చింది. ఏడాదిలో రెండు మూడు నెలలు కనిపించే నిగనిగలాడే మధురమైన మామిడిని ఆస్వాదించేందుకు జనం రెడీగా ఉన్నారు. ఫలాలన్నింటిలోకి ప్రత్యేక స్థానం కలిగిన ‘మామిడి’ ప్రస్తుతం కొందరి స్వార్థం కారణంగా కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వచ్చే మామిడి కాయలను సంప్రదాయ రీతుల్లో కాకుండా కృత్రిమ విధానాల్లో మగ్గిస్తుండడమే ఇందుకు కారణం. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 84వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. జిల్లాలో చీనీ తరువాత అతిపెద్ద వాణిజ్య పంటగా మామిడిని రైతులు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం, కదిరి, తలుపుల, ఎన్పీకుంట, తనకల్గు, ముదిగుబ్బ తదితర మండలాల్లో అత్యధికంగా సాగులో ఉంది. కాయలతో ఉన్నా తోటలను వ్యాపారులు హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. మోతాదు మించితే ఇథలిన్ కూడా ప్రమాదకరమే గతంలో రైతులు శాసీ్త్రయ పద్ధతుల్లో మామిడి కాయలను మగ్గించి విక్రయాలు సాగించేవారు. ఆ తర్వాత టోకుగా తోటల్లోని ఫలసాయాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ద్వారా 24 గంటల్లోపు మామిడి కాయలను మగ్గించి ప్రజారోగ్యంతో చెలగాటమాడసాగారు. ఈ క్రమంలో ఇథలిన్ గ్యాస్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కాల్షియం కార్బైడ్తో మగ్గించిన కాయల కంటే ఇథలిన్ గ్యాస్ వినియోగం ద్వారా దుష్ఫలితాలు తగ్గాయి. అయితే మోతాదుకు మించి ఇథలిన్ గ్యాస్ వినియోగిస్తే అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుందని పేర్కొంటున్నారు. మూతపడుతున్న రైపనింగ్ సెంటర్లు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇథలిన్ గ్యాస్ రైపనింగ్ సెంటర్లు పలు సాంకేతిక కారణాలతో మూతపడుతున్నాయి. తాడిపత్రిలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇథలిన్ రైపనింగ్ సెంటర్ కేవలం రెండేళ్లు కూడా నడవలేదు. మునిసిపాలిటీ ఆధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ సెంటర్ కాస్త మూతపడింది. ఈ క్రమంలోనే ఇథలిన్ గ్యాస్తో పండ్లను మాగబెట్టడం ఖర్చుతో కూడుకుంటోందనే నెపంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు తిరిగి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసినా మునిసిపల్ ఆధికారులు పట్టించుకోవడం లేదు. రసాయనాలతో మాగబెడుతున్న పరిస్థితి మామిడి పండ్లు సహజంగా పక్వానికి రాకముందే వ్యాపార ధోరణితో కొందరు త్వరగా మాగేలా కృత్రిమ పక్వం (ఆర్టిఫిషియల్ రైపనింగ్) చేస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కృత్రిమంగా మాగబెట్టడానికి చాలా మంది కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. ఇది తేమ తగిలినపుడు అసిటిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఈ వాయువు పండ్లను త్వరగా పసుపు రంగులోకి మారేలా చేస్తుంది. రూ.80 ఖర్చుతో ఒక కిలో కాల్షియం కార్బైడ్ ద్వారా 5 నుంచి 10 టన్నుల వరకు మామిడి కాయలను కేవలం 24 గంటల్లోనే మాగబెట్టవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, చర్మ అలర్జీలు వస్తాయి. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై అనారోగ్య ప్రభావం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కార్బైడ్ను నిషేధించినా కొందరు రహస్యంగా వాడుతూనే ఉండడం ఆందోళనకరం. – ఆర్.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వినియోగదారుల సంఘాల సమాఖ్యకాల్షియం కార్బెట్ హానికరం కాల్షియం కార్బెట్తో మాగబెట్టిన మామిడి కాయలతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎక్కువగా వాంతుల, విరేచనాలు, చికాకు, చర్మ సమస్యలు కనిపిస్తాయి. దీర్థకాలంలో క్యాన్సర్కు దారి తీయవచ్చు. శాసీ్త్రయ పద్ధతుల్లో మగ్గించిన మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. – అనిల్, వైద్యుడు, తాడిపత్రికొనే ముందు పరిశీలించాలి మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఒకసారి పరిశీలించాలి. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉండడమే కాక తియ్యటి వాసనతో ఉంటాయి. కృత్రిమంగా మాగిన మామిడి పండ్లలో పై పొర ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు కనిపిస్తాయి. అలాగే మామిడి పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడిలేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. – మహేష్, ఉద్యాన అధికారి, హిందూపురం -
నవ భారత నిర్మాత అంబేడ్కర్
పుట్టపర్తి టౌన్: నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని జానకీరామయ్య కల్యాణ మండపంలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ భరధ్వాజ్ హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి అంబేడ్కర్ చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ వసతి గృహం గురుకుల విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించారన్నారు. కేవలం రాజ్యాంగం కారణంగానే సామాన్యులు, బడుగు బలహీన వర్గాల వారు కూడా చట్ట సభల్లో అడుగుపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అఽధికారి మోహన్రామ్, డీఆర్డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఘన నివాళి.. బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ అంబేడ్కర్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎస్పీ సతీష్కుమార్ కొనియాడారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిబ్బందితో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అంటరానితనం, వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్ అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, రవికుమార్, ఆర్ ఎస్ఐలు ప్రదీప్సింగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె భవనాలే దిక్కు
అనంతపురం టౌన్: ప్రభుత్వ ఖజానాకు అత్యధికంగా ఆదాయం సమకూర్చే శాఖల్లో ప్రధానమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు లేవు. ఏడాదికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సమకూరుతోంది. అయినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే యోచన ప్రభుత్వం చేయడం లేదు. 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. డీఐజీ కార్యాలయంతోపాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రామ్నగర్, కళ్యాణదుర్గం, శింగనమల, యాడికి, పామిడి, గుంతకల్లు, కణేకల్లు తదితర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ప్రైవేట్ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు చిలమత్తూరు, ధర్మవరం రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాల ఏర్పాటు ఎన్నడో.. ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. రెవెన్యూ పరంగా బలమైన ఆదాయ వనరుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేని కొరత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. కొన్నేళ్లుగా అద్దె భవనాల్లోనే కాలం నెట్టుకొస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ భవనాలు సైతం అద్దె భవనాల్లోనే సొంత భవనాలు ఏర్పాటుపై దృష్టి సారించని ప్రభుత్వం నివేదిక పంపారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల విషయమై ఉన్నతాధికారులకు గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు నివేదికలు పంపారు. సొంత భవనాలు కేటాయిస్తే రిజిస్ట్రేషన్ శాఖపై అద్దె భారం తగ్గుతుంది. – బి.శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ -
వైభవం.. గావుల మహోత్సవం
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో మంగళవారం పోతలయ్యస్వామికి గావుల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పోతలయ్యస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు, యువకులు జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం పోతరాజులు ఉరుముల శబ్ధాలకు నృత్యాలు చేసుకొంటూ వచ్చి ఆలయం ముందు మేకపోతు పిల్లలను బలి ఇచ్చి గావుల మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ దృశాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో కిటకిటలాడిన పోతలయ్యస్వామి ఆలయ ప్రాంగణం -
ఉద్యమాన్ని జయప్రదం చేయండి
ధర్మవరం అర్బన్: ఉపాధ్యాయుల సమస్యలపై తలపెట్టిన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం పీఆర్టీయూ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 21న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని ఏర్పాటు చేసి 30శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, 2003 డీఎస్సీ వారికి మెమో 57ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలో చేపట్టాలన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్ వన్ హెచ్ఎంలుగా పరిగణించాలని కోరారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కేజీబీవీ వారికి ఎంటీఎస్ వర్తింప చేయాలని, విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇన్సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు మోడల్ ప్రైమరీ స్కూల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి -
ద్విచక్ర వాహనాల ఢీ – ముగ్గురికి తీవ్ర గాయాలు
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన యువకులు నవీన్కుమార్, భరత్కుమార్ వ్యక్తిగత పనిపై మంగళవారం ద్విచక్ర వాహనంలో కదిరికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. బత్తలపల్లి మండలం రామాపురం సమీపంలోని చిత్రావతి నది బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఓబుళాపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి పాత రోడ్డు మీదుగా ద్విచక్రవాహనంపై వస్తూ ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. -
ఘనంగా ఆదినాథ తీర్థంకర వార్షికోత్సవం
అమరాపురం: మండల కేంద్రంలో వెలసిన ఆదినాథ తీర్థంకర వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆది తీర్థంకర మూలవిరాట్కు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా జైన మతస్తులు ఆది తీర్థంకర ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. 108 కలశాలతో భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాద వినియోగం అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెంగళూరులో స్థిరపడిన అమరాపురం వాసులు పాల్గొన్నారు. అలరించిన సంగీత విభావరి ప్రశాంతినిలయం: సాయికుల్వంత్ సభామంటపంలో రెండో రోజూ తమిళ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కీర్తనా భరద్వాజ్ కర్ణాటక సంగీత కచేరీతో భక్తులను మైమరిపించారు. సంప్రదాయ తేవారంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె శాశ్వతమైన తమిళ భక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం బ్రోచేవారెవరురా, మోక్షము కలదా కృతులతో భక్తి భావాన్ని ఆవిష్కరించారు. కీర్తనా భరద్వాజ్ బృందాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ఆయన భార్య హిమవాహిణి సత్కరించారు. న్యాయవాదులపై ఫిర్యాదు హిందూపురం: స్థానిక అబాద్ పేటలో డ్రెయినేజీ నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందిని అవమానిస్తూ మాట్లాడరంటూ న్యాయవాదులు ఉదయ్సింహారెడ్డి, యూసుఫ్పై వన్టౌన్ పోలీసులకు హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో కలిసి బాధిత ఇంజనీరింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. వివరాలు.. న్యాయవాదులు నివాసముంటున్న ప్రాంతంలో కాలువ పనుల కోసం తవ్వి వదిలేశారు. దీంతో మంగళవారం అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బందిని న్యాయవాదులు ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాదన చోటు చేసుకుంది. కాగా, తాము న్యాయవాదులమని చెబుతున్నా వినకుండా మున్సిపల్ సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తూ వీడియోలు తీసి అవమాన పరిచారంటూ న్యాయవాదులు ఆరోపించారు. తమను దోషిగా చూపించేలా సిబ్బంది వ్యవహరించిన తీరు సరికాదన్నారు. అధికారులు ప్రజాసేవకులేననే విషయాన్ని గుర్తించాలన్నారు. సకాలంలో కాలువ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇందుకు స్థానికులతో కలిసి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్న తరుణంలో స్వీయ రక్షణలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ఢీ – ఒకరి మృతి అమరాపురం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని శిర తాలూకా కురుబర రామనహళ్లి గ్రామానికి చెందిన భూతరాజు (30) తన స్నేహితుడితో కలసి మంగళవారం అమరాపురం మండలం బసవనపల్లి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వచ్చాడు. ఈత ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఉప్పార్లపల్లి క్రాస్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన భూతరాజును వెంటనే శిర ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, అప్పుటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
ముగిసిన మహాలక్ష్మీ బ్రహ్మోత్సవాలు
పాలబావిలో గంగ పూజ చేస్తున్న భక్తులు కొల్హాపురి మహాలక్ష్మీ మూలవిరాట్ రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ నెల 5నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి పోతులరాజు బండారు మహోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాక, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. పాలబావిలో గంగ పూజల నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దాతల సహకారంతో ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం నాడు బ్రహ్మోత్సవాలు ముగిసిన తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయ సమీపంలో విందు భోజనాలు ఏర్పాటు చేసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆరగించారు. -
కందికుంట పేరుతో కే–ట్యాక్స్
ప్రశాంతి నిలయం: ‘‘కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది. కే–ట్యాక్స్ పేరుతో కందికుంట ట్యాక్స్ను అధికారులే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్దన్రెడ్డి, జనసేన కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్, న్యాయవాది, టీడీపీ నాయకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులే ఫీజులతో పాటు కే–ట్యాక్స్ అనే కోడ్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా ఉన్నత స్థాయి సిబ్బంది, దళారీల సహకారంతో భవనాల మార్కెట్ విలువలు తగ్గించి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిషేధించిన, వివాదాస్పద భూములను నిబంధనలు ఉల్లంఘించి అధికారులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రతి నెలా రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. రైతులు, చిరువ్యాపారుల ఫైళ్లు మాత్రం పెండింగ్లో పెట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. సుమారు రూ.20 కోట్ల కుంభకోణం జరిగినట్లు చెప్పారు. సిబ్బంది ఫోన్ కాల్ డేటా, వారి వ్యక్తి గత ఆస్తులు, వారి బినామీల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. గత కొద్ది నెలలుగా కే–ట్యాక్స్తో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం అందరికీ తెలుసన్నారు. గతంలో పని చేసిన కొంతమంది అధికారులు కందికుంట మోచేతి నీళ్లు తాగి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపారన్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూలు చేస్తున్నారు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు -
వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు, పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94412 38182కు సమాచారం ఇవ్వాలని హిందూపురం రైల్వే పోలీసులు కోరారు. ఊజీ మాత్రలు మింగి వ్యక్తి.. బత్తలపల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన సాకే వెంకటప్ప(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంట్లో కుమారుడితో గొడవ పడి ధర్మవరం వెళ్లాడు. తిరిగి వస్తూ మల్లేనిపల్లి వద్ద ఊజీ మాత్రలు మింగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావ నరసింహుడుకు ఫోన్ చేసి తెలిపాడు. ఆయన సంఘటనాస్థలానికి చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకటప్పను బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడేశ్వరితో ఇద్దరు కుమారులు ఉన్నారు. బావిలో దూకి... ముదిగుబ్బ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన షెక్షావలి (40)కు భార్య నసీమా, ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్లుగా ఆమె వేరు కాపురం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ముదిగుబ్బలోని బంధువులను కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ముదిగుబ్బ శివారున ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై..? పావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని రొప్పం గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు జయ ప్రకాష్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమే ఇందుకు కారణంగా తెలిసింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. -
మండే ఎండ.. మంటలతో జాగ్రత్త!
పుట్టపర్తి టౌన్: భానుడి భగభగలతో జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం రామగిరిలో ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాలకూ అస్కారం ఎక్కువగా ఉంటోంది. అగ్ని ప్రమాదాల బారి నుంచి తమతోపాటు చుట్టుప్రక్కల వారినీ కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక శాఖ ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి ఈనెల 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది. జిల్లాలో ఆరు అగ్నిమాపక కార్యాలయాలు.. జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర తదితర ప్రాంతాల్లో ఆరు అగ్ని మాపక శాఖ కార్యాలయాలున్నాయి. మొత్తంగా ఆరుగురు ఫైర్ ఆఫీసర్లతో పాటు 115 మంది ఫైర్ ఫైటర్లు, 24మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజురోజుకూ ఎండలు ముదిరిపోతున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడ్డివాములు, ఉద్యాన పంటలు, అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉన్నా... కొన్ని సమయాల్లో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అగ్ని మాపకశాఖ కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకోవడంతోపాటు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను అవగాహన కల్పిస్తోంది. పాటించాల్సిన నియమాలు.. చిన్న పిల్లల దగ్గర అగ్గిపెట్టెలు, లైటర్లు టపాకాయలు వంటి వాటిని ఉంచకూడదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు అగ్గిపుల్లలు ఆర్పకుండా పాడేయకూడదు. ఐఎస్ఐ మార్క్ ఎలక్ట్రానిక్ పరికరాలే ఉపయోగించాలి. ఊళ్లకు వెళ్లే సమయంలో ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఉత్తమం. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆర్పడానికి నీటిని సిద్ధంగా ఉంచాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి. గోడౌన్లలో వస్తువులు స్టాక్ ఉంచేటప్పుడు వస్తువుల మధ్య ఖాళీ ప్రదేశం వదలాలి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రదేశాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని ఉపయోగించకూడదు. మంటలను ఆర్పేందుకు పొడి ఇసుకను మాత్రమే వాడాలి. పెట్రోల్, గ్యాస్ నింపుకునేందుకు వెళ్లినప్పుడు వాహనాల ఇంజన్లను ఆఫ్ చేయాలి. పెట్రోలు బంకుల్లో సెల్ఫోన్లు వాడకూడదు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.. మంగళవాం నుంచి 20 తేదీ వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు అమరవీరులకు నివాళి, 15న అగ్ని ప్రమాదాలపై బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు, 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్ గోడౌన్లు, ఆయిల్ ఫార్మ్లు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటుు. 20న అన్ని వర్క్షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అవగాహనతోనే అగ్ని ప్రమాదాలకు చెక్ అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు గత ఏడాది అగ్నిప్రమాదాలు ఇలా.. ప్రమాదాలు 376 ఆస్తి నష్టం రూ. 4,92,11,746కాపాడిన సొమ్ము రూ.14,97,21,000 సిద్ధంగా ఉన్నాం జిల్లాలో ఎలాంటి ప్రమాదం, విపత్తు సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితోనే ప్రమాద సమయంలో వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు వెంటనే మాకు సమాచారం ఇస్తే నష్టం జరగకుండా చూస్తాం. అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తాం. – మాధవ నాయుడు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి -
‘పరాఖ్’ సర్వేను విజయవంతం చేయండి
పుట్టపర్తి: ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పరాఖ్ సర్వేను విజయవంతం చేయాలని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. సోమవారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుక్కపట్నం డైట్ కళాశాలలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. మూడో తరగతి విద్యార్థులకు ఫండమెంటల్ లెర్నింగ్ స్టడీ సర్వే జరుగుతోందని, ఇందులో భాగంగా ఎంపిక చేసిన 18 పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసనా స్థాయిలను అంచనా వేస్తారన్నారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరించే డైట్ విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లి టెస్ట్ నిర్వహించాలన్నారు. విద్యాధికారులు సీఆర్పీలను సమన్వయం చేసుకొని 16, 17, 18 తేదీల్లో సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ గోపాల్, మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, సూపరింటెండెంట్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ వైష్ణవి కదిరి అర్బన్: తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కదిరికి చెందిన చల్లా ధనుంజయ, చల్లా ధనలక్ష్మీ దంపతుల కుమార్తె చల్లా వైష్ణవి (ఎంపీసీ ఈటీ ఒకేషనల్ విభాగం) స్టేట్ ఫస్ట్ స్థానాన్ని కై వసం చేసుకుంది. వైష్ణవి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఈటీ)లో 500 మార్కులగాను 498 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచింది. తండ్రి ధనుంజయ బస్ మెకానిక్గా పని చేస్తున్నారు. రావులచెరువు వీఆర్ఏపై దాడి ధర్మవరం రూరల్: పాతకక్షల నేపథ్యంలో మండల పరిధిలోని రావులచెరువు వీఆర్ఏ శివానందపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఓ విషయమై మూడు నెలల క్రితం వీఆర్ఏ శివానందతో గ్రామానికి చెందిన కొందరు ఘర్షణ పడ్డారు. ఆరోజు మాటామాటా అనుకున్నారు. దీన్ని వారు మనసులో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో వీఆర్ఏ శివానంద ఇంటి వద్ద ఉండగా... అక్కడికి వచ్చిన మేకల ఉపేంద్ర, మేకల లక్ష్మయ్య, మేకల నరసమ్మ, మేకల కుమార్ కట్టెలు, రాళ్లతో అతనిపై దాడి చేశారు. గాయపడిన శివానందను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు నెలల క్రితం జరిగిన ఘర్షణే దాడికి దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
25 నుంచి సమ్మెలోకి తాగునీటి పథకం కార్మికులు
పుట్టపర్తి: బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు పథకం నిర్వహణకు సరైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుడు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా ఈ నెల 25నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జేసీ మౌర్యభరద్వాజ్ను కలిసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. జిల్లాలో 550 మంది కార్మికులు జిల్లాలోని 15 లక్షల మంది జనాభాకు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. గతంలోనూ సమ్మె చేస్తేనే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. దీంతో నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. తాగునీటి పథకం నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 నెలలకు సరిపడే నిధులు మాత్రమే కేటాయించడం సమంజసంగా లేదన్నారు. వాటర్ ప్రాజెక్టును జిల్లా పరిషత్ పరిధిలో విలీనం చేసి తమకు ఉపాధి భద్రత లేకుండా చేయడానికి సిద్ధమవుతున్నారని, ఇదే కనుక జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి తలుపుల: మండలంలోని కుటాగుళ్లకు చెందిన నరసింహులు (35) వడదెబ్బతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటాగుళ్లకు చెందిన చెన్నమ్మ ఉడమలకుర్తి వద్ద మామిడి తోట తీసుకుని అక్కడే ఉంటోంది. ఆమెకు నలుగురు సంతానం కాగా, చిన్న కుమారుడు నరసింహులు ఈ నెల 11వ తేదీన తల్లి చెన్నమ్మ వద్దకు వచ్చాడు. 12వ తేదీ ఆదివారం ఉదయం కుటాగుళ్లకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. నడుచుకుంటూ వస్తున్న అతను ఎండ దెబ్బకు తాళలేకపోయాడు. వడదెబ్బకు గురై ఓదులపల్లి వద్ద కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ గుర్రప్ప ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
పరిష్కార వేదికకు 80 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. ప్రాణాలు బలిగొన్న ఫిట్స్ తాడిపత్రి రూరల్: మూర్చ వ్యాధి ఒకరి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శివశంకర్ కుమారుడు మోహన్కుమార్ (25) తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన స్నేహితుడు మధుతో కలసి పనుల కోసమని ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళుతుండగా తేళ్లమిట్టపల్లి వద్దకు చేరుకోగానే బైక్ నడుపుతున్న మోహన్కుమార్కు ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మోహన్కుమార్ అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘చిలకం’తో నాకు ప్రాణహాని
పుట్టపర్తి టౌన్: తనకు, తన కుటుంబీకులకు రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మవరానికి చెందిన ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్కుమార్ను కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఎస్పీ సతీష్కుమార్కు ఓబుళరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయ ఆవరణలో కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనను గ్రామం నుంచి తరిమివేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 11వ తేదీన చిలకం మధుసూదన్రెడ్డి ఓ ప్లాన్ వేశారన్నారు. అందులో భాగంగా తన పేరు (ఓబుళరెడ్డి)తో సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి ఇష్టానుసారం పోస్టులు చేశారన్నారు. వాటి ఆధారంగా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించారన్నారు. దీంతో పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేసి కేసు నమోదు చేసి జైలుకు తరలించారన్నారు. ప్రస్తుతం తాను బెయిల్పై బయటకు వచ్చానని, అయినా అధికారం అండతో చిలకం తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఓర్వలేకే అక్రమ కేసులు.. ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కూటమి పార్టీల నేతలు వైఎస్సార్ సీసీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికి ఎక్కడ కోల్పోతామేమోనన్న భయంతో చిలకం మధుసూదన్రెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కేసులతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అశోక్, కేశవరెడ్డి, శివారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్రెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన ఓబుళరెడ్డి -
పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలి
ప్రశాంతి నిలయం: ‘‘వరుణుడు కరుణించలేదు..పట్టించుకోవాల్సిన పాలకులూ ఇక్కడి నీటిని హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేసి మరీ కుప్పానికి తరలించారు. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయి రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. నాడు కళకళలాడిన పొలాలన్నీ నేడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కోరారు. సోమవారం రైతులతో కలిసి పుట్టపర్తికి వచ్చిన ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో 65 కిలోమీటర్లు కాలువ తవ్వించి నీటిని విడుదల చేసి పేరూరు డ్యాంను కళకళలాడించామన్నారు. కానీ ప్రస్తుత పాలకులు డ్యాంకు నీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత వల్లే రైతులకు అన్యాయం.. రాప్తాడు కరువు పరిస్థితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణమని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో తాము రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే.. నేడు సాగునీరు లేక బీడు భూములు కనిపిస్తున్నాయన్నారు. సాగునీటి సమస్యతో పంటలు సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తే కనీసం రెండు పంటలను సాగు చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా... రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాము పాపంపేటకు నీళ్లివ్వాలని ప్రయత్నించినప్పుడు ఇళ్లను కూల్చివేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా... పేరూరు డ్యాంకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేసి నీటిని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించారన్నారు. దీంతో గతంలో వంద అడుగుల లోతులోనే బోర్లలో నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 400 అడుగులు వేసినా నీరు రావడం లేదన్నారు. 2018లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేసినప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.170 కోట్లు పనులకు బిల్లులు చేశామన్నారు. అయితే ఒక్క పనీ చేయకుండా పేరూరు డ్యాంకు పరిటాల రవి పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగంపేట గోపాల్రెడ్డి, మజ్జిగ శంకరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, రామగిరి, కనగానపల్లి జెడ్పీటీసీలు నాగార్జున, మారుతి, పెద్దిరెడ్డి, చంద్రకుమార్, మీనుగ నాగరాజు, రాజేష్, నాగముని, తలమర్ల సంజీవరెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ రైతులతో కలిసి జేసీకి వినతి పత్రం అందజేత -
మామూళ్లిచ్చినా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు
తహసీల్దార్లపై కలెక్టర్ సీరియస్ ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్లపై కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ముదిగుబ్బ, కదిరి, బుక్కపట్నం తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్జీలన్నీ పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 30 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో ధర్మవరం, కదిరి, కొత్తచెరువు మండలాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రశాంతి నిలయం: ‘‘విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించే మొత్తం కాకుండా మామూళ్ల కింద విద్యుత్ శాఖ ఏఈకి అదనంగా రూ.40 వేలు ఇచ్చినా...ట్రాన్స్ఫార్మర్ ఇవ్వక పోగా, రూ.24 వేలకే బిల్లులు ఇచ్చాడు. అయినా ట్రాన్స్ఫార్మర్ నేటికీ మంజూరు చేయలేదు’’ అని రొద్దం మండలం రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన రైతులు నరేష్, మాల అంజినప్ప, వడ్డ్డే గోపాల్, నాగరత్నమ్మ, సుబ్బరాయుడు తదితరులు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం జెడ్పీటీసీ అక్కులప్పతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వారు విద్యుత్శాఖ ఏఈపై ఫిర్యాదు చేశారు. బోర్లకు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీరి నుంచి అర్జీ స్వీకరించిన జేసీ... విచారించి న్యాయం చేస్తానన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 131 అర్జీలు అందాయి. జేసీ మౌర్యభరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ శ్రీకర్, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యకమ్రం అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్.. ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో వందకు పైగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్కు సంబంధించి వేర్వేరుగా అర్జీలు స్వీకరించారు. ఇందులో పలువురికి అడంగల్ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, శర్మ, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ట్రైసైకిల్ పంపిణీ.. ‘పరిష్కార వేదిక’కు వచ్చిన గోరంట్లకు చెందిన హుస్సేన్ పీరాకు జేసీ మౌర్య భరద్వాజ్ ట్రైసైకిల్ను పంపిణీ చేశారు. ఆయన ఇదివరకే ట్రై సైకిల్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈపై జాయింట్ కలెక్టర్కు రైతుల ఫిర్యాదు ‘పరిష్కార వేదిక’కు 131 అర్జీలు -
గోల్షాట్ బాల్ విజేతలుగా తిరుపతి, గుంటూరు
కదిరి అర్బన్: మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జరిగిన 4వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలుర, బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ గోల్షాట్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతి, గుంటూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో తిరుపతి జట్టు, ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో గుంటూరు జట్టు, ద్వితీయ స్థానం శ్రీసత్యసాయి జట్టు, తృతీయస్థానం విశాఖపట్నం జట్లు నిలిచాయి. విజేతలకు ఎంఈఓ చెన్నక్రిష్ణ ట్రోఫీలు, ప్రశంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గోల్షాట్ బాల్ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దేవిప్రియా, ప్రతినిధులు ప్రసన్నకుమార్, రామాంజులురెడ్డి, జగదీష్, డేనియల్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు హ్యాండ్ బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, మహేష్ తెలిపారు. జిల్లా జట్లు 18, 19వ తేదీల్లో నెల్లురులో జరిగే 5వ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు దానమయ్య, పీడీ యశోదలు పాల్గొన్నారు. సీనియర్ పురుషుల జట్టు డేనియర్, భరత్, యాసిర్, సిద్ధికీ, సాధిక్, సాయికుమార్, విశ్వనాథ్, కుమార్, నారాయణ, వరుణ్తేజ్, మోహిత్రెడ్డి, అరుణ్, ప్రవీణ్నాయక్, జోషినాయక్, మహేష్, శిశ, నాగారాజు, చంద్ర, సిద్ధార్థ సీనియర్ మహిళా జట్టు నక్షత్ర, మాధవి, సమీరా, స్వప్న, ఆదర్శిని, రిహాన, ఓంశ్రీ ప్రియాంక, ఫర్హాణా, విష్ణుప్రియా, జయదీపిక, సాయిప్రసన్న, నిహారిక, పవిత్ర, హర్షిణి, వినీత, జోష్ణ, జలజ, దివ్య, యశ్విని, హర్షిత, పవిత్ర -
ఉపాధిని కోల్పోయాం
చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో ఆపరేటర్లు ఉపాధిని కోల్పోయారు. వాహనాలను తిప్పలేక మూలన పడేశాం. బ్యాంకు రుణాలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నేటికీ ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. సక్రమంగా వాయిదాలను ప్రభుత్వం చెల్లించకపోవడతో ఆపరేటర్లకు సంబంధించి సిబిల్ స్కోర్ తగ్గిపోతోంది. వాహనాల ఇన్సూరెన్స్ రూ.11,500 కూడా ప్రభుత్వం చెల్లించాలి. – రామాంజినేయులు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
రైల్వే పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
తాడిపత్రి రూరల్: తాడిపత్రి రైల్వేస్టేషన్లో అమృత్ పథకం కింద జరుగుతున్నా పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్లో వివిధ పనుల నిమిత్తం రెండు విడతలుగా రూ.20 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు పనుల్లో కూడా నాణ్యతలో లోపాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న గ్రానైట్ బండ పరుపు కోసం ప్లాట్ ఫారంపై ఉన్న సిమెంట్ కాంక్రీట్ను తొలగించారు. సిమెంట్ బెడ్ పనులు చేస్తున్నారు. సిమెంట్ బెడ్ కోసం వేసిన సిమెంట్, ఇసుకను నిబంధనల మేరకు వేయకుండా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బెడ్ కోసం ఉపయోగిస్తున్న కంకర కూడా నాణ్యత లోపించిందంటున్నారు. ఇందులో కంకర పొడి కనిపిస్తోందని, కొంత వరకు వేసిన సిమెంట్ బెడ్పై క్యూరింగ్ సరిగా చేయలేదన్న విమర్శలున్నాయి. ఆ బెడ్పై గ్రానైట్ బండ పరుపు పరచడం వల్ల భవిష్యత్తులో కుంగిపోయి ఎగుడు, దిగుడుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు.. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది. జరుగుతున్న పనులను అధికారుల పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం చేస్తున్నారు. జరిగిన పనుల నాణ్యతను లోతుగా పరిశీలిస్తే తప్ప ఏమేరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో అర్థమవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. -
ఇన్స్టాలో పరిచయం.. టీచర్కు వేధింపులు
● పుట్టపర్తి వాసిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు దొడ్డబళ్లాపురం: టీచర్ మీ స్టూడెంట్నే అంటూ ఇన్స్టాలో మహిళా ఉపాధ్యాయురాలిని పరిచయం చేసుకొని ఆపై వేధించిన యువకుడిని పోలీసులు కటకటాలపాలుచేశారు. వివరాలు.. ఎలక్ట్రానిక్ సిటీలో టీచర్గా పని చేస్తున్న మహిళ (40)కు, పుట్టపర్తికి చెందిన అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థినంటూ కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ అర్షద్ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో కలవాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న అతను.. నూ్య్డ్ వీడియో తన వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు తరచూ అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే వేధింపులు తారాస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచన మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అవయవాలను కోసుకుంటానని అతను కొంతసేపు హల్చల్ చేశాడు. గ్రామస్తుల దాడిలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లికి చెందిన బావిరెడ్డి (51)అనే మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు శనివారం రాత్రి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడని, మనుషులపై కూడా దాడి చేయడం, బట్టలు లేకుండా తిరగడం వంటి చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగా గ్రామస్తులు బావిరెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని కాళసముద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన రామాంజినేయులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి రాప్తాడురూరల్: రాప్తాడు మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన రాజశేఖర్ (40) మామిళ్లపల్లి వైపు నుంచి జాతీయ రహదారిపై రాప్తాడు వైపు బైకులో వస్తున్నాడు. ఎం.చెర్లోపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైకు అదుపుతప్పి... యల్లనూరు: యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన మారుతి తన సోదరి మమతతో పాటు ఆమె కుమారుడు గగన్ (5)తో కలిసి రాప్తాడు వైపు నుంచి అనంతపురం వైపు బైకులో వస్తున్నారు. అయితే గాయత్రి మిల్క్డైరీ సమీపంలో అదుపుతప్పి బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గగన్ తలకు తీవ్ర గాయాలై మృత్యువాతపడ్డాడు. మారుతి, మమత గాయాలతో బయటపడ్డారు. తన కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో రైతు... కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన మహలింగప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన చిలగడ దుంపలను హైదరాబాద్ మార్కెట్కు బొలెరోలో తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రి కర్నూలు సమీపంలో బొలెరో వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మహలింగప్ప అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
అగళి: కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని కసాపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. హైదరాబాద్ నుంచి శిర వైపుగా వెళ్తోంది. అయితే మండలంలోని కసాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. దీంతో సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు మూగ గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో విద్యుత్ స్తంభం ధ్వంసమైన ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మహిళపై అత్యాచారయత్నం గుత్తి: పట్టణ పరిధికి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాలమేరకు.. జడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన లక్ష్మిదేవి పట్టణ శివారులోని డాబాలో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి ఒంట గంట సమయంలో ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని దారం చెవి కమ్మకు తగిలి చెవికు గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆరు కుట్లు వేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సురేష్ .. జడ్.వీరారెడ్డి కాలనీకి వెళ్లి బాధితురాలిని కలిసి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కాలనీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. మతిస్థిమితం లేని మహిళ మృతిఉరవకొండ: మండల పరిధిలోని చిన్నమూష్టూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మతిస్థిమితం లేని మహిళ (30 నుంచి 40 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం సీఐ మహానంది మాట్లాడుతూ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని మహిళ హంద్రీనీవా కాలువ గట్ల వద్ద ఉంటూ తిరిగేదన్నారు. ఆహారం లేక ఎండ వేడిమికు తట్టుకోలేక కాలువ సమీపంలోని చెట్టు కింద మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యాచకురాలు మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బకాయిలు విడుదల చేయాలిఅనంతపురం టవర్క్లాక్: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యయ, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీపీఎస్ ఏపీ జీఎల్ఐ, గ్రాడ్యుటీ, సరెండర్ లీవ్లకు సంబంధించిన బకాయిలు కొద్దిగా మాత్రమే విడుదల చేశారని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటేష్ బాబును ఘనంగా సన్మానించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్బాబును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్, రవికుమార్, జమీల బేగం, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, దస్తగిరి, పద్మావతి, అనంతయ్య, మనోహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. -
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ధర్మవరం అర్బన్: మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం కరపత్రాలు విడుదల చేశారు. శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో దాదాపు 50 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. మహిళా ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవని, లైంగిక వేధింపులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సంక్షేమానికి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక స్టాఫ్రూమ్, ప్రత్యేక వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాస్థాయిలో ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులతో సంతకాలు సేకరించి యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్నాథ్రెరడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరి వరకుమారి, కార్యదర్శులు నాగేంద్రమ్మ, లతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ విద్యార్థినికి జపాన్ నుంచి పిలుపు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంత’ విద్యార్థినికి జపాన్ దేశం నుంచి పిలుపు వచ్చింది. సైన్స్లో కనబరచిన ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. గుంతకల్లు మండలం కసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇడుపులపాయలో ఇంటర్ చదువుతున్న కావలి జ్యోతి తన సృజనాత్మకతతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే వినూత్న నమూనాను రూపొందించిన విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ ప్రతిభతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప అవకాశం లభించింది. జపాన్ సైన్స్,టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ కింద మన రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కావలి జ్యోతి ఒకరు ఉండడం విశేషం. వడదెబ్బతో వృద్ధురాలి మృతి కూడేరు: వడదెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. గార్లదిన్నె మండలం సంజీవ పురానికి చెందిన బొగ్గు వెంకటలక్ష్మమ్మ (65) ఆదివారం కూడేరులో పోలీసు స్టేషన్ వెనుక వైపు వ్యవసాయ పొలంలో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆ పొలం రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆమె వద్ద లభించిన కవర్లో ఆస్పత్రి చీటీ కనిపించింది. అందులో ఉన్న చిరునామా ఆధారంగా కుమారుడు సోముకు సమాచారమిచ్చారు. అతను వచ్చి చనిపోయినది తన తల్లి వెంకటలక్ష్మమ్మ అని గుర్తించాడు. తన తల్లి పుట్టినిల్లు అరవకూరని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతుండేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఆమె వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గొడవలు.. గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం న్యూటౌన్ జూనియర్ కళాశాలలో ఇటీవల ముగిసిన ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) శిబిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోర్డు నుంచి సీనియార్టీ ఆధారంగా వచ్చిన చీఫ్ ఎగ్జామినర్ల (సీఈ) జాబితాలో మార్పులు చేయడం వివాదానికి దారి తీసింది. సీనియర్ లెక్చరర్లను పక్కనబెట్టి జూనియర్లను నియమించడం, విధి విధానాలను ఉల్లంఘిస్తూ నియామకాల్లో ఇష్టానుసారం వ్యవహరించడం శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. దీనికి తోడు అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఈ క్రమంలో రగడ రాజుకుందని సీఈలు, ఏఈలు విమర్శిస్తున్నారు. గొడవలు, పరస్పర దూషణలు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. బోర్డు జాబితాలో 5వ పేరు.. ఇక్కడి జాబితాలో 14వ పేరు సీనియార్టీని అనుసరించి చీఫ్ ఎగ్జామినర్ (సీఈ)ల నియామకం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నుంచే జరుగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 12 మందితో సీనియార్టీ జాబితా పంపారు. దీన్నికాదని జిల్లాస్థాయిలో మరో జాబితా తయారు చేయడం.. అందులో సీనియార్టీని అనుసరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి వచ్చిన జాబితాలో 5వ పేరులోఉన్న ప్రిన్సిపాల్..ఇక్కడి జాబితాలో 14వ పేరుగా మార్చడమే ఇందుకు నిదర్శనం. గణితం సబ్జెక్టులోనూ ఇదే రకంగా జరిగిందని అధ్యాపకులు చెబుతున్నారు. జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు? క్యాంపులో ఓ జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు. ఈ విషయం గతనెల 31న వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఏఈ, సీఈలకు ముచ్చెమటలు పట్టాయి. వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ దుమారం క్యాంపు మొత్తం వైరల్ కావడంతో పెద్ద చర్చ జరిగింది. ఈ ఘటన మూల్యాంకన ప్రక్రియ భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల విద్యావర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి.. క్యాంపులో మిస్ అయిన జవాబుపత్రం నాలుగు రోజుల తర్వాత అదికూడా క్యాంపునకు సంబంధం లేనిచోట లభించింది. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న ఫిజిక్స్ ల్యాబ్లో దొరకడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రధానగేటుకు తాళం వేసే ఉంటుంది. బయట వారికి అనుమతి ఉండదు. అలాగే ఫిజిక్స్ ల్యాబ్కు తాళం వేసే ఉంటుంది. అధికారులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే శిబిరం నుంచి మాయమైన జవాబుపత్రం.. తాళం వేసి ఉండే ల్యాబ్లో ఎలా దొరికిందనేది అంతుచిక్కని ప్రశ్న. దీని వెనుక దాగి ఉన్న కుట్రకోణం బయటకు రావాలని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే ఇంటిదొంగలు బయటపడతారని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఈలు, ఏఈలు మూల్యాంకన విధులంటేనే బెంబెలేత్తే పరిస్థితి వస్తుందని వారు వాపోతున్నారు. సీఓఈకు ఫిర్యాదు చేసిన ఏసీఓ.. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో జరిగిన అవకతవకలపై స్వయంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ)కు ఓ అసిస్టెంట్ క్యాంపు అధికారి (జనరల్) ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అనవసరమైన వాగ్వాదాలతో తొలిరోజు శిబిరం బాగా ఆలస్యమైందని, ఏసీఓ (జనరల్)ను పక్కనపెట్టి అన్నీతానై క్యాంపు అధికారి వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అప్పటికే పని చేసిన వ్యక్తిని మళ్లీ సీఈగా నియమించారని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఏసీఓ జనరల్–1ను చేర్చకపోవడం, అవసరమైన సమాచారం అందించకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యలేనని పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ ఇంటర్ ‘స్పాట్’ తీరు -
వైభవం.. పోతులరాజు మహోత్సవం
రొళ్ల: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చారిత్రక ప్రదేశం, శైవక్షేత్రంగా పేరొందిన రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ‘పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం’ ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని గ్రామవీధుల గుండా నృత్య మాడుతూ మంగళవాయిద్యాల నడుమ కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు పాలబావిలో గంగా పూజ చేశారు. జాతరలో తినుబండారాల దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బి.అనంతరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్, మాజీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నాయకుడు నగేష్రంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్, మాజీ వైస్ సర్పంచ్ సీఎం ఘట్ట రవి, నాయకులు యరగుంటప్ప, సురేష్, హనునాయక్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ కె.నరసింహుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (నేడు) పాల బావిలో గంగా పూజతో పాటు రాత్రికి పోతుల రాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. రెవెన్యూ క్లినిక్లు.. భూ వివాదాల పరిష్కారానికి కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటర్లలో ఆయా రెవెన్యూ డివిజన్లకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అడంగల్ మార్పులు–చేర్పులు, మ్యుటేషన్లు, రస్తా, శ్మశాన వాటిక సమస్యలు, 22ఏ చుక్కల భూములు, సబ్ డివిజన్లు, పట్టాదారు పేరు మార్పులు తదితర సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఈ విషయంపై ఆదివారం ఆయా డివిజన్ల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష అనంతపురం అర్బన్:యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించిన ఫ్లాగ్షిప్ (ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఏ) పరీక్ష సజావుగా జరిగింది. పరీక్షలకు 522 మంది అభ్యర్థులకు గానూ 340 మంది హాజరయ్యారు. ఎస్ఎస్బీఎన్ కేంద్రంలో జరిగిన కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 55 శాతం నమోదైంది. కేఎస్ఆర్ కళాశాల కేంద్రంలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 65.18 శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆనంద్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. -
జిల్లాలో వివిధ రకాల సిలిండర్ల వివరాలిలా..
హిందూపురం మోడల్ కాలనీకి చెందిన చాంద్బాషా టీ కేఫ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఏర్పడిన గ్యాస్ కొరతతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బ్లాక్లో సిలిండర్ కొందామంటే రూ.3 వేలపైనే చెబుతుండడంతో అంతమొత్తం వెచ్చించలేక కేఫ్ బంద్ చేసుకుంటున్నాడు. .. గ్యాస్ కొరతతో వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చాంద్బాషా లాంటి చిరువ్యాపారులు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లూ దర్జాగా బతికిన వారంతా ఇప్పుడు కుటుంబానికి మూడు పూటలా కడుపు నింపేందుకు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. హిందూపురం టౌన్/ పెనుకొండ: పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు చిరువ్యాపారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అధికారులు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో టీ కేఫ్లు, చిన్నపాటి హోటల్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ బంకులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మూసివేశారు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచేసి బ్లాక్లో విక్రయిస్తున్నాయి. ‘కమర్షియల్’ కష్టాలు హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్లు దొరక్క నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా అంతంతమాత్రానే ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో పలు చోట్ల ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. కొన్ని చోట్ల బ్లాక్లో సిలిండర్లను కొనుగోలు చేసి మరీ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.2,200– రూ.2,300 ఉండగా.. పలు ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు రూ.4,500 వరకూ వసూలు చేస్తున్నాయి. ఇంతమొత్తం చెల్లించలేని కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అన్నీ బంద్ కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెనుకొండ మండలంలో పలు కేఫ్లు, హోటళ్లు మూతబడ్డాయి. కట్టెల పొయ్యితో హోటల్, కేఫ్ నిర్వహణ కష్టంగా మారడంతో చాలా మంది బంద్ చేశారు. గతంలో ఒక వెలుగు వెలిగిన హోటళ్లు, కేఫ్లు నిరవధికంగా మూతబడ్డాయి. వ్యాపారులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కేఫ్లు, హోటళ్ల ఏర్పాటు కోసం బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకుని నెలనెలా కంతులు చెల్లిస్తున్నారు. అలాంటి వారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద సైతం కొన్ని కేఫ్లు మూతబడగా, హోటళ్లు భారంగా నడుస్తున్నాయి. పొయ్యి వెలగక.. కడుపు నిండక హోటళ్లు, చిరు వ్యాపారులపై సిలిం‘డర్’ మోత కొరతను సాకుగా చూపి బ్లాక్లో విక్రయం మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.3 వేలపైనే గ్యాస్ కొనలేక కేఫ్లు, హోటళ్లు మూసేసిన వైనం వ్యాపారం లేక పస్తులుంటున్న చిరువ్యాపారులు వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లను నిర్వహించలేకపోతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. సిలిండర్ దొరికిన రోజు హోటల్ను నిర్వహిస్తూ, మిగతా రోజుల్లో మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్లాక్లో కొందామంటే గ్యాస్ సిలిండర్ ధర భారీగా ఉంది. అధికారులు స్పందించి వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి. – సాయి, హోటల్ నిర్వాహకుడు, హిందూపురం -
కొల్హాపురి లక్ష్మీదేవికి జ్యోతులు
రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయమే అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహాలను భక్తులు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళలు హారతులను అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, దేవాలయం కిటకిటలాడింది. పలువురు మహిళలు ఆలయ సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. -
ప్రొటోకాల్ కోసం ‘పల్లె’ ఆరాటం..
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అయినప్పటికీ ప్రతి విషయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు. అధికారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకొంటూ.. నిత్యం అధికార కార్యక్రమాల్లో దర్జా చూపుతుంటారు. ఎమ్మెల్యే ఉన్నా.. లేకున్నా.. తానే ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో, కార్యక్రమాల్లో ‘పల్లె సింధూరరెడ్డి’ అన్న బోర్డు కనిపించిన సీట్లో కూర్చుంటుంటారు. ప్రొటోకాల్ కోసం నానా తిప్పలు పడుతూ.. ఉనికి చాటుకునేయత్నం చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యే తరహాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎవరయినా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేకు ఏం తెలీదని.. రాజకీయాల గురించి ట్రైనింగ్ ఇస్తున్నానని లెక్చర్ ఇస్తుంటారు. తాజాగా మూడురోజుల క్రితం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వేదికపై కలెక్టర్ పక్కనే ఆసీనులయ్యారు. అయినా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఆయన్ను ఆక్షేపించలేదు. -
దర్పం.. పచ్చ పెత్తనం
సాక్షి, పుట్టపర్తి ప్రజాప్రతినిధులు కాదు... ఎలాంటి హోదా ఉండదు... కానీ ‘తెలుగు తమ్ముళ్లు’ అధికార దర్పంతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటూ హల్చల్ చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పాల్గొంటూ ప్రజాప్రతినిధులను మించి హడావుడి చేస్తున్నారు. ప్రతి పంచాయితీలోనూ జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. అధికారం చూపి అధికారులతోనే సలాములు కొట్టించుకుంటున్నారు. దీంతో గ్రాఉమ సచివాలయాల నుంచి ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసుల వరకూ ‘పచ్చ’ పెత్తనమే కొనసాగుతోంది. ఉనికి కోల్పోకుండా.. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలోని టీడీపీ నేతలు షాడో ఎమ్మెల్యేల అవతారమెత్తారు. తమ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. కొందరైతే అధికారులను ఇళ్లకే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. మరికొందరు అధికారిక సమావేశాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటుగా మార్చుకున్నారు. ఎమ్మెల్యే ఎవరైనానా.. అక్కడంతా వారిదే పెత్తనం అన్న చందంగా ప్రైవేటు ప్రచారం చేయించుకుంటున్నారు. అ‘ధర్మం’గా శ్రీరామ్ పెత్తనం.. ధర్మవరం నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. పెత్తనం మాత్రం పరిటాల శ్రీరామ్దే. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తలదూరుస్తూ..అంతా తానే అనేలా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరుతో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కూటమి ధర్మం పాటిస్తున్నామని చెబుతూ.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనసేన ఇన్చార్జ్ కూడా తన స్థాయిలో తాను పెత్తనం చేస్తున్నారు. మంత్రి అప్పుడప్పుడూ నియోజకవర్గానికి వస్తుండగా హడావుడంతా స్థానిక నేతలే చేస్తుండటంతో జనం కూడా ఏ పనికోసమైనా వారి వద్దకే వెళ్తున్నారు. మడకశిరలో పెత్తందారీ హవా.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో టీడీపీ ఇన్చార్జ్గా వ్యాపారవేత్త గుండుమల తిప్పేస్వామి ఉన్నారు. ఓ వైపు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన స్థానికేతరుడు ఎంఎస్ రాజు జనం దృష్టిలో, అధిష్టానం కంట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ ఎంఎస్ రాజు... చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుండగా... గుండుమల తిప్పేస్వామి మాత్రం ఎమ్మెల్యే స్థాయిలో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. పెత్తందార్లకు పెత్తనం కట్టాలనుకున్నప్పుడు తమకు రిజర్వేషన్ ఎందుకని వాపోతున్నారు. ‘పురం’లో పీఏల పెత్తనం.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపు చూపుగా హిందూపురం వస్తుంటారు. అయితే ఆయన అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. ఒకరు కాదు.. ఇద్దరు చాలరు.. అన్నట్లు ఏకంగా ముగ్గురు పీఏల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటూ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారం మాది... అడిగేవారెవరు అన్నట్లుగా ‘పచ్చ’ నేతలు రెచ్చిపోతున్నారు. సెటిల్మెంట్లు, భూదందాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. చివరకు అధికారిక కార్యక్రమాల్లోనూ దర్జా చూపుతున్నారు. ఎలాంటి హోదా లేకపోయినా.. కలెక్టర్ పక్కనే కూర్చుని ఫోజులిస్తున్నారు. తమ స్థాయి ఇదీ అంటూ చాటుకుంటున్నారు. ప్రొటోకాల్ను మరచిన అధికార యంత్రాగం కూడా ‘పచ్చ’ నేతలకే దండాలు పెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేతల దర్జా అధికారుల సమావేశాల్లో హడావుడి హోదా లేకున్నా జిల్లా సమీక్షలకు హాజరు కలెక్టరేట్ సమావేశాల్లోనూ పల్లె, పరిటాల హల్చల్ ప్రొటోకాల్ లేకుండా పక్కనే కూర్చున్నా పట్టించుకోని కలెక్టర్ హిందూపురం, మడకశిరలోనూ షాడో ఎమ్మెల్యేలు -
‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు ఉమ్మడి పోరాటం
బత్తలపల్లి: ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, నిరుపేదలకు మేలు చేసే ‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఉమ్మడి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉపాధిహామీ కూలీల హక్కుల కోసం సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలం కాటికోటేశ్వరక్షేత్రం నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తమ బృందంతో పాదయాత్రగా లింగారెడ్డిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా... వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం తాజా మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బత్తలపల్లి వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్సింగ్ గురియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తదితరులు మాట్లాడారు. వలసలు నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉపాధిహామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాపై భారం.. ఉపాధి చట్టం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రాంజీ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతుందని నేతలు అన్నారు. గతంలో ఉపాధి పథకానికి 90 శాతం నిధులను కేంద్రం అందించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందన్నారు. కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేసినప్పడే టీడీపీ సర్కార్ బిల్లులు సకాలంలో చెల్లించలేదని, ఇప్పుడు 40 శాతం నిధులివ్వాలంటే కష్టమేనన్నారు. దీనివల్ల మళ్లీ వలసలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల పని దినాలు కూడా కల్పించలేదన్నారు. గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించినట్లు వివరించారు. అందువల్ల పాత పద్ధతిలోనే ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జాతీయ కార్యదర్శి నిర్మల్, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, ఆవుల శేఖర్, బండి వెంకటేశ్వరరావు, వేమయ్య యాదవ్, మల్లికార్జున, రాజారెడ్డి, వలరాజు, నాసర్, సంతోష్కుమార్, యుగంధర్, చంద్ర నాయక్, కాటమయ్య, చలపతి, ముసుగు మధు, కదిరప్ప, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మహేష్నాయుడు, కోటి సురేష్కుమార్, గుర్రం శ్రీనివాసరెడ్డి, బండి వీరనారప్ప, షరాబ్ యోగానంద ఆచారీ, బగ్గిరి బయపరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, మాజీ సర్పంచులు అక్కిం దామోదర్, చెడిపోతుల గోపాల్, గొల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీబీ జీ రాంజీతో రాష్ట్రంపై పెనుభారం ఏన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. ప్రయోజనం లేదు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రకు మద్దతు -
మూల్యాంకనం పక్కాగా జరగాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల మేరకు పక్కాగా జరగాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను అడిగి తెలుసుకున్నారు. గడువులోపు మూల్యాంకనం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా మార్కులు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ కిష్టప్ప, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. డీఎస్పీ విజయ్కుమార్పై బదిలీ వేటు పుట్టపర్తి టౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్పై బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి డీఐజీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ను శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే పుట్టపర్తి డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. 17 నెలలుగా విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా పనిచేశారు. పలు అంశాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విదేశీయుల భూముల అంశం, కొత్తచెరువు హత్యకేసు, పేకాట అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
పూలే మార్గం అనుసరణీయం
● జయంతి వేడుకల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: సంఘ సంస్కర్త, కుల నిర్మూలన, సీ్త్ర విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మానవతావాది జ్యోతిరావు పూలే మార్గం అనుసరణీయని కలెక్టర్ శ్యాంప్రసాద్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టేకులోడు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విద్య ద్వారానే మార్పు సాధ్యమని నమ్మిన పూలే సీ్త్ర విద్య, బడుగుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడారన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్షను రూపుమాపడానికి ఫూలే ఆశయాలు, దార్శనికత నేటి తరానికి ఆదర్శమన్నారు. పూలే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా బీసీలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ నిర్వాహకుడు రాజేష్, దేవరాజ్లను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్, ఆర్డీఓ సువర్ణ, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పటివేత
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. వీటిని తహసీల్దార్, ఆర్డీఓకు అప్పగించినట్లు ఎస్ఐ వీరాంజనేయులు తెలిపారు. డైట్లో ఘనంగా ఫేర్ వెల్ డే పుట్టపర్తి: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ డే ఘనంగా జరిగింది. 2024–26 బ్యాచ్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ... తాను కూడా డైట్ కళాశాల విద్యార్థినేనని, కొంత కాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశానని గుర్తు చేశారు. ఏ ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్థి అని, వారి పని తీరు బాగుంటే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి బత్తలపల్లి: మండలంలోని డి.చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పాలమసి నారాయణస్వామి(59) గుండెపోటుతో మరణించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలోని బాలాజీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న ఆయన గురువారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించారు. కాగా, నారాయణస్వామికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నారు. నారాయణస్వామి మృతి చెందిన విషయం తెలియడంతో ఎంఈఓ సుధాకర్నాయక్తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనంతపురానికి తరలివెళ్లారు. నారాయణస్వామి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు● 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ప్రశాంతి నిలయం: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు, పథకాల అమలు ఉండాలని అధికారులకు 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. శుక్రవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాం ప్రసాద్తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వైద్యం, విద్య, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రస్తుత స్థితి గతులను కలెక్టర్ వివరించారు. పెనుకొండలో మెడికల్ కళాశాల పనులు జరుగుతున్నాయన్నారు. మధ్యాహ్న భోజనం సమగ్రంగా అందిస్తున్నారని, తాగునీటి పథకం పనులు కొనసాగుతున్నాయని, జిల్లాలోని 32 మండలాల్లో 2214 నివాస ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు 3899 పీడబ్ల్యూఎస్ స్కీములు, 4033 హ్యాండ్ పంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి 4,942 మంది నమోదు చేసుకోగా 1,130 ఇళ్లకు ఇన్స్టలేషన్ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర, ఆర్డీఓ సువర్ణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్మడకశిర: ఆంధ్రతో పాటు కర్ణాటకలోనూ చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఆంజనేయులు, చిన్నా ఉన్నారు. వీరిద్దరూ ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ చైన్స్నాచింగ్లకు పాల్పడేవారు. అలాగే పలు ఇళ్లలో చోరీలకు తెగబడ్డారు. ఇప్పటికే ఆంజనేయులుపై 45 కేసులు, చిన్నాపై 15 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర ప్రాంతంలో జరిగిన దొంగతనాలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం ఇద్దరినీ అరెస్ట్ చేసి, రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో సమావేశంలో మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్, అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య పాల్గొన్నారు. -
వెంగళమ్మచెరువు సొసైటీలో గోల్మాల్
పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంగళమ్మచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) లో గోల్మాల్ వెలుగు చూసింది. రైతులకు ఇచ్చే రుణాల్లో రూ.20లక్షలు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సొసైటీ పరిధిలో 500 మందికి పైగా రైతులు ఉండగా, వీరందరూ భూములను తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి ఏటా వడ్డీలు చెల్లించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సొసైటీలో ప్రతి ఏటా లాంగ్ టర్మ్ కింద రూ.1.5 కోట్లు, షార్ట్ టర్మ్ కింద రూ.3.5 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. క్లర్క్గా చేరి... సీఈఓగా ఎదిగి వెంగళమ్మచెరువు పంచాయతీలోని వీరాంజనేయపల్లికి చెందిన వెంకటాద్రి తొలుత ఈ సొసైటీలో క్లర్క్గా చేరాడు. కాలానుగుణంగా అదే సొసైటీకి సీఈఓగా అధికారులు నియమించారు. చాలా ఏళ్లుగా ఈ హోదాలనే ఆయన పనిచేశాడు. 2024 జూన్లో అతని పదవీ కాలం ముగిసింది. అయితే కోర్టుకు వెళ్లి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించుకోవడంతో పాటు సీఈఓ జీతం తీసుకుంటూ క్లర్క్గా విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతని పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. సీఈఓగా ఉన్నప్పుడే రైతులు చెల్లించే వడ్డీలను స్వాహా చేస్తూ వాటిని కప్పి పుచ్చుకునేందుకు క్లర్క్ గా అవతారమెత్తినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. వడ్డీపై అదనంగా వసూలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి రైతులు ఏటా మార్చి నుంచి జూన్ నెల లోపు రెన్యువల్ చేయిస్తుంటారు. ఇందుకుగాను గతంలో రసీదులను మాన్యువల్గా అందజేసేవారు. 2024 నుంచి ఈ ప్రక్రియను కంప్యూటరైజ్డ్ చేశారు. దీంతో అప్పటి నుంచి రసీదులు, బిల్లులు అన్నీ కంప్యూటర్ కాఫీలనే అందజేస్తున్నారు. అయితే వెంకటాద్రి నేటికీ మాన్యువల్ రసీదులను స్వయంగా సంతకం చేసి రైతులకు అందజేస్తున్నాడు. ఈ క్రమంలో వడ్డీకి అదనంగా డబ్బు రైతుల నుంచి వసూలు చేసి, బ్యాంక్కు కట్టే సమయంలో రుణానికి వడ్డీ మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాలను స్వాహా చేస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మాన్యువల్ రసీదు పుస్తకాలను సొసైటీలో ఉంచకుండా తన ఇంట్లో ఉంచుకుని మొత్తం కథ నడిపించినట్లుగా సమాచారం. దాటవేత ధోరణితో తప్పించుకుంటూ సీఈఓగా వెంకటాద్రి పదవీ కాలం ముగియగానే ఇన్చార్జ్ సీఈఓగా రవిశంకరరెడ్డిని నియమించారు. ఈ క్రమంలో చెల్లింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించిన ఆయన రైతులను నిలదీశారు. అయితే తాము వడ్డీలు చెల్లించామంటూ కొందరు రైతులు తమ వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను చూపడంతో స్వాహా పర్వం బయటపడింది. ఈ అంశంపై వెంకటాద్రిని సొసైటీ అధ్యక్షుడు శ్రీరామరెడ్డి, ఇన్చార్జ్ సీఈఓ నిలదీశారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నానంటూ విచారణకు సహకరించకుండా వెంకటాద్రి దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో రైతుల వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను సొసైటీ అధ్యక్షుడు తెప్పించుకుని వాటిని భద్రపరిచారు. 500 రసీదులకు గాను ప్రస్తుతం 100 వరకూ స్వాధీనం చేసుకోగా ఇందులోనే రూ.5 లక్షలకు పైగా స్వాహా అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన మొత్తం రూ.20 లక్షలకు పైగా గోల్మాల్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 51 ఎంకై ్వరీ కోరుతున్న రైతులు: సాధారణంగా వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తవకలు చోటు చేసుకుంటే ఆ శాఖకు చెందిన అధికారులు విచారణ చేపడతారు. అయితే వెంగళమ్మచెరువులో పెద్ద ఎత్తున అవతవకలు జరిగినా స్థానిక టీడీపీ నాయకులు, కో–ఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది మాత్రమే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ విచారణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. 51 ఎంకై ్వరీ చేపడితేనే అక్రమాలు బయటపడి తమకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు. రూ.20 లక్షలు స్వాహా రైతుల నుంచి ఏటా వడ్డీల రూపంలో వసూలు దొంగ రసీదులతో మాయ చేసిన మాజీ సీఈఓ విచారణకు సహకరించాలి వెంగళమ్మ చెరువు సొసైటీలో చోటు చేసుకున్న అక్రమాలపై రైతులు 51 ఎంకై ్వరీ కోరుతున్నారు. అయితే 51 ఎంకై ్వరీ అంటూ జరిగితే సొసైటీకి వచ్చే నిధులు ఆగిపోతాయి. దీంతో విచారణను సొసైటీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఈఓ, బ్యాంకు సిబ్బందినే చేయాలని సూచించాను. విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఈ విచారణకు వెంకటాద్రి పూర్తిగా సహకరించాలి. తన ఇంట్లో దాచిన రసీదు పుస్తకాలను తీసుకొచ్చి ఇవ్వాలి. – కృష్ణానాయక్, జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ) -
అక్రమ తవ్వకాలపై తనిఖీ
ముదిగుబ్బ: మండల పరిధిలోని చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను తహసీల్ధార్ మహేశ్వరరెడ్డి శుక్రవారం సీజ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తున్న చిత్రావతి నది నుంచి గతంలో ముదిగుబ్బ మండలం పీసీరేవు, తాడిమర్రి మండలం చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద మాత్రమే ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఓ ప్రజాప్రతినిధి భారీ యంత్రాలను ఉపయోగించి ఉప్పలపాడు సమీపంలోని చిత్రావతి నది నుంచి ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అంశంపై ‘చిత్రావతిలో ఇసుక దోపిడీ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం రెవెన్యూ సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇసుక తరలిస్తూ ఓ ట్రాక్టర్ పట్టుబడింది. అనంతరం ఉప్పలపాడు వద్ద ఉన్న ఇసుక డంప్లను తహసీల్దార్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు హిటాచీలను సీజ్ చేయకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ మహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హిటాచీలు ఉన్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని పేర్కొనడం విశేషం. -
ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం
పుట్టపర్తి టౌన్: స్థానిక గణేష్ కూడలి సమీపంలో ఉన్న షాదీమహల్లో శుక్రవారం సర్వేయర్ల సంఘం అధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్ హాజరై, రక్తదానం చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన సర్వేయర్లకు, రక్తదాతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే భూరికార్డులు అధికారి విజయశాంతి బాయి, ఐఓఎస్లు, డీఐఔస్లు, మండల, వార్డు సర్వేయర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఆపిల్ సాగు శుభపరిణామం గార్లదిన్నె: జిల్లాలో ఆపిల్ పంట సాగు చేయడం శుభపరిణామమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గార్లదిన్నె మండలం కోటంకలో రైతు రమణారెడ్డి సాగు చేసిన ఆపిల్ తోటను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పంట సాగు విధానాలపై రైతుతో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఆపిల్ మొక్కలు నాటాలని ఎవరూ తొందర పడరాదన్నారు. ముందుగా జిల్లాలో ఆపిల్ సాగుపై శాసీ్త్రయంగా ఉద్యానశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా విశ్లేషణ చేసిన తర్వాత ఆశాజనక ఫలితాలు వస్తే పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈరమ్మ, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఉద్యాన అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు. -
రీ టెండర్పై హైకోర్టు సీరియస్
కదిరి: ఖాద్రీశుడి ఆలయం ఎదుట టెంకాయలు విక్రయించుకునేందుకు నిర్వహించిన టెండర్ అంశం హైకోర్టుకు చేరింది. ఈ నెల 7న టెంకాయల విక్రయానికి ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి టెండర్ పిలవగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి రూ.31.21 లక్షలకు దక్కించుకున్నాడు. అదే రోజు ఆ మొత్తం డబ్బు డీడీ రూపంలో ఈఓకు అందజేశారు. అయితే అనంతరం ఆటెండర్ను రద్దుచేసిన ఈఓ ఈనెల 16న మరోసారి టెండర్ పిలిచారు. దీనిపై బాధితుడు చంటి తనకు జరిగిన అన్యాయంపై శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (నం.9847/2026) దాఖలు చేశారు. ఈ కేసును వెంటనే స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున గుడపాటి వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగిన కొబ్బరి కాయల వేలంపాట ప్రక్రియ మొత్తాన్ని ఆలయ అధికారులు వీడియో చిత్రీకరించి నిబంధనల మేరకే నిర్వహించారని కోర్టుకు విన్నవించారు. అందులో హెచ్చుపాటదారుడైన తన క్లయింట్ చంటికి తూర్పు రాజగోపురం వద్ద వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొబ్బరికాయలు అమ్ముకునేందుకు హక్కులు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటించారన్నారు. ఆలయ అధికారులు సూచించిన బ్యాంకులో ఆ నగదుకు సంబంధించి డీడీ తీసుకొని ఆలయ ఈఓకు అదే రోజు సకాలంలో అందజేసిన విషయాన్ని కూడా ఆ న్యాయవాది ఆధారాలతో కోర్టు ముందుంచారు. కేవలం ఓ ప్రజాప్రతినిధి మాటకు తలొగ్గి మళ్లీ టెండర్లు పిలుస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున నగారు నాగరాజు ఈ కేసులో వాదనలను వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి..ఈ నెల 16న రీ టెండర్ నిర్వహించాలని ఆలయ అధికారులు ప్రకటించినందున, ఈ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ కక్షతోనే... బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్రెడ్డికి ప్రధాన అనుచరుడైన చంటికి టెంకాయల విక్రయ టెండర్ దక్కడం స్థానిక ఎమ్మెల్యే కందికుంటకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే అదే రోజు బహిరంగ వేలంపాటలో రూ.27.20 లక్షలకు వేలం పాట పాడిన బీజేపీకే చెందిన దళిత మోర్చా నాయకుడు తలుపుల గంగాధర్కు ఆ టెండర్ కట్టబెట్టాలని ఆలయ ఈఓపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 7వ తేదీన జరిగిన టెండర్ను రద్దు చేసి ఈ నెల 16వ తేదీన మళ్లీ వేలంపాట నిర్వహిస్తామని ఆలయ ఈఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కందికుంట ఆదేశాల మేరకు ఈఓ టెంకాయల విక్రయానికి రీ టెండర్ పిలిచారని విష్ణువర్దన్రెడ్డి వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఓపై కలెక్టర్ సీరియస్! కొబ్బరి కాయల టెండర్ను రద్దు చేసి, మళ్లీ ఎందుకు టెండర్ పిలవాల్సి వచ్చిందని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సీరియస్ అయినట్లు తెలిసింది. హైకోర్టు దీన్ని అత్యవసర కేసుగా పరిగణిస్తూ లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించిందంటే ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ మండిపడినట్లు సమాచారం. ‘నీ ఇష్టానుసారం వ్యవహరించడానికి ఇదేమైనా నీ సొంత ఆస్తి అనుకున్నావా? లేదంటే మీ అత్తగారి ఆస్తి అనుకున్నావా?’ అని సీరియస్గా మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. కోర్టుకు చేరిన కదిరి టెంకాయల పంచాయితీ రీ టెండర్పై హైకోర్టును ఆశ్రయించిన చంటి లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించిన కోర్టు రాజకీయ ఒత్తిడితోనే రీ టెండర్ పిలిచారన్న న్యాయవాది కేసును ఈ నెల 15కు వాయిదా వేసిన న్యాయమూర్తి -
ఉక్కపోత.. పుస్తకాల్లేక..
పరీక్షలు ముగియగానే హమ్మయ్యా... అంటూ ఊపిరి పీల్చుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం మళ్లీ పరీక్ష పెడుతోంది. ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించే వారికి ‘ప్రత్యేక తరగతులు’ అంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా ఎండలు దంచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు చెబుతుండగా.. విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పుట్టపర్తి: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం విషమ పరీక్ష పెట్టింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో ‘ప్రత్యేకం’ అంటూ తరగతుల నిర్వహిస్తోంది. భానుడి భగభగలతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. కానీ ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఈ అవకాశం ఇవ్వలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రత్యేక తరగతులంటూ హింసపెడుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్లాసులు నిర్వహిస్తోంది. పుస్తకాల పంపిణీ చేయకుండా తరగతులు నిర్వహిస్తుండటంతో అధ్యాపకులు ఏం చెబుతున్నారో విద్యార్థులకు తెలియడం లేదు. అందరికీ ఇబ్బందే.. మార్చి నెలాఖరు వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సేదదీరుతున్నారు. చాలా మంది బంధువుల ఊళ్లకు వెళ్లేందుకు, శీతల ప్రదేశాల్లో విహరించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా మంది ప్రత్యేక తరగతులకు హాజరు కావడం లేదు. ప్రత్యేక తరగతుల సమయం మార్చాలని ఇదివరకే అధ్యాపకులు నిరసనకు దిగారు. అయినా చంద్రబాబు సర్కార్ వెనక్కు తగ్గలేదు. భారీగా పడిపోయిన హాజరు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేటు కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు 11,737 మంది ఉన్నారు. ఇందులో బాలికలు సుమారు 6,197 మంది ఉన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని కళాశాలలకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా ఆ తర్వాత బస్టాండుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లే బస్సు ఎక్కాలంటే గగనంగా మారుతోంది. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం పుస్తకాలు కూడా ఇవ్వకుండా పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తరగతులకు కనీసం 10 శాతం మంది కూడా హాజరు కావడం లేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు ఎండలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు భారీగా పడిపోయిన హాజరుశాతం -
డెడ్ స్టోరేజీకి చేరువలో ’పీఏబీఆర్’
కూడేరు: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీరు అందించే పీఏబీఆర్ (పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ నీటి మట్టం పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, రిజర్వాయర్ భద్రతా దృష్ట్యా 5.5 టీఎంసీలకు మించి ఇరిగేషన్ అధికారులు నీటిని నిల్వ ఉంచడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు డ్యాంలో 5 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడం, కుడికాలువ ద్వారా 49 చెరువులను నింపడం, అనంత, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తుండడంతో శుక్రవారం నాటికి డ్యాంలో 2.6 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. ఈ క్రమంలో మరో 30, 40 రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుడి కాలువకు నీటి సరఫరాను త్వరలో నిలిపి వేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కృష్టా జలాలను ఎలాంటి ఖర్చు లేకుండా పీఏబీఆర్కు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కుప్పం ప్రాంతానికి తరలించడంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో రిజర్వాయర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటంతో తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అచ్చెన్నా.. తీరు మార్చుకో
చిలమత్తూరు: వాస్తవాలు తెలుసుకోకుండా నీచంగా మాట్లాడడం సరికాదని, ఈ విషమంగా మంత్రి అచ్చెన్నాయుడు తన తీరును మార్చుకోవాలంటూ హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక హితవు పలికారు. ఆంబోతులా వ్యవహరించడం మానుకోవాలన్నారు. తల పొగరుతో నీచంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అధికారం కోసం ఛండాలపు పనులు చేసే టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజామోదంతోనే నాడు మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎం అయ్యారని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజల మనసులు గెలిచి సీఎం అయ్యారన్నారనే విషయం మరువరాదన్నారు. తన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొవడమే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడినని చెప్పుకునే చంద్రబాబులా దొడ్డి దారిన ముఖ్యమంత్రి కావాలని ఏనాడూ వైఎస్సార్ కుటుంబం ఆలోచన చేయలేదన్నారు. 2009లో మహానేత మరణం తర్వాత ఆయన తనయుడు సీఎం కావాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులేనని స్వయానా ప్రస్తుతం కాంగ్రెస్లోనే కొనసాగుతున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, తెలంగాణా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అయినా అచ్చెన్నాయుడు కేవలం చంద్రబాబు మెప్పు కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. దానిని యథాతథంగా ప్రసారం చేసి ప్రజలను పచ్చమీడియా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ కారిడార్ తెర మీదకు రావడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ, వైఎస్సార్ మరణంపై తల పొగరుతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ప్రజల దృష్టి మళ్లించే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. ఎందుకు ఇలాంటి బతుకు బతుకుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికై నా టీడీపీ నేతలు మారాలని, అభివృద్ది అంటే అమరావతి ఒక్కటే కాదనే విషయాన్ని గుర్తించి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని నోటికి వచ్చినట్లు తమ నాయకుడిని మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆంబోతులా వ్యవహరించడం సరికాదు ప్రజామోదంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్ ‘పురం’ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక -
‘సీమ’ లిఫ్ట్ అత్యంత అవశ్యం
అనంతపురం: కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత అవశ్యమని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. అలాంటి కీలకమైన సాగు–తాగునీటి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని గండికొట్టడంపై మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపివేతతో ‘సీమ’ ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్ట్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల పూర్తి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామన్నారు. ● ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్లు – సమాలోచన’ అనే అంశంపై శుక్రవారం అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రేటర్ రాయలసీమ టాస్క్ఫోర్స్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్నాథ్రెడ్డి, కేవీ రమణ తదితరులు మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలని, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తితో పాటు పలు అంశాలపై తీర్మానం చేశారు. పోరు ఉధృతం బాబు ఆలోచన సరైంది కాదు రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. సీమకు తీరని ద్రోహం రాయలసీమ ఎత్తిపోతల పాజెక్టు పూర్తి చేస్తేనే ఉమ్మడి అనంతకు సాగు–తాగునీరు రూ.10వేల కోట్ల ఖర్చుతో పెండింగ్ నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు హంద్రీనీవా కాలువ వెడల్పు, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తికి తీర్మానం జల సాధన పోరుబాటకు సిద్ధం కావాలి రౌండ్టేబుల్ సమావేశంలోవైఎస్సార్సీపీ నేతల పిలుపుప్రాజెక్టులను పరిరక్షించుకోవాలి రాయలసీమలో పుట్టిన ప్రతి బిడ్డ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ సంస్థను అమరావతికి తీసుకెళ్లారు. బడ్జెట్లలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నయాపైసా కేటాయించలేదు. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వై ఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త -
మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు
ఇంటర్ ద్వితీయ సంవత్సం ప్రత్యేక తరగతులకు మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. చదవడానికి పుస్తకాలు లేవు. మరోవైపు ఎండలు భయపెడుతున్నాయి. కాలేజీలో ఉండలేక పోతున్నాం. ప్రభుత్వం సెలవులు ఇస్తే ఆనందంగా ఇంటికి వెళ్తాం. సార్లు చెప్పిన పాఠాలు పుస్తకాల్లో చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. – తరుణ్, అమడగూరు విద్యార్థుల కోసమే తరగతులు విద్యార్థుల కోసమే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. పుస్తకాల కోసం ఇప్పటికే ఇండెంట్ పంపాము...త్వరలోనే వస్తాయి. – చెన్నకేశవప్రసాద్, డీఐఈఓ -
నేడు పూలే జయంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించడానికి తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం చేసినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియార్టీ జాబితాను మూడోసారి డీఈఓ బ్లాగ్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా రాతపూర్వకంగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అప్పేపల్లి, కాకి గ్రామంతో పాటు దొమ్మరహట్టి గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్ను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలరించి పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులంతా ఆలయ సమీపంలోని పాలబావిలో గంగ పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రత్నగిరిలోని ఎస్సీ కాలనీ వాసుల జ్యోతుల ఉత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు ● మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి యత్నం ● చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ తరుముకుంటూ వెళ్లిన వైనం నల్లచెరువు: సహజ వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు చివరకు మట్టినీ వదలడం లేదు. చెరువుల నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు టీడీపీ నేతలు మండలంలోని అల్లుగుండు గ్రామ సమీపంలోని పాలకమ్మ చెరువు నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ అక్కడకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న వారు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ సమాచారాన్ని ఫోన్ చేసి తెలపడంతో దాదాపు 30 మందికి పైగా టీడీపీ గూండాలు పాలకమ్మ చెరువు చేరుకుని గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. ‘‘అధికారపార్టీ నేతలమైన మమ్మల్నే అడ్డుకుంటారా.. రండి రా.. చూసుకుందాం.. ప్రాణాలు తీస్తాం.. జాగ్రత్త’’ అంటూ.. చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ ప్రజలను తరుముకుంటూ వెళ్లారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఘటనపై శుక్రవారం ఉదయం తహసీల్దార్ రవినాయక్ను కలిసి ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. మరోవైపు నీటి పారుదల శాఖ ఏఈ ఆదెమ్మ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి అక్రమ తవ్వకాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
● వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. రొళ్ల మండలం టీడీ పల్లి, హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతండా, రొళ్లకొండ, అలుపనపల్లి, ఎ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల నుంచి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. అమ్మవారి మూలవిరాట్ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రత్నగిరి రాజవంశీకులు కుటుంబ సమేతంగా జ్యోతులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో రాజవంశీకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కూడా వివిధ గ్రామల నుంచి జ్యోతులను తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. -
వేధింపులకు వివాహిత బలి
పెనుకొండ రూరల్: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం దుద్దేబండ గ్రామంలో స్థిరపడిన కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన పాలూరి రమేష్ కుమార్తె అనూష (21)కు గత ఏడాది నవంబర్ 2న గొల్లపల్లికి చెందిన బోయ రాజేష్తో వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబ సభ్యులకు కట్నం కింద 8 తులాల బంగారం కోరడంతో పెళ్లి సమయంలో 2.8 తులాలు, రెండేళ్ల తర్వాత 4.2 తులాలు మొత్తం 8 తులాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమకు తెలియకుండా అనూష కుటుంబసభ్యులు బంగారాన్ని మార్చారంటూ అత్తింటి వారు అనుమానంతో ఆమెను వేధిస్తూ వచ్చారు. మిగులు బంగారాన్ని కూడా తీసుకురావాలని ఒత్తిడి చేయసాగడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అనూషను పుట్టింటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న అనూష గురువారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ నర్శింగప్ప, సీఐ రాఘవన్, తహసీల్దార్ స్వాతి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. భర్త రాజేష్, అత్త జయలక్ష్మి, మామ రామాంజనేయులు వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు కియా ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుంతకల్లు టౌన్: ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లులోని శ్రీనివాసనగర్కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్.. నీట మునిగిపోయాడు. బాలుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని నీట మునిగిన సుదీప్ను వెలికి తీసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చిత్రావతిలో ఇసుక దోపిడీ
ముదిగుబ్బ: సహజ వనరుల దోపిడీని ఆదాయ వనరుగా మార్చుకున్న కూటమి నాయకులు చిత్రావతిని తూర్పారబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు భారీగా తగ్గి సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధే ఇసుకాసురుడు! చిత్రావతి నది ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తుంది. గతంలో ముదిగుబ్బ మండలంలో పీసీరేవు, తాడిమర్రి మండలంలో చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. కానీ ఓ ప్రజాప్రతినిధి ఉప్పలపాడు సమీపంలో భారీ యంత్రాలను ఉపయోగించి చిత్రావతిని ఇష్టానుసారం తవ్వేస్తున్నాడు. టిప్పర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ దందా గురించి తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రజలు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. అక్రమానికి ‘ఉమ్మడి ఒప్పందం’ కూటమిలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు ఓ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం పంపకాలు చేసుకొని ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కూటమి నేతలు ధనదాహంతో చిత్రావతి నుంచి ఇష్టానుసారం ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని నది సమీప ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి చిత్రావతి నది నుంచే ముదిగుబ్బ మండలంలోని పలు గ్రామాలతో పాటు కదిరి ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో చిత్రావతి ఎండిపోయి నీరు సరఫరా చేయలేకపోతే వేలాది మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు భేఖాతరు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా నిరంతరం తవ్వకాలు జరిపి వాల్టా చట్టానికి తూట్టు పొడుస్తున్నారు. నదిలో పరిమితికి మించి తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కూటమి నాయకుల కనుసన్నల్లోనే అక్రమ దందా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ప్రజల ఆవేదన నిఘా ఉంచుతాం చిత్రావతి నుంచి ఇసుక అక్రమ తరలింపు విషయం మా దృష్టికి రాలేదు. ఇసుక తరలింపుపై సమాచారం వస్తే దాడులను నిర్వహించి చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా చిత్రావతి నది నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – అమీర్ బాషా, మైనింగ్ ఏడీ -
పులి మాస్క్ ధరించి చోరీ
పామిడి: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఓ కళ అని నిరూపించాడు ఓ దొంగ. పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఏకంగా పులి మాస్క్ ధరించి దుకాణంలో చొరబడి నగదుతో పాటు విలువైన వస్తువులను అపహరించుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే... పామిడిలోని మెయిన్ బజార్లో రఫీ అనే వ్యక్తి జీఎస్ఆర్ పేరుతో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత 15 రోజులుగా దుకాణంలోని వస్తువులు, నగదు మాయమవుతుండడాన్ని గమనించిన ఆయన ఇటీవల సీసీ కెమెరాలను అమర్చాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి మరోసారి చోరీ జరిగింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన దుకాణదారుడు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి అవాక్కయ్యాడు. పాతికేళ్ల లోపు వయసున్న యువకుడు రెయిన్కోట్ ధరించి, ముఖానికి పులి మాస్క్తో దుకాణంలో తిరుగాడుతూ విలువైన సరుకులు, నగదు అపహరించడాన్ని గమనించి విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శివశంకరనాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉత్సాహంగా దున్నపోతుల రాతిదూలం పోటీలు కణేకల్లు: చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ మైదానంలో గురువారం దున్నపోతుల రాతి దూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలకు మొత్తం ఏడు జతల దున్నపోతులను రైతులు తీసుకువచ్చారు. ఉదయం 10 నుంచి సాయంకాలం వరకూ సాగిన ఈ పోటీల్లో రైతు దాదాకు చెందిన దున్నపోతులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే రైతు కురబ నాగరాజు దున్నపోతులు ద్వితీయ స్థానం, రైతు లాలుస్వామి దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నపోతుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ చంద్రమౌళి, జూనియర్ అసిస్టెంట్ మారుతి, మాజీ వైస్ సర్పంచ్ ఆనంద్, మార్కెట్ యార్డు డైరెక్టర్ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. అప్పు చెల్లించలేదని దాడి పెనుకొండ రూరల్:అప్పు చెల్లించలేదంటూ ఓ వ్యక్తిపై వడ్డీ వ్యాపారులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం గుట్టూరుకు చెందిన ముక్తియార్ ధర్మవరానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో గురువారం ధర్మవరం నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు.. ముక్తియార్ కుటుంబసభ్యులు గౌస్బాషా, శర్మష్, జుబేర్, ఇమ్రాన్పై దాడి చేశారు. ఘటనలో గౌస్బాషా, శర్మాష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కియా ఎస్ఐ రాజేష్ తెలిపారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు : కలెక్టర్ప్రశాంతి నిలయం: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుతో పాటు అబివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఇదే అంశంపై గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 6 ప్రాధాన్యత పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ ఆస్తులను సంరక్షిస్తూనే ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. -
తలసేమియా కేంద్రం ప్రారంభం
అనంతపురం: నగరంలోని పాతూరులో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెడ్క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్ను డీఆర్వో మలోల గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెడ్క్రాస్ చైర్మన్ ఈ.రామారావు, రాష్ట్ర వైస్ చైర్మన్ రామచంద్ర రాజు, అనంతపురం జిల్లా చైర్మన్ కాపు భారతి, జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ పాల్గొన్నారు. రెడ్క్రాస్ తలసేమియా కేంద్రానికి ఆర్థిక, వస్తు సాయం చేసిన దాతలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన తలసేమియా బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రక్తదాన శిబిర నిర్వాహకులు, వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, విద్యార్థులు, సమాజ సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ.రామారావు మాట్లాడుతూ... తలసేమియా బాధిత చిన్నారులకు సేవ చేయడమనేది అతిపెద్ద మానసిక ప్రశాంతత కలిగించే కార్యక్రమమన్నారు. రెడ్క్రాస్ కాకినాడ తలసేమియా కేంద్రంలో రక్త మార్పిడి చేసుకుంటున్న పిల్లల్లో కొందరు ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారని గుర్తు చేశారు. రామచంద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తరపున త్వరలో ఇంపోర్టెడ్ లింబ్స్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తలసేమియా కేంద్రం చాలా బాధ్యతతో కూడుకున్న కార్యక్రమమని జిల్లాలో ప్రముఖ పిల్లల డాక్టర్లు శ్రీనివాసులు, రఘువంశీ వంటి వారు ఈ కేంద్రంలో సేవా చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ పరిణామం అని కొనియాడారు. డీఆర్వో మలోల మాట్లాడుతూ.. రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జన్యు సంబంధిత తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రెడ్క్రాస్ రక్త మార్పిడి, మందులు, ఇతరత్రాలను పూర్తి ఉచితంగా అందించేలా ప్రణాళిక చేయటం చాలా సంతోషకరమన్నారు. యూపీఎస్సీ ఫ్లాగ్ షిప్ పరీక్ష రేపు అనంతపురం అర్బన్: ఈ నెల 12న జిల్లాలోని రెండు కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ప్లాగ్ షిప్ (ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఎ) పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ–1 (సీడీఎ) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ ఆకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ–1(ఎన్ఏ) పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్స్పెక్టింగ్ అధికారులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు టి.పద్మావతి, రామ్మోహన్, రూట్ అధికారులుగా డ్వామా పీడీ సలీమ్బాషా, మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నపత్రాలకు కస్టోడియన్గా డీఆర్వో మలోల ఉంటారన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ధేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే చేరుకోవాలని, అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. మద్యం తాగి వ్యక్తి మృతి అనంతపురం సెంట్రల్: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురంలోని శారదానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను ఉమానగర్కు చెందిన ఆదిశేషయ్య(45)గా వన్టౌన్ పోలీసులు గుర్తించారు. కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆదిశేషయ్య గురువారం శారదనగర్లోని ఓ మద్యం షాపులో పూటుగా మద్యం తాగాడు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద మత్తులో పడిపోయాడు. అపస్మారక స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికుల సమాచారంతో వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
గోవిందరెడ్డికి కన్నీటి వీడ్కోలు
● ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు మడకశిర రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మెళవాయి గ్రామంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మడకశిర ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్థార్ కళ్యాణచక్రవర్తి, సీఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ సోమశేఖర్రెడ్డి, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, బంధువులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయికి జైలు శిక్షహిందూపురం: చెల్లని చెక్కులకు సంబంధించి రెండు కేసుల్లో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రమణయ్య తీర్పు వెలువరించారు. వివరాలు.. హిందూపురం పట్టణానికి చెందిన సరోజాబాయి, పవిత్రకు ష్యూరిటీ కింద చెక్కులు ఇచ్చి చెరో రూ.5 లక్షలు వంతున బద్రి ఫైనాన్స్ నిర్వాహకుడు ఎంఎన్ఎస్ మణి అప్పు చేశాడు. నిర్ణీత గడువు ముగియడంతో ఆ చెక్కులను వారు క్యాష్ చేసుకునేందుకు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అయితే మణి ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు కాస్త చెల్లకుండా పోయాయి. దీంతో వారిద్దరూ సీనియర్ న్యాయవాది సి.రామచంద్రారెడ్డి ద్వారా న్యాయస్థానంలో కేసులు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను విచారించిన న్యాయమూర్తి రమణయ్య... నేరం రుజువు కావడంతో ముద్దాయి ఎంఎన్ఎస్ మణికి ఆరు నెలల జైలుశిక్ష తోపాటు రూ.5 లక్షల వంతున జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై తాను ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు ముద్దాయి అనుమతి కోరగా... బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. -
ఫాదర్ ఫెర్రర్కు ఘన నివాళి
బత్తలపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరితపించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కు పలువురు ఘన నివాళులర్పించారు. ఫాదర్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని గురువారం బత్తలపల్లిలోని ఫీల్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, స్పెయిన్ దేశస్తులు సంజీవ్ సంఘ్వాన్, యమున దంపతులు హాజరయ్యారు. ముందుగా ఫాదర్ ఫెర్రర్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా అన్నే ఫెర్రర్ మాట్లాడారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్దరణతో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం జిల్లా వాసులు సాగించిన పోరాటాలను కొనియాడారు. 57 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చివరకు రెన్యూవల్ పునరుద్దరించిందన్నారు. కష్ట సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శుక్రవారం అన్నే ఫెర్రర్ పుట్టిన రోజు కావడంతో ముందస్తుగానే ఆమెకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. రాత్రి 9 గంటలకు మారుతీ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్డీ హనుమంతప్ప, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్లు పాల్, అక్బర్, మనోరంజన్, దశరథరామయ్య, హరి, శర్మ, రీజనల్ ఇంజనీర్ మధుసూదన్, ఆసుపత్రి ఇన్చార్జ్ హనుమంతరెడ్డి, సీబీఆర్ సెంటర్ మేనేజర్ రామకృష్ణ, సీబీఆర్ ఎస్టీఎల్ అంకాల్కుమార్, సోషల్ వర్కర్ లక్ష్మణ్, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
పుట్టపర్తి టౌన్: తీవ్ర ఒత్తిళ్ల మధ్య పని చేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాలు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అధికార యంత్రాంగం సంయుక్తంగా పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీ మహల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని గురువారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే పని తీరు కూడా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో డీఐపీఆర్ఓ భరత్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెఎస్ మధుసూదన్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచన -
రాయలసీమ భవిష్యత్తు కోసం ‘సీమ’ నేతలు పిడికిలి బిగించి ఏకమవుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంపై భగ్గుమంటున్నారు. ఆరునూరైనా ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభతో పాటు
సాక్షిప్రతినిధి అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలపై రెండు ప్రభుత్వాలకు హక్కు లభించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం జలాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ప్రారంభించింది.శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తోడేసేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఈక్రమంలో ‘సీమ’ నష్టపోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పేరుతో రూ.3,850 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన హయాంలో రూ.990 కోట్ల విలువైన పనులు చేపట్టి బిల్లులు కూడా చెల్లించేశారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ను నిలిపేయాలని చంద్రబాబును ఆదేశించడం, బాబు అందుకు ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే! ఈ విషయాన్ని రేవంత్ స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ కోసం గ్రేటర్ రాయలసీమ నేతలు ఉద్యమిస్తున్నారు. ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అనంతపురంలో గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించ తలపెట్టారు. కీలకమైన ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డి, అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయకర్తలు హాజరు కానున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ఎందుకంటే.. శ్రీశైలం ప్రాజెక్టును ‘సీమ’వాసుల త్యాగాలతో 1981లో నిర్మించారు. 2003–04 వరకూ రోజుకు 11 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి ‘సీమ’కు తరలించేవారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 7 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించవచ్చు. 2004 వరకూ 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ‘సీమ’ బాగు గురించి ఆలోచించలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఎంతమంది అడ్డుపడినా ఖాతరు చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశారు. రాష్ట్రం విడిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మొదటికొచ్చినట్లైంది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నపుడే రోజుకు 2 టీఎంసీలు తరలించుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టింది. కృష్ణాజలాలు శ్రీశైలం చేరుకోక ముందే రోజుకు 8 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టులు నిర్మించింది. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం సామర్థ్యం కూడా 129 టీఎంసీల నుంచి 229 టీఎంసీలకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇదే జరిగితే ‘సీమ’ ఎడారిగా మారే పరిస్థితి. పైగా శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు, అంతకు తక్కువ ఉంటే పూర్తిస్థాయి నీటిని తీసుకోలేం. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతిరెడ్డిపాడు దిగువన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈర్ష్యతో కేసులు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందని, తన రాజకీయ మనుగడే ప్రమాదంలో పడుతుందనే ఈర్ష్యతో మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ సానుభూతి పరులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో చంద్రబాబు కేసులు వేయించారు. ఈ క్రమంలో అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతి ఉందని, ఆ ప్రాజెక్టుల కిందే చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్లో అప్పటి ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఓవైపు ఎన్జీటీ అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు పనులను పరుగులు పెట్టించింది. 2024 మే వరకూ వేగంగా పనులు జరిగాయి. అప్పటికి రూ.990 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. సాకారమైతే సస్యశ్యామలం.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. తాగునీటి కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు మరింత మేలు జరుగుతుంది. హంద్రీ–నీవా ఫేజ్–1లో ‘అనంత’లో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–2లో 90,235 ఎకరాలు ఉంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో ఫేజ్–2లో 2.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–1, 2 కింద ఉమ్మడి ‘అనంత’లో 4.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 40 టీఎంసీలకుపైగా నీరు అవసరం. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే ఫేజ్–2లోని వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని హంద్రీ–నీవాకు గాలేరు–నగరి ద్వారా నీరు అందిస్తారు. దీంతో అనంత నుంచి ఆ రెండు జిల్లాలకు కృష్ణా జలాలు పంపాల్సిన అవసరం ఉండదు. ఆ నీటిని మనమే వాడుకోవచ్చు. 4.11 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించవచ్చు. అనుకున్నంత నీటిని హంద్రీ–నీవా ద్వారా తీసుకురాలేకపోవడంతో ఏటా చెరువులకు మళ్లించడం మినహా డిస్ట్రిబ్యూటరీలు చేసి ఆయకట్టుకు అందించడం లేదు. 40 టీఎంసీలు మనమే తీసుకునే పరిస్థితి వస్తే చెరువులతో పాటు ఉప, పిల్ల కాలువలు నిర్మించి పొలాలకు నీరు పారించుకోవచ్చు. బాబు దగాపై బిగుస్తున్న పిడికిలి రాయలసీమ లిప్ట్ సాధన కోసం ఏకమవుతోన్న ‘సీమ’ నేతలు, ప్రజలు నేడు అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో సమావేశం ‘సీమ’ను సుభిక్షం చేసేందుకు రూ.3,850 కోట్లతో పనులు చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులతో కేసులు వేయించి ఆపించిన చంద్రబాబు -
12న ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
లేపాక్షి: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సీఈటీ) నిర్వహిస్తున్నట్టు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ చందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5వ తరగతికి, 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్, అలాగే వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, హాల్టికెట్, అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పాఠశాల కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆమె సూచించారు. గ్యాస్, రేషన్ పంపిణీ పక్కాగా జరగాలి ప్రశాంతి నిలయం: జిల్లాలో గ్యాస్, రేషన్ పంపిణీ పారదర్శకతతో పక్కాగా జరగాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో పౌరసరఫరాల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ డోర్ డెలివరీ చేయాలని, బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సిలిండర్లు అందించాలన్నారు. అలాగే డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కమర్షియల్ సిలిండర్లను ప్రాధాన్యతా క్రమంలో పాఠశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు అందించాలన్నారు. రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6–ఏ కేసులు నమోదు చేయాలన్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, పలువురు డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. -
బూతురాతల రాధాకృష్ణను అరెస్టు చేయండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ పెనుకొండ రూరల్: ‘కొత్త పలుకు’ పేరుతో చెత్తరాతలు రాసి వైఎస్సార్ సీపీ నేతల భార్యలను తీవ్రంగా అవమానించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో రాధాకృష్ణ రాసిన రోత రాతలను నిరసిస్తూ గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. వీకెండ్ కామెంట్స్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఛానల్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే రాధాకృష్ణ తానో జర్నలిస్టునన్న విషయం కూడా మరచిపోయారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పవిత్రమైన భార్య, భర్తల బంధాన్ని తప్పు పట్టే విధంగా వర్ణించడం దుర్మార్గమన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా...కూటమి పెద్దలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, గజేంద్ర, నరసింహమూర్తి, మండల మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, నాయకులు ఎన్. నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పితే పోరుబాటే
● 12వ పీఆర్సీ నియమించాలి ● 30 శాతం ఐఆర్ వెంటనే ఇవ్వాలి ● ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్ పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పితే తామంతా పోరుబాట పట్టక తప్పదని ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విడతల వారీ ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులు గురువారం కొత్తచెరువులోని పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్రెడ్డి, కార్యదర్శి గౌస్ లాజంతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు పవన్కళ్యాణ్ కూడా ఉపాధ్యాయులకు అలవిగాని హామీలిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించడంతో పాటు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు కోశాధికారి గోపాల్, డిప్యూటీ కార్యదర్శి చంద్ర, సమీఉల్లా, గోపాల్ నాయక్, జాఫర్ హుస్సేన్, వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఆ సంఘ నేతలు ప్రకాశ్రెడ్డి, మస్తాన్, వెంగమ నాయుడు, యూటీఎఫ్ నేతలు రామకృష్ణనాయక్, లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ, ఏపీటీఎఫ్ నేత అశోక్కుమార్, ముత్యాలప్ప, రాజశేఖర్ పాల్గొన్నారు. -
తీర్థయాత్రికులకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 1 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలతో విశాఖ, హైదరాబాద్ నుంచి రైళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ● కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం, తంజావురు, అరుణాచలంతో దివ్య దక్షిణ యాత్ర (ఎస్సీజెడ్జీ 60) ఈ నెల 27న ప్రారంభమై మే 4న వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్ ధర రూ.14,700 ఉంటుంది. విశాఖపట్నంలో రైలు బయలుదేరి తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంట జంక్షన్ల మీదుగా వెళ్తుంది. ● హరిద్వార్–మాతా వైష్ణోదేవి–రిషికేష్ యాత్ర (ఎస్సీజెడ్బీ 57) మే 12న ప్రారంభమై మే 21 వరకు సాగుతుంది. ఒకరికి సాధారణ టికెట్ ధర రూ.16,500, 3 ఏసీ ధర రూ.25,700, 2 ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. సికింద్రాబాద్లో బయలుదేరే రైలు భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, బల్హర్ష, వార్తా నాగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ● ఈ రైళ్లలో సౌకర్యాల్లో భాగంగా బస్సు, హోటల్తో మూడు పూటలా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు. ప్రమాద బీమా, కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు రైళ్లలో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. టికెట్ను విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి బుక్ చేసుకునే ప్రయాణికులు 9281495847, 9281495848, 9281030748 నంబర్లకు, హైదరాబాద్ నుంచి బుక్ చేసుకునే వారు 9701360701, 9281030727, 7670900698 నంబర్లకు సంప్రందించాలని అధికారులు సూచించారు. -
రోత రాతలపై మహిళాగ్రహం
సాక్షి, పుట్టపర్తి జర్నలిస్టు ముసుగులో మహిళల గురించి దిగజారుడు రాతలు రాసిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. భార్యకు, చెల్లికి తేడా లేకుండా నీచంగా మాట్లాడిన రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం మహిళలను కించపరిచేలా విధంగా కథనాలు ప్రచురించిన రాధాకృష్ణ... తన దిగజారుడు తనాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని.. కానీ రాధాకృష్ణ పాత్రికేయ వృత్తిని అడ్డు పెట్టుకుని బ్రోకరిజం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే రాధాకృష్ణ వైఎస్సార్సీపీ మహిళలను కించపరిచేలా వార్తలు ప్రచురించారన్నారు. హిందూపురంలో... రాధాకృష్ణ దిగజారుడు జర్నలిజాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో... వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్కు వినతిపత్రం అందజేశారు. మడకశిరలో... ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించ పరుస్తూ చేసిన వ్యాఖ్యలపై మడకశిరలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్మవరంలో... ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మహిళలు మండిపడ్డారు. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు, జయమ్మ, సానె వరలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే దిగజారుడు రాతలపై నిరసనలు, ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ -
కందికుంట అరాచకం!
కదిరి: దేశవ్యాప్తంగా డా.బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే కదిరిలో మాత్రం కందికుంట రాజ్యాంగం అమలవుతోంది. తన స్వార్థం కోసం ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బంది పెట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అరాచకంగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం.. అనే రీతిలో చెలరేగిపోతున్నారు. నిబంధనల ప్రకారం రెండు రోజుల క్రితం జరిగిన కొబ్బరి కాయల టెండర్ తాను చెప్పిన వారికి కాకుండా మరో వ్యక్తి దక్కించుకోవడంతో దాన్ని రద్దు చేయించి రీటెండర్ పిలవాలని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యేనే ఆర్డర్ వేయడంతో ఏం చేయాలో తెలియని ఈఓ ఆ టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల మేరకు టెండరు ఖరారు.. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తూర్పు గోపురం ఎదుట కొబ్బరి కాయలు విక్రయించుకునేందుకు ( 2027 మార్చి వరకు) ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ–టెండర్తో పాటు సీల్డ్ టెండర్, అలాగే బహిరంగ వేలం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంటి సీల్డ్ టెండర్ ద్వారా రూ.31.21 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇదే టెండర్ కోసం అదే పార్టీకి చెందిన దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు తలుపుల గంగాధర్ ప్రయత్నించినప్పటికీ ఆయన రూ.27.20 లక్షలకు మాత్రమే బహిరంగ వేలంలో తన పాటను ఆపేయడంతో నిబంధనల ప్రకారం హెచ్చుపాట దారుడైన చంటికి ఆలయ అధికారులు టెండర్ను ఖరారు చేశారు. అదే రోజు ఆలయ అధికారులు సూచించిన మేరకు చంటి ఆ మొత్తాన్ని డీడీ రూపంలో ఈఓకు అందజేశారు. రద్దు చెయ్.. లేదంటే సెలవుపై వెళ్లు! తనకు వ్యతిరేకంగా ఉన్న విష్ణువర్దన్రెడ్డి వర్గీయులకు టెంకాయల విక్రయ టెండర్ ఎలా కట్టబెడతారని ఆలయ ఈఓను ఎమ్మెల్యే కందికుంట బూతులు తిట్టినట్లు విష్ణు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ టెండర్ రద్దు చేయకపోతే సెలవుపై వెళ్లిపోవాలని కందికుంట హుకుం జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. న్యాయంగా, నిబంధనల మేరకు జరిగిన టెండర్ను చంటి దక్కించుకున్నారని. ఆయన కోసం అవసరమైతే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళతామని విష్ణువర్దన్రెడ్డి వర్గం చెబుతోంది. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని వారంటున్నారు. ఆగని ఆధిపత్యపోరు.. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి కదిరిలో తనకు వ్యతిరేకంగా పని చేశాడని స్థానిక ఎమ్మెల్యే కందికుంట ఆయనపై కోపంగా ఉన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు రాతపూర్వకంగా కందికుంట ఫిర్యాదు చేసినట్లు ఇటీవల సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మీడియా ముందు ఆ లెటర్ను బయట పెట్టారు. వారిద్దరి మధ్య గత రెండేళ్లుగా కోల్డ్వార్ నడుస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో తనను తేరుపైకి రాకుండా కందికుంట హౌస్ అరెస్ట్ చేయించారని విష్ణు ఆరోజు బహిరంగంగా ఆరోపించారు. కొబ్బరి కాయల టెండర్ను కూడా రూ.4 లక్షలు తక్కువకు పాడిన గంగాధర్కు కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఎలా చెబుతారని విష్ణు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో మహిమ గల కదిరి లక్ష్మీ నరసింహ స్వామితో రాజకీయం చేసిన వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధాస్తారని వారు హెచ్చరిస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుడి ఆదాయానికి గండి కొడతారా? అని భక్తులు ఆగ్రహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా కొబ్బరి కాయల టెండర్ పిలవకుండా జాప్యం చేస్తూ స్వామివారి ఆదాయానికి ఇప్పటికే భారీగా నష్టం తెచ్చారని భక్తులు మండిపడుతున్నారు. పగిలిన ‘అసమ్మతి’ టెంకాయ ఏకపక్షంగా నృసింహాలయ కొబ్బరికాయల టెండర్ రద్దు ఈఓపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించిన ఎమ్మెల్యే! ఈ నెల 16న మరోసారి వేలంపాట టెండర్ రద్దు వాస్తవమే ఈ నెల 7వ తేదీన జరిగిన కొబ్బరి కాయల టెండర్పై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అందుకే వేలం షరతుల్లో పేర్కొన్న వరుస నంబర్ 17ను అనుసరించి ఆ టెండర్ను రద్దు చేస్తున్నాం. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో కొత్తగా మళ్లీ వేలం పాట నిర్వహిస్తాం. –శ్రీనివాసరెడ్డి, ఖాద్రీ ఆలయ ఈఓ -
యూరియా కలిపిన నీరు తాగి గొర్రెల మృతి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో బుధవారం యూరియా కలిపిన నీరు తాగి 13 గొర్రెలు మృతిచెందాయి. స్థానికులు తెలిపిన మేరకు పట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన గొర్రెలను మేపు కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళుతూ.. మార్గ మధ్యంలో దాహమేసిన గొర్రెలు పరుగు తీస్తూ ఓ పొలం వద్ద యూరియా కలిపిన బకెట్లోని నీటిని తాగేశాయి. దీంతో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని కాపరి వాపోయాడు. పట్నం పశు వైద్యాధికారి డాక్టర్ సునీత సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధుడి ఆత్మహత్యఅమరాపురం: అనారోగ్యం తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అమరాపురంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిక్కాటప్ప (80) మంగళవారం రాత్రి తన కుమారుడు మల్లికార్జున ఇంట్లో భోజనం ముగించుకుని గేదెల కొట్టం వద్దకు నిద్రించేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున మాజీ సర్పంచ్ గోవిందప్ప పొలంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కడుపునొప్పి, మూత్రాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవాడని, ఈ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యంహిందూపురం: మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ చంద్రాంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం నుంచి ఆస్తికలు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మృతురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆలయంలో వెండి కిరీటం అపహరణ శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలోని అంబేడ్కర్ నగర్లో వెలసిన రామస్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వారి వెండి కిరీటంతో పాటు 5 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లిన పూజారి గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
యుద్ధ నివారణపై దృష్టి సారించని మోదీ
పుట్టపర్తి టౌన్: ‘తాను విశ్వ గురువు అని, తనకంతా తెలుసు’ అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ.. పశ్చిమాసియా యుద్ధ నివారణపై కృషి చేయకపోవడం బాధాకరమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. మొదటి రోజు సమావేశాలకు బీవీ రాఘవులు హాజరై పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతికి, ప్రశాంతతకు, సామరస్యానికి నిలయమైన పుట్టపర్తిలో యుద్ధాల గురించి చర్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఇరాక్ను సర్వనాశనం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తుంటే.. శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితేనే యుద్ధాన్ని విరమిస్తామని ఇరాక్ అంటోందన్నారు. శతాబ్దాలుగా మనకు ఇరాక్ చౌకగా ముడి చమురును సరఫరా చేస్తోందన్నారు. అలాంటి దేశం నాశనం అవుతుంటే యుద్ధ నివారణకు భారత్ ముందు వరసలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ దేశాల తరపున శాంతికి ప్రధాని మోదీ మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ సీట్లు పెంపుతో మరింత బలపడేలా దృష్టి సారించిందన్నారు. అయితే రిజర్వేషన్లు, సీట్లు పెంచాలన్నా మొదటగా 2026 జనగణన పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ దిశగానే కేంద్రం ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల సంస్కరణలకు సీపీఎం పోరాటాలు సాగిస్తుందన్నారు. కేరళలో తిరిగి లెఫ్ట్ప్రంట్ అఽధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని ఏర్పాటు అంశంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు -
పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి
పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్శాఖ ప్రతిష్ట పెంచాలని హోంగార్డులకు రాయలసీమ రీజియన్ ఇన్చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో బుదవారం నిర్వహించిన హోంగార్డుల ఒక రోజు పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అనంతరం త్వరలో తమిళనాడులో జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే హోంగార్డులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ వలి, ఆర్ఎస్ఐ ప్రదీప్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. రాయలసీమ రీజియన్ ఇన్చార్జ్ హోంగార్డుల కమాండెంట్ మహేష్ కుమార్ -
స్వాతంత్య్ర సమరయోధుడు మెళవాయి గోవిందరెడ్డి కన్నుమూత
● నేడు అంత్యక్రియలు మడకశిర రూరల్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) కన్నుమూశారు. మడకశిర మండలంలోని తన స్వగ్రామం మెళవాయిలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. గురువారం ఉదయం మెళవాయి గ్రామ శివారున ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గోవిందరెడ్డి 1942లో విద్యార్థి దశలోనే శ్రీరామరెడ్డి, కల్లూరు సుబ్బారావు, నీలం సంజీవరెడ్డితో కలసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం పలు ఉద్యమాల్లో ఆయన పాలుపంచుకుంటూ వచ్చారు. ఆయన సేవలకు గుర్తుగా స్వాతంత్య్రనంతరం కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరగిన 75 ఏళ్ల స్వాతంత్య్రదినోత్సవంలో గోవిందరెడ్డిని అప్పటి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కాగా, గోవిందరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, ఈరన్న, సేవామందిర విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీదర్, విశ్రాంత జడ్జి శివలింగేగౌడ్, మాజీ సర్పంచులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు జగన్నాథ్రెడ్డి, వేమారెడ్డి, రామచంద్ర,శివానంద్, వివిధ సంఘాల నాయకులు వేర్వేరుగా మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
మహిళా రైతుకు సత్కారం
ప్రశాంతి నిలయం: చియా సాగుతో అద్భుత ఫలితాలు సాధించిన అమడగూరు మండలం జౌకుల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవిని కలెక్టర్ శ్యాం ప్రసాద్లో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. 1.30 ఎకరాల విస్తీర్ణంలో బైబ్యాక్ విధానం కింద చియా సాగు చేపట్టినట్లు వివరించారు. 11.03 క్వింటాళ్ల దిగుబడి సాధించడంతో క్వింటా రూ.14 వేలు చొప్పున రూ.1.54 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. పెట్టుబడుల పోను రూ.1.39 లక్షలు మిగిలినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఏఓ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయండి ప్రశాంతినిలయం: ఈ నెల 23 వరకూ జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన పోషణ పక్వాడ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. అంగన్వాడీలను బలోపేతం చేయడం, తల్లీబిడ్డల ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, జంక్ ఫుడ్తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. 0–6 ఏళ్ల పిల్లలకు ఆటల ఆధారిత విద్య, సృజనాత్మకత, స్క్రీన్ టైం తగ్గించి బహిరంగ ఆటలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం, డీసీపీఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ దుర్మరణం పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అమరాపురం మండలం విరుపసముద్రం గ్రామానికి చెందిన రవికుమార్ (38)కు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఆ గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం మడకశిరకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో పావగడ తాలూకా గౌడేటి గ్రామంలో మంగళవారం జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంపై వచ్చిన రవికుమార్... రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. దొమ్మతమరి గ్రామ పరిధిలోని ఎల్లగానిగుట్ట ప్రాంతంలో ప్రయాణిస్తుండగా రోడ్డు తగ్గు ప్రదేశంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో రోడ్డుపై పడిన రవికుమార్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. వృద్ధాప్యంలో తమ బాగోగులు ఎవరు చూసుకుంటారంటూ తల్లి అంజినమ్మ రోదించిన తీరు చూపరులను కంటి తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న జేడీఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, ఆర్సీ అంజినప్ప, తిమ్మారెడ్డి, బలరామరెడ్డి, ఎన్ఏ ఈరణ్ణ తదితరులు ఆస్పత్రికి చేరుకుని రవికుమార్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణంకనగానపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం కొండ్రెడ్డిబావి గ్రామానికి చెందిన రైతు కె.రంగారెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తూ అతి కష్టంపై కుమారుడు మధుసూదన్రెడ్డి (25)ని ఏబీఏ వరకు చదివించారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తల్లికి మోకాళ్ల ఆపరేషన్ కోసమని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తండ్రితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న మధుసూదన్రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో తల్లికి వైద్య సేవలు అందించేందుకు వచ్చే ట్రైనీ నర్సుతో (కర్నూలుకు చెందిన యువతి) మధుసూదన్రెడ్డి పరిచయమై ప్రేమగా మారింది. మూడు, నాలుగు నెలల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ యువతి తనను తప్పించుకుని తిరుగుతుండటంతో మధుసూదన్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటి వద్దనే పడుకున్న మధుసూదన్రెడ్డి... అర్ధరాత్రి సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో కర్నూలుకు చెందిన యువతి తనను ప్రేమించి మోసం చేసినట్లుగా రాసి ఉంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఎం.రిజ్వాన్ తెలిపారు. -
భక్తిపారవశ్యం.. జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. రత్నగిరితో పాటు గుడ్డగుర్కి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవికి గ్రామస్తులు జ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అలంకరణలో లక్ష్మీదేవి.. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారి మూలవిరాట్ను, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో విశేషంగా అలంకరించారు. సుప్రభాత సేవ మొదలుకుని అంకురార్పణ, అభిషేకం, కుంకుమార్చన పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో కనిపించిన అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చల్లంగ చూడు తల్లీ.. సాయంత్రం మహిళలు నియమనిష్టలతో జ్యోతులను సిద్ధం చేసుకుని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ తిరిగి గర్భగుడిలోని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అందరినీ చల్లంగ చూడు తల్లీ అంటూ ప్రార్థించారు. జ్యోతుల ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మొక్కుబడుల్లో భాగంగా అమ్మవారికి పొట్టేళ్లు, మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సాయంత్రం విందు భోజనాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు, వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలో ఉన్నవారు కూడా ఉత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కిక్కిరిసిన రత్నగిరి.. లక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన జ్యోతుల ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో రత్నగిరి గ్రామం కిక్కిరిసిపోయింది. గ్రామంలోని ఏ ఇళ్లు చూసినా బంధువులతో కళకళలాడుతూ కనిపించింది. ఇక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. గాజుల అంగళ్ల వద్ద మహిళలు, చిన్నారులు రద్దీ పెరిగింది. గ్రామస్తులు స్నేహితులు, బంధువులకు గాజులు వేయించి ముచ్చట తీర్చుకున్నారు. నేడు వివిధ గ్రామాల్లో జ్యోతుల ఉత్సవాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం టీడీ పల్లి, హెచ్ఎం పల్లి, వన్నారనపల్లి, హులీకుంట, బాజయ్యపాళ్యం, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, హొట్టేబెట్ట, దాసప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, వన్నప్పపాళ్యం, అలుపనపల్లి, ఏ.గొల్లహట్టి, దొమ్మరహట్టి, రొళ్లకొండ తదితర గ్రామాల్లో అమ్మవారికి జ్యోతుల నిర్వహించనున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. సంప్రదాయ కట్టు, బొట్టుతో మహిళలు... వివిధ పుష్పాలతో అలంకరించిన కలశాలు.. వాటిపై అమ్మవారి కోసం వెలిగించిన జ్యోతులు.. డప్పు దరువులు.. భక్తుల ఆనందోత్సాహాల నడుమ రత్నగిరిలో భక్తిపారవశ్యం ఉప్పొంగింది. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. వైభవంగా మహాలక్ష్మీదేవి జ్యోతుల ఉత్సవం వందలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి జ్యోతులను సమర్పించిన మహిళలు -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
ధర్మవరం: జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ రోతరాతలు రాసిన రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ నీచపురాతలను ఖండిస్తూ బుధవారం పట్టణంలోని పీఆర్టీ సర్కిల్లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డివారి రాజశేఖర్రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు శీలం విష్ణువర్దన్, వినయ్ తేజ్గౌడ్, మండల అధ్యక్షుడు బిల్లే శ్రీనివాసులు, నాయకులు పోతుకుంట రామ్మోహన్రెడ్డి, హరీష్, సూర్యప్రతాప్రెడ్డి, ప్రవీణ్, బన్నీ తదితరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... వైఎస్ జగన్ చెప్పిన ‘మావిగన్’ కార్యరూపం దాలిస్తే తమకు జరగబోయే నష్టాన్ని ఊహించుకుని భయపడిన కూటమి నేతలు... ఏబీఎన్ రాధాకృష్ణతో వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై నీచపు రాతలు రాయించారని మండిపడ్డారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం -
ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు అన్యాయం చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించుకుపోవడంతో పాటు అస్మదీయ కాంట్రాక్టర్లకు భారీఎత్తున లబ్ధి చేకూర్చడానికే హంద్రీ–నీవా లైనింగ్ పనులు చేపట్టారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడంతో చుట్టుపక్క
ఆత్మకూరు/ కనగానపల్లి: చంద్రబాబు ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయించి సమీపంలో భూగర్భజలాలు అడుగంటేలా చేస్తూ రైతులకు కన్నీళ్లు మిగిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం ఉమ్మడి జిల్లా ప్రజలకు శాపంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా నీటిని సాఫీగా తీసుకెళ్లాలని కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే కాంక్రీట్తో లైనింగ్ చేస్తే నీరు ఆగకుండా ముందుకెళ్లిపోతాయి. సమీప ప్రాంతాల్లో నీరు ఇంకి భూగర్భజలాలు పెంపొందే అవకాశం లేకుండా పోతుంది. ఇలా చేయడం వల్ల తమకు నీటి ముప్పు తప్పదని రైతులు ఆందోళనలు చేసినా పెడ చెవిన పెట్టారు. రైతుల గోడు పట్టించుకోకుండా కాంక్రీట్ లైనింగ్ చకాచకా చేసేశారు. పనులు జరిగిన ఏడాదిలోపే రైతుల భయం నిజమైంది. భూగర్భజల మట్టం పడిపోయింది. క్రమేణా బోరుబావుల్లో నీరు తగ్గిపోయింది. కళ్లెదుటే కాలువలో నీళ్లు పోతున్నా ఉపయోగం లేకుండాపోయింది. రెండు ఇంచుల నీరు వచ్చే బోర్లు కూడా ఇప్పుడు రెండు ఎకరాలను తడపలేని పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాలువ పక్కనే బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా బయటకు రాలేదంటున్నారు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేకపోతున్నారు. దీంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడంతో వేగంగా ముందుకు వెళ్తున్న నీరు కాలువ పక్కనే బోరు వేసినా చుక్కనీరు పడని దృశ్యం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ భూమిలో ఇంకని నీళ్లు.. అడుగంటిన బోర్లు నీరందక పంటలు నిలువునా ఎండుతున్న వైనం కాలువ సమీపంలో బోర్లు వేసినా చుక్కనీరు పడని వైనం నీరందక బీళ్లుగా మారిన పొలాలు... లబోదిబోమంటున్న రైతులు -
పరిస్థితి తారుమారైంది
ఇది వరకు కాలువలో నీరు పారేటప్పుడు సమీపంలోని భూముల్లో నీరు ఇంకేవి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా వచ్చేవి. కానీ హంద్రీ– నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడంతో పరిస్థితి తారుమారైంది. బోరు బావుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. మా గ్రామానికి చెందిన ఒక రైతు కాలువ పక్కనే నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడలేదు. పచ్చగా ఉన్న భూములు కాస్తా ‘కాంక్రీట్ లైనింగ్’ పుణ్యమా అని బీళ్లుగా మారిపోతున్నాయి. – సుధాకర్రెడ్డి, రైతు, వై.కొత్తపల్లి, ఆత్మకూరు మండలం -
అపరాల సాగును ప్రోత్సహించాలి
ప్రశాంతి నిలయం: వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటలతో పాటు తక్కువ సమయంలోనే పంట చేతికొచ్చే కొర్ర, జొన్న, సజ్జ, అపరాల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కదిరి ప్రాంతంలో విజయవంతమైన ‘చియా’ సాగును జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ‘చియా’ సాగు పెరిగితే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఫారంపాండ్ల ప్రాముఖ్యతను వివరించి ప్రతి రైతూ తన పొలంలో నిర్మించుకునేలా వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. వ్యవసాయాధికారులు వారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్ర పర్యటనలు చేసి రైతులకు పంటల సాగులో సాంకేతిక తోడ్పాటును అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణాన్ని మరో 10 శాతం అధికం చేయాలని, ప్రతి అధికారి తమ పరిధిలో 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో మామిడి, దానిమ్మ, అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలన్నారు. యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ సమాచారం కోసం ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, కోఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు. ‘చియా’ సాగు విస్తీర్ణం పెంచాలి ఖరీఫ్ సన్నద్ధతపై సమీక్షలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
హంస వాహనంపై ఊరేగిన చౌడేశ్వరీదేవి
ఓడీచెరువు(అమడగూరు): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి రథం ఆలయం నుంచి బయలుదేరి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ మంగళవాయిద్యాల నడుమ సాగింది. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. కార్యక్రమానికి గాజులపల్లికి చెందిన జి.శాంతమ్మ, రాంమూర్తి, హర్షిత, నితిన్, లావణ్య, తేజస్, రామలక్ష్మమ్మ, బాలకృష్ణలు కార్యనిర్వహకులుగా వ్యవహరించారు. విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణాకటాక్షలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఇంటర్ మూల్యాంకనం పూర్తి పుట్టపర్తి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో బుధవారం పూర్తయ్యిందని డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని మూల్యాంకన క్యాంపునకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,09,708 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తర్వాత బుధవారంతో మార్కుల నమోదు పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రమంతటా మూల్యాంకనం ఈనెల 8, 9 తేదీల్లో పూర్తవుతుందని, ఫలితాలు 12న వెలువడే అవకాశం ఉందన్నారు. అలాగే మూల్యాంకనంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు పగడ్బందీగా చేపట్టారన్నారు. అందరి సహకారంతో గడువులోపు క్యాంపు పూర్తి చేశామన్నారు. -
కూలీలకు నీడ, నీరు కల్పించాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం పుట్టపర్తి: వీబీజీ రామ్జీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రాంతంలో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన బుక్కపట్నం సమీపంలోని కువ్వకొండ ప్రాంతంలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన ఖండిత కందకాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే ప్రాంతంలో తప్పనిసరిగా మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. అడిగిన కూలీలందరికీ పనులు కల్పించాలన్నారు. జిల్లాలో 77 వేల మందికి పనులు కల్పించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 19 లక్షల పని దినాలను పూర్తి చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ శ్యాంప్రసాద్ గునపం పట్టి మట్టి తవ్వారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ విజయ్ప్రసాద్, క్లస్టర్ ఏపీడీ రమేష్బాబు, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, ఈసీ మంజునాథ్, సిబ్బంది ఉన్నారు. మాతాశిశు మరణాలను నివారించాలి : కలెక్టర్ప్రశాంతి నిలయం: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పీజీఆర్ఎస్ హాలులో వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేయాలన్నారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై గ్రామ స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ ఓపీ నిర్వహించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. ఎన్సీడీ సర్వే వేగవంతం చేయాలన్నారు. అర్హత లేని చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు. రీ సర్వే పక్కాగా నిర్వహించాలి : జేసీఓడీచెరువు(అమడగూరు): ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రక్రియ పారదరర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గడువు లోపు సర్వే పూర్తి చేసి పాసుబుక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట తహసీల్దార్ మారుతీప్రకాష్, మండల సర్వేయర్, వీఆర్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వీడాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన అమడగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. త్వరలో కంప్యూటర్ ఆపరేటర్తో పాటు అన్ని గ్రామాలకు వీఆర్ఓలను నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ మారుతీప్రకాష్,ఆర్ఐ రామకృష్ణారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు -
పంటంతా ఎండిపోయింది
కనగానపల్లి మండలం పాతపాళ్యం కొత్తూరుకు చెందిన రైతు వెంకటరామిరెడ్డి రబీ సీజన్లో బోరుబావి కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. అప్పుడు వ్యవసాయ బోరుబావిలో నీరు పుష్కలంగా వచ్చేవి. కొద్దిరోజులుగా నీరు తగ్గుముఖం పడుతూ వచ్చింది. సక్రమంగా నీరందకపోవడంతో పంటంతా ఎండిపోతోంది. హంద్రీ–నీవా కాలువకు 150 మీటర్ల దూరంలోనే పొలం ఉన్నా.. కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. రైతు చేసేది లేక పంటను దున్నేసి పశువులకు మేతగా వాడుకుంటున్నాడు. దాదాపు రూ.3 లక్షల వరకు విలువైన పంట దిగుబడులు కోల్పోవాల్సి వచ్చింది. -
రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజం
చిలమత్తూరు: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జర్నలిజం చేయడం లేదని బ్రోకరిజం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. మంగళవారం వారు పార్టీ శ్రేణులతో కలిసి హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చెప్పిన ‘మావిగన్’ అమలులోకి వస్తే పరిస్థితి ఏమిటని భయపడిన కూటమి నేతలు ఏబీఎన్ రాధాకృష్ణతో వైఎస్సార్సీపీ నేతల భార్యలపై నీచపు కథనాలు, రోత రాతలు రాయించారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోతరాతలు క్షమించరాని నేరంమడకశిర: ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై మడకశిరలో మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ అని, మహిళలను కించ పరిచే విధంగా రోత రాతలు రాయడం క్షమించరాని నేరమన్నారు. వెంటనే రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, మండల మాజీ కన్వీనర్ రామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణరెడ్డి, పట్టణ కార్యదర్శి అంజలి, పట్టణ ఉపాధ్యక్షుడు గోపి, మాజీ కౌన్సిలర్ అన్సర్, పట్టణ నాయకులు ధను, నగేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రంగనాథ్, లక్ష్మీనారాయణ, వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఆర్కేను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ -
జగన్ హయాంలోనే మహిళలకు పెద్దపీట
చిలమత్తూరు: మహిళలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలకంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కువ అవకాశాలు కల్పించారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం హిందూపురం పట్టణంలోని సరిగమ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి అధ్యక్షతన మహిళా విభాగం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, జోనల్ విభాగం అధ్యక్షురాలు విజయ మనోహరి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రోజుకు 4 నుంచి 5 హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 60 –70 మంది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో మహిళలను సామాజికంగా , రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. రాజకీయంగా మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. గతంలో పథకాలన్నీ మహిళల పేరుపైనే ఇస్తూ ఆర్థికంగా బలీయంగా మార్చారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తుండటంతో 87 ఎమ్మెల్యే సీట్లు, 13 ఎంపీ సీట్లు రాబోతున్నాయన్నారు. మావిగన్ పై భయంనే ఏబీఎన్ రాధాకృష్ణ నీచపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నేతల భార్యలపై నీచపు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. బీసీశాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పింఛన్ ఇప్పించలేకపోయిన సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. అన్యాయం చేస్తున్న కూటమి నేతలకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెనుకొండ నియోజకవర్గ పరిశీలకురాలు మధుమతిరెడ్డి, మహిళా విబాగం నేతలు గాజుల శ్వేతారెడ్డి, మహిళా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలిచ్చారు హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం మహిళా సదస్సులో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి -
ఆడిట్ చేస్తే అవినీతి తేలుతుంది
ఒకప్పుడు ఇళ్ల ముందు పశువులు, గేదెలు, ఊరు ఆనుకొని గొర్రెలు, మేకల మందలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటికి మేతతో పాటు తాగడానికి నీళ్లు కూడా లేవు. దిక్కుతోచని పరిస్థితుల్లో సంతలకు తోలుకెళ్లి తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. నీటి తొట్టెల పథకం నీరుగారిపోయింది. ఆడిట్ చేస్తే అందులో జరిగిన అవినీతి బయటపడుతుంది. – జైనుల్లా, రైతువిభాగం జిల్లా నాయకులు, వైఎస్సార్సీపీ, కదిరి చర్యలు తీసుకుంటాం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలు నిర్మించాం. ఇంకా కొన్ని నిర్మించాల్సి ఉంది. స్థానికంగా కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే నిర్మించిన తొట్టెల్లో నీరు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలదే. ఎక్కడైనా నీరు నింపలేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. – విజయ ప్రసాద్, డ్వామా పీడీ -
వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు
కదిరి టౌన్: వైఎస్సార్సీపీ నేతల భార్యలను కించపరుస్తూ తన పత్రికలో తప్పుడు రాతలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సీఐ వి.నారాయణరెడ్డికి ఫిర్యాదు ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, నాయకులు మాట్లాడుతూ... సభ్యసమాజం తలదించుకునే విధంగా అత్యంత జుగుప్సాకర భాషతో వైఎస్సార్సీపీ నేతలను తిడుతూ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్లో కాలమ్ రాశారన్నారు. దాన్నే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో కూడా ప్రసారం చేశారన్నారు. తక్షణమే పేపర్, ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యమన్నారు. డబ్బా చానల్ పెట్టుకొని ముఖ్యమంర్రి చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు రవికుమార్రెడ్డి, మణికంఠనాయక్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్రెడ్డి, నాయకులు రమేష్యాదవ్, రామచంద్ర, భాస్కర్, సదాఖత్, సమీర్ఖాన్, షకిల్, ఎయెసానా తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
గుడిబండ: ‘మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలి. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. మహిళలు అనేక వ్యాపారాలు చేయడం.. లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉంది’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధలోని కరెకెర గ్రామంలో పర్యటించి పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, కొర్రమీను చేపల పెంపకం కేంద్రాన్ని, పాల డెయిరీ, ఆక్వా యూనిట్ను సందర్శించారు. అనంతరం జిల్లాలోనే తొలిసారిగా కరికెర గ్రామంలో ‘భర్తన్ బ్యాంక్’ను (స్టీల్ సామాన్ల బ్యాంక్) ప్రారంభించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కరికెర గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటి సారిగా కరికెర గ్రామంలో భర్తన్ బ్యాంక్ను ఏర్పాటు చేశామన్నారు. కరికెర గ్రామంలో మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమన్నారు. తర్వాత కరికెర గ్రామానికి చెందిన పాల డెయిరీ నిర్వహిస్తున్న లక్ష్మమ్మ ముచ్చటించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, అదనపు సీఈఓ వెంటసుబ్బారెడ్డి, ఎంపీడీఓ కేశవరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీకి నోటీసులు పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డీఆర్డీఏ పీడీ నరసయ్యకు నోటీసులు జారీ చేశారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన వి.గంగాధర్ ఓ విషయమై 2024 అక్టోబర్ 21న సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు పీడీకి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 16న వర్చువల్గా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధిపుట్టపర్తి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందాం.. ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దామని డీఎంహెచ్ఓ ఫైరోజబేగం పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఆహారపు అలవాట్లు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నాగేంద్రనాయక్, డీఈఎంఓ సుబ్రహ్మణ్యం, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, ఏపీ ఎన్జీఓ అసోషియేషన్ నాగేంద్ర, బాబా ఫకృద్దీన్, డిప్యూటీ హెచ్ఈఓ రామలక్ష్మి, ఏఎంఓ లక్ష్మీనాయక్ శివరాం, దేవేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా జలధి ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జలధి, గంగ పూజను ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూల విరాట్ను పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాన్ని పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత సమీపంలోని పాలబావి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చారు. గంగా జలంలో అమ్మవారి విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. అమ్మవారికి కట్టిన వడి బియ్యం, గాజులు, పండ్లు, పూలు, కొత్త దుస్తులు ఇతరత్ర వాటిని నైవేద్యంగా పాలబావికి సమర్పించారు. తిరిగి ఉత్సవ విగ్రహాన్ని యథావిధిగా ఆలయ ప్రాంగణంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు జ్యోతులను ఊరేగింపుగా తీసుకుచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి జ్యోతుల ఉత్సవాలు మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వివిధ గ్రామాల వారి ఆధ్వర్యంలో అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. రోజుకో గ్రామం చొప్పున చుట్టు పక్కల గ్రామాల వారు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. -
దళితుల ప్రాణాలంటే లెక్కలేదా బాబూ?
● ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు అనంతపురం టవర్క్లాక్: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా జరుగుతున్నాయి. అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దళితుల ప్రాణాలంటే లెక్కలేదా?’ అంటూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు అన్నారు. మంగళవారం స్థానిక పాతూలోని గిరిజన భవన్ లో మాదిగల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సువర్ణ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రమూ స్పందించడం లేదన్నారు. దళితులకు అండగా ఉంటానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నేడు కేవలం అగ్రవర్ణాల వారికి అండగా ఉంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరిగి నష్టపోయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. అగ్రవర్ణాల వారు నష్టపోతే వారికి పరిహారం అందిస్తున్నారని, దళితులవి మాత్రం ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. దళిత నాయకుడు టీఎం రమేష్ను అత్యంత కిరాతకంగా కొందరు హత్యచేస్తే ఇప్పటిదాకా ఆ కుటుంబానికి చిన్న సాయమూ అందలేదన్నారు. మాదిగల పెద్దబిడ్డనవుతానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు నేడు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ న్యాయం చేసి ప్రజల మన్నన పొందారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి చేయి చూపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో జెన్నే చిరంజీవి, సాకే ఓబులేసు, జయప్రకాష్, రామాంజినేయులు, సుదర్శన్, గిరిజన సంఘం నాయకులు మల్లి కార్జున నాయక్ పాల్గొన్నారు.


