breaking news
Sri Sathya Sai
-
ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం
ప్రసంగిస్తున్న ఎంపీ ప్రేమచంద్రన్సంగీత కచేరీ నిర్వహిస్తున్న బాలవికాస్ చిన్నారులు ప్రశాంతి నిలయం: కేరళీయుల పవిత్రంగా ఆచరించే ఓనం వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత కేరళ సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లం ఎంపీ ఎన్కె.ప్రేమ చంద్రన్ ప్రసంగిస్తూ.. ఓనం పర్వదిన విశిష్టతను, సత్యసాయి నిస్వార్థ సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలన్నారు. అనంతరం శ్రీశైలానికి చెందిన శ్రీసత్యసాయి విద్యాపీఠం విద్యార్థులు ‘‘ది పాథ్ ఆఫ్ ట్రూ డివోషన్’’పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. శబరి భక్తి ప్రపత్తులను వివరిస్తూ అద్భుతంగా ఆడిపాడారు. -
‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
● డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఎస్పీ రత్న వెల్లడి హిందూపురం: చవితి రోజున మండపాల్లో కొలువై పూజలందుకున్న వినాయకుడి గంగఒడికి చేరే అపురూపఘట్టం ఆసన్నమైంది. వినాయక చవితి ఉత్సవాలకు జిల్లాలోనే పేరుగాంచిన హిందూపురంలో గురువారం గణేశుడి నిమజ్జనం అట్టహాసంగా సాగనుంది. ఇప్పటికే అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న హిందూపురంలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ ఎస్పీతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 33 మంది సీఐలు, 63 మంది ఎస్ఐలు, 170 మంది ఎఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, 316 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 49 మంది మహిళా పోలీసులు, 210 మంది హోం గార్డులతో పాటు 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, స్పెషల్ పార్టీ పోలీసులు... ఇలా మొత్తంగా 1,000 మంది నిమజ్జనం విధుల్లో ఉంటారని ఎస్పీ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా హిందూపురంలో ట్రాఫిక్ మళ్లించామని, ఈ విషయాన్ని వాహన చోదకులు, ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల్లోపు శోభయాత్రకు సిద్ధంకావాలి గురువారం ఉదయం పదిగంటలల్లోపు అన్ని మండపాల నుంచి వినాయక విగ్రహాలు శోభాయాత్రకు బయలుదేరాలన్నారు. ఇందుకు గణేష్ మండపాల నిర్వహకులు సహకరించాలని ఎస్పీ రత్న కోరారు. నిమజ్జనం చేసే కోనేరు వద్దకు రాకుండా పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.డిసెంబర్ 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష పుట్టపర్తి అర్బన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీనివాసులరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల్లోపు ఉండాలన్నారు. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు www.bse.ap.gov.inల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలన్నారు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఎస్బీఐ లింక్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
29 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకూ 233.8 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా చిలమత్తూరు మండలంలో 28.2 మి.మీ, అమడగూరు మండలంలో 20.2 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇక అమరాపురం మండలంలో 15.2 మి.మీ, గోరంట్ల 14.2, అగళి 13.8, హిందూపురం 11.2, కొత్తచెరువు 10.2, లేపాక్షి 10.2, సోమందేపల్లి 9.8, పెనుకొండ 9.4, మడకశిర 9.2, రొళ్ల 9.2, గాండ్లపెంట 8.2, సీకేపల్లి 7.8, బుక్కపట్నం 6.4, నల్లమాడ 5.6, గుడిబండ 5.4, పుట్టపర్తి 4.6, పరిగి 4.2, ఎన్పీకుంట 3.6, తలుపుల 2.4, ఓడీచెరువు 2.4, బత్తలపల్లి 2.2, కదిరి 2.2, తనకల్లు 2.0, ధర్మవరం 1.6, నల్లచెరువు మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
రైతుకోసం వైఎస్సార్ సీపీ పోరుబాటు
పుట్టపర్తి అర్బన్: రైతు కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ కూటమి సర్కార్ పాలనను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నాకు సిద్ధమైంది. రైతుల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వారంతా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డితో కలిసి పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి నేతలు మామిడి రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించలేకపోయారన్నారు. ఉల్లి రైతులకు కంట కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. ఇక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో రైతులకు అందించలేకపోయారన్నారు. అందువల్లే ఈ సీజన్లో జిల్లాలో కేవలం 63 శాతం మంది రైతులే పంటలు సాగు చేశారన్నారు. రైతులకు జీవనాధారమైన వరి సాగు చేయవద్దని ప్రకటించడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కీలకమైన సమయంలో యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పంట నష్ట పరిహారం, ఉచిత బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ గత ఏడాది అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9వ తేదీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్ జగన్ సర్కార్ రైతును రాజు చేస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు. యూరియా కొరతపై 9న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపు -
బెంగళూరులో మృతి.. ‘పురం’లో సర్టిఫికెట్
చిలమత్తూరు: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడ మరణించినా.. ఎక్కడ జన్మించినా.. స్థానిక మున్సిపల్ అధికారులు కోరిన మొత్తాన్ని ముట్టజెపితే నిమిషాల వ్యవధిలో దొంగ సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. వాస్తవానికి జనన, మరణాలు చోటు చేసుకున్న ప్రాంతంలోనే ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. అయితే నిబంధనలు అతిక్రమిస్తూ హిందూపురం మున్సిపల్ అధికారులు జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు.. వాటిని పొందిన వారికి భవిష్యత్తులో చుక్కలు చూపడం గ్యారంటీ అని కొందరు మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. హిందూపురంలోని కంసాల పేటలకు చెందిన వి.శంకరాచారి (84) ఈ ఏడాది జూలై 3న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి సదరు ఆస్పత్రి యాజమాన్యం డెత్ సర్టిఫికెట్ను అందజేసింది. దీని ఆధారంగా బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) డెత్ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. అయితే స్థానిక టీడీపీ నేత జోక్యం చేసుకుని డెత్ సర్టిఫికెట్ను హిందూపురం మున్సిపాల్టీ ద్వారానే అందజేయిస్తానని నమ్మబలకడంతో మృతుడి కుటుంబీకులు జూల్ 17న దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగా డెత్ సర్టిఫికెట్ను మున్సిపల్ అధికారులు అందజేశారు. వయోభారంతో ఇంటి వద్దనే శంకరాచారి మృతి చెందినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ అక్రమాల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమిషనర్ సంతకాలతోనే ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడం కలకలం రేపింది. ఇలాంటివి లెక్కకు మించి దొంగ సర్టిఫికెట్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ అంశం తన దృష్టిలో లేదని, అలాంటివి మంజూరు చేయడం నేరమవుతుందని అన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హిందూపురంలోనే మృతి చెందినట్లుగా దరఖాస్తు చేయించిన పత్రం బెంగళూరులోని ఆస్పత్రి నిర్వాహకులు అందజేసిన మరణ ధ్రువీకరణ పత్రం జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారుల చేతివాటం టీడీపీ నేతల కనుసన్నల్లో ఇష్టారీతిన డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ ముడుపులు దండుకుని.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే అంత సులువు కాదు. అయితే హిందూపురం మున్సిపాల్టీలో కేవలం నిమిషాల వ్యవధిలోనే జనన, ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుండడం గమనార్హం. స్థానిక టీడీపీ నేతల సిఫారసు తీసుకెళితే చాలు.. ముందు వెనుక ఆలోచించకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియలో అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నట్లు సమాచారం. శంకరాచారి మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశంలోనూ హిందూపురం పట్టణానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. స్థిరాస్తి విషయంలో మరణ ధ్రువీకరణ పత్రం అవసరంకావడంతో సదరు టీడీపీ నేత తన పలుకుబడిని ఉపయోగించి దొంగ సర్టిఫికెట్ చేయించి ఇచ్చినట్లుగా తెలిసింది. అంతా మా ఇష్టం.. -
సస్యరక్షణ చర్యలే ముఖ్యం
● డాట్ సెంటర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య తలుపుల: పంటల సాగుతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనంతపురం డాట్ సెంటర్ శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య సూచించారు. ఏడీఏ శైలకుమారి, ఏఓ నాగ మధుసూదన్ ఆధ్వర్యంలో తలుపుల మండలం గొల్లపల్లితండాలో బుధవారం ఏర్పాటు చేసిన రైత శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా వేరుశనగ, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నందున ఆయా పంటలలో సస్యరక్షణ చర్యలు, పంట సాగు విధానాలను వివరించారు. పకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, వీఐఏ సుధాకర్, సీఎస్ఏ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులుఅనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 507.85 మెట్రిక్ టన్నుల డీఏపీ, 255.2 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 255.2 మెట్రిక్ టన్నుల 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు చేరాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియాకు సంబంధించి కోటా మేరకు 399.915 మెట్రిక్ టన్నులు అనంతపురం మార్క్ఫెడ్కు, 200.655 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు కేటాయించగా... 303.93 మెట్రిక్ టన్నులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కాంప్లెక్స్, డీఏపీలు 90 శాతం మేర ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు 10 శాతం మార్క్ఫెడ్కు కేటాయించినట్లు వివరించారు. జింక పిల్ల స్వాధీనం బత్తలపల్లి: మండలంలోని ఈదుల ముష్టూరు కొట్టాల గ్రామంలో బోయ సాంబ శివుడు వద్ద ఉన్న జింక పిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు బత్తలపల్లి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఉన్న జింక పిల్లతో పాటు సాంబశివుడిని పుట్టపర్తిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశులు, కానిస్టేబుల్ అనిల్కుమార్, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అక్కులప్ప పాల్గొన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సుమడకశిర: కర్ణాటకకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మధ్యాహ్నం పావగడ నుంచి 30 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బస్సు బయల్దేరింది. మడకశిర సమీపంలోకి చేరుకోగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా డ్రైవర్ గుర్తించి చాకచక్యంగా వ్యవహరిస్తూ పొలాల్లోకి తిప్పాడు. పొలాల్లో బస్సు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఎవరూ గాయపడలేదు. ఈ సందర్భంగా డ్రైవర్ను పలువురు అభినందించారు. ఉపాధ్యాయురాలి సస్పెన్షన్ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రోజారాణిని సస్పెండ్ చేస్తూ డీఈఓ క్రిష్టప్ప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ఇటీవల డీఈఓకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు డీఈఓ ఆదేశించారు. విచారణాధికారి అందజేసిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ రమణప్ప తెలిపారు. -
ఇద్దరు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు
మాణిక్యం ఇసాక్ తెలుగు టీచర్ జయచంద్ర హిందీ టీచర్ పుట్టపర్తి అర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రొద్దం మండలం కోగిర ఉన్నత పాఠశాల హిందీ టీచర్ జాబిలి చాంద్బాషా అలియాస్ జయచంద్ర, కొత్తచెరువు మండలం బండ్లపల్లి ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మాణిక్యం ఇసాక్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. జయచంద్ర తాను పని చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. వినూత్న పద్ధతుల్లో పిల్లలకు అర్థం అయ్యేలా బోధిస్తున్నారు. జాబిలి కలం పేరుతో కవితా రచన, జాతీయ గీతం ‘జనగణమన’తో లక్ష గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకు 2017లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2018లో అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించాయి. అలాగే సేవా రత్న, మదర్థెరీసా పురస్కారం తదితర 70 వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. మాణిక్యం ఇసాక్కు బోధనలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 216 పద్యాల పుస్తకాలు ఆవిష్కరించారు. 2025లో మహమ్మద్ ఇక్బాల్ జాతీయ పురస్కారం పొందారు. పదో తరగతిలో ఏటా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ పెనుకొండ రూరల్: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్పీ పదోన్నతులపై చోటు చేసుకున్న అక్రమాలపై ఆధారాలతో సహా ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురిస్తే.. కక్ష కట్టి విజయవాడలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేయించడంతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించిన ప్రభుత్వ తీరును ఆమె ఖండించారు. నిజాలను నిర్బయంగా రాసే పాత్రికేయులను అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. భూసంరక్షణా విభాగం ఈఈగా పోలప్ప అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణా విభాగం (సాయిల్ కన్సర్వేషన్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ)గా పోలప్ప బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఆ స్థానంలో ఇప్పటి వరకూ ఇన్చార్జి ఈఈగా ఉన్న ఓబుళపతి బాధ్యతలు అప్పజెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో డీఈగా ఉన్న పోలప్పకు ఈఈగా పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. అలాగే డీఈ హోదాలో ఉన్న ఇన్చార్జి ఈఈ ఓబుళపతికి సైతం ఈఈగా పదోన్నతి కల్పించి ఒంగోలుకు బదిలీ చేశారు. అయితే ఓబుళపతి డెప్యుటేషన్ కింద ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్గా కొనసాగనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇరువురూ ఈఈలకు ఆ శాఖ ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 11, 12న జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నంలోని డైట్ కళాశాల వేదికగా ఈ నెల 11, 12 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు సంస్కృతి, కళలపై జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు–2025 నిర్వహించనున్నారు. ఈ మేరకు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ చాటిన వారిని ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు 99499 93712, 79817 76864లో సంప్రదించవచ్చు. -
మద్యం బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మద్యం బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్, ఏఈఎస్ నరసింహులు తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీ రెండు, కదిరి మున్సిపాలిటీ, మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్ట్ 31 వరకు బార్లు నిర్వహించుకునేందుకు వీలుగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ విల్లాలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎక్పైజ్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు నేరుగా దరఖాస్తులు అందజేయాలన్నారు. లేదా ఆన్లైన్కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు రూ. 5 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు రూ.10 వేలు (ప్రాసెసింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక బార్కు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లో లాటరీ ద్వారా బార్లను కేటాయిస్తామన్నారు. బార్లు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజును ఆరు వారయిదాల్లో చెల్లించవచ్చన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలిమడకశిర రూరల్: బలవంతపు భూసేకరణతో రైతుల పొట్టకొట్టవద్దని ఏపీ రైతు సంఘం నాయకులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం రైతు సంఘం నాయకులు వైబీ హళ్లి, సీ కొడిగేపల్లి పంచాయతీల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. సారవంతమైన భూములను సేకరించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి వైబీహళ్లిలో సోలార్ ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరి, కార్యదర్శి పెద్దన్న, ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు మాట్లాడారు. రైతుల ఆమోదం లేకపోతే భూ సేకరణ చేయకూడదని 2013 భూ సేకరణ చట్టం చెబుతోందన్నారు. ఎకరాకు రూ.30 వేల ప్రకారం 30 ఏళ్లు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా రైతులు భూ హక్కును కూడా ప్రమాదం ఉంటుందన్నారు. సీ కొడిగేపల్లి పంచాయతీలో సేకరించిన భూముల్లో ఇప్పటి వరకు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనందున ఆ భూములను తిరిగి రైతులకు కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. -
ఎలుగుబంట్ల దాడిలో కాపరికి తీవ్ర గాయాలు
రొళ్ల: మేక పిల్లల కోసం మేత కోస్తుండగా హఠాత్తుగా రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో రంగధామప్ప అనే కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని టీడీ పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రంగధామప్ప మేక పిల్లల మేత కోసం గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి గడ్డి కోసే పనిలో నిమగ్నమయ్యాడు. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి రెండు పెద్ద ఎలుగుబంట్లు హఠాత్తుగా వచ్చి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంబడించి మరీ దాడి చేశాయి. ఎడమ చేయి, భుజం, కుడికాలు తొడ కింద భాగాన తీవ్రంగా రక్కి గాయపరిచాయి. ఎలాగోలా తప్పించుకుని తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే రొళ్ల సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనుమానాస్పద మృతి కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని కామక్కపల్లి అటవీ ప్రాంతంలో రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన తిమ్మక్క (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి బలవన్మరణంగోరంట్ల: మండలంలోని బూచేపల్లికి చెందిన శివశంకర్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామ సమీపంలోని తన పొలంలో బుధవారం చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బదిలీల్లో ఘోర పరాభవం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటికే రోజుకో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, కింది స్థాయి కేడర్కు మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్లు తెలిసింది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎంపీ మాట నెగ్గే పరిస్థితి లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎంపీలు డమ్మీలుగా మారారని, ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. టీటీడీ లెటర్లు ఇవ్వడానికి మినహా దేనికీ పనికిరావడం లేదంటున్నారు. మా అనుమతి లేనిదే.. ఎలాంటి అనధికార కార్యక్రమాలకూ తమకు తెలియకుండా ఎంపీలు వెళ్లడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. తాజాగా అనంతపురం అర్బన్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాతూరు మార్కెట్ పరిశీలనకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేకు, ఎంపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నా అనుమతి లేకుండా వెళ్లడానికి మీరెవరు’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి విరుచుకుపడినట్టు తెలిసింది. తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి వంటి నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో కూడా ఎంపీలకు తెలియదు! నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు కానీ, కేటాయింపులు చేసే అధికారాలు కూడా ఎంపీలకు లేవు. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ఏదైనా కానీ ఎంపీలకు దక్కడానికి వీల్లేకుండా చేశారు. ‘పేరుకే ఎంపీ.. అంతా ఎంప్టీ’ అన్న చందాన తయారైంది పరిస్థితి. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ తమకొద్దంటూ టీడీపీ కార్యకర్తలే ధర్నా చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆయనకు అడుగడుగునా.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చివరి నిమిషంలో ఇచ్చింది చాలు అన్నట్టు ఎంపీ సీటు దక్కించుకుని గెలిచినా.. ఉమ్మడి జిల్లాలో ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదు. ఇక.. సొంత నియోజకవర్గం పెనుకొండలో అయితే మంత్రి సవితకు, ఎంపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ పనిలోనూ ఎంపీకి చిన్న భాగస్వామ్యం కూడా లేదు. కదిరి, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్థసారథి మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఎంపీలను లెక్కచేయని శాసనసభ్యులు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదని హుకుం ఇటీవల ఎంపీ అంబికాతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఢీ శింగనమలలో ఎంపీపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు పెనుకొండలో మరీ ఘోరంగా ఎంపీ పార్థసారథి పరిస్థితి ఆవేదనలో ఎంపీల అనుచరులు టీటీడీ లెటర్లకు తప్ప ఎందుకూ ఉపయోగపడటం లేదని నిట్టూర్పు ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చిన సిఫార్సు లేఖల్లో ఎంపీల సిఫార్సు లేఖలు బుట్టదాఖలయ్యాయి. నియోజకవర్గంలో తమ సిఫార్సు కాదని ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకోవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. చివరకు ఎంపీ ల్యాడ్స్ కింద పనులు చేసినా తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కాబట్టి తమకు వాటా దక్కాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలను ఎదుర్కొనే శక్తి లేక ఎంపీలు లోలోపల కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో నలిగిపోతున్నారు. తమకంటే నామినేటెడ్ పోస్టులు దక్కించుకుంటున్న వారే నయమని ఎంపీలు సన్నిహితులతో వాపోతున్నారు. -
పోరాడదాం.. విజేతలుగా నిలుద్దాం
పుట్టపర్తి అర్బన్: ‘‘పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల నేతల దౌర్జన్యం, అరాచకం చూశాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారి వైఖరి అలాగే ఉంటుంది. ఏస్థాయికై నా దిగజారి రాజకీయం చేస్తారు. వారి అరాచకరాలను సమష్టిగా ఎదుర్కొందాం. గ్రామ గ్రామానా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడిద్దాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. బుధవారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉషశ్రీచరణ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్, రమేష్రెడ్డి మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి తెలియజేసి పార్టీని గ్రామ/వార్డు స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమర్థవంతమైన నాయకులు వేలాది మంది ఉన్నారని, అందుకే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించామన్నారు. తొలుత ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’లో భాగంగా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మన పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, తిరిగి మనమే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు జిల్లాలోని 7 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలన్నారు. పనిచేసే వారికి సముచిత స్థానం పార్టీకోసం కష్టపడే వారికి తప్పక సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని ఉషశ్రీచరణ్, రమేష్రెడ్డి తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడానికి జిల్లాలో తొలి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరి సలహా, సూచనలను కమిటీ తీసుకుంటుందన్నారు. వివిధ కమిటీల్లో స్థానం దక్కించుకున్న వారంతా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో గమనించిన ప్రతి అంశాన్ని జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి బూత్లోనూ బీఎల్ఏలను ఏర్పాటు చేసుకుని, ఆ జాబితాను ఆర్డీఓలకు పంపాలన్నారు. ఓటరు జాబితా, మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్ల మార్పు తదితర విషయాలన్నీ తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియాను వాడుకుందాం ప్రతి గ్రామంలోనూ మహిళా, రైతు, యువజన, సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, కూటమి సర్కార్ అసమర్థ పాలన, అరాచకాలను ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరిద్దామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వరరెడ్డి, కురుబ నాగిరెడ్డి, శేషురెడ్డి, సుధాకరరెడ్డి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, మహిళా విభాగం రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్, శివప్రసాద్, రఘురామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రణీత్రెడ్డి, సురేష్కుమార్, ప్రభాకరరెడ్డి, రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అభిలాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్నాయక్, వలంటీర్ విభాగం అధ్యక్షుడు హరినాథ్రెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడు జింకా కంబగిరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడు ఫకృద్దీన్, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు రమేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు గజ్జల శివ తదితరులు పాల్గొన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదాం కూటమి దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఊరూరా వివరిద్దాం పార్టీ శ్రేణులకు ఉషశ్రీ చరణ్, రమేష్రెడ్డి పిలుపు పుట్టపర్తిలో వైఎస్సార్ సీపీ వర్కింగ్ కమిటీ సభ్యులతో సమావేశం -
మాజీ మావోయిస్టుల సమస్యలు పరిష్కరించండి
పుట్టపర్తి అర్బన్: స్థానిక మాజీ మావోయిస్టుల కాలనీలో ఇంటి స్థలాలను ఇతరులకు కేటాయించకుండా చూడాలని ఆర్డీఓ సువర్ణకు ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారాం విన్నవించారు. సమస్య పరిష్కారం కోరుతూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం వినతి పత్రం అందజేసి సొసైటీ అధ్యక్షుడు రాజారాం, బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాయర్ హరి మాట్లాడారు. పుట్టపర్తి సమీపంలోని కప్పలబండ రెవెన్యూ పరిధిలో ధరణి సొసైటీ సభ్యులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు 4.5 ఎకరాలను కేటాయించారని గుర్తు చేశారు. ఇందులో సొసైటీలో సభ్యులు కాని వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, నిర్మాణాలు చేపట్టేలా అదే గ్రామానికి చెందిన లోచర్ల విజయభాస్కరరెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ అంశంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అధికారులకు సిఫారసు చేశారని, ఇది నిజమని తేలితే ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు హనుమన్న, బొంతలపల్లి శ్రీరాములు, బాలు, తదితరులు పాల్గొన్నారు. -
జన్ధన్ ఖాతాలకు కేవైసీ చేయించుకోండి
లేపాక్షి: కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రారంభించిన జన్ధన్ పథకానికి సంబంధించి బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారు మరో సారి కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే ఆ ఖాతాలు రద్దు అయ్యే అవకాశముందని ఆర్బీఐ ఎఫ్ఐ విభాగం జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మహనా పేర్కొన్నారు. లేపాక్షి మండలం చోళసముద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణా బ్యాంక్ ఆధ్వర్యంలో, లేపాక్షిలోని అన్నదాన సత్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా జనసురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు అమలులోకి వచ్చాయన్నారు. ఆయా పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్డీఓ రోహిత్ అగర్వాల్, ఎల్డీఎం రమణకుమార్, జోనల్ హెడ్ శ్రీనివాసకుమార్, రీజనల్ ఎల్డీఎంలు రమణ కుమార్, జితేంద్ర కుమార్ మిశ్రా, రమేష్, బ్రాంచ్ మేనేజర్లు విజయబాబు, జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆర్బీఐ ఎఫ్ఐ విభాగం జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మహనా -
ఎమ్మెల్యే గుమ్మనూరుపై చర్యలు తీసుకోవాలి
ధర్మవరం: ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులతో దురుసుగా మాట్లాడిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ధర్మవరంలో వారు విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి, పామిడి మండలాల్లోని ఐదు గ్రామాల్లో సోలార్ విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు లీజు పద్ధతిలో కాకుండా దళారులతో దౌర్జన్యంగా భూ సేకరణను టీడీపీ నేతలు చేపట్టారన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మండల నాయకులు, రైతులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఎమ్మెల్యే జయరాం ఫోన్ చేసి అవమానకర రీతిలో దూషిస్తూ.. బెదిరింపులకు దిగడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ బాషా, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, అయూబ్ఖాన్, ఎల్.ఆదినారాయణ, హైదర్వలి, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారుతి, వెంకటస్వామి, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకూ పోరాటం
అనంతపురం రూరల్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు మండిపడ్డారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం ఏపీ వాల్మీకి, బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవయ్య ఆధ్వర్యంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రుద్రంపేటలోని వాల్మీకి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని నాల్గో పట్టణ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మేకల శివ, నాగేంద్ర, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు -
అవినీతికి 'రెవెన్యూ'
సాక్షి, పుట్టపర్తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. అధికారం అండతో కొందరు నేతలు ఇతర పార్టీల సానుభూతి పరుల భూముల రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఏళ్లుగా సాగులో ఉన్నా... రాజకీయ కుట్రలతో రికార్డుల నుంచి పేర్లు తొలగించి.. తమకు అనుకూలమైన వారి పేర్లు చేరుస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే బదిలీ తప్పదని బెదిరిస్తుండటంతో కూటమి నేతలు చెప్పిన వాటికంతా అధికారులు తలూపుతున్నారు. ‘పరిష్కార వేదిక’కు బాధితులు ఏళ్లుగా సాగులో ఉన్నప్పటికీ రికార్డుల్లో మరొకరి పేరు చూపుతుండటంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరొకరి చెందుతున్నాయి. దీంతో బాధితులు తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదిస్తే.. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత సర్వే చేస్తామని మాట దాట వేసి.. పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులంతా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు తరలివస్తున్నారు. న్యాయం చేయండయ్యా అంటూ కలెక్టర్ను వేడుకుంటున్నారు. కానీ వారి అర్జీలన్నీ మళ్లీ తహసీల్దార్ కార్యాలయాలకే చేరుతుండగా... సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరికొందరు బాధితులు తమ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కుతున్నారు. అయితే సివిల్ పంచాయితీతో తమకు సంబంధం లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. భూములకు రక్షణ కరువు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కూటమి పార్టీల నాయకులు కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులనే పావులుగా వాడుకుంటూ.. భూదందాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే డీ–పట్టా భూములకు రక్షణ లేకుండా పోయింది. 40 ఏళ్లుగా సాగులో ఉన్నా.. రికార్డుల్లో పేర్లు మార్చి పంచాయితీలు చేస్తున్నారు. చివరకు సరిహద్దులో దేశానికి కాపలాకాసే సైనికుల భూములు కాజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములను లాగేసుకుంటున్నారు. అక్కడే ఎక్కువగా..భూమి విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే భూ తగాదాలు పెరుగుతున్నాయి. పుట్టపర్తి, కొత్తచెరువు, చిలమత్తూరు సోమందేపల్లి, పెనుకొండ, గోరంట్ల మండలాల నుంచి ప్రతి వారం భూ సమస్యలతో బాధితులు కలెక్టరేట్కు వస్తున్నారు. పదే పదే ఫిర్యాదు ఇచ్చినా... ఫలితం లేదని వాపోతున్నారు. పైగా ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారని వాపోతున్నారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు పుట్టపర్తి మండలం పెడపల్లిలో ప్రభుత్వ భూమిలో ఓ వ్యక్తి భవనం నిర్మించారు. స్థానికులు కలెక్టర్ చేతన్కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఆయన కూల్చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారెవరో తన వద్దకు వచ్చేలా చూడాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భవనం కూల్చరాదని అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆ భవనం కూల్చేందుకు అధికారులెవరూ సాహసం చేయడంలేదు. పైగా మాజీ మంత్రి చర్యలతో ఫిర్యాదుదారులూ భయపడ్డారు. » పుట్టపర్తి మండలం కొట్లపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 254–3లోని 4.68 ఎకరాలకు 1965లోనే ప్రభుత్వం హరిజన సుబ్బన్నకు డీ పట్టా ఇచ్చింది. ఆయన మరణాంతరం ఆయన కుమారుడు గంగాద్రి సాగులో ఉన్నాడు. అయితే ఇటీవల ఆ భూమిని అధికారులు బెంగళూరుకు వలస వెళ్లిన ముగ్గురి పేరిట ఆన్లైన్లో ఎక్కించారు. వన్–బీ, పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. దీంతో బాధితుడు తహసీల్దార్ కార్యాలయానికి రాగా.. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.» పుట్టపర్తి మండలం కప్పలబండ రెవెన్యూ పొలం సర్వే నంబరు 179–6లోని 25 సెంట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒకరికి ఇచ్చారు. ప్రస్తుతం అదే నంబరుపై మరొకరి పట్టా ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య భూ తగాదా మొదలైంది. ఇరువర్గాల వారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇరువర్గాలు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో అధికార పార్టీ సానుభూతి పరులకు ఆ భూమి దక్కింది. » పెడపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 665–6లోని 1.36 ఎకరాలను 40 ఏళ్ల క్రితం చంద్రనాయక్కు ఇచ్చారు. ఇటీవల రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి యజమానికిగా మరొకరి పేరు చేర్చారు. సాగులో ఉన్నప్పటికీ.. రికార్డుల పరంగా వేరొకరి వస్తుండటంతో బాధితుడు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. సాగుకు అడ్డం వస్తే.. పోలీస్ స్టేషన్కు వెళ్లు.. రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలతో ఏం కాదులే ఓ అధికారి రైతుకు చెప్పినట్లు తెలిసింది. -
మీకోసం ప్రశ్నిస్తే మాపై కేసులా?
పుట్టపర్తి టౌన్: ‘‘మీకు అన్యాయం జరిగిందని మీరు చెబితే మేము వార్తలు రాశాం. మీకు అండగా నిలిచాం. అలాంటి మాకు అండగా నిలవాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా’’ అంటూ జర్నలిస్టులు ప్రశ్నించారు. డీఎస్పీ పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై ‘సాక్షి’ కథనం ప్రచురిస్తే..తట్టుకోలేని ప్రభుత్వ పెద్దలు సోమవారం రాత్రి పోలీసులతో ‘సాక్షి’ విజయవాడ కార్యాలయంపై దాడి చేయించడంతో పాటు పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఈ చర్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లాలో జర్నలిస్టులు ఎక్కడికక్కడ పోలీసులకు వినతి పత్రాలు సమర్పించారు. ‘సాక్షి’ ఎడిటర్పై బనాయించిన అక్రమ కేసును వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పలువురు జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాక్షి స్టాఫ్ రిపోర్టర్ దివిటి రాజేష్ మాట్లాడుతూ.. డీఎస్పీ పదోన్నతుల్లో అక్రమాలపై పోలీసులే సాక్ష్యాలతో సహా సాక్షి మీడియా ముందుకు వస్తే... వారు చెప్పిన అంశాలనే వార్తగా రాశామన్నారు. దీంతో పోలీసులు ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ ధనంజయరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా సర్కార్ చర్యలను ఖండించాలన్నారు. కార్యక్రమంలో రిపోర్టర్లు గంగిరెడ్డి, విజయశేఖర్రెడ్డి, సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు. ● సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని పెనుకొండలో జర్నలిస్టులు మల్లికార్జున, గోవింద్, జాకీర్హుస్సేన్, శ్రీనివాసులు తదితరులు డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసును ఎత్తివేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి నిజాలు నిర్భయంగా రాస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాక్షి కార్యాలయంపై దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి సాక్షి కార్యాలయంపై దాడి, ఎడిటర్పై కేసులు దుర్మార్గం ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టులు -
అప్పు చెల్లించలేదని దాడి
చెన్నేకొత్తపల్లి: అప్పుతీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో రుణదాత బండరాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని కనుముక్కల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనుముక్కల గ్రామానికి చెందిన ఓబుల్రెడ్డి వద్ద అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు ఐదేళ్ల క్రితం రూ. 33 వేల అప్పుగా తీసుకున్నాడు. ప్రతి ఏటా వడ్డీ చెల్లించేవాడన్నారు. అయితే ఈ ఏడాది ఆంజనేయులు అప్పునకు వడ్డీ చెల్లించలేక పోయాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఆంజనేయులు గొర్రెలు మేపుతుండగా...రుణదాత ఓబుల్రెడ్డి అక్కడికి వెళ్లి అప్పు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన ఓబుల్రెడ్డి అక్కడే ఉన్న ఓ బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆంజనేయులు కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కనీస వేతనం అమలు చేయాలి
ఎప్పటి నుంచో అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అడుగుతున్నాం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లక్ష్యాలను చేరుకోవాలని అంగన్వాడీలను ఇబ్బంది పెడుతున్నారు. చాలీచాలనీ జీతాలతో పాటు నిత్యావసరాల కొనుగోలుకు డబ్బు చెల్లించకపోతే ఎలా? అటవీ గ్రామాలు, మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ అందక వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. యాప్ల భారం తగ్గించాలి. – మాబున్నీసా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కియా చేయూత
పరిగి: విద్యార్థుల సమగ్రాభివృద్దికి కియా ఇండియా చేయూతనందిస్తుందని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ తెలిపారు. మంగళవారం ఆయన పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇటీవల కళాశాలలో కియా ఇండియా ఆర్థిక సౌజన్యంతో రూ.50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే పూర్తయిన శానిటేషన్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాలలో నిర్మించతలపెట్టిన డార్మెటరీ, డైనింగ్ హాల్, వేడి నీటి కోసం సోలార్ సిస్టమ్కు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రమీలమ్మ, శ్రీదేవి, బోధన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీలా పడ్డ అంగన్వాడీలు
పుట్టపర్తి అర్బన్: అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సానుకూలత లభించలేదు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ధరలకు అనుగుణంగా కూరగాయల బిల్లులు పెంచాలని, వివిధ రకాల యాప్లతో చేసిన పనినే మళ్లీ మళ్లీ చేసే విధానం నుంచి విముక్తి కల్పించి ఒకే యాప్ ప్రవేశపెట్టాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్పు చేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు–ఆందోళనలు చేసిన రోజులకు ప్రభుత్వం వేతనాల్లో కోత విధిస్తున్నా వెనక్కు తగ్గకుండా డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. పనులు బారెడు.. వేతనం మూరెడు.. చిన్నారులకు ఆట పాటలతో పూర్వప్రాథమిక విద్య నేర్పి, గర్భిణులు, బాలింతలకు యాప్ ద్వారా ఫొటోలు తీసి పౌష్టికాహారం అందజేయడం, ఆరి ఆరోగ్య విషయాలు వైద్య సిబ్బందికి తెలియజేయడం, సర్వేలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం యాప్లలో నమోదు చేయడం, వంటి ఎన్నో కార్యక్రమాలను అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నారు. అయినా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్వాడీ సెంటర్ల వర్కర్లకు రూ.7,500 చెల్లిస్తున్నారు. ఇక కేంద్రాలకు వచ్చే చిన్నారులకు, లబ్ధిదారులకు భోజనం వండిపెట్టి పాత్రలను, కేంద్రాన్ని శుభ్రం చేసే ఆయాలకు రూ.7,500 ఇస్తున్నారు. ఇది ఏమాత్రమూ చాలడం లేదని అంగన్వాడీలు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్రాలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, గ్యాస్, తదితరాలకు బిల్లులు నెలల తరబడి విడుదల చేయకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. ఫోన్లు పనిచేయకున్నా తప్పని చీవాట్లు 2జీ సెల్ఫోన్లలో ఐసీడీఎస్ యాప్లు సరిగా పనిచేయడం లేదు. అంగన్వాడీ సేవలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో సకాలంలో పంపకపోయినా, నెట్వర్క్ కారణంగా సెల్ఫోన్లు పనిచేయకపోయినా వర్కర్లకు అధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. లక్ష్యం చేరుకోలేదంటూ పలువురికి షోకాజ్ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. 5జీ సామర్థ్యంతో కూడిన సెల్ఫోన్లు ఇవ్వాలని, ఒకే యాప్ అమలు చేయాలని ఇటీవల అంగన్వాడీలు పాత సెల్ఫోన్లు వెనక్కు ఇచ్చేశారు. అయితే ప్రభుత్వం కొత్తవి ఇవ్వకుండా... పాతవే మళ్లీ అంటగట్టి వివరాలు నమోదు చేయాలంటూ సిబ్బందిపై ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెట్వర్క్–సిగ్నల్స్ సమస్యతో యాప్లు సరిగా పనిచేయక సిబ్బంది సతమతమవుతూనే ఉన్నారు. మరోవైపు లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్ కాకపోతే సరుకులు ఇవ్వలేని పరిస్థితి. దీంతో తరచూ లబ్ధిదారులతోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీల సమస్యలపై చర్చలకు పిలిచినా పూర్తిస్థాయిలో పరిష్కారాలు కాలేదు. వేతనం పెంపుపైన, యాప్ల భారం తగ్గింపుపైన, ధరలకు అనుగుణంగా బిల్లుల పెంపుపైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో అంగన్వాడీలు మరోమారు డీలా పడాల్సి వచ్చింది. జిల్లా గణాంకాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2,207 మినీ అంగన్వాడీలు 617 అంగన్వాడీ వర్కర్లు 2,884 లబ్ధిదారులు 1,07,082 (గర్భిణులు, బాలింతలు, చిన్నారులు) కూటమి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి కనీస వేతనం అమలుపై స్పందన లేదు పాత ఫోన్లతోనే ఆన్లైన్ పనులకు హుకుం -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, అనుబంధ విభాగాల్లో పని చేస్తూ అకాల మృత్యువాతపడ్డ ఉద్యోగులకు సంబంధించిన వారసులు తొమ్మిది మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించారు. వారందరికీ జెడ్పీ చైర్పర్సన్ తన చాంబర్లో నియామకపత్రాలను మంగళవారం అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో ఎన్.మమత (పీఆర్ఐ సబ్ డివిజన్–మడకశిర), శోభ (ఎంపీపీ ఆఫీస్–మడకశిర), కేఆర్ రాఘవేంద్రరావు (ఎంపీపీ ఆఫీస్ –శెట్టూరు), వి.శకుంతల (జెడ్పీహెచ్ఎస్ – చెన్నేకొత్తపల్లి), సి.భార్గవి (జెడ్పీహెచ్ఎస్ – చుక్కలూరు), వై.ప్రసన్నకుమార్, పి.దీపక్ (జెడ్పీ–అనంతపురం), కె.బంధ నవాజ్ (పీఆర్ఐ, పీఐయూ–అనంతపురం), ఎస్.ధనలక్ష్మి (ఎంపీపీ ఆఫీస్ –బుక్కరాయసముద్రం) ఉన్నారు. వారినుద్దేశించి చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో బాధ్యతలను సమర్థవంతంగా అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య, ఏఓలు షబ్బీర్ నియాజ్, విజయభాస్కర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
గణపతి బప్ప మోరియా
కదిరి: గణేశ్ నామస్మరణతో కదిరి పురవీధులు పులకించాయి. వినాయక చవితి రోజున వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలకు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఏడవ రోజు మంగళవారం నిమజ్జనం–శోభాయాత్ర నిర్వహించారు. తొలుత మండపాల వద్ద గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో ప్రతిమలను కొలువుదీర్చారు. ఇక నృసింహాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా.. నిర్ణయించిన శుభ ఘడియల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు భక్తులు స్వామివారి వాహనాన్ని లాగి ప్రారంభించారు. సింహకోట, ఎర్రకోట, శివాలయం, రైల్వేగణేష్ విగ్రహాలను మాత్రమే గతంలో హిందూ, ముస్లింలు కలిసి చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆలంఖాన్ వలి మసీదు ముందు నుంచి తీసుకెళ్లారు. మిగిలిన విగ్రహాలన్నీ హిందూపూర్ సర్కిల్ మీదుగా నిమజ్జన ప్రదేశం రామనారాయణకుంటకు వెళ్లాయి. ఎస్పీ రత్న దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు. సుమారు 400 మంది దాకా పోలీసులు బందోబస్త్లో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఉల్లాసం..ఉత్సాహం చిన్నా, పెద్దా, ఆడ, మగ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా పట్టణ ప్రజలు గణేశ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు శోభాయాత్రలో చిందులు వేస్తూ ముందుకు సాగారు. పలు వీధుల నుంచి వచ్చిన గణనాథులు తెల్లని కాంతులతో ఆకాశ హర్ామ్యలతో పోటీ పడ్డాయి. బాణసంచా ఆకాశాన కాంతులీనుతుండగా అందరూ రంగులు చల్లుకొని మెరుపులై మెరిశారు. భక్త జనుల గణేశ నామస్మరణల మధ్య పార్వతీ తనయుడికి ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న రామనారాయణ కుంటలో క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు. ఈసారి ముస్లింలు స్వామివారి వాహనాన్ని లాగడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. -
వ్యవస్థలన్నీ సర్వనాశనం
లేపాక్షి: కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం లేపాక్షిలోని టూరిజం గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేపరం చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడవుతారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈ నెల నాలుగో తేదీన విశాఖలో అన్ని కార్మిక, ప్రజా, రాజకీయ సంఘాలతో ఒక సమైక్య ఉద్యమం చేపడతామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకావాలు ఉన్నా ప్రైవేటుపరం చేయడానికి సమాయత్తమవుతున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రూ.260 యూరియా బస్తాను రూ.500కు విక్రయిస్తున్నారని, డీఏపీపైనా రూ.200 అదనంగా దండుకుంటున్నారని మండిపడ్డారు. జన గణనతోపాటు కుల గణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, మండల కార్యదర్శి గౌతమ్ పాల్గొనఆనరు. మోదీ ఆశయ సాధనలో బాబు–పవన్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం -
కాలువ భూమిని కబ్జా చేశారు
పుట్టపర్తి అర్బన్: ‘‘బత్తలపల్లి కాలువకు చిత్రావతి నుంచి నీరు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సర్వే నంబర్178లో 2.9 ఎకరాల భూమిని వదలగా... పెడపల్లి పెద్దతండాకు చెందిన నాగేంద్ర నాయక్ భార్య అరుణాబాయి ఆ భూమిని ఆక్రమించారు. అక్రమంగా డీపట్టా పొంది ప్రస్తుతం భూమిని చదును చేస్తున్నారు. వెంటనే పనులు నిలిపివేయించాలి. రికార్డుల్లోనూ ఆ భూమి కాలువ అనే నమోదై ఉంది. కాలువ పూడ్చి వేస్తే చెరువుకు నీళ్లు వచ్చే వీలు లేకుండా పోతుంది. అదే జరిగితే పెద్దతండా, పైపల్లి గ్రామాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. వెంటనే ఆక్రమణలో ఉన్న భూమిని సంరక్షించాలి’’ అని పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డె వెంకటేషు, రాజేంద్ర ప్రసాద్, రమేష్, బి.వెంకటేషు, వెంకటరాముడు, హరీష్ తదితర రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ను కోరారు. ఈ మేరకు అర్జీ అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 175 అర్జీలు అందాయి. జేసీ అభిషేక్కుమార్, డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ తదితరులు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమం అనంతరం జేసీ అభిషేక్కుమార్ మాట్లాడుతూ... అర్జీలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలన్నారు. ఒక్క అర్జీ కూడా బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకూడదన్నారు. ● పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా విద్యుదాఘాతంతో నరసింహమూర్తి మృతి చెందారని, ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనని మృతుని తమ్ముడు నాగేంద్ర జేసీకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. నరసింహమూర్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ యజమాని దూరం కావడంతో వారు అనాథలయ్యారన్నారు. తగిన పరిహారం ఇప్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ● తనకు కనగానపల్లి మండలం పాతపాళ్యం గ్రామంలోని సర్వే నంబర్ 140–3లో 4 ఎకరాల భూమి ఉందని, వెబ్ల్యాండ్లో మాత్రం తన పేరు కనబడలేదని లక్ష్మీదేవి జేసీకి ఫిర్యాదు చేశారు. వెబ్ల్యాండ్లో తన పేరు నమోదు చేయాలని అర్జీ సమర్పించారు. గతంలో పలు మార్లు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలిచ్చినా ఫలితం లేదన్నారు. జేసీకి ఫిర్యాదు చేసిన పెడపల్లి పెడ్డతండా వాసులు ‘పరిష్కార వేదిక’కు 174 అర్జీలు వచ్చిన అర్జీల్లో కొన్ని ఇలా... -
తాగునీటి కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
పుట్టపర్తి టౌన్: గొంతుతడిపే గుక్కెడు నీటి కోసం నల్లమాడ మండలం గోపేపల్లి తండా వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యపై అర్జీ ఇచ్చేందుకు వచ్చన గోపేపల్లి తండా వాసులను లోనికి అనుమతించకపోవడంతో తండావాసులు కలెక్టరేట్ ఎదుటే భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ తండాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నెలకు ఒకసారి గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్తో పాటు బోరు మోటర్ పంప్ కూడా కాలిపోతోందన్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య గురించి పట్టించుకోలేదన్నారు. తాజాగా 20 రోజల క్రితం బోరు మోటరు కాలిపోవడంతో తాము సమీపంలోని వ్యవసాయ బోరుమోటార్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. పంచాయతీ సర్పంచ్ రూ.40 వేల పంచాయతీ నిధులు ఖర్చు చేసినా తాగునీటి సమస్య మాత్రం తీరలేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులు అనుమతించడంతో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు అర్జీ ఇచ్చారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ విద్యుత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు వారు వెల్లడించారు. -
బంతి పూలహారం @ రూ.71,000
రొళ్ల: మనం ఇప్పటి వరకూ రూ.లక్షల్లో పలికిన వినాయకుడి లడ్డూ వేలం చూసి ఉంటాం. కానీ రొళ్ల మండల పరిధిలోని జీరిగేపల్లి గ్రామంలో మాత్రం వినాయకుడి మెడలోని పూలహారం ఏటా వేలం వేస్తారు. ఈ సారి కూడా సోమవారం వినాయకుడి మెడలో అలంకరించిన పూలహారం వేలం నిర్వహించగా.. గ్రామస్తులు భారీగా పోటీ పడ్డారు. చివరకు రొళ్ల వీరనాగమ్మ వైన్స్ యజమాని నగేష్ ఏకంగా రూ.71,000కు వినాయకుడి మెడలోని పూలహారాన్ని దక్కించుకున్నారు. బంతి పూల మాలకు భారీ రేటు.. జీరిగేపల్లి గ్రామంలో ఏటా వినాయక చవితి రోజున స్వామివారి మెడలో ప్రత్యేకంగా తయారు చేసిన బంతిపూల మాల వేస్తారు. ఐదో రోజు నిమజ్జనం సందర్భంగా ఆ పూలమాలను వేలం వేస్తారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును మరుసటి సంవత్సరం స్వామివారిని కొలువుదీర్చేందుకు ఉపయోగిస్తారు. వినాయకుడి మెడలోని పూలమాలను దక్కించుకున్న వారికి మంచి జరుగుతుంది గ్రామస్తులు విశ్వాసం. అందుకే మామూలు బంతిపూల మాల కూడా ఇక్కడ రూ.వేలు పలుకుతోంది. ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’లో నమోదు చేసుకోండిఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్లో మంగళవారంలోపు రిజిస్టర్ చేసుకోవాలని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు, జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, సైన్స్ పరిశోధన సంస్థ సంయుక్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. సెన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకునేందుకు, పెంపొందించుకునేందుకు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ చక్కని అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి స్కూల్లోనూ కనీసం 50 మంది విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారితో ఆవిష్కరణలు చేయించాలని సూచించారు. ఐవీఎఫ్ కేంద్రాలకు అనుమతి తప్పనిసరి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి అర్బన్: జిల్లాలో అనుమతులు లేకుండా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సెంటర్ (ఐవీఎఫ్ – సంతాన సాఫల్య కేంద్రం) ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం హెచ్చరించారు. సోమవారం హిందూపురంలో అనుమతి ఉన్న ఏకైక సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రతి నెలా ఐవీఎఫ్ సేవలు పొందుతున్న వారి వివరాలను అధికారులకు సమర్పించాలన్నారు. తల్లిదండ్రులు కావాలన్న దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫీజుల దోపిడీకి తెరలేపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని కానీ, ఉచిత కన్సల్టెన్సీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసినా సదరు ఆస్పత్రుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘సమగ్ర’లో సీతయ్య
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఎవరి మాట వినని సీతయ్య అందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగులకు గుదిబండలా మారాడు. పేరుకే చిరుద్యోగి అయినా.. ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయని అతని బాగోతాలు కథలు కథలుగా వెలుగు చూస్తున్నాయి. మెసెంజర్ సిఫారసు ఉంటేనే పని పూర్తి డిప్యూటేషన్పై జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి నియమితుడైన మెసెంజర్.. బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాలయం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ (ఏపీసీ)ని సైతం పక్కన పెట్టి అన్ని అధికారాలు తానై చెలాయిస్తూ కేజీబీవీ సిబ్బందికి చుక్కలు చూపించసాగాడు. ఈ క్రమంలో ఏ పని కావాలన్నా ముందుగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే ఏ పనీ పూర్తి కావడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఓ లెక్క మెసెంజర్కు ముడుపులు ముట్టజెప్పితేనే సమగ్ర శిక్షలో పనులు పూర్తవుతాయని, లేకపోతే రోజుల తరబడి ఏదో ఒక నెపంతో ఫైల్ను పక్కన పెట్టేస్తుంటారని పలువురు బాధితులు వాపోతున్నారు. కేజీబీవీ ఎస్ఓల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది, ఎమ్మార్సీ, ఇతర సిబ్బంది బదిలీల్లోనూ ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అతను కోరిన మొత్తాన్ని చెల్లించి పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు బాహాటంగానే పేర్కొంటున్నారు. ఏసీపీ పరిధిలో ఉన్న ఎమ్మార్సీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు ఇటీవల జరిగాయి. అయితే 2 నెలలు గడిచినా వారిని ఇప్పటి వరకూ బదిలీ అయిన స్థానాలకు పంపలేదు. ఈ అక్రమాల వెనుక మెసెంజర్ పాత్ర ఉన్నట్లు ఎమ్మార్సీ సిబ్బంది వాపోతున్నారు. గతంలోనూ వివాదాస్పదమే గతంలో బాలికల గురుకుల పాఠశాలలో మెసేంజర్గా పనిచేసే అవకాశం దక్కినా.. ఆ పాఠశాల బాలికలకు సంబంధించినది కావడంతో ఉన్నతాధికారులు అనుమతించలేదు. దీంతో తనకు ప్రతిగా భార్యకు ఉద్యోగం ఇప్పించి.. అనంతరం కొద్ది రోజులకే కోర్టును ఆశ్రయించి విధుల్లోకి చేరాడు. ఈ క్రమంలో అతని పనితీరు వివాదాస్పదంగానే సాగింది. ఎస్ఓలకు బెదిరింపు కేజీబీవీలకు సంబంధించి బిల్లులు కావాలంటే మెసెంజర్కు ముడుపులు చెల్లించక తప్పడం లేదనే ఆరోపణలున్నాయి. అతను కోరుకున్న మొత్తం చెల్లించకపోతే బిల్లులు సక్రమంగా లేవంటూ కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేజీబీవీ సిబ్బందిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమస్యాత్మకంగా మారిన సమగ్ర శిక్ష కార్యాలయ మెసెంజర్పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కేజీబీవీ ఎస్ఓలను, సిబ్బందిని శాసిస్తున్న చిరుద్యోగి -
చెరువులో పడి యువకుడి మృతి
ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని మార్కెట్ వీధికి చెందిన మహేష్ (36)కు భార్య విమల, ఓ కుమారుడు ఉన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో చెరువు మొదటి మరువ వద్ద సోమవారం ఉదయం తన శరీరానికి అయిన రంగులను శుభ్రం చేసుకుంటుండగా అదుపు తప్పి నీటిలో పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మహేష్ చెరువులోని బురదలో కూరుకుపోయి బయటకు రాలేక మృతి చెందాడు. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, సిబ్బంది అక్కడకు చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రైతు ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండలంలోని ఆర్.యర్రగుంటపల్లికి చెందిన రైతు మండ్లి నాగేంద్ర (44) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య బొజ్జక్క, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న 5 ఎకరాల పొలంలో వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పంటల సాగుకు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీనికి తోడు కుటుంబంలో కలహాలు మొదలు కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం రాత్రి కలుపు నివారణ మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న నాగేంద్రను కుటుంబసభ్యులు గమనించి ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలం.. బీటెక్ విద్యార్థి ఆత్యహత్య తాడిపత్రి రూరల్: ప్రేమ విఫలమై తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి నవీన్కుమార్ (19) ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం అప్గ్రెడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. పట్టణ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నవీన్కుమార్ ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అనంతపురం: బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు జిల్లాకు చెందిన పుట్లూరు సోహన ఎంపికై ంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్లోని లూథియానాలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. -
పరిష్కార వేదికకు 45 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 45 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిపెనుకొండ రూరల్: మండలంలోని గుట్టూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సంబంధీకులు ఎవరైనా ఉంటే కియా పోలీసులను (93469 17078) సంప్రదించాలని కోరారు.బుక్కపట్నంలో విజయనగర రాజుల శాసనాలుపుట్టపర్తి: బుక్కపట్నంలోని పురాతన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విజయనగర సామ్రాజ్యం నాటి రెండు శాసనాలు బయటపడ్డాయి. ఈ మేరకు సోమవారం చారిత్రక పరిశోధకుడు, విశ్రాంత హెచ్ఎం వెంగన్న, ఉపాధ్యాయులు గోపీ, సురేష్ వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల్లో రెండు రాతి స్తంభాలపై శాసనాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవ రాయలు సోదరుడు అచ్యుత దేవరాయలు ఈ శాసనాలను లిఖించినట్లు తెలిపారు. త్వరలో ఈ శాసనాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయనున్నట్లు వెంగన్న పేర్కొన్నారు.ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు కెప్టెన్గా కోగటం హనీష్అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అండర్–19 క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ ప్రెసిడెంట్ జట్టు కెప్టెన్గా కోగటం హనీష్ వీరారెడ్డి ఎంపికయ్యాడు. ఆంధ్రా సెక్రెటరీ టీం, ఆంధ్రా ప్రెసిడెంట్ టీం, మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో పోటీలు జరగనున్నాయి. అనంతపురం జిల్లా నుంచి కోగటం హనీష్ వీరారెడ్డి ఒక్కరే ఈ టోర్నీకి ఎంపిక కావడం గమనార్హం. -
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
తాడిపత్రి రూరల్: నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచారని రైతులు వాపోయారు. పట్టణంలో వైఎస్సార్ సర్కిల్లోని మధుసాయి ట్రేడర్స్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారిపల్లికి కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి వెళ్లి తాను తాడిపత్రిలోని మధుసాయి ట్రేడర్స్కు చెందిన ఉద్యోగిగా అక్కడి రైతులతో పరిచయం పెంచుకున్నాడు. తమ వద్ద సోహా 007 రకం మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయని, 110 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని ఆశ చూపి 30 మంది రైతులకు అంటగట్టాడు. దీంతో ఎకరాకు రూ.40 వేల నుంచి 45 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు 90 రోజులు కావస్తున్నా పంట సరిగా ఎదగక పోవడంతో మోసపోయిన గుర్తించి తాడిపత్రికి వచ్చి మధుసాయి ట్రేడర్స్ యజమానికి పరిస్థితి వివరించారు. అయినా ఆయన పట్టించుకోక పోవడంతో బాధిత రైతులు సోమవారం తాడిపత్రికి వచ్చి దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఏడీఏ రవి ఆదేశాల మేరకు పెద్దపప్పూరు ఏఓ మహితా కిరణ్ అక్కడకు చేరుకుని దుకాణంలోని మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. విచారణ తరువాత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని ఏడీఏ భరసానిచ్చారు. తాడిపత్రిలో రైతుల ఆందోళన -
వాహనం ఢీ – ఒకరి మృతి
కనగానపల్లి: మండలంలోని గుంతపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బండి నరసింహులు (59), ముత్యాలు సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై పాతపాల్యం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ నడుపుతున్న నరసింహులు ఒక కాలు పూర్తిగా విరిగి పక్కకు పడిపోయింది. ముత్యాలుకు మోకాలు విరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. తీవ్రంగా గాయపడిన నరసింహులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముత్యాలును అనంతపురంలోని జీజీహెచ్కు రెఫర్ చేశారు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
పండుగలు మతసామరస్యాన్ని చాటాలి
హిందూపురం: పండుగలు మతసామరస్యాన్ని చాటాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీ హిందూపురంలో గణేష్ నిమజ్జనం, 5వ తేదీన మిలాద్– ఉన్–నబీ పర్వదినం నేపథ్యంలో సోమవారం ఆమె హిందూపురంలో పర్యటించారు. తొలుత డీఎస్పీ మహేష్తో కలిసి పోలీసుల స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏపీఎస్పీ ప్లటూన్, సాయుధ బలగాలతో కలిసి హిందూపురం ప్రధాన రహదారిలో కవాతు నిర్వహించారు. అనంతరం గణపతి నిమజ్జన శోభాయాత్ర సాగే రూట్లను, విగ్రహాలను నిమజ్జనం చేసే గుడ్డం కోనేరును పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. రెండు పండుగల సందర్భంగా రెండురోజుల పాటు హిందూపురం ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈనెల 4వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్లో ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. మిలాద్–ఉన్– నబి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం మత పెద్దలతో చర్చించారు. ఎస్పీ వెంట డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు రాజగోపాల్ నాయుడు, కరీం, జనార్దన్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ రత్న పిలుపు హిందూపురంలో పోలీసులతో కలిసి కవాతు గణేష్ నిమజ్జనం శోభాయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన మిలాద్–ఉన్–నబీ ఏర్పాట్లపై ముస్లిం మతపెద్దలతో చర్చ -
రాష్ట్రంలో అరాచక పాలన
గోరంట్ల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న గ్రామల్లో అధికార పార్టీ నాయకులు చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. సోమవారం ఆమె గోరంట్లలో పర్యటించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని వెంకటరమణపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు చేసిన దాడిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరామార్శించారు. ఈ సందర్భంగా గోరంట్లలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెంకటరమణపల్లిలో వినాయకుని ఉరేగింపు కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు అడ్డగించడం హేయమైన చర్య అన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు కొంతమంది పోలీసు అధికారులు వత్తసు పలకడం శోచనీయమన్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ వారిపై దాడులు చేస్తే సీఐ శేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా బాధితులైన వైఎస్సార్ సీపీ నాయకులనే అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అందువల్లే గ్రామస్తులంతా ధర్నాకు దిగారని, అప్పుడుగానీ సీఐ శేఖర్ ఇరువర్గాలను అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐ శేఖర్ టీడీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, మండలంలోని పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కావాలనే పోలీసు స్టేషన్ కు పిలిపించి కేసుల పెడతామని బయపెడుతున్నారన్నారు. కొన్నిరోజుల క్రితం సీఐ శేఖర్ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను స్టేషన్కు పిలిపించి వేధించారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే... వెంటనే వారిని స్టేషన్కు పిలిపించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సీఐ శేఖర్ తన పనితీరు మార్చుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, న్యాయం పోరాటం చేస్తామన్నారు. వెంకటరమణపల్లిలో జరిగిన ఘటనలో అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోతే పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారం కోసమే అలవిగాని హామీలు.. పెనుకొండ రూరల్: అధికారం కోసమే కూటమి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు గుప్పించారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. సోమవారం ఆమె మండలంలోని అడదాకులపల్లిలో ‘కాఫీ విత్ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. అధికారంలో చేపట్టిన రోజు నుంచి ప్రజలను వంచిస్తున్నారన్నారు. కొత్తగా పథకాలు ఇవ్వకపోగా.. ఉన్న పథకాల్లోనే కోతలు విధించి ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, సర్పంచ్ అలివేలమ్మ, పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మండల మాజీ కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘కూటమి’ అరాచకాలకు పోలీసుల వత్తాసు దుర్మార్గం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
లేపాక్షి: జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం లేపాక్షిలోని హౌసింగ్ కార్యాలయంలో ఏపీఏంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, ఎంపీడీఓ నరసింహమూర్తితో కలసి గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఇంజనీర్ల అసిస్టెంట్లతో ఆయన సమీక్షించారు. మండల వ్యాప్తంగా వివిధ దశలో 300 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటి నిర్మాణాలు పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేయని ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు అదనంగా చెల్లిస్తారన్నారు. ఇంటి స్థలాలు ఉండి గృహ నిర్మాణం మంజూరుకు 872 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. హౌసింగ్ పీడీ వెంకటనారాయణ -
పాత కక్షలతో దాడి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న దాడుల్లో నలుగురికి గాయాలయ్యాయి. పట్నం గ్రామానికి చెందిన వెంకటేష్, చెన్నయ్య, శ్రీనివాసులు, ఆయన కుమార్తె అంజలిపై అదే గ్రామానికి చెందిన సూరి, ఆయన కుమారులు అరవింద్, అశోక్, నాని కొడవలితో దాడి చేశారు. పశువుల మేత మేస్తున్న ప్రదేశానికి సంబంధించి ఆదివారం రాత్రి వెంకటేష్ బంధువుకి, సూరికి మధ్య గొడవ జరిగింది. గతంలోనే వీరి మధ్య గొడవలు ఉన్నాయి. పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం. క్షతగాత్రులను కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ నిరంజనరెడ్డి తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబును నిలదీద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ మహిళా జోనల్ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత వరుదు కళ్యాణి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. జైళ్లకు పంపిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమావేశంలో సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంపద సృష్టి పేరుతో ప్రజల నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పుల భారం ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలు వివరించాలని పిలుపు వైఎస్సార్సీపీ మహిళా జోనల్ సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి -
చెరగని సంతకం మరవలేని జ్ఞాపకం
వైఎస్సార్..ఈ పేరు వినగానే తెలుగునేల మీద ఉన్న ప్రతి గుండె స్పందిస్తుంది. ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత అంటూ కీర్తిస్తుంది. ఆయన వ్యతిరేకులు సైతం...గొప్ప నాయకుడంటూ వేనోళ్ల పొగడుతారు. గుండె గుడిలో.. బీళ్లుగా మారిన నేల తడిలో ఆయనుంటారు. కదిరి/అనంతపురం అగ్రికల్చర్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో కుల, మత, పార్టీలకు అతీతంగా పాలన సాగించారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించారు. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా పేరున్న 104 సేవలను అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు బాసటగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఖరీదైన వైద్యం చేయించారు.రైతు నేస్తం..2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలిసంతకంతోనే వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ చేశారు. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్లు విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అలాగే 2004కు ముందు రూ.1000 కోట్ల లోపున్న పంట రుణాలను రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు. పంటల బీమా పథకాన్ని రైతులకు మేలు జరిగేలా మార్పు చేసి అంతులేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1138 కోట్లు పరిహారం ఇచ్చారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు ఇచ్చారు. 2008లో 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు కూడా ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ, అలాగే కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ఇక అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించారు. రూ.25 కోట్లు రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి శ్రీకారం చుట్టారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. రైతులకు బిందు, తుంపర పరికరాలు... ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో ఇచ్చారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్లు రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇవే కాకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.వైఎస్సార్ హయాంలో ఎంతో అభివృద్ధివైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీసత్యసాయి జిల్లా (అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లా) ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మిల్స్బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. లోఓల్టేజీ కరెంటుతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి మండలంలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటి సామర్థ్యాన్ని కూడా పెంచారు.కదిరి పట్టణ ప్రజలు తాగునీటికోసం అల్లాడి పోతున్న విషయాన్ని గమనించిన వైఎస్సార్.. ఏకంగా రూ.100 కోట్లతో మంచినీటి పథకాన్ని చేపట్టి శాశ్వత పరిష్కారం చూపారు.హంద్రీనీవా పథకం ద్వారా కదిరి ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చారు.కదిరి మండలం చెర్లోపల్లి వద్ద హంద్రీనీవా రిజర్వాయర్ను నిర్మించారు.పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తెచ్చారు.ధర్మవరం పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం రూ.84 కోట్లతో ‘కేతిరెడ్డి సూర్యప్రతాప్రెడ్డి శాశ్వత మంచినీటి పథకం’ పేరుతో పార్నపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.చేనేత రుణమాఫీతో జిల్లాలోని చేనేతలకు ఆర్థికంగా అండగా నిలిచారు.హిందూపురంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు డాక్టర్ వైఎస్సార్ సుమారు రూ.600 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని చేపట్టారు.పెనుకొండ నియోజకవర్గానికి హంద్రీనీవా కాలువలు తవ్వించారు.మడకశిర నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ రోడ్లు వేశారు. తాగునీటి సమస్య తీర్చారు.సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మడకశిర నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చూసి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజక వర్గానికి కృష్ణా జలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.మడకశిర నియోజకవర్గంలోని వక్కలిగలను బీసీ కేటగిరీలోకి మార్చారు. ఫలితంగా ఆ సామాజిక వర్గంలోని ఎందరో రిజర్వేషన్ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మేళ్లు ఎన్నో... అందుకే జనమంతా ఇప్పుడు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.మహిళా పక్షపాతివైఎస్సార్ తన హయాంలో మహిళాభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా ఎందరో జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపారు. అలాగే ఏ ఆసరా లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ అందించారు. ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం, రూ.2లకే కిలో బియ్యం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చెరగని ముద్రవేశారు.ఆయన్ను కొలవని పల్లె లేదు ఆయన్ను తలవని తల్లి లేదుఅపన్నులకు ఆత్మబంధువుఅభాగ్యుల పాలిట కల్పతరువుకుయ్కుయ్ మనే 108 సైరన్లో..పేదవాడి గుండెచప్పుడులో..కూలి కష్టంలో...రైతు స్వేదంలో..నిరుపేద ఇంట వెలిగిన అక్షర కాంతిలో..కూలీలు కలిపే అన్నం ముద్దలో..అక్కచెల్లెమ్మల అభివృద్ధి పథంలో..పారే నీరులో...పచ్చని పొలంలోకనిపిస్తూనే ఉంటారు..భౌతికంగా దూరమైనా..నమస్తే అక్కయ్యా... నమస్తే అన్నయ్యా..నమస్తే తమ్ముడూ.. నమస్తే చెల్లెమ్మా..అంటూ ఆప్యాయతతో కూడిన ఆ పిలుపువినిపిస్తూనే ఉంటుంది. -
సీఐ వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్ ఫోర్స్: పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్నాయుడు సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నంచాడు. ఆ వీడియోలో ‘కొత్తచెరువు సీఐ జి. మారుతీశంకర్ కేసుల పేరుతో వేధిస్తున్నాడు. రోజూ స్టేషన్కు రావాలని కబురు పంపిస్తున్నాడు. రౌడీïÙట్ తెరిచామని.. స్టేషన్కు సకాలంలో రాకుంటే మరిన్ని కేసులు నమోదుచేస్తామని బెదిరించారు.అనవసరంగా నాపై కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నినట్లు అర్ధమవుతోంది. అందుకే సీఐ ద్వారా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకున్నా’.. అంటూ వివరించాడు. అనంతరం.. తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. స్థానికులు గమనించి అతనిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ నుంచి అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.కూటమి నేతల ఒత్తిళ్లతో.. కొన్ని రోజులుగా కొత్తచెరువు మండలంలో అనేకమందిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదుచేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసుల పేరుతో వేధిస్తుండడంతో ఇప్పటికే బాధితులు కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. తప్పు ఎవరిదనే విషయంపై ఆరా తీయకుండా.. కూటమి నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. -
పెళ్లి రోజే... మృత్యు ఒడికి!
శ్రీ సత్యసాయి జిల్లా: మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కపాడం నాగన్న, కపాడం రామాంజినమ్మ దంపతుల (ఇద్దరూ మాజీ ఎంపీటీసీ సభ్యులు) కుమారుడు రామ్మోహన్ భార్య హరిత (26) గత నెల 29న అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందింది. వీరికి ఏడేళ్ల క్రితం 2018, ఆగస్టు 29న వివాహమైంది. రామ్మోహన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే భార్యతో కలసి ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గొంతు నొప్పితో బాధపడుతున్న హరితను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రామ్మోహన్ పిలుచుకెళ్లి చికిత్స చేయించాడు. ఆ సమయంలో టాన్సిల్స్తో ఆమె బాధపడుతోందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్దారించారు. తాత్కాలికంగా మందులు ఇవ్వడంతో అప్పట్లో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 29న పెళ్లి రోజును హైదరాబాద్లో వేడుకగా జరుపుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం గొంతు నొప్పి తీవ్రం కావడంతో హరితను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరిశీలించిన వెద్యులు వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనైన హరిత గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి చేర్చి, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి... ఎం.చెర్లోపల్లికి చేరుకుని హరిత మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులును రాప్తాడులో పరామర్శించారు. ఆయన వెంట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ సాకే వెంకటేష్, యూత్ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, యూత్ మాజీ కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు. -
‘రిజర్వేషన్’తోనే మనుగడ
కేంద్ర ప్రభుత్వం చేనేతలకు కేటాయించిన 11రకాల రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఒకప్పుడు చేతి మగ్గం ఉండేదన్న విషయాన్ని భావితరాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇక హ్యాండ్లూమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. – జింకా కంబగిరి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం -
జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
ధర్మవరం అర్బన్: జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరానికి చెందిన నిఖ్యశ్రీ అనే క్రీడాకారిణి ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోనున్న బాస్కెట్బాల్ కోర్టులో ఆదివారం సదరు క్రీడాకారిణిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టులో ప్రతిభ కనబరచిన ధర్మవరం క్రీడాకారిణి నిఖ్యశ్రీ రాష్ట్ర జట్టుకు ఎంపికై ందన్నారు. ఈమె సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పంజాబ్ రాష్ట్రం లూథియానా నగరంలో జరిగే 75వ జూనియర్ నేషనల్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ బాలికల జట్టు తరఫున పాల్గొంటుందన్నారు. జాతీయస్థాయిలో కూడా రాణించి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్తుల్లా, కోచ్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో బుక్కపట్నం హైస్కూల్కు అరుదైన గౌరం పుట్టపర్తి: బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలకు అరుదైన గౌరవం లభించింది. 2024–2025లో రాష్ట, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటినందుకు గాను స్కూల్ ఆఫ్ స్పోర్ట్ ఎక్సలెన్స్ ఆవార్డుకు ఎంపికై ంది. 23 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరిచి రికార్డు సృష్టించడం గర్వంగా ఉందని హెచ్ఎం జగదీశ్వర్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆయన తెలిపారు. క్రీడల్లో విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన పీడీ నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక నిమజ్జనంలో ‘పచ్చ’ రభసగోరంట్ల: వెంకటరమణపల్లిలో అధికార టీడీపీ నాయకులు బరితెగించారు. తమ వీధిగుండా వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్లరాదంటూ ఓ వర్గం మహిళలు, ప్రజలపై కొడవళ్లతో దాడులకు తెగబడ్డారు.. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... వెంకటరమణపల్లిలో ఆదివారం సాయంత్రం, వైఎస్సార్సీపీ, ప్రజలు ఏర్పాటు చేసిన వినాయకున్ని నిమజ్జనం చేయడానికి గ్రామంలో ఉరేగింపుగా తీసుకెళ్లే సందర్భంలో.. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన నాగు అనే వ్యక్తి మరికొంత మంది వ్యక్తులు తమ వీధిగుండా వినాయకుడిని ఉరేగింపుగా తీసుకెళ్లరాదంటూ కొడవలితో అడ్డుకోబోయాడు. దీన్ని ప్రతిఘటించిన వినాయక సేవా సమితి సభ్యులపై దాడికి యాత్నించారు. దీంతో వినాయక సేవా సమితి సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బోయ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకుండా.. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చౌడిరెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అగ్రహించిన గ్రామస్తులు.. పోలీసుల తీరును నిరసిస్తు గ్రామంలో ధర్నాకు ఉపక్రమించారు. దీంతో పోలీసులు , ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకొన్నారు. -
స్వలాభం కోసమే లైనింగ్ పనులు
కదిరి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టారని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.రమణ విమర్శించారు. ఆదివారం కదిరిలోని ఎన్జీఓ హోంలో ‘సాగునీటి ప్రాజెక్టులు–విభజన హామీలు’ అనే అంశంపై వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జి.నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎ.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు సాకే హరి ఇంకా వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. హంద్రీ–నీవా ఫేజ్–2 కింద 7 ప్యాకేజీల్లో జరిగిన లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.936 కోట్లు వెచ్చించిందన్నారు. కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని వారు ప్రశ్నించారు. ఇందులో టీడీపీ ముఖ్య నేతలకు భారీగా ముడుపులు అందాయని, అందుకే నాసిరకం పనులు చేసినా కూటమి నేతలెవ్వరూ నోరు మెదపడం లేదని ఆరోపించారు. లైనింగ్ పనులు చేపట్టడంతో భవిష్యత్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని అభిప్రాయ పడ్డారు. లైనింగ్ పనులు వద్దంటున్న రైతుల మాటలను సీఎం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే లైనింగ్ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు తీరని అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో తాగునీటి పథకంగా శిలాఫలకాలకే పరిమితమైన హంద్రీ–నీవాను తాగు, సాగునీటి ప్రాజెక్టుగా మార్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి దక్కుతుందన్నారు. వైఎస్ చొరవతో 2009 నాటికే హంద్రీ–నీవా మొదటి దశ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించి, ఇందుకోసం రూ.6,182 కోట్ల పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారని, అదే విధంగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారని చెప్పారు. విభజన హామీలపై నోరు మెదపరెందుకు..? విభజన హామీలపై కూటమి పార్టీల నాయకులు నోరు మెదపకపోవడాన్ని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి నియోజకవర్గంలో ‘వెనుక బడిన ప్రాంతాల అభివృద్ది వేదిక’ కమిటీలు వేసి ప్రజల్ని చైతన్యం చేయాలని వారు నిర్ణయించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లింగాల మధుసూదన్రెడ్డి, కదిరి మండల కన్వీనర్ మణికంఠ నాయక్, రైతు విభాగం నాయకులు జైనుల్లా, సీపీఎం జిల్లా నాయకులు నరసింహులు, ఆర్సీపీ నాయకులు నాగన్న, రెడ్స్ సంస్థ నిర్వాహకురాలు భానూజా, ఐసీడీఎస్ రిటైర్డ్ సీడీపీఓ నిర్మలమ్మ, న్యాయవాది నరసింహులు, ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళం విన్పించారు. -
నష్టం మిగిల్చిన వేరుశనగ
● అ‘పూర్వ’ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు నల్లమాడ: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994–95లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాటశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న వారి ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. నాటి గురువులు వెంకటరమణప్ప, దేవవరం, బాషా, సుబహాన్, రమాదేవి, ప్రస్తుత హెచ్ఎం భాస్కర్రెడ్డి, వార్డెన్ రవిచంద్రరాజును ఘనంగా సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. పాఠశాల ఆవరణలోని జువ్వి చెట్టు చుట్టూ అరుగు నిర్మించేందుకు నల్లసింగయ్యగారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి ఎం.శ్రీనివాసులు రూ.20 వేలు అందజేశారు. నల్లమాడ: అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం.. దళారీల బెడదతో ఈ ఏడాది కూడా వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ ఆరంభంలోనే కోటి ఆశలతో రైతులు వేరుశనగ సాగు చేపట్టారు. వర్షాధారంగా దాదాపు వెయ్యి ఎకరాల్లో వేరుశనగ సాగులోకి వచ్చింది. ముందస్తుగా సాగు చేపట్టిన రైతులు ఇప్పటికే పంట నూర్పిడి చేసి దిగుబడిని విక్రయించారు. మరికొందరు పంట నూర్పిడి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం ఒక ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగుకు విత్తనాలు, ఎరువులు, మందులు, సేద్యం, పంట నూర్పిడి తదిరాలన్నీ కలిపి రూ.35 వేలు పెట్టుబడి అయినట్లు నల్లమాడ మండల రైతులు శ్రీరాములు, చిదంబరరెడ్డి, ఓబిరెడ్డి, చంద్ర తెలిపారు. పంట నూర్పిడి అనంతరం ఎకరాకు 10 మూటల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 44 కిలోలు వేరుశనగ బస్తా రూ.2,500 ధర పలుకుతోంది. ఈ లెక్కన ఒక ఎకరాకు రూ.25 వేలు మాత్రమే చేతికొస్తోంది. నాలుగు నెలల పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే ఎకరాకు రూ.10 వేలు నష్టాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుశగన విత్తనం వేశాక జూన్, జూలై మాసాల్లో తీవ్ర వర్షాభావానికి తోడు చీడపీడలు పంట దిగుబడిని దెబ్బతీసినట్లు అభిప్రాయపడుతున్నారు. ఆదుకోని ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా రైతులు ప్రధాన పంటగా వేరుశనగనే సాగు చేస్తున్నారు. దిగుబడి రాగానే ధర సగానికి పైగా పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. అరకొరగా పంట దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమా కింద ప్రీమియం మొత్తాన్ని చెల్లించినా.. బీమా పరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు. పెట్టుబడి కూడా దక్కని వైనం ఆదుకోని ప్రభుత్వం.. నిరాశలో రైతులు -
గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి
హిందూపురం: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిదానంగా ముందుకు సాగుతున్న వేళ డ్రైవర్ ఉన్నపళంగా ఎక్సలేటర్ తొక్కడంతో ట్రాక్టర్ ముందు భాగంలో ఉన్న భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురంలోని మారుతినగర్ మెయిన్రోడ్డులో శుక్రవారం నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాల ఊరేగింపు జరుగుతోంది. ఓ ట్రాక్టర్ ముందు భాగంలో భక్తులు నృత్యాలు చేసుకుంటూ వస్తుండగా.. డ్రైవర్ అకస్మాత్తుగా ఎక్సలేటర్ తొక్కాడు. అంతే ట్రాక్టర్ ఒక్క ఉదుటున ముందుకు వేగంగా కదిలి.. సౌభాగ్యమ్మ, మారుతి, ఆదర్శ, మమత, ఉమాదేవి, దీక్షిత, వేదవతి, గంగరత్నమ్మ, కీర్తనపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మారుతి (35)తో పాటు సౌభాగ్యమ్మ తలకు తీవ్రగాయాలై పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మారుతి చనిపోయాడు. మిగిలిన క్షతగాత్రులు హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ● ఇదిలా ఉండగా హిందూపురం మండలం బాలంపల్లి వద్ద ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న మనోహర్ అనే యువకుడు స్పీడ్ బ్రేకర్ను గమనించకుండా అలాగే పోనివ్వడంతో ఎగిరి కిందపడ్డాడు. తలకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ దూసుకెళ్లి యువకుడి మృతి మరో 8 మందికి గాయాలు -
వినాయక.. సెలవిక
ధర్మవరం అర్బన్: వినాయక ఉత్సవాల్లో ఐదోరోజు ఆదివారం ధర్మవరం, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల్లో భారీ ప్రతిమల నిమజ్జనం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. మంటపాల్లో కొలువుదీరిన గణేశుడు ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలందుకున్నారు. నిమజ్జనం సందర్భంగా అన్నదానాలు.. లడ్డూ ప్రసాదాల వేలం నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక వాహనాల్లోకి విగ్రహాలను కొలువుదీర్చి ఊరేగింపుగా తీసుకెళ్లారు. డ్రమ్స్ వాయిద్యాల నడుమ యువత, మహిళలు, చిన్నారులు చిందులు వేశారు. గణపతి బప్పా మోరియ.. జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. పార్వతీ తనయుడు వినాయకునికి జై అంటూ నినదించారు. అనంతరం చెరువులు, కాలువలు, నీటి కుంటలు, వంకల్లో నిమజ్జనం చేశారు. -
వైద్యం.. దైన్యం
కొత్తచెరువు సీహెచ్సీ ఆస్పత్రికి అదే గ్రామానికి చెందిన డెయిరీ రాజా (రాజశేఖర్) ఆదివారం వైద్యం కోసం వచ్చాడు. అయితే సిబ్బంది ఎవరూ స్పందించకపోవడంతో ఆయనే తన కాలుకు డ్రెస్సింగ్ చేసుకుని కట్టు కట్టుకుని వెళ్లిపోయాడు. ఇదేంటని అక్కడి ప్రజలు అడగ్గా.. డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోలేదని.. ‘నేనే రోగిని.. నేనే డాక్టర్ను’ అంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న వాళ్లందరూ అవాక్కయ్యారు. ● కొత్తచెరువు ఆస్పత్రికి శుక్రవారం జ్వరంతో బాధపడుతున్న ఓ రోగి వెళ్లాడు. రక్త పరీక్షలు చేశారు. అప్పటికే మధ్యాహ్నం దాటింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఉన్నఫలంగా కరెంటు కోత విధించారు. దీంతో ల్యాబ్లో పరీక్షలు చేసే వారు రిపోర్టులు ఇవ్వలేకపోయారు. మరుసటి రోజు రావాలంటూ సూచించారు. ఆదివారం ఉదయం వెళ్తే ల్యాబ్లో ఎవరూ లేరు. దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్యం పొందారు. జిల్లా కేంద్రం పుట్టపర్తికి కూతవేటు దూరంలోని కొత్తచెరువులో మాత్రమే కాదు.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ రోగులు ఇలాగే అవస్థలు పడుతున్నారు. హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, మడకశిర, ముదిగుబ్బ, గోరంట్ల.. ఇలా ప్రతి చోట వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రోగులు దిక్కు తోచని స్థితిలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాక్షి పుట్టపర్తి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ప్రభుత్వ వైద్యం దైన్యంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏ పల్లెలో చూసినా రోగులు పదుల సంఖ్యలో ఆస్పత్రుల బాట పడుతున్నారు. వారం రోజుల నుంచి ఓపీ రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే రోగులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది ఆస్పత్రిలో లేరు. డాక్టర్లు పట్టించుకోవడం లేదు. సకాలంలో వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివాళ్లు.. గంటల తరబడి.. కొన్ని రోజుల పాటు నిరీక్షించి వైద్యం పొందుతున్నారు. అయినప్పటికీ రవాణా ఖర్చు.. బయట తినుబండారాలు రూ.వేలల్లో అవుతోందని వాపోతున్నారు. ఇక పెద్దాస్పత్రి అని హిందూపురం జిల్లా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వచ్చి.. అలా వెళ్తున్నారు! ఉదయం 8 గంటలకే డాక్టర్లు విధులకు హాజరు కావాలి. ఇన్ పేషెంట్ల వార్డుల్లో రౌండ్లు పూర్తి చేసుకుని 9 గంటలకు ఓపీలోకి వచ్చి సేవలు అందించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలందించాలి. అయితే ఎక్కువమంది డాక్టర్లు చుట్టపుచూపుగా 10 గంటలకు వచ్చి.. పది నిమిషాల పాటు హడావుడి చేసి.. ఒక టీ తాగి.. గంట పాటు కాలక్షేపం చేసి మధ్యాహ్నానికి వెళ్లిపోతున్నారు. ఉన్నంత సేపు రోగులను పరిశీలించి పరీక్షలు చేయించుకోవాలని రిపోర్టులు రాసి.. రేపు వచ్చి కలవాలని సూచిస్తున్నారు. జ్వర పీడితులే అధికం.. హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓపీ రోగుల సంఖ్య సగటున రోజుకు 500 ఉండగా.. నాలుగైదు రోజుల నుంచి 800 దాటుతోంది. ధర్మవరం ఏరియా ఆస్పత్రిలో రోగుల సగటు 200 నుంచి 600 వరకు పెరిగింది. కొత్తచెరువు సీహెచ్సీలో 100 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. రోగుల్లో 70 శాతం మంది జ్వరపీడితులే కావడం గమనార్హం. గత నెలతో పోలిస్తే జ్వరపీడితులు 20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. వైద్యం కోసం మళ్లీ.. మళ్లీ! ఏ ఆస్పత్రిలో చూసినా రోగులు మరుసటి రోజు మళ్లీ రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే రోగంతో పదే పదే ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా.. సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. ఒక రోజు పరీక్షలు చేస్తారు. మరుసటి రోజు రిపోర్టులు ఇస్తారు. అదే రోజున డాక్టర్ పట్టించుకోరు. దీంతో మూడో రోజు వెళ్లి డాక్టర్ను సంప్రదించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రుల్లో రోగులను సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు విధుల్లో ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం గంటల తరబడి వేచి చూసినా అందని వైద్యం టెస్టులు రాసిస్తారు.. రిపోర్టులు వచ్చే లోపు జంప్ -
ఇళ్లలోకి దూసుకెళ్లిన లారీ
బత్తలపల్లి: మండలంలోని గుమ్మల్లకుంట క్రాస్ ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి ఓ లారీ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన మేరకు... చైన్నె నుంచి అనంతపురం వైపుగా ఆదివారం తెల్లవారుజామున అగ్గి పెట్టెల లోడుతో వెళుతున్న గుమ్మల్లకుంట క్రాస్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి ఎస్సీ కాలనీలోకి దూసుకెళ్లింది. డ్రైనేజీ కాలువ దాటుకుని రోడ్డు పక్కన ఉన్న మేరీ దుకాణాన్ని ఢీ కొంది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న పెద్దన్న ఇంటిని ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. రూ.80 వేలు విలువ చేసే సరుకులు పాడయ్యాయి. పెద్దన్న ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతినడంతో రూ.30వేలు వరకు నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకటేశులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు ఢీ.. గొర్రెల మృతి మండలంలోని రామాపురం వద్ద జీవాల మందపై కారు దూసుకెళ్లిన ఘటనలో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే కారు డ్రైవర్, గొర్రెల యజమానులు రాజీ కావడంతో ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేదని పోలీసులు తెలిపారు. -
కష్టమంతా వృధా
మూడెకరాలు భూమిని కౌలుకు తీసుకుని జూన్లో వేరుశనగ పంట వేశా. పెట్టుబడి కింద రూ.లక్ష ఖర్చు వచ్చింది. దిగుబడి 35 మూటలు రావడంతో పెట్టుబడి మొత్తం కూడా చేతికి దక్కలేదు. మూడు నెలలకుపైగా మా కష్టమంతా వృధా అయింది. – మాదారపు శ్రీరాములు, కౌలురైతు, మూలప్పగారిపల్లి, నల్లమాడ మండలం గిట్టుబాటు ధర కల్పించాలి వేరుశనగ రైతు ప్రతిసారీ నష్టపోతూనే ఉన్నాడు. ప్రభుత్వం వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాతో రైతులను ఆదుకుంది. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అనేది లేకుండా పోయింది. బీమా ప్రీమియంను రైతులే చెల్లించారు. అయినా పరిహారం అందజేతలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇలాగైతేనే రైతు మనుగడ కష్టం. – చిట్టిబాల ఆదినారాయణరెడ్డి, రైతు, రాగానిపల్లి, నల్లమాడ మండలం -
కూలి గిట్టుబాటు కావడం లేదు
కర్ణాటకలో పవర్లూమ్స్లో తయారు చేసిన పట్టుచీరలు మన ప్రాంతానికి తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో ఇక్కడి చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు జిల్లాలోనూ మరమగ్గాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి చేనేతను చావుదెబ్బతీస్తున్నారు. దీంతో చేతిమగ్గంపై నేసిన పట్టు చీరకు కూలి కూడా గిట్టుబాటు కాక మూత వేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మగ్గాలను నిర్వహించలేం. – శంకర్, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం. -
అలరించిన సాంస్కృతిక వైభవం
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ.. మానవతా విలువలు వివరిస్తూ సాయి విద్యాసంస్థల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్త కోటిని పరవశభరితులను చేశాయి. దేశ వ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సంస్థల నేతృత్వంలో నిర్వహిస్తున్న 103 పాఠశాలలకు చెందిన 2,400 మంది విద్యార్థులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చి సత్యసాయి మహాసమాధి చెంత శ్రీసత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో కృతజ్ఞతా పూర్వక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి గురుకులం బెజ్జంకి, శ్రీసత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నంకు చెందిన విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సూరత్కు చెందిన శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులు గరాబ్ నృత్యం ప్రదర్శించారు. హర్యానాకు చెందిన శ్రీసత్యసాయి జాగృతి విద్యా మందిరం విద్యార్థులు బాంగ్రా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం ఒడిశాలోని పార్లాక్కెముండి గజపతి జిల్లాకు చెందిన శ్రీసత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. -
తప్పనిసరిగా హాజరు కావాలి
గోరంట్ల: గోరంట్ల బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ల కాంప్లెక్స్ సమావేశాలను శనివారం డీఈఓ కిష్టప్ప పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పకుండా హాజరై అన్ని విషయాలు చర్చించి పాఠశాలలో విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు సెలవు పెట్టుకోకూదన్నారు. టీచర్ డైరీ అసైన్మెంట్ బుక్లెట్లను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన పిల్లలకు రెమిడియల్ క్లాసెస్ నిర్వహించి వారిన తరువాత జరిగే పరీక్షలకు సమాయాత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు రెడ్డెప్పతోపాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
చెన్నేకొత్తపల్లి: గ్రామ కంఠం, ఇంటి స్థలాలకు యాజమాన్య హక్కు కల్పించేందుకు చేపట్టిన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని డీపీఓ సమత సిబ్బందికి సూచించారు. న్యామద్దెల పంచాయతీ హరియాన్చెరువు గ్రామంలో జరుగుతున్న సర్వేను శనివారం ఆమె పరిశీలించారు. సర్వే త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్రెడ్డి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ హేమంత్, వెంకటేష్, గ్రామ సర్వేయర్ వినోద్ పాల్గొన్నారు. సచివాలయం తనిఖీ : చెన్నేకొత్తపల్లి సచివాలయం–1ను డీపీఓ సమత ఇన్చార్జ్ ఎంపీడీఓ అశోక్నాయక్తో కలసి తనిఖీ చేశారు. కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. పన్నులు, పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ తదితర పనుల గురించి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో దోమలు పెరిగి జ్వరాలు పెరిగే ప్రమాదం ఉందని, కావున ప్రత్యేక శ్రద్ద చూపాలని సిబ్బందికి సూచించారు. -
ఎట్టకేలకు ఎరువులు వచ్చాయ్
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు యారియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు శనివారం అనంతపురం చేరాయి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) కంపెనీ నుంచి వచ్చిన ఎరువులకు స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్లో రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్తో పాటు విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ తదితరులు పరిశీలించారు. 500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా.. అందులో మార్క్ఫెడ్ 350 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ హోల్సేల్డీలర్లకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏడీఏ తెలిపారు. ఇందులో అనంతపురం జిల్లాకు 388 మెట్రిక్ టన్నులు కాగా.. శ్రీసత్యసాయి జిల్లాకు 112 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇక 15–15–15 రకం కాంప్లెక్స్ ఎరువులు 854 మెట్రిక్ టన్నులు రాగా.. అందులో అనంతపురం జిల్లాకు 574 మెట్రిక్ టన్నులు, శ్రీసత్యసాయి జిల్లాకు 280 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆర్ఎస్కేలు, సొసైటీలతో పాటు ప్రైవేట్ డీలర్ల దగ్గర తగినంత యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులు తెలిపారు. ఇద్దరికి ప్రొఫెసర్లుగా పదోన్నతి అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్ జరిగింది. కాగా ఈఎన్టీ విభాగానికి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్, ప్రస్తుత ఇన్చార్జ్ హెచ్ఓడీగా ఉన్న డాక్టర్ రాజేష్కుమార్కు, మానసిక వైద్య విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ శారదకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తోటి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు. వీరిద్దరికీ ప్రొఫెసర్లుగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే పోస్టింగ్ వచ్చింది. డ్రిప్ పరికరాలు అందించండి పుట్టపర్తి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరాని(2024–25)కి సంబంధించి డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను వారంలోపు అందించాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పేర్కొన్నారు. శనివారం పీడీ తన కార్యాలయంలో 23 డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను అందించే ఏజెన్సీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12,044 హెక్టార్లకు సంబంధించి రైతులకు పెండింగ్లో ఉన్న వ్యవసాయ పరికరాలను వారం లోపు అందించి ఇన్స్టలేషన్ పూర్తి చేయాలన్నారు. ఇక 2025–26సంవత్సరానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. డీడీ (లింక్ ద్వారా) తీసుకొని ఎస్టిమేషన్ వేసి అప్రూవల్కు పంపాలన్నారు. రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ డీడీలు స్వీకరించకుండా కేవలం లింక్ ద్వారానే డీలర్కు పంపాలన్నారు. వైద్య విద్య కార్యక్రమాలతో నూతన ఆవిష్కరణలు అనంతపురం మెడికల్: నిరంతర వైద్య విద్య కార్యక్రమాల ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రో బయాలజీ విభాగానికి సంబంధించి సీఎంఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య కళాశాలలో యూజీ, పీజీ సీట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. వైద్యులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్, ప్రొఫెసర్ శాంతిరెడ్డి, డాక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వ్యసనాలకు అలవాటుపడి.. దొంగగా మారి
పుట్లూరు: వ్యసనాలు ఆ యువకుడిని దొంగగా మార్చాయి. చోరీలు చేస్తూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సత్యబాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల కేంద్రం పుట్లూరులోని బీసీ కాలనీలో ఈ నెల 22న చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీలు జరిగిన తీరు, పాత నేరస్తుల కదలికలతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. బీసీ కాలనీకి చెందిన దాసప్పగారి బాలచంద్ర అలియాస్ బాలును అనుమానితునిగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీసీ కాలనీలో జరిగిన చోరీతో పాటు గ్రామంలోని జనరల్ స్టోర్లో జరిగిన దొంగతనం కూడా బాలునే చేసినట్లు విచారణలో తేల్చారు. కూలి పనులు చేసుకునే ఇతడు ఆన్లైన్ గేమ్, పేకాట తదితర జూదాలకు డబ్బు అవసరమై దొంగతనాల బాట ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ మేరకు బాలును శనివారం అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మూడు జతల బంగారు కమ్మలు, 8 గ్రాముల చైన్, రెండు ఉంగరాలు, 25 తులాల వెండి గొలుసులతో పాటు జనరల్ స్టోర్లో చోరీ చేసిన రూ.7,450 నగదును రికవరీ చేసినట్లు సీఐ వివరించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో యల్లనూరు ఎస్ఐ రామాంజనేయరెడ్డి, ట్రైనీ ఎస్ఐలు రామక్రిష్ణ, సురేష్, కానిస్టేబుళ్లు వెంకటేష్, షెక్షావలి, నరేష్, రాము, రమేష్ పాల్గొన్నారు. -
చంటి బిడ్డతో వేచివున్నా.. ఆపని బస్సులు
బత్తలపల్లి: బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం ఉదయం 11.30 గంటలకు ఓ మహిళ చంటి బిడ్డతో ధర్మవరం వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డుపైనే ఎండలో వేచి ఉంది. బస్సులు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. వచ్చిన ప్రతి బస్సునూ ఆ మహిళ ఆపేందుకు చేయి ఎత్తుతోంది. బస్సు డ్రైవర్లు మాత్రం చూసి కూడా ఆపకుండానే వెళ్లిపోతున్నారు. ఫ్రీ టికెట్..ఎందుకు ఆపాలని అనుకున్నారో ఏమో..చంటి బిడ్డతో వేచి ఉందన్న కనీస మానవత్వం కూడా లేకుండానే వెళ్లిపోయారు. ఇలా ఐదు బస్సులు వెళ్లాయి. అప్పటికి 12 గంటలు అయింది. చివరికి అక్కడున్న వారికి ఈ తతంగం ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో ధర్మవరం డిపోకు చెందిన ధర్మవరం–పులివెందుల బస్సు వచ్చింది. ఆ బస్సు కూడా ఆపకుండా వెళుతుండడంతో స్థానికులు ద్విచక్ర వాహనంలో వెంబడించారు. జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్తో ఘర్షణకు దిగారు. ఓ మహిళ చంటి బిడ్డతో ఎండలో ఉందన్న మానవత్వం కూడా లేకుండా ఎలా వెళ్లిపోతారంటూ నిలదీశారు. తర్వాత ఆ మహిళను బస్సులో ఎక్కించి పంపించారు. మహిళలకు ఎలాగూ ఫ్రీనే కదా అనే ఉద్దేశంతో చాలావరకు బస్సులు ఆపడంలేదని పలువురు తెలిపారు. ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య బత్తలపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బత్తలపల్లి ఏఎస్ఐ సోమశేఖరమూర్తి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన లక్ష్మన్న కుమారుడు చిట్రా రమేష్(34) ఇంట్లోనే చేతి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ముడి సరుకులు ధర పెరగడంతో కూలి గిట్టుబాటుకాక జీవనం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడంతో కుటుంబ పోషణకు రమేష్ తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వడ్డీలతో కలిపి అప్పు మొత్తం పెరుగుతుండగా...తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మగ్గం పక్కనపెట్టిన రమేష్ గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటున్నాడు. కూలి డబ్బులు కుటుంబ పోషణకే సరిపోతుండటంతో అప్పులు తీర్చలేక ఇబ్బందిపడేవాడు. అప్పులు తీర్చేమార్గం కనిపించక జీవితంపై విరక్తి చెందిన రమేష్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి చీరతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన కూతురు దూలానికి వేలాడుతున్న రమేష్ను చూసి బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి చీరను కోసి రమేష్ను కిందకు దించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు గమనించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ సోమశేఖరమూర్తి సిబ్బందితో గ్రామానికి చేరుకుని మృతుని భార్యతో వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బార్ టెండర్లలో సిండికేటు
సాక్షి, పుట్టపర్తి నూతన మద్యం పాలసీ ద్వారా బార్లకు లైసెన్సులు ఇచ్చి.. మరింత ఆదాయం పెంచాలని భావించిన కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కూటమి పార్టీల నాయకులే సిండికేటుగా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. బార్లకు ఇతరులను దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలో మొత్తం 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఒక బార్ను కల్లుగీత కార్మికులకు కేటాయించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.5 లక్షలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీంతో భారీగా దరఖాస్తులు అందుతాయని అందరూ భావించారు. అయితే కూటమి నేతలు దరఖాస్తు చేసేందుకు ఉత్సాహం చూపిన పలువురిని బెదిరించారు. దీంతో కూటమి నేతల కనుసన్నల్లోనే టెండర్లు నడిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కా ప్లాన్తో సిండికేటుగా మారిన కూటమి నేతలు పరిమితంగానే దరఖాస్తులు చేశారు. ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు ఉంటేనే లాటరీ తీస్తామని నిబంధనలు విధించడంతో ఆరుబార్లకు నాలుగు చొప్పున మాత్రమే దరఖాస్తులు చేశారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే టెండర్లలో పాల్గొన్నట్లు స్పష్టం అవుతోంది. మిగతా ఐదుబార్లకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తూ రాలేదు. దీంతో ఆ ఐదు బార్లకు లాటరీ వాయిదా వేశారు. ఇక కల్లుగీత కార్మికులకు రిజర్వు చేసిన బార్కు గరిష్టంగా 11 మంది పోటీ పడటం విశేషం. మొత్తం 7 బార్లకు 35 మంది పోటీ పడగా.. లాటరీ విధానంలో ఎంపిక చేశారు. శనివారం ఉదయం పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్ లాటరీ ద్వారా బార్లు కేటాయించారు. సక్సెస్ఫుల్ అప్లికెంట్, ఆర్–1, ఆర్–2 చొప్పున ఒక్కో బార్కు ముగ్గురిని ఎంపిక చేశారు. మొదటి వారు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సదరు వ్యక్తి ముందుకు రాకుంటే మరో వ్యక్తి.. ఆయన రాకుంటే ఇంకొకరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేశారు. ● కల్లుగీత కార్మకులకు ఒక బార్ రిజర్వు చేయగా... హిందూపురంలో కేటాయించారు. ● ధర్మవరంలో మూడు బార్లకు గానూ.. కేవలం ఒకబార్కు మాత్రమే దరఖాస్తులు వేశారు. మిగతా రెండింటికి ఒక్క దరఖాస్తు అందలేదు. ● హిందూపురంలో మూడు బార్లకు గానూ రెండుబార్లకు దరఖాస్తులు అందాయి. మరో బార్కు ఎవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ● కదిరిలో మూడు బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా.. రెండింటికి మాత్రమే దరఖాస్తులు అందాయి. మరో బార్కు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ● పెనుకొండలో ఒక బార్కు నోటిఫికేషన్ ఇవ్వగా.. కేవలం నలుగురు మాత్రమే పోటీ పడ్డారు. ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ● మడకశిరకు ఒక బార్ రాగా... కర్ణాటక వాళ్లతో కూటమి నేతలు సిండికేట్ అయినట్లు సమాచారం. దీంతో ఒకరు కూడా దరఖాస్తు చేసేందుకు ముందుకు రాలేదని తెలిసింది.పక్కా ప్లాన్... దరఖాస్తులు పరిమితం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన ఆరు బార్లకు నాలుగు చొప్పునే దరఖాస్తులు అందిన వైనం ఐదు బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాక లాటరీ వాయిదా పారదర్శకంగా బార్ల కేటాయింపు పుట్టపర్తి టౌన్: జిల్లాలోని బార్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శంగా చేపట్టినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక సాయిఆరామంలో జిల్లాలోని 6 బార్లకు ఓపెన్ లాటరీ తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... నిబంధనల మేరకు దరఖాస్తులు అందిన మొత్తం 7 బార్లకు (కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన బార్తో కలిపి) 35 మంది పోటీ పడ్డారన్నారు. అందరి సమక్ష్యంలో లాటరీ తీసి బార్లు కేటాయించామన్నారు. రీ నోటిఫికేషన్ ఇస్తాం నిబంధనల మేరకు ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి. కానీ జిల్లాలో ఐదు బార్లకు నాలుగులోపే దరఖాస్తులు అందాయి. దీంతో ఆయా బార్లకు త్వరలోనే రీ–నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించాం. మిగిలిన వాటిని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన పారదర్శకంగా కేటాయించాం. – గోవింనాయక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి ఐదు బార్లకు లాటరీ వాయిదా.. లాటరీ తీసిన కలెక్టర్.. -
ఇంగ్లిష్పై ప్రావీణ్యం కరువు..
చేజారిన కొలువు!అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించాడు. అయితే ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ(సామర్థ్యం) పరీక్ష పాస్ కాని కారణంగా ఓ అభ్యర్థి పీజీటీ పోస్టు కోల్పోయాడు. డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రెండో రోజు శుక్రవారం కూడా ప్రశాంతంగా సాగింది. గురువారం హాజరుకాని అభ్యర్థులకూ అవకాశం కల్పించడంతో రెండు రోజులకు కలిపి మొత్తం 757 మంది అభ్యర్థులకు కాల్లెటర్లు అందాయి. వీరిలో వివిధ కారణాలతో 9 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పెండింగ్ పెట్టారు. కొన్ని సర్టిఫికెట్లు లేని కారణంగా హాజరైన వారిలో ముగ్గురివి పెండింగ్ పడగా, ఒక అభ్యర్థి ఫోన్ పని చేయలేదు. మరొక అభ్యర్థి బెంగళూరులో స్థిరపడ్డానని, తనకు ఇష్టం లేదని స్పష్టత ఇచ్చాడు. కేజీబీవీలో సీఆర్టీగా పని చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంపికై న అభ్యర్థినిపై ఫిర్యాదు రావడంతో పెండింగ్ పెట్టారు. ఆమె సర్వీస్లో ఉంటూ జీతం తీసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈమె తొలిరోజు హాజరైనా ఫిర్యాదు కారణంగా సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోకుండానే వెనుదిరిగింది. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ పరీక్ష పాస్ కాని కారణంగా మరో అభ్యర్థిని రిజెక్ట్ చేశారు. స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ టీచరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోస్టుకు ఎంపికయ్యాడు. అయితే, ప్రిన్సిపాల్గా పని చేసిన అనుభవం లేకపోవడంతో ఆయన ఈ పోస్టుకు అనర్హుడయ్యాడు. మొత్తం మీద జిల్లాలో 807 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా.. రెండు రోజుల్లో 757 మంది అభ్యర్థులకు కాల్లెటర్లు అందాయి. ఇంకా 50 పోస్టులకు స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం అందాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్, జిల్లా పరిశీలకులు సుబ్బారావు, డీఈఓ ప్రసాద్బాబు పర్యవేక్షించారు. పూర్తి పారదర్శకంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని వారు స్పష్టం చేశారు. మంచి ర్యాంకు సాధించినా పీజీటీ పోస్టు కోల్పోయిన అభ్యర్థి రెండోరోజూ ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన వివిధ కారణాలతో 9 మంది పెండింగ్ -
ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా తప్పనిసరి
ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్యార్డు గోదాములో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఫైర్ సేఫ్టీ, 24గంటల భద్రతాపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఎక్స్లెన్సీ అవార్డు అందుకున్న పీఈటీలులేపాక్షి: మండలంలోని పులమతి జెడ్పీహెచ్ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్బాబుతో పాటు గతంలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు రామాంజనేయులు శుక్రవారం ఎక్స్లెన్సీ అవార్డును అందుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి అవార్డులను జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అందజేశారు.నూతన బార్లకు నేడు లాటరీపుట్టపర్తి టౌన్: జిల్లాలో నూతన బార్ల ఏర్పాటుకు శనివారం కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని సాయిఆరామంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవింద్నాయక్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో మూడు చొప్పున బార్లు, మడకశిరలో 1, పెనుకొండలో 1, కల్లు గీత కార్మికులకు 1 చొప్పున బార్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. -
‘ఎంజీఎం’కు క్రీడా ప్రతిభా అవార్డు
హిందూపురం టౌన్: పట్టణంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎంజీఎం)కు జిల్లా స్థాయి క్రీడా ప్రతిభా పాఠశాల అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ చేతుల మీదుగా అవార్డును పాఠశాల హెచ్ఎం పాండురంగనాయకులు, పీడీ లోక్నాథ్ అందుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం పాఠశాల స్కూల్ అసిస్టెంట్ సుదర్శన్రెడ్డి, పీడీలు విలియమ్స్, రాణి, ప్రవీణ పాల్గొన్నారు. కియా ఉద్యోగి అదృశ్యం పెనుకొండ రూరల్: కియా అనుబంధ పరిశ్రమలో పనిచేస్తున్న యువకుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కియా ఎస్ఐ రాజేష్ శుక్రవారం తెలిపారు. వివరాలు... అనంతపురం జిల్లా శెట్టూరుకు చెందిన మైలారప్పకుమారుడు గురుప్రసాద్ ఇటీవల కియా అనుబంధ పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. గుట్టూరులో తనకు కేటాయించిన గధిలోనే సెల్ఫోన్, ఇతర సామగ్రిని వదిలేసి వెళ్లిపోయాడు. యాజమాన్యం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం కియా పీఎస్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఫిర్యాదులో గురుప్రసాద్ తండ్రి మైలారప్ప పేర్కొన్నారు. బాస్కెట్బాల్ బాలికల జట్టుకు జేసీ ప్రశంస ధర్మవరం అర్బన్: క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన జోనల్ స్థాయి అమరావతి చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీల్లో రన్నరప్ను సాధించిన జిల్లా బాలికల జట్టును జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అభినందించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్ భాస్కర్తో కలసి బాలికల జట్టును జేసీ అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. అలాగే జట్టు క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్తుల్లా, కోచ్ సంజయ్ అభినందించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎన్పీకుంట: తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి విలువైన బంగారు, నగదు, ఇతర సామగ్రిని అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్పీకుంట మండలం ఎన్.రెడ్డివారిపల్లికి చెందిన కె.నారాయణమ్మ పది రోజుల క్రితం బెంగళూరులోని కుమారుడి వద్దకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని శుక్రవారం తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తీసి లోపలకు ప్రవేశించిన ఆమె వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించి ఆందోళనకు గురై పరిశీలించింది. ఇంటి వెనుక ఉన్న తలుపులు బద్ధలు గొట్టి ఉన్నాయి. బీరువాలో దాచిన పొలానికి సంబంధించిన దస్తావేజులు, ఇంటి పత్రాలు, డిపాజిట్ బాండ్లు, ఎల్ఐసీ బాండ్లతో పాటు రెండు జతల బంగారు కమ్మలు, రూ.4వేల నగదు, విలువైన పట్టుచీరలు, 50 కిలోల బియ్యం బస్తా అపహరించుకెళ్లినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే వినాయక నిమజ్జనం తర్వాత వచ్చి పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపి వెనక్కు పంపేశారు. ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు పంపిన పోలీసులు -
ప్రేమ తిరస్కారం... యువకుడి బలవన్మరణం
కూడేరు: తన ప్రేమను యువతి నిరాకరించడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన నారాయణ కుమారుడు అనిల్కుమార్ (28) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో క్షణికావేశానికి లోనైన అనిల్కుమార్.. సెల్ఫీ వీడియో తీసి ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేసి శుక్రవారం కూడేరు మండలం గొటుకూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సీఐ రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.అక్రిడిటేషన్ల గడువు పొడిగింపుప్రశాంతి నిలయం: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఉత్తర్వులు మేరకు పీఆర్వో వేణుగోపాలరెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత గడువు ఈ నెల 30తో ముగియనుంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30వ తేదీ వరకు, లేదా కొత్త కార్డులు జారీ చేయడంలో ఏదీ ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉంటుంది. సోమవారం నుంచి బస్సు పాసులు రెన్యూవల్ చేయించుకోవచ్చు.‘దుర్గం’లో దొంగ నోట్ల హల్చల్కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో దొంగనోట్ల చెలామణి వెలుగు చూసింది. బ్రహ్మయ్య గుడి వద్ద ఉన్న ఓ టీ కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం కళ్లజోడు ధరించిన వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ రూ.200 నోటును నిర్వాహకురాలు యశోదమ్మ ఇచ్చాడు. రెండు సిగరెట్లు తీసుకోని చిల్లర రూ.160 తీసుకుని వెళ్లిపోయాడు. అయితే అది దొంగ నోటుగా ఆలస్యంగా గుర్తించిన నిర్వాహకురాలి సమాచారంతో విషయాన్ని కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తహసీల్దార్ సంతకం ఫోర్జరీ!సాక్షి టాస్క్ఫోర్స్: తాడిపత్రి మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్గా జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ శుక్రవారం కలకలం రేపింది. ఈ సంతకం కొంతకాలం క్రితం బదిలీపై వచ్చిన తహసీల్దార్ది కావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తాడిపత్రికి చెందిన ఓ యువతి గ్రూప్ –2 పరీక్షలకు సిద్ధమవుతూ అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. ఈ అంశంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్గా సర్టిఫికెట్ జారీ చేశారు. వెరిఫికేషన్లో భాగంగా సర్టిఫికెట్ను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పంపింది. తన సంతకంతో కూడిన మాన్యువల్ సర్టిఫికెట్ చూడగానే తహసీల్దార్ సోమశేఖర్ నివ్వెరపోయారు. సంతకం చేసిన అధికారి గురించి అరా తీసి మందలించే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించినల్లు తెలిసింది. దీంతో డిఫెన్స్లో పడిన సదరు అధికారి అధికార పార్టీ నేతల వద్దకు చేరుకుని పైరవీలకు తెరలేపినట్లు సమాచారం. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
బత్తలపల్లి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని మాధవ నగర్కు చెందిన బత్తుల శ్రీనివాసులు పెద్ద కుమారుడు హేమంత్కుమార్ (21)తన స్నేహితులతో కలసి తమ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు శుక్రవారం బత్తలపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రం సమీపంలోని చిత్రావతి నదికి చేరుకున్నాడు. నీటి లోతు చూసే క్రమంలో నదిలోకి దూకిన హేమంత్కుమార్... వెనక్కు వచ్చే క్రమంలో ఈత కొట్టలేక నీట మునిగి మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి నల్లచెరువు: వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహం మీదపడడంతో చెరువు నీటిలో మునిగి ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... నల్లచెరువులో శ్రీ కన్యకా పరమేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను శుక్రవారం నిమజ్జనం కోసం ఓరువాయి పంచాయతీలోని చెరువువాండ్లపల్లి సమీపంలోని చెరువుకు తరలించారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడుచూరి రోహిత్ అనే యువకుడిపై పడింది. దీంతో విగ్రహంతో పాటు యువకుడు నీటిలో మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్ను వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోడంతో తొలుత స్థానిక పీహెచ్సీకి అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. -
కొండలపై రేసింగ్
పుట్లూరు/శింగనమల: వ్యవసాయం మినహా ఏమీ ఎరుగని గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం స్పోర్ట్స్ బైక్ల మోత మోగింది. పుట్లూరు మండలం మడుగుపల్లి, ఎల్లుట్ల సమీపంలోని కొండలపై గాలిమరల వద్ద కారు, బైక్ రేసింగ్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఓ స్పోర్ట్స్ బైక్ రైడర్ నియంత్రణ కోల్పోయి ఎల్లుట్ల నుంచి నార్పలకు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు బాలాజీని ఢీకొన్నాడు. ఘటనలో బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. కాగా, బెంగళూరుకు చెందిన మోటార్ స్పోర్ట్స్ నిర్వాహకులు శింగనమల, బుక్కరాయసముద్రం, పుట్లూరు ప్రాంతాల్లోని గాలిమరల రహదారులను రేసింగ్ కోసం శుక్రవారం పరిశీలించారు. దాదాపు 32 స్పోర్ట్స్ బైక్లు, 16 కారులతో టెస్ట్ రేసింగ్ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి తరం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్చంద్ స్ఫూర్తి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రశాంతి నిలయం: మేజర్ ధ్యాన్చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని నేటి తరం క్రీడాకారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. హాకీ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ధ్యాన్చంద్ క్రీడానైపుణ్యాన్ని కొనియాడారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా జరిగిన స్కూల్గేమ్స్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఉదయ భాస్కర్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ మొరార్జీయాదవ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ధర్మవరం అర్బన్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. శుక్రవారం ఆయన ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని రికార్డుల నిర్వహణ, మందుల స్టాకు, శుభ్రత, సిబ్బంది హాజరు తదితర వివరాలను ఆరా తీశారు. వైద్య సేవల గురించి అక్కడున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ సెంటర్ను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలిచ్చారు. ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఓపీ విభాగం మరింత విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. యూరియాను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు ప్రశాంతి నిలయం: యూరియాను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా రైతుల అవసరాల మేరకు యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియాను అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. ఎవరైనా అధిక ధరకు యూరియాను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్) పథకం కింద సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని వెంటనే గుర్తించి సోమవారంలోపు నివేదికలను అందజేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, వ్యవసాయ శాఖ జేడీ సుబ్బారావు, తహసీల్దార్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అర్హులైన వారందరికీ సెప్టెంబర్ 1న పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 36,793 పింఛన్లు ఉండగా, అందులో దివ్యాంగుల పింఛన్లు 35,078, హెల్త్ పింఛన్లు 1,715 ఉన్నాయన్నారు. వీటిలో 27,527 పింఛన్లు పునఃపరిశీలన పూర్తయ్యిందని, 7,163 మందికి వివిధ కారణాలతో పింఛన్కు అర్హత కోల్పోయినట్లు తేలిందన్నారు. అనర్హతకు గురైన వారందరూ మళ్లీ అప్పీల్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల లాగిన్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇలా అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ 1న పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే వారంతా పునఃపరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వైద్యులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ధర్మవరం ఏరియా ఆస్పత్రి తనిఖీ -
నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి
● అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు ● అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం ● స్పష్టం చేసిన ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాలని, ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక నిమజ్జనానికి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీజేలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఊరేగింపు సమయంలో ఎవరూ మద్యం సేవించకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు. అలాగే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదన్నారు. శోభాయాత్ర నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన సమయం ఇప్పటికే కేటాయించి ఉంటారని, ఆ సమయంలోపు నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. బందోబస్త్లో భాగంగా అత్యాధునిక ిసీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే పోలీసులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిమజ్జనం ప్రక్రియ ముగిసేంతవరకూ ఉత్సవ కమిటీల నిర్వాహకులు, పీస్ కమిటీల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందరం కలిసి వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూద్దామన్నారు. నిమజ్జనం సమయంలో ఏదైనా సాయం అవసరమైతే డయల్ 100, 112 ఫోన్ చేయాలని సూచించారు. కడప జైలుకు నూర్ మహమ్మద్ ధర్మవరం: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ను మూడు రోజులపాటు విచారించిన పోలీసులు శుక్రవారం పుట్టపర్తి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు కడప జైలుకు తరలించారు. ఈనెల 27న కోర్టు అనుమతితో కడప జైలులో ఉన్న నూర్ మహమ్మద్ను కస్టడిలోకి తీసుకున్న ధర్మవరం పోలీసులు మూడురోజులపాటు విచారణ చేపట్టారు. అయితే విచారణలో నూర్ మహమ్మద్ సమాధానాలు దాటవేసే ధోరణి అవలంభించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసినట్లు మాత్రం తేలింది. వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంత మందిని ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేశావు అన్న కోణంలో పోలీసులు విచారణ చేసినా.. నూర్ మహమ్మద్ మౌనంగా ఉంటూ సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నూర్ మహమ్మద్ ప్రియురాలు పర్వీన్ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కూడా వివిధ అంశాలపై విచారించారు. ఆతర్వాత ఆమెను కూడా పంపించినట్లు సమాచారం. -
తమ్ముళ్ల బరి తెగింపు
ఎమ్మెల్యే, ఎంపీపై తిరుగుబావుటా సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోడ్లెక్కుతున్నారు.. నానా యాగీ చేస్తున్నారు.. అధికార మదంతో దాడులకూ దిగుతున్నారు.. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ‘తమ్ముళ్లు’ రచ్చ చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అంతర్గత గొడవలు, వర్గపోరుతో టీడీపీ అట్టుడికిపోతోంది. స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు పార్టీలోనే అసమ్మతులు రోజుకో నియోజకవర్గంలో భగ్గుమంటున్నాయి. తెలుగు తమ్ముళ్ల గొడవలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు నిశ్చేష్టుల్లా చూస్తూ ఉండిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. కిందిస్థాయిలో చిన్న ఉద్యోగాలను సైతం ఎమ్మెల్యేలు అమ్ముకుంటుండటంతో పార్టీకి పనిచేసిన వారు రోడ్డెక్కుతున్నారు. కియా వద్ద మంత్రి అనుచరుల హల్చల్.. రెండు వారాల క్రితం పెనుకొండలో కియా కార్ల ఉత్పత్తి పరిశ్రమ వద్ద మంత్రి సవిత వర్గీయులు చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. కాంట్రాక్టులన్నీ తమకే కావాలని చేసిన రచ్చ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడిభాగాల పరిశ్రమల నుంచి వచ్చే లారీలను బయటే ఆపేశారు. కియా పరిశ్రమ లోపలకు చొచ్చుకువెళ్లడానికి యత్నించారు. వందల మంది ఒక్కసారిగా రావడంతో పరిశ్రమ యాజమాన్యం ఆందోళన చెందింది. మళ్లీ నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు కొందరు గేటు బయట రచ్చ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అర్బన్లో ఆధిపత్య పోరు.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రోజుకో వివాదంతో గందరగోళం నెలకొంది. ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరుతో ప్రశాంతంగా ఉండే అనంతపురం నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో వైద్య సిబ్బందిపై దాడి కదిరిలో రెండు రోజుల క్రితం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు హల్చల్ చేశారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యురాలు రిషిత, నర్స్ బాలమునెమ్మ, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక.. ఉరవకొండ నియోజకవర్గం ఆమిద్యాల గ్రామంలో ఆధిపత్య పోరుతో టీడీపీకి చెందిన రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడి ఒకరిని ఒకరు తన్నుకోవడం సంచలనం సృష్టించింది. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మినారాయణపై టీడీపీ కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేయడం గమనార్హం. ఈ క్రమంలోనే శుక్రవారం పచ్చ పార్టీ నాయకులు బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ ఆఫీసు వద్ద ధర్నా చేయడం చూసి జనం నవ్వుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లు ఎమ్మెల్యే, ఎంపీ అమ్ముకుంటున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వడం లేదంటూ ఈ సందర్భంగా ‘తమ్ముళ్లు’ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ ఎమ్మెల్యే, ఎంపీ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై నిరసనలకు దిగడం జిల్లాలో సంచలనం సృష్టించింది. గతంలో ఎమ్మెల్యే శ్రావణిపై ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయగం గమనార్హం. తాజా పరిణామాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాలన గాడి తప్పిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు. పోలీసులు నిస్సహాయులుగా మారి అన్నింటినీ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట హల్చల్ అనంతలో రెండు వర్గాల నడుమ తరచూ ఘర్షణలు ఇటీవల పెనుకొండలో రెచ్చిపోయిన మంత్రి సవిత వర్గీయులు రెండు రోజుల క్రితం కదిరిలో వైద్య సిబ్బందిని చితకబాదిన ‘తమ్ముళ్లు’ తాజాగా శింగనమలలో ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా ధర్నా నిస్సహాయంగా పోలీసులు.. భయకంపితులవుతున్న ప్రజలు -
ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ
కదిరి అర్బన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతీని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన పలువురు భక్తులు కదిరి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణతో పాపాలనుంచి ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం పలువురు భక్తులు గిరిప్రదక్షిణ చేయగా..ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే గ్రామ ప్రజలు భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. 25 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: వాతావరణ మార్పులతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 25 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా హిందూపురం మండలంలో 32.4 మి.మీ. అమడగూరు మండలంలో 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రొళ్ల మండలంలో 29.4 మి.మీ, సోమందేపల్లి 24.2, పరిగి 19.6, చిలమత్తూరు 19.2, మడకశిర 19.0, అగళి 18.2, రొద్దం 14.8, గోరంట్ల 14.2, లేపాక్షి 14.2, తనకల్లు 10.8, పెనుకొండ 10.0, అమరాపురం 9.2, నల్లచెరువు 8.4, కొత్తచెరువు 6.6, గుడిబండ 6.4, బుక్కపట్నం 6.0, మిగతా మండలాల్లో 4 – 1.4 మి.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వైద్యురాలిపై దాడి హేయం ● కదిరి ఆస్పత్రిలో దుండగుల అరాచకాన్ని ఖండించిన ఐఎంఏకదిరి/కదిరి టౌన్: ప్రాణాలు పోసే వైద్యులపై దాడులు హేయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కదిరి శాఖ సభ్యులు అన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27వ తేదీన కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి మద్యం మత్తులో వచ్చిన కొందరు దుండగులు విధుల్లో ఉన్న వైద్యురాలు రిషిత, నర్సు బాలముణెమ్మ, సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారని, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా మిగతా వారినీ గుర్తించి అరెస్టు చేయాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నిందితులపై వెంటనే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినందున తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో కదిరి ఐఎంఏ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆజాద్, సెక్రటరీ డాక్టర్ భాస్కర్ నాయక్, ట్రెజరర్ డాక్టర్ విద్యాసాగర్, వైద్యులు సీవీ మధన్కుమార్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, హర్ష,సాయి, విజయ్ పాల్గొన్నారు. -
ఊరూరా ‘ఎల్లో బెల్ట్’
కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లలో రెండు రోజుల క్రితం మద్యం బెల్ట్ షాప్ వద్ద టీడీపీ అల్లరి మూకలు పూటుగా మద్యం తాగి పరస్పర దాడులకు దిగాయి. ఈ దాడిలో గాయపడిన కొందరు కదిరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మద్యం మత్తులో డ్యూటీలో ఉన్న వైద్యురాలు రిషితరెడ్డితో పాటు వైద్య సిబ్బంది, సెక్యూరిటీపై దాడులకు దిగారు. మద్యం మత్తులోనే దాడి జరిగిందని ఎస్పీ రత్న కూడా ధ్రువీకరించారు. ..ఇలా జిల్లాలో నిత్యం ఎక్కడోచోట మద్యం మత్తులో ఘర్షణలు జరుగుతున్నాయి. కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి జిల్లాలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండగా..తప్పతాగుతున్న మందుబాబులు ఘర్షణలకు దిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కదిరి: ‘‘బెల్ట్ షాప్లను సహించేది లేదు. ఎక్కడైనా బెల్ట్షాపు ఏర్పాటు చేస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాప్ ఉంటే దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పగా.. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామగ్రామానా బెల్ట్ షాప్లు వెలిశాయి. మద్యం దుకాణాల నిర్వాహకులే వారి వ్యాపారం కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. వీటిని అరికట్టాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. సందు సందులో మందు జిల్లా వ్యాప్తంగా 8 ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 87 మద్యం దుకాణాలున్నాయి. ఇవన్నీ దాదాపుగా అధికార టీడీపీ ప్రజా ప్రతినిధుల అనుచరులే నిర్వహిస్తున్నారు. వీటికి అనుబంధంగా మందు సేవించేందుకు ప్రతి మద్యం దుకాణం వద్ద ఒక సిట్టింగ్ రూమ్కు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. కదిరిలో మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా తీసుకుంటున్నారని మందుబాబులు చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంది. ఇవన్నీ అధికార టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. బెల్ట్షాప్లలో బాటిల్పై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు. బెల్ట్ షాప్లు రోజూ తెల్లవారుజామున 5 గంటలకే తెరిచి అర్ధరాత్రి 1 గంట వరకూ నిర్వహిస్తున్నారు. కదిరి, ధర్మవరం, హిందూపురం, మడకశిర పట్టణాల్లోని బెల్ట్ దుకాణాల్లో చాలా చోట్ల మద్యం సేవించేందుకు సిట్టింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నందున ఎకై ్సజ్ శాఖ అధికారులు అటువైపు తొంగి చూసేందుకు కూడా భయపడుతున్నారు. ఇక తాజాగా జిల్లాలో మరో 12 బార్లకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కదిరిలో 3, ధర్మవరంలో 3, హిందూపురంలో 4, మడకశిరలో 1, పెనుకొండలో 1 ఇలా మొత్తం 12 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ బార్లు కూడా అందుబాటులోకి వస్తే పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం దొరకనుంది. పేరుకే ఫ్యామిలీ ధాబాలు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఫ్యామిలీ ధాబాలు వెలిశాయి. కానీ అక్కడ ముందు చుక్క..తర్వాతే ముక్క ఆర్డర్ చేస్తున్నారు. ధాబాల నిర్వాహకులే కొన్ని చోట్ల మందు సరఫరా చేస్తుండగా... ఇంకొన్ని చోట్ల మద్యం ప్రియులు వెంట సరుకు తెచ్చుకుంటే తాగేందుకు అనుమతిస్తున్నారు. ఇలా తాగి ధాబాల వద్ద గొడవలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు ఫోన్ కొడితే ఏ సమయంలోనైనా ఇంటికే మద్యం సరఫరా బాటిల్పై రూ.20 నుంచి రూ.40 అదనం చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ అధికారులు -
గోరుముద్దలు చూపిస్తూ.. ప్రేయసితో నూర్ అలా! చివరకు..
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాది నూర్ మహ్మద్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాడిపత్రికి చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను నూర్ ప్రేయసిగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెకూ ఉగ్రకార్యకలాపాలతో సంబంధాలున్నాయా? అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఓ హోటల్లో వంటవాడిగా పని చేస్తున్న నూర్ మహ్మద్(40) ఉగ్రవాద సానుభూతిపరుడని తేలింది. గతకొంతకాలంగా అతని కదలికలపై నిఘా వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంతో లోకల్ పోలీసులు ఆగస్టు మూడో వారంలో అరెస్ట్ చేశారు. అంతేకాదు..కోట ఏరియాలో అతని నివాసంలో సోదాలు జరిపి 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్ఐఏ వర్గాలు ఆరా తీశాయి. ఈ క్రమంలో.. అతని కుటుంబ వివరాలేవీ తెలియరాలేదు. కాకుంటే తాడిపత్రిలో ఉంటున్న ఓ మహిళతో నూర్ చనువుగా ఉన్నాడని మాత్రం అతని కాల్స్ రికార్డు ఆధారంగా తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ.. గోరుముద్దలు చూపించుకుంటూ.. ఆ స్క్రీన్ షాట్స్ను సేవ్ చేసుకున్నారు. ప్రతీరోజూ ఆమె అతనితో గంటల తరబడి ఆడియో, వీడియో కాల్ మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన కాల్ రికార్డ్స్ ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు..తొలుత జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరపగా.. గత నాలుగు రోజులుగా పోలీసులూ అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. జైషేతోనే కాకుండా ఇతర ఉగ్రసంస్థలతోనూ అతనికి సబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
డీఎస్సీ కాల్లెటర్ల వెనుక కథలెన్నో..
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో మెరిట్ సాధించిన చాలామంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు మెసేజ్లు (కాల్ లెటర్లు) రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మెరిట్ సాధించి ఎంపికై న అభ్యర్థులకు గురువారం అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఎవరికై తే మెసేజ్ అందుతుందో వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలంటూ చెప్పారు. అయితే చాలామంది మెరిట్ జాబితాలో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కూడా మెసేజ్లు రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. మెసేజ్లు రాకపోయినా అక్కడికి చేరుకున్నారు. జిల్లా పరిశీలకులు, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబును కలిసి విన్నవించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి తొలిరోజు 625 మంది అభ్యర్థులకు సంబంధించిన సమాచారం మాత్రమే వచ్చిందని, తక్కిన వారికి శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వారు స్పష్టం చేశారు. కాగా, సర్టిఫికెట్ల పరిశీలనకు డీఈఓ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి 10.30 గంటలకు ముగిసింది. తొలిరోజు ఐదుగురు గైర్హాజరయ్యారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలనకు శుక్రవారం కూడా అవకాశం ఇస్తున్నట్లు డీఈఓ తెలిపారు. శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రాత్రి 10 గంటల సమయానికి 132 మంది జాబితా జిల్లా విద్యాశాఖ అధికారులకు చేరింది. వారందరూ ఉదయం 9 గంటలకు హాజరుకానున్నారు. తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి.. తమకంటే తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కాల్లెటర్లు వచ్చాయని, తమకు రాలేదంటూ కొందరు అభ్యర్థులు వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. ఒకే సబ్జెక్టు ఒకే కేటగిరీలో తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కాల్లెటర్లు వచ్చినా ఎక్కువ ర్యాంకులు సాధించిన వారికి కాల్లెటర్లు రాలేదు. అధికారులను అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని, వెబ్సైట్లో ఉంచిన హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్లు చేసినా కనీస స్పందన లేదంటూ ఆయా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులు, స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. డీఎస్సీ–25కి ఎంపికై న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన 807 పోస్టులకు గాను తొలిరోజు 625 మంది అభ్యర్థులకు మెసేజ్లు తక్కువ ర్యాంకులు వచ్చిన వారిని పిలిచారంటూ మెరిట్ అభ్యర్థుల ఆవేదన తొలిరోజు పకడ్బందీగా సర్టిఫికెట్ల పరిశీలన -
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారుల విస్తరణకు భూసేకరణ, సోలార్పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పుట్టపర్తి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఎన్హెచ్ ప్రాజెక్ట్ల ప్రతినిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ ఽఅధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్హాలులో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహిక కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా కొత్తగా పరిశ్రమల స్థాపనకు వచ్చిన అనుమతులను సమీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జిల్లా ఫ్యాక్టరీల అధికారి రాధాకృష్ట, ఏపీఐఐసీ, విద్యుత్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బిజినెస్ రీఫామ్ యాక్షన్ ప్లాన్– 2024పై సమావేశం జరిగింది. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల ప్రోత్సాహకంలో భాగంగా సులభతర వాణిజ్యానికి సత్వర సేవలందిస్తున్నాయన్నారు. -
పీహెచ్సీ నిర్మాణానికి భూమిపూజ
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు రొప్పాల వద్ద రూ.2కోట్లతో చేపట్టిన పీహెచ్సీ నిర్మాణానికి గురువారం మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,.. పీహెచ్సీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పెద్దమంతూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ బాలిక మృతి ధర్మవరం అర్బన్: విద్యుత్షాక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బుధవారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీహరి, రేష్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బతుకు తెరువు కోసం మూడు నెలల క్రితం ధర్మవరానికి వలసవచ్చి శారదానగర్లో నివాసముంటున్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ ఏడాది జూలై 14న చంద్రబాబు నగర్లో మాయకుంట్ల జయచంద్రకు చెందిన ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్న సమయంలో పెద్ద కుమార్తె వెంకటేశ్వరి (10) కూడా తల్లిదండ్రులతోపాటు వెళ్లింది. ఆ సమయంలో పైభాగంలో 11 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదవశాత్తు తగిలి షాక్కు గురైంది. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం, తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ నెల 24న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం బాలిక మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ గార్డు దుర్మరణం హిందూపురం: స్థానిక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తూముకుంట పారిశ్రామక వాడ నుంచి హిందూపురానికి వెళుతున్న సెక్యూరిటీ గార్డు మహబూబ్ బాషా (40)ను మిట్టమీదపల్లి గేట్ వద్ద బెంగళూరు నుంచి వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ద్విచక్ర వాహనానికి నిప్పు
పెనుకొండ రూరల్: మండలంలోని మరువపల్లి కి చెందిన గొల్ల శ్రీనివాసులు ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఉంచిన వాహనానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టడంతో కాసేపటికి మంటలు ఎగిసి పడ్డాయి. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు వెంటనే యజమానిని అప్రమత్తం చేసి, మంటలు ఆర్పారు. అప్పటికే ద్విచక్ర వాహనం కాలిపోయింది. వాహన యజమాని శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ పురోగతి సూచికపై నేడు శిక్షణ అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో ‘పంచాయతీరాజ్ పురోగతి సూచిక 1.0’ అనే అంశంపై ఒక రోజు శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించనున్నట్లు శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్ దాస్ గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు, డీడీఓలు, డీఎల్పీఓలు, ఇంకా పలు శాఖల అధికారులు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులు ప్రారంభిస్తారని వెల్లడించారు. సీఈఓ, డిప్యూటీ సీఈఓ కూడా పాల్గొంటారని వివరించారు. కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. డీఎస్పీ ఎం.నాగభూషణం, సీఐలు కే శ్రీనివాసులు తదితరులు ఆరు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వల్లో తేడాలను గుర్తించి రూ.1.82 లక్షల విలువైన 6.85 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపి వేస్తూ నోటీసులు జారీ చేశారు. -
మెరుగైన వైద్య సేవలందించండి
బత్తలపల్లి/ ధర్మవరం అర్బన్: ఆరోగ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. తొలుత ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ గదిలోని మందుల వివరాలు, స్టాకు, ఓపీ రిజిష్టర్, ఆన్లైన్లో ఈహెచ్ఆర్ నమోదు, ల్యాబ్లో రక్తపరీక్షల వివరాలు పరిశీలించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ అరుణ్కుమార్తో ఆస్పత్రిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలు, వాటి ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ● ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న ఫేజ్–2 సబ్ డిస్ట్రిక్ లెవెల్ ఎన్సీడీ 4.0 శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 సంవత్సరాలు పైబడిన వారికి అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించాలన్నారు. క్యాన్సర్ లక్షణాల గల వారిని తొలి దశలోనే గుర్తించి వారికి అవసరమైన మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర నాయక్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ వివేక్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పద్మమణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సాంబశివమ్మ, వన్నప్ప తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్లబండి పోటీలు
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన వినాయక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. 57 బండ్లు పోటీల్లో పాల్గొనగా పట్నం గ్రామానికి చెందిన మౌర్య సుల్తాన్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే కొత్తచెరువు చెందిన భరత్ ఎద్దులు ద్వితీయ, కర్ణాటక నాగేపల్లికి చెందిన దేవర ఎద్దులు తృతీయ స్థానంలో నిలిచాయి. విజేత ఎద్దుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బాబురెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నిరసనల మధ్య గణనాథుడి నిమజ్జనం
లేపాక్షి: మండలంలోని కల్లూరు గ్రామంలో ప్రజల నిరసనల మధ్య వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సాగింది. వివరాలు.. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో గణనాథుడి ప్రతిమలను కొలువుదీర్చి వేడుకలు జరపాలని నిర్ణయించుకున్న స్థానికులు ఆ మేరకు అనుమతుల కోసం నాలుగు రోజలు క్రితమే పోలీసులను కలిసి మాట్లాడారు. మండలంలోని కల్లూరు, కోడిపల్లితో పాటు మరో రెండు గ్రామాలు అత్యంత సమస్యాత్మక జాబితాలో ఉండడంతో వినాయక మంటపాల ఏర్పాటు, నిమజ్జనం, డీజేలు, డ్రమ్స్లు ఉపయోగించరాదనే నిబంధనలను పోలీసులు వివరించారు. మంటపాలు ఏర్పాటు చేస్తే మరుసటి రోజే నిమజ్జనం చేయాలని సూచించారు. దీంతో బుధవారం రాత్రి వినాయక ప్రతిమలను కొలువుదీర్చి పూజలు చేశారు. గురువారం నిమజ్జనం చేయాలని, లేకుంటే బైండోవర్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేసారు. వినాయక మంటపాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకసారి భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగపై ఆంక్షలు సరికాదని నినదించారు. కేవలం టీడీపీ నేతల దౌర్జన్యాలతోనే ఈ దుస్థితి దాపురించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, మడకశిర యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు నాగభూషణ్రెడ్డి, రంగనాథ్, రవికుమార్, అశ్వత్థనారాయణ విమర్శించారు. గురువారం వారు మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. 5 రోజుల క్రితం మడకశిర మండలం ఎం.రంగాపురంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారయత్నం ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే స్పందించలేదన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదులోను, నిందితుడి అరెస్ట్లోనూ నిర్లక్ష్యం వహించారన్నారు. అధికార పార్టీ నాయకులు చెబితేనే పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటారని, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించకపోతే వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతారన్నారు. మడకశిర మండలంలో బాలికపై అత్యాచార ఘటననునియోజకవర్గ వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయప్ప ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి -
ఉత్సవాల్లో అల్లర్లకు తావివ్వొద్దు
కదిరి టౌన్: వచ్చే నెల 2న కదిరిలో జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లకు తావివ్వరాదని ఉత్సవ కమిటీల నిర్వాహకులు, మత పెద్దలకు ఎస్పీ రత్న సూచించారు. స్థానిక కోనేరు సమీపంలోని ఓ ప్రైవేట్ కల్యాణమంటపంలో గురువారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు నిమజ్జనానికి విగ్రహాలను ఊరేగించే మార్గంలో అక్బరియా మసీదు, ఈద్గా. అలంఖాన్ మసీదు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. సోదరభావంతో మెలగాలని సూచించారు. అనంతరం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలపై ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఊరేగింపు సమయంలో డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వి.వి.ఎస్.శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి, నాగేంద్ర, ట్రాన్స్కో ఏఈ, మున్సిపల్ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ రత్న -
●బహురూపాయ.. గణేశాయ
పుట్టపర్తి టౌన్: వినాయక చవితి వేడుకలు అంబరం అంటాయి. పార్వతీ తనయుడి రాకతో జిల్లా ఆధ్యాత్మిక సాగరంలో మునిగింది. ‘వక్రతుండ మహాకాయ..కోటి సూర్య సమప్రభ’ అంటూ విఘ్నాలను తొలగించే వినాయకుని స్తుతితో మార్మోగింది. వాడవాడలా బహురూపాలలో ఏకదంతుడు కొలువుదీరాడు. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన బహురూపాల్లోని వినాయక ప్రతిమలను చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.● పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోనూ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు పాల్గొన్నారు. -
ముందుకు సాగని పీ–4
పుట్టపర్తి అర్బన్: పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీ–4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు లక్ష్యం ముందుకు సాగడం లేదు. ఆర్థికంగా బాగున్న వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్ఆర్ఐలు, నాయకులు (మార్గదర్శకులు) వారికి తోచిన విధంగా కొన్ని పేద కుటుంబాలను దత్తతకు తీసుకొని జీవన ప్రమాణాలు మెరుగుపరచి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. 2029 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఒక్కో మార్గదర్శకుడు కనీసం నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ సర్వే చేసి గ్రామ సభ నిర్వహించి బంగారు కుటుంబాలను గుర్తించాల్సి ఉంది. అయితే సర్వేలు, గ్రామ సభలు సరిగా చేపట్టకపోవడంతో కార్యక్రమం నీరుగారింది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 38,513 బంగారు కుటుంబాలు, 5,700 మంది మార్గదర్శకులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తక్కిన కుటుంబాలను త్వరలో గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటున్నారు. ప్రతి వారం అధికారులతో కలెక్టర్ సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేస్తున్నా... ఏ మండలంలో ఎంత మందిని, ఏ గ్రామంలో ఎవరిని గుర్తించారనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేకపోతున్నారు. ముందుకురాని ఉద్యోగులు.. పీ–4 కార్యక్రమంలో భాగంగా పేదలను ఆదుకునేందుకు ఉద్యోగులు ఒక్కరూ ముందుకు రాలేదు. రాలేమంటూ కొందరు గంటాపథంగా చెప్తున్నారు. సర్వేలోనూ పాల్గొనబోమని కరాఖండిగా చెప్పారు. ఈ తరుణంలో సంబంధిత అధికారులు లక్ష్యాలను చేరుకోలేక తలలు పట్టుకుంటున్నారు. పేదల దత్తతకు ముందుకురాని మార్గదర్శకులు -
రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ యోగా పోటీలకు ‘అనంత’ ఆతిథ్యం
అనంతపురం కల్చరల్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా పోటీలు ఈ ఏడాది నవంబర్లో జిల్లాలో నిర్వహించనున్నట్లు వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన యోగా పోటీల్లో జిల్లాకు చెందిన యోగాభ్యాసకులు మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించి, సెప్టెంబర్ 11న భిలాయ్లో, అదే నెలలో 27న విజయవాడలో జరిగే జాతీయ స్థాయిలో యోగా పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ చాటిన యోగాభ్యసకులను గురువారం అనంతపురంలోని షిరిడినగర్ వివేకానంద యోగ భవన్లో సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో యోగా గురువులు దివాకర్, పుల్లయ్య, మారుతీప్రసాద్, తారక్, నాని నవోమిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు బలిగొన్న అతి వేగం ● ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతి ధర్మవరం అర్బన్: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని దుర్గానగర్కు చెందిన అక్కం సతీష్కుమార్(36), కవిత దంపతులు మగ్గం పనితో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో సతీష్కుమార్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆయన తమ్ముడు అనిల్కుమార్ ఇంటికి చేరుకుని అన్న లేకపోవడంతో ఫోన్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పెట్రోల్ తీసుకు రావాలని కోరాడు. దీంతో పనిముగించుకున్న అనంతరం సతీష్కుమార్ పెట్రోల్ తీసుకుని ఇంటికి వెళుతూ చికెన్ సెంటర్ వద్ద మలుపు వద్ద వేగాన్ని నియంత్రణ చేసుకోలేక అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడుని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఒంటరితనం భరించలేక వివాహిత బలవన్మరణం పరిగి: ఒంటరి తనం భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం పట్టణ ట్రాఫిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సంపత్కుమార్కు భార్య లీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సేవామందిరంంలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె ప్రియాసాయి (26) కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది సజావుగా సాగిన కాపురం అనంతరం విభేదాల కారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందారు. మూడేళ్ల క్రితం తల్లి లీలావతి మృతితో సేవామందిరంలో తండ్రి సంపత్కుమార్తో కలసి ఉంటోంది. వర్క్ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ తండ్రికి ఆసరాగా ఉంటోంది. ఈ క్రమంలో ఒంటరితనంతో మానసిక వేదనకు లోనైన ఆమె బుధవారం రాత్రి యథావిధిగా తండ్రితో కలిసి భోంచేసిన అనంతరం తన గదిలోకి నిద్రించింది. గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో తండ్రి వెళ్లి కిటికీ తెరిచి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సంపత్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు రాప్తాడు రూరల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు..అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్కు చెందిన గోవిందప్ప కుమారుడు కృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో నందమూరినగర్ నుంచి పిల్లిగుండ్లకాలనీకి బైకుపై వెళుతుండగా నరిగిమ్మ ఆలయం దాటిన తర్వాత ఎదురుగా రాంగ్రూట్లో వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతిలోని స్విమ్స్కు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైద్య సిబ్బందిపై టీడీపీ నేతల దాడి.. వైద్యుల విధుల బహిష్కరణ
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, వైద్య సిబ్బందిపై పచ్చ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చ బ్యాచ్ దాడిలో వారు గాయపడటంతో ఆసుప్రతికి తరలించారు. ఈ నేపథ్యంలో తమ దాడిని ఖండిస్తూ సత్యసాయి జిల్లాలో వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు.వివరాల ప్రకారం.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద డాక్టర్, వైద్య సిబ్బందితో టీడీపీ నేతలు గొడవకు దిగారు. అనంతరం, విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది గాయపడటంతో అతడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మరోసారి వైద్య సిబ్బందిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటన స్థానిక సీసీటీవీలో రికార్డు అయ్యింది. టీడీపీ నేతల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు, కదిరిలో వైద్య సిబ్బందిపై దాడిని డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా కదిరిలో డాక్టర్లు విధులను బహిష్కరించారు. టీడీపీ కార్యకర్తలపై దాడిపై మండిపడుతున్నారు. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. -
దొరికేనా ఆ బంగారం?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎస్బీఐ (స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో దోపిడీ జరిగి రేపటికి సరిగ్గా నెలరోజులవుతోంది. ఎక్కడా ఆనవాళ్లు కూడా లభించకుండా పదకొండున్నర కిలోల బంగారం, రూ.30 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లడం అప్పట్లో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నుంచి ఇప్పటికీ స్థానికులు తేరుకోలేకపోతున్నారు. చోరీ అయిన బంగారం మొత్తం రైతులు, వివిధ వర్గాలు తనఖా పెట్టిందని తెలిసింది. ఘట నాస్థలిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు బిహార్ లేదా ఉత్తరప్రదేశ్కు చెందిన దొంగలు చేసిన పనిగా గుర్తించారు. ఒక నిందితుడు చిక్కినా.. కేసు ఛేదనకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు నాలుగు రోజుల క్రితం ఒక దొంగ దొరికాడు. అతని నుంచి 2 కేజీల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. కేసులో ఇది కొద్దిగా ఉపశమనం కలిగించే విషయమే అయినా మిగతా తొమ్మిదిన్నర కేజీల బంగారం ఎక్కడుందో తెలియకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పట్టుబడిన దొంగకు బ్యాంకు దోపిడీలో వాటా చాలా చిన్నదని వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అసలు దొంగ కోసం పోలీసులు మళ్లీ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెందిన ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. మధ్యప్రదేశ్, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు అనుమానం వచ్చిన ప్రతిచోటా లాడ్జీలు, హోటళ్లలో జల్లెడ పడుతున్నాయి. చిన్న క్లూ కూడా లేదు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు..ముఖ్యమైన దొంగకి సంబంధించి చిన్న ఆధారం కూడా లభించడం లేదు. అపహరించిన బంగారాన్ని ఇప్పటికే ముంబై లేదా బెంగళూరు ప్రాంతాల్లో విక్రయించి ఉంటారని భావిస్తున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వాడి బ్యాంకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడం.. ఎక్కడా వేలిముద్రలు, పాద ముద్రలు పడకుండా జాగ్రత్త పడడం.. అసలు ఫోనే వాడకపోవడం.. ఎలాంటి వాహనాన్ని వినియోగించకపోవడంతో అతడిని పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద దోపిడీ హిందూపురం బ్యాంకు దోపిడీ కేసును ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద దోపిడీ కేసుగా పోలీసులు చెబుతున్నారు. అనంతపురం నగర శివారులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇటీవల జరిగిన దొంగతనం సొత్తు విలువ రూ.3 కోట్లే. కానీ హిందూపురం బ్యాంకు దోపిడీ కేసులో బంగారం, నగదు విలువ కలిపి రూ.12 కోట్ల వరకూ ఉంటుంది. సవాలుగా మారిన హిందూపురం బ్యాంకు దోపిడీ కేసు ఇటీవల ఒక దొంగ అరెస్టు రెండు కేజీల బంగారం రికవరీ లభించని మరో నిందితుడి ఆనవాళ్లు అతని వద్దే తొమ్మిదిన్నర కిలోల బంగారం -
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
చిలమత్తూరు : ‘‘ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాగరాజు యాదవ్ అవినీతి అక్రమాలను తప్పక ప్రజల ముందు ఉంచుతా. ఎక్కడ ఎవరి పేరు మీద పట్టా పొందాడో బయటపెడతా. ఆయన అవినీతిని బయటపెడతాననే నాపై హత్యాయత్నం చేశాడు. అయినా వదిలేది లేదు.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగరాజు యాదవ్ను కొత్తచామలపల్లి నుంచి ప్రజలు తరిమేస్తే చిలమత్తూరు వచ్చి స్థిరపడ్డారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అధికారాన్ని అనుభవించడమే కాకుండా అవినీతి అక్రమాలు చేశాడన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన నాగరాజు యాదవ్కు అనతి కాలంలోనే అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కోడూరు, టేకులోడు, చిలమత్తూరు పంచాయతీల్లో ఆయన భార్య వినోదమ్మ పేరిట ఎన్ని అసైన్డ్ పట్టాలున్నాయో తనకు తెలుసుని, అవి ఎలా సంక్రమించాయని ప్రశ్నించారు. వాటిని బయటకు తీస్తామన్నారు. తన అవినీతి అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే నాగరాజు యాదవ్ తనపై హత్యాయత్నం చేయించారన్నారు. ఈగవాలినా ఉపేక్షించేది లేదు పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ గూండాలు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడి చేసి చంపాలని కుట్ర చేసింది కాకుండా.. ఉద్దేశ పూర్వకంగానే తమ ప్రెస్ మీట్ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై కానీ, కార్యకర్తలపై కానీ ఈగ వాలినా ఉపేక్షించబోమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండరన్న విషయం నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఎస్సీ సెల్ నేత చిన్నప్పయ్య మాట్లాడుతూ... కోడూరు పంచాయతీ టీడీపీ నేత బేకరీ గంగాధర్ తమ పార్టీపై, ఎంపీపీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికారంలో ఉంటే పార్టీ పేరు, అధికారం లేకపోతే కులం పేరు వాడుకుంటున్నారని... ఇలాంటి వాళ్లకు తమ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్రెడ్డి, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కులశేఖర్రెడ్డి, సర్పంచ్ జయశంకర్రెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, ఎంపీటీసీ రఘు, మంజునాథరెడ్డి, ఆదినారాయణ, పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల కన్వీనర్ మద్దిపి లక్ష్మీనారాయణ, లక్ష్మీరెడ్డి, షాకీర్, నవాబ్, ఆయూబ్, శ్రీనాథ్, శంకర్రెడ్డి, విష్ణు, నంజిరెడ్డి, దాము, గిరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి నాగరాజు యాదవ్ అవినీతిని బయటపెడతాననే నాపై హత్యాయత్నం -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
తనకల్లు: రోగులకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన తనకల్లులోని 30 పడకల ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి..వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్య గురించి సూపరింటెండెంట్ విజయ్బాబును అడిగి తెలుసుకున్నారు. రోజూ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, మందుల నిల్వ గురించి ఆరా తీశారు. మందుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్, లేబరేటరీ, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్ గదులను పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. షెడ్ నెట్ హౌస్ను పరిశీలించిన కలెక్టర్ మండలంలోని సీఆర్ పల్లి సమీపంలో ఉద్యానశాఖ, ‘సెర్ప్’ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్ నెట్ హౌస్ను కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం పరిశీలించారు. అలాగే చౌడేశ్వరీ ఎఫ్పీఓ కలెక్షన్ సెంటర్, సోలార్ కోల్డ్ రూంలను పరిశీలించారు. ఎఫ్పీఓ ద్వారా మార్కెటింగ్ను అభివృద్ధి చేసి ఇక్కడ పండిన కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య ఉన్నారు. జాతీయ రహదారి పనుల పరిశీలన గోరంట్ల: మండల పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి సమీపంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను మంగళవారం కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు. పనుల పురోగతిని ఎన్హెచ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి మండలం గువ్వలగట్టపల్లి వద్ద జరుగుతున్న రహదారి పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం తనకల్లులోని 30 పడకల ప్రభుత్వాసుపత్రి తనిఖీ -
మాఫియా డాన్ల ఉలికిపాటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రేషన్ బియ్యం మాఫియా డాన్లు అప్రమత్తమయ్యారు. ఈనెల 21న సాక్షిలో ‘మాఫియా గుప్పిట్లో రేషన్’ శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బియ్యం మాఫియా డాన్లు ఉలిక్కిపడ్డారు. చిన్న చిన్న సరఫరాదారులందరూ ఒక్కసారిగా కలుగుల్లోకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడూ పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రాలేదని, అందరూ కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని డాన్ల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బియ్యం సేకరించి గోడౌన్లకు చేర్చే ఏజెంట్ల మధ్య అనైక్యత కారణంగానే మీడియాకు సమాచారం వచ్చిందని మాఫియా డాన్లు తీవ్రంగా మండిపడ్డారు. మీ మధ్య ఉన్న వివాదాల కారణంగా సమాచారం బయటకు వెళుతోందని, జాగ్రత్తగా లేకపోతే మనకు తీవ్ర నష్టం జరుగుతుందని సరఫరా ఏజెంట్లకు చెప్పారు. సేకరించిన బియ్యాన్ని తమ దగ్గరే కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వారం రోజులు డంప్ల జోలికి వెళ్లొద్దు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన బియ్యం డంప్ల జోలికి వెళ్లద్దని మాఫియా భాగస్వాములు అందరూ నిర్ణయించినట్టు తెలిసింది. నాలుగైదురోజులు పోలీసులు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులతో సమావేశం నిర్వహించుకుని, తర్వాత సరఫరా చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే చెక్పోస్ట్ల అధికారులతోనూ, విజిలెన్స్ వారితోనూ టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. కొద్దిరోజులు ఆగాలని చిన్న సరఫరాదార్లకు దేశాలు ఏమైనా ఉంటే సోమందేపల్లికి బియ్యం తీసుకురావాలని కబురు ‘సాక్షి’లో కథనం రావడంతో అప్రమత్తం -
చేనేత కార్మికుడి బలవన్మరణం
చిలమత్తూరు: అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని లాలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... లాలేపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి (38) సోమందేపల్లిలో మగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. వివాహమైనా సంతానం కలుగలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. సోమందేపల్లిలోనే ఇళ్లు నిర్మించుకున్న సోమశేఖర్రెడ్డి ఇందుకోసం అప్పులు చేశాడు. ఇటీవల మగ్గంపై తగినంత రాబడి లేకపోవడం... ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం.. అప్పులు తీర్చే మార్గం కనిపించక మధనపడేవాడు. ఈ క్రమంలోనే సోమవారం స్వగ్రామం చిలమత్తూరు మండలం లాలేపల్లికి వచ్చిన సోమశేఖర్రెడ్డి అప్పుల గురించే కుటుంబీకులకు చెప్పాడు. ఏమైందో ఏమో గానీ మంగళవారం ఉదయమే గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీ హట్టిలో మళ్లీ అతిసారం
రొళ్ల: మండల పరిధిలోని జీజీ హట్టి గ్రామంలో మళ్లీ అతిసారం కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో గ్రామంలో అతిసారం ప్రబలి 45 మంది అస్వస్థతకు గురికాగా, చిన్నారి అమూల్య (11) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మంగళవారం మళ్లీ అతిసారం కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రామస్తులు నాగదేవత పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో తయారు చేసిన ఆహారం తిని చిక్కమ్మ, తిమ్మరాజమ్మ, మోహిత్, కుమార్ తదితరులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని కుటుంబీకులు మంగళవారం రొళ్ల సీహెచ్సీ, మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ షేక్షావలి, ఇన్చార్జ్ ఎంపీడీఓ రామరావుతో పాటు డాక్టర్ శివానంద్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అతిసారం లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. -
నమ్మించి.. ప్రాణం తీశారు!
గౌరీబిదనూరు (కర్ణాటక): ఇటీవల కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా పరిధిలో లభ్యమైన అపరిచిత మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. హతురాలిని హిందూపురం ప్రాంతానికి చెందిన అర్చనగా నిర్ధారించిన పోలీసులు ఆమెను హతమార్చిన ఓ యువకుడు, యువతిని అరెస్టు చేశారు. మంగళవారం గౌరీబిదనూరు తాలూకా మంచేనహళ్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను పోలీసులు వెల్లడించారు. హిందూపురం సమీపంలోని శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) క్యాటరింగ్ పని చేసేది. ఈ నెల 14న పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అర్చన భర్త ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.చున్నీతో గొంతు నులిమి..అర్చనకు కేటరింగ్ పనిలో బెంగళూరుకు చెందిన రాకేష్, అంజలితో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేష్కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని రాకేష్ పిలిపించుకున్నాడు. అనంతరం కారులో చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర, గౌరీబిదనూరు తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమె గొంతు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఓ వంతెన కింద పడేసి.. ఎవరూ గుర్తించకుండా బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించాడు. అనంతరం బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టి తన ఆటో రుణం కంతు చెల్లించాడు.పరారీలో డ్రైవర్, మరో యువతిఈ నెల 17న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ఫిర్యాదు మేరకు మంచేనహళ్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతరం హతురాలిని హిందూపురానికి చెందిన అర్చనగా నిర్ధారించారు. ఈ క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారు. ఆమెకు అందిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవం బయటపడింది. దీంతో రాకేష్తో పాటు అతనికి సాయపడిన అంజలిని మంగళవారం అరెస్ట్ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్ నవీన్, మరో నిందితురాలు నిహారిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సమాధులే దేవాలయాలు
ధర్మవరం రూరల్: మండలంలోని సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలోని ఓ కుటుంబం వారు వారి పితృదేవతలను మరచిపోకుండా వారి సమాధులపై విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నారు. గ్రామంలోని బొమ్మయ్య కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. బొమ్మయ్య వంశానికి చెందిన సుమారు 20 కుటుంబాలు ఉన్నాయి. వీరి కుటుంబాలలో ఎవరైనా మృతి చెందితే గ్రామం వెలుపల ప్రత్యేక స్థలంలో ఖననం చేసి సమాధులు నిర్మిస్తారు. అనంతరం వాటిపై వారి ముఖచిత్రాన్ని పోలిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజిస్తుంటారు. ఏటా సమాధుల వద్ద పరుష ఏటా విత్తన ఏకాదశి రోజున సమాధుల వద్ద పరుష నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ సమాధులకు పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఉన్న గంగమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ పరుషకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని బొమ్మయ్య వంశస్తులు చెపుతున్నారు.బొమ్మయ్య సమాధికి పూజలు చేసిన దృశ్యం (ఫైల్) పరుష సందర్భంగా సమాధుల వద్ద పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్) సుబ్బరావుపేటలో వింత ఆచారం సమాధుల వద్ద ఏటా ఉత్సవాలు పితృదేవతల ఆశీస్సుల కోసం పితృదేవతల ఆశీస్సుల కోసం మా వంశస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వారి రూపాలను సమాధులపై నిర్మించుకుంటాం. విత్తన ఏకాదశి రోజున సమాధుల వద్ద పరుష నిర్వహిస్తాం. మా ఇళ్లల్లో పుట్టిన మగ పిల్లలకు బొమ్మయ్య అనే పేరు తప్పనిసరిగా పెట్టుకుంటాం. గంగమ్మను మా ఇలవేల్పుగా పూజిస్తుంటాం. గ్రామంలో నిర్మించిన గంగమ్మ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సమాధుల వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తుంటాం. – నడిపి బొమ్మయ్య, గంగమ్మ ఆలయ పూజారి, సుబ్బరావుపేట -
పలువురికి తెలుగు భాషా పురస్కారాలు
హిందూపురం టౌన్: వ్యవహారిక భాషోధ్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని కవులు, రచయిత్రలకు అందజేసే తెలుగు భాషా పురస్కారాన్ని హిందూపురానికి చెందిన ఉమర్ఫారూక్ ఖాన్ అందుకున్నారు. ప్రతి పదం చైతన్యం కోసం, ప్రతి పాదం ప్రగతి కోసం అనే ఆశయంతో లేపాక్షి ఫౌండేషన్ అధ్యక్షుడు వడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో హిందూపురంలోని శేఖర్ స్టడీ సెంటర్ వేదికగా మంగళవారం పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత దేశ నిర్మాణంలో ముస్లిం దేశ భక్తుల పాత్రపై ఉమర్ ఫారూక్ రచించిన ‘భారతీయ ముస్లిం లెజెండ్స్’ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే తాడిపత్రికి చెందిన కనుమ యల్లారెడ్డి రచన ‘మొలక కథలు’, పల్నాడుకు చెందిన అమృతపూడి రేవతి రచన ‘అమృత వర్షిణి’, అనంతపురానికి చెందిన షహనాజ్ రచన ‘దీపం’, చిత్తూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రచన ‘ఎప్పుడొస్తుందో’, తిరుపతికి చెందిన కృష్ణస్వామి రాజు రచన ‘మీది తెనాలి మాది తెనాలి’, హిందూపురానికి చెందిన కల్లూరు రాఘవేంద్రరావు రచన ‘కల్లూరు సుబ్బారావు జీవిత చరిత్ర’, గుంటూరు కొలకలూరి దేవికారాణి రచన ‘స్వప్న వేణువు’, తిరుపతి లింగుట్ల వెంకటేశ్వర్లు రచన ‘జ్ఞాపక కుసుమాలు’, అశోక్ కుమార్, భాను తేజశ్రీ, తాటి హరీష్, లీలా మనోహర్, మల్లెల గంగాధర్ల రచనలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర జానపద అకాడమీ, అధికార భాషా సంఘం విశ్రాంత చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, హిందూపురం మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్కుమార్, ఎంఈఓ గంగప్ప, ఉషారాణి, కల్లూరు రాఘవేంద్రరావు, హెల్పింగ్ హ్యాండ్ శ్రీధర్ గౌడ్, సైనిక సంక్షేమ నాయకులు చలపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వివాహిత ఆత్మహత్యశెట్టూరు: మండలంలోని పర్లచేడు గ్రామానికి చెందిన వివాహిత గొల్ల శివలింగమ్మ (36) ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె సోమవారం పురుగుల మందు తాగింది. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్కు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంభూపాల్ తెలిపారు. -
ఎస్సీ శ్మశాన వాటిక పూడ్చివేత
●ఎన్హెచ్ 342 రోడ్డు పనుల్లో భాగంగా.. పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కోడూరు వరకూ నిర్మిస్తున్న 342వ జాతీయ రహదారి పనుల్లో భాగంగా పుట్టపర్తి సమీపంలోని కర్నాటక నాగేపల్లి వద్ద బైపాస్ సమీపంలో ఎస్సీ శ్మశాన వాటికను కాంట్రాక్టర్ పూడ్చి వేయడం వివాదాస్పదంగా మారింది. మిగులు మట్టి, బండరాళ్లతో శ్మశాన వాటికను పూడ్చి వేస్తున్నారని పలువురు ఎస్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వంక పొరంబోకు స్థలంలో 2.84 ఎకరాల్లో ఒక ఎకరాను ఎస్సీ శ్మశాన వాటికకు 2018లో కేటాయించారు. ఇప్పటికై నా శ్మశాన వాటిక పూడ్చివేతను ఆపాలంటూ గ్రామానికి చెందిన రమేష్, గంగాద్రి, ఆదినారాయణ, సూరి, కేశప్ప, శ్రీరాములు, గంగన్న తదితరులు కోరారు. భార్యపై దాడి ● పీఎస్లో లొంగిపోయిన భర్త మడకశిర: హైరిస్క్ కేసులో గర్భిణికి ఆస్పత్రిలో వైద్యులు ఎక్కిస్తున్న రక్తంపై అనుమానంతో భర్త దాడికి తెగబడ్డాడు. ఘటనలో గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన ఓబులేసు, రాధమ్మ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం రాధమ్మ 9 నెలల గర్భంతో ఉంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రక్తం ఎక్కించుకోవాలని సూచించారు. దీంతో భర్తతో పాటు తన తల్లిని తోడుగా పిలుచుకుని సోమవారం రాత్రి మడకశిరలోని ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. హిందూపురం నుంచి ఆమెకు అవసరమున్న గ్రూపు రక్తాన్ని తెప్పించి మంగళవారం తెల్లవారుజామున ఎక్కించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓబులేసు రక్తం హిందూపురం నుంచి తెప్పించినది కాదని, వేరే వారి నుంచి తీసుకున్న రక్తాన్ని ఎలా ఎక్కించుకుంటావంటూ భార్యతో గొడవపడి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రాధమ్మ గట్టిగా కేకలు వేయడంతో రోగులు, వారి సహాయకులు అప్రమత్తమై దాడిని అడ్డుకున్నారు. అప్పటికే రాధమ్మ దవడ కింద లోతైన గాయమైంది. స్పందించిన వైద్యులు ఆగమేఘాలపై ఆమెకు చికిత్స అందించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దాడి అనంతరం ఓబులేసు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఏ నోట విన్నా.. అదే చర్చ!
కదిరి: పట్టణంలో ఇప్పుడు గంజాయి హాట్ టాపిక్గా మారింది. ఏ టీ కొట్టులో కూర్చొన్నా దానిపైనే చర్చ జరుగుతోంది. ఏడాదిగా కదిరి ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న కీలక సూత్రధారులను కదిరి పోలీసు అధికారులు ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకుగాను రూ.30 లక్షలు ముడుపులను పోలీసులు దండుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో రూ.10 లక్షల వరకు జిల్లా కేంద్రానికి కూడా చేరినట్లు వినబడుతోంది. దాచేస్తే దాగదులే.. కదిరి మండలం కొండమనాయునిపాళ్యం వద్ద ఈ నెల 26న మంగళవారం గంజాయి ముఠాను అరెస్ట్ చేస్తే 4 రోజుల తర్వాత అంటే ఈ నెల 29న శుక్రవారం అరెస్ట్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ జాప్యం వెనక ఆంతర్యమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పటికే గంజాయి పట్టుబడిన విషయం మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది. లేదంటే ఈ కేసు నమోదయ్యేదే కాదు. గంజాయి అసలు సూత్రధారులతో స్థానిక పోలీసు అధికారులకు డీల్ కుదిరిన తర్వాతే అరెస్ట్ వివరాలు వెల్లడించారని కొందరంటున్నారు. వారంతా కూలీలే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కదిరితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. కూటమి నేతలే కొందరు ఈ దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని జలగాం జిల్లా ప్రజాపూర్లోని వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉంటున్న రవి అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైళ్లు, బస్సుల్లో ఎంపిక చేసుకున్న కూలీల ద్వారా ఇక్కడికి తెప్పిస్తున్నారు. కూలీలకు రైలు లేదా బస్సు చార్జీలు ఇవ్వడంతో పాటు కిలోకు రూ.1000 చొప్పున కూలి చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కదిరి రూరల్ పోలీసులకు పట్టుబడిన స్థానిక జామియా వీధికి చెందిన అజాజ్, నాగరాజు వీధికి చెందిన షోయబ్, గాంధీనగర్కు చెందిన ఆర్ఫాన్, మహమ్మద్ హుస్సేన్, అస్లాం, గౌసియా వీరంతా కమీషన్ ప్రాతిపదికన గంజాయిని తెచ్చే కూలీలు మాత్రమే. దీని వెనుక అసలు సూత్రధారులు వేరే ఉన్నారని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత ఇంట్లో చర్చలు జరిపిన అనంతరం కీలక నిందితులను తప్పించి, కేవలం కూలీల పేర్లు మాత్రమే వెల్లడించేలా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అసలు సూత్రధారులు ఎవరనే విషయం స్థానికంగానే కాకుండా ఉన్నతాధికారులకు సైతం బాగా తెలుసని, అయితే వారు దీనిని శ్రీమూమూలుశ్రీగా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గంజాయి అక్రమ రవాణాను అరికట్టి అసలు సూత్రధారుల ఆట కట్టించకపోతే యువత గంజాయికి బానిసై చెడుమార్గంలో వెళ్లడం ఖాయమని పలువురు అంటున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికై నా సీరియస్గా తీసుకుని గంజాయిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. గంజాయి కేసులో కూలీలను అరెస్టు చూపి కీలక నిందితులను తప్పించిన పోలీసులు ప్రస్తుతం కదిరిలోని ప్రతి టీ కొట్టులోనూ ఇదే అంశంపై చర్చ -
న్యాయవాదిపై ప్రతివాది వర్గీయుల దాడి
పావగడ: ఓ కేసు విషయంగా న్యాయవాదిపై ప్రతివాది వర్గీయులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. పావగడ తాలూకా దవడబెట్ట గ్రామానికి చెందిన సుధాకర్.. జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన స్వగ్రామంలో ఓ ఇంటి వివాదానికి సంబంధించిన లీగల్ నోటీసును ఇటీవల తన ప్రతివాది సణ్ణీరప్పకు పంపారు. దీంతో కక్ష పెంచుకున్న సణ్ణీరప్ప వర్గీయులు మంగళవారం గొల్లరహట్టిలో సుధాకర్ను అడ్డుకుని మహిళలతో కలసి 20 మంది దాడి చేశారు. వారి బారి నుంచి తప్పించుకుని దాడిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శేషానందన్, న్యాయవాదులు బాధితుడు సుధాకర్ను పరామర్శించారు. -
మరమ్మతుకు వెళ్లి.. మృత్యు ఒడికి
● విద్యుత్ షాక్తో యువకుడి మృతి● లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ భార్య ఫిర్యాదు తనకల్లు: మండలంలోని ఉస్తినిపల్లి సమీపంలో విద్యుదాఘాతంతో చంద్రశేఖర్ (30) అనే యువకుడు మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు తెలిపిన మేరకు... విద్యుత్ శాఖ లైన్మెన్ షఫీ వద్ద కొద్ది రోజులుగా మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ (చందు) దిన కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఉస్తినిపల్లి వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లైన్మెన్ షఫీ, చంద్రశేఖర్ కలసి వెళ్లారు. పనులు చేసే ముందు లైన్మెన్ కొక్కంటి లైనుకు ఎల్సీ తీసుకోవాల్సి ఉండగా.. వంకపల్లి లైన్కు తీసుకున్నాడు. ఇది తెలియని చంద్రశేఖర్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను తాకగానే షాక్కు గురై స్తంభంపైనే మృతి చెందాడు. లైన్మెన్ షఫీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుత్ షాక్తో మృతి చెందాడని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి రొళ్ల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం నసేపల్లి గొల్లహట్టికి చెందిన మారన్న (33)కు భార్య శారదమ్మతో పా టు ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపం నుంచి గడ్డి మోపు తలపై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మారన్న మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా మారన్న మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమంటూ స్థానికులు ఆరోపించారు. భూమికి 8 అడుగుల ఎత్తులో 11కేవీ విద్యుత్ లైన్ వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మౌనవ్రతం వహించారు. వివరాల్లోకి వెళితే, వైఎస్సార్సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం చిలమత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.ప్రెస్మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఒకానొక దశలో పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించినా కిమ్మనకపోవడం గమనార్హం. పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోండి..: వైఎస్సార్సీపీ నాయకులకే పోలీసుల సలహా కాగా, దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ నాయకులను వదిలేసి, పార్టీ కార్యాలయం వదిలి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ నాయకులకే పోలీసుల సలహా ఇవ్వడం గమనార్హం. ‘‘మీరు పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోతేనే, టీడీపీ నేతలు వెళ్లిపోతారు’’ అంటూ పోలీసులు అనడంతో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్రెడ్డి, పార్టీ శ్రేణులు ససేమిరా అన్నాయి.తమకు ప్రెస్మీట్ నిర్వహించుకునే హక్కు, పార్టీ కార్యాలయంలో ఉండే హక్కు ఉందని వారు స్పష్టం చేశారు. దీంతో ఒక దశలో సీఐ జనార్దన్ ..ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డిలను బెదిరిస్తూ మాట్లాడారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతలు కూడా వినకపోవడంతో చివరకు పోలీసులు ఎంపీపీ, కనీ్వనర్తో మాట్లాడి అక్కడి నుంచి వారిని బందోబస్తు నడుమ పంపించి వేశారు.ప్రెస్మీట్ ముగిసిన తర్వాత వెళ్లేప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండా బాబూరెడ్డి ఎంపీపీని అసభ్య పదజాలంతో దూషించడం గమనార్హం. కాగా, ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన అంశంపై ‘సాక్షి’ ఈ నెల 24న ‘ప్రాణం తీసేందుకే ప్లాన్ చేశారా?.. ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం వెనుక సూత్రధారులెవరు?’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. అయితే.. టీడీపీ నేత నాగరాజు యాదవ్ తనపైనే ఈ వార్త రాశారంటూ ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బెదిరింపులకు దిగారు. -
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
ధర్మవరం అర్బన్: తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు వేదికగా ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపి బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఈ మేరకు జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల సోమేశ్వర్రెడ్డి సోమవారం తెలిపారు. విద్యార్థులు మమత, అభిలాష్, యుగంధర్, రఘు, చేతన్గౌడ్, జస్వన్కుమార్, భాను కేశవ్ ప్రతిభ చూపి నాలుగు బంగారు పతకాలతో పాటు ద్వితీయ స్థానంలో ఇద్దరు, తృతీయ స్థానంలో నలుగురు, నాల్గో స్థానంలో ముగ్గురు, ఐదో స్థానంలో ముగ్గురు నిలిచారన్నారు. -
ఎమ్మెల్యే అండతో హత్యాయత్నం
పుట్టపర్తి టౌన్: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అండ చూసుకుని టీడీపీ నాయకులు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, కేసు నమోదు చేసి న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేస్తున్నారంటూ ఎస్పీ రత్న వద్ద మడకశిర మండలం ఆర్.అనంతపురం గ్రామానికి చెందిన దళితులు వాపోయారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నకు వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. వివరాలు.. ఆర్.అనంతపురం గ్రామానికి చెందిన దళిత ఉగ్ర నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. 2018లో గ్రామంలో వినాయక చవితి పండుగ రోజున చిన్న పాటి అంశంలో ఉగ్ర నరసింహులుతో అదే గ్రామానికి చెందిన ఎస్సీ వర్గీయులు ఆంజనేయులు, మారుతి, రామాంజనేయులు గొడవపడ్డారు. మరుసటి రోజు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు నరసింహులుతో పాటు ఆయన కుమారులపై దాడి చేశారు. దీనిపై అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు మడకశిర పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి 2019లోనూ మరోసారి గొడవపడడంతో పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అయితే పాత గొడవలు వద్దని 2024లో పెద్ద మనుషులు సమక్షంలో రాజీ పడి కేసులకు లోక్ అదాలత్లో పరిష్కారం పొందారు. ఈ ఏడాది జూన్ 6న నరసింహులుపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. ఆయన కుమార్తెలు, కుమారులపై దాడులకు తెగబడ్డారు. ఈ విషయంగా మడకశిర పీఎస్లో కేసు నమోదైంది. ఈ అంశంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జోక్యం చేసుకుని ఒత్తిడి చేయడంతో కేసును స్టేషన్కే పరిమితం చేస్తూ పోలీసులు నీరుగార్చారు. ‘పార్టీ మాది, కేసు లేదు.. ఏమి లేదు.. ఏం చేసుకొంటావో చేసుకో’ అంటూ స్థానిక టీడీపీ నాయకుడు కన్నా, మరికొందరు తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. దౌర్జన్య పరులకు ఎమ్మెల్యే అండగా నిలవడంతో పోలీసులు సైతం నోరు మెదపడం లేదు. దీంతో తనకు, తన కుటుంబసభ్యులకు స్థానిక టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, వారి బారి నుంచి రక్షణ కల్పించి, హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి, న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు బాధితులు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 80 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగారుస్తున్న పోలీసులు న్యాయం చేయాలంటూ ఎస్పీకి దళితుల వినతి -
ఇరువర్గాల ఘర్షణ
బత్తలపల్లి: భూ వివాదంలో ఇరు వర్గా ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు... ధర్మవరం రూరల్ మండలం తిమ్మనకొట్టాల గ్రామానికి చెందిన గోపాల్, ఆంజనేయులు, మంజు ఆదివారం మధ్యాహ్నం తమ పొలం వద్ద జేసీబీతో పనులు చేయిస్తున్న సమయంలో తిరుపాలు, శివయ్య, మునెయ్య అక్కడకు చేరుకుని ఆ భూమిలో తమకూ హక్కు ఉందంటూ కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో గోపాల్, ఆంజనేయులు, మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేలా హామీ హిందూపురం: వినాయక చవితి ఉత్సవాలను హిందూపురంలో 9 రోజుల పాటు సజావుగా నిర్వహిస్తామంటూ ఎస్పీ రత్నకు లిఖితపూర్వకంగా ఏపీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హామినిచ్చారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాలని కోరారు. ‘సెక్టోరియల్’ అభ్యర్థుల మార్కులు బహిర్గతం చేయాలి : యూటీఎఫ్ పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ పోస్టుల నియామకానికి ఎంపికై న అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలని కలెక్టర్ను యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చేతన్ను కలసి వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్షలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ పోస్టులకు 120 మంది దరఖాస్తు చేసుకోగా 34 మందిని అర్హులుగా ఎంపిక చేస్తూ వారికి గురువారం బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. మార్కులు బహిర్గతం చేసి పారదర్శకంగా పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘చిలకం’ చెబితేనే కరెంట్ కనెక్షన్ ఇస్తారంట
ప్రశాంతి నిలయం: ‘‘నా తోటలోని బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరితే.. చిలకం మధుసూదన్రెడ్డి అనుమతులు లేకపోతే మేం కనెక్షన్ మంజూరు చేయలేమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పు ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారు. అధికారుల చర్యలతోనే నా చీనీతోట నీరులేక ఎండిపోతోంది. మీరైనా న్యాయం చేయండి’’ అంటూ ఓ రైతు కలెక్టర్ చేతన్ను వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే... ధర్మవరం మండలం ముచ్చురామికి చెందిన రైతు విశ్వనాథరెడ్డికి గ్రామంలో ఐదుఎకరాల పొలం ఉంది. ఏడాదిన్నర క్రితం బోరు వేసి కరెంట్ కనెక్షన్ కోసం ఽనిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం సర్వీసు మంజూరు చేసిన అధికారులు అవసరమైన పరికరాలు అందజేశారు. అయితే అప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో రైతు విశ్వనాథరెడ్డి పలుమార్లు మండల, డివిజన్, జిల్లా స్థాయి విద్యుత్ అధికారులను కలిసి తన పొలంలో చీనీచెట్లు ఎండి పోతున్నాయని, త్వరగా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలని వేడుకున్నారు. అయినా వారు స్పందించలేదు. చివరకు చిలకం మధుసూదన్రెడ్డిని కలవాలని, ఆయన చెబితేనే కనెక్షన్ ఇస్తామని సలహా ఇచ్చారు. చేసేది లేక విశ్వనాథరెడ్డి నాలుగుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సైతం అర్జీలు ఇచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్ట్కు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నాడు. అయినా విద్యుత్ అధికారులు కోర్టు ఉత్తర్వులను లెక్కచేయలేదు. దీంతో సోమవారం మరోసారి కలెక్టరేట్కు వచ్చిన రైతు విశ్వనాథరెడ్డి తన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎదుట బైఠాయించాడు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన దిగాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోతే ఆత్మహత్యే చేసుకుంటానన్నాడు. స్పందించిన కలెక్టర్ టీఎస్ చేతన్ అక్కడే ఉన్న విద్యుత్ శాఖ ఎస్ఈని ఆరా తీశారు. రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో త్వరలోనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ హామీ ఇవ్వడంతో రైతు ఆందోళన విరమించాడు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాటిపల్లి సురేష్రెడ్డి, రైతు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఓ రైతు ఫిర్యాదు -
కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించండి
పుట్టపర్తి అర్బన్: పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని డీపీఓ సమతను జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం డీపీఓను కలసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవులు, పండుగ సమయాల్లో సర్వేల పేరుతో పని చేయాల్సి వస్తుండడంతో విశ్రాంతి లేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నామన్నారు. స్వామిత్వ పథకంలో భాగంగా క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రామమోహన్, శ్రావణ్కుమార ఈశ్వర్, జైపాల్రెడ్డి, గోపాల్రెడ్డి, జిల్లాలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రాణాలు బలిగొన్న చేపల వేట
ధర్మవరం అర్బన్: చేపల వేట సరదా ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన సాకే రామాంజనేయులు (40)కు భార్య లక్ష్మీనరసమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం సాయంత్రం ధర్మవరం చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లిన రామాంజనేయులు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో పడి మునిగిపోయాడు. సోమవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు నీటిలో తెలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి రామాంజనేయులుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చావు లేదంటూ ఊజీ గుళికలు మింగి... చెన్నేకొత్తపల్లి: ప్రపంచం అంతమైనా తనకు చావు లేదని, కావాలంటే నిరూపిస్తానంటూ ఊజీ గుళికలు మింగి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... సీకేపల్లి మండలం ప్యాదిండి పంచాయతీ నామాల గ్రామానికి చెందిన ఆంజనేయులు (64)కు భార్య శివమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలంగా మతి స్థిమితం లేక గ్రామంలో తిరుగాడేవాడు. ఈ క్రమంలో సోమవారం అందరూ చూస్తుండగా తనకు చావు లేదని, ప్రపంచం అంతమైనా తాను మాత్రం జీవించే ఉంటానని, కావాలంటే నిరూపిస్తానంటూ గట్టిగా అరుస్తూ పొలం చల్లేందుకు తీసుకొచ్చిన ఊజీ గుళికలు తీసుకుని గబుక్కున నోట్లోకి వేసుకున్నాడు. గమనించిన కుమారుడు వెంకటేష్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఊజీ మాత్రలు మింగిన వృద్ధుడిని స్థానికులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆంజనేయులు మృతి చెందాడు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీఆర్ఎంటీ సమస్యలు పరిష్కరించాలి
బత్తలపల్లి: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ (సీఆర్ఎంటీ)ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ నాయకులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో సీఆర్ఎంటీ యూనియన్ నాయకులు సోమవారం గుంటూరులో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసరావును కలిసి వినతిపత్రాలు అందజేశారు. సీఆర్ఎంటీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయి, అశోక్, రమేష్, శివయ్య, హారన్బాషా, ఓబులేసు, నరసింహ, కృష్ణప్ప, మురళి, శివానంద తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకుడిని పూజించాలి
ప్రశాంతి నిలయం: వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పర్యావరణ అనుకూల వినాయక చతుర్థి’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. చెరువులు, జలవనరులకు నష్టం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారు చేసే విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడమే మేలన్నారు. నీటి వనరుల కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్నారు. వినాయక మండపాలకు అనుమతులు జారీ చేసేటప్పుడు, విగ్రహాల ఏర్పాటు సమయంలో రెవెన్యూ, మున్సిపల్, జిల్లా పంచాయతీ, పోలీస్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ చేతన్ పిలుపు -
‘పరిష్కార వేదిక’కు 240 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 240 అర్జీలు అందాయి. కలెక్టర్ చేతన్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణులు ఎంతో నమ్మకంతో వ్యయ, ప్రయాసలకోర్చి కలెక్టరేట్ వరకూ వచ్చి అర్జీలు ఇస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ● నేటి మధ్యాహ్నం నుంచి కాల్లెటర్ల డౌన్లోడ్కు అవకాశం అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, జిల్లా పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సోమవారం జిల్లా పరిశీలకులు సుబ్బారావు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానుండడంతో ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్టిఫికెట్ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. జోన్ ఆఫ్ కన్సడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు, వారు దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత డీఎస్సీ–2025 లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాల్లెటర్లలోని సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రం, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులైతే వైకల్య ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్ఫోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలన్నారు. అభ్యర్థులు 28న ఉదయం 9 గంటలకు పరిశీలన కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. వెరిఫికేషన్కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో వ్యక్తిగత డీఎస్సీ లాగిన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఎంపిక మెరిట్, అర్హత, రిజర్వేషన్ నియమ నిబంధనల మేరకే జరుగుతుందన్నారు. వారి వెంట విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ఖాన్, చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
మడకశిర: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు చంద్రబాబు మోసాలను ఊరూరా వివరించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం పట్టణంలోని షాదీమహల్లో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ గ్రామ పంచాయతీ, వార్డుల స్థాయిల్లో ఏర్పాటు చేసిన పార్టీ అనుబంధ కమిటీల నూతన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి మాట్లాడుతూ...పార్టీ అనుబంధ కమిటీల్లోని సభ్యులు వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. వైఎస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 14 నెలల కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు వజ్ర భాస్కర్రెడ్డి, మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు. బాధ్యతాయుతంగా పని చేయాలి: ఈరలక్కప్ప నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మాట్లాడుతూ... గ్రామ, వార్డుల స్థాయిల్లోని వివిధ కమిటీలకు నూతనంగా ఎన్నికై న సభ్యులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించి ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రతినిధి జీను మహేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆనంద రంగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, ఆయా మండలాల పార్టీ ఇన్చార్జ్లు గంగుల సుధీర్రెడ్డి, భారతిరెడ్డి దేశాయి, సాయిలీల, లింగారెడ్డి, పట్టణ కన్వీనర్ బోయ సతీష్కుమార్, మండల కన్వీనర్లు నరసింహారెడ్డి, డీఎల్ యంజారేగౌడ్, త్రిలోక్నాథ్, శ్రీనివాస్, రామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయరాజ్, ఎంపీపీలు ఈరన్న, సత్యనారాయణరెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నియోజకవర్గ స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులు, పంచాయతీ, వార్డుల ఇన్చార్జ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను ఊరూరా వివరించాలి వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి -
సచివాలయ ఉద్యోగుల బాహాబాహీ
● విరిగిన పంచాయతీ కార్యదర్శి చేయి ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గోరంట్ల: కేంద్రం అమలు చేస్తున్న స్వామిత్వ యోజన సర్వే సందర్భంగా ఏర్పడిన వివాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పంచాయతీ కార్యదర్శి చేయి విరిగింది. వివరాల్లోకి వెళితే... మండలపరిధిలోని కమ్మవారిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి ఫారుక్ నేతృత్వంలో సర్వేయర్, వీఆర్ఓ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్వామిత్వ యోజనకు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఫారుక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ మధ్య వృత్తిపర వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పంచాయతీ కార్యదర్శి ఫారుక్ కిందపడగా, చేయి విరిగింది. దీంతో తోటి ఉద్యోగులు ఫారుక్ను గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి ఫారుక్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ కూడా ఈ ఘటనపై ఎంపీడీఓతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫారుక్ తనపై దాడి చేశారని పేర్కొన్నారు. చేనేత కార్మికుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..ధర్మవరం శివానగర్కు చెందిన పామిశెట్టి చౌడయ్య(60) చేనేత కార్మికుడు. మగ్గంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే వాడు. మగ్గంపై ఎంతగా పనిచేసినా రాబడి అంతంతమాత్రంగానే ఉండటం... ప్రభుత్వం నుంచి సాయం కూడా లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే మర్గమూ కనిపించక మదన పడేవాడు. ఇటీవల కురిసిన వర్షాలతో మగ్గం పనికూడా చేయలేక ఇబ్బందులు పడ్డారు. రోజుగడవడమే ఇబ్బందిగా మారింది. ఇక అప్పులు తలచుకుని భయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందిన చౌడయ్య సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు సంజీవరాయుడు, కుమార్తె జయలక్ష్మి ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహాలు చేశాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
పుట్టపర్తిలో రెడ్బుక్.. ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లిన ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
అరుదైన రక్తదానంతో రోగికి ప్రాణదానం
గుంతకల్లు: అరుదైన ‘ఓ’ నెగిటివ్ రక్త దానంతో క్యాన్సర్ రోగికి ప్రాణదానం చేశాడు గుంతకల్లుకు చెందిన పరుశురాముడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కేవీ లక్ష్మి హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుదైన ‘ఓ’ నెగిటివ్ (బాంబే బ్లడ్) గ్రూప్ ఉన్న ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో రక్తం అవసరమై కుటుంబసభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోని పలువురు రక్తదాతలను సంప్రదించారు. విషయం గుంతకల్లులోని ప్రాణదాత సేవా సమితి సభ్యులకు తెలియడంతో ఓ నెగిటివ్ బ్లడ్ కలిగిన పరుశురాముడుకు సమస్య వివరించారు. దీంతో ఆయన ఆదివారం స్థానిక గోపీ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యుడు సురేష్ జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా పరుశురాముడుని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ప్రాణదాత సేవా సమితి సభ్యులు తిమ్మప్ప, హనుమంతు, హస్సేన్, బర్మాశాల రఘు, గఫూర్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పరుశురాముడు మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 18 మంది మాత్రమే ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారున్నారన్నారు. ఇందులో తరచూ ఆరుగురు మాత్రమే రక్త దానానికి ముందుకు వస్తున్నారని, ఇప్పటి వరకూ తాను 35 సార్లు రక్తదానం చేసినట్లు వివరించారు. -
నిర్మాణానికి సాయం చేయండి
నాకు పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి దగ్గర గత ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చి.. పక్కాగృహం మంజూరు చేసింది. అయితే ఆర్థిక పరిస్థితులు బాగలేక పోవటంతో గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకోలేకపోయాను. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టా రద్దు చేయకుండా.. ఇంటి నిర్మాణానికి మరింత ఆర్థిక సహాయం చేయాలి. – మేదర లక్ష్మి, పుట్టపర్తి రద్దు.. సరికాదు జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన పట్టాలను కూటమి ప్రభుత్వం రద్దుకు ఉపక్రమించాలనుకోవటం సరికాదు. ఆర్థిక స్తోమత లేక ఇంటి పనులు ప్రారంభించకుండా ఖాళీగా ఉన్న స్థలాలను రద్దు చేసే ఆలోచన మంచిది కాదు. వారికి మరొక అవకాశమిచ్చి మరింత ఆర్థిక సహాయం అందించి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పాటునందించాలి. పునాదుల వరకు నిర్మాణాలు చేసి బిల్లు కాకుండా ఉన్న వారికి ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించి నిర్మాణాల పూర్తికి సహకరించాలి. – ఈఎస్ వెంకటేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పింఛన్ తొలగింపు బాబు కుట్రే
మడకశిరరూరల్: దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్రెడ్డి ధ్వజమెత్తారు. నూతన పింఛన్లు మంజూరు చేయలేక.. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించి పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. ఆదివారం హెచ్ఆర్ పాళ్యంలో ఆయన పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇంటి వద్దకే వలంటీర్ల ద్వారా పింఛన్ అందించారన్నారు. వ్యయప్రయాసలు.. పడిగాపులు దూరం చేసి ఠంచన్గా పింఛన్ అందించి లబ్ధిదారుల కళ్లల్లో సంతోషం నింపారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సహా వందలాది హామీలలో కొన్నింటిని అదీ అరకొరగా అమలు చేస్తూ ప్రజలను వంచిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను గాలికి వదిలి రౌడీయిజం, అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అనర్హుల పేరిట తొలగింపు నోటీసులు జారీ అయిన దివ్యాంగులకు సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ ఇవ్వకపోతే.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. దగ్గుపాటిని సస్పెండ్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై ఆనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను రమేశ్రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహించి ఆందోళనలు చేస్తున్నారన్నారు. వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్రెడ్డి -
● అ‘పూర్వ’ సమ్మేళనం
మడకశిర: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1978–80 విద్యాసంవత్సరంలో ఇంటర్ చదివిన వారు అదే కళాశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జంక్షన్ (07009) నుంచి సెప్టెంబర్ 4– సెప్టెంబర్ 25వ తేదీ వరకు ప్రతి గురువారం (4 సర్వీసులు) రైలు తిరుగుతుందన్నారు. తిరుపతి జంక్షన్ (07010) నుంచి సెప్టెంబర్ 5–సెప్టెంబర్ 26 వరకు ప్రతి శుక్రవారం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ, ఉందా నగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రైళ్లలో ఫస్ట్ క్లాస్ కమ్ సెకండ్ ఏసీతోపాటు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి
ధర్మవరం అర్బన్: ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథంతో పాటు ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరిస్తాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. ధర్మవరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలు కార్పొరేట్ల చేతుల్లో చిక్కుకుని వారికి లాభాలు తెచ్చిపెట్టే వనరుగా మారిపోయాయనన్నారు. విద్యా వ్యవస్థలో సృజనాత్మకతకు స్థానం లేకపోగా ర్యాంకులకు ప్రాధాన్యత పెరిగి పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించడం సన్నగిల్లిందన్నారు. ఈ మార్పులను అవగాహన చేసుకుని జేవీవీ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ.. సైన్స్ను హేళన చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా చీకటి సామ్రాజ్యాలను నిర్మించుకున్న బాబాలు, స్వామీజీలకు ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు దొరకడం బాధాకరమన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటుతున్నాయన్నారు. ప్రజలు అభద్రతకు లోనవుతున్నారని తెలిపారు. డాక్టర్ ఈటీ రామ్మూర్తి మాట్లాడుతూ.. రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తుల మీద, ప్రశ్నించే వాళ్ల మీద దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ టీఎం బషీర్ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల ఫలితాలను సామాన్యులకు చేరువ చేయాల్సిన బాధ్యత జేవీవీ కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, కోశాధికారి చంద్రశేఖర్రెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సానే రవీంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి, నర్సారెడ్డి, చైతన్య, గంగిరెడ్డి, గౌస్ లాజం, సురేష్, నిర్ధారణుడు, సంజీవప్ప, లక్ష్మీనారాయణ, షర్ఫుద్దీన్, మహేష్, లోకేష్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేవీవీ మహాసభలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ -
రెస్టారెంట్ సీజ్
కదిరి టౌన్: స్థానిక అరబిక్ రెస్టారెంట్ను మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్ ఆదివారం సీజ్ చేశారు. ఇప్పటికే అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఆదివారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాల నాణ్యత లోపం, అపరశుభ్రత ప్రదేశంలో ఆహార పదార్థాలు నిల్వ, తిని వదిలేసిన చికెన్, మటన్ ముక్కలను తిరిగి వడ్డిస్తున్నట్లుగా తనిఖీల్లో గుర్తించారు. కుళ్లిన చికెన్, మటన్ వండుతుండడం, గడువు తీరిన మసాలాలు వినియోగించడాన్ని మున్సిపల్ కమిషనర్ గుర్తించి రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. అనంతరం రెస్టారెంట్ను సీజ్ చేశారు. -
ఇదేనా బాలికాభివృద్ధి?
అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న బాలికాభివృద్ధి ప్రకటనల్లో తప్ప చేతల్లో కనిపిచండం లేదు. ఏటా ప్రత్యేక సర్వేలు నిర్వహించి బడిఈడు పిల్లలందరినీ గుర్తించి వారితో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడుల్లో చేర్పిస్తున్నారు. ఇందు కోసం రూ.లక్షల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. అయినా క్షేత్ర స్థాయిలో బడిఈడు పిల్లలు భిక్షాటనతో బతుకీడుస్తూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. నగర శివారులోని రాచానపల్లి వద్ద నలుగురు బాలికలు (అందరూ 10–12 ఏళ్లలోపు) జోలెలు భుజాన తగిలించుకుని భిక్షాటనకు వెళుతున్నారు. నగరంలో మరో ఇద్దరు బాలికలు సంచులు భుజాన వేసుకుని చిత్తుకాగితాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరో బాలిక తల్లితో కలసి భిక్షాటనకు వెళ్తోంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన వయసులో బాలికలు భిక్షాటన చేయడం, చిత్తుకాగితాలు ఏరుకోవడం చూపరుల హృదయాలను కదిలిస్తున్నాయి. అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, ఆ దిశగా ఎవరూ పట్టించుకోకపోవడం మరో కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇలాంటి పిల్లలను గుర్తించి బలవంతంగానైనా బడిబాట పట్టించే చర్యలు తీసుకుంటే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియురాలికి పెళ్లి.. ప్రేమికుడి ఆత్మహత్య
యాడికి: తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పైళ్లెనట్లు తెలుసుకుని క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన బాలగంగన్న, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు జయకృష్ణ (22) ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. ఆమెతో తనకు పెళ్లి చేయాలని 3 నెలల క్రితం తల్లిదండ్రులను కోరాడు. అయితే నెల రోజుల క్రితం ఆ యువతికి మరో యువకుడితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లుగా తెలిసింది. దీంతో మనోవేదనకు లోనైన జయకృష్ణ శనివారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున పిలిచినా స్పందన లేకపోవడంతో మిద్దైపెకి ఎక్కి గవాక్షం నుంచి కుటుంబసభ్యులు చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న జయకృష్ణను గమనించి బలవంతంగా తలుపులు తీసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
తోడుకున్నోళ్లకు తోడుకున్నంత
సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని రామగిరి మండలం పేరూరు సమీపంలో ఉన్న పెన్నానది నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. రోజూ ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుక దందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో పెన్నానది పరివాహక ప్రాంతం గోతుల మయమవుతోంది. సమాధులనూ తోడేస్తున్నారు.... పేరూరు గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో కొన్నేళ్లుగా ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే సమీపంలోని పెన్నానదిలో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇసుక తవ్వకాలతో సమాధులు పెకలించి వేస్తున్నారు. అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఇసుకతో పాటు ఎముకలు, పుర్రెలను సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను పెన్నానది నుంచి తరలించి ఓ చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి పొరుగున ఉన్న బెంగళూరు, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడుగంటిన భూగర్బజలాలు... కొన్నేళ్లుగా పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తలిరస్తుండడంతో పేరూరుతో పాటు చాలా గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ విస్తారంగా వర్షాలు కురవడంతో పేరూరు డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో అప్పట్లో ఇసుక దందా కొనసాగించలేకపోయారు. అంతేకాక అప్పటి జగన్ ప్రభుత్వం సైతం ఇసుకను క్రమ పద్ధతిలో విక్రయాలు సాగించడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు తావు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపులు ఊపందుకున్నాయి. లక్షల కొద్ది మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమంగా తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించకపోతే పెన్నానది పరివాహక ప్రాంతంలో పంటల సాగు కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పెన్నానది పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తోంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అనే రీతిలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇసుక అక్రమ వ్యాపారులకు తోడ్పాటునందిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పరిటాల కుటుంబం అండతో యథేచ్ఛగా ఇసుక దందా రోజూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలింపు సమాధులను సైతం వదలని వైనం పట్టించుకోని అధికార యంత్రాంగం -
కారు ఢీ – వ్యక్తి మృతి
చిలమత్తూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం పుల్లగూర్లపల్లికి చెందిన ఆంజనేయులు (50) ఆదివారం ఉదయం పని కోసం చిలమత్తూరు మండలం కమ్మయ్యగారిపల్లికి వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయన 44వ జాతీయ రహదారిపై కంబాలపల్లి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులను 108 అంబులెన్స్ ద్వారా హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి దుర్మరణం మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు...మడకశిర మండలం వైబీ హళ్లి గ్రామానికి చెందిన చిక్కన్న (72) మడకశిర సమీపంలోని ఓ దానిమ్మ తోటకు కాపలాదారుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సమీపంలోని మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఓ హోటల్లో కాఫీ తాడగానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా హిందూపురం వైపు నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామిరెడ్డి, వైబీ హళ్లి పంచాయతీ నాయకులు బాలకృష్ణారెడ్డి, నాగభూషణ్రెడ్డి తదితరు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీఐపై చర్యలకు కౌన్సిలర్ డిమాండ్ చిలమత్తూరు: హిందూపురం వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక మున్సిపాల్టీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్వుల్లా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం డీఎస్పీ కేవీ మహేష్ను కలసి ఫిర్యాదు పత్రం అందజేసి, మాట్లాడారు. శనివారం అల్హిలాల్ కాంప్లెక్స్ వద్ద మందులు కొనుగోలు చేసి నిల్చోని ఉండగా పోలీసు జీపులో వచ్చిన సీఐను గమనించి గౌరవంగా నమస్కరించానన్నారు. దీనికి ఆగ్రహంతో సీఐ ఊగిపోతూ చొక్కా పట్టుకుని లాగడంతో అది కాస్త చినిగిపోయిందన్నారు. అలాగే తనను స్టేషన్ వరకూ తీసుకెళ్లి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించిన సీఐ రాజగోపాల్నాయుడుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
‘జీపీఎఫ్’ లోపాలు సవరించాలి
పుట్టపర్తి: జనరల్ ప్రావిడెంట్ ఫంట్ ఖాతాల్లో తలెత్తిన లోపాలను ప్రభుత్వం వెంటనే సవరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చాలా మంది ఉపాధ్యాయుల ఖాతాలకు సంబంధించి ఆన్లైన్లో లోపాలు ఉన్నాయన్నారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి కొంత మంది ఉపాధ్యాయులకు అప్డేషన్ కాలేదని, మరికొందరు ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్ తప్పుగా చూపుతోందన్నారు. వెంటనే వాటిని సవరించాలన్నారు. ఆలయాల్లో దొంగతనం నల్లచెరువు: మండల కేంద్రంలోని గీతామందిరం, మార్కండేయస్వామి ఆలయాల్లో దొంగలు హుండీలు ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. స్థానికుల వివరాలమేరకు.. కె.పూలకుంట రోడ్డులోని గీతామందిరం, మార్కండేయస్వామి ఆలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హుండీలు ధ్వంసం చేశారు. అందులోని సుమారు రూ. 40 వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు శనివారం ఉదయం ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన జరిగిన ఆలయాలను పరిశీలించారు. వీరభద్రుడి సేవలో డిప్యూటీ సీఈఓ లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని శనివారం కేంద్ర ఖాదీ, గ్రామీణ చేతివృత్తుల కమిషన్ డిప్యూటీ సీఈఓ మదన్కుమార్రెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించడంతో పాటు వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. లేపాక్షిలో ఖాదీ, గ్రామీణ చేతి వృత్తుల ఎంపోరియం ఏర్పాటు చేయాలని అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు సీఈఓకు విన్నవించారు. -
నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు
పుట్టపర్తి టౌన్: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల దర్యాప్తునకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేసుల ఛేదింపుల్లో కృషి చేసిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కేసుల దర్యాప్తులో సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు వద్ద శక్తి టీం ద్వారా ఈవ్టీజింగ్ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపండి బెట్టింగ్పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ రత్న పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల్లో నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచాలని, రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేసి చోరీల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను పూర్తిగా కట్టడి చేయాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలను తరచూ సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ఉండాలన్నారు. అలాగే పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామి, మహేష్, హేమంత్కుమార్, నర్సింగప్ప, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఐటీకోర్ ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి చవితి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ నిరోధంపై దృష్టి సారించండి నేర సమీక్ష సమావేశంలో పోలీసులకు ఎస్పీ రత్న ఆదేశం -
శనీశ్వరా.. పాహిమాం
పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి శ్రావణ బహుళ అమావాస్య శనివారం శని వారోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. తమను వెంటాడుతున్న శని దోషాలను నివారించి కష్టాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. దీక్షా మంటపంలో తల నీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. నవ గ్రహ పూజలకు భక్తులు పోటెత్తారు. పలువురు ఆర్య వైశ్య వ్యాపారులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు లాయర్ వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి సుబ్బనరసింహ తదితరులు భక్తులకు సేవలందించారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రాప్తాడు: మండల కేంద్రానికి చెందిన మాజీ స్టోర్ డీలర్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని రాప్తాడు పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాలమేరకు.. ఈ ఏడాది మే 14న పోలీస్స్టేషన్కు వచ్చి సీఐ సార్ను కలవాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. తాను పోలీసుస్టేషన్ లోపలికి వెళ్తుండగా.. రాప్తాడుకు చెందిన మారుతీ, నారాయణ, జగదీష్లు పోలీస్స్టేషన్ ముందే తనపై దాడి చేశారన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా చెప్పలేదన్నారు. వారిపై కేసు నమోదు చేయాలని అప్పట్లో ఫిర్యాదు చేసినా నేటికీ పోలీసులు స్పందించలేదన్నారు. నిన్ను కొడితే దిక్కెవరు? తాజాగా శనివారం సాయంత్రం ఎస్సీ కాలనీలోని తన ఇంటి ముందు కూర్చొని ఉండగా గతంలో దాడి చేసిన నారాయణ మళ్లీ దాడికి యత్నించాడని లక్ష్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. బండి ఎక్కు .. నీతో పని ఉందని బూతులు తిట్టారన్నారు. కొడితే దిక్కెవరని, పోలీసులు కూడా మేమంటే భయపడతారన్నారన్నారు. నారాయణ నుంచి తప్పించుకొని, వచ్చి నారాయణ, మారుతీ, జగదీష్ల నుంచి తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని మరోసారి పోలీసులను వేడుకున్నానని లక్ష్మన్న తెలియజేశారు. సమష్టి కృషితో ‘స్వచ్ఛత’ పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితోనే ‘స్వచ్ఛత’ సాధ్యమవుతుందని, అందువల్ల ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు నిచ్చారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పుట్టపర్తిలో విద్యార్థులు, అధికారులు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సత్యమ్మ ఆలయం వద్ద కలెక్టర్ చేతన్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా చిత్రావతి బ్రిడ్జి వరకూ సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లాను స్వచ్ఛతలో తొలిస్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కొంత సమయం కేటాయించాలన్నారు. వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలన్నారు. -
నాలుగు పోస్టులకు అర్హత
పరిగి: మెగా డీఎస్సీలో పరిగి మండలంలోని కొడిగెనహళ్లి వాసి కేవీ వేదవ్యాస ఏకంగా నాలుగు పోస్టులకు అర్హత సాధించారు. పరిగి మండలంలోని కొడిగెనహళ్లిలో నివాసముంటున్న వాసుదేవరావు, శారద దంపతుల కుమారుడు వేదవ్యాస్ (25) డీఎస్సీలో ఏకంగా నాలుగు పోస్టులకు అర్హత సాధించారు. వేదవ్యాస కర్ణాటకలోని మైసూరులో బీఎస్సీ బీఎడ్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన అనంతరం 2024లో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది నిర్వహించిన టెట్ ఎక్జామ్లో 118 మార్కులను సాధించాడు. తాజాగా నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్షలో జోన్–4లో పీజీటీ ఫిజికల్ సైన్సస్ విభాగంలో 69.5 మార్కులతో మొదటి ర్యాంకును సాధించారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో 83.23 ర్యాంకుతో జిల్లా స్థాయి మూడో ర్యాంకు, మోడల్ రెసిడెన్సియల్ స్కూల్కు టీజీటీ ఫిజికల్ సైన్స్ జోనల్ 4లో 78.73 మార్కులతో రెండో ర్యాంకు, మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ విత్ బయాలజీ అండ్ ఫిజిక్స్ విభాగంలో 74.75 ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచాడు. తాను సివిల్స్ లక్ష్యంగా చదువుతున్నట్లు వేదవ్యాస పేర్కొన్నారు. కాగా వేదవ్యాస తండ్రి వాసుదేవరావు మండలంలోని ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. -
ఆదర్శప్రాయుడు ఆంధ్ర కేసరి
● ప్రకాశం పంతులుకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శ ప్రాయుడని, ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని శనివారం కలెక్టరేట్లో, ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ చేతన్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు గుర్తు చేశారు. స్వాతంత్య్రోద్యమంలో సైమన్ కమిషన్కు గుండెలు చూపిన ధీశాలి ఆంధ్రకేసరి అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి తెచ్చారన్నారు. అంతకుముందు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రత్న... ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘సాక్షి’ విలేకరికి బెయిల్ కదిరి: టీడీపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసుతో జైలు కెళ్లిన తలుపుల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డితో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బారెడ్డికి శనివారం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే... తలుపుల మండలం రాజనోళ్లపల్లి సర్పంచ్ సుగుణమ్మ (వైఎస్సార్సీపీ మద్దతుదారు) ఈ ఏడాది జూలై 27న మధ్యాహ్నం తన ఇంట్లో నిద్రిస్తుండగా గ్రామానికి చెందిన నవీన్ (టీడీపీ ) ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు అపహరించుకుని వెళ్లారు. తర్వాత గ్రామస్తులందరూ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీన్ని అవమానంగా భావించిన నవీన్ అదేరోజు ఇంటి పక్కనే చెట్టుకు ఉరివేసుకున్నారు. అయితే టీడీపీ నాయకులు దీన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. బాధితురాలు సుగుణమ్మతో పాటు విధి నిర్వహణలో భాగంగా వివరాలు సేకరించేందుకు వెళ్లిన తలుపుల మండల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డితో సహా మరో 8 మందిపై తప్పుడు కేసు పెట్టారు. దీంతో పోలీసులు రఘునాథరెడ్డిని గత నెల 28న అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తంకదిరి సబ్జైలుకు తరలించారు. ఈ కేసులోనే శనివారం రఘునాథరెడ్డితో పాటు మరో వ్యక్తికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొందరు హైకోర్టును ఆశ్రయించగా.. వారికీ బెయిల్ మంజూరైంది.వైఎస్సార్సీపీ కార్యకర్త రమేష్పై కేసు పుట్టపర్తి: దివ్యాంగుల పింఛన్ల తొలగింపును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టిన బుక్కపట్నం మండలం నార్శింపల్లికి చెందిన పి.రమేష్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై బుక్కపట్నం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. బుక్కపట్నం టీడీపీ మండల కన్వీనర్ మల్లిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. కూటమి ప్రభుత్వం పలువురు దివ్యాంగుల పింఛన్లను తొలగించిందని రమేష్ పోస్టులు పెట్టారని... ఇందులో నిజం లేదని టీడీపీ నేత ఫిర్యాదు చేశారన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
ధర్మవరం అర్బన్: పట్టణంలో రెండురోజుల క్రితం జరిగిన మెకానిక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యపై కన్నేసిన తమ్ముడిని అన్న హత్య చేశాడని డీఎస్పీ హేమంత్కుమార్, వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేతిరెడ్డి కాలనీ ఎల్–2కి చెందిన పాళ్యం శివయ్య పిన్నమ్మ కుమారుడు కేతిరెడ్డి కాలనీ ఎల్–3కి చెందిన పాళ్యం ధనుంజయ అన్నదమ్ములు. ఇద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. ధనుంజయ తన అన్న శివయ్య భార్యపై కన్నేసి ఆమెతో పలుమార్లు చెడుగా ప్రవర్తించేవాడు. చాలాసార్లు శివయ్య... ధనుంజయను మందలించాడు. అయినా ధనుంజయలో మార్పు రాలేదు. దీంతో ఈనెల 21న అర్ధరాత్రి సమయంలో ఎల్పీ సర్కిల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓపెన్ జిమ్ వద్ద ధనుంజయను సిమెంట్ ఇటుకతో పాటు బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. పరారీలో ఉన్న శివయ్యను అరెస్టు చేశామన్నారు. తన భార్యపై కన్నేసిన తమ్ముడిని హతమార్చిన అన్న రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు -
డీఎస్సీలో సత్తాచాటిన ధర్మవరం అభ్యర్థులు
ధర్మవరం అర్బన్: డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ధర్మవరం అభ్యర్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పట్టణంలోని కేశవనగర్కు చెందిన చేనేత కార్మికుడు చింతా పరమేశ్వర్, చింతా పద్మావతి దంపతుల కుమార్తె దివ్యశ్రీ డీఎస్సీ ఎస్జీటీ పరీక్ష ఫలితాల్లో 92.79 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. దివ్యశ్రీ పదో తరగతి, ఇంటర్ ధర్మవరంలో చదివి టీటీసీ బుక్కపట్నం డైట్ కళాశాలలో చదివారు. ఓపెన్ డిగ్రీ, బీఈడీ చేశారు. అనంతపురంలో శిక్షణ తీసుకున్నారు. డీఎస్సీలో దివ్యశ్రీ జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ధర్మవరం వైఎస్సార్ కాలనీకి చెందిన చేనేత కుటుంబానికి చెందిన ఉక్కిశిల సంగప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు సాయికుమార్ డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 92.70 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. పదో తరగతి, ఇంటర్ ధర్మవరంలో పూర్తిచేసిన సాయికుమార్ బుక్కపట్నం డైట్ కళాశాలలో టీటీసీ పూర్తి చేశారు. అనంతపురంలో శిక్షణ పొంది డీఎస్సీ పరీక్షలో ప్రతిభ చూపి జిల్లాస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. జిల్లా ప్రథమ, ద్వితీయ స్థానాలు కై వసం -
ఉదయం రెక్కీ .. రాత్రి దొంగతనం
ధర్మవరం అర్బన్: ఉదయం రెక్కి నిర్వహిస్తారు. రాత్రి దొంగతనం చేసేస్తారు. తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసి ఆ బంగారాన్ని బెంగళూరులో విక్రయించే అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన పాల్తూరి రామకృష్ణ అలియాస్ బాలరామకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం వేలూరులో నివసిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా పన్నసముద్రం పంచాయతీ అచ్చంపల్లికి చెందిన భగవంతపు రామంజినప్ప ఇద్దరూ కలిసి ధర్మవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు తలుపులు పగలకొట్టి దొంగతనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కోవడం చేసేవారు. ఇద్దరు దొంగలపై ఇప్పటికే పావగడ పోలీస్స్టేషన్, ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు చెప్పారు. వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.9 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటికే ఇద్దరు దొంగలు దొంగతనం కేసులో కొయంబత్తూర్, అనంతపురం జిల్లాలో శిక్ష అనుభవించారని తెలిపారు. జైలులో ఉన్న సమయంలో ఈ దొంగలు పరిచయం పెంచుకుని బయటకు వచ్చిన అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, హెడ్కానిస్టేబుల్ అప్పస్వామి, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్లు చొరవ చూపారని వారిని డీఎస్పీ అభినందించారు. తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్ ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు రూ.9 లక్షలు విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం -
నాకే నమస్తే పెడతావా ?
చిలమత్తూరు: గౌరవంగా నమస్తే పెట్టిన పాపానికి ఓ కౌన్సిలర్ పోలీసు దాష్టీకానికి బలయ్యాడు. వివరాల్లోకెళితే.. హిందూపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్వుల్లా శనివారం రాత్రి పట్టణంలోని అల్హిలాల్ కాంప్లెక్స్ వద్ద తన బట్టల దుకాణం వద్ద నిల్చొని ఉన్నారు. అటు వైపు నుంచి సీఐ జీపు రాగానే నమస్తే పెట్టారు. దీనికి ఆగ్రహించిన సీఐ రాజగోపాల్నాయుడు.. నాకే నమస్తే పెడతావా అంటూ ఆసిఫ్వుల్లాను కొట్టడంతో పాటు స్టేషన్కు లాక్కెళ్లారు. ఏం నేరం చేశానని ప్రశ్నించిన పాపానికి దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి , కౌన్సిలర్లు శివ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేణురెడ్డి మాట్లాడుతూ సీఐ ఆగడాలు మితిమీరిపోయాయని, వెంటనే ఆయనున్న సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్పై సీఐ రాజగోపాల్నాయుడు దాష్టీకం -
దివ్యాంగులను ఏడిపింఛన్
పుట్టపర్తి అర్బన్: పింఛన్ మొత్తంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎందరో దివ్యాంగుల పట్ల కూటమి సర్కార్ నిర్దయగా వ్యవహరించింది. మంచాలకు పరిమితమైన వారు.. నడవలేని పరిస్థితుల్లో ఉన్న వేలాది మందికి వైకల్య శాతం తగ్గించి పింఛన్ రద్దు చేస్తూ నోటీసులిచ్చింది. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగిరి, ధర్మవరం, బత్తలపల్లి, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన అర్హులకు పింఛన్ అందకుండా చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. 7,163 పింఛన్ల రద్దు.. జిల్లాలో 34,967 మంది దివ్యాంగ పింఛన్దారులు ఉన్నారు. కూటమి సర్కార్ ‘పునఃపరిశీలన’ పేరుతో వీరందరినీ ఆస్పత్రులకు పంపింది. అయితే చాలా ప్రాంతాల్లో వైద్యులు కనీసం దివ్యాంగులను పరిశీలించకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. వైకల్య శాతాన్ని ఇష్టానుసారంగా నమోదు చేశారు. దీంతో వైకల్య శాతం 40 శాతంలోపు నమోదైన 7,163 మంది పింఛన్లను తొలగిస్తూ ప్రభుత్వం లబ్ధిదారులకు నోటీసులిచ్చింది. ఇక రూ.15 వేలు, రూ.10 వేల పింఛన్ మొత్తం తీసుకుంటున్న మరో 8 వేల మందికి వైకల్య శాతం తగ్గించింది. వీరందరికీ పింఛన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది. దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖం చాటేసిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు.. ఆగస్టు 15వ తేదీ తర్వాత పింఛన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్లు ముఖం చాటేశారు. నియోజక వర్గాల్లో అందుబాటులో ఉంటే దివ్యాంగులు కార్యాలయాలకు వచ్చి ఇబ్బంది పెడతారన్న కారణంతో కనిపించకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో ‘స్థానిక’ ఎన్నికలకు ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఓ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. రేపు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా.. కూటమి సర్కార్ చర్యను నిరసిస్తూ వేలాది మంది దివ్యాంగులు వికలాంగ సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షపీ, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కో ఆర్డినేటర్ హరినాథ్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పింఛన్ కోల్పోయిన దివ్యాంగులు, వైకల్య శాతం తక్కువగా నమోదైన దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ అర్హులకు పింఛన్ మొత్తం అందించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. -
ప్రాణం తీసేందుకే ప్లాన్ చేశారా!
సాక్షి టాస్క్ఫోర్స్: అధికారం చేతుల్లో ఉంది... అడిగేవారు లేరు... అందుకే హిందూపురం నియోజక వర్గంలో ‘పచ్చ’ బ్యాచ్ రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రజల పక్షాన నిలిచే నాయకులను అంతం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం చేశారు. వాస్తవానికి ఆయన్ను అంతంచేసేందుకే ప్లాన్ చేసినా అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పాత్రధారులు కనబడుతున్నా... ఎంపీపీ మర్డర్కు స్కెచ్ వేసిన సూత్రధారులు ఎవరన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్.. చిలమత్తూరు మండలంలో కొందరు టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం, బెదిరింపులకు దిగడం, అక్రమ కేసులు పెట్టించడం పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతల్లో ముఖ్యంగా కొందరు దోపిడీలకూ తెగిస్తున్నారు. అడ్డం వస్తే బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులను ప్రోత్సహిస్తూ హత్యారాజకీయాలకు దిగడంతో సామాన్యులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక సూత్రధారులు ఎవరు...? ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో అసలు సూత్రధారులు వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని సర్వసభ్య సమావేశాలకు రానివ్వకుండా జెడ్పీటీసీ మామ నాగరాజు యాదవ్, బాబూరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారు. గతేడాది జూలై 24 వ తేదీన ఎంపీడీఓ కార్యాలయం ముందే నాగరాజు యాదవ్ హల్చల్ చేశాడు. ఎంపీపీని మండలంలో అడుగుపెట్టనివ్వబోమని హడావుడి చేశాడు. అడ్డువచ్చిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. అప్పటికే ఎంపీపీ, బాబూరెడ్డి ఓ కేసులో అరెస్టు కాగా ఎంపీపీ బెయిల్పై బయటకు వచ్చాడు. బాబూరెడ్డి మాత్రం బెయిల్ తీసుకోకుండానే బయటకు వచ్చి హంగామా చేశాడు. అప్పటి నుంచి పోలీసుల భద్రత నడుమ ఎంపీపీ సర్వసభ్య సమావేశాలకు హాజరై వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలలు స్తబ్ధతగా ఉన్న మండలంలో మళ్లీ ఎంపీపీపై హత్యా ప్రయత్నం కలకలం రేపుతోంది. ఈ దాడి వెనుక బాబూరెడ్డి ఆయన అనుచరులు ప్రత్యక్ష సూత్రధారులు కాగా, పరోక్షంగా మండలంలోని కీలకమైన టీడీపీ నేత ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీపీకి ప్రాణహాని.. ఎంపీపీ పురుషోత్తమరెడ్డికి ప్రాణహాని ఉందని, పూర్తి భద్రతతోనే గ్రామంలోకి వెళ్లాలని పోలీసులు కూడా హెచ్చరించారు. ఇప్పటికే గ్రామంలో పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎంపీపీ తన స్వగ్రామమే కదా అన్న ఏమరుపాటుగా ఉండటంతో శుక్రవారం ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం వెనుక సూత్రధారులెవరు.. ? ‘పురం’ నియోజక వర్గంలో జోరుగా సాగుతున్న చర్చ -
నాకే నమస్తే పెడతావా ?
సత్యసాయి జిల్లా: గౌరవంగా నమస్తే పెట్టిన పాపానికి ఓ కౌన్సిలర్ పోలీసు దాషీ్టకానికి బలయ్యాడు. వివరాల్లోకెళితే.. హిందూపురం మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్వుల్లా శనివారం రాత్రి పట్టణంలోని అల్హిలాల్ కాంప్లెక్స్ వద్ద తన బట్టల దుకాణం వద్ద నిల్చొని ఉన్నారు. అటు వైపు నుంచి సీఐ జీపు రాగానే నమస్తే పెట్టారు. దీనికి ఆగ్రహించిన సీఐ రాజగోపాల్నాయుడు.. నాకే నమస్తే పెడతావా అంటూ ఆసిఫ్వుల్లాను కొట్టడంతో పాటు స్టేషన్కు లాక్కెళ్లారు. ఏం నేరం చేశానని ప్రశ్నించిన పాపానికి దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి , కౌన్సిలర్ శివ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేణురెడ్డి మాట్లాడుతూ సీఐ ఆగడాలు మితిమీరిపోయాయని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్ దంపతులు
అమరాపురం/మడకశిర: మండలంలోని హేమావతిలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం సినీ హిరో మంచు మనోజ్ దంపతులు సందర్శించారు. వారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం 5 గంటలకు మడకశిర మీదుగా బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ ఉన్నారు. -
సోషల్ మీడియాతో సమాజానికి కీడు
అనంతపురం సిటీ: సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) విపరీత ధోరణితో సమాజానికి కీడే ఎక్కువ జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. సంచలనాల పేరుతో నిజాలు నిర్ధారించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రచారం, ప్రసారం చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్లో ఉన్న డీపీఆర్సీ భవన్లో శుక్రవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఉమ్మడి జిల్లా మహాసభ జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ అధ్యక్షత వహించగా.. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా కథనాలు ఉండాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్కు చర్యలు తీసుకున్నామన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్లో జర్నలిస్టులకు మరింత చేయూతనందిస్తామని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు జర్నలిజంతోనే ముడిపడి ఉందని ఉప్పల లక్ష్మణ్ అన్నారు. అయితే చాలా మంది జర్నలిస్టులు అక్రమార్కుల కొమ్ము కాస్తు నిజాలను రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిజాలే రాయాలని, అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణంలో మన పాత్ర పోషించిన వారమవుతామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో తమ యూనియన్ ముందుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ -
ఆటో డ్రైవర్ల అగచాట్లు
పుట్టపర్తి అర్బన్: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆర్బాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వేలాది మంది ఆటో కార్మికులను బజారున పడేసింది. ఇంత కాలం స్టేజ్ టు స్టేజి వెళ్లడానికి ఆటోలపై రోజూ వేలాది మంది ప్రయాణించేవారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు, ఉద్యోగినులు, విద్యార్థినులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుండడంతో ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల జీవనం దుర్భరంగా మారింది. రోజంతా వేచి చూసిన రూ.100 కూడా ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. వాహన మిత్రతో ఆదుకున్న వైఎస్ జగన్.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంతో ఆటో డ్రైవర్లను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ రూ.10 వేలు చొప్పున ఏటా ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో కార్మికుడికి రూ.15వేలు అందజేస్తామని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఆటో డ్రైవర్లను దగా చేశారు. రెండో ఏడాదిలో ఇప్పటికే సగం గడిచిపోయింది. అయినా రూ.15 వేల ఆర్థిక సాయంపై ఎలాంటి ఊసు లేదు. దీనికి తోడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ప్రస్తుతం ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. రుణం కంతు చెల్లించడమూ భారమే.. జిల్లా వ్యాప్తంగా ఆటోలు, జీపులపై ఆధారపడి దాదాపు 42 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకుని వాహనాలు సమకూర్చుకున్నారు. కనీసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఆదాయం ఉండేది. ఈ సంపాదనతోనే క్రమం తప్పకుండా నెలకు రూ.5 వేలకు పైగా రుణం కంతులు చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోలకు అద్దెలు దొరక్క ఎక్కడికక్కడ స్టాండ్లలో నిలిచిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా.. రూ. 100 కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. వచ్చే 1వ తేదీన రుణాల కంతులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రయాణికులు లేక ప్రశాంతి గ్రామం వద్ద చెట్ల కింద నిలిపిన ఆటోలు సీ్త్ర శక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో కార్మికులు జిల్లాలో 42 వేల మందిపై ప్రభావం రుణాల కంతులు చెల్లించలేక ఇబ్బందులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు జీవనోపాధి కల్పించండి పుట్టపర్తి టౌన్: సీ్త్ర శక్తి పథకం అమలు ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయామని మాకు జీవనోపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని అటోడ్రైవర్లు కోరారు. ఈ మేరకు వారి బాధలు, జీవనోపాధిని వివరిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పుట్టపర్తి పట్టణంలోనే దాదాపు 500 మంది ఆటోలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆటోల్లో మహిళలు ప్రయాణించక పోవడంతో రోజుకు రూ.150 సంపాదన కూడా లేదన్నారు. 8 శాతం వడ్డీతో ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకుని ఆటోలు కొనుగోలు చేశామని, ఇప్పటికే కంతులు చెల్లించలేని 150 ఆటోలను ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. సీ్త్ర పథకం పుణ్యమా అని మిగిలిన ఆటోలను కూడా త్వరలో ఫైనాన్స్ కంపెనీ వారు జప్తు చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. రూ.25 వేలు ఇవ్వాలి ఆటోలు, జీపులు, ఇతర వాహనాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.25 వేలు అందజేయాలి. ఎన్నికల హామీని అమలు చేయకుండా ఇప్పటికే ఏడాదిన్నర గడిపేశారు. డిమాండ్ సాధనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నాం. – బాబావలి, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రత్యామ్నాయం చూపాలి ఫ్రీ బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు ప్రత్యమ్నాయం చూపాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉంది. రోజూ ఆటోలు ఎక్కువగా ఎక్కేది మహిళలే. ఇప్పుడు వారంతా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రోజంతా ఆటో నడిపినా రూ.200 కూడా రావడం లేదు. ఆటోకు డీజిల్, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆటో మరమ్మతులు, రుణం కంతులు, ఎఫ్సీలు ఎలా చేయించుకోవాలో అర్థం కావడం లేదు. – నబీరసూల్, లోచర్ల, కొత్తచెరువు మండలం -
ప్రేమ పెళ్లికి నిరాకరణ.. యువకుడి ఆత్మహత్య
బత్తలపల్లి: ప్రేమించిన బంధువుల అమ్మాయితో పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు కుమారుడు తలారి గుణ (18) తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో క్షణికావేశంలో గురువారం రాత్రి తన మామిడి తోటలోని చెట్టుకు చీరతో ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి బలవన్మరణంఎన్పీకుంట: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్పీకుంట మండలం ధనియాని చెరువు గ్రామానికి చెందిన వల్లెపు మునెప్ప (59)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాలికి గాయం కావడంతో కొంత కాలంగా ఏ పని చేయలేక ఇంటి పట్టునే ఉంటూ వచ్చాడు. దీంతో కుటుంబ అవసరాలు, చికిత్స కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక గురువారం రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని కుటుంబ సభ్యులు గమనించి కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెండేళ్లలో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తాం
సోమందేపల్లి: పెనుకొండలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మంత్రి సవిత, ఎంపీ పార్థసారథితో కలిసి సోమందేపల్లిలోని నక్కల గుట్ట కాలనీలో కృష్ణుడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత వాసులకు సూపర్స్పెషాలిటీ వైద్యం అందడంతో పాటు మెడికల్ సీట్లు పెరుగుతాయన్నారు. రాబోయే రెండేళ్లలో కళాశాల నిర్మాణం పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య, ఎంపీపీ ఆది నారాయణ పాల్గొన్నారు. లక్ష్యాలన్నీ సకాలంలో పూర్తి చేయాలి ● అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతి సమాచారాన్ని సకాలంలో పంపే బాధ్యత ఆయాశాఖల ఉన్నతాధికారులపై ఉంటుందన్నారు. ఓటరు జాబితా మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను ఈఆర్ఓలు ఎప్పటికప్పుడు ఆప్లోడ్ చేసేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలన్నారు. ఈ–క్రాప్కు సంబంధించిన ఈ–కేవైసీ పెండింగ్లో లేకుండా వీఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి నుంచి చెత్తసేకరణపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఓవర్హెడ్ ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి పైపులు లీకేజీ లేకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల దోమలు అభివృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయాలన్నారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్లకు నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన వివిధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సీపీఓ విజయ్ కుమార్, డీపీఓ సుమత, ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అప్పు చెల్లించలేదని దాడి ధర్మవరం అర్బన్: అప్పు చెల్లించలేదంటూ ఓ లారీ డ్రైవర్పై వడ్డీ వ్యాపారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు.. నార్పల మండలానికి చెందిన గోదిన గురుప్రసాద్ లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం తాడిపత్రి పట్టణానికి చెందిన జోసఫ్తో రూ.50 వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కంతులు సక్రమంగా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 18న లారీలో సిమెంట్ లోడ్తో వెళుతున్న గురుప్రసాద్ను ధర్మవరంలోని మార్కెట్యార్డు వద్ద జోసఫ్ అడ్డుకుని తన అనుచరులు బాబా ఫకృద్దీన్, ఖాసీం, సునీల్, అబ్దుల్లా, మరో వ్యక్తితో కలసి విచక్షణారహితంగా దాడి చేశాడు. బెల్టు, కాళ్లు, చేతులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గురుప్రసాద్ తన సొంతూరికి వెళ్లి కోలుకున్న తర్వాత శుక్రవారం ధర్మవరం రెండో పట్టణ పీఎస్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీంతో దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పింఛన్ కోతలు దుర్మార్గం
పెనుకొండ రూరల్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని, పైగా ఇప్పటికే ఉన్న పింఛన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రీవెరిఫికేషన్ పేరుతో అర్హుల పింఛన్లు తొలగించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడిందన్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమన్నారు. ప్రభుత్వం అందజేసే సామాజిక పింఛన్లపైనే ఆధారపడి వేలాది మంది దివ్యాంగులు జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు వారి పింఛన్లు అనైతికంగా తొలగిస్తే వారు రోడ్డున పడతారన్నారు. పాలకులు వీలైతే సంపదను సృష్టించి కొత్త పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలవాలిగానీ, ఉన్న పథకాలను నిర్వీర్యం చేయకూడదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్ అందిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, వేలాది మంది అర్హులైన దివ్యాంగులు, అంధుల పింఛన్లు రద్దు చేస్తూ నోటీసులివ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కడుపుమండిన పింఛన్ లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆ నోటీసులను ఉపసంహరించుకుని, అర్హులందరికీ పింఛన్ అందేలా చూడాలని ఉషశ్రీచరణ్ కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
25న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25న సర్టిఫికెట్ల పరిశీలన చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు రోడ్డులోని బాలాజీ ఎంసీఏ కళాశాల వేదికగా సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఏర్పాట్లను శుక్రవారం డీఈఓ ప్రసాద్బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ అహమ్మద్ పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం మొత్తం 18 బృందాలను నియమించారు. అన్ని కేడర్ల పోస్టులు కలిపి జిల్లాలో మొత్తం 807 పోస్టులను భర్తీ చేయనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన బృందాలకు శనివారం బాలాజీ ఎంసీఏ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు శిక్షణ ఉంటుందని డీఈఓ తెలిపారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల డీఎస్సీ–25కు సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. జాబితాలను డీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.inలో, జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లోనూ ఉంచారు. అభ్యర్థులకు వ్యక్తిగత మెగా డీఎస్సీ లాగిన్ ఐడీలు ద్వారా కాల్ లెటర్ పంపుతామని అధికారులు పేర్కొన్నారు. కాల్ లెటర్లో పేర్కొన్న సూచనలను అనుసరించాలని వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పరిశీలనకు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంతకుముందే సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని, అర్హతలేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తామని స్పష్టం చేశారు. బాలాజీ ఎంసీఏ కళాశాలలో వేదిక సర్టిఫికెట్ల పరిశీలన బృందాలకు నేడు శిక్షణ -
గంజాయి ముఠా అరెస్ట్
కదిరి అర్బన్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యులుగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి గంజాయి ముఠా వివరాలు వెల్లడించారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి.. పట్టణంలోని జామియా వీధికి చెందిన అజాజ్ తన స్నేహితులు నాగరాజు వీధికి చెందిన షోయబ్, గాంధీనగర్కు చెందిన అర్ఫాన్, మహ్మద్ హుస్సేన్, అస్లాం, గౌస్బాషాతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. గంజాయి విక్రయాలతో డబ్బు సంపాదించాలనుకున్న అజాజ్ మహారాష్ట్రలోని జల్గామ్ జిల్లా ఫైజాపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలోని రాజు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి రైలులో తీసుకువచ్చేవాడు. అనంతరం గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి తన స్నేహితులతో కలిసి కదిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఒక్కో ప్యాకెట్కు రూ. 200 నుంచి రూ. 500 వరకు తీసుకునే వాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించిన అజాజ్... దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా కట్టేందుకు తన ఐదుగురు స్నేహితులతో కలిసి కదిరి మండలం కొండమనాయుని పాళెం గుట్టల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. గంజాయి రవాణా సమాచారం అందడంతో రూరల్ అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ సీఐ నిరంజన్రెడ్డి, ఎస్ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి గంజాయి తరలిస్తున్న అజాజ్తో పాటు అతని స్నేహితులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు బైక్లు, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు హ్యాండ్ బ్యాగులు, 4 తెల్లసంచులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. 10 కిలోల గంజాయి, మూడు బైక్ల స్వాధీనం -
తువాలుతో మెడకు ఉచ్చేసి.. చంపేయాలని..
చిలమత్తూరు: చేతిలో మారణాయుధాలు పట్టుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ మూక రెచ్చిపోయింది..! ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుడే లక్ష్యంగా దాడికి దిగింది.. పైపెచ్చు బాధితుడిని పరామర్శించేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం ఈ దాడి వెనుక పెద్ద కుట్రను తేటతెల్లం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించింది. శుక్రవారం హుస్సేన్పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. చౌడేశ్వరీదేవి ఆలయంలో పూజల అనంతరం పురుషోత్తమరెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన బాబూరెడ్డి, నర్సిరెడ్డి, మరో నలుగురు మారణాయుధాలతో వచ్చారు. ఎంపీపీ ఎత్తుగా ఉండడంతో ఎడమ కాలిపై ఇనుప రాడ్డుతో కొట్టి కిందపడేశారు. ఆయన మెడలోని తువాలుతోనే ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బాబురెడ్డి, అతడి అనుచరులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తమరెడ్డిని హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. దాడి సంగతి తెలిసి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డిలు ఎంపీపీని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా.. రెండో పట్టణ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీయడంతో వదిలేశారు. ఆస్పత్రిలో పురుషోత్తమరెడ్డిని దీపిక దంపతులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా పురుషోత్తమరెడ్డిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ హిందూపురం సద్భావన సర్కిల్లో దీపిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలోనే దీపికను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. వన్టౌన్ స్టేషన్కు తరలించారు. ఆమెతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుడికే కట్లు.. టీడీపీ వింత నాటకం పురుషోత్తమరెడ్డిపై దాడిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వింత నాటకానికి తెరతీసింది. నిందితులను పార్టీ నుంచి తొలగించాల్సిన టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా చిలమత్తూరు రప్పించుకుని, లేని గాయానికి కట్టు కట్టించారు. తర్వాత ప్రెస్మీట్ పెట్టి బాధిత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపైనే విమర్శలు చేయించారు. నిందితుడు బాబూరెడ్డి కుడి మణికట్టు దగ్గర వాపు ఉందని చెబితే మాత్ర ఇచ్చామని, అయినా నొప్పి ఉందని కట్టు కట్టించుకున్నారని, కంప్రెషన్ బ్యాండేజీ లేకపోవడంతో రక్త గాయాలకు కట్టే బ్యాండేజ్ ను కట్టినట్టు వైద్యాధికారి రోజా చెప్పడం గమనార్హం. -
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
● ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: గణేశ్ ఉత్సవాల వేళ జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. ఈమేరకు గురువారం గణేష్ ఉత్సవాల మండలపాల ఏర్పాటు, అనుమతులపై విధివిధానాలను ఎస్పీ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మండలపాల ఏర్పాటుకు అనుమతులు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానంతో పోర్టల్ రూపొందించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీ సేవ ద్వారా చలానా చెల్లించి ఎన్ఓసీ పొందాలన్నారు. అనుమతులు పొంది క్యూఆర్ కోడ్ను ఉత్సవాలు నిర్వహించే పందిరిలో తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలన్నారు. ముందుగా అనుమతి పొందేవారు https://ganeshutsqv.net ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేస్తే అనుమతులు మంజూరు చేస్తారని వివరించారు. గణేశ్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు డయల్ చేయాలన్నారు. సర్టిఫికెట్లతో రేపు హాజరుకండిపుట్టపర్తి టౌన్: సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికై న జిల్లా వాసులు ఈనెల 23న గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు అప్లికేషన్తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. సెక్టోరియల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ● సిఫారసులకే పెద్ద పీట ? పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం బుక్కపట్నం డైట్ కళాశాలలో సెక్టోరియల్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆర్డీఓ సువర్ణ, డీఈఓ క్రిష్ణప్ప, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ దేవరాజ్ పాల్గొన్నారు. మొత్తం 9 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే మెరిట్ లిస్టును పక్కనపెట్టి రాజకీయ నేతలు చెప్పిన వారికే అవకాశం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే మెరిట్ జాబితా ప్రకటించకుండా ఇంటర్వ్యూలు ఎలా చేపడతారని యూటీఎఫ్ నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు కలెక్టర్కు రాసిన లేఖను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డికి సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ 120 మంది దరఖాస్తు చేసుకోగా, 85 మార్కులను అర్హతగా నిర్ణయించారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికెన్ని మార్కులు వచ్చాయో చెప్పాలని, లేకపోతే ఇంటర్వ్యూలు రద్దు చేయాలన్నారు. -
గంజాయి మత్తు .. బతుకు చిత్తు !
కదిరి: జిల్లాలో ఏడాదిగా గంజాయి దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి ముఠా సభ్యులు విక్రయాలు సాగిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా పట్టణాలు మొదలు గ్రామాల్లో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి ముఠా సభ్యులకు కొండంత రాజకీయ అండ దొరికింది. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా.. కోస్తాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా జిల్లాకు గంజాయి గుట్టుగా తరలి వస్తోంది. ఇందుకోసం గంజాయి ముఠా సభ్యులు కొందరు నిరుపేదలను ఎంపిక చేసుకొని వారికి కమీషన్ రూపంలో చెల్లిస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ప్రయాణికుల్లాగా వీరు బస్సులు, రైళ్లలో సరుకు తీసుకొచ్చి గంజాయి ముఠాకు అప్పగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో గంజాయిని తీసుకొస్తున్న వారు దొరికినా సరఫరాదారులు, విక్రయదారులు మాత్రం అధికార పార్టీ నేతల అండతో తప్పించుకుంటున్నారు. గంజాయిని అరికట్టడం తమకు పెద్ద సమస్య కాదని, అసాంఘిక శక్తులకు అధికార పార్టీ నేతలు సహకరించకపోతే సంతోషిస్తామని జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇటీవల తలుపుల మండలంలో రెడ్హ్యాండెడ్గా దొరికిన ఒక దొంగను వదిలేయమని ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని మరో పోలీస్ అధికారి గుర్తు చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే .. హిందూపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారు. మత్తుకు అలవాటు పడ్డ కొందరు విద్యార్థులు గంజాయి కొనుక్కోవడానికి ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వారిపై దాడులకు కూడా పాల్పడిన సంఘటనలు ఉన్నాయని కదిరికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు. కొన్ని చోట్ల యువకులు బృందాలుగా ఏర్పడి డబ్బులకోసం ఎంతకై నా తెగిస్తున్నారు. యువతే లక్ష్యంగా జిల్లాలో జోరుగా విక్రయాలు అధికార అండతో రెచ్చిపోతున్న గంజాయి ముఠా ప్రయాణికుల ముసుగులో సరుకు తరలింపు -
ఎన్టీఆర్ ‘వసూళ్ల’ సేవ!
● సోమందేపల్లికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి గుండె సమస్యతో హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ సిబ్బంది పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని.. అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఉచితంగా వైద్యం చేస్తారని సూచించారు. అక్కడికి వెళ్లగా.. టోకెన్ ఫీజు తీసుకుని.. బెడ్ ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్రూవల్ మెసేజీ వచ్చే లోపు రూ.20 వేలు తీసుకున్నారు. పూర్తిగా ఉచితం కదా అని ప్రశ్నిస్తే.. అనుమతులు రాక ముందే చార్జీలు అంటూ సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ కండిషన్ బాగా లేకుంటే బెంగళూరు వెళ్లాలని భయపెట్టారు. ఒకవేళ దూరం వెళ్లలేకుంటే మరో రూ.30 వేలు అదనంగా చెల్లిస్తే.. స్పెషలిస్టును పిలిపిస్తామని వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. ● ఓడీ చెరువుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కదిరి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వెంటనే ప్రథమ చికిత్స చేసి రూ.10 వేలు కట్టించుకున్నారు. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ గురించి అడిగితే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వర్తిస్తుందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజుల వరకు మెడిసిన్, బెడ్ ఫీజు చెల్లించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తిస్తుందని మెసేజీ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కొన్ని గంటల ముందుగా రోగి కుటుంబ సభ్యులతో డాక్టర్లు మాట్లాడి.. ప్రభుత్వం ఇచ్చే మొత్తం సరిపోదని.. ఇంకొంత చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామని.. లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అదనంగా మరో రూ.15 వేలు చెల్లించినట్లు బాధితులు వాపోయారు. ... చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విధంగానే దందా చేస్తున్నారు. అయితే పట్టించుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి : పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకంలోని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీశాయి. రోగుల భయాన్ని, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రభుత్వం అందించే నిధులు ఏ మూలకూ సరిపోవంటూ నమ్మబలికి కో–పేమెంట్లతో దండుకుంటున్నారు. మల్టీ స్పెషాలిటీ సేవలతో పాటు ఆర్థో, యూరో, కార్డియాక్ చికిత్స చేసే ఆస్పత్రుల్లో ఇలాంటి వ్యవహారాలు బయట పడుతున్నాయి. భయపెట్టి వసూళ్లు.. అదనపు వసూళ్ల విషయంలో బయటకు చెబితే.. మెరుగైన వైద్యం అందించరేమోననే భయంతో రోగులు మిన్నకుండిపోతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. కంటి, న్యూరో, ఆర్థో, యూరాలజీ, కార్డియాక్.. ఇలా ఏ శస్త్రచికిత్స అయినా.. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మరింత డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు అప్పు తెచ్చి మరీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వసూలు చేస్తున్నారు ఇలా.. ఎన్టీఆర్ వైద్యసేవలో ఓ వ్యక్తి సింగిల్ స్టంట్ వేయించుకోవాలంటే రూ.60 వేలు, డబుల్ స్టంట్కు అయితే రూ.90 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. రోగి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి. కొందరు తెలియక.. నేరుగా ఆస్పత్రికి వెళ్తుండటంతో.. టోకెన్ ఫీజుతో పాటు బెడ్ చార్జీలు, ముందస్తు మెడిసిన్ పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఇంకా అప్రూవల్ మెసేజీ రాలేదంటే నాలుగైదు రోజులు గడిపేసి భారీగా లాగేసి ఆ తర్వాత ఆపరేషన్ కోసం మరోసారి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు.. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులో ఉండే ఆస్పత్రులు 11 (హిందూపురంలో 5, కదిరిలో 4, ధర్మవరంలో 2) ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా.. ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని కొందరు సూచించి అదనపు వసూలులో పర్సెంటేజీలు తీసుకున్నట్లు సమాచారం. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది. అమలు అస్తవ్యస్తం.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు అస్తవ్యస్తంగా ఉంది. వైద్యసేవలు అందుబాటులో ఉంటున్న ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఆరోగ్య మిత్రలు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆ తర్వాత చేరిన రోగులు టోకెన్ తీసుకుని.. మరుసటి రోజు వరకు ఫీజులు చెల్లించి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి. వైద్యసేవల్లో సరికొత్త దందా ఉచితం మాటున ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ అనుమతులు వచ్చేలోపే జేబులు గుళ్ల చేస్తున్న వైనం కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వైద్యం -
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
పుట్టపర్తి అర్బన్: గ్రామీణ మంత్రిత్వ శాఖ, కెనరా బ్యాంకు సహకారంతో ప్రారంభించిన స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ చేతన్ సూచించారు. గురువారం పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పురుషులకు మోటర్ సైకిల్ సర్వీసింగ్, సెల్ఫోన్ రిపేరీ, ఫొటో, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ వైరింగ్, పంప్సెట్ రిపేరీ, డ్రస్ డిజైనింగ్, ట్యాలీ నేర్పించనున్నట్లు చెప్పారు. సీ్త్రలకు బ్యూటీపార్లర్, డ్రస్ డిజైనింగ్, పెళ్లి కూతురు మేకప్, జ్యూట్ బ్యాగ్ల తయారీ, మెహందీ, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, కొవ్వొత్తుల తయారీ, జర్దోసి వంటి వాటిపై శిక్షణ ఇస్తారన్నారు. భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఎల్డీఎం రమణకుమార్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు, సీబీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ శాంతిప్రియ, పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు పాల్గొన్నారు. పోస్టర్లు ఆవిష్కరణ.. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే పోటీలకు సంబంధించిన ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ పోస్టర్లను బ్యాంకర్లతో కలిసి కలెక్టర్ చేతన్ ఆవిష్కరించారు. 18 నుండి 25 సంవత్సరాల యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ నైపుణ్య పోటీలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 63 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9988853335 నంబర్ను సంప్రదించాలన్నారు. -
డిమాండ్కు సరిపడని యూరియా
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా రైతుల డిమాండ్కు సరిపోవడం లేదు. ఒక లోడు, అర లోడు చొప్పున పంపుతుంటే కేవలం గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా మొక్కజొన్న, వరి సాగు చేపట్టారు. అయితే యూరియా డిమాండ్ ఉన్న ఈ పంటల్లో ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కడుతున్నారు. గురువారం పెడపల్లి సొసైటీకి 140 బస్తాల యూరియా రాగా, రెండు గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయింది. ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు చొప్పున పంపిణీ చేసినా క్యూ లైన్లో వేచి ఉన్నవారిలో సగం మందికి కూడా దక్కలేదు. దీంతో చాలా మంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ప్రస్తుతం జిల్లాలో 4,700 టన్నుల యూరియా ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నా.. ఈ మొత్తం ఏనాడో ఖాళీ అయిపోయి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వచ్చే లోడు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాల్సి వస్తోందన్నారు. వచ్చిన వెంటనే ఖాళీ అవుతున్న గోదాములు